breaking news
Tamil Nadu
-
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
– గ్రామస్తుల రాస్తారోకో తిరువళ్లూరు: తిరుప్పాచ్చూర్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా స్పీడ్బ్రేకర్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఆదివారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామంలో మూడు వేల కుటుంబాలు నివాసం వుంటున్నారు. ఈ గ్రామం మీదుగా వాహనాలు వేగంగా వెళుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రాంతంలో స్పీడ్బ్రేకర్, హెచ్చరిక బోర్డు, రెఫ్లెక్ట్ బోర్డులను ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఈక్రమంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం ఉదయం రాస్తారోకోకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 40 నిమిషాల పాటు సాగిన ఆందోళనతో రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామస్తుల సమస్యల ను పరిస్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
సంకీర్ణ ప్రభుత్వానికి ఆహ్వానం
– ప్రేమలత విజయకాంత్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ అన్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మద్దతు ఇచ్చారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని అమిత్ షా వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. ఇది అన్నాడీఎంకే వర్గాలకు షాక్లో పడేసినా, ఇతర పార్టీలకు మాత్రం ఆశాజనకంగానే మారాయి. తమిళనాడులో ఇంత వరకు సంకీర్ణప్రభుత్వం అన్నది అధికారంలోకి రాలేదు. ఈ దృష్ట్యా, అమిత్ చేసిన వ్యాఖ్యల నినాదానికి తమిళ మానిల కాంగ్రెస్ నేత, ఎంపీ జీకే వాసన్ మద్దతు ఇచ్చారు. ఇందులో తప్పే ముంది, అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వం ఽఅధికారంలోకి రావడం కోసం శ్రమిస్తున్నామన్నారు. అధికారంలో సైతం అందరికి వాటా అన్నది అవశ్యమని వ్యాఖ్య లు చేశారు. ఆదివారం కోయంత్తూరులో ఇదే విషయంగా ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, తమిళనాడులో ప్రజలకు సుపరిపాలన అన్నది అందించాలంటే, ప్రజలకు మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. అనేక రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయని, ఇక్కడ కూడా అధికారంలోకి సంకీర్ణ ప్రభుత్వం రావాల్సిన అవశ్యం ఉందన్నారు. దీనికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. కాగా డీఎండీకే నేత, ఎల్కే సుదీష్ కాంగ్రెస్ నేత నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం గురించి ఆమెను ప్రశ్నించగా, ఇది ఆయన వ్యక్తిగతం అని,పార్టీతో సంబంధం లేదని దాట వేశారు. -
నేరస్తులకు స్థావరంగా తమిళనాడు
– బీజేపీ మైనారీటీ విభాగం జాతీయ కార్యదర్శి వేలూరు ఇబ్రహీం తిరువళ్లూరు: డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత తమిళనాడు నేరస్తులు, దొంగలకు స్థావరంగా మారిపోయిందని బీజేపీ మైనారీటి విభాగం జాతీయ కార్యదర్శి వేలూరు ఇబ్రహీం ఆరోపించారు. తిరువళ్లూరు జిల్లా వెంగల్ రామరాజన్కండ్రిగ ప్రాంతానికి చెందిన హరిసతీష్(48). ఇతను బీజేపీ జిల్లా ట్రజరీగా విధులు నిర్వహిస్తున్నారు. పిల్లలు అన్నానగర్లో చదువుతున్న క్రమంలో ప్రస్తుతం అక్కడే నివాసం వుంటున్నాడు. వారానికి ఒకసారి తన సొంత గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం హరిసతీష్ ఇంట్లో చోరీ జరిగింది. దాదాపు 20 సవ ర్ల బంగారునగలు, 40 వేల నగదు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితుడు పిర్యాదు చేసిన క్రమంలో ఇంత వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాఫీని బాధితుడికి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే భాదితుడ్ని పరామర్శించిన వేలూరు ఇబ్రహీం వారికి అండగా వుంటామని హమీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. -
పుష్ప సోయగం..భక్తజన పారవశ్యం
–బోయకొండ ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం సరికొత్త శోభతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. చూడగానే కట్టిపడేలా పుష్పాలంకరణతో సరికొత్త శోభ సంతరించుకుంది. ఆదివారం బెంగళూరుకు చెందిన కృష్ణప్ప కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రూ.3లక్షల విలువ చేసే పలు రకాల పుష్పాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. దీంతో ఆలయం అంతా పుష్ప పరిమళ భరిత పుష్పాల కొత్తదనం..అందాలు భక్తులను కట్టిపడేశాయి. ఆషాఢ మాసంలో కర్ణాటక భక్తులు అమ్మవారి దర్శనం కోసం విరివిగా రావడం పరిపాటి. బెంగళూరు నుంచి పూలను తీసుకొచ్చి శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జామున వరకు ఆలయం లోపల, ఆలయం ముందు భాగం, చుట్టూ పరిసరాల్లో పూలతో అలంకరించారు. అనంతరం కుటుంబ సమేతంగా పూజలు చేయించారు. కోరిన కోర్కెలు ఫలించడంతో పుష్పాలంకరణ చేసి మొక్కుబడి చెల్లించినట్లు కృష్ణప్ప తెలిపారు. దాత కుటుంబ సభ్యులకు ఈఓ ఏకాంబరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు. -
ఆకట్టుకున్న తిమ్మన పారిజాతాపహరణం
కొరుక్కుపేట: తిమ్మన పారిజాతాపహరణం–మానసోల్లాస వ్యాఖ్యానం అనే అంశంపై ఆదివారం జరిగిన ఉపన్యాస కార్యక్రమం ఆధ్యంతం ఆకట్టుకుంది. వేదవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహిస్తున్న తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహికలో 162వ ప్రసంగంగా తిమ్మన పారిజాతాపహరణం – మానసోల్లాస వ్యాఖ్యానంపై ఉపన్యసించేందుకు హైదరాబాద్కు చెందిన అన్నమాచార్య వాజ్మయ పరిశోధకులు గంధం బసవ శంకరరావు వక్తగా పాల్గొన్ని ప్రసంగించారు. చైన్నె టీ.నగర్లోని ఆంధ్రా క్లబ్ కృష్ణాహాలు వేదికగా సాగిన కార్యక్రమానికి తెలుగు సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యదర్శి కందనూరు మధు, అధ్యక్షుడు జేకే రెడ్డి, ఆస్కా మాజీ అధ్యక్షుడు ఎం.ఆదిశేషయ్య పాల్గొని బసవ శంకరరావును సత్కరించారు. -
కీలడి పరిశోధనలో మరో అడుగు
● సైన్స్ పరంగా నిరూపితం ● పుర్రెల ఆధారంగా ముఖ చిత్రం సాక్షి, చైన్నె: మదురై సమీపంలోని కీలడిలో ఏళ్ల తరబడి జరుగుతున్న పురావస్తు పరిశోధనలో తమిళులు మరో ముందడుగు వేశారు. సైన్స్ పరంగా తమిళ చరిత్రను నిరూపితం చేసే విధంగా బ్రిటన్ సహకారంతో విజయవంతం చేశారు. 2,500 సంవత్సరాల క్రితం తమిళులు ఎలా ఉండే వారో అన్నది పుర్రె ఆధారంగా బహిర్గతం చేశారు. మదురై సమీపంలోని కీలడిలో తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే విధంగా పురాతన సంపదలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలుత 2013 నుంచి 2016 వరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పరిశోధనలు చేసింది. పురావస్తు శాస్త్రవేత్త అమర్నాథ్ రామకృష్ణన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పరిశోధన హఠాత్తుగా ఆగడం చర్చకు దారి తీసింది. దీంతో తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 2016 నుంచి ఇక్కడ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక్కడ లభించిన వస్తువులను ఓపెన్ ఎగ్జిబిషన్లో ఉంచారు. అలాగే, ఇక్కడ బ్రహ్మాండ ఆడిటోరియం, ఎగ్జిబిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదే సమయంలో అమర్నాథ్ రామకృష్ణన్ బృందం పరిశోధన నివేదికను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఓ వైపు తమిళనాడు ప్రభుత్వం పట్టుబడుతూ వస్తోంది. అలాగే, ఈ వ్యవహారం మదురై ధర్మాసనంలో సైతం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కీలడి పరిశోదనలో మరో ముందుడుగు వేశారు. పుర్రెలతో ముఖ చిత్రం కీలడి పరిశోధనలో తమిళ చరిత్ర, సంస్కృతికి సంబంధించి ఎన్నో ఆధారాలు బయటపడ్డాయి. ఇందులో పుర్రెలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మనుషులు ఎలా జీవించారో అన్న అంశానికి దర్పణం పట్టే విధంగా వారు ఉపయోగించిన ఎన్నో పరికరాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే, ఇక్కడ లభించిన పుర్రెల ఆధారంగా చేసుకుని 2,500 సంవత్సరాల క్రితం తమిళులు ఎలా ఉండే వారో అన్నది తాజాగా సైన్స్ పరిశోధనలో తేటతెల్లమైంది. మదురై కామరాజర్ వర్సిటీ, బ్రిటన్లోని జోన్ మోస్ వర్సిటీ ఈ పుర్రెల ఆధారంగా జరిపిన పరిశోధన విజయవంతమైంది. ఈ వివరాలను ఆదివారం వెలుగులోకి రావడంతో సీఎం స్టాలిన్ స్పందించారు. ప్రాచీన తమిళ సాహిత్యం గురించి వివరిస్తూ కీలడిలో జరిగిన పరిశోధనలు తాజాగా సైన్స్ ఆధారంగా సైతం నిరూపితమైందన్నారు. మన పూర్వీకులు ఎలా ఉండే వారో తాజాగా స్పష్టమైందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ తమిళనాడు చరిత్ర, సంస్కృతి ఏమిటో అన్నది ఇకనైనా కేంద్రంలోని బీజేపీ పాలకులు గుర్తెరగాలని హితవు పలికారు. తమిళ చరిత్ర, సంస్కృతిని తుంగలో తొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేంద్రంలోని బీజేపీ పాలకులకు తాజాగా సైన్స్ సైతం ఇదే వాస్తవం అని నిరూపించిందన్నారు. తమిళనాడు చరిత్రకు ఆధారాలను సైన్స్ సైతం స్పష్టం చేసిందని, ఇకనైనా కేంద్రం అమర్నాథ్ నివేదికను తేటతెల్లం చేయాలని డిమాండ్ చేశారు. -
ముగిసిన ఏలగిరి ఉత్సవాలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఏలగిరి వేసవి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఏలగిరి వేసవి ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి పడవ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా సంఘాల నృత్య ప్రదర్శన, కబడ్డీ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రదర్శనలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వివధ పుష్పాలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన వివిధ రకాల పక్షులు, చేపలు, డైనోసర్ పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను మంత్రులు ఏవావేలు, పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు దేవరాజ్, నల్లతంబి, విల్వనాధన్, ఎస్పీ శ్రేయగుప్తా, జిల్లా అటవీశాఖ అధికారి మహేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి నారాయణన్ అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు: ఏలగిరి కొండపై అటవీ ప్రాంత ప్రజలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, నయాండి మేలం, శునకాల విన్యాసాలు, కబడ్డీ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాయగూరలతో ప్రదర్శన: కొండపై వివిద కాయగూరలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అటవీ ప్రాంత రైతులు వివిధ కాయగూరలను తీసుకొచ్చి నేచర్ పార్కు సమీపంలో పావురాలు, బాతులు, నెమలి వంటి ఆకారంలో తయారు చేసి ఉంచారు. -
హిర్దు హారూన్ హీరోగా టెక్సాస్ టైగర్
తమిళసినిమా: కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రశంసలు అందుకున్న ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రం ఫేమ్ హిర్దు హారూన్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం టెక్సాస్ టైగర్. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడిన ఫ్యామిలీ చిత్రం ఫెమ్ సెల్వకుమార్ తిరుమారన్ కథ, దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రాన్ని యూకే స్వార్డ్ పతాకంపై సుజిత్ బాలాజీకుమార్, భారతికుమార్ ,సెల్వకుమార్ తిరుమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలై చక్కని భావోద్వేగాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టెయినర్ కథాంశంతో కూడిన ఫ్యామిలీ చిత్రాన్ని వీరే నిర్మించడం గమనార్హం. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న టెక్సాస్ టైగర్ చిత్ర టీజర్ వీడియోను యూనిట్ వర్గాలు విడుదల చేశాయి. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అదేవిధంగా ఇప్పుడు ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
25 నిమిషాలపాటు కర్రసాము
–యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం తిరువళ్లూరు: విరామం లేకుండా 25 నిమిషాలపాటు రెండువందల మంది విద్యార్దులు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించి యూనివర్శల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్తానం సంపాదించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూర్ సూపర్ కింగ్స్, తిరునిండ్రవూర్ నటరాజన్ క్లబ్ విద్యార్ధిని విద్యార్దులు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించి యూనివర్శల్ ఆచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కోసం ప్రయత్నం చేశారు. దాదాపు రెండు వంద మంది పాల్గోన్న కార్యక్రమంలో 25 నిమిషాల పాటు కర్రసాము స్టిక్కు రిబ్బన్ కట్టి విన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన క్రమంలో వారికి రికార్డులో స్థానం దక్కింది. అనంతరం రికార్డులో స్థానం సంపాదించుకున్న సర్టిపికేట్ను కర్రసాము క్లబ్ నిర్వాహకులకు అందజేశారు. దీంతో పాలు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించిన విద్యార్ధిని విద్యార్దులకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరుణన్, పూండి పారెస్ట్ అధికారి మునస్వామి, క్లబ్ నిర్వాహకుడు సుందర్ తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్లు జయరామన్, రాజా, గుణ,విజయ్ఆనంద్, మేనేజర్ లోకేశ్వరి, తిరునిండ్రవూర్ క్లబ్ అద్యక్షుడు నటరాజన్, మాజీ యూనియన్ కౌన్సిలర్ దిలిప్రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. -
గృహాలకు విద్యుత్ చార్జీల వడ్డన లేదు
సాక్షి, చైన్నె: గృహ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి చార్జీలను పెంచడం లేదని, రాయితీలు, ఉచిత పథకాలు కొనసాగుతాయని విద్యుత్, రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ స్పష్టం చేశారు. ఏటా జూలై 1వ తేది నుంచి విద్యుత్ చార్జీలను పెంచే దిశగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023లో గృహాలకు ఈ చార్జీలను పెంచ లేదు. 2024లో లోక్ సభ ఎన్నికల అనంతరం నామ మాత్రంగా చార్జీలను వడ్డించారు.తాజాగా జూలై 1వ తేది నుంచి వడ్డన కసరత్తులు మొదలైనట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వడ్డన భారం ప్రజల నెత్తిన వేస్తే , సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న విషయాన్నిగ్రహించిన పాలకులు వెనుకడుగు వేయడానికి సిద్దమయ్యారు. ఇందులో భాగంగా చార్జీల వడ్డనమీద వస్తున్న వార్తలు,సమాచారాలకు చెక్పెడుతూ ఆదివారంమంత్రి శివశంకర్ ప్రకటన చేశారు. విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి వస్తున్న సమాచారాలకు వివరణాత్మక వివరణ ఇది వరకే ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ..మళ్లీ అదే ప్రచారం జరుగుతుండటంతో మరో మారు స్పష్టం చేయక తప్పడంలేదన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చార్జీలను నిర్ణయిస్తుంటుందన్నారు. అయితే, ఈ విషయంగా తాజాగా ఎలాంటి ఉత్తర్వులు అన్నది ఇవ్వలేదన్నారు. ఒక వేళ ఈ వ్యవహారంలో ఏదైనా ఉత్తర్వు జారీ చేసిన పక్షంలో, గృహల విద్యుత్ వినియోగ దారులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులుఉండదని స్పష్టం చేశారు. గృహాలకు ఎలాంటి చార్జీల వడ్డన అన్నది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీ పెరుగుదల వల్ల ఎటువంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న 100 యూనిట్లు ఉచితంతో సహా అన్ని రాయితీలు, ప్రయోజనాలు కొనసాగుతాయని వివరించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల గురించి అనవసరమైన పుకార్లను నమ్మ వద్ద అని కోరారు. ● మంత్రి శివశంకర్ స్పష్టం -
ఉల్లాసంగా ...ఉత్సాహంగా ..
● జైహింద్ పేరిట డచెస్ ఆల్ ఉమెన్ కార్ ర్యాలీ 2025 ● జెండా ఊపి ప్రారంభించిన నటి సుహాసినీ మణిరత్నం కొరుక్కుపేట: డ్రైవింగ్ నిబంధనలు , దేశభక్తి, సైనికులు, యోథులను గౌరవించడం, హ్యాపీనెస్, చైన్నె నగరం గొప్ప చరిత్రను తెలియజేసే లక్ష్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఇండియన్ ఆయిల్ –డచెస్ ఆల్ ఉమెన్ కార్ ర్యాలీ 2025కు విశేష స్పందన లభించింది. జైహింద్ పేరిట నిర్వహించిన ఈ కారు ర్యాలీని ప్రముఖ సినీనటి సుహాసినీ మణిరత్నం జెండా ఊపి ప్రారంభించారు . ఈ ర్యాలీలో 100కి పైగా కార్లు పాల్గొన్నాయి . జైహింద్ .. జైహింద్ అంటూ ముందుకు సాగిన ఈ కారు ర్యాలీ ఎంతో త్రిల్లింగ్తో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. చైన్నె ఆళ్వార్పేటలోని సవేరా ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈర్యాలీ తిరిగి అదేప్రాంతానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా డెచెస్ క్లబ్ నిర్వాహకురాలు నీనా రెడ్డి మాట్లాడుతూ డచెస్ క్లబ్ తరపున 24వ వార్షిక ఉమెన్ కార్ ర్యాలీని అనూహ్యమైన స్పందన లభించిందని అన్నారు. చైన్నె నగరవ్యాప్తంగా 50 నుంచి 65 కిలోమీటర్లు మేర ఈ కార్ ర్యాలీ సాగిందన్నారు. దేశభక్తి, సైనికులు, యోధులను గౌరవించడం ఇంకా డ్రైవింగ్ నిబంధనలు పాటించడం, మహిళలు సంతోషంగా గడపడం, నగర చరిత్రను తెలిపేలా ఏర్పాటైన ఈ కార్ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు. అతిథులుగా ఐపీఎస్ అర్చణ మిశ్రా రామచంద్రన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నినాయర్ , ఐఆర్పీఎఫ్ఎస్ విను సచిన్ , ఇంకా డచెస్ క్లబ్కు చెందిన సుజాత, అను అగర్వాల్, రథి,అను సచ్దేవ్ ఇండియన్ ఆయిల్ కు చెందిన రాజశేఖర్, ఏఏ మోటర్ స్పోర్ట్ అమిత్ అరోరా ఇంకా అఖిల, రోహిణీలు పాల్గొన్నారు . -
థాయ్ ఎయిర్లైన్స్ విమానం రద్దు
కొరుక్కుపేట: బ్యాంకాక్కు వెళ్తున్న థాయ్ ఎయిర్ లైనన్స్ విమానం ఆదివారం ఉదయం చైన్నె విమానాశ్రయంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా ఆదివారం విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని కారణంగా, బ్యాంకాక్ కు వెళ్లాల్సిన 164 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన థాయ్ ఎయిర్లైన్స్ విమానం శనివారం అర్ధరాత్రి 12 గంటలకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్కు చేరుకుంది. తరువాత చైన్నె నుంచి విమానం సాధారణంగా అర్ధరాత్రి 1.10 గంటలకు ప్రయాణికులతో బ్యాంకాక్కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానాన్ని నడిపే పైలట్ విమానంలో సాంకేతిక సమస్య ఉందని, దానిని మరమ్మతు చేసిన తర్వాతే వెళ్తుందని ప్రకటించారు. వారికి చైన్నె విమానాశ్రయ లాంజ్లలో వసతి కల్పించారు. తరువాత, ఇంజినీర్లు థాయ్ ఎయిర్లైన్స్ విమా నం ఎక్కి యాంత్రిక సమస్యలను సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ఉదయం 5 గంటల వరకు విమానంలో సంభవించిన యాంత్రిక సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాలేదు. ఫలితంగా, బ్యాంకాక్కు వెళ్లే థాయ్ ఎయిర్లైనన్స్ విమానం రద్దు చేశారని ప్రకటించారు. విమానాశ్రయంలోని ప్రయాణికులలో కలకలం రేపింది. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే జగన్ మూర్తి ●పొరుగు రాష్ట్రాలకు నాలుగు బృందాలు సాక్షి, చైన్నె : తిరువేలంగాడులో బాలుడి కిడ్నాప్ కేసు సీబీసీఐడీకి దర్యాప్తును వేగవంతం చేసింది. ముందుస్తు బెయిల్ను కోర్టు నిరాకరించడంతో ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే జగన్ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనకోసం నాలుగు బృందాలను సీబీసీడీ ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. తిరువేలంగాడులో బాలుడ్ని కిడ్నాప్ కేసు వ్యవహారంలో ఏడీజీపీ జయరాం, పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్ మూర్తి ప్రమేయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం జగన్ మూర్తి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పోలీసు విచారణకు ఆయన సహరించడం లేదని ఇప్పటికే కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వివరించారు. ప్రస్తుతం ముందస్తు బెయిల్ దక్కక పోవడంతో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయం అన్నది స్పష్టమైంది. ఇదే అదనుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. ఆంధ్రప్రదేశ్ లేదా కర్ణాటకలలో ఆయన తలదాచుకుని ఉండ వచ్చు అన్న సమాచారాలు వెలువడ్డాయి. అలాగే ఢిల్లీలో ఆయనకు కావాల్సిన బీజేపీ పెద్దలు సన్నిహితులుగా ఉన్న సమాచారంతో అటు వైపుగా సైతం సీబీసీఐడీ దృష్టి పెట్టింది. నాలుగు ప్రత్యేక బృందాలురంగంలోకి దిగి జగన్ మూర్తి కోసం వేట ముమ్మరం చేశాయి. ఆయన్ని సోమవారం అరెస్టు చేయవచ్చు అన్న సంకేతాల నేపథ్యంలో ఆయన నివాసం పరిసరాలు, ఆయన ప్రాతినిత్యం వహించే నియోజకవర్గం పరిధిలో ముందు జాగ్రత్తలను పోలీసులు విస్తృతం చేశారు. పోక్సో కేసులో ముగ్గురి అరెస్టు అన్నానగర్: నైల్లె సమీపంలో గతవారం 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసినందుకు పోక్సో చట్టం కింద ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నైల్లె జిల్లాలోని మనూర్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థినిని చంపేస్తామని బెదిరించిన అదే ప్రాంతానికి చెందిన కౌసర్ (20), అజార్ మైదీన్ (20), సదాం (20) ఆ పాఠశాల విద్యార్థిని పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాలై పురనగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేసి కౌసర్, అజార్ మైదీన్, సదామ్ అనే ముగ్గురు వ్యక్తులను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి పాలయంకోట్టై సెంట్రల్ జైలుకు తరలించారు. సముద్రంలో ఈదుతూ రీల్స్ విద్యార్థి మృతి తిరువొత్తియూరు: సోషల్ మీడియా లైకుల కోసం రీల్స్ వేటలో ఓ విద్యార్థి సముద్రంలో మునిగి న సమయంలో బండ రాయిఢీకొని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. చైన్నె, ఎన్నూర్ అన్నై శివగామి నగర్కు చెందిన ప్రదీప్ (18)అతను ప్లస్ 2 పూర్తి చేసి కళాశాలలో ఉన్నత చదువులు చదవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం ప్రదీప్ ఎన్నూర్లోని పెరియకుప్పం బీచ్లో నలుగురు స్నేహితులతో కలిసి సముద్రంలో స్నానం చేస్తున్నాడు. ఆ సమయంలో, ప్రదీప్ సముద్రంలో స్నానం చేస్తూ, ఈత కొడుతున్న వీడియోను రికార్డ్ చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రీల్స్ పోస్ట్ చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ప్రకారంగా, ప్రదీప్ సముద్రంలోకి దూకి అలలలో ఈదుకుంటూ, ఒడ్డున ఉన్న తన స్నేహితులను ఈత కొడుతున్న వీడియో తీయమని అడిగాడు. ఆ సమయంలో, ఎదురు చూడని విధంగా పెద్ద అలలో చిక్కుకున్న ప్రదీప్ నీటిలో మునిగిపోయాడు. అదే సమయంలో ఒడ్డున ఉంచిన బండ రాయి ఢీ కొని తల గాయపడటం చూసి అతని స్నేహితులు దిగ్భ్రాంతి చెందారు. అతన్ని రక్షించి చికిత్స కోసం చైన్నెలోని స్టాన్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు ప్రదీప్ మార్గంమధ్యలోనే చనిపోయాడని గుర్తించారు. ఎన్నూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త చిత్రానికి గౌతమ్ కార్తీక్ రెడీ
తమిళసినిమా: పేరు మార్చుకుంటున్న నటుల్లో గౌతమ్ కార్తీక్ కూడా చేరారు. ఈయన ఇప్పుడు తన పేరును గౌతమ్ రామ్ కార్తీక్ అని మార్చుకున్నారు. ఈయన కొత్త చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి రెడీ అవుతున్నారు. వెరూస్ ప్రొడక్షన్న్స్ పతాకంపై తనిస్తాన్ ఫెర్నాడ్, రాజరాజెన్ గణనసంబంధం, సంజయ్శంకర్ సైక్ ముజీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సూర్యప్రతాప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన నాళైయ ఇయక్కనార్ సీజన్ 1 శిక్షణ పొందడంతో పాటు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన కోచ్చడైయాన్ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా పని చేశారన్నది గమనార్హం. సైన్స్, ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు నిర్మాతలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దర్శకుడు సూర్యప్రతాప్ కథ చెప్పినప్పుడే ఆయన తన భావాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగల ప్రతిభను గుర్తించామని తెలిపారు. లేకపోతే హాస్యంతో పాటు బలమైన పాత్రలోనూ తనను తాను నిరూపించుకున్న నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ ఈ చిత్రం పోలీస్ అధికారిగా నటించనున్నారని ఇది ఆయన కెరియర్లోనే ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. ఈ చిత్రానికి అర్జున్ రాజా చాయాగ్రహణం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, ఆ సమయంలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. -
క్లుప్తంగా
మినీ బజార్కు విశేష స్పందన కొరుక్కుపేట: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్రేటర్ చైన్నె విభాగం, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చైన్నె సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె చూలైమేడు, గిల్ నగర్ ఎక్స్టెన్షన్లోని శ్రీహరి నిలయంలో ఆదివారం నిర్వహించిన మినీ బజార్కు విశేష స్పందన లభించింది. వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలను పోత్సహిచడమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు అవకాశం కల్పించడమే ఈ మినీ బజార్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. మినీబజార్లో వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలను ప్రదర్శనలో కొలువుదీర్చారు. మినీ బజార్కు వచ్చే సందర్శకులకు సిల్వర్ నుంచి డైమండ్ ఐటమ్స్ వరకు ప్రతి అరగంటకు ఒక లక్కీ డిప్ అందజేసినట్టు తెలిపారు. వామ్కు చెందిన సాయిచందన్, శ్రీహరి, బి.సాంబశివరావు, త్రినాథ్కుమార్, రాజశేఖర్, సుజాత పాల్గొన్నారు. మహిళ హత్య అన్నానగర్: సేలం జిల్లా సంగగిరికి చెందిన మణిమేగలై. మునిసిపాలిటీలో క్లీనర్గా పనిచేస్తున్న ఈమె కుటుంబ వివాదం కారణంగా భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా నివసిస్తు వచ్చింది. ఈ స్థితిలో శనివారం సంగగిరి–తిరుచెంగోడు జంక్షన్ బ్రిడ్జ్ కింద మణిమేగలై రాయి దాడిలో హత్యకు గురైంది. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సంగగిరి అక్కంపేటకి చెందిన అరుంధతియార్ వీధికి చెందిన కార్తీక్ (29)ను పోలీసులు అనుమానించారు. అతన్ని అరెస్టు చేసి విచారించినప్పుడు, అతను మణిమేగలైని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. బైకు – లారీ ఢీకొని హెడ్ కానిస్టేబుల్ మృతి అన్నానగర్: కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపం మాథుర్ పోలీస్ స్టేషన్, స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మహాలింగం, హెడ్ కానిస్టేబుల్ జాస్మిన్ మిల్టన్ రాజ్ అలియాస్ మిల్టన్, 7వ స్క్వాడ్ శిక్షణ, పోచంపల్లి పే బెటాలియన్, శనివారం రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో, కోట్టూరు మారియమ్మన్ ఆలయంలో ఆడిట్ నిర్వహించి, పత్రాల పై సంతకం చేసిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్ మిల్టన్, ట్రైనీ కానిస్టేబుల్ సుకుమార్ మాథుర్ ప్రాంతంలో ఆడిట్ నిర్వహించడానికి బైకుపై వెళ్లారు. వెనుక నుంచి వస్తున్న లారీ బైకు ను ఢీకొట్టింది. ఇందులో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మిల్టన్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ట్రైనీ కానిస్టేబుల్ సుకుమార్ కిందపడి గుంతలో పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఇద్దరి లారీ డ్రైవర్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారికి కత్తి చూపించి బెదిరింపు – నగలు నగదు, అపహరణ ఇద్దరు అరెస్టు తిరువొత్తియూరు: దుకాణం యజమానికి కత్తిని చూపించి బెదిరింపులు ఇచ్చి నగదు నగలు అపహరించిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కాంచీపురం జిల్లా మనిమంగళం సమీపము వరదరాజపురం ప్రాంతానికి చెందిన మనివన్నన్ ఇతను తాంబరం ముడిచూర్ లో టీ దుకాణం నడుపుతూ ఉన్నాడు. ఇతని దుకాణంలో గుడియాత్తంకు చెందిన ధనుష్ అనే అతను పనిచేస్తున్నాడు. టీ దుకాణంలో నష్టం రావడంతో మనివన్నన్ గత 3 నెలలకు క్రితం దుకాణమును మూసివేశారు. ఈ క్రమంలో మణివన్నన్ వరదరాజపురంలో ఉన్న అతని ఇంటిలో వున్న సమయంలో అక్కడికి వచ్చిన దుకాణంలో పని చేసిన ధనుష్, అతని స్నేహితుడు విగ్నేష్ మనివన్నన్ కు కత్తిని చూపించి బెదిరింపులు ఇచ్చి గూగుల్ పే మూలంగా రూ. లక్ష బీరువాలో ఉన్న 6 సవర్ల బంగారు నగలు తదితర వస్తువులను చోరీ చేసుకుని ఇద్దరు పారిపోయారు. దీని గురించి మనిమంగళం పోలీస్ స్టేషన్లో మనివన్నన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్రోమ్ పేటలో ఉన్న స్నేహితుని ఇంటిలో దాగి ఉన్న ధనుష్ ,విగ్నేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి కత్తి, 6 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో అత్త అరెస్టు తిరువొత్తియూరు: ఆన్లైన్లో డెలివరీ ఉద్యోగి హత్య కేసులో అత్తను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె అశోక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న కలయరసన్ (23) ఆన్లైన్ డెలివరీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి కుటుంబ ఘర్షణతో భర్త నుంచి విడిపోయి తల్లితో ఉంటోంది. ఈక్రమంలో గత 15వ తేదీ హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో తమిళరసికి పులియందు తోపు ప్రాంతానికి చెందిన శరవనన్ వివాహతర సంబంధం ఉందని దీన్ని కలయరసన్ ఖండించడంతో అతను హత్య చేయబడినట్లు తెలియ వచ్చింది. ఈ కేసులో తమిళరసి సహోదరుడు రౌడీ శక్తి వేల్, మరో తమ్ముడు సంజయ్, స్నేహితుడు సునీల్ కుమార్, సంజయ్ సహా ఐదుగురిని పోలీస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో సంబంధం వున్న తమిళ అరసి తల్లి సంధ్యను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న శరవనన్ కోసం పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. -
డీఎంకేతోనే ప్రయాణం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమిలోనే తమ పయనం కొనసాగుతుందని ఎండీఎంకే కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానించారు. సెప్టెంబర్ 15న తిరుచ్చి వేదికగా బ్రహ్మాండ పార్టీ బహిరంగ సభకు నిర్ణయించారు. ఎండీఎంకే కార్యనిర్వహక కమిటీ సమావేశం ఆదివారం చైన్నె ఎగ్మూర్లోని పార్టీ కార్యాలయం తాయగంలో జరిగింది. పార్టీ నేత అర్జున రాజ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ దురై వైగో, పార్టీ నేతలు , నిర్వాహకులు హాజరయ్యారు. జూన్ 22వ తేదీన మదురైలో జరిగిన మురుగన్ మహానాడులో అన్నా, పెరియార్లను కించ పరిచే విధంగా వ్యవహరించిన నిర్వాహకులను తీవ్రంగా ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. తమిళనాడు ప్రజల మత విశ్వాసాలను రాజకీయాలకు వాడుకుంటున్న శక్తులను తరిమి కొటేట దిశగా, బీజేపీ కుట్రలను భగ్నం చేయడానికి కార్యక్రమాలు విస్తృతంగానిర్వహించేందుకు మరో తీర్మానం చేశారు. 2026 ఎన్నికలలోనూ డీఎంకే కూటమిలోనే ఎండీఎంకే పయనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 15న తిరుచ్చి వేదికగా అన్నా 117వ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మాండ సభకు తీర్మానించారు. జూలై 1 నుంచి 17వతేదీ వరకు డివిజన్ల వారీగా పార్టీ నేతలతో సమావేశాలకు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసి, ప్రజలలోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. పాఠశాలలలో వృత్తి విద్యా కోర్సులకు మంగళం పాడే విధంగా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ప్రత్యేకంగా తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించారు. ఎండీఎంకే భేటీలో నిర్ణయం సెప్టెంబర్ 15న తిరుచ్చిలో కాన్ఫరెన్స్ -
నిండు కుండగా మేట్టూరు
కావేరి ఉగ్ర రూపంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం అమాంతం పెరిగి అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. ఆదివారం జలాశయం నీటి మట్టం 120 అడుగులను సమీపించడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ గేట్లు ఎత్తి వేశారు. ముందు జాగ్రత్తగా డెల్టాలోని ఎనిమిది జిల్లాలోని కావేరి తీర వాసులను అలర్ట్ చేశారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశాలతో తీరం వెంబడి దండోరా వేయించారు. ● ఉబరి నీటి విడుదల ● ‘డెల్టా’ వైపుగా కావేరి పరవళ్లు ● తెరచుకున్న మేట్టూరు గేట్లు ● తొమ్మిది జిల్లాలకు అలర్ట్ సేలం: కర్ణాటక నుంచి తమిళనాడు వైపుగా కావేరి నది పరవళ్లు తొక్కడంతో 120 అడుగులతో కూడిన డెల్టా అన్నదాతల వరప్రదాయిని మేట్టూరు జలాశయంలోకి నీటి రాక క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. నిర్ణీత జూన్ 12వ తేదీన జలాశయం నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేశారు. అదే సమయంలో గత రెండు మూడు రోజులుగా నదీ పరివాహక ప్రదేశాలు , కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరి ఉగ్రరూపం దాల్చింది. కావేరి నదిలో హొగ్నెకల్ వద్ద సెకనుకు సుమారు 85 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇది జలాశయంలోకి సుమారు 75 వేల క్యూ సెక్కులతో ప్రవేశిస్తున్నది. దీంతో శర వేగంగా జలాశయం నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి సమయంలో 119 అడుగులను నీటిమట్టం దాటడంతో 16 స్లూయిస్ గేట్ల ఎత్తి వేసి నీటిని విడుదల చేశారు. నీటి ఉధృతి మరింతగా పెరగవచ్చు అన్న సంకేతాలతో ఆదివారం తిరుచ్చి రీజియన్ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్ల బృందం జలాశయం,పరిసరాలలో పరిశీలన చేశారు. కావేరిలో నీటి ఉధృతి, మేట్టూరు జలాశయం నిండు కుండగాదర్శనం ఇవ్వడంతో ముందు జాగ్రత్తలపై ప్రభుత్వం ఆదివారం ఉదయాన్నే దృష్టి పెట్టింది. మేట్టూరు జలాశయం మీద ఆధార పడ్డ 13 జిల్లాలోని కావేరి ఉమ్మడి తాగు నీటి పథకాలకు నీటి పంపింగ్ విస్తృతం చేయడం, మరో 11 జిల్లాలోని 925 చెరువులకు నీటి మళ్లింపునకు సంబంఽధించిన పరిశీలన విస్తృతం చేశారు. తీరంలో అలర్ట్ ఆదివారం సాయత్రం నిర్ణీత 120 అడుగులకు నీటి మట్టం చేరడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ, ప్రధాన గేట్లను ఎత్తి వేశారు. ప్రస్తుతం 60 క్యూసెక్కుల వరదనీరు కిందికి ప్రవహిస్తోంది. ఈ నీటిని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున డ్యాం వద్దకు చేరుకున్నారు. ఉబరి( మిగులు) జలాల ఉధృతి అధికంగా ఉండే అవకాశాలతో డెల్టా వైపుగా కావేరి తీరంలో ఉన్న జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తూ చర్యలు చేపట్టారు. సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు జిల్లాల్లోని తీర గ్రామాల ప్రజలకు ముందు జాగ్రత్తలతో హెచ్చరికలు చేయిస్తూ దండోరా వేయించారు. అలాగే మేట్టూరు జల విద్యుత్ కేంద్రం వైపుగా వరద చొచ్చుకు రాకుండా, మేట్టూరు – ఎడపాడి మార్గంలోకి వరద నీరు చొరబడటంతో ఆ మార్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా రాత్రి సమయంలో నీటి ఉధృతి పెరిగిన పక్షంలో వచ్చే నీటిని పూర్తిగా బయటకు పంపించక తప్పదు. ఈ దృషౠ్ట్య, సేలం, ఈరోడ్ జిల్లాలోని లోతట్టు గ్రామాలలోకి వరద నీరు చొచ్చుకు వెళ్లే అవకాశాలు ఎక్కవ కావడంతో అక్కడి ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. నివాసాలలోకి నీరు చొచ్చుకు వచ్చిన పక్షంలో అక్కడి ప్రజల కోసం శిబిరాలకు చర్యలు చేపట్టారు. భవానీ, కందన్ నగర్, అందియూరు కూడలి, పాలక్కరై , నేతాజీ నగర్, కొడుముడిలో పరిసర లలోకి వరదలు చొచ్చుకు రాకుండా చర్యలు విస్తృతం చేశారు. కావేరి నదీ తీరం వైపుగా వెళ్ల వద్దని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కల్వర్టు మార్గాలను, వంతెనలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో దండోరా వేశారు. ఏ క్షణానైనా నీటి విడుదల శాతం మరింతగా పెరగవచ్చునని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత ముందు జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించే పనిలో పడ్డారు. ఐదేళ్లుగా నిండు కుండగా.. 2021, 2022, 2023, 2024లలో నైరుతీరుతు పవనాలు కర్ణాకటలో కరుణించడంతో కావేరి పరవళ్లు తొక్కాయి. దీంతో మేట్టూరు జలాశయం నిండు కుండగా మారింది. కావేరి తీరం వైపుగా ఉబరి నీటిని బయటకు విడుదల చేశారు. గత రెండేళ్లుగా అయితే ఈ జలాశయం పలు మార్లు పూర్తిగా నిండింది. ప్రస్తుతం కూడా నిండు కుండగా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టాన్ని రాత్రి సమయంలో చేరడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. ఈ దృష్ట్యా, కావేరి తీరప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఉబరి నీటిని సమీపంలోని చెరువులు, చిన్న చిన్నా ఆనకట్టులకు మళ్లీంచే విధంగా విస్తృత చర్యలకు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
వైభవంగా గోమాతకు సీమంతం
కొరుక్కుపేట: ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న ఘటన చైన్నె నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ గోశాలలో ఆదివారం జరిగింది. చైన్నెకు చెందిన గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి గోశాలలోని రెండు గోవులకు సీమంతం చేశారు.గోవులకు పసుపు కుంకుమ రాసి,గాజులు తొడిగి ,జడపట్టి కట్టి , కొత్త వస్త్రాలు సమర్పించి గోప్రదక్షిణలు చే శారు.ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దలు, చిన్నారులు పాల్గొని గోమాత సేవలో తరించారు. గోమాత సేవ సంస్థ వ్యవస్థాపక సలహాదారులు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర రావు ,వ్యవస్థాపకులు దయాళం పుష్పాంబ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. -
అందరికీ రూ. 1000
● నిబంధనలు మరింత సడలింపు సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్ మగళిర్ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం) అందరు మహిళలకూ వర్తింప చేసే అవకాశాలుఉన్నాయి. ఈ పథకం ఇది వరకు విధించిన నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఆదివారం ప్రకటన వెలువడింది.ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్ మహిళ హక్కు పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా ఒక కోటి 6 లక్షల మందికి ఈ పథకం వర్తింపజేశారు. ఆ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు పంపిణీ జరుగుతోంది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూర లేదని పేర్కొంటూ 11 లక్షలమందికి పైగా మహిళా అప్పీలు దరఖాస్తులు దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7. 35 లక్షల లక్షల మందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయినా, తమ కంటే తమకు రావడం లేదని అప్పీలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులకూ.. మహిళా ఉద్యోగిణిలు, పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారందర్నీ ఈ పథకంకు అనర్హులుగా గతంలో ప్రకటించారు. అలాగే కార్లు కలిగిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారి కుటుంబాలకు కూడా అవకాశం కల్పించ లేదు. ఈ పరిస్థితులలో ఈ పథకం విస్తరణ దిశగా జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టాలిన్ మీతో కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమకంటే తమకు పథకం వర్తింప చేయాలన్న విజ్ఞప్తులు పెరగడంతో తాజాగా మూడు నిబంధనలను సడలించారు. ఈ మేరకు తక్కవ జీతాలు పొందుతున్న మహిళలు, పెన్షన్లు పొందతున్న మహిళలు, నాలుగు చక్రాల వాహనాలను కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలు, వితంతు పెన్షన్లు పొందతున్నమహిళలు సైతం ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఈ పథకంలో నిజమైన అర్హులకు న్యాయం జరిగే విధంగా ఈ చర్యలు తీసుకుని నిబంధనలు సడలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా వీపీ రామలింగం
● జాన్కుమార్కు మంత్రి పదవి ● మరో ముగ్గురికి నామినేటెడ్ పదవులు సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా వీపీ రామలింగం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేగా ఉన్న జాన్కుమార్కు మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురికి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులను కట్టబెట్టే దిశగా సిఫారసులు ఢిల్లీకి చేరాయి. 2021లో ఎన్ఆర్కాంగ్రెస్తో కలిసి ఎన్నికలలోకి వెళ్లిన బీజేపీ బ్రహ్మాండ విజయాన్ని దక్కించుకుంది. బీజేపీ – ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎన్ఆర్కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. అధికారంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయితే, గత వారం రోజులుగా పుదుచ్చేరి బీజేపీలో అనూహ్యమార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ అధినేతల నుంచి వచ్చిన సమాచారంతో తొలుత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో వీరి రాజీనామాను స్పీకర్ ఎన్బలం సెల్వం ఆమోదించారు. మరుసటి రోజే శనివారం మంత్రి పదవికి బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణ కుమార్ రాజీనామా చేశారు. అదే సమయంలో ఆదివారం బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు ఎన్నికల నిర్వహించారు. ఇందులో పార్టీలో 2021లో చేరిన వీపీ రామలింగం అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్దాఖలు చేశారు. ఇతరులు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయనిదృష్ట్యా,ఆ యన ఎంపిక ఏక్రగీవమైంది. కొత్త అధ్యక్షుడిగా ఆయన జూలై 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. జాన్కుమార్కు జాక్పాట్ బీజేపీలో ఆది నుంచి అసంతృప్తి ఎమ్మెల్యేగా జాన్కుమార్ వ్యవహరిస్తూ వచ్చారు. సాయి శరవణ కుమార్ రాజీనామాతో ఆయనకు తాజాగా అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో పదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో జాన్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలైన దీపయన్, సెల్వం, రాజశేఖర్లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు కట్ట బట్టే దిశగా అధిష్టానానికి సిఫారసులు వెళ్లాయి. కేంద్ర హోం శాఖ ఆమోదంతో వీరిని నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం రంగస్వామి వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పూర్తిగా మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాాలు వెలువడ్డాయి. తమ పార్టీకి చెందిన పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని తప్పించి అసంతృప్తితో ఉన్న వారికి పదవులు ఇచ్చే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా లెఫ్టినెంట్గవర్నర్ కై లాష్ నాథన్ను సీఎం రంగస్వామి కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఆయన సమయం ఇవ్వగానే మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ ప్రకటన, కొత్త వారి ప్రమాణ స్వీకారం ఒకే సమయంలో జరిగే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. -
నటిస్తే హీరోగానే..
తమిళసినిమా: నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్ ఏమిటంటే నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయరో పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్ వాగైయారో అనే టైటిల్ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే సోషల్ పొలిటికల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్ చాలా టైట్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం. తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడుగా అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన డ్రాగన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటి ఖయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఇందులో దర్శకుడు మిష్కిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దిగ్విజయంగా వంద రోజులు ప్రదర్శింపబడిన సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలో శత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గానికి జ్ఞాపికలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రం థియేటర్లలో వంద రోజులు ప్రదర్శింపబడటం సాధారణ విషయం కాదన్నారు. దాన్ని డ్రాగన్ చిత్రం సుసాధ్యం చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రదీప్ రంగానాథన్, దర్శకుడు అశ్వద్ మారిముత్తుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. మీరు చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు.. చిత్ర విజయానికి కథే కింగ్ అని, ఈ విషయాన్ని వారు గుర్తించుకోవాలని అర్చన కల్పాతి పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తాను దర్శకుడు అశ్వద్ మారిముత్తు మంచి మిత్రులు అన్నది తెలిసిందేన్నారు. అశ్వద్ మారిమాత్తు ఓ మై కడవులే చిత్రం చేస్తున్నప్పుడు అందులో తనను ఒక పాత్రలో నటించడానికి పిలిచారన్నారు. అయితే తాను నటిస్తే హీరో గానే నటిస్తానని ఆయనతో చెప్పాను అన్నారు. ఆ తర్వాత తాను కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లవ్ టుడే చిత్రాన్ని విడుదలకు ముందు అశ్వద్ మారిముత్తుకు చూపించానన్నారు. అప్పుడు తనను కథానాయకుడిగా చిత్రాన్ని చేస్తావా ఆయన్ని అడిగానన్నారు. అలా లవ్ టుడే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన తర్వాత చేసిన చిత్రం డ్రాగన్ అని చెప్పారు. నువ్వు దర్శకత్వ వహించి కథానాయకుడిగా నటించి విజయం సాధించావు ఇతరుల దర్శకత్వంలో నటించి సక్సెస్ కాగలవా అని మాట్లాడిన వారికి ఈ చిత్ర విజయం సమాధానమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడ్డానని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు. శింబు, వెట్రిమారన్ కాంబో షురూ -
రాందాసు ప్రాణాలకు ముప్పు
సేలం: అన్బుమణి మద్దతుదారుల నుంచి రాందాసు ప్రాణాలకు ముప్పు ఉందని సేలం పశ్చిమ నియోజకవర్గం పీఎంకే ఎమ్మెల్యే అరుల్ ఆరోపించారు. రాందాసును కించపరచడం మానుకోవాలని అన్బుమణిని హెచ్చరించారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. పార్టీ వర్గాలు, ముఖ్యులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారు. రాందాసు వెన్నంటే సీనియర్లు, ముఖ్యులైన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సమయంలో రాందాసును టార్గెట్ చేస్తూ అన్బుమణి విమర్శలు గుప్పిస్తుండడంతో మీడియా ముందుకు ఆదివారం ఎమ్మెల్యే అరుల్ వచ్చారు. అన్బుమణిని హెచ్చరించే విధంగా వ్యాఖ్యల తూటాలను పేల్చారు. రాందాసువి పిల్ల చేష్టలుగా అన్బుమణి పేర్కొనడాన్ని ఖండించారు. అన్బుమణి రామదాస్ కారణంగా గత 15 సంవత్సరాలుగా వరసుగా పార్టీ పతనం వైపు వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప నాయకుడైన రాందాసును అన్బుమణి అవమానకరంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్టీకి పూర్వవైభవం మళ్లీ రావాలంటే 2026 ఎన్నికల్లో రాందాసు నేతృత్వంలో పార్టీ ముందుకు సాగాల్సిన అవశ్యం ఉందన్నారు. కాగా ఇతరులు అవమానించినా, కించ పరిచినా, మనం మాత్రం ఎవర్ని బాధ కలిగించకుండా వ్యవహరించాలని ఆదివారం తైలాపురంలో జరిగిన సోషల్ మీడియా పార్టీ ప్రతినిధుల సమావేశంలో రాందాసు సూచించడం గమనార్హం. ఎమ్మెల్యే అరుల్ ఆరోపణ అన్బుమణికి హెచ్చరికలు -
భగవద్గీతతో అద్భుతమైన పరివర్తన
కొరుక్కుపేట: భగవద్గీతలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న వారి జీవితంలో అద్భుతమై పరివర్తన వచ్చి తీరుతుందని ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు, ఆథ్యాత్మిక ప్రబోధకులు, గురువు శ్రీ వివేకానంద ఉపదేశించారు. ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు ఏర్పాటు చేసిన ఆత్మజ్ఞానం సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఆథ్యాత్మిక సదస్సుకు గురువు శ్రీవివేకానంద విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆత్మచైతన్యంపై సమగ్ర అవగాహననే జ్ఞానం అని పేర్కొన్నారు. అలాగే సత్యం, జ్ఞానం అనేది తెలుసుకుంటే జీవితం ఎంతో బాగుంటుందన్నారు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది లేనే లేదన్నారు. రెండు దశాబ్దాలుగా భగవద్గీత, గరుడపురాణం తదితర గ్రంథాల్లోని సారాంశాన్ని అందరికీ ఉపదేశిస్తున్నట్టు తెలిపారు. ప్రతి మానవడు భగవద్గీత అర్థం చేసుకోవాలన్నారు. దాన్ని అర్థం చేసుకుంటే వారి జీవితంలో అద్భుత పరివర్తన వచ్చి తీరుతుందని తెలిపారు. అనంతరం గురువు వివేకానందను డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీమోహనరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంధ్య, సాంబశివరావు, ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సుభాషిణి పాల్గొన్నారు. -
శేష వాహనంపై పరాశరేశ్వరస్వామి
నారాయణవనం: టీటీడీ అనుబంధంగా ఉన్న చంపకవళ్లీ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం రాత్రి స్వామివారి ఉత్సవర్లు శేషవాహనంపై అధిష్టించి పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు పరివార దేవతలకు, మూలవర్లకు అభిషేకాలు, నిత్య కై ంకర్యాలు చేపట్టారు. 10 గంటలకు చంపకవళ్లీ, పరాశరేశ్వర్లుకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించి, భక్తులకు ప్రసాదాలను వితరణ చేశారు. సాయంత్రం కై ంకర్యాలను అందుకున్న ఉత్సవర్లు శేష వాహనాన్ని అధిరోహించారు. సర్కారు హారతి అందుకున్న దేవేరులు గ్రామోత్సవంలో విహరిస్తూ భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. కార్యక్రమాలను స్థానిక ఆలయాల ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్ తదితరులు పర్యవేక్షించారు. ఉత్సవాల్లో అయిదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు నంది వాహనం అధిష్టించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 68,229 మంది స్వామి వారిని దర్శించుకోగా 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు
శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో శ్రీఅన్నమయ్య పదామత వర్షణిశ్రీ కార్యక్రమం శనివారం సంగీత ప్రియులను అలరించింది. హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవ శంకరరావు వ్యాఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు, రచనల గొప్పతనాన్ని వివరించారు. ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. కళాకారులను ఇతర బృంద సభ్యులను ఆయన అభినందించారు. నిర్వాహకుల తరపున తిరుపతి శ్వేతా మాజీ డైరెక్టర్ భూమన్, ఎస్కే యూనివర్సిటీ మాజీ ఉప కులపతి కుసుమకుమారి కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి పళ్లేటి బాలాజీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
తమిళ భాషకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
మద్యం తాగితే స్తంభానికి కట్టేయాలి వేలూరు: విద్యార్థులు తమిళభాషకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాథన్ అన్నారు. వేలూరు కంభన్ కయగం ఆధ్వర్యంలో కవి కన్నదాసన్ జయంతి కార్యక్రమం వేలూరులోని ఊరీస్ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలూరు కంభన్ కయగం చైర్మన్, వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అధ్యక్షత వహించారు. చాన్సలర్ మాట్లాడుతూ తమిళ భాషకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలను గుర్తించి ప్రతి సంవత్సరం సమావేశం ఏర్పాటు చేసి అభినందిస్తున్నామన్నారు. చైర్మన్ జీవీ సెల్వం మాట్లాడుతూ తమిళ భాషను పది కోట్ల మంది ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ నేటి యుగంలో తమిళం మాట్లాడే వారి సంఖ్య తగ్గుతూనే ఉందన్నారు. ఇందుకు కారణం నేటి విద్యార్థులు పత్రికలు, తమిళ భాష పుస్తకాలు చదవక పోవడమే కారణమన్నారు. తమిళ భాష మాట్లాడటం అనేది అవమానం కాదని, మన గుర్తింపుగా భావించాలన్నారు. నేడు మనం ఆంగ్లభాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, తమిళభాషను మరిచి పోతున్నామని, ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తమిళ భాషను మన తరాలు మరిచి పోయే పరిస్థితి ఉందన్నారు. మాతృభాషా దినోత్సవం జరుపుకునే సంప్రదాయం తమిళులకు లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమిళ భాషను చదవాలన్నారు. తమిళ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కంభన్ కయగం ఆధ్వర్యంలో కన్నదాసన్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. అనంతరం తమిళ కవులు, రచయితలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రచయితలు జ్యోతి బాలు, వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానవేల్, కంభన్ కయగం కార్యదర్శి చోళనాథన్, కోశాధికారి తిరునావకరసు, తమిళ సంఘం రచయితలు, కవులు, తమిళ పండిట్లు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. వృద్ధురాలి చైన్, నగదు చోరీ తిరువొత్తియూరు: ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో వృద్ధురాలి చైన్, నగదు చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. చైన్నె, కొట్టివాక్కం ప్రాంతానికి చెందిన రాజేశ్వరి (62) వేపేరిలో వెటర్నరీ ఆస్పత్రిలో అకౌంట్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈమె శుక్రవారం తిరువాన్మియూర్ నుంచి షేర్ ఆటోలో కొట్టివాక్కమ్కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఆటోలో పక్కన కూర్చుని ఉన్న మహిళ, రాజేశ్వరితో మీ మెడలో ఉన్న చైన్ తెగిపోయేలా ఉందని, దాన్ని మీ బ్యాగులో భద్రంగా ఉంచుకోండని చెప్పింది. తరువాత ఆ మహిళ రాజేశ్వరి చైన్ తీసి బ్యాగులో పెట్టడానికి సహాయం చేసింది. రాజేశ్వరి ఇంటికి వచ్చి బ్యాగు తెరిచి చూడగా బంగారు చైన్, రూ.4 వేల నగదు కనిపించలేదు. దీంతో రాజేశ్వరి దిగ్భ్రాంతి చెందింది. ఆటోలో మహిళ తన దృష్టి మరల్చి, చైన్, డబ్బు చోరీ చేసినట్లు రాజేశ్వరి నిర్ధారించుకుంది. దీనిపై నీలంకరై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలలో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. టీచర్పై ప్లస్ టూ విద్యార్థుల దాడి తిరువొత్తియూరు: పాఠశాలకు ఆలస్యంగా రావడాన్ని ప్రశ్నించిన ఉపాధ్యాయుడిపై ప్లటూ విద్యార్థులు దాడి చేశారు. చైన్నె కొత్త చాకలిపేట దేశీయనగర్ నాలుగో వీధికి చెందిన వినోద్ (39) చైన్నె కొడంగయూర్ పొన్నుస్వామినగర్లోని పద్మప్రకాష్ మెట్రిక్యులేషన్ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పాఠశాలలో చదువుతున్న మాధవరం ప్రాంతానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను పిలిచాడు. కానీ విద్యార్థులు నిర్లక్ష్యం చేసి అక్కడికి వెళ్లలేదు. సమాచారం అందుకున్న పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వినోద్ అక్కడికి వెళ్లి వారిని ఆలస్యం విషయమై ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన ముగ్గురు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. దీంతో వినోద్ కుమార్ ఎడమ కంటి వద్ద గాయమైంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను విచారిస్తున్నారు. రౌడీల అరెస్టు తిరువొత్తియూరు: చైన్నె, ఎంకేబీ నగర్, పులియాంతోపు ప్రాంతాల్లో వేర్వేరు సంఘటనలకు సంబంధించి పోలీసులు పలువురు రౌడీలను అరెస్టు చేశారు. చైన్నె, ఎంకేబీ నగర్ నార్త్ అవెన్యూ రోడ్డులో ప్రజలకు భీతిని కలిగిస్తున్న వ్యాసర్పాడి దామోదరన్ నగర్కు చెందిన సంతోష్ (36), దినేష్ (29)ను అరెస్టు చేశారు. అలాగే పులియాంతోపు మేకలతొట్టి వద్ద మాంసం కొనడానికి వచ్చే వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి, డబ్బు వసూలు చేస్తున్న పులియాంతోపు, కన్నికాపురం, కస్తూరిబాయి కాలనీకి చెందిన కార్తీక్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. పులియాంతోపు కెనాల్ స్ట్రీట్ ప్రాంతంలో గుట్కా అమ్ముతున్న పులియాంతోపు నరసింహనగర్ ఒకటో వీధికి చెందిన సూర్య(19), బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ హత్య కేసులో అతని తండ్రి తిరుమలను అరెస్టు చేశారు. 6 చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు తిరువొత్తియూరు: ఎన్నూర్, తిరువొత్తియూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారించడానికి ఆరు చోట్ల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. తిరువొత్తియూర్ ఎమ్మెల్యే కేపీ శంకర్, జోనల్ కమిటీ చైర్మన్ టీఎం తనియరసు, కౌన్సిలర్ ఎంఎస్ తిరవియం ట్రాన్స్ఫార్మర్ల స్థాపనకు భూమి పూజ చేశారు. అన్నానగర్: మద్యం తాగితే ఓ రోజంతా అమ్మవారి ఆలయం వద్ద స్తంభానికి కట్టి వేయాలని పంచాయతీలో గ్రామపెద్దలు తీర్మానం చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగై జిల్లా, వేదారణ్యంలోని పంజనదికులం నడుచ్చేతి పంచాయతీలోని సిరుదలైకాడు మత్స్యకార గ్రామం. ఈ గ్రామంలో 2 వేల మందికి పైగా నివసిస్తున్నారు. చేపల వేట వీరి ప్రధాన వృత్తి. ఈ గ్రామంలో మద్యానికి బానిసైన యువకులతో ఆ అలవాటును మాన్పించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం సిరుదలైకాడులో గ్రామాధికారి నామకోటి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. సిరుదలైకాడులో నిత్యం మద్యం సేవించే వ్యక్తులను పట్టుకుని మారియమ్మన్ ఆలయం వద్ద స్తంభానికి ఒక రోజు పాటు కట్టి వేయాలని తీర్మానించారు. అలాగే మద్యం సేవించి, వాహనం నడిపితే ఆ బైకును జప్తు చేయాలని తీర్మానించారు. మహిళలను ఆటపట్టించకూడదని, వెంబడించకూడదని, వారిని ఒత్తిడి చేయకూడదని, ఎవరైనా అలాంటి పని చేస్తూ దొరికితే, అపరాధి గుడి ముందు గుండు చేయించుకోవాలని నిర్ణయించారు. ప్రజలు పంచాయతీ సమావేశంలో ఈ తీర్మానాలను ఆమోదించి, వాటిని ముద్రించి పట్టణంలోని రెండు ప్రదేశాల్లో ఉంచారు. గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు, మహిళలు హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ విషయం గురించి గ్రామాధికారి నామకోడి మాట్లాడుతూ యువత నిరంతరం మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్నారని, మద్యపానంతో కుటుంబాలు నాశనమవుతున్నాయని గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 8 నెలల గర్భిణి హత్య అన్నానగర్: ఎనిమిది నెలల గర్భిణి హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా వేప్పనపల్లి సమీపం అటవీ ప్రాంతంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో చెట్టుకు వేలాడుతు ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న వెప్పనపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం కృష్ణగిరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో మృతురాలు పల్లెరి గ్రామానికి చెందిన మూర్తి కుమార్తె షాలిని (25)గా గుర్తించారు. 8 నెలల గర్భిణి అయిన ఈమెను సుత్తితో కొట్టి, దుపట్టాతో గొంతు నులిమి హత్య చేశారని పోస్టుమార్టమ్ రిపోర్టులో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు షాలిని కుటుంబ సభ్యులను విచారించారు. ఆమె 19వ తేదీ నుంచి కనిపించలేదని, ఆమె కోసం వెతుకుతున్నామని వారు తెలిపారు. దీంతో షాలిని మృతదేహం దొరికిన ప్రదేశంలో బాధితురాలి సెల్ఫోన్ సిగ్నల్లో ఎవరి నంబర్లు రికార్డు ఆధారంగా దర్యాప్తు చేశారు. ఆ సెల్ఫోన్ నంబర్లు పందికురి గ్రామానికి చెందిన మేఘనాథన్ (21), కృష్ణగిరి సమీపంలోని పెరియా అగ్రహారానికి చెందిన పుగళేంది (19)కి చెందినవని తేలింది. పోలీసులు వారిని అరెస్టు చేసి విచాచించారు. మేఘనాథన్కు షాలినితో వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో వారిద్దరి మధ్య విబేధాలు రావడంతో మేఘనాథన్ తన స్నేహితుడు పుగళేంది సహాయంతో షాలినిని హత్య చేశాడు. దీంతో పోలీసులు శనివారం మేఘనాథన్, పుగళేందిని అరెస్టు చేశారు. కార్మికుడి హత్య తిరువొత్తియూరు: జీతం, నగదు ఇవ్వలేదని కార్మికుడిని హత్య చేసిన మరో కార్మికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..తిరువేర్కాడు సెల్వగణపతి నగర్, ఫస్ట్ స్ట్రీట్లో దండపాణి(45) బంధువుల ఇంట్లో ఉంటూ దినసరి కూలీగా పనికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇతడు రెండు రోజుల కిందట బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో చైన్నె తిరువేర్కాడు గ్రీన్పార్క్ ప్రాంతంలోని ముళ్ల పొదలో గాయాలతో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు శుక్రవారం సాయంత్రం సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించి, దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో అదే ప్రాంతానికి చెందిన సుడలై (40)ని అనుమానించి, అరెస్టు చేసి విచారించారు. దండపాణి, సుడలై కలిసి పెయింటర్లుగా పని చేయడానికి వెళ్లారు. సుడలై జీతం డబ్బు తీసుకుని దండపాణికి ఇవ్వకుండా మోసం చేశాడు. ఆగ్రహం చెందిన సుడలై సంఘటన జరిగిన రోజు, మద్యం మత్తులో దండపాణిని కత్తితో పొడిచి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయినట్లు అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరువెర్కౌడ్ పోలీసులు సుడలైని అరెస్టు చేశారు. -
క్లుప్తంగా
కారులో గుట్కా తరలిస్తున్న వ్యక్తి అరెస్టు తిరుత్తణి: ఆంధ్రప్రదేశ్ నుంచి కారులో చైన్నెకు నిషేధిత గుట్కా తరలిస్తున్న యువకుడిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం పోలీసులు శుక్రవారం రాత్రి చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలోని ఆర్కాడుకుప్పం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చైన్నె వైపు వెళుతున్న కారును ఆపి తనిఖీ చేశారు. కారులో నిషేధిత గుట్కా, పొగాకు ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి కారుతోసహ వాటిని స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించి విచారించారు. విచారణలో కనకమ్మసత్రం సమీపంలోని నెడుంబరం అరుంధతీ కాలనీకి చెందిన ముత్తుసెల్వన్(29) అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని నగరి నుంచి కారులో చైన్నెకు 50 కిలోల గుట్కా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బైకును ఢీకొన్న కంటైనర్ ● దంపతుల మృతి వేలూరు: బైక్ను కంటైన్ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా పొయిగై సమీపంలోని పిల్లయార్ ఆలయ వీధికి చెందిన రమేష్(43), అతని భార్య గోమది(36) శనివారం ఉదయం వేలూరుకు బైకులో బయలు దేరారు. ఆ సమయంలో బెంగళూరు నుంచి చైన్నెకి వస్తున్న కంటైనర్ అతి వేగంగా వచ్చి వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విరింజిపురం పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వేలూరు ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ డ్రైవర్ ఆకాష్ యాదవ్ను అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన కంటైనర్ నుంచి ఉన్న ఫళంగా మంటలు చెలరేగడంతో జాతీయ రహదారిలో సంచలనం రేగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంలో భాగస్వాములు కావాలి తిరువళ్లూరు: ప్లాస్టిక్ రహిత సమాజానికి యువత, విద్యార్థులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతాప్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళెంలోని భవానీ అమ్మవారి ఆలయంలో మెగా మాస్ క్లీనింగ్, ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, పసుపు బ్యాగుల పంపిణీతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రతాప్ హాజరయ్యారు. మొదట దేవదాయశాఖ ఆధ్వర్యంలో మెగా మాస్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆషాఢమాసంలో పెద్దపాళెం భవానీ అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. తరువాత ఆలయానికి వచ్చిన భక్తులకు ప్లాస్టిక్ వస్తువులతో కలిగే అనర్థాలను వివరించి, పసుపు బ్యాగులను అందజేశారు. కన్నకూతురిని కడతేర్చాడు! అన్నానగర్: కన్న కూతురిని ఓ తండ్రి కొట్టి చంపిన ఘటన చిదంబరం సమీపంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని చిదంబరం కాట్టుమన్నర్ కోయిల్ సమీపంలోని టి.మడప్పురం గ్రామానికి చెందిన అర్జునన్ (57) కూలీగా జీవిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, అబిత (27) అనే కుమార్తె ఉన్నారు. ఈమె ఎంఎస్సీ, ఎంఈడీ పూర్తి చేసింది. అబిత కాట్టుమన్నర్ కోయిల్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు వివాహం చేయడానికి అర్జునన్ వరుడి కోసం వెతకడం ప్రారంభించాడు. అర్జునన్ అభితకు కొంతమంది యువకుల ఫొటోలను కూడా చూపించాడు. కానీ ఆమె ఏదో కారణం చెప్పి పెళ్లిని వాయిదా వేయండంటూ వచ్చింది. కుమార్తె ప్రవర్తనపై అర్జునన్కి అనుమానం కలిగించింది. దీంతో అతను ఆమె పర్యవేక్షించి, విచారణ చేపట్టారు. అప్పుడు తన కూతురు ఒకరిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఇది అర్జునన్కి బాధ కలిగించింది. ఈ స్థితిలో శుక్రవారం అబిత విధులకు వెళ్లలేదు, ఇంట్లోనే ఉంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అర్జునన్ తన కుమార్తెను తాను చూసే వరుడిని వద్దంటున్నావెందుకని అడిగాడు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది. కోపంగా ఉన్న అర్జునన్, తన కుమార్తెను అక్కడ ఉన్న కత్తితో గొంతు కోసి, కట్టితో కొట్టాడు. దీంతో అభిత సంఘటన స్థలంలోనే మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అభిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసి అర్జునన్ని అరెస్టు చేశారు. -
ఆగిన బస్సు షెల్టర్ నిర్మాణం
తిరుత్తణి: పట్టణంలోని అక్కయ్య రోడ్డులో బస్సు షెల్టర్ నిర్మాణానికి మద్రాసు హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు ఆర్ధాంతరంగా ఆగాయి. తిరుత్తణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రైళ్లు, బస్సుల ద్వారా వస్తుంటారు. సుబ్రమణ్యస్వామి ఆలయానికి వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, కమల థియేటర్ సమీపంలోని అక్కయ్య రోడ్డులో బస్స్టాప్ వద్ద వేచి ఉండి వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. చాలా కాలంగా బస్ షెల్టర్ లేక పోవడంతో ప్రయాణికులు, ఎండ, వానలకు రోడ్డుపై వేచివుండి ప్రయాణించాల్సి వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నిధుల రూ.23 లక్షల మంజూరయ్యాయి. దీంతో బస్షెల్టర్ నిర్మాణ పనులు నెల కిందట ప్రారంభమయ్యాయి. వేగంగా పనులు జరుగుతుండగా అక్కయ్య రోడ్డులో దుకాణ యజమానులు బస్ షెల్టర్ నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు బస్షెల్టర్ నిర్మాణానికి తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో బస్షెల్టర్ పనులు ఆగాయి. చాలా కాలం తరువాత ప్రయాణికుల కోసం నిర్మిస్తున్న బస్షెల్టర్ పనులు అర్ధాంతరంగా ఆగడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తిరుచ్చిపై వెంకన్న విహారం
చంద్రగిరి : శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారు శనివారం బంగారు తిరుచ్చి వాహనంపై విహరించారు. వారపు ఉత్సవాల్లో భాగంగా వేకువనే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు సమర్పించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కనులపండువగా కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం వేడుకగా ఊంజల్ సేవ చేపట్టారు. ఈ క్రమంలోనే సర్వాలంకారభూషితులైన దేవదేవేరులను బంగారు తిరుచ్చిపై కొలువుదీర్చి ఊరేగించారు. వైభవంగా ప్రసన్నుడి గ్రామోత్సవం వడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం అప్పలాయిగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం శ్రీవారి గ్రామోత్సవం, ఊంజల సేవను వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొల్పి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఉభయనాంచారుల సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించారు. వేదమంత్రాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ స్వామి వారి ఊంజల సేవ కొనసాగింది. అనంతరం పద్మావతి అండాల్ సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామిని మేళాతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని, మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అధికారి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే జట్టుగా తమిళనాడు!
తమిళనాడు అంతా ఒకే జట్టు అన్నట్టుగా ఏకం అవుదాం అని కేడర్, ప్రజలకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ పిలుపు నిచ్చారు. జూలై ఒకటి నుంచి సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుదాం అని ఆదేశించారు. 68 వేల మంది సోషల్మీడియా సైన్యంతో మరింతగా ప్రజలలోకి చొచ్చుకెళ్దామని వ్యాఖ్యానించారు. సాక్షి, చైన్నె: మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ వ్యూహాలకు సీఎం ఎంకే స్టాలిన్ పదును పెట్టిన విషయం తెలిసిందే. డీఎంకే యువజన విభాగం ఓ వైపు, పార్టీ అనుబంధ విభాగాలు మరోవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాయి. జిల్లాలు, యూనియన్లు, పట్టణాలు, నగరాలు, గ్రామాల వారీగా ఎన్నికల పనులు మరింత వేగవంతం చేయించడమే కాకుండా, ప్రజలలోకి చొచ్చుకేళ్లే కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పథకాలన్నీ ఇంటింటా దరి చేరాయా? అని పరిశీలించి అర్హులైన వారికి మరిన్ని పథకాలను దరి చేర్చే దిశగా కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలతో ఉడన్పెరుప్పే వా...( సోదరా ..కదిలిరా) నినాదంతో సీఎం స్టాలిన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రాన్ని ఏడు డివిజన్లుగా పార్టీ పరంగా విభజించారు. ఆయా డివిజన్లకు ఇన్చార్జ్లనురంగంలోకి దించారు. జిల్లాల కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసి పనుల వేగాన్ని పెంచారు. ఈ వ్యూహాలలో భాగంగా శనివారం అందియూరు, మొడకురిచ్చి, మేట్టుపాళయం జిల్లాల నేతలతో ఒన్ టూ ఒన్గా స్టాలిన్ సమావేశమయ్యారు. ఆ నియోజకవర్గాలలో పరిస్థితులను అధ్యయనంచేశారు. ఈ సమావేశాలలో భాగంగా జూలై 1 నుంచి చేపట్టనున్న సభ్యత్వ నమోదు గురించి కేడర్కు సందేశాన్ని స్టాలిన్ పంపించారు. న్యూస్రీల్ ఏకం అవుదాం జూలై 1 నుంచి సభ్యత్వానికి శ్రీకారం చుడుదాం 68 వేల మందితో డీఎంకే డిజిటల్ సైన్యం ద్రోహులకు చోటు లేదు.. సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టే విధంగా తమిళనాడు అంతా ఒకే జట్టు అని చాటే దిశగా ఏకం అవుదామన్న పిలుపుతో కేడర్, ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. 75 సంవత్సరాల డీఎంకే ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, ఏడవ సారిగా సైతం అధికారం లక్ష్యంగా శ్రమిద్దామని పిలుపు నిచ్చారు. కలైంజ్ఞర్ నిర్దేశించిన మార్గంలో సమగ్ర ప్రణాళికతో 2026లోనూ అధికారం కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ మరింతగా దూసుకెళ్లాల్సిన తరుణం మొదలైందన్నారు. ఇందుకోసం జూలై 1 నుంచి ఓరనియిల్ తమిళనాడు( ఒకే జట్టుగా తమిళనాడు)నినాదంతో గొప్ప సభ్యత్వ నమోదుతో పాటూ ప్రచార భేరి మోగిద్దామని పిలుపు నిచ్చారు. ఓరనియిల్ తమిళనాడు పేరిట ప్రత్యేక యాప్ను సిద్ధం చేసి, డిజిటల్ సైన్యాన్ని సైతం రంగంలోకి దించామని వివరించారు. 234 నియోజకవర్గాలలోని 68 వేల పోలింగ్ బూత్లలో ఈ సైన్యానికి శిక్షణ ఇచ్చామని, వీరితో కలిసి నాయకులు ఇంటింటా వెళ్లాలని, ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించాలని,ద్రావిడ మోడల్ ప్రభుత్వం పనితీరును విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల మద్దతును కూడగట్టుకునే విధంగా ఒక్కో పోలింగ్ బూత్కు కనీసం 30 శాతం సభ్యులను చేర్చే దిశగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ద్రోహులకు తమిళనాడులో చోటు లేదని, మతం, కులం ముసుగులో ప్రజల్ని విడగొట్టే ప్రయత్నం చేసే శక్తులను తరిమి కొట్టేందుకు ప్రజా మద్దతును విస్తృతంగా సేకరించాలని ఆదేశించారు. -
విద్యార్థుల కోసం వాటర్ బెల్
● జూలై 1 నుంచి బడుల్లో అమలుసాక్షి, చైన్నె : విద్యార్థుల శరీరంలో నీటి శాతం పెంపు లక్ష్యంగా వాటర్ బెల్పథకం అమలుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉదయం వేళలో పిల్లల ఆకలి తీర్చేలా అల్పాహార పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. విద్యార్థుల కోసం మరిన్ని పథకాలు అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు బడి వేళలో సరిగ్గా నీరు సేవించడం లేదని అధ్యయనంలో తేలింది. పిల్లలు వాటర్ బాటిళ్లు బడులకు తీసుకెళుతున్నా నీరు తాగడం లేదని వెలుగు చూసింది. దీంతో పిల్లల శరీరంలో నీటి శాతం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు వాటర్ బెల్ పేరిట పథకం అమలుకు సిద్ధం అయ్యింది. ఇందుకు సంబంఽధించిన ఉత్తర్వులను శనివారం విద్యాశాఖ డైరెక్టర్ కన్నప్పన్ జారీ చేశారు. తమిళనాడులోని అన్ని జిల్లాల కార్యదర్శులు ఈ పథకాన్ని జూలై ఒకటి నుంచి అమలు చేయాల్సిందేనని ఆదేశించారు. విద్యార్థులు పాఠశాలల్లో సరిగ్గా నీళ్లు తాగేందుకు వీలుగా మూడు నుంచి ఐదు నిమిషాల వరకు సమయం కేటాయించనున్నారు. ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 3 గంటలకు మూడు సార్లు ప్రత్యేకంగా పాఠశాలలో బెల్ మోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బెల్ మోగినప్పుడల్లా విద్యార్థులు తాము తెచ్చుకున్న బాటిళ్లలో నుంచి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను డీ హైడ్రేషన్ నుంచి రక్షించడంలో భాగంగా ఈ ప్రయత్నం చేపట్టినట్టు ప్రభుత్వం వివరించింది. -
ఉగ్ర కావేరి!
సేలం: తమిళనాడులోనే డెల్టా జిల్లాలకు సాగుకు, ఇతర జిల్లాలకు ఉమ్మడి తాగు నీటి పథకానికి ప్రధాన వనరుగా మేట్టూరు జలాశయం నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కురువై సాగుబడికి ఈ జలాశయం చేయూతను ఇచ్చింది. నిర్ణీత జూన్ 12వ తేదీన సాగునిమిత్తం గేట్లు తెరచుకున్నాయి. డెల్టా జిల్లాల వైపుగా కావేరి పరవళ్లుతొక్కుతున్నాయి. నిర్ణీత 120 అడుగులతో కూడిన ఈ జలాశయంలోకి శుక్రవారం నుంచి నీటి రాక మరింతగా పెరిగింది. సెకనుకు 75 వేలకు పైగా క్యూ సెక్కుల నీరు వస్తోంది. కర్ణాటకలో కురస్తున్న వర్షాలతో మళ్లీ కావేరిలోకి వరద ఉధృతి క్రమంగా పెరుగతున్నది. తమిళనాడు సరిహద్దులలోని పిలి గుండుల వద్ద సెకనుకు 90 వేల మేరకు క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇది తమిళనాడు – కర్ణాటక సరిహద్దులలోని హొగ్నెకల్ వద్ద ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నది. హొగ్నెకల్ జలపాతం అన్నది ఇక్కడ ఒకటి ఉందా..? అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ నీటి ప్రవాహం మరింతగా పెరగవచ్చు అని భావిస్తున్నారు. ఇక్కడ సెకనుకు 85 వేల క్యూసెక్కులమేరకు నీరు ప్రవహిస్తున్నది. ఇక్కడ మరింతగా నీరు ఉప్పొంగిన పక్షంలో హొగ్నెకల్, ఆలంపాడి, ఉట్టమలై, నాడర్ కోట్టం గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల వైపుగా నీరు దూసుకెళ్లడం ఖాయం. దీంతో ముందు జాగ్రత్తగా హొగ్నెకల్ తీరంలోని గృహాలలోకి నీరు చేరడంతో ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. నీటి ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలతో కావేరి తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, గ్రామాలకు కావేరి నదీ మీదుగా ఉన్న చిన్న చిన్న వంతెనలు, రోడ్డు మార్గాలను మూసి వేశారు. మేట్టూరు జలాశయం నీటిమట్టం 116 అడుగులకు దాటింది. ఒకటి రెండు రోజులలో నిండుకుండగా మారనన్నది. దీంతో ఉబరి నీటిని పూర్తిగా బయటకు విడుదల చేయల్సి వస్తుంది. ఈ దృష్ట్యా, ముందు జాగ్రత్తగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కావేరి తీరం వెంబడి ఉన్న సేలం, ఈరోడ్, నామక్కల్, కరూర్, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, కడలూరు జిల్లాల్లోని గ్రామాల ప్రజల్ని అప్రమత్తంచేశారు. కావేరి నదీ తీరంకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా , అవసరం అయితే, సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ముందు జాగ్రత్తలుచేపట్టారు. చిన్న చిన్న మార్గాలన్నీ మూసి వేసి , పోలీసు భద్రతను కల్పించారు. మేట్టూరు– ఎడపాడి ప్రధాన మార్గాన్ని సైతం మూసి వేశారు.22 శాతం అధికంగా వర్షం కర్ణాటక నుంచి భారీగా వరద నీరు మహోగ్రంగా హొగ్నెకల్ జలపాతం ఉప్పొంగిన నీటితో తీర ప్రాంతాలు జలమయం నిండు కుండగా మేట్టూరు తీరంలో అలర్ట్ కర్ణాటక నుంచి కావేరి నదిలో భారీగా వరద పోటెత్తుతోన్నది. ఉగ్రరూపం దాల్చి కావేరి నది ప్రవహిస్తుండటంతో తీర గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేశారు. భారత నయాగారా హొగ్నెకల్ జలపాతం కనుమరుగైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది నైరుతీ రుతు పవనాలు కోయంబత్తూరు, నీలగిరులతోపాటూ పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాల మీద అధిక ప్రభావాన్ని చూపించాయి. మరోరెండు మూడు రోజులు కోయంబత్తూరు, నీలగిరులలో భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.జూన్ 1 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులో నైరుతీ రూపంలో 22 శాతం అధికంగా వాతావరణ శాఖ ప్రకటించింది. కోయంబత్తూరులో 33 సె.మీ నీలగిరులలో 26 సెం.మీ , కన్యాకుమారిలో 18 సెం.మీ వర్షం పడిందని ప్రకటలించారు. -
తిరుచెందూరులో పనులు వేగవంతం
● పరిశీలించిన మంత్రులు, ఎంపీ సాక్షి, చైన్నె: తిరుచెందూరులో కుంభాభిషేకం పనులు ముగింపుదశకు చేరాయి. ఈ పనులను శనివారం మంత్రులు శేఖర్బాబు, అనిత రాధాకృష్ణన్, ఎంపీ కనిమొళి పరిశీలించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరుపడై వీడుల్లో రెండోదిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడకు నిత్యంభక్తులు పోటెత్తుతుంటారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను తిలకించేందుకు లక్షల్లో భక్తులు తరలిరావడం జరుగుతుంటుంది. ప్రస్తుతం ఈ ఆలయ కుంభాభిషేక పనులకు అధికార వర్గాలు చర్యలు తీసుకున్నాయి. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ మహోత్సవం జూలై ఏడున ఇక్కడ జరగనున్నది. దేశ విదేశాల నుంచి సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు ఈ వేడుకకు తరలి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే స్పష్టమైన సమాచారాలు వచ్చాయి. ఒకటి నుంచి పూజలు కుంభాభిషేకం మహోత్సవం నిమ్తితం జూలై 1 నుంచి పూజలుమొదలు కానున్నాయి. తొలి రోజున యాగశాల పూజలతో ఉత్సవాలు మొదలు కాన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మైదానంలో యాగశాలను ఏర్పాటు చేసి పూజలకు చర్యలు తీసుకున్నారు.ఈ ఉత్సవం ధృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలను తూత్తుకుడి జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. పరిశీలన.. శనివారం మంత్రులు శేఖర్బాబు, అనిత రాధాకృష్ణన్, తూత్తుకుడి ఎంపీ కనిమొళి కరుణానిధిలు ఇక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. యాగశాల, ఆలయ పరిసరాలు, సముద్ర తీరంలో చేసిన ఏర్పాట్లను వీక్షించారు. భక్తుల కోసం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వీటన్నింటి గురించి జిల్లా కలెక్టర్ ఇలం భగవత్ మంత్రులు, ఎంపీకి వివరించారు.తాము చేపట్టనున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ ఆల్బర్ట్ జాన్ వివరించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లన్నీ ముగింపు దశకు చేరాయని వివరించారు. భక్తులు ముడుపులు సమర్పించే సమయంలో ఎలాంటి తొక్కిసలాటలకు చోటు కల్పించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు బస చేయడానికి వీలుగా ఏర్పాట్లు, సముద్ర తీరంలోకి చొచ్చుకు వెళ్లకుండా మరింత భద్రతపరంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. -
అనల్ అరసు దర్శకత్వంలో పరిచయం ఓ భాగ్యం
తమిళసినిమా: ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన తొలి చిత్రం ఫీనిక్స్. ఈ చిత్రం ద్వారా స్టార్ హీరో విజయ్ సేతుపతి వారసుడు సూర్య విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. ఏకే.బ్రేవ్మెన్ పిక్చర్స్ పతాకంపై రాజ్యలక్ష్మి అనల్ అరసు నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని మే 4వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక వడపళనిలోని పలోజో థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో నిర్మాత కలైపులి ఎస్.ధాను, టీ.శివ, దర్శకుడు హెచ్ వినోద్, పాండిరాజ్, ఫెఫ్సీ విజయన్, శక్తి ఫిలింస్ శక్తివేలన్, నటుడు విజయ్ సేతుపతి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఫైట్ మాస్టర్ ఆనల్ అరసు ఈ చిత్రం కథను తనకు 2018లోనే చెప్పారన్నారు. అయితే అప్పట్లో తాను నటించలేని పరిస్థితి అని పేర్కొన్నారు. ఆ తర్వాత మీ అబ్బాయి సూర్య ఈ కథలో నటిస్తే ఎలా ఉంటుంది అని అడిగారన్నారు. దీంతో తనకు ఒకపక్క సంతోషం మరో పక్క భయం కలిగిందన్నారు. అయితే తన కొడుకు సూర్యకు సంబంధించిన నిర్ణయాలు తనే తీసుకోవాలని భావిస్తానన్నారు. అతనికి కథ వినమని చెప్పానన్నారు. ఆ తర్వాత ఆ విషయం గురించి తానేమి చెప్పలేదన్నారు. అయితే తన సినిమా అనుభవాలను తన కుటుంబ సభ్యులతో పంచుకుంటానని చెప్పారు. అందుకే సూర్యకు సంబంధించిన విషయాల్లో తనే నిర్ణయం తీసుకోవాలని భావించానని చెప్పారు. అందువల్లే తాను ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలతోపాటు ఏ విషయాల్లోనూ పాల్గొనలేదని చెప్పారు. అయితే నటించడం మొదలు పెట్టిన తర్వాత సంతోషంగా ఉందా? అని తన కొడుకు సూర్యను అడగ్గా.. ఉందని చెప్పారన్నారు. అతనికి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన వారందరికీ ధన్యవాదాలన్నారు. స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ద్వారా సూర్య హీరోగా పరిచయం కావడం అతని భాగ్యంగా పేర్కొన్నారు. దర్శకుడిగా పరిచయం అయిన అనల్ అరసు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి కారణం తన తండ్రిని పేర్కొన్నారు. తన సతీమణి రాజ్యలక్ష్మి లేకపోతే ఈ చిత్రమే లేదని ఆయన అన్నారు. -
చిన్నారుల సంరక్షణ కమిటీ సమావేశం
పళ్లిపట్టు: పళ్లిపట్టు టౌన్ పంచాయతీలో చిన్నారుల సంరక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పళ్లిపట్టు టౌన్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన చిన్నా రుల సంరక్షణ కమిటీ సమావేశానికి పట్టణ పంచా యతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ అధ్యక్షత వహించారు. పట్టణ పంచాయతీ కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది. విద్యావేత్తలు, పోలీసులు, తదితరుల బృందం పాల్గొన్నారు. ముఖ్య అతిఽథిగా పట్టణ పంచాయతీ చైర్పర్సన్ మణిమేగళై పాల్గొని చిన్నారుల సంరక్షణ, బాలల హక్కులను వివరించారు. ప్రధానంగా చిన్నారులు ప్రతి ఒక్కరూ పదో తరగతి వరకు నిర్భంద ఉచిత విద్య అందడంతో పాటు బాలికలపై వేధింపులు అరికట్టడం, బాల కార్మికుల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టౌన్ పంచాయతీ మేనేజర్ కుప్పారెడ్డి, విద్యావేత్త గురుమూర్తి, ఎస్ఐ రమేష్కుమార్ సహా సభ్యులు పాల్గొన్నారు. -
క్లుప్తంగా
చైన్నెకి రెండో సబర్బన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలు ● అక్టోబర్ నుంచి అందుబాటులోకి కొరుక్కుపేట: చైన్నెకి రెండో సబర్బన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలు వచ్చేసింది. లోపాలన్నింటినీ పరిష్కరించిన తర్వాత చైన్నెలో రెండో సబ్బరన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలును ప్రారంభించారు. అయితే అక్టోబర్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు తెలిపారు. చైన్నెలో ప్రస్తుతం చైన్నెబీచ్–తాంబరం –చెంగల్పట్టు మార్గాల్లో సెంట్రల్ –అరక్కోణం, సెంట్రల్ –గుమ్మిడిపూండి మార్గాల్లో సబ్బరన్ ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇటీవల బీచ్ నుంచి చెంగల్పట్టు వరకు ఎయిర్ కండీషన్డ్ సబర్బన్ ఎలక్ట్రిక్ రైలును నడిపారు. ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఏసీ ఎలక్ట్రిక్ రైలు బోగీ లు చెడిపోవడంతో రైలు ప్రయాణికుల్లో భ యాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిలో రైలు ఆపివేశారు. ప్రస్తుతం బోగీల్లో సమస్యలు పరిష్కరించి, ట్రయల్ రన్ నిర్వహించారు. మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో తేనున్నట్లు అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి చైన్నె చేరిన తమిళులు తిరువొత్తియూరు: ఇరాన్లో చిక్కుకున్న 12 మంది తమిళులు సురక్షితంగా చైన్నెకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో వారికి మంత్రి అవడి ఎస్ఎం నాసర్ స్వాగతం పలికారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు వెళ్లిన తమిళనాడుకు చెందిన పలువురు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తదితరుల వారిని స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ దేశాల్లో చిక్కుకున్న 12 మంది తమిళులను యుద్ధ ప్రాతిపదికన చైన్నె కు రప్పించడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ తమిళుల ఆధ్వర్యంలో తమిళనాడుకు తిరిగి రావడానికి చర్యలు తీసుకున్నారు. సంక్షేమశాఖ మంత్రి అవడి ఎస్ఎం నాసర్ చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాల నుంచి 12 మంది చైన్నెకు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి అవడి ఎస్.ఎం. నాసర్ వారిని స్వాగతించారు. తరువాత చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి వారిని రైళ్లలో వారి స్వస్థలాలకు పంపించారు. విజయమే లక్ష్యంగా పనిచేయాలి తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయా లని ఎమ్మెల్యే చంద్రన్ పిలుపునిచ్చారు. తిరుత్తణిలోని కదిర్వేల్ మండపంలో డీఎంకే బూత్ లెవల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో డీఎంకే బూత్ కమిటీ సభ్యులకు నూతన సభ్యత్వ నమోదు దరఖాస్తులను ఎమ్మెల్యే చంద్రన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, పధకాలు ద్వారా లబ్ధి పొందిన వివరాలు తెలుసుకుని, వారి సమస్యలు అడిగి పరిష్కరించాలని, పార్టీలో సభ్యులుగా చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు పార్టీ సభ్యత్వ నమోదు దరఖాస్తులు అందజేశారు. జూలై నుంచి నూతన సభ్యత్వ నమోదు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదులో బీఎల్వోలు, ఐటీ విభాగం ఇన్చార్జ్లు చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్టీ పట్టణ కార్యదర్శి వినోద్కుమార్, మండల కార్యదర్శులు హారతి రవి, కృష్ణన్, రాజేంద్రన్, విజయకుమార్, పట్టణ నాయకులు శ్యామ్సుందర్, అశోక్కుమార్, గణేశన్ తదితరులు పాల్గొన్నారు. రూ.60 లక్షల విలువైన బీడీ ఆకులు స్వాధీనం కొరుక్కుపేట: తూత్తుకుడి ఓడరేవు సమీపంలోని థ్రెస్పురం బీచ్ మీదుగా అనుమానాస్పద వ్యక్తులు పడవ ద్వారా బీడీ ఆకు సంచులను ఆక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో కోస్ట్గార్డు గ్రూప్ ఇన్ స్పెక్టర్ పచ్చిముత్తు పర్యవేక్షణలో కోస్ట్గార్డు గ్రూప్ పోలీసులు బీచ్కు చేరుకున్నారు. పోలీసులు రావటంతో వారిని చూసిన ప్రజలు బీడి ఆకు సంచులను సుముద్రంలోని ఒక కంట్రీ బోట్లో వదిలి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత పోలీసులు పడవను స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.60 లక్షల విలువైన 43 సంచులలోని 1,800 కిలోల బీడి ఆకులను సీజ్ చేసి కస్టమ్స్ విబాగానికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో రైలు పనుల్లో అపశ్రుతి ● ఇనుప రాడ్డు పడి కార్మికుడికి తీవ్ర గాయాలు తిరువొత్తియూరు: కోయంబేడులో మెట్రో రైలు పనులు జరుగుతుండగా ఇనుప రాడ్ పడి ఓ కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. కోయంబేడు మార్కెట్ సమీపంలోని ఈ– రోడ్డులో మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ, శుక్రవారం రాత్రి, మంజంబాక్కంకు చెందిన కార్మికుడు రబు కై వర్క్ ( 34) తన సహోద్యోగులతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఇనుప కడ్డీలతో కూడిన ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్ ఊహించని విధంగా పై నుంచి పడింది. దీంతో రబు కై వర్క్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కొలత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కోయంబేడు బస్టాండ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ కథా చిత్రాలను ఆదరిస్తారు!
తమిళసినిమా: కథానాయకుడిగా, నిర్మాతగా మంచి చిత్రాలను చేస్తూ రాణిస్తున్న నటుడు విష్ణు విశాల్. కాగా ఈయన తాజాగా తన విష్ణు ప్రసాద్ స్టూడియోస్ పతాకంపై రోమియో పిక్చర్స్ రాహుల్తో కలిసి నిర్మించిన చిత్రం ఓహో ఎందన్ బేబీ. ఈ చిత్రం ద్వారా తన తమ్ముడు (పెదనాన్న కొడుకు) రుద్రను కథానాయకుడిగా పరిచయం చేశారు. నటి మిధుల పాల్కర్ నాయకిగా నటించిన ఇందులో అంజుకురియన్, దర్శకుడు మిష్కిన్, బాలాజీ శక్తివేల్,కరుణాకరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ వాణిజ్య ప్రకటనలు దర్శకుడు, నటుడు కష్ణ కుమార్ రామ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. జెన్ మార్టిన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూలై 11వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక రాయపేటలోని పీవీ ఆర్ సత్యం థియేటర్లో నిర్వహించారు. కార్యక్రమంలో నటుడు కార్తీ, దర్శకుడు వెట్రిమారన్, రామ్ కుమార్, అశ్వద్ మారిముత్తు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ రుద్ర తన పెదనాన్న కొడుకు అని చెప్పారు. తాను నటుడు కావడానికి తన పెదనాన్న ప్రోత్సాహమేనని పేర్కొన్నారు. ఇప్పుడు తన తమ్ముడు రుద్రను తాను కథానాయకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మాట్లాడుతూ కుటుంబం గురించి తెలియగానే తనకు వానత్తుపోల్ చిత్రం గుర్తుకు వచ్చిందన్నారు. తాను హీరోగా పరిచయమైనప్పుడు కుటుంబ సభ్యులంతా ఎంతగానో అండగా నిలిచారన్నారు. కాగా ఓహో ఎందన్ బేబీ చిత్ర ట్రైలర్ పాటలను చూస్తే ఇది మంచి ప్రేమ కథ చిత్రం గా ఉంటుందని తెలుస్తోందన్నారు. ఇలాంటి ప్రేమ కథా చిత్రాలనే ఇప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నటుడు కార్తీ పేర్కొన్నారు. -
స్ఫూర్తి ప్రదాత హెలెన్ కెల్లర్
కొరుక్కుపేట: మహిళల ఓటుహక్కు, కార్మికుల హక్కులు, ప్రపంచశాంతి కోసం విస్తృత ప్రచారం చేయడంతోపాటు తన జీవితాంతం దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలన్ కెల్లర్ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని ఎంఎన్ కంటి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శృతి పేర్కొన్నారు. దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం 64 ఏళ్లుగా సేవలందిస్తున్న నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ తమిళనాడు రాష్ట్రశాఖ (ఎన్ఏబీ– టీఎన్ఎస్బీ) ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆ శాఖకు చెందిన నీనారెడ్డి నేతృత్వంలో సవేరా వేదికగా జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శృతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ ఒక అమెరికన్ రచయిత్రి, రాజకీయ కార్యకర్త, లెక్చరర్ అయిన ఆమె అనారోగ్యం కారణంగా చిన్న వయస్సులోనే చెవిటి, అంథురాలయ్యారని, అయినా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని సంపాదించిన మొదటి చెవిటి– అంథురాలిగా నిలిచారని గుర్తు చేశారు. వైకల్యం ఉన్నా ప్రతీ బిడ్డా నాణ్యమైన విద్యను పొందే హక్కును కల్పించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ను ఘనంగా సత్కరించగా, స్పెషల్ స్కూల్స్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినంది, సత్కరించారు. -
రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
తిరువళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన క్రమంలో శనివారం ఉదయం తిరువళ్లూరులోని వేర్వేరు ప్రాంతాల్లో పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మోహన్, కలెక్టర్ ప్రతాప్ అకస్మిక తనిఖీలు చేశారు. రేషన్ సరుకు పంపిణీలో బయో మెట్రిక్ విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. అయితే ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనతో ఒక కార్డుదారుడికి సరుకులను ఇవ్వడానికి 45 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, తద్వారా కాలయాపన జరగడంతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడితే సమస్యలు మరింత జఠిలం అవుతాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణ సిబ్బంది శుక్రవారం ఉదయం ఆందోళన బాట పట్టారు. దీంతో ప్రభుత్వాధికారుల్లో చలనం మొదలైంది. పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ మోహన్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ తదితరులు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేశారు. కొత్త విధానం అమలు, సరుకుల నాణ్యతతో పాటు ఇతర వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. -
ముగ్గురు విద్యార్థుల అదృశ్యం
వేలూరు: పాఠశాలలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తిరువళ్లూరు నగర్కు చెందిన గోకుల్ ప్రసాద్, తొర్రపాడి సమీపంలోని భవానీనగర్కు చెందిన క్రిష్ణన్, కేకే నగర్కు చెందిన జీవ సూర్యన్. వీరు ముగ్గురూ తొర్రపాడిలోని రామ్సెట్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. ఒకే తరగతి గదిలో ఉంటున్న ముగ్గురూ తరచూ కలిసి తిరిగే వారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ముగ్గురు విద్యార్థులు సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వెళ్లారు. ఇందులో ఒక విద్యార్థి మాత్రం రోజూ ఆటోలో వచ్చి వెళ్లేవాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్ పాఠశాలకు వెళ్లినప్పటికీ ఆ విద్యార్థి ఆటోలో వెళ్లకుండా తాను తన స్నేహితులతో కలిసి వస్తానని చెప్పి, ఆటో డ్రైవర్ణు పంపి వేశాడు. అనంతరం రాత్రి 10 గంటల వరకు ముగ్గురు విద్యార్థులు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు కూడా విద్యార్థుల ఆచూకీ కనిపించక పోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. -
వినియోగదారుల అభిరుచులే ముఖ్యం
సాక్షి, చైన్నె: వినియోగ దారుల అభిరుచులే లక్ష్యంగా గ్రాండ్ కాంటినెంట్ సేవలు ఉంటాయని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రమేష్ శివ తెలిపారు. చైన్నె టీనగర్లో గ్రాండ్ కాంటినెంట్ ప్రీమియర్ కొత్త హోటల్ను ప్రారంభించినానంతరం రమేష్ శివ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఇదే హోటల్లో పనిచేసిన తాను, ప్రస్తుతం గ్రాండ్కాంటినెంట్ పేరిట దేశ వ్యాప్తంగా హాస్పిటాలిటీరంగంలో విస్తృత సేవలను అందిస్తున్నట్టు వివరించారు. చైన్నెలోని మిడ్ మార్కెట్ హాస్పిటాలిటీరంగంలో ఉన్నత స్థాయి సౌకర్యాలతో కొత్త బెంచ్ మార్క్గా ఈ హోటల్ నిలుస్తుందన్నారు. ఇది తమ 22వ హోటల్ అని , రానున్న రోజులలో ద్వారకా, జైపూర్, అయోద్య, గుర్గాంలలో హోటళ్లను ప్రారంభించనున్నామని వివరించారు. ప్రస్తుతం అత్యాధునిక సౌకర్యాలతో , వినియోగ దారుల అభిరుచులకు అనుగుణంగా సేవలను అందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. 2028 నాటికి తమ సేవలను ఐదు ఇంతలు పెంచడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. 2011 నుంచి తన పయనం మొదలైనా, కరోనా కాలంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని, అనంతరం క్రమంగా కోలుకుని, అందరి సహకారంతో హాస్పిటాలిటీరంగంలో ఉరకలు తీస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ విద్య రమేష్, సీఓఓ సునీల్మాథూర్ పాల్గొన్నారు. -
శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు
తిరుత్తణి: తిరుత్తణి– చిత్తూరు రోడ్డు విస్తరణ తొలిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరుత్తణి నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు పట్టణానికి ప్రస్తుతం రెండు లేన్ల రహదారి ఉంది. వాహనాల రద్దీతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకోవడంతో రోడ్డు విస్తరణకు హైవే శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో సీఎం రహదారుల విస్తరణ పథకంలో భాగంగా తొలి దశలో తిరుత్తణి హైవేశాఖ ఆధ్వర్యంలోని తలయారితాంగల్ నుంచి బీరకుప్పం వరకు నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపుల చెట్లు నరికి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇరువైపులా రోడ్డు విస్తరించి మధ్యలో సెంటర్ మీడియన్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే పళ్లిపట్టు హైవేశాఖ ఆధ్వర్యంలోని ఎరుంబి నుంచి గోపాలపురం వరకు ఐదు కిలో మీటర్లల దూరం తొలివిడతలో రూ.35 కోట్లు వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు జగుతున్నాయి. హైవేశాఖ అధికారులు సమక్షంలో పనులు వేగంగా నిర్వహిస్తున్నట్లు, మరో నెల రోజుల్లో నాలుగు లేన్ల రహదారి పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు. -
మళ్లీ మెగా ఫోన్ పట్టిన ఎస్జే సూర్య
తమిళసినిమా: విలక్షణ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎస్ జే. సూర్య. ఈయన అజిత్ కథానాయకుడిగా దర్శకత్వం వహించిన తొలి చిత్రం వాలి. ఆ చిత్రం సంచల విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే విజయ్ హీరోగా ఖుషి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు తదితర భాషల్లో తొలి చిత్రం వహించారు. అలాగే న్యూ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగానూ పరిచయం అయ్యారు. ఎస్జే సూర్య చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ఇసై. ఆ తర్వాత పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన ప్రతి నాయకుడిగా తనదైన ముద్ర వేసుకుని నటిస్తున్నారు. కాగా 10 ఏళ్ల తర్వాత తాజాగా మరోసారి మెగాఫోన్ పెట్టారు. ఈయన శ్రీజగత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి కిల్లర్ అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రీతి అస్రాణి నాయకిగా నటిస్తున్నారు. శ్రీ గోకులం ఫిలిమ్స్ గోకులం గోపాలన్తో కలిసి ఏంజెల్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం వివరాలను దర్శకుడు, కథానాయకుడు ఎస్జే సూర్య తెలిపారు. ఇది తన డ్రీమ్ చిత్రం అని చెప్పారు. ఎంజీఆర్ (స్థానాన్ని చిత్ర పరిశ్రమలో)పొందడానికి మొదటి చిత్రం దర్శకుడిలా, తొలి చిత్ర నటుడిలా మంచి కథా చిత్రంగా అందరి ఆదరణతో రూపొందించడానికి సిద్ధమయ్యానన్నారు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. చిత్రం షూటింగ్ను భారతదేశంలోని పలు ప్రాంతాలతోపాటు మెక్సికోలో కూడా చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎస్ జే.సూర్య పేర్కొన్నారు. -
234 నియోజకవర్గాల్లోనూ రోడ్ షోలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో రోడ్ షోలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నిర్ణయించారు. 2026లో అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహాలకు పదును పెట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జూలై 7 నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ పర్యటనల వివరాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో భాగంగా జరిగే కార్యక్రమాల గురించి అన్నాడీఎంకే కార్యాలయం తాజాగా ప్రకటించింది. జూలై 7వ తేదీన కోయంబత్తూరు జిల్లా మేట్టు పాళయం నియోజకవర్గం నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అక్కడి వన భద్ర కాళి అమ్మన్ ఆలయంలో ఉదయం 9.30 గంటలకు జరిగే పూజలతో తొలుత రైతు సంఽఘాలతో సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రచారం మొదలు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు చోట్ల కొన్నికి.మీ దూరం రోడ్ షో నిర్వహించే దిశగా కార్యాచరణ సిద్ధంచేశారు. జన సమూహాన్ని ఏకం చేసి ఒక చోట్ల ప్రసంగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి రోజూ పర్యటనలో రైతు సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో సమావేశాలు తప్పని సరి కార్యాచరణగా రూపకల్పన చేశారు. పళణి పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక వాలంటీర్ల బృందాన్ని ఆయా నియోజకవర్గాలలో రంగంలోకి దించారు. ఈ ప్రచార పర్యటనకు ముందుగా జూలై 3వ తేదిన తిరుచ్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మెగా నిరసనలో పళణి స్వామి పాల్గొననున్నారు. -
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వేలూరు: రెండు కార్లలో తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆంబూరు రేంజర్ సెంథిల్ అధ్యక్షతన సిబ్బంది అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నాయకనేరి గ్రామం సమీపంలోని నడువూరు గ్రామంలో అనుమానా స్పదంగా కొందరు తిరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిష్టేషన్ గల రెండు కార్లు ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ సిబ్బందిని చూసిన వెంటనే రెండు కార్లతో నిందితులు పరారయ్యారు. దీంతో సినీపక్కీ లో అటవీశాఖాధికారులు వాటిని వెంబడించారు. దీంతో నిందితులు అటవీ ప్రాంతంలోని పుదూరు గ్రామం వద్ద రెండు కార్లను వదిలి పెట్టి, పరారయ్యారు. అటవీశాఖ సిబ్బంది రెండు కార్లును తనిఖీ చేయగా అందులో సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే 575 కిలోల ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది రెడ్డితోపు ప్రాంతంలోని అటవీ కార్యాలయంలో అప్పగించారు. అనంతరం ఎర్రచందనం ఎవరు కార్లులో తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ జరపగా నాయకనేరి పంచాయతీలోని నడువూరు గ్రామానికి చెందిన ముత్తు కుమారులు రామక్రిష్ణన్, మురుగేషన్గా తెలిసింది. వీరిద్దరూ పరారీ కావడంతో వీరి కోసం గాలిస్తున్నారు. ఈ కార్లు ఆంధ్రప్రదేశ్ రిజిష్టర్ ఉండటంతో ఈ కార్లు ఎవరివి, ఎర్రచందనాన్ని ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’
చెన్నై: హిందీ భాష అనేది ఎవరికీ శత్రువు కాదని, ఆ భాషను స్నేహపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలు చూడాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తాము హిందీ నేర్చుకోవడం సంగతిని కాసేపు పక్కన పెట్టి, ఉత్తరాది వారు తమిళం నేర్చుకుంటే బాగుంటుందని కనిమొళి స్పష్టం చేశారు. అలాగైనా తమిళ భాష జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ‘మేం(తమిళులం) కూడా ఎవరికీ శత్రువులం కాదు.. మేం కూడా స్నేహితులమే. మా భాష కూడా అంతా నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా నార్త్ ఇండియన్స్ తమిళం నేర్చుకంటే బాగుంటుంది’ అని అమిత్ షా పేరును ప్రస్తావించకుండానే తనదైన శైలిలో పేర్కొన్నారు.అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భాషను దేశంలోని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలన్నారు. హిందీని ఎవరూ శత్రువుగా భావించొద్దని, అది ఏ భాషకు శత్రువు కూడా కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘త్రిభాషా పాలసీ’లో హిందీని తప్పనిసరి చేయడానికి చూడటాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు హిందీ భాషను తమ రాష్ట్రాల్లో రుద్దడాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు తమిళం ఉండగా హిందీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే హిందీని తమిళనాడులో పాతాలని చూస్తున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి సైతం హిందీ భాషను తమ రాష్ట్రంలోకి తీసుకు రావడాన్ని ఖండించారు. -
వివాహేతర సంబంధం వద్దన్నా వినలేదు!
అన్నానగర్: వివాహేతర సంబంధం నడుపుతుందన్న కోపంతో భార్యను భర్త కొట్టి, గొంతునులిమి చంపేశాడు. చెన్నై సమీపంలోని పెరుంబాక్కంలో ఉన్న హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అపార్ట్మెంట్లో నివసిస్తున్న జాహీర్ హుస్సేన్ (39)కు సుప్రియ భేగం(26) భార్య ఉంది. వీరు ఉత్తర రాష్ట్రానికి చెందినవారు. వీరిద్దరూ వేర్వేరు ప్రైవేట్ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. దీంతో ఆగ్రహించిన జాహీర్ హుస్సేన్, సుప్రియా బేగంపై దాడి చేసి, గొంతు నులిమాడు. అప్పుడు ఆమె స్పృహ తప్పింది. దీంతో వెంటనే ఆమెను రాయపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, సుప్రియభేగం అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరుంబాక్కం పోలీసులు జాహీర్ హూస్సెన్ను అరెస్టు చేసి, విచారించారు. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, మందలించిన వివాహేతర సంబంధాన్ని వదులకపోవడంతో ఆమెను కొట్టి, గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. -
రామన్నతో సెల్వం భేటీ!
● తైలాపురానికి టీఎన్సీసీ నేతలు ● రాజకీయాలు లేవని స్పష్టం సాక్షి, చైన్నె: పీఎంకే అధ్యక్షుడు రాందాసుతో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై నేతృత్వంలోని బృందం భేటీ అయింది. ముఖ్యనేతలతో కలిసి తైలాపురానికి సెల్వ పెరుంతొగై వెళ్లడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్యసాగుతున్న అధికార సమరం గురించి తెలిసిందే. తమ మధ్య వివాదాలు, విభేదాలకు డీఎంకే కారణం అంటూ అన్బుమణి ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో కీలకపార్టీగా ఉన్న తమిళనాడు కాంగ్రెస్ ప్రతినిధులు శుక్రవారం ఉదయాన్నే తైలాపురం గెస్ట్హౌస్కు వెళ్లి రాందాసును కలవడం రాజకీయ ఆంతర్యానికి పరిస్థితులు కల్పించినట్లైంది. రామన్నతో భేటీ గత కొద్దిరోజులుగా రాందాసు డీఎంకే కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు రూబి మనోహర్, విజయన్లతో కలిసి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై తైలాపురానికి వెళ్లారు. రాందాసుతో కాసేపు మాట్లాడారు. అనంతరం మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకం మాత్రమే అని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయాలు లేవు, కూటమి ప్రయత్నాలు లేవని తేల్చి చెప్పారు. పీఎంకే వివాదంలో సామరస్యం కుదర్చాల్సిన అవసరం తమకు ఎందుకు అని, అది వారికి సంబంధించినది వారే పరిష్కరించుకుంటారని సమాధానం ఇచ్చారు. వారి వివాదంలోకి అన్బుమణి డీఎంకే లాగే విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. బీజేపీ నిర్బంధానికి గురై ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారేమో అంటూనే, ఆయన మనస్సు అంతా డీఎంకేతోనే ఉంటుందని చమత్కరించారు. డీఎంకేలోకి పీఎంకే వస్తుందా అని ప్రశ్నించగా, డీఎంకే కూటమి బలంగా ఉందని, పీఎంకేను చేర్చుకోవాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత సీఎం స్టాలిన్పై ఉందన్నారు. తమిళనాడు అన్ని రంగాల్లో బలంగా ఉందని, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా దూసుకెళ్తోందని, తమ కూటమి ఈ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము మాత్రం ఇక్కడ రాజకీయంగా రాలేదని, పుదుచ్చేరికి వెళ్లి వస్తూ మార్గ మధ్యలో దిండివనం తైలాపురానికి వచ్చి రాందాసును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసినట్టు అన్నారు. -
పళణి పర్యటన షెడ్యూల్ విడుదల
● 7 నుంచి రాష్ట్ర పర్యటనసాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామి రాష్ట్ర పర్యటన రూట్ మ్యాప్ వెలువడింది. జూలై 7వ తేదీ నుంచి విస్తృతంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటించనున్నారు. 2026లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పళణిస్వామి పదును పెట్టిన విషయం తెలిసిందే. ప్రజల్లో మమేకం అయ్యే విధంగా రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. జూలై 7న కోయంబత్తూరులోని మేట్టుపాళయం సమీపంలోని గౌండంపాళయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన పర్యటనకు శ్రీకారంచుట్టనున్నారు. ముందుగా కోయంబత్తూరు, ఆ తర్వాత విల్లుపురం, కళ్లకురిచ్చి, తంజావూరు, నాగపట్నం, తిరువారూర్ జిల్లాల మీదుగా సాగే విధంగా రూట్ మ్యాప్ను రూపకల్పన చేసుకుని ఉండడం శుక్రవారం అన్నాడీఎంకే కార్యాలయం ప్రకటించింది. తొలి విడత పర్యటన జూలై 20వ తేదీ వరకు జరగనుంది. కాగా, అన్నాడీఎంకే చిహ్నం ఇతర వ్యవహారాలపై ఎన్నికల కమిషన్ కోర్టులో ఉన్న బంతి విషయంగా ఎలాంటి నిర్ణయం ఇంతవరకు వెలువడలేదు. దీంతో పళణిస్వామి హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణ సమయంలో అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలపై తుది ఉత్తర్వులు ఎప్పుడు వెలువడతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. -
బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్
● ఉత్తమ రచనలకు గుర్తింపు ● సాహితీ అవార్డు గ్రహీలకు ప్రభుత్వ గృహాలు ● సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె: బహుముఖ ప్రజ్ఞాశాలి, దివంగత నేత కలైంజ్ఞర్ అని సీఎం ఎంకే స్టాలిన్ కొనియాడారు. ఉత్తమ రచనలు, రచయితలకు ద్రావిడ మోడల్ ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా, వారికి సరైన గుర్తింపు ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సాహితీ అవార్డు గ్రహీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గృహాలను కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు.కాంచీపురం ఏకాంబరనాథర్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చూలైమేడులోని అంజుగం ప్రాథమిక పాఠశాలలో రూ. 13.94 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు పాఠశాల భవనాలను సీఎం స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. ఆ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసామగ్రి, సైకిళ్లను అందజేశారు. కీల్పాకంలో జరిగిన ఈ కార్యక్రమంలో హిందూ మత దేవాదాయ శాఖ పరిధిలోని విద్యా సంస్థల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. అలాగే, విద్యార్థుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం స్టాలిన్ తిలకించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో హిందూ మత, దేవాదాయ శాఖ మంత్రి పి.కే. శేఖర్బాబు, ధర్మపుర ఆధీనం మాసిలామణి దేశిక జ్ఞానసంపద పరమాచార్యస్వామి, కుండ్రకుడి ఆధీనం పొన్నంబల దేశిక ఆడిగలార్, మయిలం బొమ్మపుర ఆధీనం శివజ్ఞానపాలయ స్వామిగల్, శ్రీపెరంబుదూర్ మఠం అప్పన్ ఉలగరియ రామానుజ ఎంబార్ జీయర్ స్వామిగల్, గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ మేయర్ ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్కుమార్, ఎమ్మెల్యేలు ఎంకే. మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలైవానర్ అరంగంలో శతాబ్ది ఉత్సవ సదస్సు సాహితి అకాడమీ, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, తమిళ శాఖ సంయుక్తంగా కలైంజ్ఞర్ శతాబ్ది ఉత్సవం జరిగింది. ముత్తమిళరిగ్నర్ కలైంజ్ఞర్ శతాబ్ది ఉత్సవం పేరిట జరిగిన సదస్సుకు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. సదస్సును ప్రారంభించడంతో పాటు ఒక ప్రత్యేక సంచికను విడుదల చేశారు. అలాగే సాహితీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వ గృహాలను కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ప్రసంగిస్తూ వివిధ అంశాల ఆధారంగా జరిగిన ఈ సదస్సుకు పెట్టిన పేరులో కలైంజ్ఞర్కు సాటి మరొకరు లేరని వ్యాఖ్యానించారు నాయకుడిగా, కళాకారుడిగా, అపార ప్రతిభావంతుడి బహుముఖ ప్రజ్ఞాశాలి కలైంజ్ఞర్ కరుణానిఽధి అని కొనియాడారు. రంగ స్థల ప్రసంగాలు, సాహిత్యానికి మరో ముఖంగా కలైంజ్ఞర్ ఉన్నారని, శాసన సభలో ఆయన ప్రసంగం సభా గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన జీవితంలో 80 సంవత్సరాలు ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప నాయకుడని, ఆయన చేసిన పోరాటాలు, సాధించిన విజయాలు భారతీయ సమాజాన్ని ప్రేరేపించాయని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆదర్శంగా సాహిత్య అకాడమీ గొప్పగా పనిచేస్తున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో ఈ వేదిక ఆధారంగా రచయితలు, అనువాదకులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాహిత్య అకాడమీ లక్ష్యంగా పయనం సాగుతున్నట్టు తెలిపారు. తమిళ సాహిత్యం ప్రత్యేక రంగంగా తీర్చిదిద్దేలా రూ. 5.30 కోట్లు కేటాయించామని గుర్తు చేస్తూ, ఈ సమయంలో తాను ఒక సందేశాన్ని ప్రస్తావించాలనుకుంటున్నానన్నారు. సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ముగ్గురు తమిళ పండితులకు కలైంజ్ఞర్ కలల ప్రాజెక్టు గా హోమ్ అనే పథకం అమల్లోకి తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాజెక్టులో తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు 15 మంది పండితులకు స్కాలర్షిప్లను అందించిందని, ఇక, డ్రీమ్ హోమ్ ప్రాజెక్ట్ ఖర్చులు తమిళనాడు ప్రభుత్వం భరిస్తుందన్నారు. సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీతలకు సైతం ఇక గృహాలను అందజేయనున్నామని ప్రకటించారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమల్లో లేదని, ఇదికొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ఎన్డీఏ కూటమిదే అధికారం!
● అధికారంలో బీజేపీకి వాటానా? ● సీఎం ఎవరో తేల్చని అమిత్ షా ● అన్నాడీఎంకేలో గందరగోళం ● పళణి నేతృత్వంలోనే అధికారం అన్న రెండాకుల సేనలు సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఓ తమిళ మీడియాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళనాట ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని, కూటమి పాలన తథ్యమని అమిత్షా సంకేతాన్ని ఇచ్చారు. అయితే, సీఎం ఎవరో అన్న ప్రశ్నకు ట్విస్టు పెట్టే రీతిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పేరును ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇటీవల చైన్నెకి వచ్చిన అమిత్షా సమక్షంలో జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే మళ్లీ చేరిన విషయం తెలిసిందే. అదేసమయంలో తమిళనాట మాత్రం అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అని ప్రకటించారు. అన్నాడీఎంకే నీడలోనే ఎన్నికలు అని స్పష్టం చేశారు. అయితే, ఇటీవల కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, బీజేపీ నేతల వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. పళణిస్వామి నేతృత్వంలోనే తమిళనాట కూటమి అన్న పరిణామాలు సాగుతున్న సమయంలో అధికారంలో వాటా అనే నినాదాన్ని అందుకునే విధంగా బీజేపీ నేతలు ముందడుగు వేయడం చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితుల్లో తాజా తమిళనాట ఎన్డీఏ కూటమిదే అధికారం అని స్పష్టం చేసిన అమిత్షా సీఎం అభ్యర్థి విషయంలో ట్విస్టు పెట్టడం అన్నాడీఎంకేలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించినట్లైంది. అమిత్షా వ్యాఖ్యలపై చర్చ ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు అమిత్షా స్పందించారు. తమిళనాడులో కూటమి పాలనే అని ఓ ప్రశ్నకు స్పష్టం చేస్తూ, ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో వివాదాల గురించి స్పందిస్తూ, విడిపోయిన వారిని ఒక చోట చేర్చడం తమ పని కాదని, ఎవరి పని వాళ్లు చేసుకోవాల్సిందేనని, అది వారి పార్టీకి సంబంధించిన వ్యవహారం అంటూ, ఇందులో తలదూర్చమన్నారు. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి బలంగా ఉందని, అధికారంలో బీజేపీ భాగస్వామ్యం తప్పనిసరిగా ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రశ్నకు ట్విస్ట్ ఇచ్చారు. తమిళనాట ఎన్డీఏ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చినా, సీఎం అభ్యర్థి అన్నాడీఎంకేకు చెందిన ఒకరు ఉంటారన్న వ్యాఖ్యతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి మద్దతు దారుల గుండెల్లో బాంబును పేల్చారు. పళణిస్వామి పేరును సీఎం అభ్యర్థిగా అమిత్షా పరిగణించనట్టుగానే ఈ ట్విస్టును భావించాలన్న కొత్త చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఇటీవల కాలంగా బీజేపీ పెద్దలతో అన్నాడీఎంకేకు చెందిన ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్ సన్నిహితంగా ఉంటూ రావడంతో ఆ ఇద్దర్ని అమిత్షా దృష్టిలో పెట్టుకున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇక, విజయ్ ఎన్డీఏలోకి వస్తారా అనే ప్రశ్నకు ఎన్నికలకు ఇంకా సమయం ఉందని వేచి చూడండి అని సమాధానం ఇచ్చారు. న్యూస్రీల్పళణిస్వామి సీఎం అభ్యర్థి అమిత్షా వ్యాఖ్యలపై పలువురు అన్నాడీఎంకే నేతలు స్పందిస్తూ పరోక్షంగా ఖండించారు. మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ స్పందిస్తూ తమిళనాడులో అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. సీఎం అభ్యర్థి పళణిస్వామి మాత్రమే అని స్పష్టం చేశారు. మరో మాజీ మంత్రి వైగై సెల్వన్ స్పందిస్తూ తమిళనాట కూటమి పాలనకు ఆస్కారం లేదన్నారు. ఇందుకు తమిళనాడు ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. కూటమి పాలన అన్నది చరిత్రలో ఇక్కడ జరగలేదని, ఇక మీదట కూడా జరగబోదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కూటమి లక్ష్యం డీఎంకేను గద్దె దించడమే అని పేర్కొంటూ, కూటమి పాలనను అంగీకరించం అని తేల్చి చెప్పారు. ఇక, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ను ప్రశ్నించగా, కూటమి, అధికారం అన్న విషయాల గురించి తమ నేత అమిత్షా, పళణిస్వామి చర్చించి నిర్ణయం తీసుకుంటారని దాట వేశారు. -
మొహర్రం సమ్మేళనానికి శ్రీకారం
సాక్షి, చైన్నె : మొహర్రం నెల ప్రారంభంతో మొహర్రం ఆథ్యాత్మిక సమ్మేళనానికి చైన్నె వేదికగా శుక్రవారం శ్రీకారం చుట్టారు. దావూదీ బోహ్రా ముస్లిం సమాజానికి 53వ నాయకుడైన సయ్యద్నా ముఫద్దాల్ సైపుద్దీన్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆషారా ముబారకా పేరిట జూలై 5వ తేదీ వరకు జరిగే ఈ సమ్మేళనానికి ఆయన నాయకత్వం వహించనున్నారు. సయ్యద్నా సైఫుద్దీన్ వార్షిక మొహర్రం సమ్మేళనంలో ప్రవక్త మహ్మద్ మనవుడైన ఇమామ్ హుస్సేన్ త్యాగాలను, కర్బలాలో ఆయన బలిదానం వంటి అంశాల గురించి ప్రసంగిస్తున్నారు. చైన్నెలోని ఎస్ఎంబీ వీధిలోని సైఫీ మసీదు, వింగ్స్ కన్వెన్షన్ సెంటర్, వైఎంసీఏ, బిన్నీ గ్రౌండ్తో సహా నగరంలో తొమ్మిదిచోట్ల ఆయన ప్రసంగాలను ప్రత్యేకప్రసారం ద్వారా తొలి రోజున దావూదీ బోహ్రా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సుమారు 43 వేల మంది వీక్షించినట్టు నిర్వాహకులు ప్రకటించారు. చైన్నెలో జరిగే ప్రసంగాలను కోయబత్తూరు, ఈరోడ్, సేలంలతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్లోని ఆ సామాజిక వర్గం వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చైన్నెలోని ఆ కమ్యూనిటీ ఔట్రీచ్ కో ఆర్డినేటర్ అలియాస్తర్ షకీర్ తెలిపారు. దక్షిణ భారత దేశ సాంస్కృతిక రాజధానిగా పిలవబడే చైన్నెలో సమ్మిళితత్వం, వైవిధ్యం, సామరస్యాన్ని ప్రోత్సహించడానికి సైఫుద్దీన్ పర్యటన మరింత దోహదకరంగా మారినట్టు వ్యాఖ్యానించారు. -
7నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
● ర్యాంకుల జాబితా విడుదల ● జనరల్ కౌన్సెలింగ్ 14 నుంచి సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ కోటా సీట్ల భర్తీ నిమిత్తం కౌన్సెలింగ్ తేదీ ఖరారు చేశారు. జూలై 7 నుంచి రిజర్వుడ్, 14 నుంచి జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు కటాఫ్ మార్కులు 200లకుగాను 200 సాధించిన టాపర్లు, కౌన్సెలింగ్కు అర్హత సాధించిన ఇతర ర్యాంకర్ల జాబితాను ఉన్నత విద్యా మంత్రి కోవిచెలియన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో అన్నావర్సిటీ, సాంకేతిక విద్యా డైరెక్టరేట్ పరిఽధిలో ఉన్న 430 మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో కౌన్సెలింగ్ నిమిత్తం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ముగిసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల ఆధారంగా ర్యాండం నంబర్లను ప్రకటించారు. ప్లస్టూ మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి ర్యాంకుల జాబితాను సిద్ధం చేశారు. ఉదయం అన్నావర్సిటీ ఆవరణలోని సాంకేతిక విద్యా డైరెక్టరేట్లో ఉన్నత విద్యాశాఖా మంత్రి కోవిచెలియన్ జాబితాను విడుదల చేశారు. సీట్ల కోసం 3 లక్షల 2374 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో 2 లక్షల 50 వేల 298 మంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్టు మంత్రి ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ సారి 40,645 మంది అదనంగా నమోదు చేసుకున్నారని తెలిపారు. జూలై 7 నుంచి కౌన్సిలింగ్.. 200లకుగాను 200 కటాఫ్ మార్కులను స్టేట్ బోర్డు సిలబస్లో చదువుకున్న 144 మంది, ఇతర బోర్డుల ద్వారా చదువుకున్న ఐదుగురు ఉన్నారని ప్రకటించారు. వెబ్సైట్లో ర్యాంకుల జాబితా ఉన్నట్టు, ఏదేని లోపాలు ఉన్నా, ఎవరి పేర్లు అయినా లేకున్నా వెంటనే సమీపంలోని అడ్మిషన్ సెంటర్లను సంప్రదించి జూలై 2లోపు ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు అర్హత సాధించిన వారిలో 2 లక్షల 41 వేల 641 మంది ఉన్నారని, వీరిలో రిజర్వుడ్ కోటా సీట్లకు (క్రీడ, దివ్యాంగులు, మాజీ సైనికులు) జూలై 7 నుంచి 11వ తేదీ వరకు కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. జనరల్ కోటా జూలై 14 నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు నిర్వహించనున్నామన్నారు. అనుబంధ కౌన్సెలింగ్ ఆగస్టు 21 నుంచి 23 వరకు జరుగుతుందన్నారు. టాపర్లు.. స్టేట్ బోర్డు సిలబస్ ఆధారంగా మంత్రి ప్రకటించిన జనరల్ కేటగిరి ర్యాంకుల జాబితాలో తొలి స్థానాన్ని కాంచీపురానికి చెందిన సహస్త్ర అనే విద్యార్థిని దక్కించుకుంది. రెండవ స్థానంలో నామ్కల్కు చెందిన కార్తిక, మూడో స్థానం అరియలూరుకు చెందిన అమలన్ ఆంటో దక్కించుకున్నారు. ఇక 7.5 శాతం ప్రభుత్వ ప్రత్యేక కోటా మేరకు తొలి స్థానాన్ని కడలూరుకు చెందిన ధరణి, రెండో స్థానాన్ని చైన్నెకు చెందిన మైథిలి, మూడో స్థానాన్ని కడలూరుకు చెందిన మురళిధరన్ ఉన్నారు. జనరల్ కేటగిరి ర్యాంకుల జాబితాలో టాప్ 10లో ఏడుగురు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది కౌన్సెలింగ్కు ప్రభుత్వ పాఠశాలల నుంచి 47,372 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, విద్యార్థులు ఏదేని సందేహాలను నివృతి చేసుకోదలచిన పక్షంలో 18004250110 టోల్ఫ్రీ నంబరును సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.70 వేలు దాటిన వైద్య దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వ వైద్యకళాశాలలు, ప్రైవేటు కళాశాలలోని ప్రభుత్వ కోటా పరిధిలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల సీట్ల భర్తీకి నీట్ మార్కుల ఆధారంగా దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదివేల లోపు సీట్లు ఉండగా, ఇప్పటి వరకు 70 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆదివారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత నీట్ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితాను ప్రకటించే విధంగా వైద్య విద్యా డైరెక్టరేట్ అడ్మిషన్స్ విభాగం కార్యదర్శి థేరనిరాజన్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. కొన్ని కోర్సులు మిగిలి ఉండడంతో వాటిని భర్తీ చేయడానికి రెండో విడత కౌన్సెలింగ్కు చర్యలు చేపట్టారు. -
14 నుంచి నిరవధిక సమ్మె
తిరువళ్లూరు: రేషన్ దుకాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జూలై 14వ తేదీ నుంచి నిరవదిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్ర ప్రాథమిక సహాకార సంఘం ఆధ్వర్యంలో రేషన్ దుకాణాలు నడుస్తున్నాయి. ఈ దుకాణాల ద్వారా నిరుపేదలకు బియ్యం, పప్పులు, నూనె తదితర వస్తువులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల నిత్యావసర వస్తువులను అందించే సమయంలో కొత్త నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ఉత్తర్వులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోపిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తొలిదశ ఆందోళనలో భాగంగా తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు మురుగేషన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి త్యాగరాజన్ హాజరై, ప్రసంగించారు. మాట్లాడుతూ నిత్యావసర వస్తువులను అందించే సమయంలో బ్లూటూత్ను త్రాసుకు అనుసంధానం చేయాలన్న విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. గోడౌన్ నుంచి సరుకులు బయటకు వచ్చే సమయంలో తూకం సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెలవు దినాల్లో ఉద్యోగులకు ఇస్తున్న వేర్వేరు పనులను రద్దు చేయాలని కోరారు. సేల్స్మెన్ విద్యార్హత ఆధారంగా ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. సేల్స్మెన్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయవద్దని కోరారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో జూలై 14వ తేదీ నుంచి విధులను బహిష్కరించి సామూహిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నేతలు మారీ, నూర్మహ్మాద్, జయచంద్రన్, మేగనాథన్, పొన్నన్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నం
వేలూరు: స్థానిక కలెక్టరేట్ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కల్లూరు ఎంజీఆర్ నగర్కు చెందిన సత్యకుమార్ తన తల్లి చంద్ర, భార్య సంగీత, చెల్లెలు, ఆమె కుమార్తెతోపాటు శుక్రవారం ఉదయం వేలూరు కలెక్టరేట్కు వచ్చారు. ఆ సమయంలో వారు తీసుకొచ్చిన పెట్రోల్ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారిపై నీటిని పోశారు. ఆ సమయంలో సత్యకుమార్ తల్లి చంద్ర ఉన్నఫళవగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సత్యకుమార్ను విచారించగా తమ గ్రామానికి చెందిన చంద్రు అనే వ్యక్తి గత వారం తాను నిలిచి ఉన్న ప్రాంతానికి బైకులో వచ్చి తనపై దాడి చేసి గాయ పరిచాడని, ఈ విషయమై తాను గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశారన్నారు. దీంతో తాను వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా గుడియాత్తం పోలీసులు తమను కాదని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తావా? అని వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతోనే తాము కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. -
ఎలక్ట్రిఫైయింగ్ తమిళనాడు ప్రచారానికి శ్రీకారం
కొరుక్కుపేట: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ–డాడీ సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిఫైయింగ్ తమిళనాడు(విద్యుదీకరణ తమిళనాడు) ప్రచారాన్ని ప్రారంభించినట్టు ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు యాస్మీన్ జవహర్ అలీ తెలిపారు. చైన్నెలోని ట్రేడ్ సెంటర్లో శుక్రవారం నుంచి ఈవీ ఇండియా ఎక్స్పో 2025 ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో ఎలక్ట్రిక్ మెబిలిటీలో పేరుగాంచిన ఈ–డాడీ సంస్థ భారతదేశంలో మొట్టమొదటి ఐఆర్ఏఐ ఆమోదించిన మల్టీ వెహికల్ ఈవీ రెట్రోఫిట్ కిట్ను ఆవిష్కరించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం విద్యుదీకరణ తమిళనాడు పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీనిని స్టార్టప్ టీఎన్ సీఈఓ, మిషన్ డైరెక్టర్ శివరాజారామయ్య, ఇప్పో పే వ్యవస్థాపకులు మోహన్ కె ప్రారంభించారు. ఈ సందర్భంగా యాస్మీన్ జవహర్ అలీ మట్లాడుతూ ఇంధన వాహనాలతో కాలుష్యం పెరిగిపోవడంతోపాటు ఖర్చులు ఎక్కువైపోతున్నాయన్నారు. ఇంధనంతో నడిపే వాహనాలను ఈవీ వెహికల్గా మార్చడమే లక్ష్యంపై తాము దృష్టి పెట్టామని చెప్పారు. 2026 నాటికి తమిళనాడులోని టైర్ 2, టైర్ 3, గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల వాహనాలను రెట్రోఫిట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ–డాడీ ప్రారంభించిన రెట్రోఫిట్ కిట్ ఇప్పటికే ఉన్న ఇంధనంతో నడిచే ఆటో రిక్షాలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి అనుమతి ఇచ్చిందని, ఈ కిట్ అమర్చడంతో సాధారణంగా ఇంధన ఖర్చుల కంటే దాదాపు 75 శాతం తక్కువ అవుతుందని ఆమె వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ఈ–డాడీ ఇంజినీరింగ్ చేసిన 2026లో ఉత్పత్తిని విడుదల చేయడానికి షెడ్యుల్ చేసిన పూర్తి ఎలక్ట్రిక్ త్రీ –వీలర్ అయిన ఎక్స్3 ఆటోను ప్రదర్శనలో ఉంచిందన్నారు. తేలికై న డిజైన్, ఎర్గోనామిక్ సౌకర్యం, స్మార్ట్ కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. -
బయోమెట్రిక్తో నిత్యావసర సరుకులు వద్దు
వేలూరు: రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్తో నిత్యావసర వస్తువుల సరఫరా చేయడాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రాథమిక సహకార కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఆ సంఘం జిల్లా పోరాట కమిటీ అధ్యక్షుడు విజయకుమార్, కోశాధికారి అనందన్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ధర్మలింగం మాట్లాడుతూ నిత్యావసర దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్తో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే పద్ధతిని ప్రవేశ పెట్టిందన్నారు. దీనివల్ల కార్మికులు రేషన్ కార్డుదారులకు సక్రమంగా వస్తువులను సరఫరా చేయలేక పోతున్నామన్నారు. రేషన్ దుకాణాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. రేషన్ దుకాణాలకు సక్రమంగా నిత్యావసర వస్తువులను గోడౌన్ నుంచి తీసుకు రావాలని, తరచూ అధికారులు తనఖీల పేరుతో కార్మికులను వేధించడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, వినోద్కుమార్, రవి, కార్మికులు పాల్గొన్నారు. -
మామిడి రైతులను ఆదుకోవాలి
వేలూరు: ఉమ్మడి వేలూరు జిల్లాలోని మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు నాయకులు కోరారు. వేలూరు కలెక్టరేట్లో కలెక్టర్ సు బ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నేతలతో సమీక్ష నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందన్నారు. వర్షం వస్తే నదిలో నీరు పారడంతో పాటు కుంటలు, చెరువులకు నీరు చేరుతుందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచిపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటితో నదీ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. వేలూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికంగా రైతులు మామిడి పంటను పండించారన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు పల్ప్ కోసం మామిడి తీసుకెళ్లి విక్రయించే వారమని, ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దులోనే మామి డిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అలాగే వరి క్వింటాల్కు రూ.3,500 ఇప్పించాలని కోరారు. రైతులు పండించిన పంటలను వ్యవసాయ గిడ్డంగిలో నిల్వ చేసుకునేలా అవకాశం కల్పించాలని అన్నారు. దీంతో కలెక్టర్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. రైతులు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం గతవారంలో సీఎం స్టాలిన్కు వినతి పత్రం అందజేసిన ఒక మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. -
వేల్ ిఫిలింస్ ఇంటర్నేషనల్
నుంచి 10 చిత్రాలు తమిళసినిమా: ప్రముఖ విద్యాసంస్థల అధినేత, సినీ నిర్మాత ఐసరి గణేశ్ వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 2016లో ప్రభుదేవా హీరోగా దేవి అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. అలా ఇప్పటివరకు 25 చిత్రాలను నిర్మించారు. ఇటీవల శివ హీరోగా సుమో అనే వినోదభరిత కథా చిత్రాన్ని నిర్మించారు. కాగా ఐసరి గణేశ్ ఇకపై వరుసగా చిత్రాలను నిర్మించనున్నారు. ఈయన 2025 నుంచి 2027 లోగా 10 చిత్రాలను నిర్మించనున్నట్లు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ చిత్రాలను ఎవరు దర్శకత్వం వహించనున్నారన్నది తెలిపారు. అలా డాడా చిత్రం ఫేమ్ గణేశ్ కే.బాబు, కట్టా కుస్తీ చిత్రం ఫేమ్ సెల్ల అయ్యావు, పోర్ తోళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా, కనా చిత్రం ఫేమ్ అరుణ్రాజా కామరాజ్, 2018 అనే మలయాళ చిత్రం ఫేమ్ జూడ్ ఆంటని జోషఫ్, 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్, మారిసెల్వరాజ్, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, సుందర్.సీ తదితర దర్శకులతో చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో సుందర్.సీ దర్శకత్వంలో నయనతార కథానాయకిగా రూపొందిస్తున్న మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రం షూటింగ్ దశలో ఉందన్నది గమనార్హం. -
అగ్రీ గ్రీవెన్స్ను బహిష్కరించిన రైతులు
తిరువళ్లూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి ని ర్మాణానికి 2009–2010వ సంవత్సరంలో భూము లిచ్చిన రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడంలే దని ఆరోపిస్తూ శుక్రవారం అగ్రి గ్రీవెన్స్డేను రై తులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం అగ్రీ గ్రీవెన్స్డే నిర్వహించా రు. గ్రీవెన్స్డేకు రైతులు, అధికారులు హాజరయ్యారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్కు ఏకరవు పెట్టారు. 200 మందికి పైగా రైతులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతి–చైన్నె జాతీయ రహ దారి నిర్మాణం కోసం 2 వేల మంది రైతులు భూము లు ఇచ్చారన్నారు. అయితే భూములిచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదని వ్యవసాయ సంఘం నేత సంపత్ ఆరోపించారు. తమకు న్యాయమైన పరిహారా న్ని అందించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరా రు. దీంతో కలెక్టర్ జోక్యం చేసుకుని పరిహారం కోసం వినతి పత్రం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. దీంతో రైతులు కలెక్టర్ తీరును తప్పుపట్టారు. ఇప్పటికే పలుమార్లు వినతి పత్రం ఇచ్చామని, అయినా కొత్తగా వి నతిపత్రం ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. కలెక్టర్ తీరుకు నిరసగా, రైతులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు తమ పో రాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం రైతుల నుంచి వినతి పత్రాలను కలెక్టర్ స్వీకరించారు. -
ఈ దీపావళి మనదే!
తమిళసినిమా: ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ కథానాయకుడిగా అవతారమెత్తి లెజెండ్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈయనే నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, శరవణన్కు కథానాయకుడిగా, నిర్మాతగా మంచి అనుభవాన్నిచ్చిందనే చెప్పారు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలు కామెంట్స్ను కూడా ఎదుర్కొన్నారు. అయితే వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకోకుండా, చాలెంజ్గా తీసుకున్నారు. అలా ఆయన రెండో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎదుర్ నీచ్చల్, గరుడన్ చిత్రాల ఫేమ్ దురై సెంథిల్కుమార్ కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి పాయల్ రాజ్పుత్ నాయకిగా నటిస్తున్నారు. శ్యామ్, నటి ఆండ్రియా, బాహుబలి ప్రభాకర్, సంతోష్ ప్రతాప్, బేజీ ఇయల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వెంకటేశ్ చాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం గురించి శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, నిర్మాత శరవణన్ మాట్లాడుతూ చిత్రం చాలా కొత్తగా , పక్కా మాస్గా ఉంటుందన్నారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ అన్ని వర్గాలను అలరించేలా కమర్శియల్ అంశాలతో కూడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని, మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని , చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ దీపావళి మనదీ, అందరిదీ అని శరవణన్ పేర్కొన్నారు. శరవణన్ -
క్లుప్తంగా
6 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం అన్నానగర్: ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలించడానికి నిల్వ చేసిన 6 టన్నుల రేషన్ బి య్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైన్నెలోని పెరంబూరు, జమాలయ, బిన్నీ మిల్లు సమీపంలో పౌర సరఫరాల నేర దర్యాప్తు విభాగం పోలీసులు శనివారం ఉదయం సోదా లు చేశారు. అక్కడి ఒక గోడౌన్లో నిల్వ చేసిన 6,100 కిలోల రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన అసన్మధర్ (35)తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 34 వేలు, 2 కార్గో వ్యా న్లు, 3 బైకును స్వాధీనం చేసుకున్నారు. తక్కు వ ధరకు ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కానిస్టేబుల్ కిడ్నాప్నకు యత్నం తిరువళ్లూరు: హత్య కేసులో ఐదేళ్లుగా అజ్ఞాతంలో వున్న ప్రముఖ రౌడీషీటర్ను అరెస్టు చేయడానికి యత్నించిన కానిస్టేబుల్ను కారులో లాక్కెళ్లి తోసేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. చైన్నెలో గత 25 సంవత్సరాల క్రితం అన్నాడీఎంకే నేత శేఖర్ను రౌ డీ షీటర్ శివకుమార్ హత్య చేశాడు. తండ్రి హ త్యకు ప్రతీకారం తీర్చుకోవాలని శేఖర్ కుమారుడు అళగురాజ ఐదేళ్ల క్రితం శివకుమార్ను హత్య చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్ప టి నుంచి అళగురాజను చైన్నె పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అళగురాజ తిరువళ్లూ రు సమీపంలోని తిరుప్పాచ్చూర్లో ఉన్నట్టు స్పెషల్టీమ్ గుర్తించి అతడ్ని పట్టుకోవడానికి యత్నించారు. కారులో తప్పించుకోవడానికి యత్నించిన అళగురాజను పట్టుకోవడానికి కా నిస్టేబుల్ యత్నించగా అతడ్ని కారులోకి లా క్కుని కిలోమీటర్ వరకు తీసుకెళ్లి రోడ్డులో ప డేసి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పరంగిమలై రైల్వే సబ్వే పునఃప్రారంభం తిరువొత్తియూరు: ప్రయాణికుల సౌకర్యార్థం మూసి వేసి ఉన్న పరంగిమలై రైల్వే సబ్వేను పునఃప్రారంభించారు. సెయింట్ థామస్ మౌంట్ రైల్వేస్టేషన్లో సబ్వే చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో ఉంది. ప్రస్తుతం, రైల్వేస్టేషన్ను పునరుద్ధరిస్తున్నారు. అలాగే కొత్త రైల్వే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో రైల్వేస్టేషన్ నిర్వాహకులు సబ్వేను శాశ్వతంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఆదంబాక్కం నుంచి రైల్వేస్టేషన్లోకి వెళ్లే ప్రయాణికులు రైల్వేస్టేషన్కు రావడానికి చాలా దూరం చుట్టుకుని రావాల్సి వచ్చేది. వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మలైమలర్ నారదర్ (నగర్ వలం) ప్రాంతంలో ఒక వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఇటీవల సెయింట్ థామస్ మౌంట్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రజలు కూడా కేంద్ర మంత్రి మురుగన్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లారు. దీంతో రైల్వే యంత్రాంగం సబ్వేను తిరిగి ప్రారంభించారు. నాటుబాంబు కేసులో నలుగురి అరెస్టు తిరువళ్లూరు: నాటుబాంబులతో దాడి చేసిన కే సులో బాలుడు సహా నలుగురిని పోలీసులు అ రెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గాంధీనగర్కు చెందిన ముఖేష్, దీపన్, జావీధ్తోపాటు ముగ్గురు మాట్లాడుతుండగా వారిపై నాటుబాంబులతో దాడి జరిగింది. దాడిలో ము ఖేష్ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గా యపడ్డారు. పోలీసుల విచారణలో ముఖేష్ త మ్ముడు జీవానందం, చిన్నమండలి గ్రామాని కి చెందిన ఆకాష్ స్నేహితులు. వీరిద్దరు గంజాయి విక్రయిస్తున్నారని ముఖేష్ తన సోదరుడిని మందలించి కట్టడి చేశాడు. దీంతో కక్షతో ముఖేష్ను నాటుబాంబులతో దాడి చేసి హత్య చేశారని పో లీసులు నిర్ధారించారు. ఆకాష్(14), రియాజ్ (19), సంజయ్(22)తోపాటు 15 సంవత్సరాల బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎమ్మెల్యే జగన్మూర్తికి బెయిల్ నిరాకరణ సాక్షి, చైన్నె: తిరువేలంగాడులో బాలుడి కిడ్నాప్ కేసులో పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్మూర్తి బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన్ను అరెస్టు చేయవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. గతవారం రోజులు గా ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును జగన్మూర్తి ఆశ్రయించారు. శుక్రవారం విచారణ సమయంలో ఈ కేసులో జగన్మూర్తి కీలకభూమిక పోషించిన్నట్టు, పోలీసుల విచారణకు సహకరించడం లేదని ప్రభు త్వ తరఫు న్యాయవాదులు వాదించారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిన పక్షంలో కేసులో సా క్షులను బెదిరించేందుకు అవకాశాలు ఉన్నాయ ని పేర్కొన్నారు. వాదన అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేసులో జగన్మూర్తిని పోలీసులు అరె స్టు చేయవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. -
డీఎంకే ప్రభుత్వానికి స్వస్తి పలకాలి
వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా స్టిక్కర్ రాజకీయాలు చేస్తున్న డీఎంకే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు స్వస్తి పలకాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అశ్వథామన్ అన్నారు. శుక్రవారం ఉదయం వేలూరులోని ప్రైవేటు హోటల్లో ఆ పార్టీ జిల్లా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేలూరులోని పెట్ల్యాండ్ ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఇచ్చిందన్నారు. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆస్పత్రిని నిర్మించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చంకలు గుద్దుకోవడం సరికాదన్నారు. ఆస్పత్రిని ప్రారంభించినప్పటికీ అందులో రోగులకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదన్నారు. వీటిపై ఎడపాడి పళణిస్వామి చెప్పడంతో ఇందుకు బాధ్యత గల ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ నేరుగా ఆస్పత్రిని చూసి మాట్లాడాలని విలేకరులతో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం పర్యటన రోజున కాట్పాడి నుంచి వేలూరు వరకు పార్టీ జెండాలను కట్టి ట్రాఫిక్ను స్తంభింప జేసి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అయితే బీజేపీ జెండాలు కట్టకూడదని తమ పార్టీ జిల్లా అధ్యక్షులపై పోలీసులు కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ నిధుల్లో కుంభకోణం జరిగిందని నిధులను నిలిపి వేశారని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దశరథన్, కార్యదర్శి శరవణన్, ప్రతినిధులు కుమరన్, జగన్నాథన్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వీడియో: తమిళ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్ఐ పోరాటం
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హీరో సూర్య.. నటించిన సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ.. అదే రేంజ్లో ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన అళగురాజా.. మయిలై శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అళగురాజాపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా అళగురాజా.. తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడని సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో, అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.పోలీసుల రాకను పసిగట్టిన అళగురాజా, అతడి బ్యాచ్.. అక్కడి నుంచి పారిపోయింది. వీరంతా ఓ కారులో పారిపోతుండగా వారిని జామ్ బజార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద కుమార్, పలువురు పోలీసులు వెంటాడారు. ఎస్ఐ ఆనంద కుమార్.. వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్ఐ.. కారుకు డోర్కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లారు. కారుతో పాటు ఎస్ఐని అళగురాజా ఈడ్చుకెళ్లారు. అనంతరం, కారు లోపల ఉన్న నిందితులు ఎస్ఐను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. అయితే, ఎస్ఐ ఆనంద కుమార్.. హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ కారు నుంచి ఎస్ఐ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోసారి రౌడీ షీటర్ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు.திருவள்ளுர் அடுத்த திருப்பாச்சூர் பகுதியில் சென்னை ஸ்பெஷல் டீம் போலீசார் முக்கிய வழக்கு ஒன்றில் தொடர்புடைய குற்றவாளியை சினிமாவில் வரும்சண்டைக் காட்சிகளையும் மிஞ்சும் அளவிற்கு துரத்தி சென்றபோது கீழே விழும் காட்சி#Tiruvallur #Chanakyaa pic.twitter.com/x3m4Q7ceJp— சாணக்யா (@ChanakyaaTv) June 26, 2025 -
రైలు చార్జీలను పెంచవద్దు
సాక్షి, చైన్నె : రైలు చార్జీలను పెంచవద్దని కేంద్రానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. రైలు చార్జీలను జూలై ఒకటి నుంచి పెంచనన్నట్టు సమాచారాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ మేరకు తమిళనాడులో పలు మార్గాల్లో ఉదాహరణకు నెల్లై, తూత్తుకుడి, తెన్కాశి వైపుగా వెళ్లే రైళ్లలో రూ.15కు పైగా చార్జీలు పెరగవచ్చన్న సమాచారం వెలువడింది. అలాగే సేలం, కోయంబత్తూరు వైపుగా వెళ్లే రైళ్లలో రూ.20 వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఓ జాబితా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోందని, ఈ పరిస్తితులలో చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కేంద్రరైల్వే శాఖకు బుధవారం సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. రైలు చార్జీల పెంపునకు చర్యలు తీసుకోవడం సబబు కాదన్నారు. అస్సలే రైళ్లలో జనరల్ కోచ్లు, సాధారణ కోచ్ల సంఖ్య తగ్గించేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సమయంలో చార్జీల పెంపునకు కసరత్తులు చేయడాన్ని మరింతగా వ్యతిరేకిస్తున్నామని, తక్షణం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నివాళి భారత మాజీ ప్రధాని దివంగత వీపీ సింగ్ 95వ జయంతిని పురస్కరించుకుని బుధవారం రాజధాని కళాశాల ఆవరణలోని ఆయన విగ్రహం, చిత్ర పటానికి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి స్వామినాథన్, డిప్యూటీ మేయర్ మహేశ్కుమార్తో పాటు అధికారులు నివాళులర్పించారు. – సాక్షి, చైన్నె ఒప్పందం కాంచీపురం జిల్లా ఒరగడం పారిశ్రామిక వాడలోని డైమ్లర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్(డీఐసీవీ) భారత్ బెంచ్ మైనింగ్ ట్రక్కుల కోసం గైన్వెల్ ట్రక్కింగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ బెంజ్ మైనింగ్ ట్రక్కులను పంపిణీ చేయడం, అమ్మకాలు, సేవలపై దృష్టి సారించేలా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గెయిన్ వెల్ చైర్మన్ సునీల్ చతుర్వేది, డైమ్లర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజీవ్ చతుర్వేది తదితరులు హాజరయ్యారు. – సాక్షి, చైన్నె ఘనంగా వీరరాఘవ స్వామి తెప్పోత్సవం తిరువళ్లూరు: పట్టణంలో ప్రసిద్ధి చెందిన వీరరాఘవ స్వామి ఆలయంలో ఆణి అమావాస్యను పురస్కరించుకుని బుధవారం రాత్రి తెప్పోత్సతం వైభవంగా నిర్వహించారు. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన వైద్య వీర రాఘవస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి రాష్ట్రంతో పాటు ఆంధ్ర తెలంగాణ కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులు అమావాస్యకు వచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం, పుష్కరిలో పుణ్య స్థానాల ఆచరించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాగా ఏటా ఆణిమాసంలో మూడు రోజులపాటు తెపోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆణి అమావాస్య కావడంతో మొదటిరోజు పుష్కరిణిలో శ్రీదేవి భూదేవితో కలిసి వైద్య వీరరాఘవుడు భక్తులకు దర్శనం ఇచ్చారు. తెపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాగా భక్తులు చేసిన గోవింద నామస్మరణతో పుష్కరిణి ప్రాంగణం మారు మోగింది. ఇలా ఉండగా మూడు రోజులపాటు మూలవర్ ముత్తంగి సేవలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 100 అడుగులు వెనక్కి వచ్చిన సముద్రపు నీరు తిరువొత్తియూరు: అమావాస్య రోజైన బుధవారం తిరుచెందూరు వద్ద సముద్రం 100 అడుగుల మేరకు నీరు వెనక్కి తగ్గింది. భక్తులు, భీతి లేకుండా నిర్భయంగా పుణ్యస్నానాలు చేశారు. తిరుచెందూరులోని సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద సముద్రం అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో ఉప్పొంగుతోంది. ఆ క్రమంలో బుధవారం అమావాస్య కావడంతో, ప్రకృతి వైపరీత్యాల కారణంగా, తిరుచెందూరు వద్ద సముద్రం నీరు ఉదయం నుంచి సుమారు 100 అడుగుల మేరకు వెనక్కి వెళ్లింది. దీంతో అయ్యవైకుందర్ అవతారపతి సమీపంలోని బీచ్లో నాచుతో కూడిన రాళ్లు కనిపిస్తున్నాయి. భక్తులు రాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. -
పెట్ల్యాండ్ ప్రభుత్వాసుపత్రి ప్రారంభం
వేలూరు: వేలూరులో చారిత్రక నేపథ్యం కలిగిన (వంద సంవత్సరాలు) వేలూరు పెట్ల్యాండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రిని సీఎం స్టాలిన్ బుధవారం ప్రారంభించారు. పెడ్ల్యాండ్ ఆసుపత్రి వేలూరు పట్టణ నడి బొడ్డున పురాతన కట్టడాలతో ఉండడంతో డీఎంకే ప్రభుత్వంలో ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిగా మార్చేందుకు రూ: 197.81 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు పూర్తి కావడంతో సీఎం స్టాలిన్ ఆసుపత్రిని ప్రారంభించి ఆసుపత్రిలో రోగులకు ఏర్పాటు చేసిన వసతులను తనిఖీ చేశారు. వేలూరు జిల్లాలో రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలకు జిల్లాలోని అనకట్టు నియోజక వర్గంలో నూతనంగా నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సాయంత్రం తిరుపత్తూరు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆయనతో పాటూ మంత్రులు దురై మురుగన్, ఎం. సుబ్రమణియన్, ఆర్. గాంధీ, ఏవా వేలు, కలెక్టర్ సుబ్బలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు కదీర్ఆనంద్, ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, అములు, ఈశ్వరప్ప, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్కుమార్లతో పాటు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాట్పాడి నుంచి వేలూరు వరకు ఘన స్వాగతం ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన చైన్నె నుంచి రైలు మార్గంలో కాట్పాడి చేరుకున్నారు. కాట్పాడి రైల్యే స్టేషన్లో కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎస్ఫి మదివాణన్లతో పాటు పార్టీ కార్యకర్తలు , పాఠశాల విద్యార్థులు పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కారులో వేలూరుకు బయలుదేరిన ఆయనకు కాట్పాడి చిత్తూరు బస్టాండ్, సిల్క్మిల్ రోడ్డు, విరుదంబట్టు, కొత్త బస్టాండ్, గ్రీన్ సర్కిల్, సౌత్ పోలీస్ స్టేషన్ సమీపంలో డీఎంకే పార్టీ కార్యాలయం వద్ద ఆయా డివిజన్లకు చెందిన ప్రతినిధులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అదే విధంగా రోడ్డు పొడవునా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఆయనకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కొత్త బస్టాండ్ నుంచి కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో రోడ్డు పక్కన నిలిచి ఉండటాన్ని చూసిన ఆయన కారును దిగి నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ నడిచారు. పట్టణంలో అక్కడక్కడే కారు దిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. కాగా సీఎం పర్యటనలో స్థానిక విలేకరులను అనుమతించకపోవడం గమనార్హం. వేలూరులో సీఎం స్టాలిన్కు ఘన స్వాగతం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు -
● రాష్ట్రవ్యాప్త పర్యటనకుపళణి సన్నద్ధం ● జూలై 2వ వారం నుంచి ప్రజల్లోకి.. ● జిల్లాల కార్యదర్శులతో ముగిసిన భేటీ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేను మరింత బలోపేతం దిశగా ప్రత్యేక వ్యూహాలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి పదును పెట్టిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికలలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న కాంక్షతో ఉన్న ఆయన పార్టీ వర్గాలతో మమేకం అయ్యే విధంగా, ప్రజలకు మరింత చెరువయ్యే దిశగా మున్ముందు కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తరచూ పార్టీ నేతలతో చైన్నెలో సమావేశాలు నిర్వహిస్తూ, పలు సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా బీజేపీతో జత కట్టిన నేపథ్యంలో 2026లో అధికారం లక్ష్యంగా పార్టీ వర్గాలకు ఉరకలు తీయించే విధంగా వేగాన్ని పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం కొన్ని జిల్లాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. రెండవ రోజుగా బుధవారం తిరుచ్చి, మదురై, నాగపట్నం, తంజావూరు, కోయంబత్తూరు, సేలం, తిరుప్పూర్, నీలగిరి, తదితర జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు. పర్యటనకు రెడీ.. తొలిరోజు సమావేశంలో పలు సూచనలు, పార్టీ పరంగా కార్యక్రమాలను వేగవంతం చేసే విధంగా నేతలకు పళణిస్వామి ఆదేశాలు ఇచ్చారు. అలాగే బూత్ కమిటీల ఏర్పాటులో జాప్యం చేస్తున్న కొన్ని జిల్లాల కార్యదర్శులకు త్వరితగతిన పనులు ముగించే విధంగా హెచ్చరికలు చేశారు. రెండవ రోజు జరిగిన సమావేశంలో తన రాష్ట్ర పర్యటనకు సంబంధించిన సంకేతాన్ని నేతల్లోకి పళణి తీసుకెళ్లినట్టు రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగై వర్గాలు పేర్కొంటున్నాయి. జూలై 2వ వారం నుంచి తన రాష్ట్ర పర్యటన ఉంటుందని, ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైనట్టు సూచించారు. అంతలోపు నేతలందరూ నియోజకవర్గాలల్లోకి వెళ్లాలని, ప్రజల సమస్యలపై అధ్యయనం చేసుకోవాలని వివరించినట్టు ఓ నేత పేర్కొన్నారు. ప్రధానంగా తన పర్యటన నియోజకవర్గాల వారీగా సాగుతుందని, కేవలం సభలకే పరిమితం కాకుండా, మహిళా సంఘాలు, యువతతో చర్చలు, సమావేశాల దిశగా సైతం ఏర్పాట్లు చేయాలన్న సూచనను పళణి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. రాష్ట్ర పర్యటన విజయవంతం అయ్యే విధంగా ఏర్పాట్లు ఉండాలని, జనం స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్లాలని నేతలుకు పళణి స్వామి సూచించినా, తొలి పర్యటన అన్నది దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురై నుంచి సాగేనా లేదా కొంగు మండలంలో ప్రధాన నగరంగా ఉన్న కోయంబత్తూరు నుంచి మొదలెట్టేనా అన్నది తేలాల్సి ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో పది అసెంబ్లీ స్థానాలలో తొమ్మిదింటిని తమకు అందించిన కోయంబత్తూరు జిల్లా నుంచే తన పర్యటనకు పళణి నిర్ణయించినా, దక్షిణ తమిళనాడు మీద దృష్టి పెట్టే విధంగా మధురై ను సైతం వేదికగా ఎంపిక చేసుకుని ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూట్మ్యాప్ సిద్ధమైన నేపథ్యంలో సమగ్ర వివరాలను జూలై మొదటి వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నియోజకవర్గాల వారీగా.. ఒక్కో నియోజకవర్గంలో రెండో చోట్ల పది నుంచి పదిహేను నిమిషాలు ప్రసంగించే విధంగా, మరో పది నిమిషాలు ప్రజల సమస్యలు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు సమయం కేటాయిస్తూ రూట్ మ్యాప్ రూపకల్పన జరిగినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది మందిచొప్పునయువ నాయకులను ఎంపిక చేసి, వారి ద్వారా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి, స్థానికంగా ఉన్న సమస్యలన్నీ తన దృష్టికి చేరే విధంగా పళణి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే పళణి పర్యటన మొత్తం ప్రచార వాహనం ద్వారా సాగబోతున్నట్టు, సభలు, సమావేశాలు, వినూత్న తరహాలో ఉంటాయని ఆ పార్టీ నాయకులు పేర్కొంటుండడం గమనార్హం. -
‘గ్లోబల్ సిటీ’
● నాలుగు చోట్ల స్థలం పరిశీలన ● 2 వేల ఎకరాల ఎంపిక ● మరికొన్ని నగరాలలో కూడా సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెకు అనుబంధంగా శివారులను కలుపుతూ గ్లోబల్ సిటీ రూపకల్పనకు అధికారులు అడుగులు వేశారు. నాలుగు చోట్ల స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సిటీ 2 వేల ఎకరాలలోరూపుదిద్దుకోనుంది. వివరాలు.. రాజధాని నగరం చైన్నెను ‘మహా’నగరం గా తీర్చిదిద్దేందుకు మూడవ మాస్టర్ ప్లాన్ అమలు వేగం పెరిగిన విషయం తెలిసిందే. ఆ మేరకు చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణి పేట జిల్లాలలోని ప్రాంతాలు ఈ పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం 1189 చ.కీమీ గా ఉన్న చైన్నె విస్తీర్ణాన్ని 5,904 చదరపు కి.మీ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. 2026లో పూర్తిగా చైన్నె రూపు రేఖలు మార్చే దిశగా కసరత్తుల వేగం పెరిగింది. కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలు, రాణి పేట జిల్లా పరిధిలోని అరక్కోణం వరకు 1225 గ్రామాలు , ప్రాంతాలు చైన్నె మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చారు. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలుగా ఉన్న చైన్నె మహా మహానగరంగా రూపుదిద్దుకోనుంది. ప్రాథమికంగా.. చైన్నె శివారులలో శాటిలైట్ టౌన్ సిఫ్ దిశగా ఐదారు ప్రదేశాలను ఎంపిక చేసిన ప్రాథమిక పనుల కసరత్తులు జరుగుతున్నాయి. అదే సమయంలో బడ్జెట్లో చేసిన ప్రకటన మేరకు చైన్నె శివారులను అనుసంధాంచే రీతిలో గ్లోబల్ సిటీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ సిటీలో విద్య, వైద్య, రవాణాకు పెద్ద పీట వేయడమే కాకుండా, ఇతరమౌళిక సదుపాయాల కల్పనకు కసరత్తులు జరుగుతున్నాయి. 2వేల ఎకరాలలో ఈ గ్లోబల్ సిటీ రూపకల్పనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అధికారులు జరిపిన సమగ్ర పరిశీలన మేరకు ఈ గ్లోబల్ సిటీ కోసం నాలుగు స్థలాలను పరిశీలించి ఉన్నారు. టిడ్కో నేతృత్వంలో ఈ స్థల పరిశీలన ప్రకియ జరిపి ఉన్నారు. ఇందులో ఒకటి చైన్నెకు ప్రత్యామ్నాయంగా మరో విమానాశ్రయం కోసం ఎంపిక చేసిన కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో ఉండగా, మరొకటి చెంగల్పట్టు , పూంజేరి, చైన్నె ఈసీఆర్ మార్గంలో ఉన్నట్టు పేర్కొంటున్నారు.ఈ నగరం రూపకల్పనకు సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎం స్టాలిన్కు సమర్పించే విధంగా అఽధికారులు ముందుకెళ్తున్నారు. త్వరలో చైన్నె గ్లోబల్ సిటీ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంటున్నారు. ఈ పనులు మొదలు కాగానే, మదురై, తూత్తుకుడి, నాగర్ కోయిల్లలో కొత్త నగరాలను అంతర్జాతీయప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా కసరత్తులు మొదలు అవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ నిర్మాణాలు ఉంటాయని ఓఅధికారి వివరించారు. -
నాతో ఉన్న వారికే సీట్లు!
● రాందాసు స్పష్టీకరణ సాక్షి, చైన్నె: తన వెన్నంటి ఉన్న వాళ్లకే ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తూ సీట్లు ఇవ్వడం జరుగుతుందని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాసు స్పష్టం చేశారు. తన వద్దే పార్టీ పరంగా అన్ని అధికారాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య సాగుతున్న ధారావాహిక సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్బుమణి వెన్నంటి కొత్త , యువ సమూహం ఉండగా, రాందాసుతో వన్నియర్ సంఘాలతో పాటుగా పార్టీ సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారు.ఈ పరిస్థితులలో అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను తన వైపు తిప్పుకునే వ్యూహంతో బుధవారం రాందాసు వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. పీఎంకేలో పార్టీ పరంగా 78 జిల్లాల ఉన్నాయి. ఇందులో 61 జిల్లాలకు కొత్త అధ్యక్షులు, 78 జిల్లాలకు కొత్త కార్యదర్శులను రాందాసు నియమించారు. అయితే, తొలగించిన వాళ్లంతా పార్టీ పదవులలో కొనసాగుతారని అన్బుమణి స్పష్టం చేశారు. ఇందుకు చెక్ పెడుతూ , పదవుల నుంచి తొలగించ బడ్డ వారికి ఎన్నికలలో సీట్లు లేవు అని, తనతో ఉన్న వాళ్లకే సీట్లు అని స్పష్టం చేస్తూ రాందాసు బుధవారం తైలాపురంలో మీడియాతోమట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా నియమించిన వారితో సమావేశంలో భాగంగా రాందాసు మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలలో కూటమి ఎవరితో అన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ఎవరితో, భిన్నమైన కూటమితోనా అన్నది త్వరలో ప్రకటిస్తామన్నారు. తాను పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి, కొత్త కోశాధికారి తదితరులతోపాటుగా జిల్లాల పదవులకు నియమాకాలు చేశానని వివరించారు.ప్రస్తుతం తనతో ఎవ్వరెవ్వరు ఉన్నారో వారికే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ సీటు కేటాయించడం జరుగుతుందన్నారు. పార్టీ పరంగా అన్ని అధికారాలు తన వద్దే ఉన్నాయని, తాన నిర్ణయమే సుప్రీం అని స్పష్టం చేశారు. మదురైలో జరిగిన మురుగన్ మహానాడులో అన్నా, పెరియార్లను కించ పరిచే విధంగా లఘుచిత్రం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎవ్వర్నీ కించ పరచకుండా వ్యవహరించాల్సి ఉండాల్సిందని, అయితే, తప్పు చేశారని వ్యాఖ్యానించారు. -
చిన్నపిల్లల పార్క్ ప్రారంభం
తిరువళ్లూరు: పట్టణంలోని 14వ వార్డులో రూ.43 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల పార్క్ను స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ ఉదయమలర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్క్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పార్క్ల పర్యవేక్షణ బాధ్యతలను స్థానికులే స్వీకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అరుణ, జాన్, థామస్, డీఎంకే ఎన్ఆర్ఐ వింగ్ కార్యదర్శి జైకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై దాడి చేసిన హెడ్ కాన్స్టెబుల్ అరెస్టు
తిరుత్తణి: పోలీస్ స్టేషన్లో మహిళలపై దాడి ఘటనకు సంబంధించి హెడ్ కాన్స్టేబుల్ను ఎస్పీ సస్పెండ్ చేయడంతో పాటూ బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కనకమ్మసత్రంకు చెందిన మధుమిత(35)తో పాటు చెవ్వంది(29), ధనం(25) అనే ముగ్గురు మహిళలు అద్దె ఇంట్లో ఐదేళ్ల నుంచి ఒక్కటిగా వుంటున్నారు. ఇందులో మధుమితకు అరుల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం వున్నట్లు తెలుస్తోంది. అయితే మధుమిత తనను తరుచూ వేధిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నట్లు అరుల్ కనకమ్మసత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న మధుమిత అమెతో పాటూ ఉంటున్న మరో ఇద్దరు మహిళలు పోలీస్ స్టేషన్ చేరుకుని అరుల్ అతని మిత్రుడు శివాజీతో వాగ్వాదానికి దిగారు. ఈకర్మంలో హెడ్ కాన్స్టేబుల్ రామన్ మహిళలపై చేయి వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమపై హెడ్ కాన్స్టేబుల్ దాడిచేసినట్లు గాయాలైనట్లు తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చేరి చికిత్స పొందారు. స్టేషన్లో మహిళలపై దాడి ఘటనకు సంబంధించి మధుమిత ఫిర్యాదు మేరకు హెడ్ కాన్స్టుబుల్ రామన్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ మంగళవారం ఆదేశించారు. దీంతో కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి హెడ్ కాన్స్టేబుల్ను బుధవారం అరెస్టు చేశారు. అదే సమయంలో అరుల్ ఫిర్యాదు మేరకు మధుమిత పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్లుప్తంగా
రూ.కోటి విలువైన బీడీ ఆకులు స్వాధీనం అన్నానగర్: శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న రూ.కోటి విలువైన బీడీ ఆకులను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా కాయల్ పట్టణం సమీపంలోని కొంబుతురై బీచ్ నుంచి శ్రీలంకకు బీడీ ఆకులు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. క్యూ డివిజన్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఆ సమయంలో ఒక మినీ లారీ, ఒక ట్రాక్టర్ బీచ్ ప్రాంతానికి వచ్చాయి. వాటిలో చాలా తెల్లటి బస్తాలు ఉండగా గుర్తించి, అనుమానం వచ్చిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మినీ లారీ, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీ, ట్రాక్టర్లోని వ్యక్తులు, అలాగే బైకుపై ఉన్న ఒక వ్యక్తి తమ వాహనాలను వదిలి పారిపోయారు. పోలీసులు ఆ కట్టలను తనిఖీ చేయగా ఒక్కొక్కటి 30 కిలోల బరువున్న 103 కట్టల్లో దాదాపు 3 టన్నుల బీడీ ఆకులు ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.కోటి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బీజేపీ నేత ఇంట్లో చోరీ తిరువళ్లూరు: బీజేపీ కోశాధికారి పార్టీ సీనియర్ నేత ఇంట్లో తలుపులు పగలగొట్టి సుమారు 20 సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా వెంగల్ సమీపంలోని ఆర్ఆర్ కండ్రిగ గ్రామానికి చెందిన హరిసతీష్(48) బీజేపీ సీనియర్ నేతగాను, జిల్లా కోశాధికారిగానూ పని చేస్తున్నారు. పిల్లల చదువు కోసం ప్రస్తుతం అన్నానగర్లో ఉంటున్న హరిసతీష్ బుధవారం స్వగ్రామానికి వచ్చారు. ఇంటికి రాగా అప్పటికే తలుపులు పగలగొట్టి ఉండడంతో పాటు బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో షాక్కు గురయ్యాడు. ఈ విషయమై వెంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి వచ్చిన వెంగల్ పోలీసులు ఇంట్లో సుమారు 20 సవర్ల బంగారు నగలు, 40 వేల నగదు, పది కిలోల వెండి మాయమైనట్టు నిర్ధారించారు. అనంతరం పోలీసులు వేలిముద్రలను సేకరించి, నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. భార్యను కత్తితో నరికి చంపిన భర్త అన్నానగర్: తెన్కాసి జిల్లా ఆలంకుళంలోని అండిపట్టి సమీపంలోని రామనాథపురం అనే గ్రామంలో నివసిస్తున్న మురుగపెరుమాల్ (37), డ్రైవర్. ఇతని భార్య మహాలక్ష్మి (35). వీరికి ఇద్దరు కుమారులు 6, 4 తరగతులు చదువుతున్నారు. మహాలక్ష్మి తన ఇంటి పై పైకప్పును ఏర్పరచి కృత్రిమ పుట్టగొడుగుల పెంపకం, అమ్మకంలో నిమగ్నమై ఉంది. ఈమెకి సమీపంలోని పూలంగుళం గ్రామంలో ఒక దర్జీ దుకాణం కూడా ఉంది. మురుగపెరుమాల్ గత 2 నెలలుగా సరిగ్గా పనికి వెళ్లడం లేదు. అప్పు కూడా చేసినట్లు తెలుస్తుంది. దీని కారణంగా, మహాలక్ష్మి పనికి వెళ్లకపోతే అప్పు ఎలా తీర్చగలం అని మురుగపెరుమాళ్తో తగాదా చేస్తు వచ్చింది. మంగళవారం రాత్రి, వారి మధ్య వాదన జరిగి గొడవ జరిగింది. తరువాత, ఇద్దరూ నిద్రపోయేటప్పుడు, మురుగపెరుమాళ్ కోపంగా ఉన్నాడు. బుధవారం ఉదయం, ఇంట్లో వంట ముగించిన తర్వాత, మహాలక్ష్మి నేలపై పెంచుతున్న కృత్రిమ పుట్టగొడుగుకు నీరు పెట్టడానికి కిందకు వచ్చింది. అప్పుడు మురుగ పెరుమాళ్ కత్తితో భార్యను పిల్లల ముందే నరికివేశాడు. మహాలక్ష్మి తల వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. లారీ ఢీకొని డ్రైవర్ మృతి అన్నానగర్: శివగంగ జిల్లాకు చెందిన సేదుపతి (30) నటులు, నటీమణులు ఉపయోగించే కేరవాన్ వాహనాన్ని నడిపేవాడు. ప్రస్తుతం ఇతను నటుడు విజయ్ సేతుపతి వెబ్ సీరిస్లలో ఒకదానికి కేరవాన్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో తిరువెర్కౌడ్ పక్కన ఉన్న పులియంబేడు ప్రాంతంలోని పార్కింగ్ యార్డ్లో అతను వాహనాన్ని పార్క్ చేశాడు. బుధవారం ఉదయం కేరవాన్ వాహనాన్ని శుభ్రం చేసి తన తోటి డ్రైవర్లతో మాట్లాడాడు. ఆ సమయంలో, ఒక లారీ అకస్మాత్తుగా పార్కింగ్ యార్డ్లోకి అతి వేగంగా దూసుకొచ్చి సేదుపతిని ఢీకొట్టింది. అతను తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే మరణించాడు. అదృష్టవశాత్తూ, పార్కింగ్ స్థలంలో ఉన్న ఐదుగురు డ్రైవర్లు తప్పించుకున్నారు. తర్వాత ప్రమాదాన్ని ఖండిస్తూ సేతుపతి కుటుంబానికి పరిహారం చెల్లించాలని తోటి డ్రైవర్లు డిమాండ్ చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు లారీ డ్రైవర్ ను అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీని తరువాత, సేతుపతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం కిల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో నివసిస్తున్న యువతి ఆత్మహత్య అన్నానగర్: కృష్ణగిరి జిల్లాకు చెందిన శక్తి (31) భర్త నుంచి విడిపోయి సినిమా రంగంలో మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది. సినిమా రంగంలో కూడా పనిచేస్తున్న విఘ్నేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది చివరికి ప్రేమగా మారింది. అందువల్ల వారిద్దరూ వివాహం చేసుకోకుండానే విరుగంబాక్కం కాలనీలో ఒకే ఇంట్లో నివసించారు. ఇంటి పనులను ఇద్దరూ పంచుకునేవారని తెలుస్తోంది. మంగళవారం రాత్రి వంట చేయాలా వద్దా అనే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత విఘ్నేష్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. తిరిగి వచ్చేసరికి శక్తి గదిలో ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై విరుగంబాక్కం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హిందూ మున్నని నేత హత్య
● తిరుపూర్లో ఉద్రిక్తత సేలం : తిరుపూర్లో నగదు వివాదం విషయమై హిందూ మున్నాని నాయకుడు హత్యకు గురయ్యారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుపూర్ కుమరానందపురం ప్రాంతానికి చెందిన బాల మురుగన్(30) హిందూ మున్నని యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఇతడికి వివాహమైంది. బుధవారం తెల్లవారుజామున బాలమురుగనన్ను అతని ఇంటి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న బాల మురుగన్ మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తిరుపూర్ నార్త్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తిరుపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఈ ఘటన నగదు లావాదేవిలకు సంబంధించి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు సంబంధించి సుమన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అదే సమయంలో హత్యలో నిందితులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హతుడి బంధువులు ఆందోళనకు దిగారు. మృత దేహాన్ని తీసుకోబోమని తిరుప్పూర్ ప్రభుత్వాస్పత్రి ఎదుట రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగడంతోపాటు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు వారితో చర్చలు జరిపి, ఈ ఘటనలో నిందితులందర్నీ అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. -
విజేతలకు బహుమతులు ప్రదానం
సాక్షి, చైన్నె : జాతీయ క్రీడల్లో విజేతలైన నలుగురు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.25 లక్షల బహుమతిగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని క్రీడాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వారికి అందజేశారు. ఉత్తరాఖండ్లో ఇటీవల 38వ జాతీయ క్రీడలు జరిగాయి. బ్యాడ్మింటన్లో మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో తమిళనాడు జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే, తమిళనాడు పురుషుల జట్టు బాస్కెట్ బాల్ పోటీలో రజిత పతకాన్ని దక్కించుకుంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఆద్యవారియత్కు రూ. 3.75 లక్షలు, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు తిమ్మయ్యకు రూ. 2.50 లక్షలు, బాస్కెట్ బాల్ క్రీడాకారులు ప్రణవ్ ప్రిన్స్, ప్రశాంత్కు తలా రూ.1.50 లక్షలను డిప్యూటీ సీఎం, క్రీడాశాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి అందజేశారు. -
సమాజ సేవకులకు సత్కారం
కొరుక్కుపేట: సమాజానికి విశేష సేవలను అందించిన పలువురు సేవకులను ఘనంగా సత్కరించారు. ఇందులో ట్రిప్లికేన్ రామ్నగర్కు చెందిన రిటైర్డ్ టీఎన్ఈబీ ఉద్యోగి పాల్ కొండయ్యను పుదియ జననాయగ మక్కల్ ఇయక్కం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. పుదియ జననాయగ మక్కల్ ఇయక్కం ఆధ్వర్యంలో చైన్నెలోని ఇస్కాన్లో డాక్టర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగ నిర్మాణానికి, ఆయన ఆలోచనలు, సేవలు గురించి ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు టి.వేలవేనదన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ సభా నాయకులు సీకే తమిళరసన్, ఆర్ మత్తయ్యన్, మౌర్యయార్ బుద్ధ డోరా (దక్షిణ భారత బౌద్ధ కూటమి, అధ్యక్షుడు) పాల్గొన్నారు. ముఖ్య అతిథి తిరుమతి ఆమ్ స్ట్రాంగ్ విచ్చేసి సంఘ సేవకులకు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో పేద విద్యార్థులకు విద్య కోసం కృషి చేసిన పి.పాల్ కొండయ్యను అంబేడ్కర్ అవార్డుతో సత్కరించారు. -
నిఘా నీడలో తీరం
● హై అలర్ట్ ● తనిఖీలు ముమ్మరం ● సాగర్ కవచ్కు శ్రీకారం సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి హైఅలర్ట్ ప్రకటించారు. నిఘా నీడలోకి తీర ప్రాంతాల్ని తీసుకొచ్చారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సిబ్బంది అలెర్ట్గా ఉన్నారో లేదో అని పసిగట్టే విధంగా 48 గంటల సాగర్ కవచ్ మాక్డ్రిల్కు శ్రీకారం చుట్టారు. వివరాలు.. గతంలో జరిగిన ముంబై పేలుళ్ల తదుపరి సముద్ర తీరాల్లో భద్రతను పర్యవేక్షించే రీతిలో ఆరు నెలలకు ఒక పర్యాయం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సాగర్ కవచ్ నినాదంతో ఈ డ్రిల్ పోలీసులకు ముచ్చమటలు పటిస్తున్నదని చెప్పవచ్చు. రాష్ట్రంలోని చైన్నె మొదలు కన్యాకుమారి వరకు ఉన్న 13 సముద్ర తీర జిల్లాల్లో 48 గంటల పాటూ ఈడ్రిల్ సాగుతుంది. బుధవారం ఉదయాన్నే ఆరున్నర గంటలకు ఈ డ్రిల్కు శ్రీకారంచుట్టారు. పోలీసులు, కోస్ట్గార్డ్, నావికాదళం, సముద్ర తీర భద్రత విభాగాల నేతృత్వంలో రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో తొలి రోజు ఈ డ్రిల్ సాగింది. ఉరకలు... పరుగులు.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై పోలీసులు సముద్ర తీరాల్లో వేకువ జామున ప్రత్యేక చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. ఆయా సముద్ర తీర గ్రామాల్లో సైతం పోలీసులు రంగంలోకి దిగడంతో హడావుడి పెరిగింది. సముద్ర మార్గం గుండా మారు వేషాల్లో సిబ్బంది కొందరు ఆయా ప్రాంతాల్లోకి చొరబడనున్నారన్న సమాచారంతో, వారిని పట్టుకునేందుకు తీవ్రంగా కుస్తీలు పట్టారు. ప్రధానంగా వాహనాల తనిఖీలు జోరుగా సాగగా, మరోవైపు సముద్రతీరాల్లో జాలర్ల గ్రామాల్లోమఫ్టీలో ఉన్న సిబ్బంది ఆ మారు వేషగాళ్లను పట్టుకునేందుకు నిరీక్షించక తప్పలేదు. చైన్నె తీరం, ఈసీఆర్ మార్గంలో పోలీసులు అడుగడుగున చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీలో నిమగ్నం అయ్యారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేసి అనుమతించారు. అప్రమత్తంగానే ఉన్నమని చాటే విధంగా సిబ్బంది ముందుకు సాగారు. చైన్నెలోని మెరీనా బీచ్, బీసెంట్ నగర్ బీచ్, హార్బర్ పరిసరాలలో అయితే, భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలతో సాగర్ కవచ్ గురువారం సాయంత్రం వరకు జరగనుంది. -
కండెక్టర్పై దాడి
తిరుత్తణి: బస్సు ఫుట్బోర్డు ప్రయాణం చేసిన విద్యార్థులను హెచ్చరించిన కండెక్టర్పై విద్యార్థి దాడి సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తిరుత్తణి నుంచి మంగళవారం ఉదయం తిరుత్తణి ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన టౌన్ బస్సు తిరుత్తణి బస్టాండ్ నుంచి నల్లాట్టూరుకు బయలుదేరింది. ఆ బస్సు డ్రైవర్గా వాసు, తాత్కాలిక కండెక్టర్ నరేంద్రన్(28) విధులు నిర్వహించారు. బస్సులో పొన్పాడి స్టాపింగ్లో పూనిమాంగాడులోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులు ప్రయాణించారు. బస్సు ఖాళీగా ఉన్నా, విద్యార్థులు పుట్బోర్డుపై నిలుచుకుని ప్రయాణం చేస్తుండగా వారిని కండెక్టర్ లోపలికి రావాలని హెచ్చరించారు. అయితే విద్యార్థులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులను మందలించి, లోపలికి వెళ్లాలని సూచించడంతో విద్యార్థులు, కండెక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన ప్లస్టూ విద్యార్థి ఒకరు కండెక్టర్పై దాడి చేశాడు. ఇందులో కండెక్టర్ నుదుటిపై గాయాలయ్యాయి. వెంటనే బస్సును పూనిమాంగాడు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆపి, కండెక్టర్ చికిత్స పొందారు. అనంతరం కండెక్టర్పై దాడి సంఘటనకు సంబంధించి కనకమ్మసత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసున్నారు. -
మానాడు–2కు సన్నాహాలు జరుగుతున్నాయా?
తమిళసినిమా: నటుడు శింబు, దర్శకుడు వెంకట్ప్రభు కాంబోలో రూపొందిన చిత్రం మానాడు. సురేష్కామాక్షి నిర్మించిన ఈ చిత్రం లూప్ అనే కొత్త కాన్సెప్ట్లో తెరకెక్కింది. 2021 నవంబర్ 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. నిజం చెప్పాలంటే ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించిన ఏ చిత్రం మంచి విజయాన్ని సాధించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన పత్తుతల పూర్తిగా నిరాశ పరిచింది. ఇక ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్తో కలిసి నటించిన థగ్లైఫ్ చిత్రంపై శింబు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం అపజయాన్నే చవి చూసింది. ప్రస్తుతం మూడు కొత్త చిత్రాలను కమిట్ అయ్యారు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో నటించే చిత్రం. ఇది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా తాజాగా మానాడు–2 చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శింబు, దర్శకుడు వెంకట్ప్రభుల కాంబో ఈ చిత్రంతో రిపీట్ కానుందన్నదని ప్రచారం. అంతే కాదు ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్న శింబు తదుపరి మానాడు–2 చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. -
క్లుప్తంగా
బారికేడ్ను ఢీకొన్న బైక్ ● సబ్ ఇన్స్పెక్టర్ మృతి అన్నానగర్: బారికేడ్ను బైక్ ఢీకొని, సబ్ఇన్స్పెక్టర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ జిల్లాలోని అరుప్పుకోట్టైకి చెందిన విజయకుమార్ (52) అరుప్పుకోట్టై అసిస్టెంట్ సూపరింటెండెంట్ కార్యాలయంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీస్లో స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో కేసు దర్యాప్తు కోసం మంగళవారం అతను బైకులో మధురైకి వచ్చాడు. తరువాత, అతను మధురై నుంచి అరుప్పుకోట్టై వైపు వెళుతున్నాడు. కరియాపట్టి సమీపం మధురై–తూత్తుకుడి జాతీయ రహదారిపై ఎస్.కల్లుపట్టి బైపాస్ వద్దకు చేరుకుంటుండగా, విజయకుమార్ నడుపుతున్న బైకు అకస్మాత్తుగా రోడ్డుపై ఉంచిన ఇనుప బారికేడ్ను ఢీకొన్నాడు. దీంతో అతడు కిందపడి తీవ్రంగా గాయపడి మరణించాడు. ట్రాక్టర్ చక్రంలో చిక్కుకుని బాలుడి మృతి అన్నానగర్: తండ్రి నడుపుతున్న ట్రాక్టర్ చక్రంలో చిక్కుకుని ఓ బాలుడు మృతి చెందాడు. తిరుపత్తూరు జిల్లా నాట్టరంపల్లి సమీపం నాయనసెరువు ప్రాంతానికి చెందిన అరుళ్ ప్రకాశం, సంగీత దంపతులకు ఒకటిన్నరేళ్ల కరణ్ శర్మ కుమారుడు ఉన్నాడు. బుధవారం అరుళ్ ప్రకాశం తన పొలం దున్నడానికి ట్రాక్టర్ తీసుకుని బయలుదేరాడు. ఆ సమయంలో, అతని ఒకటిన్నర ఏళ్ల కుమారుడు కరణ్ శర్మ ట్రాక్టర్ వెనుక ఉన్నాడని గమనించకుండా దాన్ని స్టార్ట్ చేసి, వెనక్కి తీశాడు. దీంతో బాలుడు ట్రాక్టర్ వెనుక చక్రంలో ఇరుక్కుపోయి తలకు తీవ్ర గాయమైంది. ఆ పిల్లవాడిని వెంటనే నాట్టరంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధి పనుల తనిఖీ పళ్లిపట్టు: మండపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ ప్రతాప్ మంగళవారం తనిఖీ చేశారు. పొదటూరుపేట బస్టాండ్లో రూ.1.50 కోట్లు వ్యయంతో సముదాయ భవనంతోపాటు బస్టాండ్ పైకప్పు నిర్మాణ పనులు చేపడుతున్నారు. అలాగే మండలంలోని ఈచ్చంపాడిలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టిన చెరువు పూడికతీత పనులు, రూ. 29 లక్షల వ్యయంతో పార్క్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అనంతరం అత్తిమాంజేరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేసి, వైద్యసేవలకు సంబంధించి రోగులతో మాట్లాడారు. మహిళలు, గర్భిణులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. తరువాత ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించారు. రూ. 50 లక్షల వ్యయంతో ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మిస్తున్న ల్యాబ్ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ పంచాయతీల సహాయ డైరెక్టర్ జయకుమార్, పట్టణ పంచాయతీల కార్యదర్శి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. యువకులకు గుండు గీయించిన ఇన్స్పెక్టర్ కొరుక్కుపేట: విభిన్న హెయిర్స్టైల్ పెట్టుకుని తిరుగుతున్న యువకులకు ఇన్స్పెక్టర్ గుండు గీయించారు. చైన్నె వ్యాసార్పడి ఎంకేబీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బెంజిమ్ మంగళవారం రాత్రి పోలీసులతో కలిసి పెట్రోలింగ్లో ఉన్నాడు. సత్యమూర్తి నగర్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో రంగు రంగుల జుట్టు, ఆభరణాలతో ముగ్గురు యువకులను చూశాడు. వారు గందరగోళంగా తిరుగుతుండగా పోలీసులు వారిని ప్రశ్నించి, పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. తరువాత ముల్లైనగర్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ విభిన్నమైన హెయిర్ స్టైల్స్ ఉన్న 3 యువకులను చూశారు. వాళ్లని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీసులు అక్కడ ఆరుగురి యువకులకు గుండు గీయించారు. తర్వాత వారిని అక్కడి నుంచి పంపించారు. యువకులకు గుండు చేయించిన ఇన్స్పెక్టర్ బెంజమ్ను వెయిటింగ్ లిస్ట్కు బదిలీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ విషయంపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. మాధవరం హైవేపై గుంతలు ● నడవలేక ప్రజలకు ఇబ్బంది కొరుక్కుపేట : మాధవరం టొరెంట్ గ్యాస్ పైప్లైన్ నిర్మాణ సమయంలో హైవేపై గుంతలు తవ్వడం, వాటిని పూడ్చి వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాధవరం మూలక్కడై నుంచి ఎంఆర్హెచ్ హైవే మీదుగా మాధవరం చిన్న రౌండ్ అబౌట్ 200 అడుగుల రోడ్డుకు వెళ్లే హైవేపై టొరెంట్ గ్యాస్ పైపులైన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఈ కంపెనీ హైవేపై గుంతలు తవ్వి, పైపులు వేసి, వాటిని పూడ్చి వేయకుండా వదిలివేస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ పని రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరగాల్సి ఉంది. అయితే, ఈ పని ఉదయం వేళల్లో ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో నిర్వహించడంతో వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభిస్తోంది. సంబంధిత అధికారులు ఈ రోడ్డులోని గుంతలను పూడ్చాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. -
ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి విముక్తి
కొరుక్కుపేట: క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి, వైద్యుల సూచనలతో చికిత్సలు తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చని అపోలో క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. అపోలో క్యాన్సర్ సెంటర్స్ నేతృత్వంలో ‘కాన్విన్’ (క్యాన్సర్ విన్) కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ వారి క్యాన్సర్ ప్రయాణంలో ఒకచోట చేర్చే ఒక సపోర్ట్ గ్రూప్ను తీసుకుని వచ్చేలా శ్రీకారం చుట్టారు. దీని మొదటి చొరవగా క్యాన్సర్ విజేతలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ గ్రూప్ అంకాలజీ అండ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దినేష్ మాధవన్ మాట్లాడుతూ క్యాన్సర్కు వ్యతిరేకంగా నేటి పోరాటం అధునాతన చికిత్సలకు మించి పోయిందన్నారు. జాతీయ క్యాన్సర్ సర్వైవర్స్ మాసాన్ని గుర్తించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో, అపోలో క్యాన్సర్ సెంటర్స్ కాన్విన్ అనే క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు, -
కుమార్తెలపై కోపంతో.. రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన తండ్రి
వేలూరు: ఓ మాజీ సిపాయి తనకు చెందిన రూ.4 కోట్ల విలువైన భూమి పత్రాలను రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేశాడు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని పడవేడు గ్రామానికి చెందిన విజయన్ మాజీ ఆర్మీ సిపాయి. ఇతనికి భార్య కస్తూరి ఉంది. ఈమె కన్నమంగళం సమీపంలోని మంగళాపురంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలకు వివాహం కావడంతో ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా జీవిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ సిపాయి విజయన్కు భార్య కస్తూరి మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. విజయన్ మాత్రం ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో విజయన్ మనోవేదనతో ఉండేవాడు. దీంతో మే 2వ తేదీన జిల్లాలోని పడవేడులోని రేణుకాంబాల్ ఆలయానికి స్వామివారి దర్శనం కోసం విజయన్ వచ్చాడు. దర్శనం చేసుకున్న అనంతరం రూ.4 కోట్ల విలువ చేసే భూ పత్రాలను హుండీలో వేశాడు. అనంతరం అక్కడ నుంచి ఇంటికి వెళ్లాడు.మంగళవారం ఉదయం రేణుకాంబల్ ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయన్ ఆలయానికి వచ్చాడు. అనంతరం ఆలయ నిర్వహకులతో మాట్లాడి ఆలయ హుండీలో రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలున్నాయని, వాటన్నింటిని ఆలయాన్ని రాసి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆస్తి కోసం తన కుమార్తెలు నిత్యం వేధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయన్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది, స్థానికులు అవాక్కయ్యారు. విజయన్ ఆలయ హుండీల్లో ఆస్తి పత్రాలు వేసిన విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు ఆలయానికి వచ్చారు. ఆస్తి తమదని, ఆ పత్రం తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఆస్తిపత్రం తమ దగ్గరే ఉంటుందని దేవస్థానం అధికారులు వారికి స్పష్టం చేశారు. -
ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎప్పుడూ ఉండేదే.. త్వరలోనే నిజాలు బయటపడతాయ్
చెన్నై: కోలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్.. తనకు మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు అంగీకరించాడు. మరో తమిళ నటుడు కృష్ణ కూడా ఈ డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందించడంతో పోలీసులు ఆ నటుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ వ్యవహారంపై తమిళ హీరో విజయ్ ఆంటోని (Vijay Antony) స్పందించాడు.విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మార్గన్. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో హీరో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడటం కొత్తేమీ కాదు. ఇక్కడ చాలాఏళ్లుగా ఈ సమస్య ఉంది. డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ (టాలీవుడ్లో శ్రీరామ్) జైల్లో ఉన్నాడు. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అన్నాడు. మార్గన్ మూవీ జూన్ 27న విడుదల కానుంది.చదవండి: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్ -
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోం : నటుడు సత్యరాజ్
దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి తమిళ నటుడు సత్యరాజ్(Sathyaraj) వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో మురుగన్ మానాడు పేరిట బీజేపీ నిర్వహించిన సమ్మేళనంలో పవన్ .. నాస్తికులు, సెక్యులరిస్టులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలపై ఇప్పుడు నటుడు సత్యరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మురుగన్ మానాడు పేరుతో తమిళులను మోసం చేశామనుకుంటే… అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని విమర్శించాడు. తమిళ ప్రజలు తెలివైన వారన్న సత్యరాజ్… తమిళనాట మీ ఆటలు సాగబోవని కూడా హెచ్చరించారు. విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, పవన్ వ్యాఖ్యలను ఇప్పటికే డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు తమిళనాడుతో మీకేం సంబంధం’ అని డీఎంకే కీలక నేత, మంత్రి శేఖర్ బాబు పవన్ని ప్రశ్నించారు. ‘మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఒకవేళ అంతగా తమిళనాడుపై ప్రేమ ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించు’ అని పవన్కి సవాల్ విసిరాడు. -
‘కూలీ’ తొలి సింగిల్ సాంగ్ ఎప్పుడంటే ?
తమిళసినిమా: రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న రెండు భారీ చిత్రాలలో కూలీ ఒకటి. లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ టాలీవుడ్ స్టార్ నాగార్జున, సత్యరాజ్ సౌబినచ షాహీర్, నటి శృతిహాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, ఫాహత్ ఫాజిల్, రెబామోనిక జాన్ తదితర ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే ప్రత్యేక పాటలో మెరవనున్నారు గోల్డ్ స్మగ్లింగ్ ఇతివృత్తంతో సాగే ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కూలీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చిత్రం టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల మధ్య విశేషాదరణ పొందింది. కాగా చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర వర్గాలు ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా కూలీ చిత్రం ఫస్టు క్లిప్స్, చికిటు వైబ్ పొటు ప్రోమో వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు అనిరుద్, డానన్స్ మాస్టర్ శాండీ నటించిన ఈ ప్రోమో విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ను బుధవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. దీంతో రజనీకాంత్ అభిమానులు ఖుషి అవుతున్నారు. -
‘సీ–కౌ’ సంరక్షణకు సన్నద్ధం
సాక్షి, చైన్నె: అంతరించి పోతున్న కడల్ పసు (సీ కవ్, సముద్రపు పసువు)లను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. తంజావూరు మనోరా బీచ్లో రూ.15 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను విడుదల చేశారు. సముద్ర సంపదలను పరిరక్షించే విధంగా, అరుదైన సముద్ర జీవ రాశులను కాపాడుకునే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అంతరించి పోతున్న కడల్ పసువును సంరక్షించే దిశగా, వాటి మీద పరిశోధనలు విస్తృతం చేయడానికి వీలుగా ఓ కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సముద్ర తీరాలలో సుమారు 250 మేరకు సీ కవ్లు ఉన్నాయని, ఇందులో మన్నార్ వలిగుడా, బగ్విరి గుడా వంటి ప్రాంతాలలో వీటి సంచారం అధికంగా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. అంతరించి పోతున్న వీటిని రక్షించుకునేందుకు తంజావూరు మనోరా బీచ్లో సంరక్షణ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం రూ. 15 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులతో పనుల మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇక్కడ జరగనున్న నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలతో.. అంతర్జాతీయప్రమాణాలతో సీ కవ్ సంరక్షణ కేంద్రంతో పాటూ తాబేళ్ల పరిరక్షణకు ప్రత్యేక నిర్మాణాలు ఇక్కడ జరగబోతున్నాయి. మనోరా బీచ్లో మూడు కేటగిరులతో నిర్మాణంకు చర్యలు తీసుకున్నారు. సందర్శకుల కోసం ఓపెన్ ప్రాంతం, అద్దాలతో నిర్మితమైన ప్రాంతం, పూర్తి క్లోజ్డ్ ప్రాంతంగా మూడు కేటగిరీలపై దృష్టి పెట్టి నిర్మాణాలు జరగనున్నాయి.రూ. 15 కోట్లతో ఈ పనులు జరగనున్నాయి. ప్రత్యేక ఆకారంలో కేంద్రం, మ్యూజియం, 4 డీ థియేటర్, పార్కు, ఓపెన్ ఎయిర్ థియేటర్ , రెస్టారెంట్,సెల్పీ పాయింట్, అంటూ బ్రహ్మాండ నిర్మాణాలు జరగబోతున్నాయి.ఈ కేంద్రం ఏర్పాటులో భాగంగా తంజావూరు, పుదుకోట్టై సముద్ర తీర ప్రాంతాలను కలుపుతూ సీ కౌవ్ కన్షర్వేషన్ రిజర్వుగా పరిసరాలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సంరక్షణ కేంద్రం నమూనా తంజావూరులో కేంద్రం రూ. 15 కోట్లతో పనులు కార్యాచరణ ప్రణాళిక విడుదల -
ఇరాన్ నుంచి చైన్నెకు తమిళ విద్యార్థులు
సాక్షి, చైన్నె: ఇరాన్లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు.23 మంది విద్యార్థులలో 11 మంది చైన్నెకు చెందిన వారు ఉన్నారు. ఇరాన్, ఇజ్రయేల్ మధ్య యుద్దంతో తమ వాళ్లు ఏమయ్యారో అన్న ఆందోళన ఇక్కడున్న కుటుంబాలలలో బయలుదేరిన విషయం తెలిసిందే. తమ వాళ్లను సురక్షితంగా రప్పించాలన్న విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పటు చేసింది. ఈ క్రంటోల్ రూమ్ను సంప్రదించిన వారిలో ప్రస్తుతానికి 23 మంది ఉన్నారు. వీరందర్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఢిల్లీకి మంగళవారంతీసుకొచ్చారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో చైన్నెకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి విద్యార్థులు ప్రత్యేక వాహనాలలో వారి వారి స్వస్థలాలకు పంపించారు. ఇందులో 11 మంది చైన్నెకు చెందిన విద్యార్థుల కాగా, మిగిలిన వారు వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరందర్నీ ప్రభుత్వ ఖర్చుతోనే స్వస్థలాలకు వాహనాలలో పంపించారు. మరి కొందరు విద్యార్థులు ఇక్కడకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మంగళవారం యుద్ధానికి బ్రేక్ పడటం గమనార్హం. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 3.20 కోట్లు మోసం ●ఇద్దరు అరెస్టు తిరువళ్లూరు: ఆన్లైన్ పెట్టుబడిలో అధిక వడ్డీ వస్తుందని నమ్మించి సుమారు పది మంది వద్ద రూ. 3.20 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరుకు చెందిన శివశంకర్(43), రాజీవ్గాంధీ(39) తదితర ఇద్దరు వృక్షం ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నారు. వీరి కంపెనీలో తనికవేలు(43) సహా పది మంది సుమారు 3.20 కోట్లు రూపాయలను ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడిదారులకు వడ్డీ ఇవ్వకపోగా, అసలు సైతం ఇవ్వడానికి నిరాకరించి బెదిరింపులకు దిగినట్టు తెలుస్తుంది. దీంతో భాదితులు ఆవడి కమిషనర్కు పిర్యాదు చేశారు. కమిషనర్ శఽంకర్ ఆదేశాల మేరకు ఎకనమిక్స్ అఫెక్స్ వింగ్ ఇన్పెక్టర్ కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఇద్దరి వద్ద ఉన్న రెండు విలువైన కార్లు, సెల్ఫోన్లతో పాటూ బ్యాంక్లోని అకౌంట్ను ప్రీజ్ చేసి సుమారు 50 లక్షలు విలువ చేసే మొత్తాన్ని సీజ్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. విమానంలో రూ.3 కోట్ల విలువైన గంజాయి సీజ్ తరలిస్తున్న యువకుడి అరెస్టు అన్నానగర్: మదురైకి వస్తున్న విమానంలో రూ.3 కోట్ల విలువైన గంజాయి, హై–గ్రేడ్ కొకై న్ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు ఓ యువకుడిని అరెస్టు చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఓ ప్రయాణికుల విమానం మధురై విమానాశ్రయానికి చేరుకుంది. దిగిన ప్రయాణికుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో, భారత పాస్పోర్ట్ హోల్డర్ ప్రయాణికుడి ఆధీనంలో 6 ప్యాకెట్లలో ఆకుపచ్చ రంగులో భిన్నమైన పదార్థం కనిపించింది. అధికారులు పరీక్షించి హై–గ్రేడ్ గంజాయిగా గుర్తించారు. దర్యాప్తులో అతను తూత్తుకుడి జిల్లాలోని కాయల్పట్టు నివాసి అలీ అబ్దుల్ ఖాదర్ (52) అని, థాయిలాండ్ నుంచి శ్రీలంక మీదుగా విమానంలో మదురైకి వస్తున్నట్లు తేలింది. దీంతో కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి అలీ అబ్దుల్ ఖాదర్ను అరెస్టు చేసి, అతని నుంచి రూ.3 కోట్ల విలువైన హైగ్రేడ్ గంజాయి, సిగరెట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. 11 విమానాలు రద్దు కొరుక్కుపేట: ఇజ్రాయిల్, ఖతార్ మధ్య యుద్ధ ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న రాత్రి సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపై దాడి జరిగింది. దీని తరువాత, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , బహ్రెయిన్ తమ వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. ముఖ్యంగా, సౌదీ అరేబియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఖతార్ ఎయిర్లైన్స్ తదుపరి నోటీసు వచ్చేవరకు తన అన్ని విమానాలను నిలిపివేయాలని ఆదేశం జారీ చేసింది. దీంతో కువైట్, అబుదాబి, దుబాయ్ సహా చైన్నెకి 11 విమానాలు రద్దయ్యాయి. థాయిలాండ్ నుంచి దోహాకు 3 విమానాలు చైన్నెలో నిలిచిపోయాయని వెల్లడించారు.దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయి, ఎప్పుడు వస్తాయో తెలుసుకోవడానికి వారి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదిస్తున్నారు. చైన్నె విమానాశ్రయ అధికారులు తమ విమానాలను తిరిగి షెడ్యూల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. విమానాల రద్దు, ఆలస్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా, తిరుచ్చి నుంచి షార్జా , దుబాయ్లకు విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ రోజు తిరుచ్చి నుంచి నడపాల్సిన తిరుచ్చి–షార్జా, దుబాయ్–తిరుచ్చి , తిరుచ్చి–దుబాయ్ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా, ఈ విమానాలలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. -
ఉచిత శస్త్ర చికిత్సలే లక్ష్యంగా ఒప్పందాలు
● ప్రాజెక్ట్ జీవన్తో సేవలు సాక్షి, చైన్నె: ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు, పుట్టుకతోనే వెన్నెముక , మెదడు రుగ్మతలతో బాధ పడుతున్న పిల్లలకు ఉచిత శస్త్ర చికిత్సల నిర్వహణకు కావేరి ఆస్పత్రిలో ప్రాజెక్ట్ జీవన్ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె మిత్రా, రోటరీ బెంగళూరు ఐటీ కారిడార్ లీడ్ క్లబ్లతో కావేరి ఆస్పత్రి ఒప్పందాలు జరిగాయి. స్పినా బిఫిడా, మైలో మెనింగో సెల్, టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్, స్కోలియోసిస్, స్పైనల్ ట్యూమర్స్ వంటి సమస్యలతో బాధ పడుతున్న పేద వర్గాల పిల్లల జీవితాన్ని ఆనందమయంచేయడం లక్ష్యంగా శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. చైన్నె ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రిలో మల్టీ డిసిప్లినరీ బృందం, వైద్య బృందంతో కలిసి సీఎస్ఆర్ ద్వారా సేకరించిన రూ. 85 లక్షలతో మొదటి విడుదలగా ప్రాజెక్ట్ జీవన్ కోసం 35 మంది పిల్లలకు ఉచితంగా క్లిష్టమైన శస్త్ర చికిత్సల నిర్వహణ కు చర్యలు తీసుకున్నారు.ఈ ఒప్పందాల కార్యక్రమంలో కావేరి గ్రూప్ ఆఫ్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ అరవింద్ సెల్వరాజ్, రోటరీ ప్రతినిధులు ఎన్ఎస్శరవణన్, సాయి శేషన్, అనిల్ గుప్తా, డాక్టర్రవి వర్మ, కావేరి వైద్యుల బృందం డాక్టర్ జి. బాలమురళి, డాక్టర్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హిజ్రాలకు ప్రోత్సాహం
● ఆ రెండు పథకాలలో నిబంధనల సడళింపుసాక్షి, చైన్నె: పుదుమై పెన్, తమిళ్ పుదల్వన్ పథకాలలో ట్రాన్స్ ఉమెన్, జెండర్ (హిజ్రాల కోసం ) నిబంధనలను సడళిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులలో చదువుకున్న విద్యార్థినులకు ఉన్నత చదవులలో ప్రోత్సాహంగా నెలకు రూ.1000 నగదు పంపిణీ నిమిత్తం పుదుమైపెన్ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్లస్–2 ముగిసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకుంటూ లక్షలాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే, విద్యార్థులకు సైతం ఈ పథకం వర్తింప చేసే విధంగా తమిళ్ పుదల్వన్ అని నామకరణం చేశారు. విద్యార్థులకు ఈ పథకం అమలోయ్యే సమయంలో తమకు వర్తింపు చేయాలని ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలల నుంచి విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో ఈ రెండు పథకాలను ప్రభుత్వ , ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు అమలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తమకు సైతం వర్తింపు చేయాలని హిజ్రాల నుంచి విజ్ఞప్తులు పెరిగాయి. హిజ్రాల సంక్షేమం దిశగా ప్రభుత్వం బృహత్తర పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వారిలో ఉన్నత విద్యా ప్రోత్సహం నింపే దిశగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహకారం అన్న నిబంధనలను హిజ్రాలకు తొలగించారు. ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ జెండర్ ఏ బడులలోచదువుకున్నా సరే, ఈ పథకాల నిమిత్తం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ సీఎం స్టాలిన్ ఆదేశాలతో మంగళవారం అధికార వర్గాలు ఉత్తర్వులు జారీ చేశారు. -
మురుగన్ మహానాడుపై ఫిర్యాదు
సాక్షి, చైన్నె : మదురైలో బీజేపీ, హిందూ మున్నని తదితర సంఘాల నేతృత్వంలో ఆదివారం జరిగిన తమిళ్ కడవుల్ మురుగన్ మహానాడుపై పోలీసులకు ఫిర్యాదు చేరింది. కొన్ని సంఘాలు మంగళవారం మదురై కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. ఆ మహానాడుకు హాజరైన బీజేపీ నేతలు నైనార్ నాగేంద్రన్, అన్నామలై, తమిళిసై, ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హిందూ మున్నని నేతలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. రాజకీయాలకతీతంగా మహానాడు అని కోర్టుకు హామీ ఇచ్చి, రాజకీయ వ్యాఖ్యలు, తీర్మానాలు ఈ మహానాడులో చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆ సంఘాల ప్రతినిధులు కోరారు. కాగా ఈ మహానాడులో పెరియార్, అన్నాలను అవమానించేలా లఘు చిత్రం ప్రదర్శించడాన్ని అన్నాడీఎంకే ఖండించింది. అన్నాకు వ్యతిరేకంగా వీడియో విడుదల చేసిన వారిని ఖండిస్తున్నామని ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత ఆర్బీ ఉదయకుమార్ పేర్కొన్నారు. అలాగే, అన్నాను విమర్శించే వారిని వ్యతిరేకిస్తామని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాకు వ్యతిరేకంగా వ్యవహరించుకోవడం మానుకోవాలని లేకుంటే ప్రతిఘటన తప్పదని ఎండీఎంకే నేత వైగో హెచ్చరించారు. అన్నా, పెరియార్పై విమర్శలు గుప్పించిన మురుగన్ మహానాడులో పాల్గొనడం ద్వారా మరింతగా రాష్ట్రంలో అన్నాడీఎంకే పతనం మొదలైనట్టు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ వ్యాఖ్యానించారు. -
ఫ్రీడమ్ షూటింగ్ పూర్తి
తమిళసినిమా: ఇప్పుడు హిట్ ట్రాక్లో పయనిస్తున్న కథానాయకుడు శశికుమార్. అయోథి, గరుడన్ చిత్రాలతో మంచి విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న ఈయన ఇటీవల నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా శశికుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఫ్రీడమ్. నటి లిజోమోల్ జోస్ కథానాయకిగా నటించిన ఇందులో నటుడు బోస్ వెంకట్, మాళవిక అవినాష్, సుదీవ్ నాయిర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కళుగు, సవాలే సుమాలి, 1945 వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. గణపతి పిక్చర్స్ పతాకంపై పొండియన్ పరశురామన్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, ఎన్ఎస్.ఉదయకుమార్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఎలాంటి నేరం చేయకపోయినా శ్రీలంక జైలులో బాధింపునకు గురైన ఇద్దరు తమిళులు అక్కడ నుంచి ఎలా బయట పడ్డారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఫ్రీడమ్ అని చిత్రం వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రాన్ని జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. కాగా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ప్రీడమ్ చిత్రం యూనిట్ -
● మల్టీ మోడల్ సేవకు సన్నద్ధం ● అన్ని రవాణా సేవలకూ ఒకే టికెట్టు ● కసరత్తులు పూర్తి ● ప్రయోగంలో ప్రత్యేక యాప్ ● జూలై నుంచి అమలులోకి
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నె విస్తీర్ణం 2026లో పెరగబోతున్న విషయం తెలిసిందే. ఇది వరకు నగరం, సబర్బన్ ప్రాంతాలుగా 1,189 చ.కీమీ విస్తీర్ణంతో ఉన్న ఈ చైన్నె మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇక 5,904 చదరపు కి.మీ విస్తీర్ణంతో మహా మహానగరంగా జాబితాలోకి చేరింది. చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, రాణిపేట జిల్లా అరక్కోణం ఈ మహా మహానగరం పరిధిలోకి చేర్చారు. అదే సమయంలో చైన్నె నగరం చుట్టూ మెట్రో సేవల కార్యాచరణ వేగవంతం చేసిన అధికారులు పనుల వేగం పెంచారు. అలాగే ఎంటీసీ బస్సుల సేవలను, ఎలక్ట్రిక్ రైళ్ల సేవలను వీటికి అనుసంధానించే విధంగా ఒకే టికెట్టుతో మల్టీ మోడల్సేవలకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం.. రాజధాని నగరం చైన్నెలో ప్రధాన రవాణా వ్యవస్థలుగా చెంగల్పట్టు నుంచి బీచ్ వరకు, సెంట్రల్ నుంచి అర్కోణం , గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ రైళ్ల సేవలు , బీచ్ నుంచి వేళచ్చేరి వరకు ఎంఆర్టీఎస్ రైలు సేవలు చైన్నెలో ఇప్పటికే ఉంది. ఇటీవల విమానాశ్రయం నుంచి కోయంబేడు – సెంట్రల్ మీదుగా విమ్కో నగర్కు ఓ మార్గం, సెయింట్ థామస్ మౌంట్ నుంచి ఆలందూరు మీదుగా అన్నా సాలై వైపుగా సెంట్రల్కు మారో మార్గంలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో ఎంఆర్టీఎస్ సేవలు మరికొన్ని నెలలలో వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు పట్టాల మీదకు రానున్నాయి. ఇక, మెట్రో సేవలు చైన్నె నగర శివారులోని నలు దిశలను చుట్టే విధంగా కీలాంబాక్కం, సిరుచ్చేరి మాధవరం, పుందమల్లి – ఆవడి – పరందూరు వరకు విస్తరించే విధంగా పనుల వేగం పెంచారు. కొన్ని మార్గాలలో ఈ ఏడాది చివర్లో ,మరికొన్ని మార్గాలలో 2027 మార్చి నాటికి పనులు ముగించే విధంగా కార్యాచరణ సిద్దంచేశారు. నగరానికి నలుదిశలలో మెట్రో ప్రయాణమే కాదు, ఇతర రకాలా రవాణా వ్యవస్థను సులభతరం చేయడమే లక్ష్యంగా చైన్నె మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ పర్యవేక్షణలో (సీఎండీఏ) కంబైన్డ్ ట్రాన్స్ పోర్టు అథారిటీ రంగంలోకి దిగింది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్లను ఏకీకృతం చేస్తూ, అన్ని సేవలకు ఒకే టికెట్టు అన్న నినాదంతో ముందుకెళ్లేందుకు సిద్ధమైంది.జూలైలో అందుబాటులోకి.. ఒకే గూటిలోకి అన్ని రవాణా సేవలను తీసుకొచ్చేందుకు కసరత్తులను కంబైన్డ్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ప్రస్తుతం పూర్తి చేసింది. ఒకే టికెట్టుతో పైన అన్ని రకాల రవాణా సేవలను ప్రజలు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆయా మార్గాలను ఏకం చేయడం, రైల్వేతో అనుసంధానించడం , ప్రయాణికులకు రవాణా మార్గాలను సులభతరం చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఇందు కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేశారు. తద్వారా ప్రయాణ టికెట్టు పొందేందుకు వీలుగా రూట్మ్యాప్తో పాటూ అన్ని రకాల రవాణా సమాచారం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా ప్రయాణికులకు తెలియజేసేందుకు సిద్ధమవుతోన్నారు. చైన్నె నగరంలో అన్ని రకాల రవాణాలకు సంబంధించిన స్టేషన్ల,స్టాపింగ్లు తదితర సమాచారాలు ఈ యాప్లో పొందు పరుస్తున్నారు. ఈ మేరకు ఒకే టికెట్టు ఆధారంగా మూడు రవాణా సేవలను పొందేందుకు వీలు కల్పించనున్నారు. మొబైల్ యాప్లోని క్యూ ఆర్ కోడ్ ఉపయోగించి టికెట్లను పొందే అవకాశం కూడా కల్పించనున్నారు. మెట్రో స్టేషన్లలో స్కానింగ్ సదుపాయం ద్వారా టికెట్టు పొందేందుకు, ఎంటీసీ బస్సులలో పొందు పరచనున్న క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్ల ద్వారా అప్పటికప్పుడే టికెట్లు పొందేందుకు సైతం వెసులు బాటు కల్పించే విధంగా సమగ్ర వివరాలను ఈ యాప్లో పొందు పరిచినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకే టికెట్టు సేవకు సంబంధించిన సమగ్ర కార్యారణను అధికారులు సిద్ధం చేశారు. జూలైలలో అమల్లోకి తెచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంతకు ముందుగా ప్రయోగాత్మాకంగా యాప్ పరిశోధనకు సిద్ధమయ్యారు. జూలై చివరి నాటికి చైన్నె నగరంలో పూర్తిస్థాయిలో ఒకే టికెట్టుతో కూడిన మల్టీ మోడల్ సేవలను అందరికి దరిచేర్చే దిశగా ఉరకలు తీస్తున్నారు. -
ఎన్ని లడ్డూలు ఇచ్చారో?
తమిళసినిమా: నటుడు ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన తొలి చిత్రం కుబేర. టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం మలయాళం కన్నడం, హిందీ భాషల్లో కూడా గత 20 వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా బాలీవుడ్లో సల్మాన్ఖాన్ సరసన నటించిన సికిందర్ చిత్రం నిరాశపరిచిన రష్మిక మందన్నాకు కుబేర చిత్రం విజయానందానిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి రష్మిక మందన్నా నటుడు ధనుష్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ నేషనల్ క్రష్ తన ఇన్ స్ట్రాగామ్లో ‘ధనుష్ సార్ మీతో నేను పూర్తి చిత్రంలో నటించినా ఇదే నేను, మీరు కలిసి తీసుకున్న తొలి ఫొటో.(ఆ ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు). మీరు అద్భుతమైన మనిషి. ప్రతి రోజు కఠినంగా శ్రమిస్తునందుకు చాలా ధన్యవాదాలు. మనం వేర్వేరు నగరాల్లో వేర్వేరు పనుల్లో ఉన్నా విశ్రాంతి ఎంత ముఖ్యమో అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆ విశ్రాంతిని మనం పొందలేమన్నది తెలుసు. కుబేర చిత్రంలోనే కాకుండా అన్ని చిత్రాల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శిస్తునందుకు ధన్యవాదాలు. నాతోనే కాకుండా మీతో పరిచయం ఉన్న అందరితోనూ ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. షూటింగ్ సమయంలో మీరు నాకు ఎన్ని లడ్డూలు ఇచ్చారో ఇంకా గుర్తుంది. ఆ విషయాన్ని నేనెప్పటికీ మరచిపోను. షూటింగ్ సమయంలోనే తమిళం పదాలు నేర్పించిన విధం, ఎలా నటించాలన్నది, వాటిని సరిగ్గా చేసినప్పుడు బాగుంది అని అభినందించడం వంటివి అద్భుతమైన అనుభవం. ఇవన్నీ మీకు సాధారణంగా అనిపించవచ్చు. ఇప్పుడే కాదు. ఎప్పుడూ మీకు మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డీఎన్ఏ చిత్రంతో చాలా నేర్చుకున్నాను! తమిళసినిమా: నటుడు అధర్వ, నటి నిమిషా సజయన్ జంటగా నటించిన చిత్రం డీఎన్ఏ. విజీ చంద్రశేఖర్, దర్శకుడు బాలాజీ శక్తివేల్, సుబ్రహ్మణ్యం శివ, రమేష్ తిలక్, బోస్ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేత్ కుమార్ సమర్పణలో జయంతి అంబేడ్కర్ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేష్ కథా, దర్శకత్వం వహించారు. పొర్థీ చాయాగ్రహణం, జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ థ్యాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు నెల్సన్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ చిత్రం కథ 10 ఏళ్లుగా తన వద్ద ఉందన్నారు. అందులోని ఆనంద్, దివ్య పాత్రలు నిజజీవితంలోనివని చెప్పారు. తాను చెప్పిన కథను నిర్మాత పీఆర్ఓ చెప్పారు. అప్పుడే తన కథ నిర్మాతకు నచ్చిందని భావించానన్నారు. చిత్రం మంచి థియేటరికల్ ఎక్స్పీరియనన్స్గా వచ్చిందన్నారు. నిమిషా సజయన్ నటిగా ఒక వరం అని పేర్కొన్నారు. ఈ చిత్రం తదుపరి దశకు వెళ్లడానికి నటుడు అధర్వ నటించడానికి అంగీకరించడమేనని పేర్కొన్నారు. ఆయనలోని కథాబిరుచి అపారం అన్నారు. కథను అర్థం చేసుకుని నటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రానికి అన్ని వర్గాల నుంచి సపోర్ట్ అవసరం అని నెల్సన్ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన నటనకు వస్తున్న ప్రశంసలకు కారణం దర్శకుడు నెల్సన్ వెంకటేష్, నటుడు అధర్వ అని నటి నిమిషా సజయన్ పేర్కొన్నారు. నటుడు అధర్వ అద్భుతమైన పెర్ఫార్మర్ అని ఆమె అన్నారు. నటుడు అధర్వ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఎవరైనా మంచి చిత్రం చేయాలనే శ్రమిస్తామన్నారు. చిత్రం విడుదలైన థియేటర్లను సందర్శించామన్నారు. అక్కడ ప్రేక్షకులు తమ చిత్రంగా భావిస్తూ ఎంతగానో సంతోషించారన్నారు. తన తల్లి వయసు కలిగిన ఒక ఆమె తన దగ్గరకు వచ్చి తమ్ముడు చిత్రం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందని గుండెలకు హత్తుకున్నారన్నారు. తాను ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. -
2027లో సంస్థాగత సమరం
● నియోజకవర్గ నేతలతో స్టాలిన్ విస్తృత భేటీసాక్షి, చైన్నె : 2027లో డీఎంకేలో పదవులకు సంస్థాగత సమరం జరగనుంది. దీని ద్వారా పదువులు భర్తీ కానున్నాయి. ఈ దృష్ట్యా, 2026 ఎన్నికలలో గెలుపు లక్ష్యంగా నేతలు శ్రమించేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ అధికారం దిశగా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రతి పక్షాల గుప్పెట్లో ఉన్న, 2021లో తక్కువ ఓట్లతో గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నేతలతో చైన్నెకు పిలిపించి సమీక్షిస్తూ వస్తున్నారు. ఆ దిశగా మంగళవారం ఆండిపట్టి, శ్రీవిళ్లిపుత్తూరు, చోళవందాన్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు, స్థానికంగా ఉన్న నేతల పనితీరు, సమస్యలు గురించి ఆరా తీశారు. బలోపేతం లక్ష్యం కావాలని, అందరికి పార్టీ పదవులలో న్యాయం జరుగుతుందని, అధికారం లక్ష్యంగా శ్రమించాలని స్టాలిన్ సూచించారు.అదే సమయంలో 2026 ఎన్నికల ప్రక్రియ ముగియగానే, పార్టీ పరంగా 2027లో సంస్ధాగత సమరంకు పిలుపు నిచ్చే వ్యూహంతో స్టాలిన్ఉన్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. 2022లో సంస్థాగత సమరం జరగ్గా, తాజాగా ఐదేళ్ల అనంతరం 2027లో సంస్థాగత మీద దృష్టి పెట్టి, పనిచేసే వారికి పదవులు కట్టబెట్టే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. 2027లో జరిగే సంస్థాగత సమరం ద్వారా పార్టీ పదవులలో కీలక మార్పులు ఉంటాయన్న చర్చ బయలు దేరింది. పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ వయోభారం, అనారోగ్య సమస్యలు తరచూ ఎదుర్కొంటుండటాన్ని పరిగణించి, ఆయన స్థానంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలను టీ ఆర్ బాలు లేదా, కేఎన్ నెహ్రూకు అప్పగించ వచ్చనే చర్చ బయలుదేరింది. -
మంత్రి సమక్షంలో చర్చలు ఫలించేనా ?
తమిళసినిమా: సమాచార, ప్రచార శాఖా మంత్రి స్వామినాథన్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలిస్తాయో? లేదో వేచి చూడాల్సి ఉంది. తమిళ సినీ నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (పెప్సీ)కి మధ్య పారితోషికం విషయంలో చాలా కాలంగా వివాదం జరుగుతోంది. రెండు సంఘాల నిర్వాహకులు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒక దశలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. దీంతో పెప్సీకి యాక్టీవ్ నిర్మాతల మండలి మద్దతుగా నిలిచింది.దీంతో తమిళ సినీ నిర్మాతల మండలికి చెందిన నిర్మాతలు నిర్మించే చిత్రాలకు తమ సపోర్ట్ ఉండదని పెప్సీ ప్రకటించింది. దీంతో తమిళ సినీ నిర్మాతల మండలి కొత్తగా మరో పెప్సీ సమాఖ్యను ప్రారంభించింది. ఇలా ఒకరికొకరు తగ్గేదెలా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివాదం ప్రభుత్వం జోక్యం చేసు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమాచార, ప్రచార శాఖా మంత్రి స్వామినాథన్ సమక్షంలో సినీ ప్రముఖులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళీ రామస్వామి, పెప్సీ అధ్యక్షుడు ఆర్ కే.సెల్వమణి, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్, నిర్వాహకులు పూచీ మురుగన్, కరుణాస్, ప్రభుత్వ కార్యదర్శి రాజారామ్ తదితరులు పాల్గొని, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరోసారి చర్చలు జరగనున్న తెలిసింది. కాగా ఇదే సమయంలో పెప్సీ అధ్యక్షుడు ఆర్ కే.సెల్వమణి, సినీ కార్మికుల సొంత గృహాల కోసం పయనూర్లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొన్ని మార్పులు చేయాలని మంత్రి స్వామినాథన్కు వినతిపత్రం అందజేశారు. మంత్రి సమక్షంలో జరుగుతున్న ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయే లేదో వేచి చూడాలి. -
డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ అరెస్ట్
చెన్నై: డ్రగ్స్ కేసులో సినీ హీరో శ్రీరామ్ (Sriram) అలియాస్ శ్రీకాంత్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. AIADMK మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారు ఇచ్చిన సమాచారంతో నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని నుంగంబాక్కం స్టేషన్కు తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు. నటుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.అసలేం జరిగింది?చెన్నైలోని ఓ బార్లో ఏఐఏడీఎమ్కే మాజీ నేత ప్రసాద్ తాగి గొడవకు దిగాడు. పోలీసులు అతడిచి అరెస్టు చేసి విచారించగా డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. హీరో శ్రీరామ్ కోసం ప్రదీప్ అనే వ్యక్తి తన దగ్గర కొకైన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. ప్రదీప్కు 40 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో శ్రీరామ్ను అదుపులోకి తీసుకుని పరీక్షలు చేయగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై హీరో శ్రీరామ్ స్పందించాల్సి ఉంది.శ్రీరామ్ సినీజర్నీ..శ్రీరామ్.. రోజా కూటం అనే తమిళ చిత్రంతో హీరోగా ప్రయాణం ప్రారంభించాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పోలీస్ పోలీస్, దడ, నిప్పు, లై, 10th క్లాస్ డైరీస్,స్నేహితులు(డబ్బింగ్ మూవీ), పిండం, రావణాసుర.. ఇలా అనేక సినిమాలు చేశాడు. చదవండి: ఈ మూవీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుంది -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
ప్రేమ జంట నిర్వాకం.. పొట్టు పొట్టు తన్నుకున్న బంధువులు..
అన్నానగర్: కృష్ణగిరిలోని పోచంపల్లి సమీపంలో అదృశ్యమైన కళాశాల విద్యార్థిని, ఆమె ప్రేమికుడు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ప్రేమికుడిని అడ్డగించి దాడి చేశారు. ప్రతిగా, ప్రత్యర్థి వర్గం కూడా దాడి చేయడంతో కలకలం రేగింది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా లోని పోచంపల్లి సమీపంలోని పులియాండపట్టి గ్రామానికి చెందిన సదాశివం కుమారుడు వేలు(23). ఇతను పోచంపల్లి సిబ్ కాట్ లోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ధర్మపురి జిల్లా అడియమాన్ కొట్టాయి కెట్టుపట్టి గ్రామానికి చెందిన తిరుపతి కుమార్తె జ్యోతిలక్ష్మి(20) ధర్మపురి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. జ్యోతిలక్ష్మి ఆలయ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పులియండపట్టిలోని బంధువుల ఇంటికి వచ్చినప్పుడు వేలుతో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. జ్యోతిలక్ష్మి తల్లిదండ్రులు వారి ప్రేమను వ్యతిరేకించారు. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేసేందుకు యతి్నంచారు. జ్యోతిలక్ష్మి దానిని వ్యతిరేకించింది. దీంతో ఆమెను ఇంట్లో ప్రత్యేక గదిలో బంధించినట్లు తెలుస్తుంది. ఈ స్థితిలో వేసవి సెలవులు ముగిసి 16న కళాశాల తెరిచిన తర్వాత కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన జ్యోతిలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదు. ఇది తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా చోట్ల వెతికినా కూతురు కనిపించకపోవడంతో, వారు అదియామన్కోట్టై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో, కనిపించకుండా పోయిన జ్యోతిలక్ష్మి సేలం వెళ్లి అక్కడి ఒక ఆలయంలో వేలును వివాహం చేసుకున్నారని, వారిద్దరూ వేలు స్నేహితుడి ఇంట్లో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇంతలో, పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలిసి, జ్యోతిలక్ష్మి ఆదివారం తన భర్తతో కలిసి మాథుర్ పోలీస్ స్టేషన్కు వచ్చింది.ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. అకస్మాత్తుగా వారు ఆ జంట ప్రయాణిస్తున్న దారిని అడ్డుకున్నారు. వేలు, అతని బంధువులను చుట్టుముట్టి వారి పై దాడి చేశారు. వారు కూడా ఎదురుదాడికి దిగారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సమాధాన పరిచి కేసు విచారణ చేస్తున్నారు. -
మళ్లీ సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట సీఎం అయ్యే అర్హత మళ్లీ ఎంకే స్టాలిన్కే ఉందని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సర్వేలో తేలింది. 77 శాతం మంది స్టాలిన్కే మద్దతు పలికారు. 67 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి/స్వామికి , 60 శాతం మంది తమిళగ వెట్రి కళగం నేత విజయ్కు ఓటు వేశారు.అయితే, విజయ్ కంటే ఒక అడుగు ముందు వరుసలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు 64 శాతం మంది మద్దతు ఇవ్వడం విశేషం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దిశగా డీఎంకే కసరత్తుల వేగాన్ని పెంచింది. ఈసారి అధికార పగ్గాలు చేజిక్కించుకునే విధంగా అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. మార్పు అంటూ తొలిసారిగా ఎన్నికల కదన రంగంలోకి సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ సన్నద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉందో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో ప్రస్తుత ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల గురించి చెన్నైలోని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్వే వివరాలను ఆదివారం ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించారు. స్టాలిన్కే మద్దతు ఈ సర్వే మేరకు 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత స్టాలిన్కే ఉందని 77.83 శాతం మంది మద్దతు పలికారు. అలాగే 67.99 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సీఎం కావాలని మద్దతు ఇచ్చారు. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ సీఎం కావాలని 67.99 శాతంమంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సీఎం కావాలని 64.58 శాతం మంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, గత ఏడాది రాజకీయ పార్టీని ప్రకటించి ప్రస్తుతం దూకుడుగా వ్యూహాలకు పదును పెట్టిన విజయ్ సీఎం కావాలని 60.58 శాతం మంది మద్దతుగా ఓటు వేసినట్టు సర్వే వివరాలలో పేర్కొన్నారు. ఇక, ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో అన్న ప్రశ్నకు డీఎంకేకు 17.70 శాతం, అన్నాడీఎంకేకు 17.30 శాతం, 12.20 శాతం మంది తమిళగవెట్రి కళగంకు మద్దతుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పథకాల తీరు తెన్నులకు ఓట్లు అధికంగానే పడ్డాయి. ఇందులో అల్పాహార పథకానికి 72 శాతం మంది, మహిళా హక్కు పథకానికి 62 శాతం మంది, మహిళలకు ఉచిత బస్సు సేవలకు 56 శాతం మంది మద్దతు ఇచ్చారు. తమిళనాడు ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించే పార్టీ డీఎంకే అని 25.30 శాతం మంది, అన్నాడీఎంకే అంటూ 22.80 శాతం మంది, 15.70 శాతం బీజేపీ, 11.72 శాతం తమిళగ వెట్రి కళగం అంటూ తమ మద్దతును తెలియజేసి ఉండడం గమనార్హం. ఈ శాతాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీ అన్నట్టుగా సాగడం స్పష్టమవుతోంది. -
క్లుప్తంగా
విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కొరుక్కుపేట: యిమ్మిడి కిషోర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు 600 మందికి ఉచితంగా విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. వరద ముత్తయ్యప్పన్ వీధిలోని నారాయణ గురువయ్య చెట్టి చారిటీస్ హాలు వేదికగా ఆదివారం ఉదయం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు కిషోర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అలపాటి భరత్కుమార్, ఏఎన్. సురేష్కుమార్, హరికుమార్, హెచ్. బాలాజీ, దీపక్ తరద్ పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్లు, లంచ్ బాక్స్లు , పంపిణీ చేశారు. రూ. 1.11కోట్ల మోసం కేసులో మాజీ ఉద్యోగి అరెస్టు కొరుక్కుపేట: ఒక ప్రైవేట్ ఆర్థిక సంస్థలో జరిగిన రూ.1.11 కోట్ల మోసం కేసులో 6 నెలలుగా పరారీలో ఉన్న మాజీ ఉద్యోగిని జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సేలం జిల్లాలోని మెట్టూరు సమీపంలోని కొలత్తూరులో ఒక ప్రముఖ ప్రైవేట్ ఆర్థిక సంస్థ ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తోంది. సేలం, మనకాడు నివాసి నరేంద్ర కుమార్ ఈ కార్యాలయంలో చీఫ్ డెట్ కలెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. గత సంవత్సరం చివరిలో, అతను సేలం జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో తాను పనిచేస్తున్న ఆర్థిక సంస్థ కొలత్తూరు శాఖలో డెట్ కలెక్టర్లుగా పనిచేస్తున్న ఫీల్డ్ వర్కర్లకు టీమ్ లీడర్గా పనిచేస్తున్న సిలంబరసన్ (34) సహచర ఉద్యోగులతో కలిసి 40 మంది పాత రుణగ్రహీతల నకిలీ ఖాతాలను సృష్టించి రూ. 1,11,20,000 మోసం చేశాడని, ఈ మోసంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని, డబ్బును తిరిగి పొందాలని కోరారు. ఈ విషయంపై జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారు సిలంబరసన్, మోసంలో పాల్గొన్న ఇతర ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సిలంబరసన్ను అరెస్టు చేయడానికి పోలీసులు అతని కోసం చురుగ్గా వెతుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం, అతను కొలత్తూర్ బస్టాండ్ నుంచి కర్ణాటకకు పారిపోబోతుండగా ప్రత్యేక పోలీసు దళం పట్టుకుని అరెస్టు చేసింది. అతన్ని సేలం కోర్టులో హాజరుపరిచి సెంట్రల్ జైలులో ఉంచారు. రౌడీ హత్య – తరిమి తరిమి నరికిన ప్రత్యర్థి ముఠా అన్నానగర్: కుండ్రత్తూర్ సమీపం కోవూర్ ప్రాంతానికి చెందిన కుల్ల ప్రతాప్ అలియస్ ప్రతాప్ కుమార్. రౌడీ అయిన ఇతనిపై వివిధ క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతను శనివారం రాత్రి అతను అప్పటికే నివసిస్తున్న ఎం.జి.ఆర్. నగర్కు తన స్నేహితులను చూడటానికి వచ్చాడు. 11.30 గంటల ప్రాంతంలో, అదే ప్రాంతంలోని అన్నా మెయిన్ రోడ్డులోని ఒక తోపుడు బండి స్టాల్లో భోజనం చేస్తున్నాడు. అక్కడికి సమీపంలో భోజనం చేస్తున్న ఏడుగురు వ్యక్తుల బృందానికి, ప్రతాప్కుమార్కు మధ్య అకస్మాత్తుగా గొడవ జరిగింది. ఆ తర్వాత ప్రతాప్కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆగ్రహించిన ఆ బృందం అదే ప్రాంతంలోని కురింజి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ప్రతాప్కుమార్ను వెంబడించి, కత్తులతో నరికారు. దీనితో షాక్కు గురైన ప్రతాప్ కుమార్ హంతక ముఠా నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తాడు. తర్వాత ముఠా సభ్యులు తప్పించుకున్నారు. తీవ్రగాయాలైన ప్రతాప్ కుమార్ను పొరుగువారు రక్షించి కిల్పాకం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయ స్థితిలో అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఎంజిఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. జోరుగా చేపల అమ్మకాలు కొరుక్కుపేట: తమిళనాడులో 61 రోజుల చేపల వేట నిషేధం జూన్ 21వ తేదీతో ముగిసింది. శనివారం రాత్రి నుంచే, 100కు పైగా ఫిషింగ్ బోట్ల నుంచి 800 మందికి పైగా మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో లోతుగా చేపలు పట్టే మత్స్యకారులు ఒడ్డుకు తిరిగి రావడానికి కనీసం 7 నుంచి 15 రోజులు పడుతుంది. ఇదిలాఉండగా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఆదివారం ఉదయం కాసిమేడు ఓడరేవుకు తిరిగి వచ్చారు. నిషేధ కాలం ముగిసి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లిన తర్వాత, వారి వలల్లో చాలా పెద్ద చేపలు పడ్డాయి. కాసిమేడులో వంజరం, వవ్వల్ శ్రీవర, తైట్టె, తిరుకై ్క, కొడువా వంటి పెద్ద చేపలను విక్రయానికి పెట్టారు. చేపలను ఫిషింగ్ నెట్స్ నుంచి బుట్టల్లో విక్రయించి వేలం వేశారు. -
మళ్లీ సీఎం స్టాలిన్
●77 శాతం మద్దతు ●పళనికి 67 శాతం ●విజయ్కు 60 శాతం సాక్షి, చైన్నె: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట సీఎం అయ్యే అర్హత మళ్లీ ఎంకే స్టాలిన్కే ఉందని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సర్వేలో తేలింది. 77 శాతం మంది స్టాలిన్కే మద్దతు పలికారు. 67 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి/స్వామికి , 60 శాతం మంది తమిళగ వెట్రి కళగం నేత విజయ్కు ఓటు వేశారు.అయితే, విజయ్ కంటే ఒక అడుగు ముందు వరుసలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు 64 శాతం మంది మద్దతు ఇవ్వడం విశేషం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దిశగా డీఎంకే కసరత్తుల వేగాన్ని పెంచింది. ఈసారి అధికార పగ్గాలు చేజిక్కించుకునే విధంగా అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. మార్పు అంటూ తొలిసారిగా ఎన్నికల కదన రంగంలోకి సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ సన్నద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉందో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో ప్రస్తుత ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల గురించి చైన్నెలోని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్వే వివరాలను ఆదివారం ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించారు. స్టాలిన్కే మద్దతు ఈ సర్వే మేరకు 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత స్టాలిన్కే ఉందని 77.83 శాతం మంది మద్దతు పలికారు. అలాగే 67.99 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సీఎం కావాలని మద్దతు ఇచ్చారు. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ సీఎం కావాలని 67.99 శాతంమంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై సీఎం కావాలని 64.58 శాతం మంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, గత ఏడాది రాజకీయ పార్టీని ప్రకటించి ప్రస్తుతం దూకుడుగా వ్యూహాలకు పదును పెట్టిన విజయ్ సీఎం కావాలని 60.58 శాతం మంది మద్దతుగా ఓటు వేసినట్టు సర్వే వివరాలలో పేర్కొన్నారు. ఇక, ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో అన్న ప్రశ్నకు డీఎంకేకు 17.70 శాతం, అన్నాడీఎంకేకు 17.30 శాతం, 12.20 శాతం మంది తమిళగవెట్రి కళగంకు మద్దతుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పథకాల తీరు తెన్నులకు ఓట్లు అధికంగానే పడ్డాయి. ఇందులో అల్పాహార పథకానికి 72 శాతం మంది, మహిళా హక్కు పథకానికి 62 శాతం మంది, మహిళలకు ఉచిత బస్సు సేవలకు 56 శాతం మంది మద్దతు ఇచ్చారు. తమిళనాడు ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించే పార్టీ డీఎంకే అని 25.30 శాతం మంది, అన్నాడీఎంకే అంటూ 22.80 శాతం మంది, 15.70 శాతం బీజేపీ, 11.72 శాతం తమిళగ వెట్రి కళగం అంటూ తమ మద్దతును తెలియజేసి ఉండడం గమనార్హం. ఈ శాతాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీ అన్నట్టుగా సాగడం స్పష్టమవుతోంది. -
ఈసీ గుర్తించాలంటే అధిక సీట్లు
● ఎండీఎంకే భేటీలో తీర్మానం సేలం: ఎన్నికల కమిషన్ (ఈసీ) గుర్తింపు పొందాలంటే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లలో పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఎండీఎంకే సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈరోడ్లోని పెరుందురై పరిమళం మహల్లో ఆదివారం ఎండీఎంకే రాష్ట్ర జనరల్ కమిటీ సమావేశం జరిగింది. జనరల్ కమిటీ సమావేశానికి చైర్మన్, ఆడిటర్ అర్జున్ అధ్యక్షత వహించారు. పార్టీ ప్రధానకార్యదర్శి వైగో, ప్రిన్సిపల్ సెక్రటరీ దురై వైగో, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లై సత్య, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర జనరల్ కమిటీ సభ్యులు సహా 1,700 మందికి పైగా సమావేశానికి హాజరయ్యారు. సర్వసభ్య సమావేశం ప్రారంభం కాగానే, కశ్మీర్ పహల్గామ్ మృతులకు, అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులర్పించారు. అధిక సీట్లలో పోటీ అవసరం 2017లో ఎన్నికల పొత్తుకు సంబంధించి తీసుకున్న నిర్ణయం, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగే విధంగా నిర్ణయించారు. 1997 నుంచి 2010 వరకు కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపును పార్టీ కలిగి ఉన్నట్టు, ఈ గుర్తింపు మళ్లీ దక్కాలంటే, 2026 ఎన్నికల్లో కూటమిలో అధిక సీట్లను రాబట్టే ప్రయత్నం చేసి, పోటీచేయాలన్న నిర్ణయానికి వస్తూ తీర్మానం చేశారు. అనంతరం నిర్బంధ విద్యా హక్కు చట్టం, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ వ్యవహరిస్తున్న విధానాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. అనంతరం 2026 అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. వైగో మాట్లాడుతూ సమావేశానికి 1,504 మంది హాజరయ్యారని వివరించారు. 28 తీర్మానాలు ఆమోదించామన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు పతనం తప్పదని, దేవుడి రాజకీయాల కోసం వాడుకోవడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. డీఎంకే కూటమి బలంగా ఉందని, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
కమనీయం..శ్రీనివాసుడి కల్యాణం
కొరుక్కుపేట: చైన్నె మాధవరం పొన్నియమ్మన్మేడు మోహన్నగర్లో వెంకటాద్రి భజన సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస తిరు కల్యాణం అదివారం కనులపండువగా జరిగింది. ఉమియ మహల్ వేదికగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్స్వామి మంగళశాసనాలతో సాగిన కల్యాణ మహోత్సవం చేశారు. కార్యక్రమానికి త్రిదండి ఆహోబిల రామానుజ జీయర్స్వామి పాల్గొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.45 గంటలలోపు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని తిరుకల్యాణాన్ని వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. శ్రీమాన్ భక్త పార్థసారథి రామానుజర్ ఆశీస్సులతో శనివారం సాయంత్రం గరుడసేవ, శ్రీజన్మరక్షక హరినామ సుకీర్తనం, నాట్యాంజలి, భక్తిగీతాల ఆలాపన నిర్వహించారు. భజన సమాజం అధ్యక్షుడు కే పద్మరాజ్, కార్యదర్శి కే ఐశ్వర్య ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జెట్ చైన్నె కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యతోనే బంగారు భవిత
కొరుక్కుపేట: అంకితభావంతో చదివి ప్రతిభావంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు బంగారు భవిత సొంతమవుతుందని ఫ్రేమ్ ఫార్మా గ్రూప్ కంపెనీల మేనేజింగ్ పార్ట్నర్ బీఎల్ కుమారవేల్ అన్నారు. చైన్నె జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘం నిర్వహణలోని వాసవి విద్యానిధి ఆధ్వర్యంలో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్షుడు డాక్టర్ కనిగెలుపుల శంకరరావు, బీఎల్ కుమారవేల్ పాల్గొన్నారు. ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున వంద మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. అలాగే నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరి విద్యార్థులతోపాటు ఉపకార వేతనాల కోసం రూ.లక్ష విరాళం నిచ్చిన ఉప్పు జయచంద్రన్ను సత్కరించారు. అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నరసింహులు, కోశాధికారి పెసల రమేష్, ఉపాధ్యక్షులు ఎం ఉదయ్కుమార్, సుబ్బారావు, వాసవీ విద్యానిధి కార్యదర్శి ఎం.ప్రవీణ్కుమార్, సంయుక్త కార్యదర్శి పువ్వాడ అశోక్కుమార్ పాల్గొన్నారు. -
యోగాతో సరికొత్త ఉత్తేజం
వేలూరు: పురాతన చరిత్ర కలిగిన యోగా శిక్షను విద్యార్థులతో పాటూ ప్రతి ఒక్కరూ చేయాలని వేలూరు జూనియర్ రెడ్క్రాస్ కార్యదర్శి జనార్ధణన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదివారం ఉదయం కాట్పాడిలోని జూనియర్ రెడ్క్రాస్ అద్వర్యంలో కాట్పాడిలోని యోగా శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ యోగా శిక్షణ తరగతులు జరిగిని ఈ శిక్షణను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమతి ద్వారా జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా గత 2015వ సంవత్సరంలో ప్రకటించడం జరిగిందన్నారు. ఈ యోగాను మన సిద్దర్లు గత ఐదు వేల సంవత్సరాల క్రితమే చేశారన్నారు. ప్రపంచంలోని ప్రజలు తెలుసుకునే విధంగా ఈ యోగా ప్రాధాన్యతను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇది ఒక రోజు చేసే శిక్షణ కాదని ప్రతి రోజూ వీటిని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తిరువణ్ణామలై తపోయోగివనం ఆశ్రమం నిర్వహకుడు సనంతా స్వామిజీ, వేలూరు ఈట్టురుద్ది ఆస్పత్రి డాక్టర్ మీరా, జూనియర్ రెడ్ క్రాస్ సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసన్, సభ్యులు దీనబంధు, సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. -
అధికారులు ఆదర్శంగా ఉండాలి
తిరువళ్లూరు: ప్రభుత్వ అధికారుల పనితీరు అందరికి ఆదర్శంగా వుండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత వుండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కలైంజ్ఞన్ పక్కాగృహాల పథకం, తారు, సిమెంట్ రోడ్డు నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామీణాభివృద్ధిశాఖలో నిష్పక్షపాతంగా పని చేసిన పలువురు అధికారులను కలెక్టర్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, చీఫ్ ఇంజినీర్ రాజవేలు, డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్,ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియారాజన్ ల్గొన్నారు. -
తిరుత్తణికి పోటెత్తిన భక్తులు
● స్వామి దర్శనానికి 4 గంటల సమయం ● వాహనసేవలకు అంతరాయం తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. నాలుగు గంటలపాటు భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి పుణ్యక్షేత్రంలో స్కంధషష్టి సందర్భంగా స్వామికి సూరసంహార వేడుకలకు భిన్నంగా పుష్పాభిషేకం చేపడతారు. ఆలయ మూలవర్లకు వేకువజామున అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచం తొడిగి దీపారాధన పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కొండ ఆలయం వాహనాలతో నిండిపోవడంతో ఘాట్రోడ్డులో వాహనాలను కొండ కిందే వాహనాలు నిలుపుదల చేసి కాలినడకన వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తజనంతో కొండ ఆలయం కిక్కిరిసింది. ఉచిత దర్శన క్యూలో నాలుగు గంటలు, రూ.100 ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. -
మహిళల అభ్యున్నతే లక్ష్యం
తిరుత్తణి: డీఎంకే ప్రభుత్వంలో మహిళల అభ్యున్న తే లక్ష్యంగా ముఖ్యమంత్రి పథకాలు అమలు చేసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపినట్లు మంత్రి నాజర్ పేర్కొన్నారు. డీఎంకే పాలన నాలుగేళ్లు పూర్తి సందర్భంగా తిరువళ్లూరు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎన్.కండ్రగ గ్రామంలో శనివారం వీధి ప్రచారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో మంత్రి నాజర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షం ఆటంకం సృష్టించినా మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వం పధకాలు రూపకల్పన చేసి ఆదుకుంటున్నట్లు, తద్వారా మహిళా సమాజనం అభివృద్ధి బాటలో పయనిస్తున్నట్లు తెలి పారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం మౌలి క సదుపాయాలు కల్పించి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు మూకుమ్మడిగా డీఎంకే ప్రభుత్వంకు తమ మద్దతు పలికి ఆదరించాలని కోరారు. జిల్లా యువజన విభాగ కన్వీనర్ కిరణ్, మండల కార్యదర్శి విజయకుమార్, పార్టీ ప్రచారకులు శివాజీ కృష్ణమూర్తి, రాజరాజేశ్వరి పాల్గొన్నారు. -
చారుకేసీ రూపకల్పనకు రజనీకాంత్ కారణం
తమిళసినిమా: రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి త్రిష. ప్రస్తుతం ఈమె వయసు 41 ఏళ్లు సినీ కెరీర్లో గాని వ్యక్తిగతంగా గాని, త్రిష ఎన్నో ఎత్తుపల్లాలని చవిచూశారు. చివరికి త్రిష పని అయిపోయిందనే ప్రచారాన్ని సైతం ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా రాజసాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలను అందుకున్నారు. అంతేకాకుండా పోయిందనుకున్న కెరియర్ను నిలబెట్టుకున్నారు. దీంతో మళ్లీ వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించడం మొదలెట్టాయి. అలా పొన్నియిన్ సెల్వన్ –2, లియో, విడాముయర్చి, థగ్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కరుప్పు చిత్రంతోపాటు ,తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలోని నటిస్తున్నారు. అదేవిధంగా కన్నడం, మలయాళం నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే జయపదయాలు అన్నవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. అలా త్రిష నటుడు అజిత్ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థగ్ లైఫ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించ లేకపోయాయి. ముఖ్యంగా థగ్ లైఫ్ చిత్రంలో త్రిష నటించిన పాత్ర పై పలు రకాల ట్రోలింగ్స్ దొర్లుతున్నాయి. అసలు ఆ చిత్రంలో ఈమె పాత్రకు ఎలాంటి ఐడెంటిటీ లేదని, నటించడానికి అవకాశం కూడా లేదంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమె నటన గురించి మాత్రం ఎవరు విమర్శలు చేయకపోవడం. అదేవిధంగా థగ్ లైఫ్ చిత్తంలో త్రిష పాత్ర గురించి వస్తున్న విమర్శలపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. అసలు అలాంటి విమర్శలు ఆమె వరకు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే త్రిషకు తమిళంలో చదవటం గానీ రాయడం గాని రాదు. అదేవిధంగా త్రిషకు వ్యక్తిగత కార్య నిర్వాహకుడు కానీ, పీఆర్ఓ టీమ్ కానీ సోషల్ మీడియా అడ్వైజర్ గాని లేరు ఇవన్నీ చాలా కాలంగా త్రిష తల్లి నే చూసుకుంటున్నారు. కాగా ఎలాంటి విమర్శలకై నా విజయమే తగిన బదులు చెబుతుందని ఆమె వర్గం పేర్కొంటున్నారు. ప్రస్తుతం సూర్య కు జంటగా నటిస్తున్న కడుప్పు చిత్రం, అదేవిధంగా తెలుగులో చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం సాధించే విజయాల కోసం ఆమె ఎదురుచూస్తున్నానే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమిళసినిమా: ఇంతకుముందు బాషా వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సురేష్ కృష్ణ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం చారుకేసీ. ప్రముఖ సీనియర్ నటుడు వైజీ మహేంద్ర పలుమార్లు స్టేజి మీద నటించిన చారుకేసీ నాటకమే ఇప్పుడు అదే పేరుతో సినిమాగా రూపొందడం విశేషం. ఇందులో వైజీ మహేంద్రతో పాటూ సత్యరాజ్, సుహాసిని, సముద్రఖని, రమ్య పాండియన్ ,రాజ్ అయ్యప్పన్, లివింగ్ సచటన్ , జయ ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వెంకట్ కథను అందించిన ఈ చిత్రానికి పాటలు, మాటలను పా.విజయ్ రాయడం విశేషం. దేవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని అరుణ్ విజువల్స్ పతాకంపై అరుణ్ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సంగీత భరిత కథా చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఎస్ బీపీ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ చారుకేసీ చిత్ర రూపకల్పనకు ప్రధాన కారణం నటుడు రజనీకాంత్ నేనని పేర్కొన్నారు. నాటకాలు చూసిన ఆయన దీన్ని సినిమాగా రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని తనతో పలుమార్లు అన్నారు. అలా ఆయన ప్రోద్బలంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని చెప్పారు. తనకు కర్ణాటక సంగీతం తో కూడిన కథా చిత్రాన్ని చేయాలనే కోరిక చాలాకాలంగా ఉందన్నారు. చారుకేసీ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్న తర్వాత దీనికి సంగీతాన్ని ఎవరు అందించాలన్న విషయంలో తమకు దేవానే కనిపించారన్నారు. అదేవిధంగా శంకర్ మహదేవన్ అయితే ఈ చిత్రంలోని పాటలకు గాయరకుడు శంకర్ మహదేవన్ మాత్రమే న్యాయం చేయగలరని ఆయన్ని ఎంపిక చేశామన్నారు. గీత రచయిత పా.విజయ్ అద్భుతమైన పాటలను, అదేవిధంగా సంభాషణలను, స్క్రీన్ ప్లేను కూడా రాశారన్నారు. ఇది శంకరాభరణం, సింధు భైరవి చిత్రాల స్థాయిలో కర్ణాటక సంగీతంలో రూపొందిన గొప్ప సంగీత కళాత్మక కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు కృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని నటుడు వైజీ.మహేంద్ర పేర్కొన్నారు. విజయమే బదులిస్తుంది..! -
విజయ్, తిరుమాకు గాలం
● డిప్యూటీ పదవికి అన్నాడీఎంకే నిర్ణయం ● సన్నిహితుల ద్వారా పళణి రాయబారం సాక్షి, చైన్నె: అధికార పగ్గాలు ఎలాగైనా చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. విజయ్, తిరుమావళవన్ తమ వైపుగా వస్తే చాలు అన్నట్టుగా గెలుపు ధీమాతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి వర్గాలు ఉన్నాయి. విజయ్, తిరుమా ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే దిశగా అన్నాడీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. 2026లో అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. డీఎంకే కూటమి ప్రస్తుతం బలంగా ఉన్నా, ఆ కూటమి పార్టీలో అధిక సీట్ల నినాదం అందుకోవడం అన్నాడీఎంకే నిశితంగా పరిశీలిస్తున్నది. ఈ సారి అధికారం చేజారిన పక్షంలో మరలా అన్నాడీఎంకే అధికారంలోకి రావడం అసాధ్యమవుతుందన్న నిర్ణయానికి వచ్చిన పళణి స్వామి కొత్త వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ, రాష్ట్రంలో తమ నేతృత్వంలోనే ఎన్నికల వ్యవహారాలు సాగే దిశగా పళణిస్వామి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. ఆదిశగా తమ కూటమిలోకి విజయ్ తమిళగ వెట్రికళగం, వీసీకే తిరుమావళవన్ను ఆహ్వానించే దిశగా కసరత్తులు చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. డిప్యూటీ పదవులు.. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ అన్న విషయాన్ని ఆ పార్టీ పెద్దలకు పళణి స్వామి స్పష్టం చేసినట్టు సమాచారం. అదే సమయంలో తాము కొన్నికీలక పార్టీలను తమిళనాట ఆహ్వానించ బోతున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండా వ్యూహాలకు మద్దతు ఇవ్వాలన్న విజ్ఞప్తిని బీజేపీ ఢిల్లీ పెద్దలకు పళణిస్వామి సంకేతాలు పంపినట్టు సమాచారం. ఇందులో తమిళగ వెట్రి కళగం నేతవిజయ్, డీఎంకే కూటమిలోని వీసీకే నేత తిరుమావళవన్ తమ వైపుగా వస్తే గెలుపు తథ్యమన్న ధీమాతో పళని స్వామి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. డీఎంకే కూటమిలో గత కొన్నేళ్లుగా వీసీకే కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంగా అధిక సీట్లు అన్న నినాదాంతో కూటమిలోని ఇతర పార్టీలను రెచ్చగొట్టడం డీఎంకేకు మింగుడు పడడం లేదు. ఈ దృష్ట్యా, ఈసారి ఎన్నికల సమయంలో వీసీకేను పక్కన పె ట్టవచ్చు అన్న చర్చల నేపథ్యంలో ఆ పార్టీ నేత తిరుమావళవన్ను తమ వలలో వేసుకునేందుకు డిప్యూటీ సీఎం పదవి ఆశ చూపించే పనిలో అన్నాడీఎంకే ఉన్నట్టు సమాచారం. ఇక, పార్టీ ఆవిర్భావంతో ప్రజలలోకి పూర్తిస్థాయిలో చొచ్చుకెళ్లనప్పటికీ, మద్దతు, అభిమాన బలం ఉన్న నేతగా ఉన్న విజయ్ను ఈ సారి తమ వైపు తిప్పుకుంటూ మరింతగా ఓటు బ్యాంక్ దక్కినట్టే అన్న ధీమాతో పళని ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయ్ను సైతం డిప్యూటీ సీఎం పదవి ద్వారా తమ వైపుగాతిప్పుకుంటూ అధికారం చేజిక్కించుకున్నట్టే అన్న సంకేతాలతో సన్నిహితుల ద్వారా రాయబార ప్రయత్నాలను అన్నాడీఎంకే వర్గాలు విస్తృతం చేసినట్టుగా ఆదివారం తమిళనాట మీడియాలలో సమాచారాలు హల్ చేయడం గమనార్హం. ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తాయో అన్నది ఎన్నికల నగారా మోగే వరకు వేచిచూడాల్సిందే. -
విజయ్ @ 51
● రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ● టీవీకేలో పండుగ సంబరాలు సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ ఆదివారం 51వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భాన్ని పండుగ తరహాలో ఆ పార్టీ వర్గాలు జరుపుకున్నాయి. వాడ వాడలలో వేడుకలు, సేవలు మిన్నంటాయి. వివరాలు. సినీ నటుడిగా అశేషాభిమానుల హృదయాలలో ముద్ర వేసుకున్న దళపతి విజయ్ గత ఏడాది రాజకీయాలోకి వచ్చారు. ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కళగంను ప్రకటించినా, కొన్ని నెలల పాటుగా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టలేదు. గత ఏడాది చివరి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యవర్గాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు విజయ్ సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన తొలి బర్తడేను జరుపుకుంటుండటంతో పార్టీ వర్గాలకు పండుగగామారింది. విజయ్ 51వ పుట్టిన రోజును సేవా కార్యక్రమాల రూపంలో హోరెత్తించారు. రాష్ట్రంలో 120 మేరకు జిల్లా కమిటీలు, 20 మేరకు ఉన్న అనుబంధ విభాగాల ద్వారా విజయ్ బర్త్డే వేడుకలు పండుగ తరహాలో మిన్నంటాయి. బంగారు ఉంగరాలు.. పుట్టిన పిల్లలకు బంగారు ఉంగారాలను అందజేశారు. గర్భిణి సీ్త్రలు, చంటి పిల్లల తల్లులకు కావాల్సిన అన్నిరకాలవస్తువులను పంపిణీ చేశారు. విజయ్ తల్లి శోభ ఉదయాన్నే స్థానికంగా ఉన్న ఆలయంలో పూజలు చేశారు. విజయ్ సీఎం కావాలన్న కాంక్షతో ఆ పార్టీ వర్గాలు ఎక్కడిక్కడ ఆలయాలలో పూజలు హోరెత్తించారు. సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. అన్నదాతనం, రక్తదానం, వస్త్ర, ఇతర వస్తువుల దానంతో పేదలకు ఉపయోగ పడే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, పనయూరులోని విజయ్ ఇంటి వద్ద కు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. చైన్నెలో జరిగిన కార్యక్రమాలలో పార్టీ నేతలు భుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జునలు పాల్గొన్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనాథ ఆశ్రమాలకు కావాల్సిన వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులలో పుట్టిన వందలాది మంది పిల్లలకు బంగారు ఉంగరాలను పార్టీ వర్గాలు అందజేసి ఆనందాన్ని పంచుకున్నారు. వాడ వాడలలో స్వీట్లు పంపిణీతో సంబరాలలో మునిగారు. ఇక, విజయ్ తదుపరి చిత్రం జననాయగం పోస్టర్లు సామాజికమాధ్యమాలలో హల్చల్ చేశాయి. ఇదిలా ఉండగా విజయ్ బర్త్డే సందర్భంగా అభిమానులు పోస్టర్లు, ప్లెక్సీలను హోరెత్తించగా, పోలీసుల హఠాత్తుగా నిషేధం విధించడం పలు చోట్ల వివాదానికి దారి తీసింది. కొన్ని చోట్ల విజయ్ మద్దతు దారులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడులు చేయడం రచ్చకెక్కింది. ఇక విజయ్ బర్త్డే వేళ మంచి నిర్ణయం తీసుకోవాలని బీజేపీ మహిళ నేత తమిళిసై సౌందరారజన్ పిలుపునిచ్చారు. ఇక, తమిళనాడు కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, పీఎంకే నేత అన్బుమణి, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
భారీగా అన్నాడీఎంకేలో చేరిక
సేలం: సేలం నగర జిల్లా ట్రేడ్ టీం జాయింట్ సెక్రటరీ సెంబన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లాయర్స్ వింగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.ఎన్. సుబ్రమణ్యం నేతత్వంలో పార్టీ మాజీ కొలత్తూర్ యూనియన్ అధ్యక్షుడు ఇలాంగో, జమీన్ ఉతుకులి పేరూర్ కార్యదర్శి ధర్మరాజ్, పేరూర్ ఉపాధ్యక్షుడు అరుణ్రాజ్, వార్డు కార్యదర్శులు ప్రదీప్, ప్రభు, కొంగునాడు పీపుల్స్ నేషనల్ పార్టీ సేలం నగర మహిళా బృందం ఆర్గనైజర్ సుమతి, పార్టీ కొలత్తూర్ యూనియన్ విద్యార్థి సంఘం కార్యదర్శి గౌరి, ఔన్జిసి కావేరి ప్రాపర్టీ పెట్రోలియం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లారెన్స్, కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు జి. ప్రభాకరన్, కోశాధికారి డి.ప్రభాకరన్, ఉప కార్యదర్శులు ఉమాపతి, నవమణి, శరవణన్, సంయుక్త కార్యదర్శులు సత్యరాజ్, ఇంద్రజిత్, ఇయలరసన్, విజయన్, ప్రతాప్, 400 మందికి పైగా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి సమక్షంలో ఏఐఎడీఎంకేలో చేరారు. సేలం సబర్బన్ జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, జనరల్ సెక్రటరీ ఎడపాడి పళనిస్వామి కొత్తగా చేరిన సభ్యులకు అన్నాడీఎంకె రిబ్బన్లు ధరించి స్వాగతం పలికి అభినందించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
హిట్ కాంబో రిపీట్ !
తమిళసినిమా: మహారాజా చిత్రం నటుడు విజయ్సేతుపతి కెరీర్లోనే చాలా ప్రత్యేకం. కారణం ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించడం అదేవిధంగా 50వ చిత్రం కావడం, అంతకంటే కూడా ఇది విదేశాల్లో కూడా మంచి వసూళ్లు సాధించడం. ఈ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకుడు. 2024 జూన్ 12వ తేదీన విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. కాగా ఆ తర్వాత దర్శకుడు నితిలన్ మరో చిత్రం చేయకపోవడం విశేషం. నయనతార ప్రధాన పాత్రలో ఒక చిత్రం చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అదేవిధంగా అజిత్ హీరోగా చిత్రం చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. మళ్లీ విజయ్సేతుపతి కథానాయకుడిగా చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం విజయ్సేతుపతి టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆయన నితిలన్ దర్శకత్వలో నటించడానికి సమ్మతించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. -
ఉచిత బస్సు ప్రారంభం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నియోజకవర్గంలోని అన్నామలైచ్చేరి మత్స్యకార గ్రామాలకు ఉచిత బస్సు సదుపాయాన్ని స్థానిక ఎమ్మేల్యే దురైచంద్రశేఖర్, జిల్లా కన్వీనర్ రమేష్రాజ్ ప్రారంబించారు. పొన్నేరి నియోజకవర్గంలోని అన్నామలైచ్చేరితోపాటు 30 గ్రామాలు విద్య, వైద్యం, ఉపాధితో పాటు ఇతర వాటి కోసం 30 కిమీ ప్రయాణం చేయాల్సి వుంది. ఈక్రమంలోనే తమ గ్రామాలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరారు. వీరి వినతిని పరిష్కరించిన ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన బస్సును ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. జిల్లా మాజీ ప్రతినిఽధి వల్లూరు తమిళరసన్, పొన్నేరి చేర్పర్సన్ పరిమళం, డీఎంకే కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదారులు, రోడ్ల విస్తరణలో దూసుకెళ్తోందని సీఎం స్టాలిన్ అన్నారు. ఈ మేరకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.
సాక్షి, చైన్నె: దేశంలోనే హైవేల రంగంలో అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడు కొత్త చరిత్ర సృష్టిస్తున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల డీఎంకే ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ఆదివారం సీఎం స్టాలిన్ ఆదేశాలతో ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. అందులో.. శ్ఙ్రీఒక దేశ ఆర్థికాభివృద్ధికి రోడ్డు సౌకర్యాలు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో కలైంజ్ఞర్ కరుణానిధి రహదారులను మెరుగు పరచడంలో గతంలో దృష్టి పెట్టారు. రహదారుల శాఖ నేతృత్వంలో తమిళనాడు హైవే రంగంలో అత్యుత్తమంగా మారింది. 2021 తర్వాత రోడ్ల అభివృద్ధి మీద మరింత ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రహదారుల అభివృద్ది ప్రాజెక్టుకు రూ. రూ. 3,858 కోట్ల అంచనా వ్యయంతో 448 కి.మీ., రూ. 2,207 కోట్ల వ్యయంతో 1,681 కి.మీ పొడవున్న టూ వే, ఫోర్ వేలను అభివృద్ధి పరిచారు. రూ. 2,807 కోట్ల అంచనా వ్యయంతో 383 కి.మీ. పొడవైన నాలుగు లేన్ల రహదారి పనులు, రూ. 709 కోట్ల అంచనా వ్యయంతో 357 కి.మీ. పొడవైన టూ వే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రూ. 17,154 కోట్ల అంచనా వ్యయంతో 9,620 కి.మీ. రోడ్డు పనులు, 996 చిన్న పెద్ద వంతెనలను రూ 1,161 కోట్లుతో పూర్తి చేశారు. 164 కి.మీ. దూరం రూ. 731 కోట్లతో పట్టణాలలో రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ. 2,074 కోట్ల అంచనా వ్యయంతో 6,805 కి.మీ. దూరం మట్టి రోడ్డులు తారు రోడ్డులుగా మారాయి. రూ. 662 కోట్ల అంచనా వ్యయంతో 1,652 రోడ్డు భద్రతా పనులు పూర్తి చేశారుశ్రీశ్రీ అని పేర్కొన్నారు. ఇతర ముఖ్యమైన పనులు ● మన్నచనల్లూర్ – ఇలుపూర్ మధ్య రూ. రూ. 307.8 కోట్లు, పార్థిబనూర్, రాసిపురం,తిరుతురైపూండి – భవానీ మధ్య పేజ ఒన్ పనులు, ముదుగలత్తూర్, తిరుత్తణి, కూనూర్ నమక్కల్ తదితర పది బైపాస్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈరోడ్ జిల్లాలోని విల్లరసంపట్టిలో రూ. 20.85 కోట్ల వ్యయంతో తిండాల్ జంక్షన్ నుండి కనీరావుత్తరం కులం వరకు , జవాన్స్ భవన్ – పసుమలై లింక్ రోడ్డు రోడ్డు రూ. 1.97 కోట్లుతో అమల్లోకి తెచ్చారు. 5,064.53 కి.మీ పొడవున్న పంచాయతీ, రోడ్లు రూ. 4,907.17 కోట్లతో పంచాయతీ యూనియన్ రోడ్లను, జిల్లా ఇతర రోడ్లుగా అప్గ్రేడ్ చే శారు. అంతర్జాతీయ ఆర్థిక సహాయంతో రూ. 1,330.70 కోట్లతో చైన్నె–కన్యాకుమారి, రూ.240.06 కోట్లతో నక్కసలేం – కురుంబలూరు బైపాస్, రూ. 349 కోట్లతో తురైయూర్ పెరంబలూర్ రోడ్డు, మోహనూర్ రోడ్డు, రూ. 251 కోట్లతో నామక్కల్ – సేంతమంగళం రాశిపురం రోడ్డు, రూ.251.29 కోట్లతో విరుదాచలం– ఉలుందూర్ పేట, రూ. 238.90 కోట్లతో తంజావూరు – మన్నార్గుడి రోడ్డు, రూ. 250.51 కోట్లతో తిరుపత్తూరు రోడ్డుతో సహా 5 రోడ్డు పనులు పూర్తి చేశారు. చైన్నెలోని తిరువొత్తియూర్లో రూ. 58.64 కోట్లు పొన్నేరి–పంచెట్టి రోడ్డులో బకింగ్హామ్ కాలువ మీదుగా హై–లెవల్ వంతెన, కాంచీపురం జిల్లా ఉతిరమేరూరులో రూ. 21.56 కోట్లతో సెయ్యారి నది పై వంతెన అంటూ అనేక వంతెనల నిర్మానాలు పూర్తి చేశారు. రూ. 59 కోట్లతో చైన్నె–పొన్నెరికరై కాంచీపురం రహదారిపై రైల్వే ఫ్లైఓవర్, రూ. 37.12 కోట్లతో ఊరపాక్కం సమీపంలోని వండలూర్ – గూడువాంజేరి రైల్వే వంతెన వంటి మరెన్నో పనులు పూర్తి చేశారు. కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టులు.. ● కోయంబత్తూరు వెస్ట్రన్ రింగ్ రోడ్, మన్నర్గుడి ఫేజ్–1, అంబసముద్రం, తిరుచెంగోడ్ , భవానీ ఫేజ్– 1, నామక్కల్, పొల్లాచి వెస్ట్రన్ బైపాస్, అరుప్పుకోట్టై వెస్ట్రన్ బైపాస్, కౌముది శివగంగై ఫేజ్ –1, ఉత్తిర మేరూర్ , తురయూరు , తాంబరం ఈస్ట్ బైపాస్, తిరుపోరూర్, కేలంబాక్కం ప్రాంతాల్లో బైపాస్ రోడ్ల నిర్మాణ పనులుజరుగుతున్నాయి. రూ. 944.21 కోట్లతో పంచాయతీ యూనిట్ల పరిధిలోని 812.8 కి.మీ దూరం రోడ్లను అప్ గ్రేడ్ చేస్తున్నారు. రూ. 331 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ● అభివృద్ధి ప్రణాళిక కింద 373 రోడ్డు భద్రతా పనులు, ఇంటిగ్రేటెడ్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద 2,264 కి.మీ. రోడ్డు పనులు రూ. 8,076 కోట్ల అంచనా వ్యయంతో, రూ.694 కోట్ల విలువైన 69 వంతెనలు రూ.763.80 కోట్లతో 134 హై–లెవల్ వంతెనలుగా అప్గ్రేడ్ పనులు జరుగుతున్నాయి. నాబార్డ్ రుణ సహాయంతో రూ. 375.32 కోట్లతో 32 హై లెవల్ వంతెనలు, రూ. 596 కోట్లతో 19 ఉన్న స్థాయి వంతెనలు, రూ. 1791 కోట్లతో కోయంబత్తూరులో గోల్డ్వినన్స్, ఉప్పిలిపాళయం హై–లెవల్ రోడ్డు నిర్మాణం, రూ. 621 కోట్లతో చైన్నె తేనాం పేట, సైదా పేట మధ్య ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం. ● రూ. 190.40 కోట్ల అంచనా వ్యయంతో మధురైలోని గోరిపాలయం జంక్షన్ వద్ద రోడ్ ఫ్లైఓవర్, మధురైలోని మధురై–తోండి రహదారిపై రూ. 150.28 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు పనులతో పాటుగా రూ.2,105.49 కోట్ల అంచనా వ్యయంతో 41 రైల్వే ఫ్లైఓవర్లు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు రూ. 27.5 కోట్లతో చేపట్టారు. ● టైడల్ పార్క్ జంక్షన్ వద్ద యూ ఆకారం ఫ్లైఓవ ర్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పనులు రూ.590.51 కోట్లతో సర్దార్ పటేల్ రోడ్డు, రూ. 60.69 కోట్లతో రాజీవ్ గాంధీ రోడ్డు రోడ్డుతో కలిసే మధ్య కైలాష్ జంక్షన్ వద్ద పనులు జరుగుతున్నా యి. రూ. 45.50 కోట్లతో మొగలివాక్కం వరకు ఫ్లైఓవర్ నిర్మాణం ,మడిపాక్కం సమీపంలో వాహ న సబ్ వే నిర్మాణం, రూ. 30.67 కోట్లతో నెల్సన్ మాణిక్కం రోడ్ జంక్షన్ – సెంథిల్ నగర్ జంక్షన్ వద్ద 2 పాద చారుల వంతెన, ఇన్నర్ రింగ్ రోడ్డుపై రూ. 139.17 కోట్లతో రైల్వే వంతెన వంటి పనులకు చైన్నె మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాజెక్టు ద్వా రా జరుగుతున్నట్టు ఆ నివేదికలో వివరించారు. ● భారతదేశంలోనే తమిళనాడు రహదారులలో అత్యుత్తమ రాష్ట్రంగా కొత్త చరిత్ర సృష్టిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, పర్యాటక ప్రాంతం కన్యాకుమారిలో రహదారుల శాఖ నేతృత్వంలో వివేకానంద రాక్ – తిరువళ్లువర్ విగ్రహాన్ని అనుసంధానిస్తూ సముద్రంలో నిర్మించిన అద్దాల వంతెన ప్రత్యేకతను చాటుకుంటున్నట్టు వివరించారు. ఇక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలే కాదు, రహదారుల పర్యవేక్షణ, నిర్మాణ పనుల నిమిత్తం 84 అసిస్టెంట్ ఇంజనీర్లు, 416 జూనియర్ ఆఫీసర్లు, 182 అసిస్టెంట్స్, 3 ఆడిటర్అసిస్టెంట్స్ , 67 జూనియర్ అసిస్టెంట్స్, అంటూ 919 మందిని నియమించినట్టు వివరించారు. సీఎం స్టాలిన్తో ఇంజినీర్లు రహదారులలో..అత్యుత్తమం రాష్ట్ర నాలుగేళ్ల ప్రగతి నివేదిక విడుదల రూ. 17,154 కోట్లతో 9,620 కి.మీ దూరం పనులు రూ. 6,065 కోట్లతో గ్రామీణ రోడ్ల అభివృద్ధి సీఎం స్టాలిన్ వెల్లడి -
రోబోటిక్ సర్జరీతో కీళ్ల సంరక్షణ
సాక్షి, చైన్నె: రోబోటిక్ విధానంతో మోకాలి సర్జరీతో కీళ్ల సంరక్షణలో కొత్త శకానికి సీటీఎస్ స్పెషాలిటీ ఆస్పత్రి నాంది పలికింది. చైన్నె అన్నానగర్లో ఆదివారం ఆర్టోపెడిక్ కేర్లో పేరుగడించిన సీటీఎస్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోబోట్ సాయంతో మొకాలి మార్పిడి విధానాలను ప్రవేశ పెట్టారు. ఈ సేవలను స్థానిక ఎమ్మెల్యే మోహన్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ సెల్వం ఈ రోబోటిక్ సేవలను గురించి వివరించారు.సీటీఎస్ స్పెషాలిటీలో అధునాతన ఆర్టోపెడిక్ కేర్కు 35 పడకల సౌకర్యం కల్పించినట్టు వివరించారు. క్లినికల్, సర్జిక ల్, కీళ్ల మార్పిడి, సంక్లిష్టమైన ఆర్టోపెడిక్ విధానా లను, ఆర్ర్థోస్కోపి, ట్రామా కేర్, స్పోర్ట్స్ గాయా లు వంటి అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చికిత్స విధానాలను అందించనున్నామని వివరించారు. రోబోట్ సహాయ సాంకేతికతతో త్వరితగతిన రోగి కోలుకునే దిశగా సర్జరీలకు ప్రత్యేక, అత్యాధునిక వైద్య సేవలను అందించనున్నామన్నారు. -
రవిమోహన్ @23
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన స్టార్ నటుడు రవి మోహన్. జయం చిత్రంతో కథానాయకుడిగా ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న నటుడు ఈయ న. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపో తూ అగ్రకథానాయకుల్లో ఒకరిగా రాణిస్తున్న రవిమోహన్ ఇటీవల వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వాటిని నటుడిగా తన కెరీర్కు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈయనకు ప్రస్తుతం ఒక భారీ విజయం చాలా అవసరం. అందుకోసం దర్శకుడిగా, నిర్మాత గా కూడా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈయన గణేష్ కె బాబు దర్శకత్వంలో కరాటే బాబు అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు అదేవిధంగా సుధాకొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడుగా నటిస్తున్న పరాశక్తి చిత్రంలో ప్రతినాయకుడిగా వైవిధ్యభరిత పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్ యోగి దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈచిత్రాన్ని ఈయనే నిర్మించనుండ డం విశేషం. దీనికి బ్రోకోడ్ అనే టైటిల్ నిర్ణయించా రు. రవిమోహన్ కథానాయకుడిగా పరిచయమైన జయం చిత్రం విడుదలై 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఇన్స్ట్రాగామ్లో భగవంతుడికి కృతజ్ఞతలు అని పోస్ట్ పెట్టారు. ఈయన పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రవిమోహన్ కథానాయకుడిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పలువురు హితులు, సన్నిహితులకు మంచి పార్టీని ఇచ్చినట్లు సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 76,181 మంది స్వామివారిని దర్శించుకోగా 33,874 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. శ్రీవారి సేవలో ప్రముఖులు తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సినీనటి దివి, సినీనటి విద్యాబాలన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
పల్లిపాళయం వద్ద దుండగుల దుశ్చర్య
● ఒకే రైతుకు చెందిన చెరుకుతోటకు 4 సార్లు నిప్పు తిరువొత్తియూరు: నామక్కల్ జిల్లా, పల్లిపాలయం సమీపంలోని మొలాసి మునియప్ప పాలయంకు చెందిన రైతు తంగవేల్ (70) ఆరు ఎకరాల్లో చెరుకు నాటారు. ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో చెరకు సాగు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి, 8.00 గంటల సమయంలో తంగవేల్ చెరకు తోటకు అకస్మాత్తుగా నిప్పు అంటుకొని మంటలు చెలరేగాయి. దీని తరువాత, ఆ ప్రాంతంలోని చాలా మంది రైతులు గుమిగూడి నీరు పోసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత, రాత్రి 10 గంటల ప్రాంతంలో తంగవేల్ చెరకు తోటలో మరోసారి మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో 3 వ సారి మంటల్లో చిక్కుకుంది. షాక్కు గురైన ఆ ప్రాంతంలోని రైతులు మళ్లీ గుమిగూడి మంటలను ఆర్పారు. తంగవేల్ తోట దగ్గర చాలా చెరుకు తోటలు ఉన్నప్పటికీ. ఒకే రాత్రిలో 3 సార్లు తంగవేల్ అనే రైతుకు చెందిన చెరుకు తోటలోని అనేక మూలల్లో మంటలు చెలరేగాయి. ఇది రైతులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడుసార్లు మంటల్లో చిక్కుకుని దాదాపు 2.5 ఎకరాల్లో పండించిన రూ.5 లక్షల విలువైన చెరుకును నాశనం అయినట్టు తెలిసింది . దీనిపై ఎస్పీ రాజేష్ కన్నన్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో 4వ సారి కూడా తంగవేలు చెరుకు తోటకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో భద్రత కోసం ఆ ప్రాంతంలో పోలీసులను మోహరించారు. దర్యాప్తు కొనసాగుతోంది. సిరులతల్లి సేవలో సినీనటి చంద్రగిరి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సినీనటి విద్యాబాలన్ శనివారం సేవించుకున్నారు. ఆలయం వద్ద ఆమెకు అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఘనంగా అక్కమ్మ దేవత తిరునాళ్లు గుడిపాల: మండలంలోని రామభద్రాపురం గ్రామంలో ఉన్న గ్రామదేవత అక్కమ్మ దేవత తిరునాళ్లు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకం నిర్వహించి, విరుపాక్షమ్మ దగ్గర పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించి మేళతాళాలు మధ్య, బాణసంచావేడుకలతో వైభవంగా ఉత్సవమూర్తులు అమ్మవారి గెరిగలను జోడించి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోళ్ల హరిప్రసాద్, గ్రామస్తులు సురేంద్రబాబు, అమరేంద్రబాబు, వరదరాజులు, సురేంద్రనాయుడు, శ్రీధర్, ధనంజయ, గోవర్ధన్, వినాయక, నరసింహ, మనుమంతనాయుడు, సందీప్, చరణ్ పాల్గొన్నారు. -
108 ఆసనాలతో ప్రత్యేక ప్రతిభవంతుల ప్రపంచ రికార్డు
తెలుగు లోగిళ్లలో యోగా సంబరాలు తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సుమారు వంద మంది ప్రత్యేక ప్రతిభావంతులు 108 యోగాసనాలను ప్రదర్శించి నోవా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించారు. దివ్యాంగులు, బధిరులకు యోగాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని ప్రోత్సహించాలని హ్యాపీ యోగా హెల్త్కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సెంథిల్కుమార్, గీత ప్రయత్నించారు. ఇందులో భాగంగానే దివ్యాంగులు, బధిరులు సుమారు వంద మందిని ఎంపిక చేసి, వారికి మూడు రోజులపాటు యోగాలోని 108 ఆసనాలు వేయడంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయిన నేపథ్యంలో మనవాలనగర్లోని ప్రైవేటు మండపంలో నోవా ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించడానికి ఆసనాలను ప్రదర్శించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక ప్రతిభావంతులు 108 ఆసనాలను ప్రదర్శించి నోవా ప్రపంచ రికార్డును సాధించారు. కాగా ప్రత్యేక ప్రతిభావంతులు చేసిన యోగాసనాలు అందరిని ఆకట్టుకున్నాయి. కరూరులో 6వేల మందితో యోగా సేలం: కరూర్ భరణి పార్క్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ సాధారణ ప్రార్థన తిరుక్కురల్ పారాయణంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 6వేల మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి భరణి పార్క్ విద్యాకమిటీ అధ్యక్షుడు ఎస్.మోహనరంగన్ అధ్యక్షత వహించారు. కార్యదర్శి పద్మావతి మోహనరంగన్, ట్రస్టీ సుభాషిణి అశోక్శంకర్ పాల్గొన్నారు. భరణి పార్క్ ఎడ్యుకేషనల్ గ్రూప్ ప్రిన్సిపల్ డాక్టర్ సి. రామసుబ్రమణియన్ మాట్లాడుతూ ‘అందరికీ ప్రయోజనకరమైన యోగా కళ, మన మాతృభూమి ఈ ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అన్నారు. భరణి పార్క్ ఎడ్యుకేషనల్ గ్రూప్ నుంచి 6 వేల మంది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. యోగా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి వేలూరు: యోగా శిక్షణను విద్యార్థులతోపాటు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీపురం బంగారుగుడి నారాయణి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణి మండపంలో యోగా శిక్షణను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులు, సిబ్బందితో కలిసి యోగాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమతి ద్వారా జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా గత 2015వ సంవత్సరంలో ప్రకటించడం జరిగిందన్నారు. ఈ యోగాను మన సిద్దర్ గత ఐదు వేల సంవత్సరాల క్రితమే చేశారన్నారు. ప్రపంచంలోని ప్రజలు తెలుసుకునేలా ఈ యోగా ప్రాధాన్యతను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇది ఒక రోజు శిక్షణ కాదని, ప్రతి రోజూ దీన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, నారాయణి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే వేలూరు నేతాజీ మైదానంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ మదివాణన్ ప్రారంభించారు. వీఐటీ యూనివర్సిటీలో.. వేలూరు వీఐటీ యూనివర్సిటీలో యోగా శిక్షణను జైళ్లశాఖ డైరెక్టర్ ప్రదీప్ ప్రారంభించారు. వీఐటీ క్రీడా మైదానంలో జరిగిన ఈ యోగా శిక్షణలో వీఐటీలోని విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని, శిక్షణ పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరకంగా, మానసిక రుగ్మతలను పారద్రోలి సర్వరోగి నివారణిగా యోగా దోహద పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ వైస్ చాన్సలర్ కాంచన, ఫ్రో చాన్సలర్ పార్థసారథి మల్లిక్, పిజికల్ పిట్నెస్ డైరెక్టర్ మంగయకరసి, అరుణ్ పాల్గొన్నారు.కొరుక్కుపేట: చైన్నెలోని తెలుగు లోగిళ్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా, ధ్యానం ప్రాముఖ్యతను వివరిస్తూ మరోవైపు యోగా విన్యాసాలతో అబ్బుర పరిచారు. ఎస్కేపీడీ విద్యాసంస్థల్లో.. ఎస్కేపీడీ చారిటీస్ నిర్వహణలో కొనసాగుతున్న ఎంవీఎం సీనియర్ సెకండరీ స్కూల్ – చూలైలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్ టీవీ రామకుమార్, ప్రిన్సిపల్ పి.సుబ్రహ్మణ్యం నేతృత్వంలో యోగ దినోత్సవం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు యోగాసనాలతో అబ్బుర పరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతోపాటు సమగ్ర అభివృద్ధికి పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందన్నారు. యోగా పాఠశాల పాఠ్యాంశాల్లో అంతర్భాగం అని, విద్యార్థులలో మానసిక, శారీరక సమతుల్యతను ప్రోత్సహిస్తుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు, విద్యార్థులు వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సెషన్లలో పాల్గొని, ఐక్యత, శ్రేయస్సును పెంపొందించారని కొనియాడారు. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడంతో విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ, ఏకాగ్రత, సృజనాత్మకత అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజర్ శ్రీలత పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరుచువల్ సొసైటీ మూమెంట్స్ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా పిరమిడ్ స్పిరుచువల్ సొసైటీ మూమెంట్స్, మహర్షి విద్యామందిర్ తిరువొత్తియూర్ సంయుక్త ఆధ్వర్యంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. వక్తలుగా చైన్నె పిరమిడ్ స్పిరుచువల్ సొసైటీ సెక్రటరీ అమరా చంద్రశేఖర్తో పాటు చంద్రకళ, వందన మాట్లాడుతూ యోగా, ధ్యానంతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే మెదడులో నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేస్తాయన్నారు. దీంతో పిల్లలకు జ్ఞాపకశక్తి, ఉన్నత లక్ష్యాలు కలిగి సరైన పద్ధతితో జీవన విధానం కలుగుతాయని చెప్పారు. యోగా, ధ్యానంతో ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హర్షిణి, భాగ్యం, నర్మదా తదితరులు పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గ తెలుగు పాఠశాలలో : చైన్నె విల్లివాక్కంలోని శ్రీ కనకదుర్గ తెలుగు మహోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా ఏఐటీఎఫ్ అధ్యక్షులు, పాఠశాల నిర్వాహకులు ఆచార్య సీఎంకేరెడ్డి, గౌరవ అతిథిగా ఎస్కేడీటీ మహోన్నత పాఠశాల కస్పాండెంట్ డాక్టర్ సీఎం కిషోర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శారాసుహాసిని స్వాగతోపన్యాసం చేయగా, సహాయ ప్రధానోపాధ్యాయులు అళగరాజ్ వందన సమర్పణ చేశారు. ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్ నందగోపాల్. పాఠశాల కోశాధికారి ఎన్ నరసింహులు, నమో గాడ్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ ఎన్.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
అడుగంటిన స్వర్ణముఖి బ్యారేజ్
వాకాడు : స్వర్ణముఖి బ్యారేజ్లో నీరు అడుగంటింది. సాధారణంగా ప్రభుత్వం ఏటా ఏప్రిల్, మే నెలల్లో 200 క్యూసెక్కుల తెలుగుగంగ నీటిని విడుదల చేసేది. తద్వారా రైతులు పొలం పనులు ప్రారంభించేవారు. ఈ ఏడాది ఆ ఊసే లేకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు.వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నీటి ఆధారంగా 11 చెరువులు ఉన్నాయి. అలాగే పులి కాలువ, రొయ్యల కాలువ, చల్లాకాలువ, వాగులు, వంకలు, పిల్ల కాలువలు కలిపి 16 వరకు ఉన్నాయి. వీటి ఆధారంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన 2,600 మంది రైతులు దాదాపు 20 వేల ఎకరాల్లో పంటలు సాగుచేసుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈ సారి బ్యారేజ్కి గంగ నీటిని విడుదల చేస్తారన్న నమ్మకంతో రైతులు చెరువులు, బోర్ల ద్వారా వచ్చే అరకొర నీటి ఆధారంగా పూర్తి స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం బ్యారేజ్తోపాటు దాని ఆధారిత జలాశయాలు ఎండిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు బ్యారేజ్ ఆధారంగా 1,850 తాగునీటి బోర్లు వున్నాయి. వాటి ద్వారా ప్రజలకు వేసవిలోనూ నీరు సమృద్ధిగా సరఫరా చేసేవారు. ప్రస్తుతం బ్యారేజ్లో నీరు అడుగంటింది. ఎడారుని తలపిస్తోంది. ఎడగారు రైతులకు ఎండమావిని మిగిల్చింది. బోర్లలోనూ నీరు తక్కువగా వస్తుండడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కొందరు రైతులు బోర్ల ఆధారంగా పంటలు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భూ గర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు పనిచేయడం లేదు. పస్తుతం మూడు మండలాల్లో మూడు పంటలు కాదు కదా.. ఒక్క పంట కూడా పండించలేని పరిస్థితి దాపురించింది. పాలకులు స్పందించి తెలుగు గంగ జలాలను విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. -
క్లుప్తంగా
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య సాక్షి, చైన్నె : పెరంబూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. విల్లుపురం జిల్లా ఉలందూరు పేటకు చెందిన అళగేషన్ కుమార్తె సుమతి(30) 2017సంవత్సరంలో తమిళనాడు పోలీసు శాఖలో చేరారు. తొలుత పులియాంతోపు ట్రాఫిక్ విభాగంలో పనిచేయగా 2023లో పెరంబూరు స్టేషన్కు బదిలీ అయ్యారు. సెంబియం పోలీసు క్వార్టర్స్లో ఉన్న సుమతిని తరచూ సహచర కానిస్టేబుల్ జయలక్ష్మి కలుస్తుండేవారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం జయలక్ష్మి దుస్తులు ఆర వేయడానికి డాబా పైకి వెళ్లింది. పది గంటల సమయంలో డాబా మీదకు వెళ్లిన ఆమె తిరిగి గదిలోకి వచ్చి చూడగా సుమతి ప్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతుండటాన్ని చూసి, ఆమెను రక్షించే ప్రయత్నం చేసింది. క్వార్టర్స్లో ఉన్న వాళ్లు ఆమె అరుపులకు పరుగులు తీశారు. సుమతిని రక్షించే ప్రయత్నం చేశారు. రెట్టేరిలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. సెంబియం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మోసం కేసులో ముగ్గురి అరెస్టు తిరువళ్లూరు: స్వచ్ఛంద సంస్థ పేరుతో రూ.1.25 కోట్లు మోసం చేసి, నాలుగేళ్లుగా పరారీలో ఉన్న మహిళతోసహా ముగ్గురిని పోలీసులు ఊటీలో అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా దిమ్మబూపాలపురం గ్రామంలో గీత(57) నివాసమున్నారు. అదే ప్రాంతానికి చెందిన రవిచంద్రన్(45), తేన్మెళి(37), తేన్మెళి భర్త సురేష్(48) ముగ్గురు కలసి గీత వద్దకు వెళ్లి తాము స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు నమ్మించారు. అనంతరం గత 2021వ సంవత్సరంలో రూ.3.50 లక్షలు అప్పుగా తీసుకున్న తేన్మెళి తరచూ గీత వద్దకు వెళ్లి అప్పుగా భారీ మొత్తాన్ని తీసుకున్నారు. తరువాత తమకు పెద్ద ప్రాజెక్టు వచ్చిందని, పనులు చేస్తే భారీగా లాభం వస్తుందని వచ్చే లాభంలో వాటా ఇస్తామని నమ్మించి ముగ్గురు కలిసి గీత వద్ద రూ.1.25 కోట్లు నగదు, బంగారు నగలను తీసుకుని ఉడాయించారు. తన వద్ద తీసుకున్న నగదు, బంగారు నగలను తిరిగి చెల్లించాలని పలు సార్లు కోరినా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్ల కిందట బాధితురాలు గీత తాను మోసపోయానని భావించి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించగా వారు పరారయ్యారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవాలని ఎస్పీ ఆదేశించిన క్రమంలో ప్రత్యేక టీమ్ నిందితులు ఊటీలో ఉన్నట్టు గుర్తించి, వారిని అరెస్టు చేశారు. భార్యపై కిరోసిన్ పోసి నిప్పటించాడు! అన్నానగర్: ఓ వృద్ధుడు తన భార్యపై కిరోసిన్ పోసి, నిప్పంటించి, సజీవ దహనం చేశాడు. విరుదునగర్ జిల్లా కరియాపట్టిలోని చెట్టియార్ వీధి నివాసి నాగేంద్రన్ (60), కస్తూరి(52) దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లద్దరూ వివాహితులు కావడంతో విదేశాల్లో నివసిస్తున్నారు. నాగేంద్రన్, అతని భార్య అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. శనివారం తెల్లవారుజామున ఎప్పటిలాగే ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో ఆగ్రహించిన నాగేంద్రన్, కస్తూరిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె పరుగున వెళ్లి నాగేంద్రన్ను పట్టుకుంది. దీంతో నొప్పి భరించలేక పైనుంచి దూకాడు. ఈ ఘటనలో కస్తూరి అక్కడికక్కడే మరణించింది. గాయపడిన నాగేంద్రన్ను పోలీసులు విరుదునగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోసంరక్షణ ట్రస్టుకు విరాళం కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు శనివారం హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ 2,300 డాలర్లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఈవో పెంచలకిషోర్కు ఆ నగదును అందజేయగా.. ఆయన దాత కుంటుంబానికి ప్రత్యేక దర్శనభాగ్యం కల్పించారు. -
డిజ్జీ వరల్డ్ ఇన్స్టా రీల్స్ విజేతలకు బహుమతులు
సాక్షి,చైన్నె : వేసవి సందర్భంగా ఎంజీఎం డిజ్జీ వరల్డ్ నేతృత్వంలో సోషల్ మీడియా బ్లాక్ బస్టర్గా ఇన్స్ట్రాగామ్ రీల్స్ పోటీలను నిర్వహించారు. 500 మందికి పైగా ఔత్సాహికులు 90 సెకన్లతో ప్రత్యేక ఆకర్షణతో కూడిన రీల్స్ను ఏప్రిల్ 11 నుంచి మే 31 వరకు పంపించారు. రోలర్ కోస్టర్ క్షణాలను ఇన్ స్ట్రాగామ్ రీల్స్గా మార్చారు. తమలోని సృజనాత్మకను చాటుకున్నారు. ఈ రీల్స్ అన్నింటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీని డిజ్జీ వరల్డ్ నియమించింది. న్యాయ నిర్ణేతల కమిటీ చివరకు 10 మందిని ఎంపిక చేశారు. వీరిలో తొలి బహుమతిగా మరియం అన్సారికి రూ.2 లక్షలు, రెండో బహుమతిగా సరస్వతికి రూ.లక్ష, మూడో బహుమతిగా శరవణకుమార్కు రూ. 60 వేలు అందజేశారు. మిగిలిన ఏడుగురికి కన్సోలేషన్ బహుమతిగా తలా రూ. 20 వేలు చొప్పన అందజేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఎంజీఎం డిజ్జీ వరల్డ్ ఏజీఎం కృష్ణమూర్తి, ఎంజీఎం హోటల్స్ ఉపాధ్యక్షుడు దీరజ్కుమార్, డిజ్జీ వరల్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్ సెంథిల్, బీచ్ రిసార్ట్ జీఎం మురళీ ధర వెంకటరామన్ బహమతులకు గాను చెక్కులను అందజేసి సత్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
– ఇద్దరికి గాయాలు తిరువొత్తియూరు: శివగంగ జిల్లా దేవకోట్టైకి చెందిన కృష్ణన్, అతని భార్య అయోతి అమ్మాళ్. ఈ దంపతులకు కుమార్తె కలైచ్సెల్వి, కుమారుడు వెంకటేశన్ ఉన్నారు. వెంకటేశన్కు కలైయార్ ఆలయానికి సమీపం వాలైపెరుమల్ గ్రామానికి చెందిన ముత్తు కృష్ణన్ కుమార్తె సంగీతతో వివాహం జరిగింది. గర్భవతి అయిన సంగీత తన తండ్రి ఇంటికి వచ్చి ఉంది. ఈ క్రమంలో కోడలు ఆమె అత్తగారు అయోతి అమ్మాళ్, సంగీత ఆడ బిడ్డ కలైసెల్వి దేవకోట్టై నుంచి వాలైపెరుమల్ గ్రామానికి వెళ్లారు. వెల్లారండల్ బస్టాప్ వద్ద నుంచి ముత్తుకృష్ణన్కు ఫోన్ చేశారు. దీంతో ముత్తు కృష్ణన్ అక్కడికి మెప్పేడులో వెళ్లి వారిద్దరినీఎక్కించు బయలుదేరారు. కలైయార్ ఆలయం వద్ద వస్తున్న సమయంలో గూడ్స్ వాహనం ముత్తు కృష్ణన్ బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తుకృష్ణన్, అయోతియమ్మాళ్ అదేచోట మృతి చెందారు. కలైసెల్వి గూడ్స్ వాహనం డ్రైవర్ శంకర్ గాయాలతో శివగంగ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరారు.కలైయార్కోవిల్ ఇన్స్పెక్టర్ శరవణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక సందేశం తిరుప్పూర్లోని రామ్ రాజ్ కాటన్ పరిశ్రమలో ఉద్యోగ, సిబ్బందికి యోగా డే సందర్భంగా మనస్తత్వ శాస్త్ర నిపుణుల ద్వారా ప్రత్యేక ప్రసంగం అందించారు. యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాలు, దైనందిన జీవితంలో అభ్యాసాలను గురించి, సమస్యల పరిష్కారానికి అవకాశాలను సందేశం రూపంలో తెలియజేశారు. – సాక్షి, చైన్నె -
రెడ్క్రాస్ కార్యదర్శికి అభినందన
వేలూరు: లండన్లోని బ్రిటీష్ రెడ్క్రాస్ సంఘం కార్యాలయానికి వెళ్లి, అక్కడి సంఘం సేవలపై అవగాహన పెంచుకుని, తిరిగి వచ్చిన వేలూరు జిల్లా కాట్పాడి జూనియర్ రెడ్క్రాస్ కార్యదర్శి జనార్దనన్ను సబ్ కలెక్టర్ సెంథిల్కుమార్ అభినందించారు. లండన్లోని రెడ్క్రాస్ సంఘం అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ను కలిసి బ్రిటిష్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రానున్న 2030వ సంవత్సరంలోపు చేయనున్న పనులు, సేవా కార్యక్రమాలు, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వాటిపై అవగాహన పెంచుకోవడంతోపాటు అక్కడి ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుని వచ్చిన జనార్దనన్ వేలూరులోని సబ్ కలెక్టర్ను కలిశారు. అనంతరం లండన్ దేశంలో చేస్తున్న సేవా కార్యకమాల గురించి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వేలూరు బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ శివన్, రెడ్క్రాస్ సభ్యులు రమేష్కుమార్ జైన్, తదితరులు ఉన్నారు. -
అబివృద్ధి పనులను వేగవంతం చేయండి
తిరువళ్లూరు: జిల్లాలోని ఎల్లాపురం యూనియన్లో జరుగుతున్న వేర్వేరు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతాప్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్లోని కన్నిగాపురం, ఊత్తుకోట, పాలవాక్కం, గురువాయల్, తిరుకండలంతో సహా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కలైంజర్ పక్కాగృహాలు, అన్నా పునఃజీవనం పథకం కింద జరుగుతున్న సిమెంట్ రోడ్డు, తారురోడ్డు నిర్మాణం, అంగన్వాడీ భవన నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఊత్తుకోటలో రూ.22 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, చీఫ్ ఇంజినీర్ శరవణన్, ఊత్తుకోట మేజర్ పంచాయతీ కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పనులను పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్ పొన్నయ్య అధికారులను ఆదేశించారు. రాణిపేట జిల్లా ఆర్కాడు యూనియన్ పరిధిలోని నంద్యాలం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ చంద్రకళ అధ్యక్షతన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న పాఠశాల నిర్మాణ పనులు, ప్రభుత్వ కార్యాలయ నిర్మాణ పనుల్లో నాణ్యత ఉందా? అనే విషయాలను పరిశీలించారు. అనంతరం కూలీల వద్ద సక్రమంగా కూలీలు అందజేస్తున్నారా? అని కూలీలను అడిగారు. అనంతరం అరపాక్కం గ్రామ పంచాయతీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, అనంతరం అన్నామరుమలర్చి పథకం కింద రూ.17.25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు తదితర వాటిని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇల్లు నిర్మాణ పనులను తనిఖీ చేశారు. -
‘మాయాకూత్తు’ ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల
తమిళసినిమా: రాహుల్ మూవీ మేకర్స్ రాహుల్ దేవా, అభినయ క్రియేషనన్స్ ప్రసాద్ రామచంద్రన్ కలిసి భారీ బడ్జెట్లో నిర్మించిన చిత్రం మాయాకూత్తు. ఈ చిత్రం ద్వారా ఏఆర్.రాఘవేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బ్రహ్మ శిష్యుడు అన్నది గమనార్హం. అలాగే గత పదేళ్లుగా పలు షార్ట్ ఫిలిమ్స్ రూపొందించడంతోపాటు ఉడన్పాల్ చిత్రానికి కథా రచయిత ఈయనే అన్నది గమనార్హం. కాగా ఆ అనుభవంతో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నటుడు ఢిల్లీగణేష్, ఎం.రామస్వామి, సాయి దీనా, నాగరాజన్ ప్రధాన పాత్రలు పోషించిన ఇందులో ప్రగదీశ్వరన్, మురుగన్, ఐశ్వర్య, గాయత్రి, రేఖ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సుందర్ రామకృష్ణన్ చాయాగ్రహణం, అంజనా రాజగోపాలన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు పేర్కొంటూ ఇది వైవిధ్య భరితమైన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు మంచి థియేటర్ ఎక్స్ పీరియనన్స్ ఇస్తుందన్న నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఐటమ్ సాంగ్స్కు సై అన్న మరో నాయకి
తమిళసినిమా: ప్రముఖ కథానాయకులు ఐటమ్ సాంగ్స్కు సై అనడం అనేది చాలా కాలం క్రితం మొదలైంది. రెండు మూడు రోజుల్లో నటిస్తే చాలు మంచి పారితోషికం తోపాటు పబ్లిసిటీ లభించడమే ఇందుకు కారణం. అలా ఐటమ్ సాంగ్స్తో బాగా పాపులర్ అయిన నటి తమన్న. ఈమె ఐటెం సాంగ్లో నటిస్తే అభిమానుల గుండె గుల్లే. నిర్మాతలకు, పంపిణీదారులకు గలాటా గలగలే. నటి సమంత, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇందుకు అతీతం కాదు. కాగా తాజాగా నటి గాయత్రి కూడా ఐటమ్ సాంగ్ బాట పట్టారు. బెంగళూరుకు చెందిన ఈ తమిళ భామ మలయాళం, తమిళ భాషల్లో కథానాయకిగా నటించి పాపులర్ అయ్యారు. 18 వయదు అనే చిత్రం ద్వారా కోలీవుడ్లో కథానాయకిగా పరిచయమైనా ఆ చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత విజయ్ సేతుపతికి జంటగా నటించిన నడుముల కొంచెం పక్కత్త కానోం చిత్రం అనుహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత గాయత్రికి తమిళంలో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలా పొన్మాలై పొళుదు, రమ్మీ, ఫురియాద పుదీర్, కాదలుమ్ కడందు పోగుమ్, ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్, సీతకాత్తి, సూపర్ డీలక్స్, మామనిధన్, విక్రమ్ తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఈమె తమిళంలో ఎక్కువగా విజయ్ సేతుపతికి జంటగా నటించడం విశేషం. మలయాళంలోనూ పరిసరాలు నటించిన గాయత్రికి ప్రస్తుతం అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. దీంతో ఈ అమ్మడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డట్టున్నారు. అందులో భాగంగానే ఐటమ్ సాంగ్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధర్వ కథానాయకుడిగా నటించిన డీఎన్ఏ చిత్రంలో ఐటెమ్ సాంగ్లో మెరిశారు. అందులో కాంగ్రెస్లో వచ్చే బార్ సాంగ్లో గాయత్రి అందాలు ఆరబోస్తూ నటించడం విశేషం. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి ఇప్పుడు ఐటెమ్ సాంగ్లో నటించడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కురక్రారు మాత్రం గాయత్రి శృంగార భరిత నటనను ఎంజాయ్ చేస్తున్నారు.నటి గాయత్రి -
గుడ్ డే ఆడియో ట్రైలర్
గుడ్ డే చిత్ర ఆడియోను ఆవిష్కరించిన రాజు మురుగన్, బాలాజీ ధోరణి ధరన్తో యూనిట్ సభ్యులు తమిళసినిమా: న్యూ మంక్ పిక్చర్స్ పతాకంపై పృద్వీరాజ్ రామలింగం నిర్మించి హీరోగా నటించిన చిత్రం గుడ్డే. అరవింద్ దర్శకత్వం వహించారు. గోవింద్ వసంత్ సంగీతం, కార్తీక్ నేతా పాటలు అందించారు. నటి మైనా నందిని, శివ సుబ్రహ్మణ్యం, కాళీ వెంకట్, బోస్, విజయ్ మురుగన్, వెంకట్, మురుగానందం, బక్స్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గుడ్ డే చిత్రం ఈ నెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. దర్శకుడు రాజు మురుగన్ , బాలాజీ ధరణిధరన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాజు మురుగన్ మాట్లాడుతూ ఈ చిత్రం చూడగానే కచ్చితంగా దీని గురించి మాట్లాడాలనిపించిందన్నారు. ఇది మద్యం గురించిన కథా చిత్రం మాత్రమే కాదని, అంతకు మించిన కథాంశంతో రూపొందిన చిత్రం అని పేర్కొన్నారు. మద్యం వల్ల కలిగే సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడమే ముఖ్యం అన్నారు. అలాంటి చిత్రం ఈ గుడ్ డే అని అన్నారు. ఈ చిత్రానికి కచ్చితంగా సపోర్ట్ చేయాలన్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. ఆ సంస్థ నిర్వాహకుడు గుహన్ మాట్లాడుతూ కొత్త వారికి సపోర్ట్ చాలా అవసరం అన్నారు. వారిని సరైన మార్గంలో తీసుకెళ్లాలన్నదే తమ భావనగా పేర్కొన్నారు. ఇది తిరుప్పూర్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అని చెప్పారు. ఈ ప్రపంచం తనకు అవసరం లేదు, ఈ ప్రపంచానికి తాను అవసరం లేదు అని మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడే యువకుడి ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఇదని చెప్పారు. చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు. నిర్మాణ, కథానాయకుడు పృధ్వీరాజ్ రామలింగం మాట్లాడుతూ ఇది తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం అని చెప్పారు. చిత్ర నిర్మాణంలో పలు సమస్యల ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామన్నారు. వ్యాపారం కోసం చాలా ప్రదర్శనలు చేశామని, విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాలేదన్నారు. చివరికి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు గుర్తుకు వచ్చారన్నారు. ఎస్ఆర్.ప్రభు చిత్రం చూసి బాగుందని ప్రశంసించి విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. -
మలయాళ దర్శకుడితో సూర్య
తమిళసినిమా: సూర్య వంటి స్టార్ హీరో కెరీర్కి ప్లాప్లు అంతగా ప్రభావం చూపవు. ఆ మధ్య వచ్చిన కంగువ చిత్రంలో సూర్య నటనకు ప్రశంసలు జల్లు కురిసినా చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. అయితే ఆ తరువాత సూర్య కథానాయకుడిగా నటించిన రెట్రో చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకుంది. ఇక కొత్త చిత్రాల విషయానికి వస్తే బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన 46వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ దశలో ఉండగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. సూర్య ప్రముఖ మలయాళ దర్శకుడితో కలిసి పని చేయడానికి సమ్మతించినట్లు తెలిసింది. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన జీతు మాధవన్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో సూర్య నటించనున్నారని సమాచారం. జీతు మాధవన్ ఇంతకు ముందు ఆవేశం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా నటుడు మోహన్లాల్ హీరోగా చిత్రం చేయించాల్సి ఉన్నా, అది డ్రాప్ అయ్యిందని సమాచారం. అలాగే నటుడు సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాల్సి ఉన్నా వాడివాసల్ చిత్రం కూడా డ్రాప్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సూర్య తన 47వ చిత్రాన్ని మలయాళ దర్శకుడు జీతా మాధవన్తో కలిసి చేయడానికి పచ్చజెండా ఊపినట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ మాధవన్ ధ్రువపరిచారు. సూర్య హీరోగా నటించే చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు ఒక భేటీలో పేర్కొన్నారు. కాగా చిత్రాన్ని ఇంతకు ముందు వాడివాసల్ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసిన కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు సమాచారం. -
చెరువులోకి వ్యర్థాల విడుదలపై చర్చల విఫలం
పళ్లిపట్టు: టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి గ్రామీణులు, పార్కు నిర్వాహకుల మధ్య తహసీల్దారు ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. పళ్లిపట్టు సమీపంలోని నెడియం పంచాయతీలోని వెంగంపేట వద్ద ప్రయివేటు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. టెక్స్టైల్ పార్కు నుంచి విడుదలయ్యే నూలు రంగుతో పాటూ రసాయనం కలిసిన నీటితో భూగర్భజలాలు అడుగంటి గ్రామీణులకు ప్రధాన నీటి వనరుగా ఉన్న చెరువు కలుషితమవుతుందని గ్రామీణులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నీరాహారదీక్ష చేపట్టారు. వారితో పోలీసులు చర్చలు జరిపి చర్చలు ఏర్పాటు చేశారు. తహసీల్దారు కార్యాలయం వేదికగా గ్రామస్తులు, టెక్స్టైల్ పార్కు బృందం సభ్యులతో చర్చలు శనివారం సాగాయి. తహసీల్దార్ భారతి ఆధ్వర్యంలో గ్రామీణుల కమిటీ నుంచి రాజేంద్రప్రసాద్, టెక్స్టైల్ పార్కు కమిటీ నుంచి రామకృష్ణన్ బృందం పాల్గొన్నారు. గంటపాటు చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు నీటితో చెరువులో ఎలాంటి కాలుష్యం ఏర్పడడం లేదని పార్కు నిర్వాహకులు తెలపగా, గ్రామస్తులు దీన్ని ఖండించారు. రెండు వర్గాల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో తహసీల్దారు సమావేశాన్ని ముగించారు. చర్చలు పట్ల కలెక్టర్కు నివేదిక సమర్పించిన తరువాత కలెక్టర్ తుది నిర్ణయం తీసకుంటారని తహసీల్దారు ప్రకటించారు. -
భార్య పాస్పోర్ట్ దరఖాస్తుపై భర్త సంతకం అక్కర్లేదు
చెన్నై: పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు భర్త అనుమతి, వారి సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త సంతకం లేకుండా కొత్త పాస్పోర్ట్ జారీ చేసేలా అధికారులను ఆదేశించాలంటూ రేవతి అనే మహిళ వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేశ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. 2023లో వివాహం కాగా, తన భర్త విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేశారని, అది పెండింగ్లో ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ విషయం తెలిపిన తర్వాత కూడా రీజినల్ పాస్పోర్టు ఆఫీస్(ఆర్పీవో) భర్త అనుమతి, సంతకం తప్పనిసరని చెబుతున్నాన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే మహిళలకు భర్త అనుమతి, సంతకం కావాలన్న వాదన పురుషాధిక్య ధోరణిని చాటుతోంది. భార్యను భర్త సొంత ఆస్తిగా సమాజం భావిస్తుండటం సరికాదు. వివాహంతో మహిళ తన వ్యక్తిత్వాన్ని కోల్పోదు. మహిళా సాధికారిత దిశగా అడుగు వేస్తున్న సమాజానికి ఈ ధోరణి మంచిది కాదు’అని పేర్కొన్నారు. పిటిíÙనర్ అర్హతలను పరిశీలించి, ఆమెకు నాలుగు వారాల్లోగా పాస్పోర్టును మంజూరు చేయాలని పీఆర్వోను న్యాయమూర్తి ఆదేశించారు. -
తమిళావనికి వళ్లువర్ కోట్టం అంకితం
● ప్రారంభించిన సీఎం స్టాలిన్ సాక్షి, చైన్నె : ఎట్టకేలకు వళ్లువర్ కోట్టం మళ్లీ సుందరంగా ముస్తాబైంది. తమిళావనికి ఈ వళ్లువర్ కోట్టాన్ని అంకితం చేస్తూ సీఎం స్టాలిన్ శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ పర్యాటక క్షేత్రం విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. చైన్నె నుంగంబాక్కంలోని వళ్లువర్కోట్టం తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, పురాతనతకు అద్దం పట్టే కళాఖండాల సమూహరంతో నిండిన పర్యాటక ప్రదేశం. తమిళ కవి తిరువళ్లువర్ పేరిట ఒకప్పుడు డీఎంకే హయంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నగరం నడి బొడ్డున రూపుదిద్దుకున్న ఈ వళ్లువర్కోట్టంలోని రథం ప్రత్యేక ఆకర్షణ. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ పర్యాటక ప్రదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగేది. అయితే, గత పదేళ్లు అన్నాడీఎంకే పాలనలో ఈ వళ్లువర్కోట్టం శిథిలావస్థకు చేరింది. దీంతో గత ఏడాది సీఎం స్టాలిన్ వళ్లువర్ కోట్టంపై దృష్టి పెట్టారు. రూ. 80 కోట్లతో వళ్లువర్కోట్టానికి సొబగులు దిద్దేందుకు సిద్ధం అయ్యారు. ఇక్కడి శిల్ప సంపద చెక్కు చెదరని రీతిలో మళ్లీ పునరుద్ధరించారు. తొలి అంతస్తులో 1400 మంది కూర్చునేందుకు వీలుగా పూర్తి ఏసీ సౌకర్యంతో ఆడిటోరియం తీర్చిదిద్దారు. మరో అంతస్తులో వేలాది పుస్తకాలతో గ్రంథాలయం కొలువు దీరింది. వివిధ చర్చా కార్యక్రమాలకు వేదిక బ్రహ్మాండ హంగులతో ఇక్కడ అనేక నిర్మాణాలతో రూపుదిద్దుకున్నాయి. కురల్ మణి మండపాన్ని ఆధునీకరించారు. 1300 కురల్(సూక్తులు)ను ఇక్కడి రాళ్లలో పొందు పరిచినట్టుగా పుస్తకం తరహాలో నిర్మాణాలను ఆధునీకరించారు. 1330 తిరుక్కురల్ చిత్ర లేఖనాలు చెక్కు చెదరని రీతిలో పెయింటింగ్స్తో కొత్త శోభను తీసుకొచ్చారు. వళ్లువర్ కోట్టంలో 106 అడుగుల రాతి రథం మరింత ఆకర్షణగా మారింది. ఈ పరిసరాలన్నీ విద్యుత్వెలుగులో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఈ వళ్లువర్ కోట్టాన్ని శనివారం రాత్రి సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుక్కురల్ , తిరువళ్లువర్ గురించి ప్రసంగిస్తూ ఈ వళ్లువర్ కోట్టాన్ని తమిళావనికి అంకితం ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్తో పాటుగా పలు పథకాలను ప్రకటించిన సీఎం స్టాలిన్ను ఆ సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. -
కనువిందుగా ఆరుపడై వీడులు
● గవర్నర్ రవి వ్యాఖ్య ● మురుగన్ మహానాడుకు సర్వం సిద్ధంసాక్షి, చైన్నె: ఆరుపడై వీడులలోని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఒకే చోట చూడటం కనువిందుగా, ఆనందంగా ఉందని గవర్నర్రవి వ్యాఖ్యానించారు. బీజేపీ, హిందూ సంఘాల నేతృత్వంలో మదురై వేదికగా ఆదివారం మురుగన్ భక్తుల మహానాడుకు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఆరుపడై వీడులుగా మురుగన్కు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ ఒక చోట చేర్చినట్టుగా ఆరుపడై వీడుల సెట్టింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సెట్టింగ్తో కొలువు దీర్చిన సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకునేందుకు జన సందోహం తరలి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం మురుగన్ మహనాడు జరిగే ప్రాంతాన్ని గవర్నర్ రవి సందర్శించారు. ఇక్కడ కొలువు దీర్చిన ఆరుపడై వీడులను సందర్శించారు. పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరుపడై వీడులన్నీ ఒక చోట చేర్చడం కనువిందుగాను, ఆనందంగాను ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయేతర కార్యక్రమంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. కాగా, ఆదివారం జరిగే మహానాడుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కానున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. అదే సమయంలో దక్షిణభారత చలన చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రచారం ఊపందుకుంది. అయితే రజనీకాంత్ హాజరు కావడం లేదని ఆయన తరపున ప్రతినిధులు ఎక్స్లో పేర్కొన్నారు. ఆయన ఈ మహానాడుకు వెళ్తారన్నది అవాస్తవం అని , ఇది ప్రచారం మాత్రమేనని, రాజనీకాంత్ హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. -
మైనర్లకు లైంగిక వేధింపులు
తిరుత్తణి: మైనర్లను లైంగిక వేధింపులకు గురిచేసిన ముగ్గురిపై పోలీసులు అరెస్టు చేశారు. తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఈనెల 11న ముళ్ల పొదల్లో పసికందును గుర్తించిన స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స పొందిన తరువాత తిరువళ్లూరులోని చిన్నారుల సంరక్షణ కేంద్రంకు తరలించారు. విచారణలో ఆర్కేపేట ప్రాంతానికి చెందిన ఓ టెన్త్ విద్యార్థిని ఆ పసికందును ముళ్ల పొదలో వేసినట్లు తేలింది. వంగనూరుకు చెందిన కరుణ (23) అనే యువకుడిని టెన్త్ విద్యార్ధిని ప్రేమించి గర్భందాల్చినట్లు, ప్రసవం కోసం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి వస్తే చిన్నారికి ప్రసవం చేయరని, పోలీసులు సమాచారం ఇస్తారని తెలియడంతో ఆసుపత్రికి సమీపంలో ఆడబిడ్డకు జన్మనిచ్చి ముళ్ల పొదల్లో వేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారిని గర్భవతి చేసిన కరుణను పోక్సో నేరం కింద అరెస్టు చేశారు. అలాగే తిరువలంగాడు ప్రాంతంకు చెందిన విద్యార్ధిని ప్లస్–2 చదువుకుంటున్నారు. ఆ విద్యార్ధినితో సరదాగా మాట్లాడుతూ యువకుడు లైంగిక వేదింపులకు పాల్పిడినట్లు బాలిక తిరుత్తణి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిందిత సీఐ మలర్ కేసు నమోదు చేసి ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన విజయ్(28)ను పోక్సో చట్టం ద్వారా అరెస్టు చేశారు. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి లైంగిక దాడియత్నం అలాగే తిరుత్తణికి చెందిన నాలుగేళ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి తనవెంట తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై లైంగిక దాడి యత్నించాడు. దీనిపై మహిళా పోలీసులు కేసు నమోదు చేసి మనోహరన్(59) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.● వేర్వేరు చోట్ల ముగ్గురిపై పోక్సో కేసు -
త్వరలో సేలం డిఫెన్స్ కారిడార్
కేంద్ర మంత్రి కుమారస్వామి సేలం : సేలంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి నాలుగైదు నెలల్లో ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి డి కుమార స్వామి తెలిపారు. సేలంలోని స్టీల్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. ఇక్కడి ఉత్పత్తులు, సాంకేతికత అమలు గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను మరింత అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపట్టామన్నారు. మళ్లీ దీన్ని లాభాల్లో నడిపించడమే ధ్యేయంగా పేర్కొన్నారు. వివిధ కొత్త ఉత్పత్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఆవరణలో డిఫెన్స్ కారిడార్కు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయన్నారు. ఆర్మీకి అవసరమయ్యే అన్ని రకాల పరికరాల ఉత్పత్తులు ఇక్కడ జరిగే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన నాలుగైదు నెలల్లో ప్రకటన వెలువడుతుందన్నారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నేడు టాటా ప్లేలో విజయ్ బర్త్డే వేడుకలు సాక్షి, చైన్నె: దళపతి విజయ్ బర్త్ డే వేడుకలను టాటా ప్లే బింగే వేదికగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం విజయ్ బర్త్డే వేడుకలను కోలాహలంగా నిర్వహించేందుకు టీవీకే వర్గాలు సిద్ధమైన విషయం తెలిసిందే. వాడవాడలా బ్రహ్మోండ సేవలతో కార్యక్రమాలు జరగనున్నాయి. అదే సమయంలో టాటా ప్లే బింగేలో 30కు పైగా ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్లో విజయ్ ఐకానిక్ బ్లాక్ బస్టర్లతో పాటూ కేక్ కట్టింగ్లు వంటి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విజయ్ నటించిన వారిసు, మాస్టర్, తలైవా, థెరి, వంటి బ్లాక్ బస్టర్లను వీక్షించే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే అముల్ కందస్వామి కన్నుమూత ● అన్నాడీఎంకే వర్గాల్లో దిగ్బ్రాంతి సాక్షి, చైన్నె: కోయంబత్తూరు జిల్లా వాల్పారై ఎమ్మెల్యే అముల్ కందస్వామి (60) శనివారం కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. అన్నాడీఎంకేలో ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శితో పాటూ పలు విభాగాలలో అముల్ కందస్వామి పనిచేశారు. 2021 ఎన్నికలలో వాల్పారై నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఇక్కడి నుంచి తొలి సారిగా అసెంబ్లీకి ఎన్నికై న ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. విశ్రాంతిలో ఉన్న సమయంలో ఆదివారం మళ్లీ అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా సాయంత్రం కన్నుమూశారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తన సంతాపం తెలియజేశారు. కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ జిల్లాలోని అన్నాడీఎంకే నేతలందరూ అముల్ కందస్వామి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని అన్నూరులోని స్వగృహంలో ఉంచారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. మాజీ మంత్రిపై ఎస్పీకి ఫిర్యాదు కొరుక్కుపేట: డీఎంకే మంత్రి టీఆర్బీ రాజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్కుమార్పై డీఎంకే నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందం ఫిర్యాదు చేసింది. మధురై సౌత్ జిల్లా డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్ ఆర్గనైజర్ జయచంద్రన్ నేతృత్వంలోని డీఎంకే సభ్యులు శనివారం మధురై ఎస్పీ అరవింద్కు ఒక వినతిపత్రం సమర్పించారు. తరువాత, వారు విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు పరిశ్రమల మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్ కార్యదర్శి టీఆర్బీ రాజాపై అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్పీ ఉదయకుమార్ అగౌరవపరిచేలా, అబద్ధాలు వ్యాప్తి చేసేలా మాట్లాడారన్నారు. ఆయన ప్రసంగం రాజకీయ లాభం కోసం, రాజకీయ వ్యవస్థకు బాధ్యత వహించే మంత్రిని బెదిరించేలా ఉందన్నారు. తన సొంత ఉనికిని కాపాడుకోవడానికి మాజీ మంత్రి అలా మాట్లాడారని ఆరోపించారు. అతను ఉద్రిక్తత సృష్టించేలా, ప్రజా శాంతికి భంగం కలిగించేలా, రెండు వర్గాల మధ్య హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడారని అన్నారు. అతనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
భారతీయ తెగల అభ్యున్నతికి కృషి
సాక్షి, చైన్నె : భారతీయ తెగల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కృషి చేస్తుందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం నేతృత్వంలో శని, ఆదివారాల్లో గిరిజన ప్రతిఘటన, స్థితిస్థాపకత, భవిష్యత్తు, భగవాన్ బిర్సా ముండా 150 సంవత్సరాల వేడుకలకు చర్యలు తీసుకున్నారు. గిరిజన చరిత్ర, ప్రతిఘటన ఉద్యమాలు, గుర్తింపు, భవిష్యత్తు అవకాశాల ఇతివృత్తాలతో నిమగ్నమయ్యే పండితులతో తొలిరోజు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనరెడ్డి మాట్లాడుతూ భారతదేశ గిరిజనుల దేశీయ జ్ఞానం సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా ఆధునిక జీవనశైలితో అనుసంధానం కావాలన్నారు. దేశంలోని గిరిజన వర్గాల ప్రజలు, వారసత్వం, అభ్యున్నతి, సంరక్షణ కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన ఈసందర్భంగా తెలిపారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి, వైద్యుడిగా ప్రజలకు ఆయన చేసిన సహాయం ఎనలేనిదని కొనియాడారు. గిరిజన జీవితంలోని వివిధ అంశాల్లో పరిశోధన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్లోని మానవీయ శాస్త్రాలు, సామాజిక శాస్త్రాల విభాగాధిపతి ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీన్ (విద్యార్థులు) ప్రొఫెసర్ సత్యనారాయణ ఎన్. గుమ్మడి తదితరులు పాల్గొన్నారు. -
● వాడవాడలా యోగా డే ● త్రివిధ దళాల నేతృత్వంలో కార్యక్రమాలు ● విద్యా సంస్థలలోనూ వేడుకలు
ఆపరేషన్ సింధూర్కు సెల్యూట్.. ఆపరేషన్ సింధూర్కు సెల్యూట్ అన్న నినాదంతో హిందూ స్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు యోగా డేను జరుపుకున్నారు. ఆపరేషన్ సింధూర్ – భారత సైన్యానికి వీర వందనం నినాదంతో భారత సాయుద దళాల వీరత్వం , త్యాగానికి గౌరవాన్ని కల్పించారు. ఆపరేషన్ సింధూర్ హెచ్ఐఎస్పీ–25 ఆకారంలో నిలబడి విద్యార్థులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం వర్గాలు తమ వీర వందనం సమర్పిస్తూ యోగాసనం చేశారు. హిందూస్థాన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాక్షి, చైన్నె : జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అనుసరిస్తున్న విషయం తెలిందే. భారత ప్రాచీన కళకు లభించిన గుర్తింపును అధికారికంగా వేడుక తరహాలో కేంద్ర ప్రభుత్వం ఏటా కార్యక్రమాల మీద దృష్టి పెట్టింది. ఆ దిశగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఉదయం రాష్ట్రంలో వాడవాడలా యోగాసనాలు హోరెత్తాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్మీ క్యాంప్లు, అకాడమిలు , ఎయిర్ ఫోర్స్ స్టేషన్, డిఫెన్స్ బేస్ కార్యాలయాలు, కోస్టుగార్డు కార్యాలయాలు, నావికాదళం కార్యాలయాల్లో యోగాసనాల కార్యక్రమాలు జరగాయి. అలాగే దీంతో ప్రైవేటు సంస్థలు, బీజేపీతో పాటూ కొన్ని సంఘాల నేతృత్వంలో, విద్యాలయాలు, ఆథ్యాత్మిక కేంద్రాలు, ఉద్యాన వనాలు, పార్కులు తదితర ప్రాంతాల్లో యోగ శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెతో పాటూ తిరుచ్చి,మదురై, తిరునల్వేలి, సేలం, తూత్తుకుడి, తంజావూరు, నాగపట్నం, వంటి నగరాల్లో యోగా డే వేడుకలు జరిగాయి. యోగా గురువులు ఆసనాలను ప్రదర్శించి హాజరైన వారి చేత చేయించారు. వివిధ ప్రాంతాలలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం మహాబలిపురంలోని సముద్ర తీర ఆలయం వద్ద యోగా డే ఘనంగా జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సిసోర్ టెంపుల్ వద్ద ఎయిర్ ఫోర్స్ వర్గాలు యోగాసనాలు చేశారు. అడయార్ ఐఎన్ఎస్, డిఫెన్స్ కార్యలయం నేతృత్వంలో చైన్నె సముద్ర తీరంలో యోగా కార్యక్రమం జరిగింది. సెయింట్ థామస్ మౌంట్ ఆర్మీ అకాడమితో పాటూ చైన్నె సముద్ర తీరంలో పలు చోట్ల, పార్కుల్లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. వేలూరు జిల్లా గుడియాత్తంలో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ , సినీ నటి నమిత హాజరయ్యారు. మదురైలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో 10 వేల మంది విద్యార్థులతో జరిగిన బ్రహ్మాండ వేడుకలో అందరితో గవర్నర్ రవి యోగాసనాలు చేయించడంతో పాటూ స్వయంగా 51 సార్లు పుష్ అప్ తీయడం విశేషం. ఐఐటీ మద్రాసు ఆవరణలో జరిగిన యోగా డేకు త్రిపురా గవర్నర్ ఎన్ ద్రసేనారెడ్డి, ఐఐటీ డైరెక్టర్ కామకోటి, డీన్ గుమ్మిడి ఎన్ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. దక్షిణ రైల్వే నేతృత్వంలో చైన్నె, తిరుచ్చి,మదురై, సేలంలతో పాటూ నుంగంబాక్కం రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన యోగాసనాలలో డీఆర్ఎం బి. విశ్వనాథ్ ఈరయ్య తదితరులు పాల్గొన్నారు. అరుంబాక్కం సిద్ధ, వైద్య కళాశాలలో జరిగిన యోగా డే లో ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం పాల్గొని యోగాసనాలు చేశారు. పెరంబూరులోని ఇంటిగ్రల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో యోగా ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదంతో జరిగిన కార్యక్రమానికి ఐసీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నవీన్స్ టవర్స్లో.. మేడవాక్కంలోని నవీన్స్ టవర్స్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అక్కడి నివాసితులు ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి యోగాసనాలు చేశారు. స్టార్ వుడ్ టవర్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి నవీన్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్కుమార్, డైరెక్టర్ పి భవానీ, క్షీర వసుధ కుమార్లు హాజరయ్యారు. బ్యాంకులలో.. వివిధ బ్యాంక్ల కార్యాలయాలలోనూ యోగా డే కార్యక్రమాలు జరిగాయి. ఇండియన్ బ్యాంక్ నేతృత్వంలో పలుచోట్ల యోగా డే జరిగింది. కార్పొరేట్ ఆఫీస్లో జరిగిన కార్యక్రమానికి ఇండియన్ బ్యాంక్ చైర్మన్ బినోద్కుమార్ అధికారులు మహేష్కుమార్, అశుతోష్ చౌదరి, శివ భజరంగ్సింగ్తో పాటూ అనంత యోగా సెంటర్ వర్గాలు హాజరయ్యారు. -
విమానం నుంచి ‘మేడే కాల్’.. తప్పిన పెను ప్రమాదం
ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.గువహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో గురువారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం చాలా తక్కువగా ఉందని పైలట్ గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి ‘మేడే’ సందేశం పంపారు.దీంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్య, అగ్నిమాపక సేవలతో సహా అత్యవసర సేవల బృందాలను మోహరించారు. రాత్రి 8:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. 168 మంది ప్రయాణికులు విమానంలో ఉండగా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.మేడే కాల్ అంటే..ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్థకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది. -
'కుబేర' హిట్.. నాకు చాలా సంతోషంగా ఉంది: కేతిరెడ్డి
నిర్మాత సునీల్ నారంగ్ తీసిన 'కుబేర'.. థియేటర్లలో రిలీజై జనాదరణ పొందుతున్న సందర్భంగా ఆయన మిత్రుడు, నిర్మాత-దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సునీల్ ఇంతా మంచి సినిమా తీయ్యడంతో సంతోషంగా ఉందని, చాలా రోజుల తరువాత ఓ మంచి మూవీ చూసిన అనుభూతి ప్రేక్షకులకు వచ్చిందని చెప్పారు. సంక్షోభంలో ఉన్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 'కుబేర' ఊరట కల్పించిందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు.'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వేసవిలో తెలుగు సినిమా మసక బారిందని, ఇప్పుడు దాదాపు ఐదారు నెలల తర్వాత కుబేర సినిమాతో కాస్త జనం థియేటర్లకు రావటం చూస్తుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి చిత్రాన్ని ఆదరిస్తారనే విషయం మరోసారి తేటతెల్లం అయ్యిందని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమ.. ప్రేక్షకుడి అభిరుచిని గుర్తెరిగి మంచి సినిమాలను నిర్మించాలని.. అప్పుడే ప్రేక్షకులు ఓటీటీలకు కాకుండా థియేటర్ల వైపు వస్తారని కేతిరెడ్డి తెలిపారు. -
చెరుకు సాగుపై సమీక్ష
కొరుక్కుపేట: తమిళనాడులో చెరుకు సాగు, చక్కెర మిల్లుల సామర్థ్యాన్ని పెంచడం, రైతులకు ప్రకటించిన ప్రత్యేక ప్రోత్సాహకాలను వేగవంతం చేయడం పై రాష్ట్ర పర్యాటక, సహకారశాఖా మంత్రి రాజేంద్రన్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో సహకార, ప్రభుత్వ రంగ చక్కెర మిల్లుల కార్యదర్శులు, ఆ శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ సీఎం స్టాలిన్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెరుకు సాగును పెంచడానికి, చక్కెర మిల్లుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకున్న చర్యల కారణంగా చెరుకు సాగు విస్తరిస్తుందని అన్నారు. చక్కెర మిల్లుల సామర్థ్యం కూడా పెరుగుతోంది. చెరుకు రైతుల సంక్షేమం, చక్కెర మిల్లుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వివిధ నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా 2024–25లో మిల్లింగ్ సీజన్కు చెరుకు సరఫరా చేసిన రైతులకు ప్రకటించిన టన్నుకు రూ.349 ప్రత్యేక ప్రోత్సాహకాన్ని వేగవంతం చేయడానికి అందరు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపైనా ఆయన అధికారులతో సమీక్షించారు. -
ఐఏఎస్ల మెడకు అవినీతి ఉచ్చు
● ఐఎఎస్ల మెడకు అవినీతి ఉచ్చు...! ●ముగ్గురిపై కేసు నమోదుకు ధర్మాసనం ఆదేశం ●గతంలో విడుదల చేయడంపై విచారణ ●రంగంలోకి ఏసీబీ సాక్షి, చైన్నె: పాడి పరిశ్రమల శాఖలో గతంలో జరిగిన అక్రమాలు ఇద్దరు ఐఏఎస్ల మెడకు ఉచ్చుగా మారింది. వీరితో పాటు మరొకరిపై కేసు నమోదు చేసి పునఃవిచారణకు మదురై ధర్మాసనం న్యాయమూర్తి పుహలేంది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో జరిగిన తనిఖీల్లో పాల ఉత్పత్తి సహకార సంఘాల్లో అక్రమాలు వెలుగు చూశాయి. రూ.1.75 కోట్లు అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో అప్పటి పాడిపరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ అధికారి కామరాజ్, కమిషనర్గా ఉన్న వల్లలార్లతో పాటు అదనపు కమిషనర్ క్రిస్తుదాసులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా 2023లో ఐఏఎస్లకు క్లీన్చిట్ వచ్చింది. ఈ కేసు నుంచి ఐఏఎస్లు బయట పడ్డా, క్రిస్తుదాసు మాత్రం ఎదుర్కొంటూ వచ్చారు. నన్ను కూడా విడుదల చేయండి.. ఈ కేసు నుంచి ఇద్దరు ఐఎఎస్లు విడుదలైనా, తనను మాత్రం ఈకేసును ఎదుర్కొనేలా చేయడాన్ని వ్యతిరేకిస్తూ, తనను కూడా విడుదల చేయాలని మదురై ధర్మాసనంలో క్రిస్తుదాసు పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని, పనిచేశానని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా శుక్రవారం న్యాయమూర్తి పుహలేంది తీవ్రంగానే స్పందించారు. ఐహేఎస్ల మీద అనేక కేసులు దాఖలు అవుతున్నా, చివరకు విడుదలు కావడం పరిపాటిగా మారుతోందని వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్లను ఈకేసులో విడుదల చేసి, క్రిస్తు దాసును మాత్రం విచారణ ఎదుర్కొనేలా చేయడంలో కారణం ఏమిటో అని ప్రశ్నించారు. క్రిస్తుదాసు పిటిషన్ విచారణను తోసిపుచ్చారు. అదే సమయంలో కీలక ఉత్తర్వులను ఏసీబీకి జారీ చేశారు. కేసుల నుంచి విడుదలైన తర్వాత కూడా మంత్రులే మళ్లీ విచారణలను ఎదుర్కొంటున్నప్పుడు, ఐఏఎస్లకు మినహాయింపు ఉండబోదంటూ వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్లకు క్లీన్చిట్ ఇవ్వడంపై విచారణ జరపాలని కేంద్ర అవినీతి నిరోధక శాఖ కమిషన్ను ఆదేశించారు. అలాగే, ఈ అక్రమాల వ్యవహారంలో పునః విచారణకు ఏసీబీని ఆదేశించారు. ఐఎఎస్లు ఇద్దరితోపాటు క్రిస్తుదాసుపై మళ్లీ కేసుల నమోదుతో విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. మదురై ధర్మాసనం -
జూలైలో అమిత్షా పర్యటన
సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్షా జూలైలో తమిళనాడులో పలు పర్యటనలకు కసరత్తులు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లలో కమలనాథులు ఉన్నారు. తమిళనాట బలోపేతం దిశగా అమిత్ షా ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు కావడంతో, ఇక, పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకే పార్టీలను అక్కున చేర్చుకునే దిశగా వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. తమిళనాట ఈ సారి అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్న అమిత్షా జూలైలో తమిళనాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు తెలిసింది. ఇందుకోసం పలు కార్యక్రమాలకు కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే మదురై వేదికగా మురుగన్ మహానాడుకు సర్వం సిద్ధం చేసిన కమలనాథులు, ఈ మహానాడు విజయం తర్వాత అమిత్షా పర్యటనల కసరత్తులను వేగవంతం చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 8 విమానాలు రద్దు కొరుక్కుపేట: చైన్నె–ఢిల్లీ, ముంబయి, తూత్తుకుడి, హైదరాబాద్ మధ్య నడిచే ఎనిమిది విమానాలు రద్దు అయ్యాయి. దీంతో చైన్నె విమానాశ్రయంలో వేచి ఉన్న ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. చైన్నె నుంచి ముంబయికి ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఢిల్లీకి ఉదయం 9.45 గంటలకు వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం, ఉదయం 10.10 గంటలకు చైన్నె నుంచి తూత్తుకుడికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్ విమానం, చైన్నె నుంచి డిల్లీకి రాత్రి 8.40 గంటలు వెళ్లాల్సిన ఎయిండియా విమానాలు రద్దు చేశారు. అలాగే శుక్రవారం హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు చైన్నెకు చేరుకోవాల్సిన స్పైస్ జెట్ విమానం, ఉదయం 9.05 గంటలకు ఢిల్లీ నుంచి చైన్నె చేరుకోవాల్సిన ఎయిండియా ప్యాసింజర్ విమానం, మధ్యాహ్నం 1.45 గంటలకు తూత్తుకుడి నుంచి చైన్నె చేరుకోవాల్సిన స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ విమానం, రాత్రి 7.10 గంటలకు ఢిల్లీ నుంచి చైన్నె చేరుకోవాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కోర్టుకు రండి! – సీఎస్కు ఆదేశాలు సాక్షి, చైన్నె: కారుణ్య నియామక కేసులో కోర్టుకు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కారం కింద 2023 నుంచి సీఎస్లుగా పనిచేసిన వారికి ఈ నోటీసులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో మరణించే ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద వారి అర్హతల ఆధారంగా వివిధ పోస్టులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కారుణ్య నియామకాలకు సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం జరగాలని ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కారుణ్య నియామకానికి సంబంధించి ఉద్యోగం కోసం దాఖలైన కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ తాజా బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. 2023లో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కమిటీ ఏర్పాటు కాకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా బెంచ్ పరిగణించింది. శుక్రవారం విచారణ సమయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారంగా పరిగణించి 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వారిని స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 21వ తేదీకి వాయిదా వేసింది. రాందాసుతో మనవరాళ్ల భేటీ! సాక్షి, చైన్నె: పీఎంకేలో వివాదం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పెద్దలు, కుటుంబపెద్దలు, ముఖ్యులు, శ్రేయాభిలాషుల బుజ్జగింపునకు తలొగ్గని రాందాసు, తన మనవరాళ్ల భేటీతో తగ్గే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బమణి మధ్య అధ్యక్ష పదవి విషయంగా వివాదం బుల్లి తెర ధారా వాహికను తలపించే విధంగా పలు ఎపిసోడ్లుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాందాసును అనేక మంది బుజ్జగించారు. అన్బుమణి క్షమాపణలు చెప్పుకున్నా, స్వయంగా కలిసి క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ప్రకటించినా రాందాసు ఏమాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో చైన్నెలో ఉన్న రాందాసు మనవరాళ్లు, అన్భుమణి కుమార్తెలు కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని గంటల పాటు ఈ భేటీ జరగడంతో మున్ముందు పరిస్థితులు సద్దుమణగవచ్చు అనే చర్చ పీఎంకేలో నెలకొంది. -
ఈడీకి చెక్!
●ఆకాశ్, విక్రమ్కు ఊరట ●అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం ●టాస్మాక్ స్కాంలో మలుపు సాక్షి, చైన్నె : టాస్మాక్ స్కాం మలుపు తిరిగింది. ఈడీ దూకుడుకు చెక్ పెడుతూ మద్రాసు హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈకేసుతో సంబంధం ఉన్నట్టుగా ఈడీ భావిస్తున్న సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, పారిశ్రామిక వేత్త రవీంద్రన్లకు ఊరట కలిగిస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. చైన్నెలోని తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) ప్రధాన కార్యాలయంలో మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలు, కొనుగోలు, టెండర్ల ప్రక్రియలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈసోదాల్లో రూ.1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు సమాచారం. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో ఈడీ సైతం దూకుడు పెంచింది. అధికారులను టార్గెట్ చేసింది. అదే సమయంలో సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, పవిక్రమ్ రవీంద్రన్లను సైతం ఈడీ టార్గెట్ చేసింది. వారి నివాసాలు, కార్యాలయాలలో సోదాలు జరిగాయి. వాటికీ సీల్ వేశారు. కంప్యూటర్లు ల్యాప్ టాప్లను పట్టుకెళ్లారు. కోర్టు రూపంలో అక్షింతలు టాస్మాక్ వ్యవహారాలతో తమకు సంబంధం లేదంటూ ఈడీ తదుపరి చర్యలకు వ్యతిరేకంగా ఆకాశ్ భాస్కరన్, విక్రమ్ రవీంద్రన్లను మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. గత వారం రోజులుగా ఈ కేసు విచారణవాడి వేడిగా జరుగుతూ వచ్చింది. శుక్రవారం తుది విచారణ జరిగింది. అయితే, టాస్మాక్ స్కాం వ్యవహారంలో ఆకాశ్, విక్రమ్లకు సంబంధం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలను ఈడీ సమర్పించక పోవడాన్ని న్యాయమూర్తులు రమేష్, లక్ష్మీనారాయణ బెంచ్ తీశ్రంగా పరిగణించింది. వారి కార్యాలయాలకు వేసిన సీల్ తొలగిస్తామని, కంప్యూటర్లు అప్పగిస్తామని ఈడీ హామీ ఇచ్చింది. అయితే, టాస్మాక్తో వీరికి ఉన్న సంబంధం ఏమిటో ...? అని పదే పదే విచారణ సమయంలో న్యాయమూర్తులు ప్రశ్నించినా, సమాధానం , ఆధారాలు ఈడీ సమర్పించక పోవడం గమనార్హం. చివరకు ఈడీకి అక్షింతలు తప్పలేదు. ఆధారాలు లేనప్పుడు సోదాలు చేసే అధికారం కూడా లేదని న్యాయమూర్తులు మండి పడ్డారు. ఆధారాలు లేనప్పడు ఏ ప్రాతిపదికన సీల్ వేశారో..? అన్న ప్రశ్నలతో ఈడీ తరపు న్యాయవాదులను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ కేసులో ఆకాశ్, విక్రమ్లకు సంబంధాలు ఉన్నట్టుగా ఈడీ ఆధారాలు సమర్పించక పోవడాన్ని పరిగణించి, తదుపరి చర్యలకు చెక్ పెడుతూ స్టే విధించారు. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
బీఎడ్, పీజీ కోర్సులకు దరఖాస్తులు
● ఆన్లైన్లో శ్రీకారం ● ప్రారంభించిన ఉన్నత మంత్రి గోవి చెజియాన్ సాక్షి, చైన్నె : ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యాలయాలలో బీఎడ్, పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) కోర్సుల ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియను శుక్రవారం ఉన్నత విద్యాశాఖా మంత్రి గోవి చెజియాన్ ప్రారంభించారు. ఉదయం చైన్నెలోని క్వీన్ మేరీ కళాశాలలో 2025–26 బీఎడ్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్సైన్ కళాశాలలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశం నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆన్లైన్లో మంత్రి శ్రీకారం చుట్టారు. 110 కళాశాలలలోని 24,309 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు శుక్రవారం నుంచి జూలై 9వ తేదీ వరకు ఠీఠీఠీ.్ట ుఽజ్చట్చ.జీ ుఽ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు అని మంత్రి సూచించారు. ర్యాంకింగ్ జాబితాను జూలై 18న విడుదల చేస్తామన్నారు. 21 నుంచి 25వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలను విద్యార్థులు ఎంచుకోవచ్చు అని వివరించారు. ఆగస్టు 6 నుంచి అన్ని ప్రభుత్వ , ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. బీఎడ్ వివరాలు బీఎడ్ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి మంత్రి వివరిస్తూ 7 ప్రభుత్వ విద్యా కళాశాలలో 900 సీట్లు, 14 ప్రభుత్వ సహకారంతో నడిచే కళాశాలలో 1,140 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ సీట్ల కోసం జూలై 9లోపు దరఖాస్తులు చేసుకోవాలని, జూలై 18వ తేదీన ర్యాంకుల జాబితా, 21 నుంచి 25 వ తేదీ వరకు కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. 28వ తేదీన సీట్ల కేటాయింపు ఉత్తర్వుల జారీ, 31వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కళాశాలలో అడ్మిషన్లు, ఆగస్టు 6 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం ఉంటుందన్నారు. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కళాశాల విద్యా విభాగానికి ఎంపికై న 6 మందికి ఈసందర్భంగా ఉద్యోగ నియామక ఉత్తర్వులను మంత్రి అందజేశారు. విద్యాశాఖ కార్యదర్శి సమయమూర్తి, కమిషనర్ ఎ.సుందరవల్లి ఐ, క్వీన్ మేరీ కళాశాల ప్రిన్సిప్ డాక్టర్ పి. ఉమామహేశ్వరి, ఉన్నత విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏర్కాడు, ఏలగిరిలో రోప్ వే
సాక్షి, చైన్నె : పర్యాటక ప్రాంతాలు ఏర్కాడు, ఏలగిరిలో రోప్ వే సేవలకు నివేదిక సిద్ధం చేయడానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. సేలం జిల్లాలోని ఏర్కాడు పేదల ఊటిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఊటిని తలపించే విధంగా ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు పర్యాటక శాఖ చర్యలు తీసుకుంది. వేలూరు జిల్లాలోని ఏలగిరి కొండలు సైతం ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి రమణీయతతో నిండిన ప్రదేశాలు, కొండ కోనల్లో సెలయేర్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. దీనిని కూడా అభివృద్ధి పరిచే పనులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఏర్కాడు, ఏలగిరిలలో రోప్ వే సేవలకు సిద్ధమవుతున్నారు. ఏర్కాడు కొండలు, ఏలగిరి కొండ కోనల్లో రోప్కార్ సేవలపై దృష్టి పెట్టిన తమిళనాడు టూరిజం డెవలప్ మెంట్ బోర్డు వివరణాత్మక నివేదికను కోరుతూ టెండర్లను ఆహ్వానించేందుకు నిర్ణయించింది. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు రోప్వే సేవలు చేపట్టాలి, పర్యాటకంగా ప్రాంతాలను కలిపే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాల గురించి నివేదికను కోరడం విశేషం. -
నాలుగు కొత్త ఆర్ట్స్ కళాశాలలు
2025–26 విద్యాసంవత్సరంలోనే విద్యా సేవలు అందించే విధంగా ఏర్పాటు చేసిన నాలుగు కొత్త ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలను సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా కళాశాలలను ప్రారంభించి, అక్కడి వసతులను పరిశీలించారు. వేలూరు జిల్లాలోని తిరువళ్లువర్ వర్సిటీలో రూ.36.18 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు.సాక్షి, చైన్నె: ఉన్నత విద్యాపరంగా విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నాన్ మొదల్వన్, తమిళ్ పుదల్వన్, పుదుమైపెన్ వంటి పథకాలను విజయవంతంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే, పేద గ్రామీణ విద్యార్థుల ఉన్నత విద్య అవసరాలు పూర్తి చేయడానికి, 2025–26 సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖ నేతృత్వంలో 11 కొత్త ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్న్స్ కళాశాలలు ఏర్పాటు చేశారు. గత నెల ఈ కళాశాలలను ప్రారంభించారు. కళాశాలలు, సీట్ల సంఖ్య పెరిగినా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉండడంతో మరో నాలుగు కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమయ్యేలా విస్తృత చర్యలు తీసుకున్నారు. నాలుగు కళాశాలల ప్రారంభం ఉన్నత విద్యాశాఖ తరఫున వేలూరు జిల్లా కె.వి.కుప్పం, తిరుచ్చి జిల్లా – తురైయూర్, కళ్లకురిచి జిల్లా–ఉలుందూర్పేట, తిరువణ్ణామలై జిల్లా– సెంగంలలో ఈ కళాశాలలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కళాశాలలను సీఎం స్టాలిన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఒక్కో కళాశాలలో ఐదు కోర్సులను అమలు చేస్తూ తొలి విడతగా చర్యలు తీసుకున్నారు. అలాగే, ప్రతి కళాశాలకు 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు (మొదటి సంవత్సరానికి మాత్రమే) నియమించారు. అలాగే, 14 మంది చొప్పున బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. ఈ నాలుగు కళాశాలలకు ఒక సంవత్సరం స్కాలర్షిప్ల మంజూరు ఖర్చుల కోసం రూ.8కోట్ల 67లక్షలు కేటాయించారు. 1,120 మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశశం కల్పించారు. 4 కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల సంఖ్య 180కు చేరింది. అలాగే, వేలూరులోని తిరువళ్లువర్ వర్సిటీలో రూ. 18 కోట్ల 74 లక్షతో ఐదు అంతస్తులతో నిర్మించిన భవనం, రూ.2 కోట్ల 38 లక్షల 70 వేలతో నిర్మించిన విద్యా భవనం, వైస్ చాన్స్లర్ నివాసం, రూ. 8.49 కోట్లతో నిర్మించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నివాసాలు, రూ6.కోట్ల 56 లక్షల 20వేలతో నిర్మించిన బోధనేతర సిబ్బందికి గృహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. ఇక్కడి వసతులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పరిశీలించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ప్రజా పనుల మంత్రి ఈవీ వేలు, ఉన్నత విద్యాశాఖా మంత్రి డాక్టర్ గోవి చెజియాన్, ప్రధాన కార్యదర్శి మురుగానందం, విద్యా శాఖ కార్యదర్శి సమయమూర్తి, కళాశాల విద్యా కమిషనర్ ఎ.సుందరవల్లి, సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. న్యూస్రీల్ ప్రారంభించిన సీఎం స్టాలిన్ నాలుగు శాఖల అధికారులతో సమీక్ష అధికారులతో సమీక్ష ప్రారంభోత్సవాల అనంతరం ఆహార శాఖ, రెవెన్యూ, ఎంఎస్ఎంఈ, పశు సంవర్ధకం, మత్స్య శాఖ, పాడి పరిశ్రమలు, పెట్టుబడులు, పరిశ్రమల శాఖ మంత్రులు, అధికారులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా శాఖల్లో పథకాల తీరు తెన్నులు, ప్రాజెక్టుల అమలును సమీక్షించారు. బడ్జెట్లో కేటాయింపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనుల విస్తృతం గురించి చర్చించి ఆదేశాలు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు అన్బరసన్, టీఆర్బీ రాజా, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, అనితా రాధాకృష్ణన్, మనో తంగరాజ్లతో పాటుగా ఆయా శాఖల కార్యదర్శులు, కమిషనర్లు పాల్గొన్నారు. -
రీ రిలీజ్కు తడైయార తాక్క
తమిళసినిమా: ఇంతకుముందు విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రాలు రీ రిలీజై నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. అలా నటుడు అరుణ్విజయ్ కథానాయకుడిగా నటించిన తడైయార తాక్క రీరిలీజ్కు సిద్ధం అవుతోంది.అరుణ్ విజయ్కు జంటగా మమతా మోహన్దాస్, రకుల్ప్రీత్సింగ్ నటించిన ఇందులో వంశీకృష్ణ, అరుళ్దాస్ ,కాళీ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ఇందులో గాయనీ ఎల్ఆర్.ఈశ్వరి పాడిన పూందమల్లిడా అనే పాట సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. కాగా 2012లో తెరపైకి వచ్చిన తడైయార తాక్క మంచి విజయాన్ని అందుకుంది. నటి రకుల్ప్రీత్సింగ్ పాపులర్ అయ్యింది ఈ చిత్రంతోనే. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్స్వింగ్ ఎంటర్టెయిన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈనెల 27న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ఈ సంస్థఽ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యాక్షన్ ఎంటర్టెయిన్మెంట్ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాజాగా ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో నవీన 4కే సౌండింగ్లో రూపొందించి డిజిటల్ ఫార్మెట్లో రీ రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్లో డెవిలన్ తమిళసినిమా: అసాధ్యాలను సుసాధ్యం చేయడం చరిత్ర. ప్రయోగాలకు ఫలితం ఉంటుంది. అలా 48 గంటల్లో చిత్ర షూటింగ్ను పూర్తిచేసి విడుదల చేయడం అనే అసాధ్యాన్ని సాధ్యం చేసిన డెవిలన్ చిత్ర యూనిట్ ఇప్పుడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కారు. సీకర్ పిక్చర్స్ పతాకంపై పి.కమలకుమారి, ఎన్.రాజ్కుమార్ 48 గంటల్లో డెవిలన్ పేరుతో చిత్ర షూటింగ్ను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రకటించిన ప్రకారం 2025 మే నెల 29న 4.01 గంటలకు చిత్ర షూటింగ్ను ప్రారంభించి మే నెల 31న సాయంత్రం 3.58 గంటలకు నిర్మాణాన్ని పూర్తి చేసి విడుదల చేశారు. అలా ఈ చిత్ర దర్శకుడు బిక్కయ్ అరుణ్ 47.58 గంటలకే షూటింగ్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, మాస్టరింగ్, థియేటర్లలో విడుదల వంటి అంశాలను ప్రకటించిన దానికంటే 3 నిమిషాలు ముందుగానే పూర్తి చేసి ప్రపంచ నోబెల్ బుక్ రికార్డ్లోకి ఎక్కారు. ఈ రికార్డ్ను మే నెల 31వ తేదీనే వరల్డ్ నోబెల్ రిజిస్టర్లో నమోదు చేశారు. ఈ చిత్ర షూటింగ్ పక్రియను నోబెల్ రికార్డు సంస్థ నిర్వాహకురాలు హేమలత బృందం పర్యవేక్షణలో జరిగింది. చిత్ర సహ నిర్మాత ఎన్.రాజ్కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రంలో నటి కార్తీక, ఇందిర, ఫెడ్రిక్, బాలాజీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి టీజే.బాలా చాయాగ్రహణం, కమల్జిత్సింగ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి ప్రపంచ నోబెల్ రికార్డ్ ప్రతినిధులు ధ్రుపత్రాన్ని అందించారు. ఈ చిత్రం ప్రపంచ నోబెల్ రికార్డ్ సాధించడం సంతోషంగా ఉందని దర్శకుడు బిక్కయ్ ఆరుణ్ పేర్కొన్నారు. -
సూర్య 45వ చిత్రం కరుప్పు!
తమిళసినిమా: రెట్రో చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టిన సూర్య ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఆర్జే.బాలాజీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఒకటి. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో నటి స్వాశిక, అనకా, మాయారవి, షివదా, సుప్రీత్ రెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తరువాత సూర్య, త్రిష జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. దీన్ని ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సాయి అభయంకర్ సంగీతాన్ని, జీకే.విష్ణు చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా డిఓషనల్తో కూడిన సాంఘిక కథా చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక పండగలా ఉంటుందని నిర్మాతల వర్గం పేర్కొంది. కాగా ఈ చిత్రానికి కరుప్పు అనే పేరును ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. పోస్టర్లో సూర్య చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంగా నిలబడ్డారు. ఈ పోస్టర్కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. చిత్ర విడుదల తేదీన త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొంది. -
డీఎంకేతోలోనే విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరు జిల్లా కేవీ కుప్పంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భవనాలను రాష్ట్ర సచివాలయం నుంచి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో కేవీ కుప్పంలో మంత్రి దురైమురుగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని విద్యార్థులు గతంలో కళాశాల విద్య కోసం వేలూరు, గుడియాత్తం వెళ్లాల్సి ఉండేదని దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు కేవీ కుప్పంలో కళాశాల ఏర్పాటు చేయాలని విన్నవించడంతో ప్రభుత్వంతో అనుమతి పొంది ఈ ఏడాదే తరగతులు ప్రారంభించాలని పూర్తి చేశామన్నారు. ఈ చుట్టు పక్కల చాలా గ్రామాలే ఉన్నందున నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వస్తారన్నారు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. అనంతరం విద్యార్థుల అడ్మిషన్లను ప్రారంభించారు. కలెక్టర్ సుబ్బలక్ష్మి, ఎంపీ కదిర్ ఆనంద్, ఎమ్మెల్యేలు న ందకుమార్, కార్తికేయన్, అములు, జగన్మూర్తి, జెడీ చైర్మన్బాబు, విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ సింత్య సెల్వి, కేవీ కుప్పం యూనియన్ చైర్మన్ రవిచంద్రన్, వైస్ చైర్మన్ భారతి పాల్గొన్నారు.