Jangaon
-
పెట్రోల్బంక్ నిర్మాణానికి స్థల పరిశీలన
రఘునాథపల్లి: రఘునాథపల్లి మండల కేంద్రంలోని ఖిలాషాపూర్ రోడ్డులో స్వయం కృషి దివ్యాంగుల మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్బంక్ నిర్మాణానికి మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి వసంత, అడిషనల్ డీఆర్డీఓ నూరుద్దిన్, తహసీల్దార్ మోహ్సిన్ముజ్తబ, డీపీఎం రాజేంద్రప్రసాద్లతో కలిసి కలెక్టర్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12 గుంటల స్థలంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నుంచి అనుమతి లభించిందన్నారు. సుమారు రూ.70 లక్షలతో నిర్మించనున్న ఈ పెట్రోల్ బంక్ నిర్మాణంతో దివ్యాంగుల మండల సమాఖ్య అభివృద్ధి పథంలో కొనసాగనుందన్నారు. ఆయన వెంట ఏపీఎం సారయ్య, సీసీలు జంపయ్య, రేణుక, లలిత తదితరులు ఉన్నారు. పాఠశాల ఆకస్మిక తనిఖీ జనగామ: పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియా ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్ాధ్యలను పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను చూసిన డీఈఓ వారిని అభినందించి, కష్టపడి చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను విద్యార్థులకు అందించారనే అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సర్కారు అందిస్తున్న సంక్షేమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వి.కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు ఉన్నారు. భూగర్భ జలాలను పెంచుకోవాలి నర్మెట/బచ్చన్నపేట: భూగర్భ జలాల పెంపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ శాస్త్రవేత్త వెంకటగిరి అన్నారు. మంగళవారం నర్మెట, బచ్చన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రతి ఇంట్లోని నీరు వృథాగా పోకుండా ఇంకుడుగుంతను నిర్మించుకోవాలన్నారు. సంబంధిత ఈజీఎస్ అధికారులు గ్రామాల్లో ఇంకుడు గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓలు బోడపాటి అరవింద్ చౌదరి, వెంకటమల్లికార్జున్, ఏపీఓలు కృష్ణ, పులుగం రమాదేవి, టీఏ బాబు, కార్యదర్శులు శ్రీధర్, గణేష్, నరేష్, సుజాత, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారుల నూతన ఫోన్నంబర్లుజనగామ: జనగామ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ ఇంజినీర్ల ఫోన్ నంబర్లు మారినట్లు డీఈ ఎం.లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పాత నంబర్ల స్థానంలో కొత్త సిమ్ కార్డులను ఇవ్వడం జరిగిందని, ఈ నంబర్లను ప్రతీ వినియోగదారుడు తెలుసుకుని సేవలను పొందాలన్నారు. హోదా ఫోన్నంబర్ ఎస్ఈ,జనగామ 87124 82677 డీఈ 87124 82682 ఏడీఈ 87124 82693 ఏఈ,జనగామ టౌన్–1 87124 82718 ఏఈ,జనగామ టౌన్–2 87124 82719 ఏఈ,జనగామ రూరల్ 87124 82720 ఏఈ,పెంబర్తి 87124 82721 ఏఈ,బచ్చన్నపేట 87124 82722 ఏఈ,పడమటికేశ్వార్ 87124 82723 ఏడీఈ,దేవరుప్పుల 87124 82695 ఏఈ,దేవరుప్పుల 87124 82724 ఏఈ,సింగరాజుపల్లి 87124 82725 ఏఈ,లింగాలఘణపూర్ 87124 82726 ఏడీఈ,రఘునాథపల్లి 87124 82694 ఏఈ,రఘునాథపల్లి 87124 82728 ఏఈ,ఖిలాషాపూర్ 87124 82729 ఏఈ,నర్మెట 87124 82730 ఏఈ,తరిగొప్పుల 87124 82731 -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం
జనగామ రూరల్: ప్రజావ్యతిరే విధానాలపై ప్రజానాట్యమండలి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఐలమ్మనగర్లో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి నాటక శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు భూనాద్రి వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజానాట్యమండలి కళారూపాలు ప్రజల పక్షాన నిత్యం పోరాడే ఆయుధాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ముఖ్య ఘట్టాలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో భాగంగా వీర తెలంగాణ నాటకాన్ని ప్రజానాట్యమండలి జిల్లా కళాకారులు నేర్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ కళారూపాలను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సుంచు విజేందర్, జోగు ప్రకాశ్, శివ ప్రసాద్, నరసింహ స్వామి, బాలమని, ప్రమీల, లత, భాగ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి -
కనీస వసతులేవి?
● ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుపై నీలినీడలు ● పూర్తిస్థాయిలో వసతులు కల్పించకపోవడంతో ఎన్ఎంసీ షోకాజ్ ● ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు గుర్తింపు ● నేడు విచారణ, వర్చువల్ పద్ధతిలో పాల్గొననున్న ప్రిన్సిపాల్ ● సెప్టెంబర్ 15 నుంచి థర్డ్ ఇయర్ ప్రారంభంజనగామ: ప్రాథమిక స్థాయిలోనే ప్రతీ విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలని కోరుకుంటారు. భవిష్యత్లో ఏం కావాలనుకుంటున్నావనే టీచర్ ప్రశ్నకు విద్యార్థి నోటి నుంచి టక్కున వచ్చే జవాబు డాక్టర్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు డాక్టర్ వృత్తిని కోరుకుంటారు. అంతటి ప్రాధాన్యం కలిగిన వృత్తిపై నీలినీడలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కనీస వసతి సౌకర్యాలు లేవని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ఈ నెల 14వ తేదీన ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 2025–26 నూతన విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుకు సంబంధించి మెడికల్ కళాశాలలో విద్యార్థుల బోధనకు తగ్గట్టుగా సౌకర్యాలు లేవని గుర్తించారు. యూజీఎంఎస్ఆర్–2023 నిబంధనలను అనుసరించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస మౌలిక వసతి సౌకర్యాలు, అధ్యాపకులు, విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ హాజరు ఎంబీబీఎస్ విద్యార్థుల బోధన సమయంలో సరిపడా రోగులు, ప్రాక్టికల్స్కు అవసరమైన మృతదేహాలు ఉండాలి. కళాశాల నిర్వహణ ఇలా... జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు చంపక్హిల్స్ మాతా శిశు సంరక్ష ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) ఉంది. ప్రస్తుతం ఎంసీహెచ్ ప్రాంగణంలోని తాత్కాలిక రేకుల షెడ్డుల్లో ఏర్పాటు చేసిన మొదటి, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ తరగతులు కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి సుశీలమ్మ అనాథ వృద్ధాశ్రమంలో విద్యార్థినులకు హాస్టల్ వసతి సౌకర్యం కల్పించగా, విద్యార్థులు చంపక్హిల్స్లోని డీఆర్డీవో భవనంలో ఉంటున్నారు. వచ్చే సెప్టెంబర్ 15 నుంచి మూడవ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్న నేపధ్యంలో హాస్టల్తో పాటు తరగతి బోధనకు జిల్లా ఆస్పత్రి ఎదుట ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసును అద్దెకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. 100 పడకలతో క్రిటికల్ కేర్ మెడికల్ కళాశాలలో సౌకర్యాలు లేవని ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఇందులో 90 శాతం మేర త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 100 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. డీహెచ్లో ీసీటీ స్కాన్ సేవలను వారం రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెడికల్ కళాశాలలో 117 పోస్టులకు గాను రెగ్యులర్ ఉద్యోగులు 82, కాంట్రాక్టు 7 మంది విధులు నిర్వర్తిస్తుండగా, 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డు గీతానగర్లో నూతనంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనం ఆరునెలల్లో అందుబాటులోకి రానుంది. నేడు వర్చువల్గా విచారణ మెడికల్ కళాశాల నిబంధనలకు సంబంధించి ఢిల్లీలో నేడు (బుధవారం) జరిగే విచారణకు ఆరోగ్య శాఖ కార్యదర్శి, వైద్య విద్య సంచాలకులు హాజరు కావాలని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు (యూజీఎంఈబీ) ఆదేశించింది. ఈ విచారణలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆయా కళాశాలల నుంచి వర్చువల్గా అందుబాటులో ఉండాలని కోరారు.ఎనిమిది కేటగిరీల్లో లోపాలు.. జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు జాతీయ వైద్య కమిషన్ విచారణలో వెల్లడైయింది. మృతదేహాలు, పడకలు, సిటీ స్కాన్, ఎమ్మారై సేవలు, ఆపరేషన్ థియేటర్లు, ఫారం–16 ఇన్ కంప్లీట్, ఒక డాక్టర్ డిక్లరేషన్కు సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డీహెచ్, ఎంసీహెచ్లో ఎన్ఎంసీ నిబంధనలను అనుసరించి 420 వందల బెడ్లకు గాను 20 తక్కువగా ఉన్నాయి. బిగ్, స్మాల్ ఆపరేషన్ థియేటర్లు 12 ఉండాల్సిన చోట 9 మాత్రమే ఉన్నాయి. అలాగే క్రిటికల్ ఆపరేషన్ థియేటర్లు చిన్నవి, పెద్దవి కలిపి 5కు గాను ఒక్కటి లేవు. కొంతమంది డాక్టర్లకు సంబంధించి ఫాం–16 ఇన్కంప్లీట్, ఒక డాక్టర్ డిక్లరేషన్ ఇవ్వక పోవడాన్ని అందులో ప్రధానంగా చూపించారు. సమస్యలన్నీ చిన్నవే.. జనగామ మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎనిమిది కేటగిరీల్లో లోపాలు ఉన్నట్లు చూపించారు. కళాశాల ప్రారంభ సమయంలో 6 మృతదేహాలు చూపించగా, ఆ తర్వాత మరో నాలుగువచ్చాయి. సీటీ స్కాన్ సేవలు మరో వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. వైద్యుల ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్కు సంబంధించి పైనుంచే మిషన్లు రాలేదు. ప్రస్తుతం ఎవరికి వారే సెల్ఫోన్ల ద్వారా హాజరు శాతం నమోదు చేసుకుంటున్నారు. ఫారం–16, డాక్టర్ డిక్లరేషన్ కంప్లీట్ చేస్తున్నాం. – డాక్టర్ గోపాల్రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
అట్రాసిటీ కేసుల పరిష్కారానికి కృషి
జనగామ రూరల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరెట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్తో కలిసి అట్రాసిటీ కేసులపై జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన బడ్జెట్ ప్రకారం పెండింగ్ లేకుండా బాధితులకు నష్ట పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు జిల్లాలో ఎంపిక చేసిన 9 గ్రామ పంచాయతీల్లో గిరిజనుల సమస్యలపై ప్రధానమంత్రి దర్తీ ఆబ జాన్ భగీదారి అభియాన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఏసీపీ డీఎస్డీఓ విక్రమ్, డీపీఓ స్వరూప, రాణా ప్రతాప్, భోజన్న పాల్గొన్నారు. పక్కాగా భూగర్భ జలాల నిర్వహణ భూగర్భ జల వనరుల పరిరక్షణలో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్లో భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి భూగర్భ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంచడానికి చర్యలు చేపట్టడంతోనే గణనీయంగా మార్పు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి అశోక్, డీఆర్డీఓ వసంత, డీఏఓ రామారావు నాయక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
మోదీతోనే అభివృద్ధి సాధ్యం
లింగాలఘణపురం: దేశ అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొండబోయిన సంపత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంతో పాటు రాష్ట్రంలో కూడా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, నేనషల్ హైవేల అభివృద్ధి వంటి పనులు జరుగుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, సోమిడి వెంకట్రెడ్డి, నాగరాజు, సతీష్, గణేష్, కార్తీక్, సాయికుమార్, శర్మ, రవి, అనిల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ిసీటీ స్కాన్ సేవలు!
జనగామ: జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (డీహెచ్)లో సీటీస్కాన్ సేవలను మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ీసీటీ స్కాన్ యంత్రం డీహెచ్కు చేరుకుని నెలలు కావస్తుంది. యంత్రం ఇన్స్స్టాలేషన్కు సంబంధించి ఏజెన్సీ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సి ంహ్మ మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు ఫోన్ చేసి ఆరా తీశారు. సీటీ స్కాన్ సేవలను త్వరగా ప్రాంభించాలని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో ఓల్డ్ సీటీ స్కాన్ గదిలోనే కొత్త యంత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పాత మిషన్ను తొలగించి, కొత్తగా ఏర్పాటు కోసం గదిలో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నెల 27వ తేదీలోపు ీసీటీస్కాన్ సేవలను ప్రారంభించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో ీసీటీ స్కాన్ సేవలు మూలన పడి 8 ఏళ్లు గడిచి పోతున్నా, పాత వాటి స్థానంలో కొత్త సేవల ప్రారంభంలో జాప్యం పై ‘సాక్షి’ లో అనేక కథనాలు ప్రచురితం చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ీసీటీస్కాన్ యంత్రం కొనుగోలుకు ఆదేశాలు జారీ చేయగా, ప్రస్తుతం ఇన్స్స్టాలేషన్ దశలో ఉంది. సాక్షి కృషితో కొద్ది రోజుల్లో పేదలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిని సాధించాలి
జనగామ రూరల్: ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇళ్లు లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులను కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేశ్కుమార్లతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండవ విడతగా ఐదు మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేయగా మార్కింగ్ పనులు వేగవంతంగా జరిగిందన్నారు. ఇళ్ల ప్రగతిలో స్టేషన్ఘనపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ డీఎస్. వెంకన్న, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత నాయక్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
ఇంటి నంబర్లు కేటాయించాలి
జనగామ రూరల్: పట్టణంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు అధికారులు ఇంటి నంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అన్నారు. మంగళవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ..గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలోని నిరుపేదలకు 114 ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చారన్నారు. అందులో అనేక ఇబ్బందులు పడి ఇంటి నిర్మాణం చేసుకున్నారని, కానీ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భూక్య చందు నాయక్ ముసుపట్ల జయ, తేరాల అండాలు, ఏనుగుల కమల, గంగా కౌర్, గంగాధరి సురేష్, సిలివేరి ఉపేందర్, బాలస్వామి, మంద అ మల, రాములు, నీల సమ్మక్క, స్వరూప, దానమ్మ, సుజాత, సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నతో ‘సీఎం’ విజయవంతం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యాన సోమవారం చేపటిన ముఖాముఖి కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు మంత్రులు, సీ.ఎస్ కె.రామకృష్ణారావులతో కలిసి సీఎం 1,031 రైతు వేదికల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. జిల్లాలోని 12 వేదికల్లో వీసీ అందుబాటులో ఉండగా.. మరో 24 చోట్ల ఏర్పాటు చేసిన నూతన వీసీలను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. మొత్తంగా 36 రైతు వేదికల్లో జిల్లా నుంచి 7,500 మంది రైతులు పాల్గొన్నారు. జనగామ మండలం చీటకోడూరు రైతు వేదికలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, ఆర్టీ మెంబర్ అభిగౌడ్, జిల్లా వ్యవసాయధికారి రామారావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి, కొడకండ్ల, చిల్పూరు, రఘునాథపల్లి, దేవరుప్పుల, బచ్చన్నపేట పరిధిలో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు. ముఖాముఖిలో 7,500 మంది రైతులు 36 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం పండుగ వాతావరణంలో స్వాగతం -
సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలి
జనగామ: ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించేలా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో క్లబ్ అధ్యక్షుడు ఎడమ సంజీవరెడ్డి ఆధ్వర్యాన నిర్వహించిన లయన్స్ క్లబ్ జనగామ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను అవగాహన కల్పించాలన్నారు. అహ్మదాబాద్లో చదువుకునే సమయంలో లయన్స్ సేవల గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా పాల్గొనలేక పోయానని, అధికారి హోదాలో ఇక్కడ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి, దివంగత కాసం అంజయ్య సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు చంద్రగిరి శ్రీనివాస్, గోవింద్రాజ్, దీపక్ భట్టాచార్య, బాబురావు, వెంకటరెడ్డి, దయాకర్ రెడ్డి, సుకుమార్, డాక్టర్ లవకుమార్రెడ్డి, ముచ్చ రాజిరెడ్డి, కన్న పరశురాములు, రఘునాథ్రెడ్డి, ప్రమోద్కుమార్, కృష్ణ జీవన్ బజాజ్, ప్రభాకర్, జయహరి, గోపయ్య, ఈశ్వర్రావు, హన్మంతరావు, డాక్టర్ కల్నల్ భిక్షపతి, బుస్సా సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ -
ఇందిరమ్మ ఇళ్లకు నంబర్లు ఇవ్వాలి
జనగామ రూరల్ : పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లకు వెంటనే ఇంటి నంబర్లు వేసి కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కనీస సౌకర్యాలు కల్పించి పేదలను ఆదుకోవాలని లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి రాజు, అహల్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, ఉపేందర్, చందు నాయక్, బొట్ల శ్రావణ్, పాము శ్రీకాంత్, బాలమణి, పాముకుంట్ల చందు, సుమ, ఎండీ గౌసియా, నాజియా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి -
విద్యుత్ పనులు త్వరగా పూర్తిచేయాలి
జనగామ రూరల్ : విద్యుత్ సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్న డీడీ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ విద్యుత్ శాఖ అధికారులను కోరారు. సోమవారం ఏఈకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చందు నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని బోరుబావుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయని వాటిని సరిచేయాలన్నారు. రైతులు, పశువులు విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారని కొత్త విద్యుత్ తీగలు అమర్చాలని కోరారు. డీడీలు చెల్లించిన రైతులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగకుండా పనులు త్వరగా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మంగ భీరయ్య, నాయకులు విజయ్కాంత్, రజనీకాంత్, బాలుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
జనగామ రూరల్: క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య అన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిర ఆధ్యర్యాన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి బూత్, మండల, బ్లాక్, జిల్లా కమిటీలు పూర్తి చేయాలని, ప్రతి నెలా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పారు. వచ్చేనెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి.. కాబట్టి మండలాధ్యక్షులంతా బూత్ కమిటీలను పూర్తి చేసి కష్టపడి పని చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను గడప గడపకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జనగామ మండల అధ్యక్షురాలు కాముని జయకు నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకట సుబ్బమ్మ, బొట్రెడ్డి శ్రీలతరెడ్డి, దేవులపల్లి భాగ్యలక్ష్మి, కొయ్యడ శోభ, గంగ కోమలత, మౌనిక, స్వప్న, ప్రవళిక, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య -
ప్రేరణ సాంగ్ అద్భుతం
జనగామ: ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను చాటి చెబుతూ రవీందర్ అల్లూరి రాసిన ‘బడిబాట’ ప్రేరణ సాంగ్ అద్భుతంగా ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా కితాబిచ్చారు. ఇందుకు సంబంధించిన సీడీని సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్తో కలిసి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యార్థుల నమోదును పెంచేందుకు టీచర్లు పడుతున్న శ్రమను కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, హెచ్ఎం రవీందర్, ఉపాధ్యాయులు వాసంతి, జ్యోతి, నర్సింహారెడ్డి, కె.సురేందర్రెడ్డి, ఎం.లింగం తదితరులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల పరిశీలన కొడకండ్ల : మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. మొండ్రాయి, పెద్దబాయితండా, రామవరం, కొడకండ్ల గ్రామాల్లో కేంద్ర భూగర్భ జలశాఖ మినిసీ్ట్ర ఆఫ్ జలశక్తి అభియాన్ బృందం పర్యటించింది. సైంటిస్ట్ వెంకటగిరి ఆధ్వర్యంలో కేంద్ర బృందం ఇంకుడు గుంతలు, పాం పాండ్, ఫిష్ పాండ్లను పరిశీలించి, అవి వినియోగంలో ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్లాంట్ మేనేజర్ వీరన్న, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఏపీఓ కుమారస్వామి, ఈసీ రమేశ్, టీఏలు సుధీర్, బస్వ భాస్కర్, కందికట్ల యాకయ్య, కార్యదర్శులు మధు, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ చాంపియన్ రామ్కిరణ్ చిల్పూరు: మండలంలోని శ్రీపతిపల్లి గ్రామానికి చెందిన గౌలికర్ రామ్కిరణ్ వాలీబాల్లో ఇంటర్నేషనల్ చాంపియన్ షిప్ అవార్డు అందుకున్నాడు. గతంలో వరంగల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన నేషనల్ లెవల్ వాలీబాల్ పోటీల్లో ఇంటర్నేషనల్కు ఎంపికయ్యాడు. ఇటీవల నేపాల్లోని పొకరాలో జరిగిన అండర్–19 పోటీల్లో తెలంగాణ తరఫున ఆడి అవార్డు అందుకున్నాడు. ‘జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి’ జనగామ: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని టీఎస్ జేయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పలంచి నరేందర్ సోమవారం డీఈఓ భోజన్నకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల్లో చాలా మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే ఉన్నారని, వారి పిల్లల చదువులకు రాయితీ కల్పించాలని కోరారు. స్పందించిన డీఈఓ త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ జేయూ ఉపాధ్యక్షుడు గంగిశెట్టి మహేష్కుమార్, కోశాధికారి కొన్నె ఉపేందర్, కార్యవర్గ సభ్యులు చేల్లోజు నవీన్ కుమార్, ఓంకార్, గన్ను కార్తీక్, ఎండీ.అఫ్రోజ్, ప్యాట రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల జనగామ రూరల్ : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లాకు సంబంధించి సెకండ్ ఇయర్లో 1,227 మంది పరీక్ష రాయగా 740 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 720 మందికి 429 ఉన్నారు. ఫస్ట్ ఇయర్లో 2,007 మందికి 1,282 పాసయ్యారు. ఇందులో బాలురు 829 మందికి 430 మంది, బాలికలు 1,178 మందికి 852 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఒకేషనల్లో 343 మందికి 221 మంది, సెకండియర్లో 376 మందికి 192 మంది పాసైనట్లు ఇంటర్ విద్యాధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. -
ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ
జనగామ రూరల్: ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ.. సమస్యలు తీర్చాలంటూ ఏళ్ల తరబడి తిరుగుతున్నారు. అటు మండల స్థాయిలో.. ఇటు జిల్లా స్థాయి గ్రీవెన్స్లో పదుల సార్లు అర్జీలు పెట్టుకున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలు అధికారులకు తమ గోడు చెప్పుకుని వేడుకున్నారు. వివిధ సమస్యలపై 56 వినతులు రాగా రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్ అర్జీలను పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, జనగామ, స్టేషన్ఘన్పూర్ ఆర్డీఓలు గోపిరామ్, డీఎస్ వెంకన్న, డీఆర్డీఓ వసంత, అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ● జిల్లా కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన చెరుకు ప్రమీల కొడుకు శ్రీకాంత్ దివ్యాంగుడు. కురుస్తున్న పాత పెంకుటింట్లో జీవనం సాగిస్తున్నారు. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రమీల అర్జీ పెట్టుకుంది. ● పాలకుర్తి మండలం ముత్తారానికి చెందిన రైతులు పొరల కృష్ణ, కర్రె రవీందర్, బామండ్ల పెద్దాపురం రైతులు కోమటి చెరువు బ్రాహ్మణ కుంట చెరువు శిఖంలో బోర్లు వేసి వ్యవసాయం చేస్తున్నారు. పట్టా భూములకు దారి లేకుండా చేశార ని, తాము పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణం చర్యలు తీసుకో వాలని గ్రామ రైతులు కోరారు. ● చిల్పూర్ మండలం మల్కాపూర్కు చెందిన గంకిడి వీరారెడ్డి అంధుడు. హైదరాబాదు జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తాడు. ‘తన వాటాకు వచ్చిన ఎకరం 10 గుంటలతో పాటు ఇంటి స్థలాన్ని అన్న, వదిన అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. న్యాయం చేయాలని’ అర్జీ పెట్టుకున్నాడు. పక్క ఫొటోలోని వృద్ధురాలి పేరు బి.వీరభద్రమ్మ. తరిగొప్పులకు చెందిన ఈమె భర్త రాజేశ్వర్ చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కరో నా సమయంలో వీరభద్రమ్మకు పాజిటివ్ రావడంతో పాటు బ్లాక్ ఫంగస్, షుగర్, బీపీ అటాక్ అయింది. దీంతో ఓ కన్ను వందశాతం పోయింది. అలాగే నోట్లోని కపాలం తొలగించారు. ప్రస్తు తం ఆమెకు నెలనెలా మందులకు రూ.5వేలు ఖర్చవుతోంది. 64ఏళ్ల వయస్సులో భర్త తన రెక్క ల కష్టంతో భార్యకు చికిత్స చేయిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నా డు. సదరం సర్టిఫికెట్ కోసం శిబిరానికి వెళ్తే ‘ఒకే కన్ను పోయింది.. రెండో కన్ను పోతేనే పింఛన్ వస్తది’ అంటూ వెళ్లగొట్టార ని వీరభద్రమ్మ వాపోయింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా కు చెబుతూ కన్నీటి పర్యంతమైంది. పింఛన్ కావాలంటే గిన్ని తిరకాసులేంటని ఆమె తీవ్ర మనోవేదన గురైంది. మండలంలో 20 సార్లు.. గ్రీవెన్స్లో 8 సార్లు పుట్టుకతోనే నడవలేని పరిస్థితి. పీజీ వరకు చదువుకున్నాను. అమ్మా, నాన్నకు ఒక్కడినే. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. సిస్టం వర్క్ ఫర్ఫెక్ట్గా వస్తుంది. ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో ఓ చిన్న ఉద్యోగం ఇప్పించండి. మూడేళ్ల నుంచి మండల పరిషత్లో 20 సార్లు, కలెక్టరేట్ గ్రీవెన్స్లో 8 సార్లు వినతిపత్రం ఇచ్చాను. నా మొర ఆలకించడం లేదు. ఆదుకోండి. – ఏనూతల నాగరాజు, పాలకుర్తి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి చిన్న పాటి వర్షానికే ఇంట్లో ఉండ లేకపోతున్నం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నం. మొదటి జాబితాలో పేరుఉన్నా మంజూరు సమయంలో రాలేదు. దివ్యాంగుడైన కొడుకు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తమను పోషిస్తున్నాడు. ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – చెరుకు ప్రమీల, ధర్మకంచ, జనగామ పట్టణం ఆలకించి సమస్యలు తీర్చండి గ్రీవెన్స్లో మొరపెట్టుకున్న అర్జీదారులు వివిధ సమస్యలపై 56 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సన్మాన సభకు తరలిరండి
జనగామ రూరల్ : మంద కృష్ణమాదిగ సన్మాన సభకు లక్షలాదిగా దివ్యాంగులు తరలి రావాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిర్రు నగేష్ పిలుపునిచ్చారు. సోమవారం వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం సోమరాజు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పద్మశ్రీ అందుకున్న మంద కృష్ణను ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లోని నాగోల్ శుభం ఫంక్షన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ధరావత్ స్వామి, ఉడుత అనిల్, పశువుల సోమయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
పొద్దంతా ఉక్కపోత.. రాత్రి చలి
జనగామ: వాతావరణంలో చోటుచేసుకుంటున్న వింత మార్పులు ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పొద్దంతా ఎండ.. మధ్యాహ్నం ఆకాశంలో మబ్బులు.. రాత్రి ఈదురు గాలులు, చలి.. ఫలితంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. రాత్రి బాగానే ఉన్నట్టుండి.. తెల్లవారే సరికి అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానలు, సబ్ సెంటర్లు, జిల్లా ప్రభుత్వ జనరల్(డీహెచ్) ఆస్పత్రులు ఉన్నాయి. వాతావరణంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా జనం ఒళ్లు నొప్పులు, తీవ్ర జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్నారు. పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం పరిస్థితిని మరింత జఠిలంగా మార్చుతోంది. నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న పంచాయతీల్లో శానిటేషన్ నిర్వహణ గాడి తప్పింది. దోమల స్వైర విహారంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వెరసి ప్రజలు అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమారు 450 మంది వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో స్వల్ప జ్వరంతో ఉన్నవారు 150 మంది ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు జిల్లా ఆస్పత్రితో పాటు మండలాల పరిధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19,463 మంది ఓపీలో పేర్లు నమోదు చేసుకోగా, 391 మంది అడ్మిట్ అయ్యారు. జిల్లా ఆస్పత్రిలో 4,630 మంది ఓపీ, 72 మంది అడ్మిట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 14,833 మంది, అడ్మిట్ అయిన జ్వర పీడితులు 319 మంది ఉన్నారు. వైద్యులు రోగులను పరీక్షించి అవసరమైన వారికి రక్త నమూనాలు తీసుకుని పరీక్షలు చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ 15 రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు చేరిన రోగుల సంఖ్య 11 వేల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. నిత్యం పర్యవేక్షణ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అందిస్తున్న వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. పల్లెల్లో నమోదవుతున్న జ్వర పీడితులు, ఇతర రోగ గ్రస్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. సబ్ సెంటర్ల పరిధి గ్రామాల్లో సైతం ఏఎన్ఎంలు ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం జ్వరాలు వస్తున్నా తగ్గుముఖం పడుతున్నాయి. – డాక్టర్ మల్లికార్జున్ రావు, డీఎంహెచ్ఓ15 రోజుల్లో జిల్లాలోని ఆస్పత్రులకు వచ్చిన రోగుల సంఖ్యా వివరాలు వాతావరణంలో పెనుమార్పులు జ్వరాల బారిన జనాలు రోగులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు 15 రోజుల్లో ఓపీ 19,463గా నమోదు 391 మంది అడ్మిట్ ఆస్పత్రి నమోదు ఓపీ అడ్మిట్డీహెచ్ 4,630 4,558 72 పీహెచ్సీ 14,833 14,514 319 -
పార్టీలకు ‘స్థానిక’ జోష్!
● మంత్రి పొంగులేటి ప్రకటనతో పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి ● వారంలో నోటిఫికేషన్ ఉంటుందన్న సంకేతాలు ● నేటి కేబినెట్ మీటింగ్ తర్వాత మరింత స్పష్టత ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ● ఆతర్వాతే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ● అధికార పార్టీలో మళ్లీ మొదలైన ఆశావహుల ప్రయత్నాలు ● ‘స్థానిక’ ఎన్నికలకు రాజకీయ పార్టీల సమాయత్తంసాక్షి ప్రతినిధి, వరంగల్: పల్లెల్లో మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. పొలిటికల్ పార్టీలకు ఎలక్షన్ జోష్ వచ్చింది. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్న మంత్రుల వ్యాఖ్యలు.. ఎన్నికల వేడిని రగిలించాయి. మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అత్యధికంగా గెలిచేలా సిద్ధంగా ఉండాలి’ అని నాయకులకు మార్గనిర్దేశం చేసిన మంత్రి ధనసరి సీతక్క పరోక్షంగా ‘స్థానిక’ ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. రెవెన్యూ, గృహనిర్మాణశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఏకంగా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ప్రకటించారు. సోమవారం జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. దీంతో అధికార కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలు పోటీకి సమాయత్తం అవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్ని పార్టీల ఆశావహులు పోటీ చేసేందుకు మళ్లీ పావులు కదుపుతున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు! మంత్రుల వ్యాఖ్యలు, ఇదే అంశంపై సోమవారం కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంటామనడంతో ‘స్థానిక’ ఎన్నికల నగారా ఖాయమన్న చర్చ జరుగుతో ంది. 2019 ఏప్రిల్ 20న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 6, 10, 14 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 27న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. ఇప్పటికే జిల్లాల వారీగా ఎన్నికల, అధికార యంత్రాంగం ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలు, బూత్లు, ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల ప్రకారం జెడ్పీ చైర్మన్ పదవులు కేటాయించారు. వరంగల్ అర్బన్ (హనుమకొండ) ఎస్సీ పురుషుడు/మహిళ, వరంగల్ రూరల్ (వరంగల్) జనరల్, జనగామ అన్ రిజర్వుడ్ కోటాలో పురుషుడు/మహిళ, జయశంకర్ భూపాలపల్లి ఎస్సీ మహిళ, ములుగు అన్ రిజర్వుడ్ పురుషుడు/మహిళ, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీలు, సర్పంచ్లకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే ఈసారి నిర్వహించబోయే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే పరిగణనలోకి తీసుకుంటారా? లేక కొత్త నిబంధనలు తీసుకొస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో జిల్లాల వారీగా మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలుజిల్లా పేరు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ స్థానాలు స్థానాలు స్థానాలువరంగల్ అర్బన్ 07 07 86 వరంగల్ రూరల్ 16 16 178 భూపాలపల్లి 11 11 106 ములుగు 09 09 72 మహబూబాబాద్ 16 16 198 జనగామ 12 12 140 మొత్తం 71 71 780సర్పంచ్ ఎన్నికలకు సమయం ఉంది.. వాస్తవానికి గతంలో సర్పంచ్ ఎన్నికలు ముందు జరిగి.. తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరిలో జరిగితే, మే, జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల తంతు జరిగింది. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందు జరిపించే అవకాశం ఉందనడంతో సర్పంచ్, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్, సభ్యుల ఎన్నికలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి వరంగల్లో మంగపేట మండలం, ఏకగ్రీవమైన 305 పంచాయతీలు మినహా 1,403 గ్రామ పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా గతేడాది జూలైలోనే అధికారులు పంచాయతీల ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. 1,705 జీపీల్లో 15,056 వార్డుల్లో 22,45,394 మంది ఓటర్లను గుర్తించిన అధికారులు ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం అప్పుడు ఎన్నికలకు విముఖత వ్యక్తం చేయడంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. కాగా.. తాజాగా ఎన్నికల ప్రస్తావన తెర మీదకు రావడంతో అన్ని పార్టీల ఆశావహులతో సందడి మొదలైంది. -
‘రైతు నేస్తం’కు సర్వం సిద్ధం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, సాగు, దిగుబడి తదితర వాటికి సంబంధించి రైతు నేస్తం కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్రెడ్డి నేడు (సోమవారం) రైతులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల రైతులతో సీఎం ఇంటరాక్టు కానున్నారు. రైతు వేదిక ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. గతంలో 12 రైతుల వేదికల్లో 12 దృశ్య శ్రవణం అందుబాటులో ఉండగా, నేటి నుంచి మరో 24 వేదికల్లో నూతనంగా ప్రారంభించ బోతున్నారు. మొత్తంగా 36 రైతు వేదికల ద్వారా సీఎం రేవంత్రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. జనగామ మండలం చీటకోడూరు రైతువేదికలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొననున్నారు. సీఎం రైతు నేస్తం ప్రోగ్రాంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏడీఏలు, ఏఓలు, ఏఈఓ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. పండుగ వాతావరణంలో... సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రోత్సాహంగా అందిస్తున్న కార్యక్రమాలపై ముఖాముఖి ఉంటుందని తెలుస్తుంది. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం, ధాన్యం కొనుగోళ్లు తదితర వాటికి సంబంధించి సీఎం నేరుగా రైతు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సమాచారం. రైతు వేదికలను మామిడి తోరణాలతో అలంకరించి, రంగ వళ్లులతో రైతులను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా మహిళా రైతులను భాగస్వామ్యులను చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు, తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయితే సీఎం రైతులను అడిగే సమయంలో వారు చెప్పే సమాధానాలు ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ నెలకొంది. నేడు రైతులతో మాట్లాడనున్న సీఎం 36 రైతువేదికల్లో ఏర్పాట్లు పూర్తి -
కష్టపడే స్వభావం ఉండాలి
జనగామ రూరల్: పిల్లలకు కష్టపడే స్వభావం ఉండాలని పలువురు కవులు, కళాకారులు అన్నారు. ఆ దివారం ఫాదర్స్ డే సందర్భంగా పట్టణంలోని గణేష్వాడలో కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్న గొప్పతనం వెలకట్టలేనిదని, ప్రేమ పంచిపెట్టడంలోనూ బరువు బాధ్యతతో కూడిన జీవ నం అనిర్వచనీయమైనదంటూ కవితా గానంలో పేర్కొన్నారు. పిల్లల ఎదుగుదలకు కష్టపడే స్వభా వం, వ్యక్తిత్వం ఎంతో గొప్పదన్నారు. ఈ కవి సమ్మేళనంలో జి.వై.గిరి ఫౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ, శ్రీశ్రీ కళా వేదిక రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు లగిశెట్టి ప్రభాకర్, అభినందన కల్చరల్ సొసైటీ ఫౌండర్ అయిలా సోమ నర్సింహచారి, కవి హృదయం సాహిత్య వేదిక వ్యవస్థాపకులు పెట్లోజు సోమేశ్వరాచారి, తదితరులు పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు, కళాకారులు -
ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి
● టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జయప్రకాశ్ స్టేషన్ఘన్పూర్: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను, ఉప విద్యాధికారి పోస్టులు, డైట్ అధ్యాపకులు, బీఎడ్ కళాశాల అధ్యాపకుల పోస్టులను అర్హులైన ఉపాధ్యాయులచే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్ డిమాండ్ చేశారు. ఘన్పూర్ డివిజన్కేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, హైస్కూ ల్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, 23 జిల్లాల్లో డీఈఓ పోస్టులు, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా పోస్టులకు ఈనెల చివరివరకు పదోన్నతులు నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా లేకుండా చూడాలని కోరారు. నూతనంగా ఏర్పాటైన ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం 13 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో త్వరగా కోలుకుంటా..● వీడియో సందేశంలో ఎమ్మెల్యే పల్లా జనగామ: నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాజీవితంలో యథావిధిగా పాలుపంచుకుంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి యశోద ఆస్పత్రి నుంచి వీడియో సందేశం ద్వారా ఆదివారం స్పష్టం చేశారు. ఈనెల 11వ తేదీన ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారి పడడంతో గాయమైయిందన్నారు. అందరి ఆశీర్వాదాలతో నాలుగు గంటలు ఆపరేషన్ విజయవంతం అయిందన్నారు. జనగామ నుంచి తనను కలిసేందుకు చాలామంది వస్తున్నారని, మేజర్ ఆపరేషన్ కావడంతో వైద్యులు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి కావాలని చెప్పారన్నారు. ఆరోగ్యం కుదుటపడగానే ప్రతిఒక్కరిని కలుసుకుంటానన్నారు. డాక్టర్కు ఉత్తమ అవార్డుదేవరుప్పుల: వైద్య వృత్తిలో విస్తృత సేవలు అందించినందుకు గాను ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో ప్రముఖ సర్జన్ వైద్యుడు లకావత్ లక్ష్మీనారాయణనాయక్కు ఉత్తమ డాక్టర్ అవార్డు లభించింది. ఆదివారం హైదరాబాద్లోని హైటెక్ సిటీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. గవర్నర్ చేతుల మీదుగా సీపీకి అవార్డు వరంగల్ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెడ్క్రాస్ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. నాటక రంగాన్ని భావితరాలకు అందించాలిహన్మకొండ కల్చరల్ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆ డిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొని మాట్లాడారు. -
శ్రీశ్రీ అడుగుజాడల్లో నడవాలి
జనగామ రూరల్: మహాకవి శ్రీశ్రీ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి లగిశెట్టి ప్రభాకర్ అన్నారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని స్కాలర్ గ్రామర్ స్కూల్లో ఆదివారం శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాస్) వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ సమసమాజ నిర్మాణానికి శ్రీశ్రీ కవిత్వం పునాదులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు సాంబరాజు యాదగిరి, జి.కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి, అయిలా సొమనర్సింహచారి, నక్క సురేష్, చిలుమోజు సాయికిరణ్, డాక్టర్ వేముల సదానందం, పొట్టబత్తిని భాస్కర్, గడ్డం మనోజ్ కుమార్, రంగరాజు ప్రసాద్, గూటం రమేష్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, గుండె కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి గిరిజన తండాల్లో సదస్సులు
జనగామ: జిల్లాలోని గిరిజన తండాల్లో ఈ నెల 16 నుంచి పీఎం దర్తీ ఆభ జన్ భాగీ ధారి అభియాన్ పథకంపై సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. శనివారం కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆరు మండలాల పరిధిలో తొమ్మిది గిరిజన తండాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 16 నుంచి జూలై 2వ తేదీ వరకు సమస్యల పరిష్కారానికి తండాల పరిధిలో సదస్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధార్, కిసాన్ క్రెడిట్, రేషన్కార్డు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, ఆయుష్మాన్ భవ, ఇన్సూరెన్స్ కవరేజ్, వృద్ధాప్య, వితంతు పెన్షన్ తదితర పథకాలకు సంబంధించి అర్హులైన వారికి అందించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో వినతులను స్వీకరించనున్నారు. తరిగొప్పుల మండలం భోజ్యా తండా గ్రామపంచాయతీ పరిధి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తేదీల వారీగా సదస్సుల వివరాలు ఈ నెల 16, 17న తరిగొప్పుల మండలం భోజ్యాతండా, 18, 19, 20 తేదీల్లో నర్మెట మండలం బొమ్మకూరు, మల్కపేట, 21, 23న చిల్పూరు మండలం ఫతేపూర్, 24, 25, 26న పాలకుర్తి మండలం కొండాపూర్, మైలారం, 27, 28, 30, జూలై 2న దేవరుప్పుల మండలం లకావత్తండా (తూర్పు), ధర్మాపురం, జూలై 2న కొడకండ్ల మండలం నీలిబండతండాలో సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆరు మండలాల్లో తొమ్మిది తండాలు ఎంపిక కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ప్రైవేట్కు దీటుగా..
సర్కారు కాలేజీల్లో అత్యుత్తమ బోధన● గ్రామాల్లో అధ్యాపకుల విస్తృత ప్రచారం ● 30శాతం పెరగనున్న అడ్మిషన్ల సంఖ్యజనగామ రూరల్: ప్రైవేట్కు దీటుగా అత్యుత్తమ బోధన వసతులపై ఊరూరా ప్రచారం చేస్తూ సర్కారు కాలేజీలో విద్యార్థుల ప్రవేశాలు తీసుకోవాలని అధ్యాపకులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో ఏడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ ఏడాది మొత్తం 4,920 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 68 శాతంగా నమోదైంది. జనగామ, స్టేషన్ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వడంతో పాటు స్వేచ్ఛయుత వాతావరణం కల్పించడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న అడ్మిషన్ల సంఖ్య 2019–20 విద్యాసంవత్సరంలో జనగామ జూనియర్ కళాశాలలో మొత్తం 2,418 విద్యార్థులు ఉంటే ప్రస్తుత విద్యాసంవత్సరానికి నెల రోజుల వ్యవధిలోనే 415 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇంకా అడ్మిషన్ల గడువు ఉండడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రవేశాలకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన బోధన, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నా... కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్లో ఎక్కువ ఫీజులు చెల్లిస్తూ జేబులు చిల్లు చేసుకుంటున్నారు. ఈసారి అలా కాకుండా ఇంటర్ బోర్డు అధికారులు, కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. దాదాపు 50 రోజుల ముందునుంచే గ్రామాల్లో పర్యటించి కళాశాలల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.కళాశాలల వారీగా అడ్మిషన్ల సంఖ్య కళాశాల నమోదైన విద్యార్థుల సంఖ్య స్టేషన్ఘన్పూర్ 71 దేవరుప్పుల 39 జనగామ 81 జఫర్గఢ్ 28 కొడకండ్ల 26 నర్మెట 75 జనగామ (బాలికలు) 95 ప్రభుత్వ కళాశాలల్లో కల్పించే వసతులు.. ఉత్తమ ఫలితాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉపకార వేతన సౌకర్యం. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్లో ఫీజు మాఫీ. బస్సు సౌకర్యం లేనటువంటి రూట్లను గుర్తించి రవాణా సౌకర్యం కల్పించడం. అనుభవం, అంకితభావం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన. గ్రంథాలయాలు, క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి గురించి వివరించడం.విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిపుణులైన, క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులు బోధిస్తున్నారు. రాష్ట్రంలో గొప్పస్థాయిలో ఉన్నవారు, అనేక అవార్డులు పొందిన వారు జిల్లాలో పనిచేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తాం. నాలుగేళ్లుగా ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూవస్తుంది. – జితేందర్ రెడ్డి, ఇంటర్ విద్యాధికారి -
శాంతి చర్చలు జరపాలి●
● ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన జనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతిచర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని శనివారం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, మేధావుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డిలు మాట్లాడుతూ అటవీ సంపద, ఖనిజాలను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఆపరేషన్ కగార్ అన్నారు. తక్షణమే బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే శాంతిచర్చలు జరపాలని, లేదంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, బన్సీ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి, బక్క శ్రీనివాస్, జోగు ప్రకాష్, న్యాయవాది సాధిక్ అలీ, వేముల నర్సింగం, రాపర్తి రాజు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
జఫర్గఢ్: కన్నపిల్లలు కాకున్నా.. వందలాది మంది పిల్లలతో నాన్న అని పిలుపించుకుంటున్నారు ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య. మండలంలోని రేగడితండా గ్రామ శివారు టీబీ తండా వద్ద ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ అనాథ ఆశ్రమం’లో రెండు దశాబ్దాలుగా ఎంతో మంది అనాథలను అక్కున చేర్చుకుని ఆశ్రమంలో చోటు కల్పించారు. వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు గాదె ఇన్నయ్య. అనాథ పిల్లల పట్ల తండ్రి ప్రేమను పంచుతూ.. పిల్లల అభిమానాన్ని పొందుతున్నారు. ఆశ్రమంలోని పిల్లలు తమ ఆధార్ కార్డుల్లో, పాఠశాలల రికార్డుల్లో సైతం ఇన్నయ్య పేరునే తమ తండ్రిగా రాయించడం విశేషం. ఈసందర్భంగా గాదె ఇన్నయ్య మాట్లాడుతూ.. ఎంతో మంది అనాథ పిల్లలతో నాన్న అని పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పిల్లలు కూడా తనను తండ్రిలాగే భావిస్తూ తనపై అభిమానం చూపుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు కూడా ఆశ్రమంలో ఇన్నయ్యను నాన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇలా.. పిలవడమే తమకిష్టం అని పిల్లలు చెబుతున్నారు. ‘తండ్రి లేని లోటును తీరుస్తున్న ఇన్నయ్యే మా నాన్న’ అంటూ వారు పేర్కొనడం గమనార్హం.ఏళ్ల కష్టానికి.. విజయమే సమాధానం! బచ్చన్నపేట: భూమిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించారు. చదువును నమ్ముకుని పిల్లలను బాగా చదివించారు. ఆ తండ్రి ఇప్పుడు గర్వంగా చెబుతున్నాడు తమ పిల్లలు ప్రయోజకులయ్యారని. బచ్చన్నపేటకు చెందిన చిమ్ముల మల్లారెడ్డికి ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సేద్యం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించాడు. పాడి పశువుల్ని సాకుతూ పాలు పితికి అమ్ముతూ, వ్యవసాయం చేస్తూ ఒక కొడుకు, ఒక కూతురును ఉన్నతంగా చదివించారు. కూతురు చిమ్ముల నవిత ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా జనగామ మండలం పెద్దపహాడ్లో విధులు నిర్వరిస్తున్నారు. కుమారుడు రాజశేఖర్రెడ్డి గ్రూప్–1లో స్టేట్ 272వ ర్యాంకు సాధించారు. ‘నా కలలు నిజమయ్యాయి. పిల్లలు ప్రయోజకులవ్వడం చూస్తే ఇన్నేళ్ల కష్టం మరిచిపోతున్నా’ అంటున్నారు చిమ్ముల మల్లారెడ్డి. న్యూస్రీల్వందలాది పిల్లలకు దేవుడిచ్చిన నాన్న -
ఘనంగా వార కల్యాణం
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావుల ఆధ్వర్యంలో వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులకు హైదరాబాద్కు చెందిన కొండ విష్ణుమూర్తి, శోభారాణి, దేవులపల్లి వెంకటేశ్వర్లు, అనురాధలు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు గణగోని రమేష్, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్, భక్తులు పాల్గొన్నారు. -
నాన్న.. కలల నిచ్చెన
పిల్లల జీవితాలకు రంగులద్దుతున్న తండ్రులు ● త్యాగాలు చేస్తూ.. కన్నీళ్లు మోస్తూ.. శక్తికి మించి పనిచేస్తూ ● కడుపున పుట్టినవారు ఉన్నతంగా బతకాలని వారందరి తపన ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా ఫాదర్స్ కష్టాలెన్నున్నా.. చిరునవ్వు ఒలకబోస్తాడు. కన్నీటి సుడులు ఉప్పైనె పొంగుతున్నా.. పంటి బిగువన అదిమి పడతాడు. తాను మాసిన గడ్డంతో ఉన్నా.. పిల్లల బట్టలు మెరవాలంటాడు. తన కోరికలు చంపుకునైనా.. పిల్లలు కోరినవేవైనా చిటికెలో పట్టుకొస్తాడు. తాను కడుపు నిండా తినకపోయినా.. కంటి నిండా నిద్రపోకపోయినా కుటుంబం కోసం అడ్జెస్ట్ అవుతాడు. పిల్లల జీవితాలకు రంగులద్దుతాడు. వారి కలలకు నిచ్చెనవుతాడు. ప్రతీ కుటుంబానికి నాన్న ఓ హీరో. నేడు(ఆదివారం) ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు. నేడు ఫాదర్స్ డే -
నడిచే దైవం.. నాకు తొలినేస్తం
ఖిలా వరంగల్: వరంగల్ 34వ డివిజన్ శివనగర్కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్ రిప్రసెంటేటివ్గా పని చేస్తూ పిల్లల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్ ఇండియా సివిల్ సర్వీస్లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈస్థానంలో నిలబెట్టింది. -
నాన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి..
వరంగల్ క్రైం: చిన్నప్పటి నుంచి మా నాన్న జన్నేల్సింగ్ నాలో నింపిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. వృత్తిరీత్యా నాన్న ప్రిన్సిపాల్ కావడంతో చదువులో ప్రోత్సాహం అందించారు. ముఖ్యంగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన చేసిన మోటివేషన్ నాలో రెట్టింపు ఉత్సాహం నింపింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచేలా తిర్చిదిద్దారు. సామాజిక సమస్యలు, వాటిని ఎదుర్కొంటున్న ప్రజల జీవన స్థితిగతులపై అవగాహన కల్పించారు. చదువుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు ప్రతీ దశలో వెన్నంటి ప్రోత్సహించారు. – సన్ప్రీత్ సింగ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
వెలివేసినా.. విజయబావుటా!
రఘునాథపల్లి: రఘునాథపల్లి గ్రామానికి చెందిన కొయ్యడ ప్రభాకర్ 33 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఇరు కుటుంబాలు వెలివేశాయి. అయినా బెదరకుండా అద్దె ఇంట్లో ఉంటూ.. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా, ఆర్ఎంపీగా, రోజు వారీ కూలీగా పని చేశాడు. ముగ్గురు కుమారులు, ఒక కూతురిని చదివించారు. పెద్ద కుమారుడు ఉదయ్కుమార్ సింగరేణిలో పర్సనల్ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ ఇటీవల గ్రూప్–1లోనూ ప్రతిభ చాటారు. రెండో కుమారుడు పృధ్వీకుమార్ హైదరాబాద్లో లా పైనల్ ఇయర్ చదువుతున్నాడు. మూడో కుమారుడు ప్రణయ్కుమార్ తెలంగాణ కేడర్ ఐఏఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్న కూతురు మౌనశ్రీ ఓయూలో పీహెచ్డీ చేస్తోంది. ‘ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొన్న.. అద్దె ఇంట్లో ఉంటూ పడరాని కష్టాలు పడ్డా. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించి ఉన్నత స్థానాల్లో నిలిపినందుకు గర్వపడుతున్నా. ప్రణయ్కుమార్ ఐఏఎస్ సాధించిన రోజు మరువలేనిది. అనేక కష్టాలను అనుభవించిన మేం.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందు వరుసలో ఉంటాం’ అంటున్నారు ప్రభాకర్. -
రాజీపడితేనే సమస్యల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ జనగామ రూరల్: రాజీపడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కారించుకోవాలన్నారు. లోక్ అదాలత్లో 6 బెంచ్ల ద్వారా సమస్యలను పరిష్కరించారు. మొత్తం సివిల్ కేసులు 82, మోటార్ యాక్సిడెంట్ కేసులు 4, క్రిమినల్ కేసులు 5160, ప్రీ లిటిగేషన్ 450 కేసులను పరిష్కరించగా రూ.1,03,17,307 వసూలు అయినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెంచ్ జడ్జీలు విక్రమ్, ఈ సుచరిత, జి. శశి, సందీప, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పూజలు
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి శేషవస్త్రాలతో సన్మానించి, ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ జడ్జి సందీప, ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు, ఎస్సై దూలం పవన్కుమార్, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్శర్మ, అనిల్కుమార్, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంజనగామ రూరల్: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే మోదీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొఫెషనల్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి పేదల అభ్యన్నతికి తోడ్పాటునందిస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అత్యధిక స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లేగా రామ్మోహన్ రెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్, నందా రెడ్డి, తోకల ఉమారాణి, శివరాజ్ యాదవ్, శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్గా వేదకుమార్జనగామ/రఘునాథపల్లి: జిల్లా ఆర్యవైశ్య మహాసభ జోన్ చైర్మన్గా రఘునాథపల్లికి చెందిన కూరెళ్ల వేదకుమార్ నియామకమయ్యా రు. ఈ మేరకు శనివారం ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్య క్షుడు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్కుమార్ వెల్లడించారు. అనంతరం వేదకుమార్కు నియామకపత్రం అందించి శాలువాతో సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని, ఈ నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, కోశాధికారి బెజుగం భిక్షపతి, రీజన్ చైర్మన్ పడకంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలిజనగామ రూరల్: ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు అధ్యక్షత జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం అవుతున్నప్పటికీ విద్యా రంగంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కన్వీనర్ గూడెల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తండ్రి తాపీ మేసీ్త్ర.. కుమార్తె డాక్టర్
కాజీపేట రూరల్: ఆయన చదువుకోలేదు. తనలా పిల్లలు కావొద్దని బాగా చదివించాడు. సమాజంలో గొప్ప స్థాయిలో కూతుళ్లను చూస్తూ మురిసిపోతున్నాడు కాజీపేట బాపూజీనగర్కు చెందిన తాపీ మేసీ్త్ర లింగాల వీరస్వామి. వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు. 15 ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. పెద్ద కూతురు హేమలతను వైద్య విద్య చదివించాడు. ఆమె ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రైమరీ వెటర్నరీ సెంటర్ పెగడపల్లిలో అసిస్టెంట్ సర్జన్గా పని చేస్తున్నారు. చిన్న కూతురు సుమలత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నాన్న జీవితమే తమకు ప్రేరణనిచ్చిందని.. సుమలత, హేమలత చెబుతున్నారు. -
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి జనగామ రూరల్: జాతీయ రహదారి జనగామ నుంచి దుద్దెడ వరకు నిర్మిస్తున్న 365బి నిర్మాణంలో ఇళ్ల స్థలాలు కోల్పోతున్న యజమానులకు గజానికి రూ.20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ గోపిరామ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న బాధితుల విషయంలో ప్రభుత్వాలు, అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్హెచ్ బాధిత ప్లాట్ ఓనర్ల కమిటీ అధ్యక్షుడు బూడిది గోపి, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దల కిషోర్, కోశాధికారి గూడెల్లి కృష్ణారెడ్డి, గౌరవ సలహాదారు కర్రే కృష్ణ, నల్ల యాదగిరి, గంగుల భూపాల్రెడ్డి, గుండు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన అందుతుందని డీఈఓ డి.భోజన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, టెంపుల్ కాలనీ పాఠశాలల్లో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో ఈ విద్యాసంత్సరం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, మైనర్ రిపేర్ పనులు చేయించినట్లు తెలిపారు. పాలకుర్తి ప్రాథమిక పాఠశాల అద్భుతంగా ఉందని హెచ్ఎం చిదురాల శ్రీనివాస్ను, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం శోభారాణి, టెంపుల్ కాలనీ హెచ్ఎం ఇమ్మడి అశోక్, ఎం.శ్రీనివాస్, విజయ్కుమార్, విజేందర్, శ్రీనివాస్, మంజుల, అప్రాష్ సూల్తానా, సుధాకర్, నరసింహమూర్తి, సంపత్ పాల్గొన్నారు.జిల్లా విద్యాధికారి భోజన్న -
ప్రైవేట్ మాయా వలయంలో చిన్నారులు
● లెక్కకు మించి నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు ● బ్యాగు మోయలేక చిన్నతనంలోనే వెన్ను సంబంధ సమస్యలు˘ జనగామ: ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలు బండెడు పుస్తకాల మూట మోయాల్సి వస్తున్నది. చదువుల పేరిట వారిపై మోయలేని భారం మోపుతున్నారు. లెక్కకు మించి నోట్బక్స్, పాఠ్యపుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని ఉదయం బడికి వెళ్లడం, సాయంత్రం తిరిగి రావడంతో అలసటకు గురవుతున్నారు. స్కూల్కు వెళ్లిన తర్వాత మొదటి, రెండవ అంతస్తులో ఉన్న తరగతి గదికి బ్యాగుతో చేరుకోవాల్సి ఉంటుంది. భరువు మోయలేక ముక్కుపచ్చలారని చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నా రు. స్కూల్ బ్యాగుల బరువు ఎంత ఉండాలనే అంశంపై 2006లోనే ఉమ్మడి రాష్ట్రంలో చట్టం తీసుకువచ్చారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో చిన్నారు ల ‘బ్యాగు మోత’పై కథనం. శరీర బరువులో 10శాతం మించొద్దు చిల్ట్రన్ స్కూల్ బ్యాగ్ యాక్టు–2006 ప్రకారం విద్యార్థి శరీర బరువులో పుస్తకాల బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థి 3 కిలోల బరువుకు సమానంగా పుస్తకా ల బ్యాగు ఉండాలి. అయితే ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే.. పుస్తకాల బ్యాగు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి 35 నుంచి 40 కిలోలు ఉంటే.. పుస్తకాల బరువు దాదాపు 12 కేజీలు దాటుతోంది. దీంతో విద్యార్థుల వెన్ను విలవిల్లాడిపోతోంది. శారీరక, ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెడ, భుజాలు, వెన్నుముక వంగి పోతున్నాయి. అనేక మంది పిల్లలు వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. శ్వాస పూర్తిగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతున్నది. తరగతులకు వెళ్లేందుకు తంటాలు జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు అత్యధికంగా బహుళ అంతస్తుల భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. పుస్తకాల బ్యాగు బరువుతో విద్యార్థులు పైకి వెళ్లేందుకు నరకం చూస్తున్నారు. రెగ్యులర్ సిలబస్ పుస్తకాలతో పాటు అసైన్మెంట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, డైరీ తదితరాలతోపాటు హోంవర్క్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఎన్విరాన్ మెంటల్ సైన్స్.. ఒక్కో సబ్జెక్టుకు 2 నుంచి 4 నోట్బుక్స్ ఉండడంతో మోయలేని భారంగా తయారైంది. యశ్పాల్ కమిటీ నివేదిక ఇలా.. విద్యార్థుల స్కూల్ బ్యాగు బరువుపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం యశ్పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ‘లెర్నింగ్ విత్ అవుట్ బర్డెన్’ పేరుతో నివేదిక వెల్లడించింది. దాదాపు 90 శాతం పాఠశాలల్లో ఆహ్లాదకరంగా లేని బోధన సాగుతోందని, ఫలితంగా విద్యార్థులు మానసిక వేదనకు గురువుతున్నారని పేర్కొంది. దీనికి తోడు అవసరానికి మించిన పుస్తకాలు విద్యార్థుల ప్రతిభకు అడ్డంకిగా మారుతున్నాయని వ్యాఖ్యానించింది. ఈ నివేదిక ప్రకారమే 2006లో స్కూల్ బ్యాగులపై చట్టం తీసుకువచ్చారు. నియమ నిబంధనలు: ● నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు పుస్తకాలు మోయకూడదు. ● ఇతర తరగతికి చెందిన విద్యార్థుల బ్యాగులు శరీరం కంటే 10శాతానికి మించకూడదు. ● స్కూల్ బ్యాగు బరువు, రోజు తీసుకురావాల్సిన పుస్తకాలపై శాసీ్త్రయ అంచనాలతో తల్లిదండ్రులకు పాఠశాలలు మార్గదర్శకాలు ఇవ్వాలి. ● కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూల్ బ్యాగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● మిగిలిన పుస్తకాలు స్కూల్లో భద్ర పరుచుకునేలా పాఠశాలల యాజమాన్యాలు లాకర్, డెస్క్ ఏర్పాటు చేయాలి. ఈ నిబంధనలు పాటించక పోతే ఆయా స్కూళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి స్కూల్ బ్యాగుల అధిక బరువుతో పిల్లలు చిన్న తనంలోనే అనేక అనా రోగ్య సమస్యల బారిన పడుతున్నారు. చట్టంలోని నిబంధనల మేరకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో హోం వర్క్ ఇచ్చిన పుస్తకాలు మినహా మిగతావి బడిలోనే ఉండేలా చూడాలి. ఇలా చేయకుంటే వెన్నుపూసపై తీవ్ర ప్రభావం పడుతుంది. పిల్లల ఎదుగుదల విషయంలో దుష్ఫలితాలు ఉంటాయి. బ్యాగుల మోతపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించక పోతే ఎదిగే పిల్లలను అనారోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి. – కల్నల్, డాక్టర్ భిక్షపతి, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఎండీ (మెడిసిన్) -
‘స్వచ్ఛ జనగామ’గా తీర్చిదిద్దుకుందాం
జనగామ: పట్టణాన్ని ‘స్వచ్ఛ జనగామ’గా తీర్చిదిద్దుకుందాం.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు సంచాలకులు జ్యోత్స్న అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘100 రోజుల కార్యాచరణ’లో భాగంగా శుక్రవారం ఆమె జనగామలో పర్యటించారు. కమిషన్ వెంకటేశ్వర్లుతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, తడి, పొడిచెత్త సేకరణ, దోమల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అపరి శుభ్ర వాతావరణంతో పందులు, కుక్కల సంచారం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నార ని, ప్రతీ కుటుంబం ఇంటి మాదిరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. పట్టణంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మున్సిపల్, మెప్మా విభాగాలు కలిసి పనిచేయాలని, వందరోజుల్లో ఈ మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వి.గోపయ్య, పులి శేఖర్, మెప్మా సిబ్బంది వాణిశ్రీ, తిరుమల, షాహిన్ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు సంచాలకులు జ్యోత్స్న -
చవక ధరలకు నాణ్యమైన మందులు
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు పాలకుర్తి టౌన్: చవక ధరలకు నాణ్యమైన మందులు ప్రధాన మంత్రి జాతీయ జన్ ఔషధి కేంద్రంలో పొందవచ్చని జిల్లా వైద్యాధికారి కె.మల్లికార్జున్రావు అన్నారు. మండల కేంద్రంలో జాతీయ జన్ ఔషధి కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శంచిన ఆయన వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్ఓ డాక్టర్ సుధీర్, డీఐఓ డాక్టర్ స్వర్ణకుమారి, పీహెచ్సీ వైద్యాధికారి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. -
నిజరూప దర్శనం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం భక్తులకు నిజరూప అలంకరణలో దర్శనంఇచ్చారు. ఉదయం ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ శ్రీధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు లాభదాయకం నర్మెట: ఆయిల్ పామ్ తోటలతో రైతులకు అధిక లాభాలుంటాయి.. అంతర పటలకు అనుకూలమని ఆయిల్ ఫెడ్ జిల్లా మేనేజర్ శంకర్ అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు అవగా హన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం పొందవచ్చని, చీడపీడలు, కోతులతో నష్టం ఉండదని పేర్కొన్నారు. బిందు సేద్యం ద్వారా 50 శాతం ఎరువులు, సాగు ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. ప్రభుత్వం నిర్వహణ వ్యయంగా ఎకరాకు రూ.4,500 ఆర్థిక సహాయం అందజేస్తున్నదని, బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఓ హరిబాబు, పీఎంఓ రాజేందర్, డ్రిప్ కంపెనీ ప్రతినిథులు, రైతులు పాతూరి మల్లారెడ్డి, దేవులపల్లి రాంరెడ్డి, ముప్పిడి భూమయ్య, కొన్నె భిక్షపతి, నిమ్మ కృష్ణారెడ్డి, ఐలేని సిద్దిరామిరెడ్డి, వెంకట్రామి రెడ్డి, గౌరబోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ కుంటలో ఔషధ మొక్కలుజనగామ: పట్టణంలోని బతుకమ్మకుంటలో ఔషధ మొక్కలు నాటేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయుష్ విభాగం ప్రతినిధులు శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. మెడికల్ ప్లాంట్స్ గురించి వివరించి సింధూరి మొక్క అందజేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ కుంట చుట్టూ ఔషధ మొక్కలు నాటేందుకు కలెక్టర్ అనుమతించారు. కార్యక్రమంలో విశ్వ ఆయుర్వేద పరిషత్ నుంచి డాక్టర్ సురేష్, డాక్టర్లు అంజిరెడ్డి, అనురాధ, మమత, హారిక, ప్రీతి తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలనజనగామ రూరల్: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంను శుక్రవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా సందర్శించారు. భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పనితీరు, మంటల నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. ఈవీఎం వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్ల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల ని, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ పార్టీల నాయకులు భాస్కర్, రవి, విజయభాస్కర్, జోగు ప్రకాశ్ తదితరులు ఉన్నారు. 24 గంటల ధర్నాను జయప్రదం చేయండిజనగామ రూరల్: పట్టణంలోని మూడో విడత ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యాన ఈనెల 16న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన 24 గంటల ధర్నాను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కార్యాలయంలో మూడో విడత ఇందరమ్మ ఇళ్ల సాధన కమిటీ అధ్యక్షు డు కళ్యాణం లింగం ఆధ్వర్యాన ఏర్పాటు చేసి న సమావేశంలో వారు మాట్లాడారు. ఇళ్లు నిర్మించుకొని అక్కడే నివాసం ఉంటున్న లబ్ధిదారులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంటి నంబర్లు, విద్యుత్, రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోట్ల శ్రావణ్, పగిడిపల్లి బాలమణి, కొమ్మగళ్ల ఎల్లయ్య, ముసిపట్ల జయ, భూనాద్రి వెంకటేశ్, మాదాసి సుధాకర్, బాలస్వామి, మేడ పద్మ, కొడిదాల అంజమ్మ, గుండు శశిరేఖ, సంతోష తదితరులు పాల్గొన్నారు. -
అదనపు కోర్టు మంజూరు చేయాలి
స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో అదనపు కోర్టు మంజూరు చేయాలని స్థానిక బార్ అసోసియేషన్ బాధ్యులు జిల్లా జడ్జి ప్రతిమను కోరారు. జడ్జి శుక్రవారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. కోర్టు పరిసరాలను పరిశీలించిన ఆమె కోర్టు ఫైలింగ్ కేసులు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఘన్పూర్ కోర్టు పరిధిలోని కేసుల గురించి ఘన్పూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకం రమేశ్ జడ్జికి వివరించారు. కోర్టు పరిధిలో 3,600 కేసులు ఉన్నాయని, హైకోర్టు నిబంధనల మేరకు అదనపు కోర్టు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఘన్పూర్ జడ్జి సందీప తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జికి ఘన్పూర్ బార్ అసోసియేషన్ బాధ్యుల వినతి -
ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలి
జనగామ రూరల్: ముస్లింలకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షుడు న్యాయవాది జమాల్ షరీఫ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రార్థన అనంతరం జనగామలోని జామియా, ఏక్ మినార్, అజీజియా, హైదర్, జుబేదా మసీదుల్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రభుత్వంలో 14శాతంగా ఉన్న ముస్లింలకు ఒక మంత్రి పదవి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఓట్ల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తరువాత తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ నుంచి అమీర్అలీఖాన్ మాత్రమే ఉన్నారని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ముహమ్మద్ అన్వర్, ముహమ్మద్ ఇస్మాయిల్, ముహమ్మద్ గౌస్, ముహమ్మద్ అజారుద్దీన్, ముహమ్మద్ అలీముద్దీన్, ముహమ్మద్ బాబా, ఫరూక్, అకీల్ హమ్మద్, ముహమ్మద్ రఫీ మతీన్ అడ్వకేట్, డాక్టర్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు. -
బడి.. విద్యార్థుల సందడి
శుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuజనగామ: సర్కారు బడుల పునఃప్రారంభం పండుగ వాతావరణాన్ని తలపించింది. అరటి, మామిడి కొమ్మలు, తీరొక్క పూలతో బడుల ప్రాంగణాలను అలంకరించి, చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సెలవులను ముగించుకుని స్కూల్ బాట పట్టిన విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. యూనిఫాంలో కొందరు, కొత్త బట్టలు ధరించి మరి కొందరు విద్యార్థులు బడికి వచ్చారు. విద్యార్థుల చేతిలో పూలు పెట్టి ఉపాధ్యాయులు, హెచ్ఎంలు స్వాగతం పలికారు. యాభై రోజుల పాటు ఆడి, పాడుతూ ఎంజాయ్ చేసిన పిల్లలు, నూతన విద్యా సంసవత్సరంలో భుజాన బ్యాగు వేసుకున్నారు. మొదటి రోజు తల్లిందడ్రులతో కలిసి పాఠశాలకు వచ్చిన విద్యార్థులు పై తరగతిలో కూర్చొని సంతోషపడ్డారు. జనగామ మండలం ఎర్రగుండ తండా పీఎస్ను కలెక్టర్ పునఃప్రారంభించారు. నూతన విద్యార్థులు 2,428 జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల పాఠశాలలు 548 ఉన్నాయి. వీటి పరిధిలో 45 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు డీఈఓ భోజన్న పర్యవేక్షణలో టీచర్లు బడిబాట నిర్వహించారు. దీంతో విద్యార్థుల సంఖ్యను కొంతమేర పెంచగలిగారు. అన్ని కేటగిరీల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,607, కేజీబీవీ (6 నుంచి12 వర కు) 821 మొత్తం 2,428 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. తొమ్మిది జీరో స్కూళ్లు పునఃప్రారంభం జిల్లాలో 72 ప్రాథమిక, ఒక యూపీఎస్ మొత్తం 73 పాఠశాలల్లో జీరో స్ట్రెంత్తో రెండేళ్ల క్రితం మూసేశారు. గతంలో మూతబడిన పాఠశాలల్లో బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి, జయాల, చిల్పూరు మండలం గార్లగడ్డ తండా, దేవరుప్పుల మండలం మల్యతండా, రాజీవ్ కాలనీ, జనగామ మండలం ఎర్ర గుంటతండా, కొడకండ్ల మండలం బోడ తండా, నర్మెట మండలం లుంబియా తండా, పాలకుర్తి మండలం కురుమ తండా పరిధిలో తిరిగి పునఃప్రారంభించారు. తొమ్మిది గ్రామాల్లో ఉపాధ్యాయులు గత నెల రోజుల నుంచి ఇంటింటికీ తిరుగుతూ సర్కారు బడుల్లో బోధన గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. బడులను పునఃప్రారంభించడంలో సక్సెస్ సాధించారు. నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫాం అందించారు. కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు బుక్ బ్యాంకు నుంచి ఇవ్వగా.. తక్కువగా ఉన్న వారి కోసం సర్కారుకు ఇండెంట్ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అడ్మిషన్ల కోసం క్యూలు.. గతంలో ఎన్నడూ లేని విధంగా 2025–26 నూతన విద్యా సంవత్సరం మొదటి రోజు చాలా చోట్ల సర్కారు బడుల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కట్టారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్, బచ్చన్నపేట, రఘునాథపల్లి ఇలా అనేక పాఠశాలల పరిధిలో ఉపాధ్యాయులు ఊహించని విధంగా అడ్మిషన్లు తీసుకున్నారు. కలెక్టర ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు బడి బాట పట్టి వసతి సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజన తయారీ, వడ్డింపు తదితరాలు పర్యవేక్షించారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 548విద్యార్థుల సంఖ్య: 45,000మొదటి రోజు హాజరు శాతం: 69.8న్యూస్రీల్ పునఃప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులకు పూలతో స్వాగతం యూనిఫాంలో కొందరు.... కొత్త దుస్తుల్లో ఇంకొందరు కలెక్టర్, డీఈఓ, ఉన్నతాధికారుల పర్యటనలు యాభై రోజుల తర్వాత మోగిన పాఠశాల గంట నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ తొమ్మిది జీరో స్కూళ్లు రీఓపెన్పుష్పాలిచ్చి.. స్వాగతించి! నర్మెట: మండలంలోని మాన్ సింగ్తండా, కేజీబీవి, ఆగపేట పాఠశాలలను సందర్శించిన డీఈఓ భోజన్న విద్యార్థులకు గులాబీ పువ్వులు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మడిపల్లి ఐలయ్య, కాంప్లెక్స్ హెచ్ఎం నీలం వేణు, హెచ్ఎంలు పైడిపల్లి దామోదర్, గంగరాజు కేశవరావు, ఎస్ఓ బైరోజు రజిత, ఉపాధ్యాయులు రావుల రామ్మోహన్రెడ్డి ఉన్నారు.పాఠ్యపుస్తకాల అందజేత జనగామ రూరల్: బడిబాట సందర్భంగా మండలంలోని ఓబులకేశ్వాపూర్ ఉన్నత పాఠశాలలో డీఈఓ దర్శనం భోజన్న, ఎంఈఓ శంకర్ రెడ్డి గురువారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్లు, యూనిఫాం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగిళ్ల నర్సింహారెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ శ్రీమతి బత్తెపు ఉమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదువుతోనే గౌరవం ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం బడి బాటలో భాగంగా జనగామ మండలం ఎర్రకుంట తండా మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పునఃప్రారంభించారు. ఎర్రకుంట పాఠశాలకు 28 మంది విద్యార్థులు వచ్చేలా కృషి చేసిన ఉపాధ్యాయురాలు రేష్మాను అభినందించారు. కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ భోజయ్య, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం
తరిగొప్పుల: భూభారతి రెవెన్యూ సదస్సులతో రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మహిపాల్రెడ్డి, డీటీ మందాడపు రామారావు, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. గురువారం జనగామ మండలం ఎర్రకుంట తండాలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా అందుతాయన్నారు. తండాకు చెందిన మాలోతు అనితను ఇంటి నిర్మాణం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ -
చదువుతోనే బంగారు భవిష్యత్
● జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ బచ్చన్నపేట: విద్యార్థులు చదువుకుంటేనే బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఆదర్శ, కస్తూర్బాగాంధీ, సెకండరీ పాఠశాలల పరిసరాలను మధ్యాహ్న వంటను పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు బుక్స్ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక వసతులు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు వాటిని వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పాఠశాల ప్రిన్సిపాళ్లు భారతీదేవి, గీత, పంచాయతీ కార్యదర్శి అనిల్రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. -
రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..
స్టేషన్ఘన్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో హామీలు అమలు చేయాలని గురువారం ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులకు రుణ విముక్తి చేయాలని, రుణ విమోచన చట్టం తేవాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ ప్రైవేటు మార్కెట్ల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులకు చేసిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి, నాయకులు మొగిలి, రాజు, మల్లయ్య, సోమయ్య, లింగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి
రఘునాథపల్లి: క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కె.మల్లికార్జునరావు వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంద రోజుల టీబీ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక క్షయ వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. టీబీ నిర్ధారణ కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మొబైల్ యాక్టివ్ కేస్ ఫైండింగ్ యూనిట్, సీవై టీబీ పరీక్షలను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 155 మంది టీబీ అనుమానితులకు ఎక్స్రే, సీబీ నాట్ పరీక్ష, సైడ్ టీబీ స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు అశోక్, కమల్హాసన్, పీహెచ్సీ వైద్యాధికారి స్రవంతి, సీహెచ్ఓ రామ్కిషన్, జిల్లా క్షయ నిర్ధారణ బృంద సభ్యులు చంద్రారెడ్డి, విశ్వనాథ్, మధు, అంజుకుమార్, శ్రవణ్కుమార్, సూపర్వైజర్లు సుజన, రజనీ, సులోచన తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మల్లికార్జునరావు -
ఫిట్నెస్ ఆలస్యమేనా?
జనగామ: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సు సర్వీసుల సేవల విషయంలో కాసింత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు పిల్లలను తీసుకొచ్చే సమయంలో ఆర్టీఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కిటికీలకు జాలీలు, డోరు వద్ద క్లీనర్ పర్యవేక్షణ తప్పనిసరి. బస్సు ఎక్కి పాఠశాలకు చేరుకుని, తిరిగి ఇంటికి చేరే వరకు కేర్గా చూసుకోవాలి. గతంలో జిల్లాలోని రెండు ప్రాంతాల్లో విద్యార్థులు బస్సు దిగి వెళ్లే క్రమంలో చక్రాల కింద నలిగి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇతర ఆర్టీఏ నిబంధనలు పాటించాలని సంబంధిత అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నారు. వేసవి సెలవులు ముగిసే సమయంలో ఇరవై రోజు ల ముందు నుంచే అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు నోటీసులను పంపించారు. జిల్లాలో 190 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో 150 సర్వీసులకు ఫిట్నెస్ పూర్తయ్యింది. మరో 40 బస్సులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 20 బస్సులకు ఆర్టీఏ నిబంధనలు లేకపోవడంతో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి రిజెక్ట్ చేయగా, మరో 20 బస్సులకు మరమ్మతులు చేయిస్తున్నారు. మూడు బస్సులు సీజ్.. జిల్లాలోని పలు పాఠశాలల ప్రైవేట్ స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా నడిపిస్తూ రవాణా శాఖ అధికారులకు గురువారం పట్టుబడ్డాయి. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక విజిలెన్స్ అధికారి పాహిమా సుల్తానా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ని ఆర్టీసీ చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీల్లో సాన్మారియా స్కూల్కు చెందిన రెండు, చంపక్హిల్స్ న్యూ క్రియేషన్ పాఠశాల ఒక బస్సు ఫిట్నెస్ లేకుండా తిరుగుతుండడంతో విజిలెన్స్ అధికారులను పట్టుకున్నారు. మూడు బస్సులను సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యం నిబంధనలు తుంగలో తొక్కి.. రోడ్డెక్కుతున్న బస్సులు జిల్లా రవాణా శాఖ ఉక్కుపాదం విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఒక్కరోజే మూడు బస్సుల సీజ్ -
అర్హులందరికీ సంక్షేమ పఽథకాలు
బచ్చన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పఽథకాలు అందిస్తోందని ఎవరూ నిరుత్సాహ పడొద్దని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. గురువారం మండల మండలంలోని సాల్వాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లను దశల వారీగా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. పదేళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్రెడ్డి హయాంలో నెరవెరబోతోందన్నారు. అలాగే గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్యాదవ్, దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, నాయకులు జంగిటి విద్యానాఽథ్, హరిబాబుగౌడ్, వెంకటేశ్, రవీందర్రెడ్డి, అల్వాల ఎల్లయ్య, సందీప్, మసూద్, బాలకిషన్గౌడ్, హరీష్, రాములు, స్వామి, రమేశ్, బాలరాజు, సురేందర్రెడ్డి, పలువురు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి -
పనులు సత్వరమే పూర్తి చేయండి
రఘునాథపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని నిడిగొండ, కంచనపల్లి పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భోజయ్య, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, పీఆర్ ఏఈ భరత్, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రశంస పత్రాల పంపిణీ జనగామ రూరల్: కార్పొరేట్ కళాశాల విద్యను విద్యార్థులు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ పింకేశ్కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఇంటర్లో కార్పొరేట్ కళాశాలలో చేరుతున్న 15 మంది విద్యార్థులకు ప్రవేశపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు డాక్టర్ విక్రమ్, రవీందర్ సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ‘బడిబాట’పై పాట ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య, విద్యా ప్రాముఖ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా అల్లూరి రవీందర్ రాసిన, వసంత, జ్యోతి, యమున టీచర్లు గానం చేసిన బడి బాట పాట వీడియోను కలెక్టర్ రిజ్వానా భాషా, డీఈఓ భోజన్న మండలంలోని ఎర్రకుంట తండా పాఠశాలలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల నమోదుకు చేస్తున్న కృషిని కలెక్టర్ అభినందించారు. -
మూడో ఏటనే.. బడికి పంపారు
నన్ను రెండేళ్లు దాటి మూడో ఏడు రాగానే బడికి పంపించారు. అయితే.. నా గోల భరించలేక మా అమ్మ ఓ పథకం వేసి బడిలో అయితే కాస్త భయంతో ఉంటానని అనుకుని ఉండొచ్చు. ప్రైమరీ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. పెద్ద సారు క్యాడర్ పెద్దది కాబట్టి మాకు చిన్నసారే పలక మీద ఓనమాలు పెట్టించేది. ఆయనకు పెద్ద మీసాలు ఉండేవి. పిల్లలంతా ఈయనకి కూడా భయపడే వారు. అనంతరం హైస్కూల్ చదువులోనూ ఎప్పుడూ ఫస్ట్ ఉండేదాన్ని. బడికి వెళ్లాలంటే ఏనాడు భయపడలేదు. తల్లి ప్రోత్సాహంతో చదివి ఉన్నతస్థాయికి ఎదిగాను. ఇప్పటికీ బాల్య స్మృతులు గుర్తుకు వస్తే.. ఎంతో సంతోషంగా ఉంటుంది. – నెల్లుట్ల రమాదేవి, ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్ జోనల్ చీఫ్ మేనేజర్, శివునిపల్లి ● -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
జనగామ రూరల్: జిల్లా కేంద్రంలో ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ను వేది కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, న్యాయస్థానంలో పెండింగ్ ఉన్న కేసు లోక్ అదాలత్కు వచ్చిన తర్వాత పరిష్కారమైతే కోర్టులో చెల్లించిన రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లిస్తారని తెలిపారు. సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందని, రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలు, డబ్బు రికవరీ, మోటార్ వెహికల్ యాక్సిడెంట్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు.పిల్లలను అంగన్వాడీల్లో చేర్పించాలికొడకండ్ల : ప్రీస్కూల్ పిల్లలందరినీ తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సీడీపీఓ సత్యవతి కోరారు. ‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా బుధవా రం మండలకేంద్రంలో ఇంటింటికీ తిరిగి అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ఈనెల 17 వరకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి అర్హత కలిగిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలని చెప్పారు. అలాగే అవగాహన ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంది స్తున్న సేవలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సరళ, అంగన్వాడీ టీచర్లు మైమూదాబేగం, సరిత, ఉప్పలక్ష్మి, వినోద, నర్సమ్మ, మంజుల, మాధవి తదితరులు పాల్గొన్నారు.శ్రీ చైతన్యకు అనుమతి లేదు : డీఈఓజనగామ: పట్టణంలో శ్రీ చైతన్య పేరుతో ఎలాంటి ప్రైవేట్ స్కూల్ అనుమతి లేదు.. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈఓ భోజన్న తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీచైతన్య పేరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వైష్ణవి స్కూల్ పేరుతోనే రన్ చేయాలని, ఒక వేళ అలాగే కంటిన్యూ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. రికగ్నైజేషన్ లేకుండా ప్రైవేట్ స్కూళ్ల ను నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని, ప్రీ ప్రైమరీ స్కూల్ యాజమాన్యాలు సైతం తమ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్కావెంజర్లకు సంబంధించి మూడు నెలల వేతనం రెండు, మూడు రోజుల్లో రానున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం వండి వడ్డించే గ్రూపులకు బకాయి ఉన్న సుమారు రూ.3కోట్ల బడ్జెట్ కూడా త్వరలో రిలీజ్ అవుతుందని అన్నారు.కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటనలింగాలఘణపురం: మండలంలో బుధవారం కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటించింది. లింగాలఘణపురం, నెల్లుట్ల, నవాబుపేట, నేలపోగుల, కొత్తపల్లి, గుమ్మడవెల్లి, సిరిపురం, కళ్లెం, నాగారం గ్రామాల్లో నిర్మించిన సోక్పిట్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్పిట్స్, ప్లాంటేషన్, వాటర్ రీజార్జ్లను పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు, సైంటిస్ట్ సెంటర్ వాటర్ బోర్డు వెంకటగిరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకన్న, డీఆర్డీఓ సరిత, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, ఎంపీఓ రఘురామకృష్ణ, ఏపీఓ బిక్షపతి పాల్గొన్నారు.ఉపాధి పనుల పరిశీలనకొడకండ్ల : ఏడునూతుల, కొడకండ్ల గ్రామాల్లో కేంద్ర బృందం సభ్యులు జాయింట్ డైరెక్టర్ పుష్పలత కుమారి, సీనియర్ స్టాటిస్టిక్స్ ఆఫీస ర్ అంకిత్ బుధవారం పర్యటించారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులను పరిశీలించారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులు, ఉపాధి కూలీలతో మాట్లాడి జాబ్కార్డుల అప్డేషన్, సెవెన్ రిజిస్టర్లతోపా టు సడక్ యోజన కింద చేపట్టిన రోడ్ల నిర్మాణాల గురించి తెలుసుకున్నారు. డీపీఎం వినితరెడ్డి, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, ఎంపీఓ ఇందిర, ఏపీఓ కుమారస్వామి పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ బకాయిలు సత్వరం చెల్లించాలి
● రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లురఘునాథపల్లి: రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ బకాయిలు సత్వరం చెల్లించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మైలా రం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజకుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కరపత్రాలను బుధవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆయా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. గత ప్రభుత్వం రజకుల కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ కేటాయించగా.. ఈ ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించక పోవడం దారుణమన్నారు. రజకులకు, నాయీ బ్రాహ్మణుల కు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యంఇవ్వాలని, వయసు 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్, రజకులకు ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మరికుక్కల సారయ్య, యాదగిరి, ధశరథ, సోమనాథ్, ఉమేష్, నాగరాజు, నర్సయ్య, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు కల్పగూరి ప్రభాకర్, నరేష్, ప్రవీణ్, రాములు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన టెక్నోజిల్–2025 సంబురం
జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న టెక్నోజిల్–2025 వేడుకలు బుధవారం ముగిసాయి. చివరిరోజు సంబరా లను కళాశాల డైరెక్టర్ డి.విజయపాల్రెడ్డి ఆధ్వర్యా న నిర్వహించారు. స్లో బైక్రేసింగ్, మెహందీ, రంగో లీ, ఫేస్ పెయింటింగ్, నృత్య పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఫ్యాషన్ షో, డీజేనైట్ ప్రోగ్రాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విజయపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఆటలతో పాటు చదువూ ముఖ్యమే అన్నారు. తల్లిదండ్రుల ఆశలను, ఆశయాలను నెరవేర్చే విధంగా సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలన్నారు. చివరలో ఆయా పోటీల్లో గెలు పొందిన విజేతలకు డైరెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశా రు. ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్రెడ్డి, కన్వీనర్ ఏఎస్.రావు, కోకన్వీనర్ జి.సరిత పాల్గొన్నారు. ఆటలు, చదువు రెండూ ముఖ్యమే : సీజేఐటీ డైరెక్టర్ విజయపాల్రెడ్డి -
సర్కారు స్కూళ్లను బతికించుకుందాం..
● జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న జనగామ: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చే నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను బతికించుకునేందుకు ప్రతీ తల్లిదండ్రి ఆలోచించాలని డీఈఓ భోజన్న అన్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో బుధవారం డీఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత నమ్మ కం పెంచేలా అంకిత భావంతో పని చేస్తామని, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులపై అదనంగా దృష్టి సారిస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలను సందర్శించి, విద్యాబోధన విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసి పాఠశాల వారీగా ఉపాధ్యాయుల ప్రగతి, విద్యార్థి ప్రతిభపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 125 పాఠశాలల్లో 329 ఇంట రా క్టివ్ ప్లాట్ ప్యానెల్(ఐఎఫ్ పీ) డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశామని, ఇందులో సబెక్టుల వారీగా 543 కంటెట్లు లోడ్ చేసి ఉంటుందని వివరించారు. ప్రత్యక్ష బోధనతో పాటు డిజిటల్ ద్వారా కార్పొరేట్ స్థాయి విద్య అందించనున్నట్లు తెలిపారు. 6 నుంచి 10 తరగతులకు ఏఐ(ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) పాఠాలు సైతం కొనసాగుతున్నాయని, 1 నుంచి 5 వరకు ఎఫ్ఎల్ఎన్ ఏఎక్సల్ ద్వారా ఏఐ బోధన గత ఏడా ది నుంచే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ పాఠశాలకు స్పోర్ట్సు మెటీరియల్ అందించామని, ‘బడిబాట’ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చే స్పందన సర్కారు బడుల పనితీరుకు నిదర్శనమని వివరించారు. -
చెప్రాసి అంటే హడల్..
జనగామ రూరల్ : నాటి కాలంలో బడికి వెళ్లాలంటే భయపడే వాళ్లం. ఒక్క పూట బడి మానేసినా.. ఉపాధ్యాయుడి కంటే చెప్రాసి కట్టే పట్టుకొని వస్తున్నాడంటే వణికి పోయేటోళ్లం. అప్పుడు గ్రామంలో ఒకే ఒక్క పాఠశాల ఉండడంతో సర్పంచ్ నుంచి పటేల్ పట్వారీ పిల్లల వరకు అందరూ సర్కారు స్కూల్కే వెళ్లాం. విద్యతో పాటు క్రీడలు కూడా నేర్పించే వాళ్లు. స్వగ్రామం వడ్లకొండలోనే 7వ తరగతి వరకు చదువుకున్నాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఉన్నత పదవిలో ఉన్నాను. – రవీందర్యాదవ్, వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, వడ్లకొండ(జనగామ)చదివిన స్కూల్లోనే టీచర్గా..తరిగొప్పుల: మేం చదువుకునే రోజుల్లో టీచర్లు అంటే భయం ఉండేది. ఎదురుగా నిలబడే సాహసం చేసేవాళ్లం కాదు. వారు స్థానికంగానే ఉండేవారు. చదవకున్నా.. హోం వర్క్ చేయకపోయినా బెత్తంతో దండించేవారు. ఆ భయం నేటి విద్యార్థుల్లో లేదు. స్థానిక పాఠశాలలో 1970 సంవత్సరం విద్యాభ్యా సం ప్రారంభించాను. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ప్రభుత్వ టీచర్గా పదోన్న తి పొందాను. విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాలలోనే టీచర్గా పని చేశాను. – మచ్చ చిరంజీవులు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, తరిగొప్పుల -
రోజు 13 కిలోమీటర్లు నడిచి వెళ్లే వాడిని..
పాలకుర్తి టౌన్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978 నుంచి 1983 వరకు చదువుకున్నా ను. ఆ రోజుల్లో రోడ్లు, రవాణా సౌకర్యం ఉండేది కాదు. రోజూ సమయపాలన పాటిస్తూ వల్మి డి నుంచి 30 మంది స్నేహితులతో కలిసి 13 కిలోమీటర్లు నడిచేటోళ్లం. ప్రభుత్వ పాఠశాల నేర్పించిన క్రమశిక్షణే ఈ స్థాయికి ఎదిగేలా చేసింది. – పోతుగంటి నరసయ్య, ఎంఈఓబడికి తప్పించే వాళ్లం కాదుజఫర్గఢ్: స్థానిక ఉన్నత పాఠశాలలో 1973 సంవత్సరం పదో తరగతి పూర్తి చేశాను. ఉపాధ్యాయులంటే భయం, గౌర వం ఉండేది. కరెంటు సౌకర్యం లేకున్నా గుడ్డి దీపాల వెలుతురులో తల్లిదండ్రులు చదివించే వారు. సర్కారు బడిలో చదవడంతోనే ఈ పొజిషన్కు చేరుకున్నా. ఆ అభిమానంతోనే జఫర్గఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలుగా మార్చినం. – డాక్టర్ సాంబశివరావు, ఆరోగ్యశాఖ మాజీ డైరెక్టర్బాయికాడికి పొమ్మంటే బడికి పోయేదిలింగాలఘణపురం : నాన్న బాయికాడికి పోయి పొలం దున్నమంటే నేను బడికి పోయేవాడిని. ఇష్టంతో చదువుకున్నాను. ప్రస్తుతం ఉస్మాని యా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు బడికి పోకపోతే మార్కులు తక్కువ వస్తాయనే భయంతో నాన్న బాయికాడికి పొమ్మన్నా స్కూల్కు వెళ్లేది. అప్పట్లో చదువుకోవడానికి ఇప్పటిలా సౌకర్యాలు లేవు. పుస్తకాలు కొనుక్కోవడానికి పైసలు లేక ఇబ్బంది పడేది. – బుట్టిరెడ్డి రవీందర్రెడ్డి, ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, లింగాలగణపురం● -
స్కావెంజర్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
జనగామ రూరల్: స్కావెంజర్ల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవా రం జిల్లా కమిటీ ఆధ్వర్యాన డీఈఓ భోజన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరం పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించి కేవలం మూడు నెలలకు మాత్రమే వేతనాలు చెల్లించారని అన్నారు. గత వేసవిలో ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు పీపీఎల్స్ మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నల్లనాగుల రాజు, ప్రధాన కార్యదర్శి అంకుషావలి, జిల్లా బాధ్యులు, శ్రీహరి, శ్రీరామ్, రాజారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025
స్టేషన్ఘన్పూర్: పక్క ఫొటోలో కనిపిస్తు న్న ఉన్నత పాఠశాల శివునిపల్లిలో ఉంది. 1952లో ప్రారంభించారు. ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో చాలా మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, కోచ్లు, గెజిటెడ్ హెచ్ఎం స్థాయికి ఎదిగారు. ప్రైవేటుకు దీటుగా.. జనగామ: ప్రైవేట్ పాఠశాలలకు కేంద్ర బిందువైన జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గణేశ్ స్ట్రీట్ ప్రాథమి కోన్నత పాఠశాలలో 1 నుంచి 7 తరగతులు ఉన్నా యి. హెచ్ఎంతో 9 మంది ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని ఉన్నా.. గత ఏడాది 184 మంది పిల్లలు ఉండగా.. ఈసారి ‘బడిబాట’లో మరో 40 మందికి పైగా అడ్మిషన్లు పొందారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రులతో నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. న్యూస్రీల్ -
బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
జనగామ రూరల్: బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడంతోపాటు బాలల హక్కులను పరిరక్షించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో కార్మిక, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్త ఆధ్వర్యాన ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పిల్లలు ఆటపాటలతో విద్య అభ్యసించేలా చూడాలని, వారికి అనుకూలమైన విద్యావాతావరణం కల్పించాలని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థతోపాటు చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇందుకు సంబంధిత శాఖల అధికా రులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, జిల్లా సహాయ కార్మిక అధికారి కుమారస్వామి, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య, బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, స్కోప్ ఎన్జీఓ కోఆర్డినేటర్ మనోజ్కుమార్ పాల్గొన్నారు. మోడల్ మార్కెట్ పనులు వేగవంతం చేయాలి పట్టణంలోని దయానిలయం వద్ద నిర్మాణమవుతున్న ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పనులను పరిశీలించిన ఆయన మాట్లాడారు. పట్టణ వాసుల సౌలభ్యం కోసం నిర్మాణం చేపట్టిన మోడల్ మార్కెట్ పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
పురాతన బడికి పూర్వ వైభవం
దేవరుప్పుల: సింగరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ప్రైవే ట్ స్కూళ్ల కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రాభవం కోల్పోయింది. ఇటీవల బదిలీపై వచ్చిన హెచ్ఎం అంబటి అంజయ్య, ఉపాధ్యాయులు గ్రామస్తుల సహకా రంతో బడికి పూర్వ వైభవం తేవడానికి గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ వంగాల మల్లారెడ్డి, ప్రస్తుతం మరో చోట పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దివాకర్రెడ్డి, జీపీ భాగస్వామ్యంతో పాఠశాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. గత ఏడాది 40 మందికి పరిమితమైన విద్యార్థుల సంఖ్య 60కి పెంచేందుకు కసరత్తు ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణం, భవన సముదాయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. -
టీచర్లకే తల్లిదండ్రుల సపోర్టు
జనగామరూరల్: ఒకటో తరగతి నుంచి 5 వరకు స్వగ్రామంలోనే చదివాను. తమ్మడపల్లి, పెద్దరామన్చర్ల, పెద్దపహాడ్, పసరమడ్ల నుంచి విద్యార్థులు ఈ స్కూల్కే వచ్చేవారు. చిన్నప్పుడు నాకు సోమిరెడ్డి, మల్లారెడ్డి సార్లు తొలిగురువులు. మాకు చదువుతోపాటు ఆట పాటల్లో ప్రత్యేక పీరియడ్స్ ఉండేవి. ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఒక్కరోజు పాఠశాలకు రాకున్నా ఆయమ్మ(గోపమ్మ) ఇంటికి వచ్చి ఎందుకు రాలేదని అడిగే వారు. గురువులంటే భయమూ భక్తి ఉండేది. చదువు సరిగా రాకపోతే ఉపాధ్యాయులు మందలించే వారు. తల్లితండ్రులు కూడా వారినే సమర్థించే వారు. – బాలాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఓబుల్కేశ్వాపూర్, జనగామ -
ఔరా.. సర్కారు స్కూళ్లు
వేసవి సెలవుల తర్వాత నేడు తెరుచుకోనున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లుమామిడి తోరణాలు.. తీరొక్కపూలు.. రంగురంగుల బొమ్మలు.. వాకిట ముగ్గులు.. వేసవి సెలవుల అనంతరం నేటి(గురువారం) నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా అలంకరించారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో డీఈఓ భోజన్న ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. మొదటిరోజే పిల్లలకు యూనిఫాం, నోటు, పాఠ్యపుస్తకాలు అందించేందుకు అన్నీ సిద్ధం చేశారు. జిల్లాలో 548 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకులాలు ఉండగా.. వీటిలో 45వేల పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. ‘బడిబాట’తో సంఖ్య మరింత పెరగనుంది. – జనగామ అలంకరణలో పాలకుర్తి పీఎస్ స్వాగత తోరణం బచ్చన్నపేట: పడమటి కేశ్వాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పాఠశాలను మామిడి కొమ్మలు, స్వాగత తోరణాలతో అలంకరించారు. మామిడి తోరణాలతో అలంకరణ పాలకుర్తి టౌన్ : స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధాన గేటు, తరగతి గదులను కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించారు. ప్రధానోపాధ్యాయులు చిదురా ల శ్రీనివాస్ ఆధ్వర్యాన విద్యార్థులను ఆకర్షించేలా వాల్కు విద్యార్థులకు ఉపయోగపడే ఇంగ్లిష్, తెలుగు అక్షరమాల, జాతీయ నాయకులు, ప్రకృతి చిత్రాలతో తీర్చిదిద్దారు. -
ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ కేసును చాలెంజ్గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్నాయక్ అభినందించారు. -
రుచికరమైన భోజనం అందించాలి
రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కాంప్లెక్స్ పరిధిలోని హెచ్ఎంలకు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు మోనూ ప్రకారం అందించే మధ్యాహ్న భోజనంలో ఉపయోగించే వస్తువుల క్వాలిటీని క్షుణ్ణంగా పరిశీలించి శుభ్రతగా తయారు చేసి వడ్డించాలన్నారు. భోజనం తయారు చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రఘునందన్రెడ్డి, ఆర్పీ అంకం రవీందర్, హెచ్ఎం రమేష్, సీఆర్పీ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న -
పూర్తిస్థాయిలో అందని దుస్తులు, నోట్బుక్స్
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuఉన్నత 103ఓపీఎస్ అమలు చేయాలిజనగామ: విద్యుత్ శాఖ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని జనగామ సర్కిల్ జీపీఎఫ్ సాధన సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సాధన సమితి ఆదేశాల మేరకు మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం పునరుద్ధరించే విధంగా అసెంబ్లీలో తమ తరఫున ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి విద్యుత్ ఉద్యోగులు పక్షాన అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం చేసే విధంగా ముందుంటా నని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంపత్కుమార్, భూక్య బాలు, రాజేష్, నర్సయ్య, కనకచారి, వెంకట్రెడ్డి, వెంకటయ్య, కనకసేన, సురేందర్, భిక్షపతి పాల్గొన్నారు. ఉపాధి పనుల పరిశీలననర్మెట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులపై 4వ సా మాజిక తనిఖీలో భాగంగా బొమ్మకూర్లో జరి గిన పనులపై మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టిన పనుల వివరాలు, రికార్డులను పరిశీలించి ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పెన్షన్ పథకం, పీఎంజేజేఎస్వై, పీఎంకేఎస్వై పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతీఒక్కరూ ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి, టీం అధికారులు పుష్పలత కుమారి, ఎస్ఎస్ఓ అంకిత్, అదనపు డీఆర్డీఓ చంద్రశేఖర్, డీపీఎం వినీతా రెడ్డి, ఈసీ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం మాదారపు రవి, ఏపీఓ రమాదేవి, ఏఈ పీఆర్ ప్రదీప్ కుమార్, సీసీ కవిత, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యంజనగామ: రాష్ట్రం అభివృద్ధి ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో మోదీ 11 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశాన్ని నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ యాదవ్, పార్లమెంటు కోకన్వీనర్ కొంతమంది శ్రీనివాస్, కల్నల్ భిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఎల్లయ్య, నాయకులు బాగాల నవీన్రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ద జగదీష్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. 15 రోజుల తర్వాత..జనగామలో భారీ వర్షం జనగామ: జనగామ పట్టణంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత నెల 25 నుంచి ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా ఉక్కపోతతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు చల్లని వాతావరణంతో ఉపశమనం పొందారు. వికసించిన బ్రహ్మకమలం కొడకండ్ల: ఎంతో విశిష్టమైన బ్రహ్మకమలం పుష్పం మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన తోట కర్ణాకర్లక్ష్మి పటేల్ ఇంటిలో వికసించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వికసించే ఈ పుష్పం మంగళవారం వికసించడంతో యజమానులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులు 38,000 (పెరగవచ్చు)ప్రాథమికోన్నత 64పీఎస్ 341జిల్లాలో పాఠశాలలు, విద్యార్థుల వివరాలు అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, వామపక్ష, ప్రజా సంఘాల నాయకులుజనగామ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయాలను పత్రికారంగానికి ముడిపెడుతూ సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ప్రజల పక్షాన నిలబడుతున్న సాక్షి మీడియాపై దాడులు చేయించడం సహించరానిదని సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి ధ్వజమెత్తారు. ‘కొమ్మినేని’ని ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రం ఆర్టీసీ చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీజేపీ, వామపక్ష, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపారు. నల్లబ్యాడ్జీలతో జంక్షన్లో ర్యాలీ నిర్వహించి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాజారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో జర్నలిస్టులకు సంకెళ్లు వేయాలని చూస్తుందన్నారు. వెంటనే శ్రీనివాసరావును విడుదల చేసి సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు కన్నా పర్శరాములు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తనగోతి తానే తవ్వుకుంటున్నారన్నారు. జర్నలిస్టులతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా కాలగర్భంలో కలిసి పోయాడన్నారు. టీయూడబ్ల్యూజేఏ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వెంకటస్వామి మాట్లాడుతూ మొన్న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, నేడు సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్లు చేస్తూ పత్రికా రంగంపై గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూబ్ల్యూజేఏ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, టీయూడబ్ల్యూజే 143 జిల్లా ప్రధాన కార్యదర్శి జాల రమేష్, హింజె మాధవరావు, భాస్కర్, కన్నారపు శివశంకర్, గూడూరు కరుణాకర్, కిషోర్, కేమిడి ఉపేందర్, చౌదర్పల్లి ఉపేందర్, కొత్తపల్లి కిరణ్కుమార్, గోవర్దనం వేణుగోపాల్, బండి శ్రీనివాస్రెడ్డి, రాణా ప్రతాప్, గణేష్, శ్రీని వాస్, మంగ శంకర్, సుప్రీం, యూసుఫ్, వినయ్, ఎజాజొద్దీన్, ఉదయ్ కిరణ్, మోహన్, బాబా, వెంకన్న, రాజు, అశీష్, బీజేపీ నాయకులు దేవరాయ ఎల్లయ్య, పెద్దోజు జగదీష్, సుడిగెల భిక్షపతి తదితరులు ఉన్నారు.పర్యావరణ పాఠ్యపుస్తకాలకు మోక్షమెప్పుడో? ఉన్నత స్థాయిలో 9, 10 తరగతులు చదువుకునే విద్యార్థులకు అదనంగా పర్యావరణం సబ్జెక్టు ఉంటుంది. ఇందుకు సంబంధించి వీటికి ఇంటర్నల్ మార్కులు వేస్తారు. జిల్లాలో 2,14,460 పాఠ్యపుస్తకాలు అవసపరముండగా, ఇప్పటి వరకు 2,04,410 జిల్లాకు చేరుకున్నాయి. వీటిలో 1,82,596 పుస్త కాలను బడులకు పంపించారు. ఇంకా 10,050 పుస్తకాలు రావాల్సి ఉంది. అలాగే బడిబాటలో కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంలను అందించాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే వీటికి సంబంధించిన నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిస్తారు. వాహనంలో తరలిస్తున్న పాఠ్యపుస్తకాలుజనగామ: వేసవి సెలవుల అనంతరం రేపటి (గురువారం) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. బడి ప్రారంభానికి ముందుగానే సర్కారు బడుల విద్యార్థులకు రెండు జతల దుస్తులు, నోటు, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ముందుగానే స్పష్టం చేసింది. యూనిఫాం విషయంలో ఒక జత వరకే సరిపెడుతుండగా...ప్రాథమిక పాఠశాలలకు వర్క్బుక్స్, 9, 10 తరగతులకు పర్యావరణ పుస్తకాలను నేటికీ పంపించలేదు. కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు సైతం పాఠ్యపుస్తకాలు ఇప్పట్లో అందే పరిస్థితి ఉండదు. జిల్లాలో 508 పాఠశాలలు.. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 508 ఉన్నాయి. ఇందులో 38 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి గత కొన్ని సంవత్సరాలుగా పాలక ప్రభుత్వాలు రెండు జతల యూనిఫాంలను ఉచితంగా అందిస్తున్నారు. వేసవి సెలవులకు ముందుగానే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు పిల్లల వివరాలు, యూనిఫాం ఇండెంటును సర్కారు పంపించారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాయింట్, షర్టు, ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి పిల్లలకు నిక్కర్, షర్టు లెక్కన క్లాత్ పంపించారు. నిక్కర్పై విద్యార్థులు ఆక్షేపన చెప్పడంపై సాక్షిలో ప్రచురితమైన కథనంతో సర్కారు స్పందించింది. ఒకటి నుంచి 10 వరకు పాయింట్ స్టించ్చింగ్ చేయించాలని విద్యాశాఖను ఆదేశించిన సంగతి పాఠకులకు తెలిసిందే. నిక్కర్కు వచ్చిన క్లాత్ను అడ్జెస్ట్మెంట్ చేసి పాయింట్కు కన్వర్ట్ చేయడంతో కొంత కొరత ఏర్పడింది. విద్యాశాఖ ఇండెంట్ ప్రకారం ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తుల చొప్పున 58,316 దుస్తులు అవసరముండగా, మొదటి విడతలో 29,158 జతలను స్టిచ్చింగ్ చేయింస్తున్నారు. ఇందులో 9వ తేదీ వరకు 26,724 జతల యూనిఫాం తయారీ కాగా, మిగతావి స్టించ్చింగ్ చేస్తున్నారు. వీటిని హెచ్ఎంల సమక్షంలో ఆయా పాఠశాలకు పంపించారు. రెండవ జతకు సంబంధించి ప్రభుత్వం నుంచి క్లాత్ రావాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పంపిణీ కాని వర్క్బుక్స్ జిల్లాలో 508 ప్రభుత్వ పాఠశాలల్లో చదువకునే విద్యార్థులకు నోటు పుస్తకాల (రాసుకునేవి) సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు సంబంధం లేకుండా నేరుగా పాఠశాలలకే సప్లయ్ చేసింది. ఒకటి నుంచి 5 తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి 4 వర్క్బుక్స్, 6 నుంచి 7 వరకు 6, 8 నుంచి 10 తరగతుల పిల్లలకు 14 చొప్పున నోట్బుక్స్ను ఉచితంగా అందించనున్నారు. 6 నుంచి 10 వరకు విద్యను అభ్యసించే విద్యార్థులకు నోటు బుక్స్ రాగా, ప్రాథమిక స్థాయిలో ఇప్పటి వరకు నోట్బుక్స్ రాలేదు. పాఠశాలల పునఃప్రారంభానికి ఒక్కరోజే ఉండటంతో పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలనే దానిపై ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్నారు.త్వరలో పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంకు సంబంధించిన క్లాత్ మరో పది రోజుల్లో జిల్లాకు రానుంది. ప్రాథమిక పాఠశాలలకు రావాల్సిన వర్క్బుక్స్ కూడా వచ్చాయి. మూడు రోజుల్లో పంపిణీ చేస్తాం. 9, 10వ తరగతులకు రావాల్సిన పర్యావరణం పాఠ్యపుస్తకాలు సైతం త్వరలోనే రానున్నాయి. ఈ పుస్తకాలు కొంచెం ఆలస్యమైన ఇబ్బంది ఉండదు. – భోజన్న, జిల్లా విద్యాశాఖ అధికారి ● యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి. ● గత మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులను పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నకిలీ పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి. ● తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురుని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ. వరి తర్వాత పత్తివైపే రైతుల మొగ్గు.. ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా, 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈ సారి బీటీ–3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో ఏటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు.. రూ.400 వరకు అదనం.. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఓవైపు నకిలీ బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకెట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా బీటీ–2 రకాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901లకు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350ల నుంచి రూ.1,450ల వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. న్యూస్రీల్సీడ్.. ఫ్రాడ్..రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తి సీజన్ ఆరంభంనుంచే దందా పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్న రైతులుమరిన్ని ఫొటోలు, వివరాలు సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి జర్నలిస్టులు, వామపక్ష, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన, ర్యాలీ 9, 10 తరగతులకు పర్యావరణ పాఠ్యపుస్తకాలకు మోక్షమెప్పుడో ? రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం– 9లోuజిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా... జిల్లా సాగు అంచనా అవసరమయ్యే (ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు హనుమకొండ 85,000 1,70,000 వరంగల్ 1,22,358 2,44,716 మహబూబాబాద్ 84,070 1,68,140 జేఎస్ భూపాలపల్లి 1,01,500 2,03,000 జనగామ 1,45,000 2,90,000 ములుగు 29,430 58,860 -
అంతర్జాతీయ యోగా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
జనగామ: అంతర్జాతీయ 11వ యోగా ఉత్సవాలను పురస్కరించుకుని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావుతో కలిసి ఆయన మాట్లాడారు. నిత్యందన జీవితంలో ప్రతీరోజు యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంత, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడంతో పాటు ఉల్లాసంగా ఉండవచ్చన్నారు. ఈ నెల 21వ తేదీన మినీ స్టేడియంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రజలు, జిల్లా అధికారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అశోక్ కుమార్, జిల్లా అధికారి డాక్టర్ మమత, డీపీఎం కుమార్ పాల్గొన్నారు. -
రఘుపాల్ సేవలు మరువలేనివి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ రూరల్: తెలంగాణ విప్లవ పోరాటంలో కామ్రెడ్ రఘుపాల్ మరణం సమాజ సేవకు అంకితమని, ఆయన సేవలు మరవలేనివని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్హాల్లో మంగళవారం సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన సీపీఎం మాజీ హైదరాబాద్ నగర కార్యదర్శి, పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రెడ్ గంగసాని రఘుపాల్ సంస్మరణ సభ జరిగింది. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రఘుపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటంలో ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక వర్గం సమస్యల పరిష్కారంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. అనంతరం రఘుపాల్పై సాంబరాజు యాదగిరి రాసిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, సూడి కృష్ణారెడ్డి, ఆముదాల మల్లారెడ్డి, రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సింగారపు రమేష్, బొట్ల శేఖర్, బూడిద గోపి, జోగు ప్రకాష్, తదితరులు ఉన్నారు. -
కొత్త ఆవిష్కరణలకు నాంది
జనగామ: మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యో తి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు కొత్త ఆవి ష్కరణలకు శ్రీకారం చుట్టారు. టెక్నోజిల్–2025 కా ర్యక్రమంలో 350 ప్రదర్శనలతో తమలోని ప్రతి భను చాటుకున్నారు. మంగళవారం టెక్నోజిల్ కా ర్యక్రమాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డితో కలిసి డైరెక్టర్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. జనగామ, హనుమకొండ, వరంగల్, కాజీపేట తది తర జిల్లాకు చెందిన 800 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని నూతన ఆవిష్కరణలను పరిశీలించా రు. కంప్యూటర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ తదితర రంగాలకు సంబంధించిన ఆవిష్కరణ లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. అ నంతరం జరిగిన సదస్సులో డైరెక్టర్ విజయపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్న అధ్యాపకుల కృషి అభినందనీయమన్నా రు. ప్రతీ విద్యార్థి అవకాశాలు సద్వినియోగం చేసుకుని, ఆదర్శంగా నిలవాలన్నారు. సీజేఐటీ కళాశాల విద్యార్థులు పరిశోధన, ప్రయోగాలకు ప్రతీకగా ని లుస్తున్నారన్నారు. అంతకు ముందు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టెక్నోజిల్ కన్వీనర్ అల్లంకి సన్యాసిరావు, కో కన్వీనర్ సరిత, కో ఆర్డినేటర్ డాక్టర్ కె. యాకూబ్, అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు. సీజేఐటీ టెక్నోజిల్–2025లో 350 ప్రదర్శనలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి కళాశాల డైరెక్టర్ విజయపాల్రెడ్డి -
సర్దుబాటు సబబేనా..!
సర్కారు స్కూళ్లకు శాపంగా మారనున్న టీచర్ల అడ్జెస్ట్మెంట్జనగామ: సర్కారు స్కూళ్లలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు శాపంగా మారనుంది. ఓ వైపు ‘బడిబాట’ కొనసాగుతుండగా.. ఈనెల 13వ తేదీ వరకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలనే సర్కారు ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. సర్దుబాటుతో ఉన్న విద్యార్థులను తరిమేయడం తప్ప మరొకటి కాదని అంటున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. ప్రభుత్వం మాత్రం రేషనలైజేషన్ పేరుతో విద్యను నిర్వీర్యం చేసే దిశలో ప్రయత్నించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ప్రైమరీ సెక్టార్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో ఐదు తరగతులకు ఒక ఉపాధ్యాయుడితో నెట్టుకొస్తున్నారు. రేషనలైజేషన్తో ప్రాథమిక పాఠశాలలు కాస్త ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే అవకాశం ఉంది. మూత పడిన పాఠశాలలను ప్రారంభించాలని చెబుతూనే.. మరో వైపు వర్క్ అడ్జెస్ట్ పేరుతో ప్రైమరీ స్కూళ్లను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో ఒక పక్క ఉపాధ్యాయులను తొలగిస్తూ.. ప్రాథమిక విద్యలో తొలి మెట్టు లాంటి కార్యక్రమాలు ఎన్ని తీసుకొచ్చినా ఆరంభ శూరత్వమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ సబ్జెక్టులు మాత్రం తగ్గవు.. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని సూచనలు వస్తున్నాయి. కనీసం 40 మంది విద్యార్థుల వరకు ఇద్దరు, 41 నుంచి 60 వరకు ముగ్గురు, 61 నుంచి 90 మంది విద్యార్థుల వరకు నలుగురు టీచర్లు ఉండేలా చూడాలని అంటున్నారు. ఐదు తరగతులు, 20 సబ్జెక్టులను ఒక్క టీచర్ ఎలా బోధించ గలడో ప్రభుత్వం ఆలోచించాలని ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి. ఈనెల 13వ తేదీ లోగా పూర్తి చేయాలని ఆదేశాలు ఓ వైపు ‘బడిబాట’.. మరో వైపు తొలగింపు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లకు అడ్మిషన్లు వస్తే పరిస్థితి ఏమిటి? ఆందోళనలో టీచర్లు.. మండి పడుతున్న ఉపాధ్యాయ సంఘాలుజీరో స్కూల్స్ 73 జిల్లాలో ఒక్క విద్యార్థికూడా లేని పాఠశాలలు 73 ఉన్నా యి. ఇందులో ఒకటి ఎయిడెడ్ (యూపీఎస్), 72 ప్రాథమిక పాఠశాలలు. ప్రస్తుతం ‘బడిబాట’ కార్యక్రమంలో జీరో స్కూల్ పరిధిలో విద్యార్థుల అడ్మిషన్లు వచ్చేలా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు. -
సంక్షేమ పథకాలను పక్కాగా అమలుచేయాలి
● కేంద్ర బృందం సభ్యులు పుష్పలత, అంకిత్ జనగామ రూరల్: కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు చేరువయ్యేలా పక్కాగా అమలు చేయాలని కేంద్ర బృందం సభ్యులు పుష్పలత, అంకిత్ సూచించారు. సోమవారం వారు జనగామ మండలం వడ్లకొండ, సిద్దింకి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, దీన్ దయాళ్ అంత్యోద య, సంసాద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకాల పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యమని, నిర్లక్ష్యం చేయకుండా గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిబంధన ప్రకా రం చేపట్టాలని చెప్పారు. అంతకు ముందు వారికి గ్రామాల్లో బతుకమ్మలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, డీపీఎం వినీతరెడ్డి, ఇన్చార్జ్ ఎంపీడీఓ సంపత్ కుమార్, ఏపీఓ భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి, టీఏలు అనిల్, జహంగీర్, కార్యదర్శులు రాజశేఖర్రెడ్డి, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్లు అనిత, జయ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారం ఎప్పుడు..?
ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు నల్ల బుచ్చమ్మ. స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త అనుమరెడ్డి పేరు మీద గ్రామంలో ఉన్న 23 ఎకరాల భూమిని కొడుకుల పేర రిజిస్ట్రేషన్ చేయించారు. ‘ఇప్పుడు కొడుకులు తనను పట్టించుకోవడం లేదు.. కనీసం ఉండానికి ఇల్లు కూడా లేదు. వృద్ధాప్యంలో బతకలేక పోతున్నాను.. కొంత భూమి ఇప్పించి ఆధారం కల్పించాలి’ అని బుచ్చమ్మ వేడుకుంది.జనగామ రూరల్: ‘ఏళ్ల తరబడి తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదు.. ఎక్కడివక్కడే ఉన్నాయి.. మా వెతలు ఎప్పుడు తీరుతాయి’ అని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు వివిధ సమస్యలపై 64 అర్జీలు రాగా.. అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్తో కలిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్నాయక్ స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగిన చర్యలకు సూచనలు చేశారు. గ్రీవెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, డీడబ్ల్యూఓ ఫ్లోరెన్స్, డీసీఎస్ఓ సరస్వతి పాల్గొన్నారు. ఏళ్ల తరబడి తిరుగుతున్నా తీరని వెతలు గ్రీవెన్స్లో అర్జీదారుల ఆవేదన వివిధ సమస్యలపై 64 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లువినతుల్లో కొన్ని ఇలా.. తన 28 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి భూ రికార్డులను సవరించి పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరు చేయాలని జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన సంకటి పార్వతమ్మ అర్జీ పెట్టుకుంది. తన భూములకు సంబంధించి ఆర్ఓఆర్ ప్రొసీ డింగ్లు, 1బి, 7బి రికార్డులు జారీ చేయాలని లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన ఉప్పలసాగర్ వినతిపత్రం ఇచ్చారు. తన 29 గుంటల భూమిని అక్క కుమారుడు మోసం చేసి పట్టా చేయించుకుని ఇబ్బందులు పెడుతున్నాడు.. చర్యలు తీసుకుని భూమి ఇప్పించాలని జనగామ మండలం వెంకీర్యాల కు నీల సత్తమ్మ దరఖాస్తు పెట్టుకుంది. ఎకరం పది గుంటల భూమి డిజిటల్ పెండింగ్లో ఉంది.. సవరించి, పీపీబీలో అందజేయాల ని లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన సాయిలు అర్జీ పెట్టుకున్నాడు. తన ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించి అక్రమ పద్ధతిలో అదనంగా భూమి రికార్డు నమోదు చేయించుకున్నా రు.. న్యాయం చేయాలని తరిగొప్పుల మండలం కనీలకుంట గ్రామానికి చెందిన కలకుంట్ల నర్సింహులు వినతిపత్రం అందజేశారు. -
రేషనలైజేషన్తో ప్రాథమిక విద్య నిర్వీర్యం
టీచర్ల హేతుబద్ధీకరణ పేరుతో మరో మారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను అగాథంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నది. రేషనలైజేషన్ పేరిట ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తూ పాఠశాలల మూసివేతకు తలుపులు తెరిచింది. ఈనెల 6 నుంచి 19 వరకు ‘బడిబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆఘ మేఘాల మీద సర్దుబాటు చేయడం ఏమిటీ. ఎంతో నమ్మకం, విశ్వాసంతో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు తాము ఏమి సమాధానం చెప్పాలి?. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, ప్రధానోపాధ్యాయుల సంఘంవర్క్ అడ్జెస్ట్మెంట్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలిప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుమంటూ నే వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరిట ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. విద్యా ర్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని చెబుతూనే సర్దుబాటు పేరిట ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా చేయడానికి పూనుకోవడం ఆందోళనకరం. ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పిన సర్కారు.. ఇప్పుడేమో గత పాలకులు చేసిన విధంగానే వ్యవహరిస్తున్నది. – రాధాకృష్ణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
వెండి కిరీటం బహూకరణ
పాలకుర్తి టౌన్: శ్రీసోమేశ్వరలక్ష్మీనర్సింహస్వామి వారికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంకు చెందిన భక్తుడు ఇటుకల రాజు, శ్రావణి కుటుంబ సభ్యులు 258 గ్రాముల మిశ్రమ వెండితో తయారు చేసిన కిరీటాన్ని సోమవారం సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఈఓ సల్వాది మోహన్బాబు వెల్లడించారు. కార్యక్రమలలో సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.పాలకుర్తి సీఐ బదిలీపాలకుర్తి టౌన్: పాలకుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్రెడ్డి మహబూ బాద్ టౌన్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఆ స్థానంలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. మహేందర్రెడ్డి సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సర్కిల్ పరిధిలో వారానికి ఒక పోలీస్సేష్టన్ను సైకిల్పై సందర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకు ని పరిష్కరించారు. నేరాల నియంత్రణ, ప్రజలతో సత్సంబంధాల విషయంలో కీలక ప్రాత పోషించారు. ఈ ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించిన సీఐగా మహేందర్రెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీల్లో ఇంగ్లిష్, తెలుగు రైమ్స్జనగామ: ‘అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లిష్, తెలుగు రైమ్స్ నేర్పిస్తున్నాం.. రంగు రంగుల బొమ్మలు, ఆట వస్తువులతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాం.. మీ బిడ్డను ఇందులో చేర్పించండి.. కంటికి రెప్పలా చూసుకుంటూ జ్ఞానం కల్పిస్తాం’ అంటూ ‘అమ్మమాట–అంగన్వాడీ’ బడిబాటలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. సోమవారం పట్టణంలోని కురుమవాడ సత్రం కాలనీలో టీచర్ స్వర్ణలత ఆధ్వర్యాన ఇంటింటా ప్రచారం నిర్వహించా రు. రెండున్నర ఏళ్ల వయసు నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయ ని కరపత్రాల ద్వారా తెలియజేశారు. ఇంగ్లిష్, తెలుగు రైమ్స్తో పాటు కథలు, పాటలు, సృజ నాత్మకతతో కూడిన కృత్యాలు, ప్రకృతి సందర్శన, ప్రత్యక్ష అనుభవాలు, చదవడం, రాయడానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తామని వివరించారు. సీజేఐటీలో ‘టెక్నోజిల్–2025’ జనగామ: జనగామ మండలం యశ్వంతాపూ ర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో నేటి(మంగళవారం) నుంచి టెక్నోజిల్–2025 వేడుకలు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సోమవారం కళాశాలలో ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. మొదటిరోజు టెక్ ఐడియా, పేపర్ ప్రజంటేషన్, ప్రాజెక్టు ఎక్స్పో, రెండోరోజు సాంస్కృతిక విభాగంలో పేయింటింగ్, రంగో లీ, మెహందీ, స్లో బైక్రైడింగ్, ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలుంటాయని పేర్కొన్నా రు. టెక్నోజిల్ కన్వీనర్ సన్యాసిరావు, కోకన్వీనర్ జి.సరిత, కోఆర్డినేటర్ డాక్టర్ కె.యాకూబ్, స్టూడెంట్ కోఆర్డినేటర్ దివ్య, అశ్వితరా మ్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. ధరలు తగ్గించాలిజనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకులతోపాటు గ్యాస్ ధరలు తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యాన నెహ్రూపార్క్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పేదలను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాల్సింది పోయి పెట్టుబడీ దారులకు అనేక విధాలుగా రాయితీలు ఇస్తూ దోపడీ చేస్తున్నదని మండి పడ్డారు. అనంతరం జనర ల్ బాడీ సమావేశంలో కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. -
శిక్షణ ఐఏఎస్ల పర్యటన
జనగామ రూరల్/రఘునాథపల్లి : శిక్షణ ఐఏఎస్ అధికారుల బృందం సోమవారం జిల్లాలో పర్యటించింది. ఉషా నేతృత్వంలో కొయ్యడ ప్రణయ్, సౌరబ్ శర్మ, హరీశ్ చౌదరి, క్యారలీన్, సలోని బృందం మొదట కలెక్టర్ కార్యాలయాని కి చేరుకుంది. అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్ వారితో సమావేశమై జిల్లా ప్రాధాన్యతాంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్లోని ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. తర్వాత జనగామ మండలం పెంబర్తి కోఆపరేటివ్ సొసైటీని సందర్శించి హస్తకళా కార్మికులతో మాట్లాడారు. వారు తయారు చేసిన వస్తువులను పరిశీలించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రవీందర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి రఘునాథపల్లి మండల కేంద్రంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
● వీసీలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క జనగామ రూరల్: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ కె.రామకృష్ణారావుతో కలిసి ‘బడి బాట’, ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో మహిళా సంఘాలు పెట్రోల్ పంపు ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, ఒక పెట్రోల్ పంపు ఏర్పాటుతో 10 కుటుంబాలు బాగుపడతాయన్నారు. నవంబర్ నాటికి నూతన ఇంది రా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈనెల 12న పాఠశాలలు పునః ప్రారంభోత్స వం సందర్భంగా పండుగ వాతావరణంలో పిల్లల కు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందజేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సబ్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల అనువైన భూమి 10 రోజుల్లో గుర్తించాలని చెప్పారు. వీసీలో అదనపు కలెక్టర్ పింకేష్కుమార్, డీఆర్డీఓ, డీఈఓ పాల్గొన్నారు. -
విద్యార్థుల నమోదు పెంచమంటూ టీచర్లను తొలగిస్తారా?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, అభ్యసనా సామర్థ్యాల ను పెంచే బాధ్యతను ఉపాధ్యాయులే వహించాలని ప్రభుత్వం చెబుతూనే.. మరో వైపు సర్దుబాటు పేరిట ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను లేకుండా చేయడం దారుణం. సర్కారు స్కూళ్లలో విద్యార్థుల నమోదు ఏటేటా తగ్గిపోతున్నది. ఈ ఏడాది నమో దు పెంపునకు సమష్టిగా కృషి చేద్దామని చెప్పిన విద్యాశాఖ అధికారులు కనీసం ‘బడిబాట’ తర్వాత విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటి. వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులు ‘బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నమోదును పట్టించుకోకుండా ఈనెల 13 నాటికే సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం సరికాదు. – పి.చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్యూటీఎఫ్ ‘బడిబాట’ ముగిశాకే సర్దుబాటు చేయాలి‘బడిబాట’ ముగిశాకే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి. ‘బడిబాట’లో విద్యార్థుల సంఖ్య పెరిగేది లేనిది చూడకుండానే జూన్లోనే ఉపాధ్యాయుల సర్దుబాటు సహేతుకం కాదు. ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తే ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యార్థులు ఎలా చేరతారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, అదనంగా ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులను మాత్రమే జూలైలో సర్దుబాటు చేయాలి. – డి.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీపీటీఎఫ్ -
‘భూభారతి’ని వినియోగించుకోవాలి
జనగామ రూరల్: భూభారతి సదస్సులు రైతులకు అర్థమయ్యే రీతిలో పకడ్బందీగా నిర్వహించాలని సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ మంద మకరందన్ ఆదేశించారు. సోమవారం జనగామ మండలం యశ్వంతాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సదస్సు నిర్వహణను ఆర్డీఓ గోపిరామ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి చట్టం తీసుకొ చ్చింది రైతుల కోసమేనని, తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. దరఖాస్తులను పరిశీలిస్తూ తెలియనివి ఉంటే అధికారులను అడిగి తెలుసుకో వాలని పొరపాట్లు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్, ఆర్ఐ, డీటీ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నష్కల్, తమ్మడపల్లి(ఐ)లో సదస్సులు.. చిల్పూరు/జఫర్గఢ్: చిల్పూరు మండల పరిధి నష్కల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ, జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ) గ్రామంలో సోమవారం ఘన్పూర్ ఆర్డీఓ వెంకన్న ఆధ్వర్యాన భూ భారతి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది భూసమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులను అందజేశారు. తహసీల్దార్లు సరస్వతి, శంకరయ్య, డీటీలు సదానందం, అనిల్బాబు ఆర్ఐలు పాల్గొన్నారు. సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ మకరందన్ -
చెల్క భూముల్లో పత్తి సాగు
జనగామ: కొత్త టెక్నాలజీ సహకారంతో చెల్క భూముల్లో పత్తి సాగు చేసి ఉత్పాదకత పెంచేందుకు రైతులను ప్రోత్సహించడానికి కేంద్రం కొన్నేళ్లుగా నూతన స్కీంను అమలు చేస్తున్నద ని యాదాద్రి భువనగిరి ఏరువాక కేంద్రం, ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ బి.అనిల్కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అధిక సాంద్ర త పత్తి సాగు ప్రాజెక్టు 2025–26 సంవత్సరంలో 500 ఎకరాల టార్గెట్తో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. చెల్క భూమి(ఎర్ర భూములు) ఉన్న చిన్న, సన్నకారు రైతులు 1 నుంచి 5 ఎకరాల వరకు మాత్రమే ఈ ప్రాజెక్టులో నమోదు చేసుకోవాలన్నా రు. ఎకరానికి రూ.5వేల చొప్పున సబ్సిడీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపా రు. ఈ పథకం కింద రైతులు రాశి కంపెనీకి చెందిన ఆర్సీహెచ్–929, ఆర్సీహెచ్–971(స్విఫ్ట్) హైబ్రిడ్ విత్తనాలు వినియోగించే క్రమంలో మెళకువలు పాటించాలని సూచించారు. ప్రతీ వరుస మధ్యలో 90 సెంటీమీటర్ల(3 ఫీట్లు)తో పాటు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల(సగం ఫీటు) దూరం ఉండేలా విత్తుకోవాలని తెలిపారు. ఒక ఎకరానికి 6 ప్యాకెట్ల పత్తి విత్తనాలు సరిపోతా యన్నారు. రైతులు నూజివీడు కంపెనీకి చెందిన అర్మిత, ఆద్య, సిరి, విజేత హైబ్రిడ్ లేదా క్రిష్టల్ కంపెనీకి చెందిన సీసీహెచ్–03, సదానంద్ హైబ్రిడ్ విత్తనాలు నాటుకునే సమయంలో సూచనలు, సలహాలు పాటిస్తే మంచి దన్నారు. ప్రతీ వరుసకు 90 సెంటీమీటర్లు (3 ఫీట్లు), మొక్క మొక్కకు మధ్య 30 సెంటీమీటర్లు(1 ఫీటు) దూరం ఉండేలా చూడాలని, ఎకరాకు 4 ప్యాకెట్ల విత్తనాలు అవసరమని పేర్కొన్నారు. పైన సూచించి న రాశి లేదా నూజివీడు లేదా క్రిష్టల్ కంపెనీలకు చెందిన హైబ్రిడ్ విత్తన ప్యాకెట్లను ఈ ప్రాజెక్టులో పేర్లను నమోదు చేసుకు న్న రైతులకు అందుబాటులో ఉంచుతా మని వివరించారు. నాగపూర్కు చెందిన కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ ఆధ్వర్యాన ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో జిల్లాల్లోని కృషి విజ్ఞాన, ఏరువాక కేంద్రాల ద్వారా ఈ ప్రాజెక్టు నిర్వహణ కొనసాగుతుందని వివరించారు. జిల్లాలో 2023–24 సంవత్సరం పేరు నమోదు చేసుకున్న రైతులకు సాగు విస్తీర్ణం ఆధారంగా బ్యాంకు ఖాతా ల్లో సబ్సిడీ సొమ్ము జమ చేసినట్లు శాస్త్రవేత అనిల్కుమార్ చెప్పారు. రైతుల పత్తి పంట క్షేత్రానికి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు వచ్చి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఆస్తికి ఉన్న రైతులు(పేరు, ఊరు, మొబైల్ నంబర్) పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9989623815 / 8332970255 నంబర్లలతో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎకరాకు రూ.5వేల ప్రోత్సాహం జిల్లాకు 500 ఎకరాల టార్గెట్ పత్తి ఉత్పాదకత పెంచేందుకు కేంద్ర సర్కారు పథకం భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్కుమార్ -
రెస్కూ ్య.. సెవెన్ అవర్స్!
కాళేశ్వరం: సమీప బంధువు వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను ఏడు గంటల పాటు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్లో వివిధ బృందాల గాలింపుతో పోలీసులు త్వరగా కనుగొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోవివాహ వేడుకలు ముగిసిన తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ చూద్దామని సరదాగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు సొంత ఆటోలో పట్టి వెంకట్స్వామి అతడి ఇద్దరు కుమారులు, మరో ఐదుగురితో కలిసి వెళ్లారు. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అప్స్ట్రీమ్ మూడో బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రాంతంలో ఈతకు దిగిన ఏడుగురిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. అన్నీ కూలీ కుటుంబాలే.. అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి–యశోద దంపతులకు ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్(18) డిగ్రీ, చిన్నకుమారుడు పట్టి శివమనోజ్(15) (పదో తరగతి పూర్తి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ.. వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులు కళ్ల ముందే నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా రక్షించే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పిల్లల చెప్పులు, బెల్టులు పట్టుకొని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కవలల్లో ఒకరు మృతి అంబట్పల్లికి చెందిన సమ్మయ్యకు కుమారుడు కర్ణాల సాగర్(16), స్రవంతి కవలలు. వారిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. సాగర్ మృతి చెందడంతో సోదరి కన్నీటి ధారలతో వీడ్కోలు పలికింది. వారిదీ కూలీ కుటుంబమే. కొడుకు మరణంతో.. మల్హర్ మండలం మల్లారానికి చెందిన తొగరి రాజయ్య–సాంబ దంపతుల కుమారుడు తొగరి రక్షిత్(13) 9వ తరగతి చదువుతున్నాడు. వారు అంబట్పల్లిలోనే నివాసం ఉంటున్నారు. కూలీ పని చేస్తూ జీవించే వీరికి కుమార్తె కూడా ఉంది. రక్షిత్ మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి సాంబ రోదనలు మిన్నంటాయి. కుమారుడి మృతితో.. మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల వెంకటయ్య–స్వర్ణ దంపతుల పెద్ద కుమారుడు రామ్చరణ్(17) డిగ్రీ చదువుతున్నాడు. వీరు వ్యవసాయ కూలీలు.. వారికి చిన్న కుమారుడు ఉన్నాడు. రామ్చరణ్ మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది. అన్నా.. అంటూ నీటిలోకి.. పట్టి వెంకట్స్వామి చిన్న కుమారుడు శివమనోజ్ నీటిలోకి దిగి అన్నా..అన్నా అని పిలుస్తూ లోతుకు జారుకుంటున్నాడు. ఆక్రమంలో ఒడ్డున ఉన్న అన్న మధుసూదన్ తమ్ముడిని పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నం చేసి అతడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పట్టి మధుసూదన్ను కాపాడే ప్రయత్నంలో పట్టి శివమణి(18) కూడా నీటిలోకి దిగి చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెల్ఫీలతోనే.. ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. ఆ క్రమంలోనే జారి లోతు ప్రవాహంలో పడినట్లు తెలిసింది. దీంతో ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు అంతా గల్లంతై మృత్యువాత పడ్డారని తెలిసింది. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 12 గంటల వరకు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భూపాలపల్లి ఏఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, ఫైర్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాలు వెలికి తీశారు. అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా ఆర్తనాదాలతో మార్మోగింది. రాత్రి ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఘటన జరగడంతో హుటాహుటిన కదిలిన అధికారులు లైటింగ్ ఏర్పాటు చేసి కొంతమేర లోతుకు వెళ్లి పరిశీలించి రాత్రి 11.50గంటలకు వరకు వేచి చూసి నిలిపి వేశారు. శనివారం గోదావరి ప్రవాహం 5,100 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 4,500 క్యూసెక్కులకు తగ్గింది. రూ.10లక్షలు పరిహారం చెల్లించాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాల ను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీ లించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు పరి హారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్యారేజీకి మ రమ్మతులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి వదిలేశారని, నీటిని నిల్వ చేసి కాపలా ఉంటే ఈ ఘటన జరి గి ఉండేది కాదన్నారు. మృతి ఘటనకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబే కారణమని ఆరోపించారు.ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు మృతులందరివీ సాధారణ కూలీ కుటుంబాలే తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు ప్రాణాలు తీసిన ఈత సరదా.. సెల్ఫీలపై ఆసక్తి!7 గంటల్లో ఇలా.. ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. మొదట 5.41 గంటలకు తొగరి రక్షిత్, 6.50 గంటలకు పసుల రాహుల్, 9.45 గంటలకు కర్ణాల సాగర్, 10.07 గంటలకు మధుసూదన్, 11.16 గంటలకు రామ్చరణ్, 11.45 గంటలకు శివమనోజ్ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్కుమార్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు పవన్కుమార్ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట డీటీ కృష్ణ, ఆర్ఐ జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ సురేశ్ ఉన్నారు. వివాహ వేడుకలకు వచ్చి.. మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల శ్రీనివాస్–లక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు రాహుల్(19) డిగ్రీ చదువుతున్నాడు. వివాహ వేడుకలకు వచ్చి రాహుల్ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారు కూడా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. -
లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు షురూ
జఫర్గఢ్: మండల కేంద్రమైన జఫర్గఢ్ పడమర కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతీఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి మూడురోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పొడిచేటి వెంకటాచార్యులు తెలిపారు. మొదటి రోజులో భాగంగా 81 కళాశాలతో స్వామివారికి కళాభిషేకం చేశారు. అనంతరం భక్తులు మొక్కులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. శ్మశానవాటిక అభివృద్ధిపై రివ్యూ చేస్తాం జనగామ: జనగామ పట్టణంలోని నెహ్రూపార్కు ఏరియా 60 ఫీట్ల రోడ్డులోని వైకుంఠ ధామం అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో రివ్యూ చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ‘చివరి మజిలీలో గౌరవం ఎక్కడ..!’ శీర్షికన ఈ నెల 8వ తేదీన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. వైకుంఠ ధామంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గోపినాథ్ మరణం బాధాకరం● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాజకీయాల్లో ఓ విలక్షణమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మాగంటి, నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ చెరగని ముద్ర వేశారన్నారు. మాగంటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే పల్లా ఆకాంక్షించారు. నేడు మధ్యాహ్న భోజనం తయారీపై శిక్షణజనగామ:జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారీపై జిల్లా స్థాయిలో నేడు (సోమవారం) ఒక్కరోజు శిక్షణ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ ఏరియా ప్రభుత్వ పాఠశాలలో నేడు కాంప్లెక్స్ హెచ్ఎంతో పాటు వంట తయారీ గ్రూపులోని ఒకరు జిల్లా స్థాయి శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే 10వ తేదీన మండల స్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమానికి కాంప్లెక్స్ హెచ్ఎం, ప్రతీ పాఠశాల నుంచి ఒక వంట తయారీ ప్రతినిధి హాజరు కావాల్సి ఉంటుంది. సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం అందించే భోజనంలో మరింత నాణ్యతను పెంచే విధంగా ఈ శిక్షణ దోహద పడనుంది. శిక్షణలో వంట తయారీకి సంబంధించిన మేళకువలతో పాటు ప్రత్యక్షంగా వివిధ వంటకాలను తయారు చేసి సంబంధిత ఫొటోలను రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులకు పంపించమన్నారు. 11 నుంచి బీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి బీపీఈడీ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపా రు. ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. -
ముగిసిన ధాన్యం కొనుగోళ్లు
జనగామ రూరల్: వ్యవసాయం మీద ఆధారపడి జీ వించే రైతులకు అండగా ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం పని చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా ముగిసిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు భాగస్వామ్యం అయిన ప్రతీ ఒక్క అధికారిని కలెక్టర్ అభినందించారు. 1,64,211.160 మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా సన్న రకం 107, దొడ్డు రకం 193 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 300 కేంద్రాల ద్వారా 1,64,211.160 మె.ట ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతుల ఖాతా ల్లో రూ.380 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. సాఫీగా ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లకు ముందస్తుగా ఏర్పాట్ల పైన తగిన శిక్షణ ఇచ్చి రైతులకు సరిపడా టార్పాలిన్లు అందజేశారు. ధాన్యం తూర్పారా పట్టేందుకు 120 అధునాతన ఆటోమేటిక్ యంత్రాలను అందుబాటులో ఉంచి తగినన్ని సంచులు సరఫరా చేయడంతో పాటు సకాలంలో ధాన్యం రవాణా చేశారు. ప్రతీరోజు కలెక్టర్ పర్యవేక్షణ, టెలీ కాన్ఫరెన్స్, గూగుల్ మీట్ ద్వారా పలు సూచనలు చేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,64,211.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రతీ గింజను కొనుగోలు చేశాం.. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ అత్యధిక స్థాయిలో కొనుగోలు చేశాం. ఏ సమస్య వచ్చినా సంబంధిత అధికారులు ఆయా కేంద్రాలను సందర్శించి సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించేలా తగు ఆదేశాలు తీసుకున్నాం. అందరి సహకారంలో జిల్లాలో కొనుగోళ్లు పూర్తి చేశాం. – రిజ్వాన్ బాషా, కలెక్టర్ -
చినుకు జాడేది..?
జనగామ: వానాకాలం సీజన్కు ముందు మోస్తరు వర్షాలతో ఆశపుట్టించిన వరుణుడు.. రైతులు నార్లు పోసి, దుక్కులు దున్ని, పత్తి గింజలు పెట్టిన తర్వా త ముఖం చాటేశాడు. వేలాది రూపాయలు పెట్టుబడిపెట్టి సాగు చేసిన పంటకు తడిలేక ఎండుతుంటే చూసి తట్టుకోలేక అన్నదాత కన్నీటి పర్యంతమవుతున్నాడు. యాసంగి సీజన్లో వర్షాభావ పరిస్థితులు, కరువుతో 30 శాతం పంట దిగుబడి కోల్పోయి న రైతన్నలు ఆశలన్నీ వానాకాలంపై పెట్టుకున్నా రు. ఈ సీజన్ ఆరంభంలోనే వర్షాలు గడిబిడ చేస్తుండడంతో.. భవిష్యత్పై టెన్షన్గా ఉన్నారు. 3.40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా జిల్లాలో వానాకాలం సీజన్లో వరి 2.15 లక్షలు, పత్తి 1.25లక్షలు.. అన్ని పంటలు కలుపు కుని 3.40 లక్షల ఎకరాల వరకు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నెల రోజుల నుంచి సాగు పనులు మొదలయ్యాయి. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న అన్నదాతలు నాట్ల కోసం నారు సిద్ధం చేసుకున్నారు. నర్మెట, పాలకుర్తి, లింగాలఘణపురం, దేవరుప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ఘన్పూర్, జఫర్గఢ్, పాలకుర్తితో పాటు జనగామ ప్రాంతంలోని పలు గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగా పత్తి గింజలు విత్తుకున్నారు. గత నెల 24వ తేదీ వరకు అడపా దడపా వర్షాలు కురవడంతో 10 నుంచి 15వేల ఎకరాల్లో వరి నాట్లు సైతం వేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు 10 మీటర్ల లోతుకు పడిపోగా.. 80శాతం మేర బోర్లు ఒట్టి పోయాయి. బోరు బావుల ద్వారా సాగునీరు అందించలేని పరిస్థితుల్లో.. రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడ్డారు. గత నెల 25వ తేదీ నుంచి వర్షాల జాడ లేక పోవడంతో నారు మళ్లు, నాట్లు వేసిన పొలా లు, పత్తి విత్తనాలు ఎండిపోయి మట్టిలో కలిసిపోయే ప్రమా దం ముంచుకొస్తోంది. దీంతో రైతులు పెట్టుబడులు నష్టపోయే అవకాశం ఉంది. రోహిణీ కార్తె ముగిసి నేటి నుంచి మృగశిర కార్తె మొదలు కానుంది. వరణుడు ముఖం చాటేయడంతో సీజన్ పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కొందరు అప్పులు చేసి బోర్లను రీఫ్రెష్ చేయిస్తుండగా.. మరికొందరు కొత్తగా వేయిస్తున్నారు.మే నెలలో కురిసిన వర్షపాతం వివరాలుమురిపించి.. ముఖం చాటేసి 15 రోజులుగా అడ్రస్లేని వానలు మొలకెత్తని పత్తి గింజలు ఎండుతున్న వరి నారు మళ్లు ఆందోళనలో అన్నదాతలు తేదీ మిల్లీమీటర్లు 10 1.1 11 1.1 14 4.2 15 2.6 16 3.5 17 9.5 19 0.4 20 0.4 21 10.3 22 12.2 23 0.7 24 7.3 -
‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు నేతలకు ఆదివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో మూడో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొండా సురేఖ, ధనసరి సీతక్కలకు రేవంత్రెడ్డి కేబినేట్లో స్థానం దక్కింది. సుమారు 16 నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మూడో మంత్రి కోసం పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆశావహులకు నిరాశ మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుంచి వాయిదా పడుతుండగా.. చివరకు శుక్రవారం పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు అగ్రనేతలతో ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. 2014లో టికెట్ దక్కకున్నా ఇండిపెండెంట్గా గెలుపొందిన మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ టికెట్పైన గెలిచిన ఈయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినా జరగలేదు. ఈసారి కూడా తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరినా దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని వదలకుండా ఉన్న తనకు కూడా అవకాశం ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పార్టీ పెద్దలకు తన వాయిస్ వినిపించారు. మాజీ ఐపీఎస్ అధికారి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు ప్రచారం. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి ఆశించిన ఎవరికీ అమాత్యపదవి దక్కక పోవడం కొంత నిరాశ పర్చింది. అమాత్యుల శాఖలు పదిలం మంత్రివర్గ విస్తరణలో ఈసారి కనీసం నలుగురికి అవకాశం ఉంటుందని భావించినా.. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో ఎమ్మెల్యే, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రానున్న కాలంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విస్తరణ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు చెందిన శాఖల మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(గ్రామీణ నీటిసరఫరా సహా), మహిళా శిశుసంక్షేమ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రి వరకు శాఖలు కేటాయించలేదు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగలేదు. దీంతో మంత్రుల శాఖలు మారతాయనేది ఉత్త ప్రచారమని తేలిపోయింది.ఫలించని ఓరుగల్లు సీనియర్ నేతల ప్రయత్నాలు డిప్యూటీ స్పీకర్తోనే సరిపెట్టిన పార్టీ అధిష్టానం విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా రామచంద్రునాయక్ శాఖలను పదిలం చేసుకున్న మహిళా మంత్రులు ఊహాగానాలకు తెర దింపిన హైకమాండ్ -
నాటి చరిత్ర కళ్లకు కట్టేలా..
● కలెక్టరేట్లో ఫొటో గ్యాలరీజనగామ : జిల్లా కలెక్టరేట్లో రాజకీయ, చరిత్రకు సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. జనగామ పేరు ప్రస్తావన, తెలంగాణ సాయుధ పోరాట ఘట్టాలు, ఆనాటి పోరాట యోధులు ఇలా ప్రతీ ఒక్క అంశంతో కూడిన ఫొటోతో పాటు సమగ్ర సమాచారంతో ఫొటోలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో ఎంటర్ కాగానే.. ఎదురుగా ఉన్న ప్రత్యేక చాంబర్లో ప్రతి ఒక్కరికి జిల్లా ఆవిర్భావం, నాటి చరిత్రను కళ్లకు కట్టేలా చిత్ర మాలికను ఆకర్షనీయంగా అందుబాటులో ఉంచారు. -
300 మందికి వైద్య పరీక్షలు
రఘునాథపల్లి: ఫతేషాపూర్లో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రాథమిక పాఠశాల ఆవరణలో గ్రామానికి చెందిన చింత మహేష్, పయ్యావుల రఘుపతి ఆధ్వర్యంలో యశోద నేత్రాలయ ఆస్పత్రి సహకా రంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మాజీ జెడ్పీటీసీ లింగాల జగదీష్చందర్రెడ్డి ప్రారంభించారు. శిబి రానికి వచ్చిన దాదాపు 300 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో గొట్టం భాస్కర్రెడ్డి, గాజులపాటి మహేందర్, ఎండీ.హయత్అలీ, గాజులపాటి నేతాజీ, ఎండీ.షబ్బీర్మియా, గొట్టం కరుణాకర్రెడ్డి, గాజులపాటి విరోజీ, చింత మదార్, యామంకి కొంరెల్లి, ఎలందర్ పాల్గొన్నారు. -
నదీతీరం.. శోకసంద్రం
నేనూ సచ్చిపోయేవాడినే ః పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తీసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులో కి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొక రు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి సమీప మేడిగడ్డ ఎగువన మూడోబ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాదం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. రాత్రి 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థాని కులకు, పోలీసులకు సమాచారం అందింది. వెంట నే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్ర సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావ డం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి నదిలోకి దిగి ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం గాలింపు కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం... పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూస్తూ... గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది. మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు గల్లంతైన వారు.. అంబట్పల్లి వాసులు: పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంట వాసి బొల్లెడ్ల రాంచరణ్(17), స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్(19) సాయంత్రం 6 నుంచి 11.50 వరకు సాగిన గాలింపు.. లభించని ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలో విషాదం -
బడి బస్.. ఫిట్లెస్!
మొత్తం బస్సులు ఫిట్నెస్ చేసుకున్నవి చేయించుకోవాల్సినవిజనగామ భూపాలపల్లి 103 54 49130 58 72ములుగు ఇవీ నిబంధనలు.. ● 15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి. ● విద్యా సంస్థ పేరు, సెల్ఫోన్ నంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ● ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. ● డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ● బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్ ఉండాలి. ● ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి. ● ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. ● కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి. ● ఫుట్బోర్డ్పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి.హనుమకొండ95 46 49920 485 435(917 బస్సుల్లో 225 బస్సులను వివిధ కారణాలతో తిరస్కరించారు)వరంగల్ మహబూబాబాద్ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు350 172 178222 48 134‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్పరీక్షలు చేయించుకోవాలి. కానీ క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్బడి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్నెస్ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు కోరారు. ఇలా చేస్తే మంచిది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్నెస్ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. 1,820కి ఇప్పటివరకు పూర్తి చేసుకుంది 887 పరీక్షలు చేసుకోవాల్సింది 917.. ఫిట్నెస్ తనిఖీలకు రాని వందల బస్సులు ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంతో చర్చ స్పెషల్ డ్రైవ్లకు సిద్ధమవుతున్న ఆర్టీఏ అధికారులు -
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు ఆధ్వర్యాన వార కల్యాణా న్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వైభవంగా నిర్వహించారు. వేడుకను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు హైదరాబాద్కు చెంది న చాగంటి రామకృష్ణ–కృష్ణవేణి దంపతులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలిజనగామ రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సీఐటీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీ ర్యం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు యాటల సోమన్న, సుంచు విజేందర్, అన్నబోయిన రాజు, చిట్యా ల సోమన్న, జోగు ప్రకాష్, బూడిద ప్రశాంత్, తాండ్ర ఆనందం, బత్తిని వెంకన్న పాల్గొన్నారు. కేసీఆర్తోనే తెలంగాణ సాకారం దేవరుప్పుల : కేసీఆర్ ఉద్యమంతోనే తెలంగా ణ కల సాకారం అయిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆమెరికా దేశం వాషింగ్టన్, సియాటిల్లోని వాటా, వాట్జ్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ని రాజకీయ అడ్డంకులు వచ్చినా అధిగమించేందుకు సమస్త తెలంగాణ సమాజాన్ని కూడగట్టుకొని ప్రత్యేక రాష్ట్రం సాధించి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్.. మొన్న కేసీఆర్ విజన్తో పరిపాలన సాగిస్తే.. కొందరు విమర్శలు చేయడం శోచనీయమన్నా రు. విదేశాలకు వచ్చినా స్వదేశీ అభివృద్ధిపై ఎన్ఆర్ఐల తోడ్పాటు అభినందనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు, ఎన్ఆర్ఐలు వంశీరెడ్డి, రాజేష్, సందీప్, గణేష్ వీరమనేని, మాణిక్యం, ప్రదీప్ పాల్గొన్నారు. -
చివరి మజిలీలో గౌరవం ఎక్కడ..?
జనగామ: ‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అనే సాంగ్ పుట్టుక, మరణం ఒకటే అనే అర్థం చెబుతుంది. తల్లి కడుపులో నుంచి ప్రపంచాన్ని చూసిన వేళ కుటుంబ సభ్యులు ఎంత సంతోష పడతారో.. చివరి మజిలీలోనూ అలాగే సాగనంపాలనే ‘ఆకలి రాజ్యం’ సినిమా పాట ఎప్పుడూ హిట్టే. పట్టణంలోని నెహ్రూపార్కు 60 ఫీట్ల రోడ్డు ఏరియాలో ఉన్న వైకుంఠ ధామం చూస్తే చచ్చిన వ్యక్తికి సైతం అసహ్యం వేసేలా కనిపిస్తోంది. చెత్త కుప్పలు, దుర్గంధంతో మురికి కూపాన్ని తలపిస్తోంది. వర్షాలు కురిస్తే మోకాలి లోతు నీరు. అక్కడ పది నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి. జిల్లా కేంద్రంలోని 75 శాతం జనాభాకు ఈ వైకుంఠ ధామమే దిక్కు. చివరి మజిలీలో చనిపోయిన వ్యక్తికి గౌరవ ప్రదమైన వీడ్కోలు లేకుండా పోతున్నది. మున్సిపల్ అధికారులు ఒక్కసారి అటువైపు వెళ్లి చూస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. చెత్త డంపింగ్ కేంద్రంగా మారిన వైకుంఠ ధామాన్ని ఆహ్లాదకరంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. చెత్త డంపులు.. మురికి కూపాలు దుర్గంధం వెదజల్లుతున్న వైకుంఠ ధామం -
విస్త్తృత తనిఖీలు చేపడతాం..
విద్యాసంస్థల ప్రారంభంలోగా.. బస్సులన్నింటికీ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే విస్తృత తనిఖీలు చేపట్టడం ద్వారా పట్టుబడిన వాహనాలు సీజ్ చేస్తాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తాం. పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. అనుభవం ఉన్న డ్రైవర్ల నియామకం చేయాలి. పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, ఇన్చార్జ్ డీటీసీ, హనుమకొండ -
నేడు మృగశిర కార్తె
● జోరుగా చేపల అమ్మకాలుజనగామ: రోహిణి ముగిసి ఆదివారం(నేడు) మృగశిర కార్తె ఆరంభం కాబోతోంది. అయినా ఎండలు మండిపోతున్నాయి. పది రోజుల ముందు ముసు రు వర్షాలతో వాతావరణం కాసింత చల్లబడినా తిరిగి ఒక్క సారిగా వేడెక్కింది. మృగశిర ప్రారంభం రోజు చేపలు తినడం వల్ల వానాకాలంలో వచ్చే వ్యాధులు దూరమవడమే కాకుండా గుండె జబ్బులు, అస్తమా వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఎండాకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేడి ఉండేందుకు చేపలను తినడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా కొర్రమీను, రోహు, కట్ల, రవ్వు చేపలంటే చాలా మంది ఇష్టపడతారు. కొందరు ఏపీ నుంచి రొయ్యలు, ఇతర రకాల చేపలను ఆర్డర్పై తెప్పించుకుంటారు. జిల్లా కేంద్రంలో శనివారం ముందస్తుగానే మృగశిర చేపల విక్రయాలు జోరందుకున్నాయి. చాలా మంది కొనుగోలు చేస్తూ కనిపించారు. -
మోదీ నాయకత్వంలోనే అభివృద్ధి
జనగామ రూరల్: మోదీ నాయకత్వంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిరికొండ విద్యాసాగర్ రెడ్డి అన్నారు. ‘నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యాన కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమాని కి మోదీ చేసిన అభివృద్ధి పనులు అనేకం ఉన్నాయ ని, తెలంగాణ అభివృద్ధికి పాటుపడింది బీజేపీ మాత్రమే అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా బొమ్మకంటి అనిల్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పెద్దోజు జగదీశ్, ఉపాధ్యక్షులుగా తోకల హరీశ్, బింగి రమేశ్, సూరజ్ హరిప్రసాద్, గోగీకర్ బాలా జీ, నాగ బండి సరిత, కార్యదర్శులుగా దూసరి శివకృష్ణ, ఏగుర్ల భాస్కర్, కాసుల నీలిమ, పాయల వెంకటలక్ష్మి, ట్రెజరర్గా గుజ్జుక రాజు ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా.. మండల కమిటీ ఆధ్వర్యాన అధ్యక్షుడు లద్దునూరి మహేశ్ యాదవ్ నేతృత్వంలో స్థానిక వికాస్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దేవరాయ ఎల్లయ్య, మార్క ఉపేందర్, బండారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
విశేష అలంకరణలో వేంకటేశ్వరస్వామి
చిల్పూరు: బుగులు వేంకటేశ్వరస్వామి శుక్రవారం విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. ఉదయం ఆల య ఈఓ లక్ష్మీప్రస న్న, చైర్మన్ శ్రీధర్రావు ఆధ్వర్యంలో అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజల చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పనులు వేగవంతం చేయాలి జనగామ రూరల్: బతుకమ్మకుంట పనులు వేగంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బతుక మ్మ కుంట అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పా రు. పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో తెలియజేయాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలోనే చేనేత రంగం పురోగతి దేవరుప్పుల : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నే తెలంగాణంలో చేనేత రంగం పురోగతికి అడుగులు పడ్డాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం ఆయన అమెరికా డల్లాస్లో తెలంగాణ పద్మశాలీలతో ఎంఎల్సీ రమణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించగా ఎన్ఆర్ఐలు ఎర్రబెల్లిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమ నేపథ్యంలో నేతన్నల కష్టం తెలిసిన కేసీఆర్ ఆచరణాత్మకంగా చేనేత మిత్ర, నేతన్న కు చేయూత పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. వరంగల్, సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్లు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఊరట కల్పించార ని, కొడకండ్లలోనూ మినీ టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయించినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ఎన్ఆర్ఐలు తోడ్పాటు ఇవ్వ డం అభినందనీయమన్నారు. మహిళా సంఘాల పాత్ర కీలకం లింగాలఘణపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడంలో మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమని డీఈఓ భోజన్న అన్నా రు. శుక్రవారం నెల్లుట్లలో జరిగిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలకు వివరించి వారి పిల్లలు స్కూళ్లలో చేరే విధంగా చూడాలని కోరారు. జీసీడీఓ గౌషియాబేగం, ఎంఈఓ విష్ణుమూర్తి, హెడ్మాస్టర్లు శ్రీలత, సమ్మ క్క తదితరులు పాల్గొన్నారు. ‘పార్ట్టైం’ నియామకం జనగామ: ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి పార్ట్టైం(పీటీఐ) బోధకుల నియామకానికి సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూళ్లతో పాటు భవిత కేంద్రాల్లో హెల్త్, ఫిజికల్, ఆర్ట్, వర్క్ ఎడ్యుకేషన్ బోధకుల సేవలను పునఃప్రారంభిచనున్నారు. జిల్లాలో గత ఏడాది 55 మంది పార్ట్టైం బోధకులు పనిచేయగా.. ప్రతీ ఏడా ది ఏప్రిల్లో కాలపరిమితి ముగుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలో పనిచేయడానికి గత ఏడా ది చివరి నెల వేతనంతో నియమించనున్నారు. బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం జనగామ రూరల్: బెస్ట్ అవైలబుల్ పథకం కింద అడ్మిషన్ల కోసం గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరా నికి 3,5,8వ తరగతిలో ప్రవేశానికి జిల్లాలోని గిరిజన విద్యార్థులు అర్హులని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం 1,50,000, పట్టణ ప్రాంతం రూ.రెండు లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఈనెల 9 నుంచి 13 వరకు హనుమకొండలోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని, 20న లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందని తెలిపారు. -
ఆయిల్ పామ్ సాగుతో స్థిరాదాయం
బచ్చన్నపేట : ఆయిల్ పామ్ తోటల సాగుతో స్థిరాదాయం పొందవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయిల్ పామ్ తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3,500 ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 2వేల మంది రైతులు సుమారు 7వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, 45 మంది రైతులు 1,716 ఎకరాల భూమిని గుర్తించినట్లు పేర్కొన్నా రు. ఈ పంటకు వడగళ్ల వర్షం, కోతులతో సమస్య ఉండదని, ఉద్యానవన అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి రవికాంత్, ఫీల్డ్ ఆఫీసర్ శశి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఓఆర్తో భూసమస్యలకు పరిష్కారం బచ్చన్నపేట/నర్మెట : భూ భారతి చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్ఓఆర్ చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట మండలం కొన్నె, నర్మెట మండలం వెల్దండ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రైతుల దరఖాస్తులను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులో అన్ని రకాల భూసమస్యలకు దరఖాస్తు చేసుకోవచ్చని, రెవెన్యూ సిబ్బంది దగ్గరుండి సహా యం అందించాలని చెప్పారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు ఫణికిషోర్, కలకుంట్ల వెంకట రామానుజాచార్యులు, డీటీలు స్రవంతి, వేణు, ఎంఆర్ఐ కృష్ణవంశీ, ఏఆర్ఐ మున్వర్, జూనియర్ అసిస్టెంట్లు యాకయ్య, సర్వేయర్ నర్మద, రజిత, గంగాస్వప్న, కవిత, రాజశ్రీ పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
‘భూ భారతి’ చట్టంతో సమస్యల పరిష్కారం
జనగామ రూరల్/రఘునాథపల్లి : నూతన ‘భూ భారతి’ చట్టంతో ప్రజల భూ సమస్యలు పరిష్కా రం అవుతాయని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ అన్నారు. శుక్రవారం జనగామ మండలం ఎల్లంల, రఘునాథపల్లి మండలం మాధారం గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెండో దశ గ్రామ రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. సదస్సుకు హాజరైన రైతులు, ప్రజల నుంచి భూ సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు తీసుకుని రశీదులు తప్పనిసరి ఇవ్వాలని, చట్టాన్ని అనుసరించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు హుస్సేన్, మోహ్సిన్ముజ్తబ, ఏఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్లు, ఎంఎస్లు రవీందర్, శ్రీనివాస్రావు, నరేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ -
సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవాలి
దేవరుప్పుల : సర్కారు స్కూళ్లకు పూర్వవైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం సింగరాజుపల్లిలో నిర్వహించిన ‘బడిబాట’ ర్యాలీ ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని శివాలయ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ రంగాల్లో రాణించాలన్నా విద్య అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద కనీస వసతులు మెరుగుపర్చి ప్రాథమిక, ఉన్నత విద్య బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ జి.కళావతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, హెచ్ఎం సూచిత్రానంద్ తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
మైనర్ పనులే పెండింగ్
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025– 10లోuజనగామ: నిధులున్నాయి.. పనులు పూర్తి కాగానే డబ్బులు బ్యాంకులో జమవుతున్నాయి.. అయినా అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చివరి దశ పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. తరగతి గదులకు కిటికీలు అమర్చలేదు.. మరుగుదొడ్లకు తలుపులు బిగించలే దు.. విద్యుత్ వైరింగ్, టాయిలెట్ల నిర్మాణం, ప్రహరీలు, రంగుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతిపై ‘సాక్షి’ పరిశీలనాత్మక కథనం. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద 320 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. తరగతి గదుల్లో బోధనకు అవసరమైన పరికరాలతో పాటు కనీస మౌలిక వసతుల కల్పనకు గత ఏడాది ఏప్రిల్లో రూ.11.75 కోట్ల నిధులకు అడ్మిన్ సాంక్షన్ ఇచ్చారు. ఇందులో 12 పాఠశాలల్లో నూత న టాయిలెట్ల నిర్మాణానికి ఇటీవలే గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 1,125 పనులకు ఇప్పటి వరకు 950 పూర్తయ్యాయి. రూ.9.25 కోట్ల మేర నిధులు చెల్లించారు. 250 పాఠశాలల్లో వందశాతం పనులు పూర్తికాగా.. జిల్లాలో మరో 63 పాఠశాలలకు ఈ స్కీంలో అవకాశం కల్పించాలని ఇటీవల అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ప్రభుత్వానికి నివేదించారు.కమిటీ నిర్లక్ష్యం.. పనులకు ఆటంకం నర్మెట: గండిరామారం ప్రాథమికోన్నత, వెల్దండ ఉన్నత పాఠశాలల్లో విద్యుత్ వైరింగ్ పని పెండింగ్లో ఉంది. టాయిలెట్లకు తలుపులు బిగించలేదు. నిధుల కొరత లేకున్నా కమిటీ నిర్లక్ష్యంతో పనులకు ఆటంకం కలుగుతోంది. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇబ్బంది లేకుండా చేస్తాం..పాఠశాలలు తెరుచుకునే లోపు అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు పెండింగ్ లేకుండా చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. తాగునీటి వసతులు, టాయిలెట్ల పనులు వందశాతం పూర్తి చేయిస్తాం. – మడిపల్లి ఐలయ్య, ఎంఈఓకిటికీ లేని తరగతి గది బచ్చన్నపేట : పై ఫొటోలో కనిపిస్తున్న పాఠశాల బచ్చన్నపేట మండలం గోపాల్నగర్ పీఎస్. ఇందులో ఒకటి నుంచి 5 తరగతులు ఉన్నాయి. 27 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కొత్త అడ్మిషన్లు కొన్ని పెరగనున్నాయి. ఏడాది క్రితం ఈ స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల స్కీంకు ఎంపికై యింది. మరమ్మతు, టాయిలెట్లు, టైల్స్ ఇతర మైనర్ పనుల కోసం రూ.2.11లక్షల నిధులకు అడ్మిన సాంక్షన్ ఇచ్చారు. మరుగుదొడ్డిలో టైల్స్, తరగతి గదులకు కిటికీల బిగింపు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. తరగతి గదిలోని డిజిటల్ బోర్డు, బెంచీలు, కుర్చీలకు రక్షణ లేదు. పనులు పూర్తి చేయిస్తాం..90 శాతం పనులు పూర్తయ్యాయి. మైనర్ పనులు పెండింగ్లో ఉన్నాయి. పాఠశాలల పునఃప్రారంభం లోపు వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – మడిశెట్టి కృష్ణమూర్తి, హెచ్ఎంన్యూస్రీల్గ్రౌండ్ రిపోర్ట్ ’అమ్మ ఆదర్శ పాఠశాల’ పథకం కింద జిల్లాలో 320 స్కూళ్ల ఎంపిక వందశాతం పనులు పూర్తయిన పాఠశాలలు 250 రూ.9.25 కోట్ల మేర నిధుల చెల్లింపులు బడుల పునఃప్రారంభానికి మిగిలింది ఐదు రోజులే.. -
పరిశోధనా పద్ధతులపై అవగాహన ఉండాలి
కేయూ క్యాంపస్: వివిధ సామాజిక అంశాలపై పరిశోధనలు చేసేటప్పుడు పద్ధతులపై అవగాహన అవసరమని కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ అండ్ ఎంఎస్డబ్ల్యూ విభాగం అధిపతి ప్రొఫెసర్ స్వర్ణలత అన్నారు. శుక్రవారం యూని వర్సిటీలోని రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోషల్సైన్స్ పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై ఏర్పాటుచేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. పరిశోధకులకు పరిశీలనలో నమూనా పద్ధతులను ఆమె వివరించారు. కేస్ స్టడీ అనేది కీలకంగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో ఆ విభాగం అధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, అధ్యాపకులు డాక్టర్ నాగరాజు, పరిశోధకులు పాల్గొన్నారు. డీఈఈసెట్ అభ్యర్థులకు 9నుంచి సర్టిఫికెట్ల పరిశీలన విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఈఈసెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల ప్రవేశాలకుగాను ఈనెల 9నుంచి 13వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమతమ ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు ర్యాంకు కార్డు, హాల్టికెట్, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకురావాలని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 14నుంచి 17వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సింటుందని తెలిపారు. పూర్తి వివరాలకు టీజీడీఈఈసెట్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. -
కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు జనగామ రూరల్: కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డీఎంహెచ్ఓ మల్లికార్జున్రావు అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్, మెప్మా సంయుక్త ఆధ్వర్యాన శుక్రవారం స్థానిక మున్సిప ల్ కార్యాలయంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది తరచూ దుమ్ము, ధూళి ఇతర కాలుష్యం బారిన పడుతుంటారని, వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయ క గ్రూపు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది రక్తనమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టుల ఆధారంగా వైద్యం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.వెంకటేశ్వర్లు, ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి జనగామ రూరల్: మహిళలు ప్రభుత్వం అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ వసంత అన్నారు. శుక్రవారం సెర్ప్, భారత ప్రభుత్వం పారిశ్రామిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ పారిశ్రామిక శాఖ సంయుక్తంగా ఆలిప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యాన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు శిక్షణ పొందాలని, ముఖ్యంగా టైలరింగ్, పేపర్ ప్లేట్స్, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల అధికారి శివరామకృష్ణ, డీపీఎం రాజేంద్రప్రసాద్, ఏపీఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలి
జనగామ రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభమైనందున తక్షణమే రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యాన శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రం బ్యాంకు మేనేజర్కు అందజేశా రు. ఈ సందర్భంగా చందునాయక్ మాట్లాడుతూ ప్రజల డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా ధనంతో నిర్వహిస్తున్న బ్యాంకులు రిజర్వు బ్యాంక్ నిబంధనల ప్రకారం రైతులకు 18శాతం పంట రుణాలు, 22శాతం దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉండగా అమలు చేయడంలేదన్నారు. దీంతో సీజన్ ప్రారంభంలో అన్నదాతలు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాల ని, కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈనెల 11న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. రామావత్ మీట్యా నాయక్, బోడ రాములు, ఉర్సుల కుమార్, ఉర్సుల మల్లయ్య రామచొక్కం తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చందునాయక్ -
సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : రైతులు పండించిన ధాన్యాన్ని వానాకాలం, యాసంగి సీజన్లలో ఏటా సేకరిస్తు న్న ప్రభుత్వం.. మర ఆడించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైస్మిల్లులకు అప్పగిస్తోంది. కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మరాడించి బియ్యాన్ని గడువులోగా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్సీఐలకు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఉమ్మడి జిల్లాలో గతేడాది రెండు సీజన్లలో సీఎంఆర్ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగలేదు. అయినప్పటికీ అధికారులు ఈ వానాకాలానికి సంబంధించి కూడా సుమారు 281 రా రైస్, పారాబాయిల్డ్ రైస్మిల్లులకు సీఎంఆర్ ధాన్యం సరఫరా చేశారు. రెండు నెలలు కావస్తున్నా కేవలం 2.19 శాతం మాత్రమే రైస్మిల్లర్లు బియ్యం ప్రభుత్వరంగ సంస్థలకు అందజేశారు. సీఎంఆర్ జాబితాలో డిఫాల్టర్లు..! గతం వానాకాలం, యాసంగి సీజన్లలో సీఎంఆర్ కింద ధాన్యం తీసుకుని ఇంకా బియ్యం ఇవ్వని డిఫాల్టర్లకు ఈ వానాకాలంలో సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కువగా హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. ● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు రైస్మిల్లులను నడుపుతున్న హసన్పర్తికి చెందిన ఓ వ్యాపారి రూ.కోట్లలో సీఎంఆర్ ఎగవేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అతడిపై రెవెన్యూ రికవరీ యాక్టు పెట్టే అవకాశం ఉన్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ ధాన్యం కేటాయించడం వివాదాస్పదం అవుతోంది. ● హసన్పర్తి మండలం సీతంపేట సమీపంలోని ఓ రైస్మిల్లును లీజుకు తీసుకుని సివిల్సప్లయీస్ ద్వారా తీసుకున్న సుమారు రూ.15 కోట్ల విలువైన ధాన్యానికి మంగళం పాడినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే గత వానాకాలం, యాసంగి సీఎంఆర్ ఇవ్వని డిఫాల్టర్లకు ఈ సీజన్లో ధాన్యం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ సీజన్లోనూ రైస్మిల్లులకు బ్యాంకు గ్యారంటీ, ష్యూరిటీలు తీసుకుని సీఎంఆర్ కింద ధాన్యం కేటాయించామని, సీఎంఆర్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి వరంగల్కు చెందిన పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు.వానాకాలం బియ్యం మరాడింపు ప్రక్రియ మరీ స్లో.. ఉమ్మడి వరంగల్లో మిల్లర్లకు 7.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం 5.04 లక్షల మెట్రిక్ టన్నులు.. రెండు నెలల్లో ఇచ్చింది 11,068 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే యాసంగి సీఎంఆర్పైన నిర్లక్ష్యమే.. డిఫాల్టర్లకు సీఎంఆర్ ధాన్యం?జిల్లా మొత్తం ధాన్యం ఇవాల్సిన ఇచ్చిన ఇంకా ఇవ్వాల్సిన (మెట్రిక్ టన్నుల్లో..) సీఎంఆర్ బియ్యం బియ్యంహనుమకొండ 1,14,129 77,608 2,091 75,517 వరంగల్ 1,55,177 1,05,520 00 1,05,520 మహబూబాబాద్ 1,69,073 1,14,970 00 1,14,970 జనగామ 1,61,246 1,09,647 7,042 1,02,605 ములుగు 72,640 49,395 804 48,591 జేఎస్ భూపాలపల్లి 69,996 47,597 1,131 46,466 7,42,261 5,04,737 11,068 4,93,669సర్కారు ధాన్యంతో మిలర్ల వ్యాపారం.. సీఎంఆర్ కింద ధాన్యం ఇచ్చే క్రమంలో రైస్మిల్లుల యజమానులకు గడువు విధించి నిర్దేశించిన సమయంలోగా అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అయితే ఏటా మిల్లుల యజమానులు గడువును లెక్కచేయకుండా ధాన్యాన్ని బియ్యంగా మార్చి సొంత వ్యాపారం చేసుకుంటూ.. వారికి నచ్చినప్పు డు పౌరసరఫరాల సంస్థ, ఎఫ్సీఐలకు బియ్యం అప్పగిస్తున్నారు. ఇలా ప్రతి ఏటా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్మిల్లులకు ఈ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన 7,42,261 మెట్రిక్ టన్నుల ధాన్యం సీఎంఆర్ కింద ఇచ్చారు. ఇందుకు 5,04,737 మెట్రిక్ టన్నుల బియ్యం ఆగస్టు వరకు పూర్తిగా ఇవ్వాల్సి ఉండగా.. రెండు నెలల్లో కేవలం 11,068(2.19 శాతం) మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే మిలర్లు ఇచ్చారు. గతేడాది వానాకాలం, యాసంగి సీఎంఆర్కు సంబంధించి సుమారు రూ.561 కోట్ల విలువైన బియ్యం పెండింగ్లో ఉండగా.. ఈ వానాకాలం సీజన్కు సంబంధించి 4,93,669 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్లు ఎప్పటి వరకు ఇస్తారన్న చర్చ జరుగుతోంది. -
సేఫేనా..?
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025హోటల్ ఫుడ్ పట్టణంలోని ఓ బేకరీ నిర్వహణ ఇలా..● పట్టణంలో అధ్వానంగా హోటళ్ల నిర్వహణ ● మురికి కూపాలను తలపిస్తున్న కిచెన్ షెడ్లు ● నిల్వ చేసిన చికెన్, మటన్ విక్రయాలు ● ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కరువుజనగామ: హోటల్కు వెళ్లి ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుంటూ టిఫిన్లు లాగిస్తున్నారా.. అయితే ఒకటికి రెండు సార్లు చూసుకుని తినండి.. చట్నీలో బల్లి, బొద్దింక ఇంకా ఏమైనా రావచ్చు.. జంతు అవశేషాలు కనిపిస్తే నిర్వాహకులు సింపుల్గా కొట్టి పారేస్తారు. నిలదీస్తే దబాయిస్తారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ నుంచి టిఫిన్తోపాటు తీసుకెళ్లిన చట్నీలో బల్లి అవశేషాలు కనిపించగా అడిగిన విని యోగదారుడికి ‘కొత్తిమీట కట్ట, ఆకు కూర’ అయి ఉండొచన్నారు. గట్టిగా నిలదీస్తే దబాయించారు. సోమవారం పట్టణంలో జరిగిన ఘటన హోటళ్లకు నిర్వహణకు అద్దం పడుతోంది. ప్రజల ఆరోగ్యం గాలికి.. పట్టణంలోని హోటళ్ల నిర్వాహకులకు సంపాదనే లక్ష్యంగా మారింది. ప్రజల ఆరోగ్య భద్రతను గాలికి వదిలేశారు. ఆహార పదార్థాలు, తిను బండారాల తయారీలో నిబంధనలు పాటించకుండా కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. టేస్టీ కోసం బిర్యానీలో రంగులు, ఫాస్ట్ఫుడ్లో హానికరమైన లిక్విడ్స్ కలుపుతూ కొత్త రోగాలకు కారకులవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కిచెన్ షెడ్లు మురికి కూపాలను తలపిస్తున్నాయి. వడ, మిర్చి, దోష, పూరీ తదితర పిండి వంటల తయారీ ముడికి సరుకును అపరిశుభ్రత వాతావరణంలో ఉంచుతున్నారు. బల్లులు, బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాలు సంచరిస్తున్నా పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసిన చికెన్, మటన్ కర్రీలను వినియోగదారులకు అంటగడుతున్నారు. కుళ్లిన వంటకాలు, జంతు అవశేషాలు, అపరిశుభ్రత కని పించిన కస్టమర్లు ఫిర్యాదు చేస్తే కనీస చర్యలు ఉండడం లేదు. ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకెళ్తే వచ్చి ఎంతో కొంత జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. ల్యాబ్కు పంపిస్తామని శాంపిళ్ల పేరిట సేకరిస్తున్న ఆ పదార్థాలకు సంబంధించిన రిపోర్టుల జాడే ఉండడం లేదు. గతంలో నెహ్రూపార్కు ఏరియాలోని రాఘవేంద్ర టిఫిన్ సెంటర్, సాయిక్రిష్ణ హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, దాబాలు, రెస్టారెంట్లు తదితర వాటిలో కుళ్లిన మాసం వంటకాలు, జంతు అవశేషాలతో చట్నీ బయటపడడంతో జరిమానా మినహా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల మోర్ సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన బలవర్థకమైన ఆహార ప దార్థాలు విక్రయించగా జరిమానాతో సరిపుచ్చారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో అధ్వానం జిల్లా కేంద్రంలోని పలు ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో విక్రయిస్తున్న చికెన్ ఎంత వరకు సేఫ్ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చికెన్ సెంటర్ల వద్ద కటింగ్ చేసే సమయంలో పడేసే వేస్టేజ్ను తీసుకు వచ్చి ఫ్రైడ్రైస్, నూడిల్స్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రాత్రి మిగిలిన వంట కాన్ని రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి మరుసటి రోజు వేడి చేసి అమ్ముతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు కఠినంగా ఉంటాయి. సోమవారం చట్నీలో బల్లి అవశేషాలు వచ్చిన సాయిక్రిష్ణ హోట ల్కు గతంలోనూ రూ.5వేల జరిమానా వేశాం. ప్రస్తుతం కస్టమర్ ఫిర్యాదుతో ల్యాబ్కు పంపించి రెండు రోజులు హోటల్ను సీజ్ చేశాం. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం అయితే హోటల్ శాశ్వతంగా మూసివేస్తాం. ఈ మేరకు యజమానితో లిఖిత పూర్వకంగా తీసుకున్నాం. – చేవూరి కృష్ణమూర్తి, గెజిటెడ్ ఫుడ్సేఫ్టీ అధికారి, వరంగల్న్యూస్రీల్ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లు ఉన్నాయా..? పట్టణంలో చాలా హోటళ్లకు ట్రేడ్ లైసెన్స్లు, ఫుడ్ సేఫ్టీ అనుమతులు లేవని తెలుస్తున్నది. కనీసం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేని హోటళ్లపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార భద్రత అధికారులు వచ్చి తనిఖీ చేసిన దాఖలాలూ కనిపించవు. ఒక వేళ ఎవరైనా వినియోగదారులు ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా వచ్చి జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. -
సర్కారు స్కూళ్లలోనే నాణ్యమైన విద్య
సర్కారు స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలి. సర్కారు స్కూళ్లలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం అందజేస్తారు. కార్పొరేట్కు ధీటుగా డిజిటల్ తరగతులు, స్పెషల్ క్లాస్లు, సబ్జెక్టు ల వారీగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన ఉంటుంది. ప్రైవేట్ మాయలో పడొద్దు. డబ్బులు వృథా చేసుకోవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. – భోజన్న, డీఈఓ● -
మొక్కలతోనే మానవ మనుగడ
జనగామ రూరల్: మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యం ఏర్పడి మానవజాతి మనుగడ సాధ్యమవుతుందని డీపీఓ స్వరూప, డీఆర్డీఓ వసంత అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెంబర్తిలో మొక్కలు నాటిన అనంతరం వారు మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని, మానవుడు అనేక వ్యర్థాలను గాలిలోకి వదడంతో వాయు కాలుష్యం ఏర్పడుతోందని చెప్పారు. దీనిని నివారించడం కేవలం మొక్కల పెంపకం వల్లే సాధ్యం అవుతుందని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని కోరా రు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీఓ సంపత్కుమార్, ఏపీఓ భిక్షపతి, ఈసీ మాధవరెడ్డి, పంచా యతీ కార్యదర్శి ప్రఫుల్రెడ్డి, సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
మానవ జాతికి వృక్షాలే ఆధారం
జనగామ రూరల్: మానవ జాతికి వృక్షాలే ఆధారం.. పర్యావరణం పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలి.. ప్లాస్టిక్ను నిషేధించాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాల సదన్ను సందర్శించి బాలికలతో మొక్కలు నాటించారు. చెట్లతో భవిష్యత్ తరాలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పిల్లలతో మొక్కలు నాటించటం వల్ల వారికి సైన్స్పై అవగాహన పెరుగుతుందని చెప్పారు. ప్లాస్టిక్ వినియోగంతో భూసారం తగ్గడంతో పాటు అనారోగ్యానికి కారణమతుందని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, కె.వేరోనికా, ఎం.కృష్ణవేణి బి.స్రవంతి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ -
‘బడిబాట’కు వేళాయె..
జనగామ: అమ్మ ఆదర్శ పాఠశాలలతో కార్పొరేట్ కు ధీటుగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన.. పిల్లల బంగారు భవిష్యత్కు బాట లు వేస్తున్న సర్కారు స్కూళ్లలో పిల్లలను చేర్పించా లంటూ టీచర్లు ఇంటింటా ప్రచారం చేయడానికి సన్నద్ధమయ్యారు. గత నెల చేపట్టిన ముందస్తు ‘బడిబాట’ ముగియగా.. నేటి(శుక్రవారం) నుంచి రెండో విడత ప్రారంభం కానుంది. సర్కారు స్కూళ్లలో కల్పిస్తున్న వసతులపై ఈనెల 19వ తేదీ వరకు ఊరూరా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహ న కల్పించనున్నారు. ఆయా పాఠశాలల్లో విద్యాబోధన గురించి కార్పొరేట్ తరహాలో ముద్రించిన కరపత్రాలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మొదటి విడత ‘బడిబాట’ కార్యక్రమంలో 132 మంది విద్యార్థులను గుర్తించి అడ్మిష న్ల కోసం తల్లిదండ్రులను సంప్రదిస్తున్నారు. కార్యాచరణ మేరకు.. డీఈఓ భోజన్న ఆధ్వర్యాన నేటి నుంచి నిర్వహించ తలపెట్టిన రెండో విడత ‘బడిబాట’ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన కార్యాచరణ మేరకు ముందు వెళ్లనున్నారు. గ్రామ సభలు, బడిఈడు పిల్లల గుర్తింపు, ఇంటింటి ప్రచారం, అంగవాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్ఔట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం తదితర క్యాక్రమాలు చేపట్టాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల ప్రారంభం, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ, సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ, విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం, తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం, విద్యార్థులకు క్రీడా పోటీలతో ‘బడిబాట’ ముగియనుంది. నేటి నుంచి రెండో విడత షురూ.. ఇంటింటి ప్రచారానికి ఉపాధ్యాయులు 19న క్రీడా దినోత్సవంతో ముగింపు మొదటి విడతలో 132 మంది గుర్తింపు ‘బడిబాట’ కార్యక్రమాలు ఇలా.. 6న : గ్రామసభలు 7న : ఇంటింటికీ వెళ్లి పిల్లల గుర్తింపు 8 నుంచి 10 వరకు : కరపత్రాలతో ఇంటింటి ప్రచారం. అంగన్వాడీ కేంద్రాల సందర్శన. డ్రాప్ఔట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించ డం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించడం. 11న : 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష 12న: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యాన చేపట్టిన పనుల ప్రారంభం. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం పంపిణీ. 13న: సామూహిక అక్షరాభ్యాసం. బాలల సభ 16న: ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ దినోత్సవం 17న: విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం 18న: తరగతి గదుల డిజిటలీకరణపై అవగా హన. మొక్కల పెంపకం 19న: విద్యార్థులకు క్రీడా పోటీలు -
నిర్ణీత సమయంలో లక్ష్యాలు సాధించాలి
జనగామ రూరల్: నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం కలెక్టరేట్లో వనమహోత్స వం, జలశక్తి అభియాన్, సీజనల్ వ్యాధులు తది తర అంశాలపై సంబంధిత అధికారులతో ఏర్పా టు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని చెప్పారు. జీపీలు, హాస్టళ్లు, స్కూళ్లు, గ్రంథాలయాలు, పీహెచ్సీలు, పశువైద్య కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలన్నారు. ‘బడిబాట’ నిర్వహించే గ్రామ సభల్లో వనమహోత్సవం ఆవశ్యకతతో పాటు జాతీయ కుటుంబ లబ్ధి పథకంపై వివరించాలని చెప్పారు. జలశక్తి అభియాన్లో భాగంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడానికి సోక్ పిట్, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రభల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటిలో క్లోరినేషన్ చేయాలని, దోమల నివారణకు మురికివాడల్లో ఫాగింగ్ చేయించాలని చెప్పారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ మాధురి షా, డీఆర్డీఓ వసంత, డీపీఓ స్వరూప, ఆయా శాఖల జిల్లా అధికారులు మల్లి కార్జునరావు, రామారావునాయక్, రాధాకిషన్, శ్రీధర్, రవీందర్, అనిత పాల్గొన్నారు. ‘భూ భారతి’ చట్టం రైతులకు వరం జఫర్గఢ్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘భూ భారతి’ చట్టం రైతులకు వరం లాంటిదని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. కోనాయిచలంలో గురువారం నిర్వహించిన భూ భారతి గ్రామ సభను ఆయన సందర్శించారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ శంకరయ్య, డిప్యూటీ తహసీ ల్దార్ అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు జఫర్గఢ్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. లబ్ధిదారులు కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గురువారం పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడు తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఇందిర మ్మ రాజ్యంలో పేదలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని చెప్పారు. ఆర్డీఓ డీఎస్ వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్రెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, సింగిల్ విండో చైర్మన్ తీగల కర్ణాకర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఆర్థిక బలోపేతమే లక్ష్యం
‘ఉపాధి’ పనుల ఎంపికలో మార్పులు ● తగ్గనున్న పూడికతీత పనులు ● గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలకు ప్రాధాన్యం ● నీటి సంరక్షణలో 15 రకాల పనులు ● జిల్లా వ్యాప్తంగా 2.31లక్షల కూలీలు ● ఈఏడాది 28 లక్షల పనిదినాలు జనగామ రూరల్: గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల ఎంపికలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మట్టి పనులను పూర్తిగా తగ్గించి కూలీలు ఆర్థికంగా బలోపేతం అయ్యే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 28 లక్షల పనిదినాలుగా ప్రణాళిక ఖరారు చేశారు. ప్రధానంగా బిల్డింగులు, ఇతర నిర్మాణాలు చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం, అంగన్వా డీ కేంద్రాలకు నూతన భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కిచెన్ షెడ్లు, పాఠశాలలకు ప్రహరీల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తగ్గనున్న పూడికతీత పనులు ఉపాధి పథకంలో ఎక్కువగా చెరువు పూడికతీత పనులు చేపడుతుంటారు. ఈ పనుల పేరుతో ఏటా రూ.కోట్లలో నిధులు ఖర్చవుతున్నా ఆశించిన మేర ఫలితాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పనులు అక్రమార్కులకు మరింత లాభం చేకూరేలా ఉన్నాయి. సోషల్ ఆడిట్లోనూ తరచూ ఇవి బయటపడుతున్నాయి. నిరుపేద కూలీల పేరుతో రూ.లక్షల్లో నిధులు పక్కదారిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి పనుల ఎంపికలో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా పూడికతీత పనులను చాలా వరకు తగ్గించారు. ప్రాధాన్యత పనులకు లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనులకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా వ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు భవన నిర్మాణాలు, 54 అంగన్వాడీ కేంద్రాల భవనాలు, 54 చోట్ల పాఠశాలల కిచెన్ షెడ్లు, ప్రహరీలు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ మేరకు పనుల ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో లింకు రోడ్లకు కూడా ఉపాధి నిధులను కేటాయించనున్నారు. 2,31లక్షల మంది కూలీలు గ్రామీణ ప్రాంత నిరుపేద కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని 281 గ్రామాల్లో పనులు నడుస్తున్నా యి. మొత్తం 1,17,806 లక్షల జాబ్కార్డులు ఉండగా.. 2.34 లక్షల మంది కూలీలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో ఉపాధి పనులకు రెగ్యులర్గా వెళ్లే కూలీల సంఖ్య 1.28 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 50 రోజుల్లో రూ.20కోట్ల విలువైన పనులు చేపట్టారు. నీటి సంరక్షణ పనులు ఈసారి ఉపాధి హామీ పథకంలో నీటి సంరక్షణ ప నులు కూడా చేపట్టనున్నారు. అలాగే వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానంగా చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులు, ఓపెన్వెల్స్, ఫాంపాండ్లు, వాటర్ హార్వెస్టింగ్ పాండ్లు, రూఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, బోర్వెల్ రీచార్జ్ కట్టడాలు తదితర 15 రకాల పనులను ఈసారి కూడా ఉపాధి పథకంలో చేపట్టనున్నారు. ఒక్కో మండలంలో చేపట్టనున్న పనులు ఇలా.. క్యాటిల్ షేడ్స్ 20, అజొల్లా 20, వర్మికంపోస్ట్ 10, పౌల్ట్రీ షెడ్లు 20, అగ్రికల్చర్ రోడ్డులు(10 కిలోమీటర్లు) హార్టికల్చర్ ప్లాంటేషన్ 10 ఎకరాలు, ఫాంపాండ్లు 40, పర్కులేషన్ ట్యాంకులు 5 చెక్డ్యాంలు 2, రూఫ్టాప్ వాటర్ హార్వెస్టింగ్ 10, బోర్వెల్ రీచార్జ్ 10, ఇరిగేషన్ ఓపెన్ వెల్స్ 2, కమ్యూనిటీ సోక్ కిట్స్ 40, ప్రభుత్వ కార్యాలయాల్లో రోప్ టాప్ రీచార్జ్ స్ట్రక్చర్లు 25, వ్యక్తిగత మరుగుదొడ్లు 200 నుంచి 300. పీఆర్ డిపార్ట్మెంట్ ద్వారా సీసీ రోడ్డులు(10 కిలోమిటర్లు), అంగన్వాడీ కాంపౌండ్ వాల్స్ 2, మండలాల్లో సొంత జీపీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలె ట్లు లేని వాటికి ఏర్పాటు చేయనున్నారు.భవన నిర్మాణాలకు ప్రాధాన్యం ఈ ఏడాది ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం కొత్తగా పనులను ఎంపిక చేసింది. గతంలో పూడికతీత, ఇంకుడు గుంతలకు ఎక్కువ అవకాశం కల్పించగా.. ప్రస్తుతం భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా జీపీ భవనాలు, మండలానికి రెండు చెక్డ్యాంలు, నీటి సంరక్షణ పనులు, పాఠశాల కాంపౌండ్ వాల్స్, అంగన్వాడీ భవనాల నిర్మాణం చేపట్టనుంది. దినసరి కూలి రూ.307 ఉంది. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. – వసంత, డీఆర్డీఓ -
‘పచ్చని’ వాతావరణం.. స్వచ్ఛమైన గాలి
జనగామ: ‘పచ్చని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం.. పర్యావరణ పరిరక్షణకు ఉద్యమంలా కదులుదాం.. రేపటి భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడుకుందాం’ అంటూ పర్యావరణ ప్రేమికులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. మట్టిని నాశనం చేస్తూ, ప్రమాదకరమైన ప్లాస్టిక్తో ప్రయాణిస్తూ వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్న మానవ సమాజాన్ని మేల్కొలుపుతున్నా.. ఇంకా నిద్ర మత్తులోనే జోగుతున్నారు. నేడు(గురువారం) ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. పర్యావరణంపై మానవుడి దాడి ప్రకృతి ఒడిలో పంచభూతాలు ప్రాణకోటి జీవజాతికి ఆధారం. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్య వంతమైన జీవనం వీటితోనే సాధ్యం. ప్రకృతితో పెనవేసుకున్న మానవుడి జీవితం ప్రమాదంలో ఉంది. చెరువులు, వాగులు, పచ్చని కొండలు కనుమరుగవుతున్నాయి. మానవులు పర్యావరణంపై చేస్తున్న ఈ దాడితో వాయు, నీటి కాలుష్యంతోపాటు పుడమిపై తీవ్ర ప్రభావం పడుతోంది. రోజురోజుకూ విస్తరిస్తున్న మహా నగరాలు, పట్టణాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి ఆకుపచ్చని అడవులు కాంక్రీట్ వనాలుగా మారుతున్నాయి. 5.28 లక్షల ఎకరా ల విస్తీర్ణం కలిగి ఉన్న జనగామ జిల్లాలో అటవీ ప్రాంతం కేవలం 7,265 ఎకరాలు మాత్రమే. ఒక శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 3 నుంచి 5 శాతానికి పెంచేందుకు 11 ఏళ్లుగా కోట్లాది రూపాయలు ఖచ్చు చేస్తున్నా ఇప్పటికీ 0.05 శాతం అడవిని మాత్రమే పెంచగలిగారు. అంతరిస్తున్న అటవీ ప్రాంతం జిల్లాలో 1985 నుంచి 2018 వరకు కలప అక్రమ రవాణా జోరుగా సాగింది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో చెట్లను నరికి కర్రను జిల్లా దాటించేస్తున్నారు. రోడ్ల విస్తరణ పేరిట మహా వృక్షాలను తొలగించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాగు పెరిగింది. దీంతో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న చెట్లను తొలగించడంతో జిల్లా ఎడారిగా మారింది. దీనికి తోడు రియలెస్టేట్ వెంచర్ల పేరిట పచ్చని చెట్లను నరికి పర్యావరణా నికి చేటు చేస్తున్నారు. మానవునికి నేలతో ఉన్న సంబంధాన్ని గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవంభూమిపై మళ్లీ పుట్టే అవకాశం వస్తే.. భూమిపై మళ్లీ పుట్టే అవకాశం వస్తే ప్రకృతిలో ఏ రూపంలో పుట్టాలనుకుంటున్నారు. కొద్ది సేపు మౌనంగా ఉండి ఆలోచిస్తే సమాధానం లభిస్తుంది. మీరు పుట్టాలనుకునే రూపం ఈ భూమిని మీరు ఎంతగా ప్రేమిస్తారో చెబుతుంది. అప్పుడే పర్యావరణ పరిక్షణ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతాం. – ఎండీ.గౌసియా బేగం, టీజీ నేషనల్ గ్రీన్ క్రాప్స్● ప్లాస్టిక్కు గుడ్బై చెబుదాం ● మట్టిలో కలిసి పోయే శ్రేష్టమైన బ్యాగులు వాడుదాం ● ఇంటిముందు నీటి పాత్ర పెట్టి పక్షులను కాపాడుదాం ● మొక్క నాటి పేరుపెట్టి మిత్రుడిగా చూసుకుందాం ● అది మన జీవన గమనంలో మైలురాయి అవుతుంది ● పిల్లలు, మనువలకు నీడ నిస్తుంది●ఇలా చేద్దాం..భవిష్యత్ తరాలకు అందిద్దాం ఇన్స్టంట్ వ్యవసాయం, ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు కనుమరుగవుతున్న చెరువులు, వాగులు, పచ్చని కొండలు వాటిని కాపాడుకుంటేనే మానవుల మనుగడ 5.28 లక్షల ఎకరాల విస్తీర్ణంలో జిల్లా.. అటవీ ప్రాంతం ఉన్నది ఒక్క శాతమే -
ఉత్సాహంగా వ్యాసరచన పోటీలు
జనగామ రూరల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ‘ప్లాస్టిక్ కాలు ష్యాన్ని ముగిద్దాం’ అనే అంశంపై నిర్వహించి న వ్యాస రచన పోటీలో 18 మంది, చిత్రలేఖ నం పోటీలో 14 మంది జిల్లాలోని 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను డీఈఓ భోజన్న సందర్శించి విద్యార్థులను అభినందించారు. వ్యాసరచనలో మనోజ్ఞ, శ్రీ కార్మెల్ కాన్వెంట్ స్కూల్ పాలకుర్తి ప్రథమ స్థానం, పి.అక్షయ, కేజీబీవీ బచ్చన్నపే ట ద్వితీయ స్థానం, ఎం.సంయుక్త, జెడ్పీఎస్ఎస్ ధర్మకంచ తృతీయ స్థానం, కె.నందిని, కేజీబీవీ స్టేషన్ఘన్పూర్ నాగులో స్థానంలో నిలిచారు. చిత్రలేఖనంలో టి.సహస్ర సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల పాలకుర్తి ప్రథమ, సీహెచ్.శివ ద్వితీయ, టి.గణేష్, లింగాలఘణ పురం మోడల్ స్కూల్ తృతీయ, కన్సోలేషన్ బహుమతికి జి.శ్రీ విద్య, కేజీబీవీ స్టేషన్ఘన్పూర్ ఎంపికయ్యారు. వీరికి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన బహుమతులు అందించనున్నారు. విత్తనాల పంపిణీపై విచారణబచ్చన్నపేట : స్థానిక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా జరిగిన విత్తనాల పంపిణీపై పాలకుర్తి ఏడీఏ పరశురాంనాయక్ బృందం ఆధ్వర్యాన బుధవారం విచారణ చేపట్టారు. రైతులకు సబ్సిడీపై అందించాల్సిన జీలుగ విత్తనా లను ఆ షాపు యజమాని పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఆ విత్తనాలను తొర్రూరు వద్ద టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకుని విచా రించగా బచ్చన్నపేట నుంచి తీసుకొచ్చినట్లు వెల్లడైంది. అందులో భాగంగానే ఆగ్రోస్ షాపు ల్యాప్టాప్, విత్తనాల విక్రయ, స్టాక్ తదితర రికార్డులను టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీ నం చేసుకుని ఆ దుకాణాన్ని సీజ్ చేసి అందులోని జీలుగ విత్తనాలను వేరే ప్రదేశానికి తరలించారు. విచారణలో భాగంగా కొడవటూర్, బసిరెడ్డిపల్లి, సదాశివపేట గ్రామాల్లో జీలుగ విత్తనాలు తీసుకున్న రైతుల నుంచి వివరాలు సేకరించి అవి ఎక్కడ విత్తారో పంట పొలాల వద్దకు క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించారు. కొడవటూర్ రైతులకు 35 బస్తాల జీలుగ విత్తనాలు విక్రయించినట్లు రికార్డులో ఉండగా.. అక్కడ కేవలం ఏడుగురు రైతులకు ఏడు బస్తాలు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడైందని సమాచారం. మరో రెండు రోజుల పాటు అధికారుల బృందం విచారణ చేపట్టనుంది. క్రీడలతో ఉజ్వల భవిష్యత్జనగామ రూరల్: క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా క్రీడల అధికారి వెంకట్రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం ధర్మకంచలోని మినీ స్టేడియంలో చేపట్టారు. అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపగాని సుగుణాకర్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకట్రెడ్డి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని, అలాగే భవిష్యత్లో మంచి కళాశాలలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్నత విద్యకు అవకావం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి మనోజ్కుమార్, ట్రెజరర్ అశోక్కుమార్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కై రిక హనుమంతరావు, సంతోష్కుమార్, బన్నీ, రామచంద్రం, పోరిక విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ర్యాపిడ్’ ఫోర్స్ కవాతుజనగామ: జిల్లా కేంద్రంలో బుధవారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. డీసీపీ రాజమహేంద్రనాయక్ ఆధ్వర్యాన ఏఎస్పీ పండేరి చేతన్నితిన్ నేతృత్వంలో నెహ్రూపార్కు నుంచి రైల్వేస్టేషన్ మీదుగా ఆర్టీసీ చౌరస్తా వరకు చేపట్టిన ఈ కవాతులో.. శాంతి భద్రల పరిరక్షణలో మేమున్నామంటూ ర్యాపిడ్ యాక్ష న్ ఫోర్స్ బృందం ప్రజలకు తెలియ జేసింది. అత్యవసర సమయంలో ప్రజలను కాపాడుతు న్న తీరును వివరించింది. -
విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాలకుర్తి టౌన్: సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యాలయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ప్రాధాన్యత కల్పిస్తున్నదని ఎమ్మెల్యే మామి డాల యశస్వినిరెడ్డి అన్నారు. స్థానిక బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఉంటూ సిద్ధార్థ విద్యాలయంలో చదవి పదో తరగతిలో 557 మార్కులు సాధించి సీఎం ప్రతిభా పురస్కారం అందుకున్న విద్యార్థి ఈగ సందీప్ను ఆమె బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ జిల్లా నుంచి సందీప్ ప్రతిభా పురస్కారాన్ని పొందడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షే మ వసతి గృహాల విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం పెంచి ప్రోహిస్తున్నదని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యాలో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సందీప్ తల్లిదండ్రులతోపాటు సిద్ధార్థ విద్యాలయం ప్రిన్సిపాల్ జక్కుల రవీందర్, కరస్పారెండెంట్ జక్కుల ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. -
పునర్విభజన హామీల అమలుకు పోరాటం
నర్మెట: పునర్విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ల్లపల్లి శ్రీనివాస్రావు అన్నారు. పార్టీ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా స్థానిక వినాయక గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సభాప్రాంగణంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు పాతూరి సుగుణమ్మ ఎర్రజెండాను ఎగురవేసిన అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సీహెచ్. రాజారెడ్డి, సహాయ కార్యదర్శులుగా ఆకుల శ్రీనివాస్, ఆది సాయన్నను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. విభజన చట్టంలో తెలిపిన విధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్ట రీ ఏర్పాటు చేయాలని, జనగామ నుంచి హైదరా బాద్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో గుగులోత్ సఖి, మోతె శ్రీశైలం, చొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, సముద్రాల రాజు, జువారి రమేశ్, జీడి ఎల్లయ్య, నీల కనకయ్య, బోనగిరి కుమారస్వామి, పాతూరి ప్రశాంత్రెడ్డి, చామకూర యాకూబ్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ల్లపల్లి శ్రీనివాస్రావు -
సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి
ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు తీవ్ర ప్ర భావం చూపుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా తరచూ తీవ్రమైన వడగాల్పులు, కరువు, వరదలు, తుపాన్లు తదితర విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నది. ఇవి మానవ ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించ డం, పునరుత్పాదక ఇంధన వనరులకు మారడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరం. – డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్, సామాజిక వేత్త పర్యావరణ రక్షకులుగా ఉందాం.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ముందు తరాలకు ఇవ్వాల్సింది ఆస్థిపాస్తులనే కాదు.. స్వచ్ఛమైన పర్యావరణాన్నికూడా. అందుకు మనమంతా పర్యావరణ స్పృహ కలిగి ఉండాలి. మన పిల్లల్లోనూ పర్యావరణంపై అవగాన పెంచాలి. నీరు, నేల, కాలుష్యం కాకుండా చూడాలి. – త్రిపురారి పద్మ, సాహితీవేత్త, రచయిత్రి ● -
కేజీబీవీల్లో విద్యార్థినుల నమోదు పెంచాలి●
● అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ జనగామ రూరల్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో విద్యార్థినుల నమోదు పెంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. బుధవారం డీఈఓ భోజన్నతో కలిసి కలెక్టరేట్ నుంచి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో మాట్లాడారు. కేజీబీవీల్లో భద్రతతో కూడిన విద్య, నాణ్య మైన భోజనం, వసతులు కల్పిస్తున్న విషయాన్ని బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రణాళికతో ‘బడిబాట’ నిర్వహించాలని చెప్పారు. ఇంటర్ ఫలితాల గురించి తెలుసుకున్న కలెక్టర్.. పదో తరగతి పాసైన విద్యార్థినులు కేజీబీ వీలోనే ఇంటర్లో వివిధ కోర్సులు తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో బాలికల అభివృద్ధి అధికారి గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి/లింగాలఘణపురం: రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం రఘునాథపల్లి మండలం నిడిగొండ, లింగా లఘణపురం మండలం నెల్లుట్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన అనంతరం మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శంగా జరిగిందని, మొదటి విడతలో ఇల్లు మంజూరు కాని అర్హులు ఆందోళన చెందవద్దని, త్వరలో రెండో విడతలో వస్తుందని చెప్పారు. ‘ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎవరైనా డబ్బులు అడిగితే నాకు తెలియచేస్తే వారి పని నేను చూసుకుంటా’ అని భరోసా ఇచ్చారు. అవినీతికి అస్కారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్సింగ్, ఆర్డీఓ గోపిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, ఎంపీడీఓలు గార్లపాటి శ్రీనివాసులు, జలేందర్రెడ్డి, ఎంపీఓ రఘురామకృష్ణ, తహసీల్దార్ మోహ్సిన్ముజ్తబ పాల్గొన్నారు. -
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
జనగామ రూరల్: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే బీజేపీ లక్ష్యమని శాసన మండలి సభ్యుడు చిన్నమలై అంజిరెడ్డి అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వ అభివృద్ధి ఫలాలను ప్రజల్లో ప్రచారం చేయాల ని కార్యకర్తలు, నాయకులను కోరారు. తెలంగా ణలో రహదారుల నిర్మాణానికి రూ.100 కోట్లు కేంద్రం వెచ్చించిందని, 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సర్కా రు కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నందరెడ్డి, ఆరుట్ల దశమంత్ రెడ్డి, కేవీఎల్ఎన్. రెడ్డి, లేగ రామ్మోహన్రెడ్డి, ఉడుగుల రమేశ్, శోభనబోయిన శివరాజ్ పాల్గొన్నారు. శాసన మండలి సభ్యుడు చిన్నమలై అంజిరెడ్డి -
‘భూ భారతి’తో సత్వర పరిష్కారం
● కలెక్టర్ రిజ్వాన్ బాషా రఘునాథపల్లి: ప్రభుత్వం అమలు చేస్తున్న ‘భూ భారతి’ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరష్కా రం లభిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం ఇబ్రహీంపూర్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించిన అనంత రం ఆయన హెల్ప్ డెస్క్ను సందర్శించారు. రైతులు ఏ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారని కలెక్టర్ అడగ్గా వారసత్వం, సాదాబైనామాపై ఎక్కువ వచ్చినట్లు తహసీల్దార్ మోహ్సిన్ముజ్తబ వివరించా రు. రైతులు భూభారతి సదస్సులను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ నరేష్, పంచాయతీ కార్యదర్శి నర్సింహ, ఎంఎస్.నరేష్, జూని యర్ అసిస్టెంట్లు ఐలమల్లయ్య, శారద, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణ పనులు ఆకర్షణీయంగా ఉండాలిజనగామ: పట్టణ సుందరీకరణ పనులు అత్యంత ఆకర్షణీయంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. రూ.30 లక్షల నిధులతో చేపట్టిన సుందరీకరణ పనులను బుధవారం అదనపు కలెక్టర్ పింకేష్కుమార్తో కలిసి పరిశీలించిన కలెక్టర్.. హనుమకొండ రోడ్డులో నిర్మిస్తున్న ఆర్చి, విద్యుదీకరణ పను ల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్–హైదరాబాద్ హైవేపై ప్రయాణించే వారికి ముఖ ద్వారం ఆకట్టుకునేలా ఉండాలన్నారు. స్వాగత తోరణంతో పాటు ప్రభు త్వ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ మహిపాల్ సిబ్బంది ఉన్నారు. -
నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యం
లింగాలఘణపురం: ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అందజేయడమే లక్ష్యమని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏరువాక శాస్త్రవేత్త విశ్వతేజ అన్నారు. మంగళవారం మండలంలోని సిరిపురం రైతువేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మూలవిత్తనాలను రైతులకు ఇచ్చి వాటి నుంచి విత్తనోత్పత్తి చేసి ఆ విత్తనాలను గ్రామంలోని రైతులకు అందజేయడం జరుగుతుందని, అందులో భాగంగా మండలానికి 28 వరి విత్తన ప్యాకెట్లు, 14 పెసర కిట్లు పంపిణీ చేశామన్నారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకొని విత్తనాలను ఉత్పత్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ వెంకటేశ్వర్లు, ఏఈఓలు స్పందన, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లిలో.. రఘునాథపల్లి: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు అందజేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో వరి, పెసర విత్తనాలను రైతులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రైతులు పొందిన విత్తనాలు సాగు చేసి తిరిగి గ్రామ రైతులకు విత్తనోత్పత్తి కోసం విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఓ వసంత సుగుణ, ఏఓ శ్రీనివాస్రెడ్డి, యాదగిరి, ఏఈఓ కల్యాణి పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలని ధర్నా
జనగామ రూరల్: లింగాలఘణపురం మండలం పటేల్గూడెం గ్రామ శివారులో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం గుడిసెవాసుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పటేల్గూడెం శివారులో ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారని, వర్షాకాలం సమీపించడంతో గుడిసెలను సరి చేసుకుంటున్న పేదలపై లింగాలఘణపురం తహసీల్దార్, పోలీసులు గుడిసెల వద్దకు వచ్చి ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. రాత్రి సమయంలో కూడా గుడిసెవాసుల వద్దకు వెళ్లి భయబ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికై న కలెక్టర్ స్పందించిన తహసీల్దార్, సీఐ, ఎస్సైపై చర్య తీసుకొని, గుడిసెవాసులపై వేధింపులు ఆపాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ మన్సూర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేశ్, సుంచు విజేందర్, జోగు ప్రకాష్, ఉపేందర్, కర్ణాకర్, శంకరయ్య, దేవదానం, నాయకులు పాల్గొన్నారు. -
పోలీసింగ్పై దృష్టి పెట్టాలి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ అధికారి పోలీసింగ్పై దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం కమిషనరేట్లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్తి నేరాలను తగ్గించాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సూచనలిచ్చారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన కమ్యునిటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. వాహనాల చోరీలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని ముగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పండుగ రోజు దర్గాల వద్ద బందోబస్తు పట్టిషం చేయాలని, వరంగల్కు ఉన్న కీర్తి ప్రతిష్టతలు తగ్గకుండా పోలీసింగ్ ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెసిక్ పోలీసింగ్ ఉండాలని సీపీ ఆదేశించారు. డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్సింగ్ కమిషనరేట్లో నెలవారీ నేర సమీక్ష -
జీపీఓలు
75మంది జనగామ: ఇటీవల జీపీఓలుగా నియమించేందుకు నిర్వహించిన పరీక్షకు జిల్లాలో 116 మంది వీఆర్ఏ, వీఆర్ఓలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా 75 మంది జీపీఓలుగా అర్హత సాధించారు. బీఆర్ఎస్ హయాంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను మంగళం పాడి.. రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ధరణి పోర్టల్ను తీసుకువచ్చి.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు. వీఆర్ఏ, వీఆర్ఓల అర్హత ఆధారంగా ఆయా శాఖలో విలీనం చేయగా... రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పెద్ద లోటు ఏర్పడింది. తహసీల్దార్, ఆర్డీఓ పరిధిలో ఉన్న పలు ఆప్షన్లను తొలగించడంతో రైతులు కొంత మేర ఇబ్బందులు పడ్డారు. ధరణి పోర్టల్పై వచ్చిన నిరసన నేపధ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకు వస్తామని అనేక సభల్లో నేతలు వాగ్దానాలు చేశారు. గతేడాది జరిగిన సాధారణ ఎలక్షన్లో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... ధరణి పోర్టల్కు స్వస్తి పలికి భూ భారతికి శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న నిబంధనలను తిరిగి అమలులోకి తీసుకు రావడంతో పాటు వీఆర్ఓ, వీఆర్ఏల స్థానంలో గ్రామ పరిపాలన అధికారుల (జీపీఓ) వ్యవస్థను తీసుకువచ్చారు. 75 మంది క్వాలీఫై జిల్లాలో 12 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు ఉండగా, 176 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. గతంలో వీఆర్ఓ, వీఆర్ఏలుగా పని చేస్తూ ఇతర శాఖల్లో పని చేస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మాతృశాఖకు వచ్చేందుకు అవకాశం కల్పించింది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ స్థానంలో కొత్తగా జీపీఓగా నామకరణం చేసింది. నేరుగా జీపీఓగా బాధ్యతలను స్వీకరించేందుకు, ఇంటర్, డిగ్రీ అర్హత నిబంధన విధించారు. అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను కోరారు. జిల్లాలో 116 మంది వీఆర్ఏ, వీఆర్ఓలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో 97 మంది అర్హత సాధించారు. ఇందులో 86 మంది రాత పరీక్షకు హాజరు కాగా, 11 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలో 75 మంది జీపీఓలుగా అర్హత సాధించారు. ఇందులో ఒక్కరు నాట్ విల్లింగ్ ఇవ్వగా, ముగ్గురు ఇతర జిల్లాలకు ఆప్షన్ ఇచ్చారు. మిగిలిన 71 మందికి జనగామ సొంత జిల్లాలో పని చేసే అవకాశం వచ్చింది. ఆప్షన్ ప్రక్రియ ముగిసిపోగా...జీపీఓలను జిల్లాల వారీగా అలాట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక్కో జీపీఓకు రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలను అప్పగించనున్నారు. జీపీఓల విధులివే..● రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించడం. ● భూమిశిస్తు, సెస్సులు, పన్నులు, ఇతర బకాయిలను వసూలు చేయాలి. ● సర్వే రాళ్లు తనిఖీ. ● జన్మస్థల ధ్రువపత్రములు, సాల్వెన్సీ, నివాస, సర్టిఫికెట్లు, జారీ ● పహాణి, అడంగల్ తదితర పనులు. ● అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు ఇతర విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం అందించడం. ● ప్రభుత్వ భూములు, చెరువులు, చెట్లు, ఇతర ఆస్తుల పరిరక్షణ. ● పురాతన కట్టడాల కూల్చివేత, శిలాశాసనాలు, స్మారక చిహ్నాలు లభ్యమైన సమయంలో తహసీల్దార్లకు సమాచారం అందించాలి. ● ఓటర్ల జాబితాల తయారీ, అప్డేట్, సవరణ సమయంలో సహకారం. ● హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలి. ● ఇందిరమ్మ, ఇందిరప్రభ, ఇందిర క్రాంతి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సహకరించాలి. ● మలేరియా, మెదడువాపు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తక్షణం తెలియజేయాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యభూమిక పోషిస్తాం.. మాతృ సంస్థ రెవెన్యూ వ్యవస్థలో తిరిగి పని చేసే అవకాశం కల్పించిన సీఎం రేవంత్రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం. – పెండెల శ్రీనివాస్, జీపీఓ● 116 మంది పరీక్షకు హాజరు, 75 మంది క్వాలీఫై జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాలు ఒక్కో జీపీఓకు రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలు సీఎం చేతుల మీదుగా త్వరలో ఆర్డర్ కాపీలు! -
‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టంతో ప్రజల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని, రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూసదస్సు నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయని, జూన్ 20వ తేదీ వరకు రెండో విడత రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. భూ రికార్డులో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్–బిలో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అంతకుముందు ఆర్డీఓ గోపిరామ్ దరఖాస్తు ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సెన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి లింగాలఘణపురం: రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకున్న రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. మంగళవారం లింగాలఘణపురం మండలం నాగారం గ్రామాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి‘బక్రీద్’ను ప్రశాంతంగా జరుపుకోవాలి జనగామ రూరల్: బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు కలెక్టర్ రోహిత్సింగ్లతో కలిసి ముస్లింలు, హిందువులతో కలిసి శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గోవధ నిషేధమని, గోమాతను పరిరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ అధికారి రాధాకిషన్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. అర్హులకు మంజూరు పత్రాలు అందించి 9వ తేదీలోపు ముగ్గుపోసిన ఫొటోలను యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. అలాగే రేషన్ సన్నబియ్యం పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. -
‘బెస్ట్ ప్రాక్టీస్’ రాష్ట్ర సదస్సుకు ఎంపిక
మెమోరీ గేమ్స్లో.. గణితంతో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధన. పిల్లవాడి మెమోరీ పవర్ను అర్థం చేసుకుని, అందుకు తగ్గట్టుగా లెక్కల పాఠాలు బోధించడంలో పాటించిన పద్ధతులను రాష్ట్ర స్థాయి సదస్సుకు ఎంపికయ్యేలా చేసింది. – కె.శిరీషరాణి, టీజీటీ మ్యాథ్స్, మోడల్ స్కూల్, కొడకండ్ల జనగామ: సర్కారు బడుల్లో విద్యాబోధనలో మరి న్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించింది. విద్యార్థుల బంగారు భవిష్య త్, బడుల అభివృద్ధికి శ్రమిస్తున్న ఉపాధ్యాయులపై ఫోకస్ సారించారు. ఉత్తమ విధానాలను ఎంపిక చే సుకుని పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన అంది స్తున్న జిల్లాలోని ఐదుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయి (బెస్ట్ ప్రాక్టీస్) సదస్సుకు ఎంపిక చేసింది. నేటి నుంచి సదస్సు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నేటి (బుధవారం) నుంచి విద్యాస్థాయి ప రిశోధన శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు ప్రారంభం కానుంది. నూతన అభ్యసన ప్రక్రియకు సంబంధించి ఉత్తమ ప్రదర్శనలకు ఎంపికై న వాటిని రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఉ న్నతాధికారుల సమక్షంలో ప్రదర్శించనున్నారు. వినూత్న పద్ధతులువిద్యార్థుల్లో కొత్తదనం నింపడం, వినూత్న పద్ధతుల ద్వారా బోధన. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ స్కూల్లో బ్యాంకు నిర్వహణ తదితర అంశాలు రాష్ట్ర స్థాయి సదస్సుకు ఎంపికయ్యేలా చేశాయి. – డి.వెంకటేశ్వర్లు, స్కూల్ అసిస్టెంట్, సోషల్, జెడ్పీఎస్ఎస్, చిల్పూర్ చదువుపై ఆసక్తి కల్పించడం..వినూత్న పద్ధతులను అవలంభిస్తూ బోధించడం. క్వాలిటీ బోధన అందించే క్రమంలో విద్యార్థులకు చక్కటి మెళకువలను నేర్పించడం. చదువుపై ఆసక్తి కలిగించడం. – ఎం.పద్మారాణి, పెద్దమడూరు,పీఎస్, దేవరుప్పుల జిల్లా నుంచి హాజరుకానున్న ఐదుగురు ఉపాధ్యాయులు -
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
జనగామ రూరల్: నెట్వర్క్, టీవీ కేబుల్స్ ద్వారా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఈ వేణుమాధవ్ అన్నారు. మంగళవారం జనగామ డివిజన్ పరిధిలోని ఏడు మండలాలు బచ్చన్నపేట, లింగాలఘణపురం, రఘునాథపల్లి, నర్మెట, తరిగొప్పుల, దేవరుప్పుల, జనగామ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేబుల్ టీవీ ఆపరేటర్స్, ఇంటర్నెట్ నెట్వర్క్ ఆపరేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెగిపోయిన కేబుల్ తీసేసి కొత్త కేబుల్ వేయాలని, గాలిలో వేలాడకుండా చూడాలన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను సరిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ ఆపరేషన్ లక్ష్మీ నారాయణ రెడ్డి, డీఈ టెక్నికల్ గణేష్, జయరాజు , ఏడీలు, ఏఏఓ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించాలి
చిల్పూరు: పశువుల ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించాలని జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణాజీగూడెం గ్రామంలో మంగళవారం గొర్రెలమేకల పెంపకం దారుల సంఘం జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షుడు మోటె దేవేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రవీందర్ హాజరై మాట్లాడుతూ పాడి పరిశ్రమతోనే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందంటూ ఒకపక్క నాయకులు అంటూనే మరోపక్క వాటి సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు. రెండేళ్లుగా గొర్రెలుమేకలు, పాడి పశువులకు ప్రభుత్వం నుంచి కనీసం నట్టల మందులను ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఒక్క అటెండర్ పోస్టును భర్తీ చేయలేదని, కనీసం నేటికి పశుసంవర్ధక శాఖ మంత్రిని నియమించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించాలని, అన్ని రకాల మందులను పాడి రైతులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాదం రమేష్, బాలరాజు, రమేష్, రాజబీరయ్య, మేకల మల్లేష్, చంద్రయ్య, బోళ్ల రాజ్కుమార్, ఆవుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ జనగామ రూరల్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయని డీఈఓ డి.భోజన్న మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మకంచలో జరిగిన తెలుగు పరీక్షలో 51 మంది విద్యార్థులకు గాను 48 మంది హాజరు కాగా 3 గైర్హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాన్ని డీఈఓ, ఏసీజీఈ రవికుమార్లు సందర్శించారు. సందీప్కు రాష్ట్ర ప్రతిభా పురస్కారం పాలకుర్తి టౌన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఈగ సందీప్ రాష్ట్ర ప్రతిభా పురస్కారం అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర హాస్టల్లో ఉంటూ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో చదివి పదో తరగతిలో 557 మార్కులు సాధించారు. దీంతో విద్యార్థికి ప్రోత్సాహకంగా మెమెంటోను అందించారు. జిల్లా నుంచి బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థి పురస్కారం అందుకోవడంతో జిల్లా బీసీ సంక్షేమ అధికారి రవీందర్గౌడ్ విద్యార్థి సందీప్ను అభినందించారు. స్టేషన్ఘన్పూర్లో 18 వార్డుల కేటాయింపుస్టేషన్ఘన్పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీకి అధికారికంగా 18 వార్డులను కేటాయించినట్లు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ టీకే శ్రీదేవి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వార్డుల వారీగా పబ్లిక్ నోటిఫికేషన్ను మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని, ఏమైనా అభ్యంతరాలుంటే కార్యాలయంలో సంప్రదించాలన్నారు. నేటి నుంచి పరిశోధన పద్ధతులపై తరగతులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు పరిశోధనా పద్ధతులపై అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్, బీఓఎస్ డాక్టర్ కిష్టయ్యతో కలిసి ఆవిష్కరించారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యులతో ఈఅవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోషల్ సైన్సెస్ పరి శోధకులు కూడా ఈపరిశోధనా పద్ధతుల అవగాహన తరగతుల్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 4న ఈతరగతులను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సోషల్ సైన్స్ ఆచార్య టి.మనోహర్ ప్రారంభిస్తారని సంకినేని వెంకటయ్య తెలిపారు. అధ్యాపకులు సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు. -
డివిజన్ సరే.. సిబ్బంది నియామకమేది..?
హన్మకొండ: డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిబ్బంది నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రారంభం.. సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తులు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సేవలు అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత నెల 31న సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డివిజన్ పరిధిలోని ప్రస్తుత సెక్షన్లను విభజించి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశారు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈ పోస్టుగా మళ్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన ఇతర ఇంజనీర్లు, సిబ్బంది నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో డివిజన్ ఎప్పుడు ఏర్పాటవుతుంది..? ఎప్పటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.టీజీ ఎన్పీడీసీఎల్ ములుగు డివిజన్ పరిధిలో ములుగు టౌన్, మల్లంపల్లి, వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి సెక్షన్లు, ఏటూరునాగారం సబ్ డివిజన్లోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం సెక్షన్లు, ఎన్.వి.పురం సబ్ డివిజన్లోని వెంకటాపురం(కె), వాజేడు సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటూరునాగారం, వెంకటాపురం(కె), సబ్ డివి జన్లలోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం. వెంకటాపురం(కె), వాజేడు సెక్షన్లను కలిపి ఏటూరునాగారం డివిజన్గా ఏర్పాటు చేశారు. డీఈ పోస్టు ఒకటే మంజూరు.. డివిజన్ పాలనా వ్యవహారాలు సాగించేందుకు డివిజనల్ ఇంజనీర్, ఏఈ కమర్షియల్, ఏఈ టెక్నికల్, ఇద్దరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. కాగా ఇందులో ఒక డీఈ పోస్టును మాత్రమే మంజూరు చేశారు. ఇతర పోస్టుల గురించి ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈగా మళ్లించినప్పటికీ నియామకం చేపట్టలేదు. ఇతర పోస్టుల మంజూరు, అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత లేకపోవడంతో డివిజన్ పరిపాలన కార్యక్రమాల ప్రారంభంపై స్పష్టత లేకుండా పోయింది. పని భారం పెరుగుతుందని ఆందోళన.. అదనపు పోస్టులు మంజూరు చేయకుండా.. అదనపు సిబ్బందిని నియమించకుండా ప్రస్తుత డివిజన్లోని ఉద్యోగులను విభజిస్తే వారిపై పని భారం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు, సిబ్బందిని నియమించకుండా నూతన డివిజన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలు, సర్కిళ్ల పునర్విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ వాచ్మెన్. స్వీపర్ పోస్టుల బైఫరికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. బైఫరికేషన్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు లేదు. ఇప్పటికై నా యాజమాన్యం వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సంఘాల బాధ్యులు కోరుతున్నారు. ఏటూరునాగారం కేంద్రంగా విద్యుత్ డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత కరువు ములుగు డివిజన్లోని సెక్షన్ల బదలాయింపు -
తెలంగాణ తల్లి విగ్రహంపై రాద్ధాంతం అర్థరహితం
● కన్నతల్లిని తలపించేలా విగ్రహ రూపకల్పన ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాలకుర్తిటౌన్: మన కన్న తల్లులను తలపించేలా .. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన సోమవారం ఆవిష్కరించారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డిలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగించారు. దొరల గడీల ఆనవాళ్లు, రాచరికపు పోకడలు పాత విగ్రహంలో కనిపించాయని, వాటికి చోటు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజల ముందుకు తెచ్చామన్నారు. దానిపై బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. సచివాలయం తర్వాత రాష్ట్రంలోనే రెండో తెలంగాణ తల్లి విగ్రహం పాలకుర్తిలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా.. పట్టణంలోని దళితకాలనీకి చెందిన గాదెపాక దోతి ఎల్లయ్య ఇంట్లో మంత్రి శ్రీనివాస్రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జ్ ఝాన్సీరెడ్డి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్లు భోజనం చేశారు. అనంతరం ఎల్లయ్య, వెంకటమ్మ దంపతులకు మంత్రి నూతన వస్త్రాలు బహూకరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, హామ్యానాయక్, ఏఎంసీ చైర్పర్సన్లు మంజుల, ఆండాలు, నాయకులు రాఘవరావు, కుమారస్వామి, శ్రీరాములు, శ్రీనివాస్, యాకాంతరావు, మదార్, హరీష్, నాగన్న పాల్గొన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో పని చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్గౌడ్ తెలిపారు. వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక అంశాలపై మున్సిపాలిటీ పరిధిలోని ఘన్పూర్లో సోమవారం ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యాలయంలో కమిషనర్ విలేకర్లతో మాట్లాడుతూ.. వివరాలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, ఇంటిపన్నుల వసూళ్లు తదితర అంశాలపై వంద రోజుల ప్రత్యేక యాక్షన్ప్లాన్ తయారు చేశామన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, వార్డుల వారీగా డ్రెయినేజీలను శుభ్రం చేయడం, డ్రెయినేజీలు లేనిచోట్ల నిర్మాణాలు చేపట్టడం, పిచ్చిమొక్కలు తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు నల్లాల ద్వారా సక్రమంగా నీరు అందించేలా ప్రత్యేక చొరవతో పనిచేస్తామన్నారు. పైప్లైన్ల మరమ్మతులు, లీకేజీలను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. వీధిదీపాల సక్రమ నిర్వహణతోపాటు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు. ప్రజల నుంచి వంద శాతం ఇంటిపన్నులు వసూలు చేస్తామని, భువన్యాప్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని ఇళ్లు, స్థలాలను జియో ట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, క్లీన్ అండ్ గ్రీన్పై దృష్టి సారిస్తామని తెలిపారు. కమిషనర్ రవీందర్గౌడ్ -
జిల్లా కోర్టులో అవతరణ వేడుకలు
జనగామ రూరల్: జిల్లా కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి సుచరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెండో తరగతి మెజిస్ట్రేట్ వెంకట్రాంనర్సయ్య, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం సీజ్ బచ్చన్నపేట : మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి విద్యాకర్ రెడ్డి, ఎంఆర్ఐ వంశీకృష్ణ సోమవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగ్రోస్ యజమాని కామిడి శ్రీనివాస్రెడ్డి రైతులకు సబ్సిడీపై అందించే జీలుగ విత్తనాలను అడ్డదారిన ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించాడని తెలిపారు. జీలుగ విత్తనాలను తొర్రూరు వద్ద అక్కడి టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఆగ్రోస్ కేంద్రంలోని జీలుగ విత్తనాలను పీఏసీఎస్ గోదాములకు తరలించి ఆగ్రోస్ సేవా కేంద్రం, గోదామును సీజ్ చేశామన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ప్రిన్సిపాల్గా మనోహర్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ కాలే జీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న హిస్టరీ విభా గం ప్రొఫెసర్ టి.మనోహర్కు వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది లా ఉండగా.. హనుమకొండలోని యూనివర్సి టీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న ఆచార్య ఎస్.జ్యోతికి ఆ కాలేజీ సమీ పాన ఉన్న వర్సిటీ మహిళా పీజీ కాలేజీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రాంగణ నియామకాలు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రంట్ అండ్ డెవలపర్లుగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అందులో డి.సత్యారెడ్డి, ఎం.సాయిపవన్, ఎస్.అరవింద్, టి.పుష్కరాణి, ఎం.మనస్విని, ఎ.వర్షిత ఎంపికై పట్లు కొత్తగూడెం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్రాజు కేయూలో తెలిపారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.6లక్షలు ఉంటుందని, తొలుత మూడునెలలపాటు శిక్షణ కూడా ఇస్తారని, అనంతరం హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సింటుందన్నారు. ఆయా విద్యార్థులకు నియమాక పత్రాలను సోమవారం యూనివర్సిటీలో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, ఆ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.రాము, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు పాల్గొన్నారు. నియామకం కేయూ క్యాంపస్ : హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ నర్సింహాచారి నియమితులయ్యారు. వీసీ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పి.వరలక్ష్మి నుంచి నర్సింహాచారి బాధ్యతలను స్వీకరించనున్నారు. -
సంక్షేమం.. అభివృద్ధి
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025‘ఇందిరమ్మ’ ప్రొసీడింగ్స్ పంపిణీలో గందరగోళం – IIలోuజనగామ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం.. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, రైతులు, పేదలకు భరోసా కల్పిస్తున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండేరి చేతన్ నితిన్తో కలిసి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా.. విప్కు స్వాగతం పలికారు. విప్ అయిలయ్య అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాత, జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర వీరుల త్యాగఫలితమే ప్రత్యేక రాష్ట్రమన్నారు. సంక్షేమ పథకాల జాతర పేద కుటుంబాల్లో విద్యా వెలుగుల నింపాలనే సంకల్పంతో సీఎం రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్లో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. బాలిక విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలోని 12 కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఇంటర్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో రూ.9.25 కోట్లతో 320 పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 కోట్ల 4లక్షల92వేల85వేల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ ఉచిత ప్రయాణం చేశారని, దీని ద్వారా సంస్థకు రూ.97.80 కోట్ల మేర ఆదాయం సమకూరిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 76,403 మంది మహిళా కుటుంబాలకు రూ.500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్ సరఫరాతో 91,669 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇప్పటి వరకు 1,42,763 జీరో బిల్లులు జారీ చేశామన్నారు. పంట రుణమాఫీ ద్వారా 59,718 రైతులకు రూ.523 కోట్ల 89 లక్షల మేర రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరీ కోసం మండలాల పరిధిలో 12 పైలట్ గ్రామాలను ఎంపిక చేసి 71 6, ఫేస్–2లో 5,308 గృహాలు మంజూరైనట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు డబ్బులు చెల్లించడంలో జనగామ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించాలనే ఉద్దేశంతో తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేను చేపట్టిన ఘనత తమకే దక్కుతుందన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ద్వారా 2,355 మంది రైతులకు రూ.3.87కోట్ల రాయితీ అందించినట్లు చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు పథకంలో రూ.2,743 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 2,94,000 ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఉండగా, ప్రస్తుతం లక్ష 50వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జిల్లా మెడికల్ కళాశాల సొంతభవన పనులు 60 శాతం పూర్తయ్యాయని అన్నారు. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసే క్రమంలోనే ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన 58 మంది నర్సింగ్ ఆఫీసర్లు, 18 మంది వైద్యుల నియామకం చేపట్టిందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ స్కీంలో 40 మంది నిరుద్యోగులకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, నర్సింగ్ ఆఫీసర్ల నియామకం జరిగిందన్నారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ట్రాన్సెండర్లకు ప్రత్యేకంగా ట్రా్న్స్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. మహిళాభివృద్ధికి పెద్దపీట మహిళల ఆర్థిక బలోపేతానికి జిల్లాలో ఇప్పటి వరకు 1,28,583 గ్రామీణ మహిళలతో 11,249 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో నంబర్ వన్గా నిలిచామన్నారు. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9,278 సంఘాలకు రూ.476 కోట్లు లక్ష్యం నిర్ధేశించగా, 5,277 సంఘాలకు రూ.485 కోట్ల మేర బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వగా, 8,997 స్వయం సహాయక సంఘాలకు రూ.25.43కోట్ల వడ్డీని తిరిగి చెల్లించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జనగామ ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, ఆర్డీఓ గోపీరామ్, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. న్యూస్రీల్ రైతులు.. పేద కుటుంబాలకు ప్రభుత్వ భరోసా తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాలకు ప్రాధాన్యం మహిళాశక్తి క్యాంటీన్లతో ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జిల్లాలో అంబరాన్నంటిన ఆవిర్భావ సంబురాలుభూ భారతితో రైతులకు అండ భూ సంబంధిత సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టాగలనే సంకల్పంతో భూ భారతిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో స్టేషన్ఘన్పూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికి చేసి ఊరూరా రెవెన్యూ సదస్సులను నిర్వహించగా, 1902 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. నేటి నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. – మరిన్ని ఫొటోలు II, IIIలో u -
ఆగ్రోస్ సేవా కేంద్రం తనిఖీ
బచ్చన్నపేట: మండలంలోని ఆగ్రోస్ సేవా కేంద్రంలో తహసీల్దార్ ఫణికిశోర్, మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, పెద్ద వంగర ఎస్సై సురేశ్, టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 27 బస్తాల జీలుగ విత్తనాలు తేడారావడంతో ఆగ్రోస్ యజమాని కామిడి శ్రీనివాస్రెడ్డి నుంచి ల్యాప్టాప్, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, రికార్డు బుక్స్ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం ద్వారా అక్రమంగా తరలిస్తున్న జీలుగ విత్తనాలను తొర్రూరు వద్ద అక్కడి పోలీసులు పట్టుకున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు జీలుగ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాగా షాపు యజమానుల లైసెన్స్ రద్దు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
బరిగీసి కొట్లాడిన జనగామ
జనగామ: రజాకార్ల అరాచకాలు..గడీల పాలనపై తిరుగుబాటు చేసి... దున్నేవాడికే భూమి అంటూ ఎదురొడ్డి పోరాడిన జనగామ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమంలో బరిగీసి కొట్లాడింది. పోలీసుల లాఠీలు, నిర్భందా లను సైతం లెక్క చేయకుండా సకల జనులు రోడ్లపైకి వచ్చి ఢిల్లీ కోటలు బద్దలయ్యేలా నినదించారు. తల్లి తెలంగాణ కోసం పండు ముసలి నుంచి పడచు యువకుడి వరకు పోరుబాటలో నేను సైతం అంటూ ముందుకు కదిలారు. రాస్తారోకోలు, ధర్నాలతో ఆనాటి ఉమ్మడి పాలకులు గడగడలాడించారు. జైలుకై నా వెళ్తాం.. ప్రాణాలైనా ఇస్తాం అంటూ పో లీసుల తూటాలకు ఎదురొడ్డి జనగామ గడ్డ పౌరుషాన్ని చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చరిత్రలో మరచిపోలేని ఘటనలు ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన మలిదశ ఉద్యమ చరి త్రలో మరచిపోలేని ఎన్నో ఘటనలు నేటికి గుర్తుకు చేస్తూనే ఉంటాయి. బచ్చన్నపేట మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన పొన్నం అశోక్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉరితాడును ముద్దాడాడు. దీంతో ఉద్యమకారులు రగిలి పోయారు. అశోక్ నుంచి మొదలుకుని అనేక గ్రామాల్లో ఆత్మహత్యలు, ప్రయత్నాలు జరుగుతూనే వచ్చా యి. ఈ ఘటనలో ఎందరో యువకులు బలిదానాలయ్యారు. అప్పటి వరకు ర్యాలీలు, ధర్నాలతో, రిలే దీక్షలతో అట్టుడికి పోతున్న ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాహనాలను దహనం చేయడంతో పాటు ధ్వంసం చేశారు. రోజుల తరబడి రోడ్లను బ్లాక్ చేసి పాలకులకు అల్టి మేటం జారీ చేశారు. 2001లో మొదలైన 144 సెక్షన్ తెలంగాణ ఆవిర్భావం 2014 వరకు కొనసాగింది. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి ఇలా ప్రతీ మండలంలో ఏళ్ల తరబడి రిలే దీక్షలు కొనసాగాయి. బరిగీసి కొట్లాడిన విద్యాలోకం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం 2009 చివరి అంకంలో తారా స్థాయికి చేరుకుంది. విద్యార్థులు, యువ త ఒక్కసారిగా గర్జించారు. వేలాది ర్యాలీలు చేస్తూ గంటల తరబడి రోడ్లపై బైఠాయించారు. రేపటి భవిష్యత్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలా ప్రతిఒక్కరిని అడ్డుకుని ముందుకు కదలనివ్వలేదు. వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ, దాడులకు సైతం వెనకాడలేదు. ఆంధ్ర పేరుతో ఉన్న కార్యాలయాల బోర్డులను మార్చేశారు. సర్కారు బోర్డులపై తెలంగాణ పేరుతో ముందే స్వరాష్ట్రాన్ని ప్రకటించుకున్నారు. దేశం మొత్తం వినిపించేలా.. తెలంగాణ ఉద్యమాన్ని దేశం మొత్తం వినిపించేలా కొత్త తరహా నిరసనలకు శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా పరిధిలోని రైల్వే ట్రాక్పై బైఠాయింపు, గొర్లమందలు, గేదెలను వదిలి రాకపోకలకు ఇబ్బందులు కలిగించడంతో ఒక్కసారిగా దేశం ఇటువైపు చూసింది. ఉద్యమకారులపై సైతం రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసినా వెనక్కి తగ్గలేదు. దీనికి తోడు కేసీఆర్, హరీష్రావు, కోదండరామ్ ఇలా ఉద్యమ నేతల సభలు ప్రజల్లో చైతన్యం కలిగించా యి. సకల జనులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, బోనాలు, బతుకమ్మ ఆటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ నిరసన తెలిపారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ‘జనగామ’ స్ఫూర్తి ప్రస్తుత 32 జిల్లాలను కదిలించిందని ఆనాటి మేధావులు అనేక ప్రసంగాల్లో చెబుతూ వచ్చారు. చరిత్రలో మరచిపోలేని ఘటనలు దశాబ్దంన్నర పాటు 144 సెక్షన్ తొలి, మలిదశ ఉద్యమంలో ముఖ్యపాత్ర కోర్టుచుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులుకోర్టు చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు తెలంగాణ కోసం 14 ఏళ్ల పోరాటం...స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరి 12 ఏళ్లు గడిచి పోతున్నా ఆనాటి ఉద్యమకారుల్లో పలువురు నేటికి కో ర్టు చుట్టూ తిరుగుతున్నారు. నాలుగున్నర కో ట్ల ప్రజల కోసం పోరాడి, తమ భవిష్యత్ను ఫణంగా పెట్టిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. స్వరాష్ట్ర పాలకులు, అధికారులు కరుణించి అప్పటి కేసుల నుంచి విముక్తి కలిగించాలని బచ్చన్నపేట మండలం కట్కూర్కు చెందిన మూసిన బాబుగౌడ్ కోరుతున్నారు. -
అవతరణ వేడుకలకు సర్వం సిద్ధం
జనగామ: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో సర్వం సిద్ధం చేశారు. ఆదివారం డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్నితిన్తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు చెందిన పలు శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.45 గంటలకు వేడుకల ప్రాంగణానికి చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివా ళులర్పిస్తారు. 10 నుంచి 10.10 గంటల లోపు జాతీ య జెండాను ఆవిష్కరించిన తర్వాత, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.10 నుంచి 10.30 గంటల వరకు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బీర్ల అయిలయ్య ప్రసంగించనున్నారు. అనంతరం పలు సాంసృతిక కార్యక్రమాలు, బహుమతులు అందజేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఉత్తర్వుల కాపీలు.. జూన్ 2 పురస్కరించుకుని నేడు (సోమవారం) ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వుల కాపీలను అతిథుల చేతులు మీదుగా అందిస్తారని కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలి పారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించి సాయిరాం ఫంక్షన్ హాల్, స్టేషన్ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని పాలకుర్తి రోడ్డు సిరిపురం గార్డెన్, పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలోని దశరథ గార్డెన్లో అతిథుల చేతులమీదుగా ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వు కాపీలను అందిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ -
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025
జనగామ: రేషన్ సన్నబియ్యం పంపిణీలో కొత్త చికొచ్చి పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిరుపేదలకు అందించే సన్నబియ్యం పంపిణీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ఈనెల నుంచి ఒకేసారి మూడు నెలల కోటాను అందిస్తున్నారు. గతంలో ఒక్క వేలి ముద్రతో ఐదు నిమిషాల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ ముగిసేది. మూడు నెలల బియ్యం ఇచ్చే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వేర్వేరుగా వేలి ముద్ర తీసుకుని కాంటా వేయడంతో తీవ్ర జాప్యానికి కారణమైంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ పూర్తి చేసేసరికి అరగంటకు పైగా సమయం పడుతుంది. ఈ సమస్యతో జిల్లాలో మొదటి రోజు ఎక్కడా 10 శాతం బియ్యం పంపిణీ కాలేదు. సమస్య ఎక్కడంటే.. రేషన్ లబ్ధిదారులకు జూన్ మాసం నుంచి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి ఇస్తున్నారు. కేంద్రం 5 కిలోలు, రాష్ట్రంలో కిలో చొప్పున ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల బియ్యం అందిస్తోంది. మూడు నెలల కోటాకు సంబంధించి రేషన్ డీలర్లు లబ్ధిదారుడి నుంచి నెలవారి చొప్పున కేంద్రం, రాష్ట్రం అందించే బియ్యానికి సంబంధించి వేర్వేరుగా వేలిముద్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆరు సార్లు తీసుకోవాలి. ఇదే సమయంలో ఈ–పాస్ మిషన్లో సాంకేతిక లోపం, పదిహేను నిమిషా లకు ఒకసారి లాగ్అవుట్ కావడంతో డీలర్లకు బి య్యం పంపిణీ కత్తిమీద సాములా మారిపోయింది. లింగాలఘణపురం మండలంలోని ఓ రేషన్ షాపు లో ఆదివారం ఉదయం 7 గంటలకు బియ్యం పంపిణీ ప్రారంభించగా...మధ్యాహ్నం 3 గంటల వర కు 20 మందికి పంపిణీ చేయలేకపోయారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించి ఓపిక లేక వెళ్లిపోతే, డీలర్లు సైతం దుకాణాలను మూసి వేశారు. చిల్పూరు మండల పరిధిలో 9 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్లో సాంకేతిక లోపంతో పంపిణీ నేటికి (సోమవారం) వాయిదా వేశా రు. ఈ పాస్లో 3.2 వెర్షన్ ఎలక్ట్రానిక్ కాంటాకు బ్లూటూత్ కనెక్షన్తో సమస్య తీవ్రమవుతోంది. ఈ వెర్షన్తో పాటు కాంటాకు బ్లూటూత్ అనుసంధానాన్ని తొలగించాలని మెజార్టీ డీలర్లు కోరుతున్నారు. రేషన్ షాపులకు చేరుకున్న సరుకు జిల్లాలో 335 రేషన్ దుకాణాలు ఉండగా, మూడు నెలల సన్నబియ్యం కోటా 90,140 క్వింటాళ్లు కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 175 షాపులకు 24,336 క్వింటాళ్ల సన్నబియ్యం పంపించగా, ఇంకా 165 దుకాణాలకు 65,810 క్వింటాళ్ల సరుకు పోవాల్సి ఉంది. ఆరుసార్లు వేలిముద్ర వేశా.. రేషన్ బియ్యం తీసుకెళ్తామని తండా నుంచి మండల కేంద్రానికి వస్తే బియ్యం తీసుకునేందుకు రెండు గంటల సమయం పట్టింది. నెలకు 30 కిలోల చొప్పున 3 నెలలకు సంబంధించి 90 కిలోల బియ్యం తీసుకునేందుకు ఆరుసార్లు వేలిముద్ర వేశా. – గుగులోత్ స్వామి, గుమ్ముల బండ తండా, కొడకండ్లఇబ్బందిగా ఉంది.. ప్రభుత్వం చేపట్టిన రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ రేషన్ డీలర్లకు తలనొప్పిగా మారింది. నూతన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సమస్యగా ఉంది. మూడు నెలల బియ్యానికి కేంద్ర ప్రభుత్వానికి మూడుసార్లు, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మాదిరిగా ఇలాంటి పద్ధతులను డీలర్లకు చెప్పడం బాధాకరం. – గట్టు మొగిళిగౌడ్, డీలర్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్అరగంట సమయం పడుతుంది.. ఒకేసారి మూడునెలల బియ్యం ఇవ్వడంతో ఒక్కొక్క కార్డు హోల్డ ర్కు అరగంటకు పైగా సమయం పడుతోంది. కేంద్రం అందించే ఐదు కిలోలు, రాష్ట్రం ఇచ్చే ఒక కిలో బియ్యానికి వేర్వేరుగా వేలిముద్ర తీసుకుంటున్నాం. పైగా బియ్యం పంపిణీ చేసే సమయంలో యాప్ మోరాయిస్తుంది. – వల్లాల ప్రసన్న, రేషన్ డీలర్, గోపాల్నగర్, బచ్చన్నపేట●న్యూస్రీల్ -
నిబంధనల మేరకు పంట రుణాలివ్వాలి
స్టేషన్ఘన్పూర్: స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు రైతులకు పంట రుణాలు అందించాలని తెలంగాణ రైతు సంఘం జి ల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డి మాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరి ష్కారానికి తెలంగాణ రైతు సంఘం ఆ ధ్వర్యంలో ఈనెల 5, 6వ తేదీల్లో బ్యాంకుల ఎదుట ధర్నాలు, 11న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని మండలంలోని ఇప్పగూడెంలో ఆదివారం చేపట్టారు. రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన సోమయ్య మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘం బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాసు ప్రభాకర్, ఎల్.సుధాకర్, బక్క సోమయ్య, కుమార్, గట్టయ్య, మంకయ్య, ఉప్పలయ్య, గోపయ్య, గట్టుమల్లు, లక్ష్మయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య ఘర్షణ
జనగామ: జిల్లాలోని పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులు కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాత నమూనా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పాలకుర్తిలో పోలీసులను మోహరించి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెపట్టాయి. దాంతో పోలీసులను భారీగా మోహరించారు. -
పొదుపు.. భవిష్యత్కు మలుపు
కాజీపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను గతంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే అనుకునేవారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వావలంబన్ పథకం’కు గృహిణి నుంచి కూలీ పని చేసుకునే ప్రతి ఒక్కరూ అర్హులు. ఈ పథకంలో చేరడం వల్ల వృద్ధాప్యంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుత రోజూవారీ ఖర్చులను అధిగమించడం కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో సంపాదించే వయసులోనే ఎలాంటి పొదుపు చేకుండా ఉంటే వృద్ధాప్యంలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులను జీవిత చరమాంకంలో కొడుకులు పట్టించుకోకపోవడం ప్రస్తుతం చూస్తున్నాం. ఆసరా కరువై.. పనిచేసే శక్తిలేక.. ఆర్థిక అండ కరువై ఎంతోమంది వృద్ధులు దుర్భరంగా బతుకుతున్నారు. వయసు పెరగడంతో పాటు జీవన వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆర్థికంగా స్వాతంత్య్రం ఉండాలి. అందుకే ‘స్వావలంబన్’ యోజన పథకంలో చేరితే చక్కటి ఫలితంగా ఉంటుంది. వయసులో ఉన్న సమయంలో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు అవకాశం కల్పిస్తుంది. పింఛన్ ఇలా పొందుతారు.. ఖాతాదారుడి వయస్సు 60 ఏళ్ల నిండిన వెంటనే తాము జమచేసిన డబ్బు మొత్తం 60 శాతం నగదును ఒకేమారు చెల్లిస్తారు. మిగతా 40శాతం వారి ఖాతాలో అలాగే ఉంచి, దానిపై వచ్చే రాబడిని జీవితాంతం ప్రతీనెలా పింఛన్ రూపంలో చెల్లిస్తారు. ఖాతాదారుడు మరణిస్తే అప్పటివరకు ఖాతాలో పొదుపు చేసిన మొత్తం నిధిని వారి నామినీకి అందిస్తారు. 60 ఏళ్ల తర్వాత పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఖాతాలో నిల్వ ఉన్న 40శాతం సొమ్మును కూడా వారికే అందజేస్తారు. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మండలస్థాయి కోఆర్డినేటర్లను నియమించినా ఆశించిన ఫలితాలు రావడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకానికి సరైన ప్రచారం చేస్తే మరింత ఉపయోగం ఉంటుంది. టోల్ఫ్రీ నంబర్ 1800–110708కు ఫోన్చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.‘స్వావలంబన్ యోజనతో’ వృద్ధాప్యంలో ఆర్థిక అండ 18 నుంచి 60 ఏళ్ల వారు అర్హులు కేంద్ర ప్రభుత్వ పథకంతో భవిష్యత్కు ఆర్థిక ధీమాస్వావలంబన్తో ప్రయోజనాలు.. వృద్ధాప్యంలో పింఛన్ అందజేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 18 నుంచి 60 ఏళ్ల వయసున్న భారతీయ పౌరులందరూ ఈ ఖాతాను తెరిచేందుకు అర్హులు. ప్రతీ పౌరుడు ఏడాదిలో కనీసం రూ.వెయ్యి నుంచి రూ. 2వేలకు తగ్గకుండా పొదుపు చేయాలి. ప్రభుత్వం ఏటా రూ.600 కలుపుతుంది. ప్రతీ ఖాతాదారుడికి ఫొటోతో పాటు పాన్కార్డు (పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్)ను ఇస్తుంది. ఈ కార్డుతో ఎన్పీఎస్లో సభ్యత్వం ఉన్నట్లు గుర్తించొచ్చు. ఖాతా తెరిచిన 45 రోజుల్లో ఈ కార్డును పొందొచ్చు.నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్ యోజన పథకం’ వృద్ధాప్యంలో ఆర్థికంగా అండగా నిలవనుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి దేశంలోని సామాన్యులు సైతం 60 ఏళ్లు నిండిన తర్వాత పెన్షన్ పొందేందుకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. బడుగు, బలహీన వర్గాల వారితోపాటు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లు, ఇతర ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న,పెద్ద వ్యాపారులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. వయసులో చేసిన పొదుపు.. వృద్ధాప్యంలో అండగా నిలవనుంది. స్వావలంబన్ యోజన విశిష్టత.. ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా దేశంలోని సామాన్యులు కూడా 60 ఏళ్ల తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ పొందేందుకు కేంద్రప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా 2009లో ‘జాతీయ పెన్షన్ స్వావలంబన్ యోజన పథకం’ను ప్రారంభించింది. -
డల్లాస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి జనగామ: అమెరికా డల్లాస్లో నేడు(ఆది వారం) నిర్వహించే సభ చరిత్రలో నిలిచి పోతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని డల్లాస్లో నిర్వహించే సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులకు ఫోన్ ద్వారా సందేశం పంపించారు. కేసీఆర్ ముందు చూపు, ఆలోచన విధానానికి ప్రస్తుత రాజకీయాల్లో ఆయనకు సాటి ఎవరూ లేరన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి నిర్వహించిన కరీంనగర్ శంఖారావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు సృష్టించిందని చెప్పారు. ఇటీవలి ఎల్కతుర్తి సభకు లక్షలాదిగా జనం వచ్చి విజయవంతం చేశారని, ఆ సభ తర్వాత ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్పై నమ్మకం మరింత పెరిగిందన్నారు. ఎల్కతుర్తి సభ సక్సెస్ను స్వాగతిస్తూ డల్లాస్ సభకు ప్లాన్ చేసినట్లు వివరించారు. ఈ సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారని, అన్ని వర్గాల వారు పాల్గొని విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
వైభవంగా వార కల్యాణం
చిల్పూరు: శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో శనివారం వార కల్యాణాన్ని అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచా ర్యులు వైభవంగా నిర్వహించారు. హనుమకొండకు చెందిన అడెపు శ్రీనగేష్–శ్వేత, పింగిళి మధుపాల్రెడ్డి–ప్రేమలత భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మీప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, జూనియర్ అసిస్టెంట్ కుర్రెంల మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాళ్లపెల్లి నరేష్గౌడ్కు డాక్టరేట్జఫర్గఢ్: షాపల్లికి చెంది న తాళ్లపెల్లి నరేష్గౌడ్కు కాకతీయ విశ్వవిద్యాల యం డాక్టరేట్ ప్రకటించింది. ‘స్టేట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏ స్టడీ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ పోరిక సమ్మూలాల్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసినందుకు డాక్టరేట్ ప్రకటించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడిలో ఆదిత్రి ప్రతిభచిల్పూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలకలూరిపేట కళా నిలయం వారు ఇటీవల నిర్వహించిన 40వ అంతర్జాతీయ నృత్యకళా పోటీల్లో చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన ఏమాండ్ల రాజనర్సింహారెడ్డి–రమ దంపతుల కూతురు ఆదిత్రిరెడ్డి కూచిపూడి చంద్ర కేటగిరి(5 నుంచి 14 ఏళ్ల లోపు)లో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది. ఆదిత్రి ప్రస్తుతం కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఈ సందర్భంగా ఆమెను గ్రామానికి చెందిన చల్లా రాజమహేందర్రెడ్డి, కందుల రఘుపతి, జంగం యాదగిరి, ఎన్నకూస కుమార్, వలబోజు బ్రహ్మచారి, గుర్రపు విజయ్కుమార్, చొల్లేటి రాజేశ్వరశర్మ తదితరులు అభినందించారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
పాలకుర్తి టౌన్: మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు అంశం ఘర్షణకు దారితీసింది. రోడ్డు విస్తరణలో భాగంగా చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, తెలంగాణ తల్లి విగ్రహాలను రెండేళ్ల క్రితం తొలగించి పోలీస్టేషన్లో భద్రపరిచారు. పనులు పూర్తయ్యాక చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన గద్దైపెనే నూతనంగా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ నాయకులు శనివారం స్లాబ్ వేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వచ్చి తమ ప్రభుత్వం రూపొందించిన పాత విగ్రహమే ఏర్పాటు చేయాలని స్లాబ్ను కూల్చివేశారు. సమాచారం అందుకున్న వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని నాయకులను చెదరగొట్టారు. దీంతో అదే ప్రదేశంలో బైఠాయించి నిరసన తెలుపగా కొందరిని అరెస్ట్ చేశా రు. ఈ క్రమంలో స్లాబ్ కూల్చిన ప్రదేశంలో కాంగ్రెస్ నాయకులు పనులను పునరుద్ధరించడానికి పూనుకోగా బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకోవడానికి సిద్ధమవగా పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం బందోబస్తు మధ్య స్లాబ్ పనులు తిరిగి మొదలు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూని నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ బొబ్బాల అశోక్రెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామని, దానిపై కాంగ్రెస్ నాయకులు కొత్త విగ్రహం ఏర్పా టు చేస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయులు సురేష్నాయక్, మహేందర్, పాపారావు, బాలు నాయక్, దిండిగాల వెంకన్న, బెల్లి సోమన్న తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో వివాదం కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్.. పాత విగ్రహమే కావాలన్న బీఆర్ఎస్ నాయకులు స్లాబ్ నిర్మాణం కూల్చివేత.. ఇరువర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
జనగామ రూరల్: యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత అన్నారు. శనివారం కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. పొగాకు వినియోగంతో ముఖ్యంగా మౌత్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కిడ్నీలు పాడై డయాలసిస్ వరకు వెళ్తున్నారని చెప్పారు. ఇంట్లోని పెద్దలు, ఫ్రెండ్స్తోపాటు సినిమాల ప్రభావం కారణంగా పొగాకు అలవాటుగా మారుతోందన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్, యోగా, వాకింగ్, రన్నింగ్ చేయాలని సూచించారు. డాక్టర్ కమలహాసన్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురికి క్యాన్సర్ వచ్చేదని, ఇప్పుడు ఆ స్థాయి ఎక్కువగా పెరిగిందన్నారు. ఇందు కు పొగాకు ఎక్కువగా వాడటమే కారణమని పేర్కొన్నారు. అంతకు మందు విద్యార్థులు పారాలీగల్ వలంటీర్లతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, లీగలైట్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర, సోషల్ వర్కర్ ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఆస్పత్రిలో.. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాలీ అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్సీడీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కర్ణాకర్ రాజు, డాక్టర్ మధుకర్, డాక్టర్ కమలహాసన్, ఎన్సీడీ కోఆర్డినేటర్ రాజబాబు, భూక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సుచరిత -
‘పుష్కరాల’ చెత్త తొలగింపు ఏదీ!
కాళేశ్వరం: గత నెల 15 నుంచి 26వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగిన సరస్వతీనది పుష్కరాల్లో చెత్త తొలగింపుపై పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. గోదావరిలోని ఖాళీ వాటర్ బాటిళ్లు, వ్యర్థాలు తొలగించడం లేదు. దీంతో పశువులు అందులోని వ్యర్థాలు, ప్లాస్టిక్ను తింటున్నా యి. ఫలితంగా పశువులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదే కాకుండా అన్నదానసత్రాలు, హోటళ్లు, ఇతర వ్యాపారాలు నిర్వహించిన ప్రాంతాల్లో వ్యర్థాలు కుళ్లి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెంది, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికై నా అధి కారులు స్పందించి దోమలు వ్యాప్తి చెందకుండా చెత్తను తొలగించి, అన్ని వార్డుల్లో రెండు రోజులకు ఒక్కసారి వారం పాటు బ్లీచింగ్ ఫౌడర్ చల్లాలని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పారిశుద్ధ్యంపై తక్షణ చర్యలు తీసుకుని దుర్గంధం వెదజల్ల కుండా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
చిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది. గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు. ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండలోని నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
మేడారం ఈఓగా వీరస్వామి
హన్మకొండ కల్చరల్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఈఓగా మేకల వీరస్వామి బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు మేరకు శనివారం వరంగల్లోని ధర్మిక భవన్లోని మేడారం సమ్మక్క , సారలమ్మ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓ మేకల వీరస్వామికి వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామల సునీత, తెలంగాణ అర్చక ఉద్యోగ జాక్ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఉద్యోగ విరమణ పొందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర ఈఓ రాజేంద్రం, మరో ఆలయ ఈఓ వేణుగోపాల్ను ఘ నంగా సన్మానించారు. కా ర్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట ప్రధాన కార్యదర్శి తనుగుల రత్నాకర్, ఈఓలు అద్దంకి నాగేశ్వరరావు, వెంకటయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు -
సమన్వయంతోనే పుష్కరాలు సక్సెస్
భూపాలపల్లి: అధికారులు, ప్రజల సమన్వయంతోనే సరస్వతీనది పుష్కరాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన నిర్వహించిన ‘సరస్వతి పుష్కరాలు ఎ డే ఆఫ్ థాంక్స్’ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే మార్గనిర్దేశంలో 33 శాఖలకు చెందిన అటెండర్ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ మూడు నెలలు కష్టపడ్డారన్నారు. పుష్కరాల విజయవంతంలో వారి పాత్ర కీలకమని, వారందరికీ అభినందనలు తెలిపారు. పుష్కరాల నిర్వహణ అంత తేలిక కాదని, ఏ చిన్న పొరపాటు జరిగినా, నిర్లక్ష్యంగా ఉన్నా జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నారు. కొందరు సరస్వతీనది పుష్కరాలు విజయవంతం కాకుండా చేయాలని కుట్రలు పన్నారని, చిన్న అంశాలను భూతద్దంలో చూపించి తమను బద్నాం చేసేందుకు యత్నించారన్నారు. త్వరలోనే కాళేశ్వరం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో కొత్త బస్డిపోల నిర్మాణానికి శ్రీకారం చుడుతామన్నారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను మరింత వైభవోపేతంగా నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజారామయ్యర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పుష్కరాల విజయవంతానికి కృషి చేశారన్నారు. పుష్కరాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయిన వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్నారు. అనంతరం పుష్కరాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన పలు శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్కుమార్, విజయలక్ష్మి, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అటెండర్ నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు మూడు నెలలు శ్రమించారు పుష్కరాలు విజయవంతం కావొద్దని కొందరు కుట్రలు పన్నారు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
జనగామ: కలెక్టరేట్ ఆవరణలో జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ మేరకు డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్నితిన్తో కలిసి ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రముఖులు, మీడియా, అతిథుల కోసం ఏర్పాటు చేసే గ్యాలరీ ప్రాంతాన్ని సందర్శించి.. వేదిక, అలంకరణ, సౌండ్ సిస్టం, తాగునీటి సదుపాయంపై అధికారులకు సూచనలు చేశారు. పోలీసుల గౌరవ వందనం, బందోబస్తుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ గోపీరాం, ఉద్యానవన అధికారి శ్రీధర్రావు, తహసీల్దార్ హుస్సేన్, కలెక్టరేట్ ఏఓ మన్సూర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పిల్లలకు ఉచిత స్వర్ణ ప్రాశనజనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులోని వేద ఆయుర్వేదిక్ పంచకర్మ, వెల్నెస్ సెంటర్లో శనివారం ఉచిత స్వర్ణ ప్రాశన కార్యక్రమాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. స్వర్ణ ప్రాశన తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగనిరోధక, మేధాశక్తి, ఎముకల పటిష్టత, జీర్ణశక్తి పెరుగుతుందన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
సమాజం అండదండలతోనే ‘పద్మశ్రీ’
హన్మకొండ అర్బన్ : సమాజం అండదండలతోనే తనకు ‘పద్మశ్రీ’ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న అనంతరం శనివారం వరంగల్ చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో ఎమ్మార్పీస్ శ్రేణులు, ఇతర సంఘాల నాయకులు మంద కృష్ణ దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్లో, రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో పద్మశ్రీ మంద కృష్ణమాదిగ మాట్లాడారు. ఈ సంవత్సరంలో ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగా వర్గీకరణ సాధించడం, తనకు పద్మశ్రీ పురస్కా రం రావడం మాదిగజాతికి గర్వకారణమన్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాకుండా తనకు ఉద్యమంలో అన్ని విధాలా సహకరించిన సమాజానికి కూడా అన్నారు. మూడు దశాబ్దాల ఉద్యమ పోరాటంలో అనేక ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా బరిలో నిలిచి లక్ష్యం సాధించామన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు .. వర్గీకరణ విషయంలో ముందుండి నడిపిన ప్రధాని మోదీ, సహకరించిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్రెడ్డి, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలి పారు. ఇది మాదిగ జాతి ఉద్యమ విజయానికి నిదర్శమన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునిపోతూ వర్గీకరణ సాధించామన్నారు. ఈక్రమంలో అనేక వర్గాలు సహకరించాయన్నారు. రా నున్న రోజుల్లో వారి అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రంలో జాతీయ కార్యవర్గ సమావేశం.. వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి సుమారు 11గంటల ప్రాంతంలో హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రానికి చేరుకున్నారు. తెలంగాణ, ఏపీ ఎమ్మార్పీస్ నేతలు, ఇతర ప్రజాసంఘాల ఆఽధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణను సన్మానించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో మందకృష్ణను అభినందిస్తూ తీర్మానంచేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యుక్షులు గోవిందు నరేశ్ మాదిగ, రుద్రపోగు సురేశ్ మాదిగ, జాతీయ నేత మంద కుమార్ మాదిగ, బొడ్డు దయాకర్, నరేంద్ర, బొర్ర భిక్షపతి, బుర్రి సతీశ్, రవి, గద్దల సుకుమార్, బండారు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మంద కృష్ణమాదిగకు ఘన స్వాగతం ఖిలా వరంగల్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు వరంగల్లో ఘనస్వాగతం పలికారు. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఆయన శనివారం రాత్రి ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో వరంగల్ వచ్చారు. రైల్వేస్టేషన్లో దిగిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో రైల్వేస్టేషన్నుంచి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం వరకు ర్యాలీగా చేరుకున్నారు. వర్గీకరణ స్వప్నం సాకారమమడం ఉద్యమ విజయం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ -
ముందస్తు బియ్యం వచ్చేశాయ్
జనగామ: రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం వచ్చే మూడునెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్షాకాలం నేపథ్యంలో బియ్యం రవాణాలో తలెత్తే సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ పర్యవేక్షణలో పౌరసఫరాల శాఖ జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన సన్న బియ్యం కోటాను జూన్ ఒకటో తేదీ నుంచి పంపిణీకి చర్యలు చేపట్టింది. వర్ష్షాకాలంతో అప్రమత్తం.. వర్షాకాలంలో ఏటా దేశంలోని అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు రేషన్ సరుకులు పంపి ణీ చేయడం గతం నుంచే కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో కల్వర్టులు, చెరువు కట్టలు, మట్టి రహదారులు కోతకు గురై రవాణా వ్యవస్థ స్తభించి పోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేస్తున్నది. అయితే ఈసారి మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాల్లో మూడు నెలలకు సంబంధించిన సరుకులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. 5,35,689 మంది లబ్ధిదారులు జిల్లాలో 1,63,283 రేషన్ కార్డులు ఉండగా.. 335 రేషన్ దుకాణాలు ఉన్నాయి. లబ్ధిదారులు 5,35,689 మంది ఉండగా.. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 30,049 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. మూడు నెలలకు సరిపడా 90,147 క్వింటాళ్ల సన్న బియ్యం రేషన్ దుకా ణాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 195 దుకాణాలకు 20వేల క్వింటాళ్ల సన్న బియ్యం తరలించారు. వచ్చే నెల 10వ తేదీ వరకు వందశాతం కోటా పంపించేలా ట్రాన్స్పోర్టేషన్ను సిద్ధం చేశారు. పంపిణీ నిబంధనల సడలింపు రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల కోటా సన్న బియ్యం ఒకేసారి తీసుకువెళ్లేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నా రు. గతంలో 18వ తేదీ వరకు బియ్యం తీసుకుపోయే అవకాశం ఉండగా.. ఈసారి జూన్ 30వ తేదీ వరకు పంపిణీ చేసేలా నిబంధనలను సడలించారు. జూన్ 10 వరకు వందశాతం కోటా.. జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయబోతున్నాం. ఇప్పటి వరకు 195 రేషన్ దుకాణాలకు బియ్యం వచ్చాయి. 10వ తేదీలోగా అన్ని దుకాణాలకు వందశాతం కోటా వెళ్తుంది. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – హథీరామ్, సివిల్ సప్లయీస్ డీఎంజిల్లాలో రేషన్ వివరాలురేషన్ దుకాణాలు: 335 రేషన్ కార్డులు: 1,63,283 లబ్ధిదారులు: 5,35,689 నెలవారీ కోటా: 30,049 క్వింటాళ్లుమూడు నెలల కోటా ఒకేసారి రేపటి నుంచి పంపిణీ షురూ 195 దుకాణాలకు చేరిన సన్న బియ్యం జూన్ 10వ తేదీ వరకు వందశాతం.. 30వ తేదీ వరకు పంపిణీకి అవకాశం వర్షాకాలం నేపథ్యంలో నిర్ణయం -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● డీసీపీ రాజమహేంద్రనాయక్ పాలకుర్తి టౌన్: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలో ని పలు ఎరువులు, పురుగుల మందు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన.. సరుకు నాణ్యతా ప్రమాణాలు, స్టాక్ రిజిస్టర్, బిల్బుక్ నిర్వహణ తదితరాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు నాసిరకం విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ విభాగానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీలో ఏసీపీ అంబటి నర్సయ్య, వ్యవసాయ అధికారులు రామారావు, పరుశురాంనాయక్, ఏఓ శరత్చంద్ర, ఎస్సై దూలం పవన్కుమార్, లింగా రెడ్డి, పీఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు.