Guntur
-
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
పహల్గాం మృతులకు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి మృతులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులర్పించారు. గురువారం పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ముందు ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు నివాళులర్పించారు.సమావేశం ప్రారంభంలో.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam Attack)లో ఉగ్రవాదులు జరిపిన ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మౌనం పాటించి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ భేటీలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఇంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్.. ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారారాయన. ఈ క్రమంలో.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి కూడా. -
లాం ఫాంలో సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వ్యవసాయ శాఖలు సంయుక్త ఆధ్వర్యం వహించాయి. నగర శివారుల్లోని లాంఫాం నందున్న సమావేశ మందిరంలో రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ రైతుల సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని పరిశోధన ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. నూతన వంగడాలపై ఫీడ్ బ్యాక్ రైతుల నుంచి తీసుకోవాలన్నారు. సహజ వనరుల పొదుపు, నేల ఆరోగ్యం వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కృష్ణ మండలంలో నిష్ణాతులైన రైతుల ద్వారా సాగు సమస్యలు, సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ మాట్లాడుతూ జిల్లా వనరులు, అవసరాలు, పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని నూతన పరిశోధనలు జరపాలన్నారు. రైతులు విత్తన రకాలపై కాకుండా పంటల్లో యాజమాన్య పద్ధతులపై దృష్టి సారించాలని కోరారు. వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా ప్రాంతాల పంటల స్థితిగతులు, పంటల యాజమాన్యం, మినీ కిట్ల పనితీరు గురించి వివరించారు. వచ్చే ఏడాదిలో చేపట్టాల్సిన పరిశోధనలకు దిశానిర్దేఽశం చేశారు. కేవీకే ఘంటశాల, గరికపాడులతో తయారు చేసిన పలు రకాల ప్రచురణలను విడుదల చేశారు. కార్యక్రమంలో 6 జిల్లాల వ్యవసాయ శాఖల అధికారులు, 12 పరిశోధన స్థానాలు, 6 విస్తరణ యూనిట్లు శాస్త్రవేత్తలు, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, డీఆర్సీ అధికారులు, 6 జిల్లాల అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
మంగళగిరి టౌన్ : పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా మంగళగిరిలో పలు రాజకీయ పార్టీల నాయకులు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు సంతాపం తెలియజేశారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మంగళగిరి నగర పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, నాయకులు నివాళులర్పించారు. కొవ్వొత్తులతో సంతాపం తెలియజేశారు. పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంతో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషమని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమని పేర్కొన్నారు. దాడుకు పాల్పడిన ఉగ్రవాదులపై ప్రధాని మోడీ ఉక్కుపాదం మోపుతారని అన్నారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. కాశ్మీర్ అభివృద్ధిని ఆపలేరు గుంటూరు మెడికల్: కాశ్మీర్లో అమాయక ప్రజలపై జరిగిన అమానుష దాడికి సంఘీభావంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ వరకు కొవ్వొత్తులతో ఈ ర్యాలీ సాగింది. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ అమాయక పౌరులపై జరిపిన దాడిని ఖండించారు. పార్టీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు, భీమినేని చంద్రశేఖర్, ఈదర శ్రీనివాసరెడ్డి, చరక కుమార్ గౌడ్, డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, నేరళ్ళ మాధవరావు, మంత్రి సుగుణ, ఏలూరి లక్ష్మీ, మేరీ సరోజినీ, బొల్లాప్రగడ శ్రీదేవి, వాణి వెంకట్, కోలా రేణుకాదేవి, గాయత్రి, రాజేష్ నాయుడు, దార అంబేడ్కర్, దర్శనపు శ్రీనివాస్, కంతేటి బ్రమ్మయ్య, బజరంగ్ రామకృష్ణ, దుర్గా ప్రసాద్, రామచంద్రరావు, తూనుగుంట్ల రాజేష్, మల్లాల లక్ష్మణ్, కామేపల్లి వెంకటేశ్వర్లు, మోతే శేషగిరి, పోతురాజు వెంకటేశ్వర్లు, తానుచింతల అనిల్, సాధు రామకృష్ణ, షేక్ బిలాల్, శ్రీను నాయక్, పద్మనాభం, రాజా అజయ్ కృష్ణ, షేక్ సాంబశివరావు, సురేష్ జైన్, కృష్ణ చైతన్య, పేరుమళ్ల పద్మనాభం, వక్కలగడ్డ తిరుమలరావు సాంబమూర్తి, నాగసాయి, కారం శెట్టి రమేష్, చంద్రశేఖర్, తాడువాయి రామకృష్ణ, సాంబయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు. మృతులకు నివాళి ఏఎన్యూ: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఉగ్రదాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, పరిశోధకులు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన కాశ్మీర్లోని శాంతి, సామరస్య స్ఫూర్తికి విరుద్ధమైనదని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. దాడి వెనుక ఉన్న దుష్టశక్తులు, వారికి సహకరించిన ఎంతటివారైనా సరే వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కన్వీనర్ కె.గంగాధర్ రావు, రాష్ట్ర షోద్ కన్వీనర్ డి. రమాకాంత్, యూనివర్సిటీ శాఖ వైస్ ప్రెసిడెంట్ రాము, ఎస్ఎఫ్డీ కో కన్వీనర్ సి.హెచ్. శివ గణేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్, విశ్వవిద్యాలయం పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పెదపలకలూరు శ్రీచైతన్య స్కూల్ విద్యార్థుల ప్రతిభ
గుంటూరు రూరల్: పదో తరగతి ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని పెదపలకలూరు శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ డైరెక్టర్లు తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో కేవీ సౌజన్య అత్యధికంగా 586 మార్కులు సాధించి రాష్ట్ర ర్యాంకును సాధించిందన్నారు. పాఠశాలలో 550 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులు 9 మంది, 500 మార్కులకు పైగా సాధించిన వారు 28 మంది ఉన్నారన్నారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చారన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు శనగల సాంబిరెడ్డి, ఎం.వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏరువ శ్రీవేణి, గ్రామస్తులు అభినందించారు. పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య ఫిరంగిపురం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కానందుకు మనస్తాపానికి గురై విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పి.వినయకుమార్ (16) స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదు. మనస్తాపానికి గురై తన తాత పాపయ్య ఇంటికి వచ్చి ఫ్యాన్కు ఉరి వేసుకొన్నాడు. చుట్టు పక్కల వారు గమనించి విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రయివేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విద్యార్థిని రక్షించిన పోలీసులు తాడేపల్లి రూరల్ : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా బుధవారం తాడేపల్లి పోలీసులు కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ కల్యాణ్రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ విద్యార్థికి 10 తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వచ్చాడన్నారు. తల్లిదండ్రులు అరండల్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అక్కడి సీఐ అప్రమత్తమై విద్యార్థి వద్ద సెల్ఫోన్ ఆధారంగా లొకేషన్ కనిపెట్టి తాడేపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు బృందాలుగా తాడేపల్లి పోలీసులు వెతకగా తాడేపల్లి కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి అరండల్పేట పోలీస్స్టేషన్కు పంపినట్లు సీఐ కల్యాణ్ రాజు తెలిపారు. హైదరాబాద్కు ఇంద్ర బస్సులు చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాదు – బీహెచ్ఈఎల్ ఏసీ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం ఎస్.రాంబాబు బుధవారం తెలిపారు. డిపో వినియోగదారుల అవసరాలు పరిశీలించి హైదరాబాద్, బీహెచ్ఈఎల్ మార్గాల్లో కొత్తగా రిజర్వేషన్ను ప్రారంభించామన్నారు. -
నకిలీ ఉద్యోగాల ముఠాపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో జనసేన పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై బుధవారం జనసేన నాయకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ సీనియర్ నాయకుడు అంబటి తిరుపతిరావులు మాట్లాడుతూ ఉండవల్లి సెంటర్లో శివ అనే వ్యక్తి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని జనసేన ఎంపీ, మంత్రుల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దరఖాస్తులు స్వీకరిస్తూ, నగదు వసూలు చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందన్నారు. పత్రికల్లో దీనిపై వార్తలు వచ్చాయని గుర్తుచేవారు. శివకు, అతని వెనుక ఉన్న ముఠాతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చల్లాకుల కోటేష్, నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు చిగురుశెట్టి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్ల కేటాయించడం జరిగిందని గుంటూరు డివిజన్ సీనియర్ డీసీయం ప్రదీప్ కుమార్ బుధవారం తెలిపారు. రైలు నంబర్ 08579 విశాఖపట్నం – చర్లపల్లి రైలు ఈ నెల 25 నుంచి మే 30వ తేదీ వరకు నడుస్తుందన్నారు. 08580 చర్లపల్లి – విశాఖపట్నం రైలు ఈ నెల 26 నుంచి మే 31వ తేదీ వరకు నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అమరావతి: మండలంలోని ఎనికపాడు గ్రామంలో హనుమత్, లక్ష్మణ సీతాసమేత రామచంద్రస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. యాజ్ఞిక బ్రహ్మ పరాశరం రామకృష్ణమాచార్యుల పర్యవేక్షణలో వైఖానసాగమంలో చంచాహ్నికహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహించారు. ప్రతిష్టా సుముహుర్తమైన 8గంటలకు తొలుత యంత్ర స్థాపనచేసి యాగశాల నుంచి స్వామివార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్టించారు. అనంతరం అత్యంత వైభవంగా జీవధ్వజ ప్రతిష్టాకార్యక్రమం నిర్వహంచారు. ఈసందర్భంగా మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణ మహా సమారాధన నిర్వహించారు. ఽవిగ్రహ ప్రతిష్ట అనంతరం మొదట ధేను దర్శనం, దిష్టికుంభం, కన్యాదర్శనం అనంతరం ప్రథమార్చన నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం దేవాలయ నిర్వాహకులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్టా ఉత్సవాలతో గ్రామం భక్తులతో కళకళలాడింది. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగాకాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్ సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతురావు మాట్లాడుతూ రంగా కాలనీలో ఇటీవల చోటు చేసుకుంటున్న గొడవల నేపథ్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరికలు చేశారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టడంతో రంగాకాలనీలో ఏదో జరిగిందంటూ కొంత సేపు కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని పోలీస్టేషన్కు తరలించారు. -
మార్జాలంపై మమకారం!
ఇటీవలి కాలంలో పట్టణాలు, నగరాల్లోనూ పిల్లులపై మోజు పెరుగుతోంది. గతంలో రైతులు, పశుపోషకులు మాత్రమే పిల్లులను ఆదరించేవారు. ప్రస్తుతం అన్ని వర్గాలకు ఇది విస్తరిస్తోంది. పిల్లుల పెంపకం ఓ జీవనశైలి మాత్రమే కాదు, మానవీయ విలువల ఆవిష్కరణగా మారింది. ● జిల్లాలో పెరుగుతున్న పిల్లుల పెంపకం ● అన్ని వర్గాలకూ విస్తరిస్తున్న అలవాటు ● పెంపుడు జాతుల్లో ‘పర్షియన్’దే ఆధిక్యం ● బిల్లీ, మచ్చల పిల్లులకు ఆదరణ -
అట్టహాసంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవం
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహా మంజీరనాదం వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించగా, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు వేడుకలను ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం మేలట్టూర్ ఎన్.శ్రీకాంత్ నటరాజన్ (కేరళ)ను అక్కిరాజు మణి ప్రియ స్మారక సాత్రాజితి పురస్కారంతో, ఏలూరి జయశ్రీ, దంగేటి సాత్విక (తెలంగాణ)లను సంస్థ కార్యదర్శి కళారత్న డాక్టర్ కాజ వెంకటసుబ్రమణ్యం సత్కరించారు. మేలట్టూర్ శ్రీకాంత్ నటరాజన్ మేలట్టూ సంప్రదాయ నృత్యాన్ని, ఏటూరి జయశ్రీ కూచిపూడి నృత్యాన్ని, దంగేటి సాత్విక ఆంధ్ర నాట్యాన్ని ప్రదర్శించారు. వారి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమాలను మోదుగుల రవికృష్ణ, అక్కిరాజు శ్రీహరిబాబు, వెంకటగిరి నాగలక్ష్మి (కోశాధికారి), శ్రీఅలేఖ్యరావు పర్యవేక్షించారు. సాత్విక నృత్యం -
చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ఇద్దరు అరెస్టు
గుంటూరు రూరల్: చిరునామా అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్లకు పాల్పడే మామా అల్లుళ్లను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అడవితక్కెళ్ళపాడులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ డీఎస్పీ భానోదయ ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ... పాతగుంటూరు యాదవ బజారుకు చెందిన బాణావత్ బద్రునాయక్, పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన కేతావత్ శరత్లు మేనమామ, మేనల్లుడు. నగరంలో ఆటోలు నడుపుతూ వ్యసనాలకు బానిసలయ్యారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్లను ఎన్నుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళుతూ ఒంటరిగా వెళుతున్న మహిళలను అడ్రస్ అడుగుతున్నట్లు నటించి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పారిపోయేవారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇన్నర్ రింగ్రోడ్డులో ఓ మహిళ మెడలోని 20 గ్రాముల బంగారు చైన్ను ఇదే తరహాలో లాక్కెళ్లారు. నల్లపాడు సీఐ వంశీధర్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం ఉదయం వై జంక్షన్ వద్ద తిరుగుతున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి పోలీసులు 20 గ్రాముల బంగారం, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ, సీఐని, ఎస్ఐ వాసు, సిబ్బంది సుబ్బారావు, మస్తాన్వలి, నరుల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
చెమటోడుస్తున్నా చల్లనమేదీ?
గుంటూరు జీజీహెచ్లో గుండె జబ్బు రోగులకు అవస్థలు తప్పడం లేదు. దీర్ఘకాలిక వ్యాధితో రోజూ ఇబ్బంది పడేవారు కొంత ఉపశమనం కోసం గుంటూరు జీజీహెచ్కు వస్తే అక్కడ ఏసీలు పనిచేయక మరిన్ని కష్టాలు పడుతున్నారు. ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గదిలో ఏసీలు పనిచేయక నానా అగచాట్లు పడుతున్నారు. రోగులకు సరిపడా గాలి, వెలుతురు లేని పక్షంలో ఊపిరి అందక ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వారికి సేవలు అందించే వైద్యులకూ ఇబ్బందులు తప్పడం లేదు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్ గుండె జబ్బుల విభాగం సీసీయూలో చికిత్స కోసం వచ్చే రోగులు రెండు నెలలుగా ఏసీలు పనిచేయక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొద్దో గొప్పో డబ్బులు ఉన్నవారు ఫ్యాన్లు కొనుగోలు చేసుకుని తమ పడకల వద్ద పెట్టుకుంటున్నారు. కొంత మంది ఇళ్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. స్థోమత లేని వారు మాత్రం గాలిక ఆడక, నిద్రపట్టక నానా అగచాట్లు పడుతున్నారు. వేసవికి ముందే ఆసుపత్రిలో ఏసీల నిర్వహణ చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే నేడు రోగులకు ఇబ్బంది తప్పడం లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీల మెయింటెనెన్స్ కాంట్రాక్టును విజయవాడకు చెందిన కంపెనీ వారు దక్కించుకున్నారు. మార్చి ప్రారంభానికి ముందే మరమ్మతులు చేయాల్సి ఉంది. ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లాంటి అత్యవసర వైద్య సేవల విభాగాల్లో నిత్యం ఏసీల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. వాటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. సదరు కాంట్రాక్టర్పై ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడం విమర్శలకు తావిస్తోంది. రోగులు ఇబ్బంది పడుతున్నప్పుడైనా కాంట్రాక్టర్కు బిల్లులు నిలుపుదల చేయడం, లేదా వేరొకరికి కాంట్రాక్టు అప్పగించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రి అధికారులకు సంబంధించిన గదుల్లో మాత్రం ఏసీలు బాగానే పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికీ కష్టాలు హార్ట్ ఫెయిల్యూర్ లాంటి తీవ్ర ప్రాణాపాయ స్థితిలో గుంటూరు జీజీహెచ్ గుండె జబ్బుల వార్డుకు వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చెమటోడ్చి సేవలందిస్తున్నారు. ఎక్కువ సేపు వైద్య విభాగంలో సేవలందించేలా ఆసుపత్రి అధికారులు ఏసీలు రిపేర్లు చేయించకపోవడంతో వీరు సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధిక సంఖ్యలో గుండె ఆపరేషన్లు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నా తగిన వసతులు కల్పించకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలో ఎండ తీవ్రత పెరిగి మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా ఆసుపత్రి అధికారులు స్పందించి పేద రోగులతోపాటు వైద్య సిబ్బంది బాధలు తీర్చాలని పలువురు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చాం కార్డియాలజీ సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయని విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణను ‘సాక్షి’ వివరణ కోరగా... సమస్య తమ దృష్టికి వచ్చిందన్నారు. సెంట్రల్ ఏసీ అవడంతో తరచుగా సమస్య ఉత్పన్నం అవుతోందని తెలిపారు. ఏసీలు పనిచేసేలా చూడాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు ఇచ్చామన్నారు. జీజీహెచ్ గుండె జబ్బుల విభాగంలో పనిచేయని ఏసీలు వైద్యం చేసే సమయంలో డాక్టర్లకు తప్పని అవస్థలు సొంత ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగులు, సహాయకులు -
రాష్ట్రంలో కూటమి లిక్కర్ మాఫియా
● టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలు అప్పగింత ● వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబునగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక లిక్కర్ మాఫియా కొనసాగుతోందని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు మండిపడ్డారు. గుంటూరు బృందావన్గార్డెన్స్ ౖవైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్టీఆర్ మద్యాన్ని నిషేధించగా, ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యం పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో సారాయి, మద్యం ఏరులై ప్రవహిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్వరమే మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులకే మద్యం దుకాణాలను అప్పగించారని ఆరోపించారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలకు 30 శాతం వాటా ఇచ్చి, ఊరుకు ఎనిమిది బెల్ట్ షాప్లు, పర్మిట్ రూములను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. రూ.వేల కోట్లు టీడీపీ నేతల చేతులు మారుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు గతంలో బెల్ట్షాపులు రద్దు చేస్తామని సంతకం చేశారని, ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 43 వేల బెల్ట్ షాప్లను రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సుమారు 4,300 మద్యం దుకాణాలు ఉండగా వైఎస్ జగన్ హయాంలో 33 శాతం తగ్గించారని తెలిపారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ నాయకులకు వచ్చేలా చేశారని, క్వాటర్ బాటిల్కు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బెల్డు షాప్ల ఏర్పాటుకు సైతం లంచం కింద రూ.2 లక్షలు చెల్లిస్తున్నారని తెలిపారు. తద్వారా తాగునీటి సీసాల విక్రయాలు, పర్మిట్లు ఇస్తున్నారని విమర్శించారు. గతంలోని మద్యం పాలసీపై చంద్రబాబు ఏ–3గా ఉన్నారని, ఆ కేసు ఏమైందనేది చూసుకోవాలని అన్నారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆ కేసులో వైఎస్ జగన్ను ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్లతో బలవంతంగా రాజ్ కసిరెడ్డి పేరు చెప్పించారని ఆరోపించారు. -
‘సాక్షి’పై దాడిని ఖండిస్తున్నాం
గుంటూరు మెడికల్: ఏలూరులో ‘సాక్షి’ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా పేర్కొన్నారు. సాక్షి కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వరంలో గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అనంతరం అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఎవరైనా రాసిన వార్త తమకు ఇబ్బందికరమని భావిస్తే ప్రెస్ కౌన్సిల్ను సంప్రదించవచ్చన్నారు. లేని పక్షంలో కోర్టులను ఆశ్రయించవచ్చని తెలిపారు. అంతేకానీ అప్రజాస్వామికంగా దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి కె.రాంబాబు, నగర గౌరవ అధ్యక్షుడు శర్మ, నగర అధ్యక్షుడు వి.కిరణ్కుమార్, కార్యదర్శి కె.ఫణి, పరసశ్యామ్, సాక్షి బ్యూరో ఇన్చార్జి డి.రమేష్బాబు, సాక్షి టీవీ జిల్లా ఇన్చార్జి అశోక్, కెమెరామెన్ బాషా, ఫొటోగ్రాఫర్ రామ్గోపాల్రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ గోపి, సర్క్యూలేషన్ మేనేజర్ అబ్దుల్లా, సాక్షి అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ ఎంవీడీ సత్యనారాయణ, సాక్షి సిబ్బంది రవి, భగత్, ఎం.సి.హెచ్.కోటిరెడ్డి, మొండితోక శ్రీనివాసరావు, రఘు, షేక్ సుభాని, ప్రకాష్, కృష్ణ, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యుల నిరసన -
మెడిసిన్ చదువుతా
తెనాలి: ఇంటర్లో బైపీసీ తీసుకుని మెడిసిన్ చేయాలనుందని పదో తరగతిలో 595 మార్కులు సాధించిన వివేక విద్యాసంస్థల విద్యార్థిని సీహెచ్ పరమేశ్వరి తన లక్ష్యాన్ని వెల్లడించింది. తెనాలి వివేక విద్యాసంస్థల్లో చిన్నప్పటి నుంచి చదవటం, ఉపాధ్యాయుల సూచనలు తనకు ఎంతగానో ఉపకరించినట్లు పేర్కొంది. వారందరికీ రుణపడి ఉంటానని చెప్పింది. తన తండ్రి అనంతరాజు సాధారణ పండ్ల వ్యాపారి కాగా, తల్లి శివలక్ష్మి గృహిణి అని తెలిపింది. తన చదువు కోసం వారు పడిన కష్టం మరువలేనిదని పేర్కొంది. న్యూరో సర్జన్గా స్థిరపడాలనేది లక్ష్యమని, అందుకోసం పట్టుదలతో చదువుతానని తెలిపింది. – సీహెచ్ పరమేశ్వరి -
బాలికలు భళా..!
గుంటూరుముగిసిన ప్రతిష్టా వేడుకలు శావల్యాపురం: వేల్పూరు గ్రామంలో వేంచేసియున్న గంగమ్మ, పోతురాజుల, పేర్పిడి ప్రతిష్టా మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. భక్తులు భారీసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. త్రికోటేశ్వర విగ్రహ పునఃజీవ ప్రతిష్ట సత్తెనపల్లి: అమ్మిశెట్టి వారి వీధిలోని త్రికోటేశ్వర స్వామి విగ్రహ పునఃజీవ ప్రతిష్ట, దేవాలయం పునర్ నిర్మాణం, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం బుధవారం జరిగాయి.రెడ్డి పేరంటాలమ్మకు పూజలు నాదెండ్ల: సాతులూరులో రూ.2 కోట్లతో నిర్మించిన రెడ్డిపేరంటాలమ్మ ఆలయంలో విద్యాదాత, గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి పూజలు చేశారు.గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గుంటూరు ఎడ్యుకేషన్ : మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన 27,255 మంది విద్యార్థుల్లో 24,129 మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలు రాసిన 14,444 మంది బాలురులో 12,567 మంది ఉత్తీర్ణులు కాగా, 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదే విధంగా 12,811 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 11,562 మంది ఉత్తీర్ణులయ్యారు. 90.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది 88.14 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 16వ స్థానానికి పరిమితమైన గుంటూరు జిల్లా ప్రస్తుత ఫలితాల్లో 88.53 శాతం ఉత్తీర్ణతతో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన పేద కుటుంబాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడి రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించడంతోపాటు జిల్లాలో టాపర్లుగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతోపాటు అధిక మార్కులు సాధించిన వారు వందలాదిగా ఉండటంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 20,504 మందికి ప్రథమ శ్రేణి జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ప్రథమ శ్రేణిలో పాసైన వారే ఉన్నారు. పరీక్షలు రాసిన 27,255 మందిలో 24,129 మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో 20,504 మంది ప్రథమ శ్రేణి పొందడం గమనార్హం. మిగిలిన వారిలో 2,512 మంది ద్వితీయ, 1,113 మంది తృతీయశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. ● తాడికొండ ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి పఠాన్ మొహమ్మద్ అబ్దుల్ రెహ్మాన్ అత్యధికంగా 592 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచాడు. ● సంగం జాగర్లమూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని మద్దినేని మనోజ్ఞ, తెనాలి కొత్తపేటలోని ఎస్డీఐఎం మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ ఉస్నే జహా, పెదకాకాని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని షేక్ రిజ్వానా, కొల్లిపర మండలం వల్లభాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని తియ్యగూర పూజితారెడ్డి, మంగళగిరి వీవర్స్ కాలనీలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.వరుణ్సాయి 591 మార్కులు సాధించారు. ● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులను జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందించారు. అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. పదో తరగతిలో జిల్లా విద్యార్థులు మెరిశారు. కన్నవారి కలలు నిజం చేసేలా పలువురు అత్యుత్తమ మార్కులు సాధించారు. మొత్తమ్మీద బాలుర కంటే బాలికలు సత్తా చాటి భళా అనిపించారు. బుధవారం ఎస్సెస్సీ బోర్డు ప్రకటించిన పరీక్షా ఫలితాలలో జిల్లాలో 88.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో ఏడాదివారీగా ఫలితాలు ఇలా.. సంవత్సరం ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో స్థానం 2020 ఆల్ పాస్ 2021 ఆల్ పాస్ 2022 68.20 7 2023 77.40 6 2024 88.14 16 2025 88.53 4 3న్యూస్రీల్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో హవా జిల్లాలో 88.53 శాతం ఉత్తీర్ణత రాష్ట్రస్థాయిలో జిల్లాకు 4వ స్థానం గతేడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంక్ సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 20,504 మంది -
ఉగ్రవాదుల దాడి హే యం
పట్నంబజారు: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దుర్ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నేతృత్వంలో బుధవారం పార్టీ శ్రేణులు శాంతి ర్యాలీ చేపట్టాయి. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బుధవారం ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని సిగ్నల్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సరైన బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ విచక్షణరహితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాద సంస్థలను అణచివేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి దాడులు చేయడం ఎంతో హేయమైన చర్య అని, ఈ దాడిలో అమాయకులు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కిరాతకులను కఠినంగా శిక్షించాలన్నారు. దేశంలో ఇలాంటివి పునరావృతం కాకుండా, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించాలన్నారు. తప్పు చేసిన వారిని అణచివేయాలని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్ర మోడీ సరైన జవాబు చెప్పాలన్నారు. దేశం దమ్మును వారికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్, తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్, పార్టీ నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, నిమ్మకాయల రాజనారాయణ, మండేపూడి పురుషోత్తం, సీడీ భగవాన్, కొరిటెపాటి ప్రేమ్కుమార్, మామిడి రాము, నందేటి రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు -
నేటి నుంచి టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సాధారణ బదిలీల కోసం పెట్టుకునే ప్రభుత్వ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధారణ బదిలీ కోసం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతి ఒక్కరూ జీజీహెచ్ ఆసుపత్రి అభివృద్ధి సంఘం కౌంటర్లో రూ.1,500 ఫీజు చెల్లించాలన్నారు. అభ్యర్థులు రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, ఉద్యోగ గుర్తింపు కార్డు తీసుకుని ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యలో కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99637 66638 ఫోన్ నంబరులో సంప్రదించాలన్నారు. ఘనంగా పోలేరమ్మ ఆలయ వార్షికోత్సవం తెనాలి టౌన్: భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే పోలేరమ్మ కరుణ, కటాక్షాలు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆలయ ధర్మకర్త వీరయ్య ఆకాంక్షించారు. పట్టణ వైకుంఠపురం రోడ్డులో వేంచేసియున్న పోలేరమ్మ దేవస్థానం 27వ వార్షికోత్సవాలు మంగళ, బుధవారాలు కనులపండువగా నిర్వహించారు. పసుపు, కుంకుమలతో మేళ తాళాలు, కనక తప్పెట్లు, కాళికా వేషధారణలతో పురవీధుల్లో ఉరేగింపు ఉత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బుధవారం దేవస్థానం వద్ద భక్తులకు అన్న వితరణ చేశారు. విశేష సంఖ్యలో పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో గుంటి వెంకట్, పెద్దలు పాల్గొన్నారు. సూదివారిపాలెం సర్పంచ్కు పంచాయతీ రాజ్ అవార్డు ఇంకొల్లు(చినగంజాం): జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మండలంలోని సూదివారిపాలెం గ్రామ సర్పంచ్ గోరంట్ల జయలక్ష్మికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం చేశారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన పంచాయతీ రాజ్ దివస్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తున్న రాష్ట్రీయ గౌరవ గ్రామ సభ అవార్డుతో ఆమెను సత్కరించారు. వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా? ● పోలీసుల అదుపులో వెదుళ్లపల్లి రైస్మిల్లు యజమాని ● ఆరా తీస్తున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసులో రేషన్ మాఫియా పాత్రపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. హత్య కేసును విచారిస్తున్న పోలీసులకు రేషన్ మాఫియాపై అనుమానాలు తలెత్తినట్లు సమాచారం. నాగులుప్పలపాడుకు చెందిన చౌక బియ్యం వ్యాపారితో వీరయ్య చౌదరికి విభేదాలున్నాయి. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో కలిసి వ్యాపారం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని వెదుళ్లపల్లికి చెందిన రైస్మిల్లు యజమానిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరయ్య చౌదరి హత్యలో నిజంగా రేషన్ మాఫియా హస్తం ఉందా? లేక మరేదన్నా కారణమా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. పోలీసుల అదుపులో ముగ్గురు..? పొన్నూరు: పట్టణంలోని నిడుబ్రోలుకు చెందిన గోపి, అమీర్, అశోక్ అనే ముగ్గురిని ఒంగోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జరిగిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో వీరి పాత్రపై అనుమానంతో తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈ ముగ్గురు వెదుళ్లపల్లి మిల్లుకు రేషన్ బియ్యం రవాణా చేస్తున్నట్లు, ఈ క్రమంలో వీరి ప్రమేయంపై అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. -
ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఇప్పటంలో గౌడ పాలెంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామ స్వామి విగ్రహంతోపాటు పలు విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ మంత్రి జోగి రమేష్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ముందుగా గ్రామంలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌడపాలెంలో శ్రీ కోదండరామస్వామి, శ్రీ గణపతి, శ్రీ గంటలమ్మ, పోతురాజు, హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ రూరల్ అధ్యక్షుడు అమరా నాగయ్య, మంగళగిరి నియోజకవర్గ మాజీ జేసీఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ నేతలతో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. -
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్కుమార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
పహల్గాం ఉగ్రదాడి.. శాంతి ర్యాలీకి వైఎస్ జగన్ పిలుపు
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అన్నీ జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండీల్ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. వైఎస్ జగన్ పిలుపుతో ఈ రోజు సాయంత్రం పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిఅనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఖండించారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
పహల్గాం ఉగ్రదాడి.. ఏపీవాసుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఇందులో విశాఖ వాసి చంద్రమౌళి, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు. చంద్రమౌళి ఎస్బీఐ రిటైర్డ్ ఎంప్లాయి కాగా, మధుసూదన్ ఓ సాఫ్ట్వేర్ కంపెఈలో సీనియర్ ఆర్కిటెక్ట్గా పని చేస్తున్నారు. ఈ ఇద్దరి మృతిని ధృవీకరించిన కేంద్ర హోం శాఖ.. ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించింది.ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను కేంద్రం ప్రభుత్వం ఆదుకుని ఆండగా నిలవాలని వైఎస్ జగన్ కోరుతున్నారు. -
4న శ్రీవాసవీ దేవస్థానం కమిటీ సర్వసభ్య సమావేశం
తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం మే నెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు పాలకవర్గ బాధ్యులు మంగళవారం దేవస్థానం ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. కమిటీ ఉపాధ్యక్షుడు ఆకి అచ్యుతరావు, వుప్పల వరదరాజులు, దేసు శ్రీనివాసరావులు మాట్లాడారు. ముందుగా ఏప్రిల్ 13వ తేదీన సర్వసభ్య సమావేశం జరిపేందుకు నిర్ణయించి, ఆ ప్రకారం వెయ్యిమంది సభ్యులకు నోటీసులు పంపినట్టు గుర్తుచేశారు. దేవస్థానం కమిటీ జనరల్ బాడీలో సభ్యులు కానివారు, అన్య కులస్తులు వచ్చి గందరగోళ పరిస్థితులు సృష్టించిన కారణంగా సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలంటే కార్యవర్గం సమావేశమై, తేదీని నిర్ణయించి వెయ్యిమంది సభ్యులకు నోటీసుల ద్వారా తెలియపరచాల్సి ఉందన్నారు. నిర్ణయించిన తేదీన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, అక్కడ తీసుకునే నిర్ణయం అమలవుతుందని చెప్పారు. ఎవరుపడితే వాళ్లొచ్చి, ఏవేవో పుస్తకాలు పెట్టుకుని సభ్యులు కానివారితో సహా సంతకాలు పెట్టించుకుని తామే కమిటీగా ఎన్నికయ్యాం అంటే చెల్లుబాటు కాదన్నారు. ఈ నెల 13న రసాభాసతో సమావేశం వాయిదా పడిన తర్వాత ట్రైనీ అడిషనల్ ఎస్పీ సుప్రజ వచ్చి బైలా తీసుకెళ్లినట్టు గుర్తుచేశారు. 15 రోజుల సమయం తీసుకుని సమావేశం జరుపుదామని చెప్పినట్టే, వైశ్య కులదేవత శ్రీవాసవీ అమ్మవారి సాక్షిగా మే నెల 4వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. సభ్యులంతా హాజరై తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. అంతా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. సభ్యులకు నోటీసులు పంపుతున్నామని, ఆధార్ కార్డు, సమావేశం నోటీసు, ఐడీ కార్డు సహా సభ్యులు సమావేశానికి హాజరుకావాలని సూచించారు. పోలీసు బందోబస్తుతో సభ్యులనే లోనికి అనుమతిస్తారని తెలిపారు. వక్కలగడ్డ గంగాధర్, అన్నవరపు నరసింహారావు, గ్రంధి విశ్వేశ్వరరావు, మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, గొడవర్తి సాయి హరేరామ్, సుగ్గుల మల్లికార్జునరావు, నూకల భాస్కరరావు, కొల్లా గురునాథగుప్తా తదితరులు పాల్గొన్నారు. -
స్టైల్గా వచ్చాడు... చక్కగా కాజేశాడు!
మంగళగిరి టౌన్: ఓ వివాహానికి స్టైల్గా హాజరై... బంధువుగా మమేకమయ్యాడు. అందరితో చనువుగా ఉంటూ, భోజనం చేసి సుమారు 4 గంటలకు పైగా వారితో తిరిగాడు. చక్కగా చదివింపులు దోచుకుపోయాడు ఓ దొంగ. ఈ ఘటన మంగళగిరి పట్టణంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణం శివాలయం రోడ్డులో నివాసముంటున్న జి. చిన్ని తన కుమారుడు జి. సాంబశివరావు వివాహ వేడుకను ఆదివారం పట్టణ పరిధిలోని మార్కండేయ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి స్టైల్గా హాజరై అందరితోపాటు కూర్చున్నాడు. కొంతసేపు అక్కడివారితో మాట్లాడి చదివింపులు దగ్గరకు వెళ్లాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నటిస్తూ అటూ ఇటు తిరుగతూ హడావిడి చేశాడు. పెళ్లి వారితో కలిసి విందు భోజనం కూడా ఆరగించాడు. చదివింపుల దగ్గర ఓ పాప ఉండడం గమనించి ఈ డబ్బులు లోపల పెట్టు అంటూ గదమాయించాడు. దీంతో ఆ పాప పక్కన ఉన్న రూమ్లోకి వెళ్లి అక్కడ పెట్టి వచ్చేసింది. వెంటనే ఆ వ్యక్తి ఆ రూమ్లోకి వెళ్లి తలుపు దగ్గరకు వేసి ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. పాపను చదివింపుల డబ్బు ఎక్కడ అని అడగ్గా, ఓ అంకుల్ లోపల పెట్టమన్నాడని చెప్పడంతో లోపలికి వెళ్లి చూశారు. అక్కడ డబ్బు లేకపోవడంతో కంగుతిన్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదివింపుల నగదుతోపాటు బంధువులు, మిత్రులు కొంతమంది బంగారపు చైన్లు, ఉంగరాలు బహుమతులుగా ఇచ్చారని ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు. నగదు సుమారు రూ.3 లక్షలకుపైగా ఉంటుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. మంగళగిరి పట్టణ పోలీసులు కల్యాణ మండపంలో సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించి ఆ వ్యక్తి కదలికలకు గుర్తించారు. వినూత్నంగా దొంగతనం పెళ్లిలో చదివింపులు మాయం నిందితుడు -
అనాథలా వదిలేస్తే అక్కున చేర్చుకున్న ఆశ్రమం
తెనాలి: అందరూ ఉండీ అనాథలా ఆసుపత్రికి చేరిన అభాగ్యుడి దయనీయ స్థితిపై ‘మానవత్వమా...నీ జాడెక్కడా’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. తన పేరు, ఊరు చెబుతున్న రాధాకృష్ణమూర్తి అనే అరవై ఏళ్ల వృద్ధుడిని ఎవరో తీసుకొచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలేసి వెళుతున్నారు. ఒంటిపై దుస్తులు కూడా లేకుండా గొడవ చేస్తున్న అతడిని ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్ రూములో పడేశారు. ‘హెల్పింగ్ సోల్జర్స్’ సంస్థ బాధ్యులు అతడి పరిస్థితిని చూసి వస్త్రం కప్పి, ఆహారం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచనతో మున్సిపల్ ఆరోగ్య అధికారిణి డాక్టర్ హెలెన్ నిర్మల, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణితో చర్చించారు. అనంతరం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని కారుణ్య ఆశ్రమాన్ని సంప్రదించారు. రాధాకృష్ణమూర్తితోపాటు ఆసుపత్రిలోని మరో గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఆశ్రమానికి తరలించామన్నారు. -
ఉపాధ్యాయుల కేటాయింపుల్లో అసమానతలు సరిదిద్దాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపుల్లో నెలకొన్న అసమానతలను సరిదిద్దాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ బదిలీల చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టంలో పొందుపర్చిన అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలను నాలుగు రకాలుగా విభజించిన ప్రభుత్వం, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని వేర్వేరుగా నిర్ణయించడం తగదన్నారు. ఫౌండేషన్ స్కూల్లో 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు, మోడల్ ప్రైమరీ స్కూల్లో 20 మంది పిల్లలకు ఒకరు, హై స్కూల్ ప్రైమరీలో 10 మంది పిల్లలకు ఒక్కరు చొప్పున కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అన్ని పాఠశాలల్లో కేటాయింపులు ఒకే విధంగా ఉండాలని అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి మాట్లాడుతూ యూపీ పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను కేటాయించాలని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి మోడల్ ప్రాథమిక పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులను తప్పనిసరిగా కేటాయించాలని అన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల లభ్యతను బట్టి విద్యా విధానాన్ని మార్పులు చేయటం తగదన్నారు. దీనికి బుదులుగా ఒక ఉన్నతమైన విద్యా విధానాన్ని రూపొందించి, దానికి తగ్గట్టు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవగాహన సదస్సులో జిల్లా గౌరవ అధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎం. గోవిందు, ఎండీ షకీలా వేగం, కె.రంగారావు, బి.ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచండి
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అన్నారు. మంగళవారం చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో .. 35 మంది విద్యార్థినులకు 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి పూర్తి చేసుకున్న వారిని 6వ తరగతిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేర్పించడంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలతోపాటు ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యాశాఖాధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను తిరిగి చేర్పించే విధంగా తల్లిదండ్రులను నచ్చచెప్పాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వాటిపై అవగాహన పెంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా బడి ఈడు పిల్లలను ఆయా గ్రామాల్లోని ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచి, ప్రతి పాఠశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థుల సంఖ్య చేరేలా ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు షేక్ ఎండీ ఖాసిం మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థినులను ఇతర పాఠశాలలకు వెళ్లే అవసరం లేకుండా తమ పాఠశాలలోనే 6వ తరగతిలో చేరే విధంగా తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించినట్లు చెప్పారు. పాఠశాలలో చేరిన విద్యార్థినులు ఆధునిక బోధన, మౌలిక వసతులతో విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. గుంటూరు డీవైఈవో ఏసురత్నం, డీసీఈబీ కార్యదర్శి ఎ. తిరుమలేష్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రాబియా బస్రీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్లో సమష్టిగా కృషి చేయాలి జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన గుంటూరు వైద్యుడు
హెల్త్ యూనివర్సిటీ టాపర్గా డాక్టర్ పవన్కుమార్ గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల న్యూరో సర్జరీ వైద్య విభాగం పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పోలిశెట్టి జానకీ రామ పవన్కుమార్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం విడుదల చేసిన పీజీ పరీక్షా ఫలితాల్లో న్యూరో సర్జరీ వైద్య విభాగంలో 800 మార్కులకు 511 సాధించి డాక్టర్ పవన్కుమార్ వర్సిటీ టాపర్గా నిలిచాడు. కాకినాడకు చెందిన డాక్టర్ పవన్కుమార్ విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ పీజీ అభ్యసించారు. గుంటూరు జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ పీజీ ఎంసీహెచ్ న్యూరాలజీలో చేరారు. న్యూరో సర్జరీ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉండగా, ఒకరు యూనివర్సిటీ టాపర్గా నిలవగా, మరొకరు డాక్టర్ యాదరాల కృష్ణుడు యూనివర్సిటీ సెకండ్ ప్లేస్ సాధించారు. 800 మార్కులకు గాను 508 మార్కులు సాధించారు. పరీక్షా ఫలితాల్లో యూనివర్సిటీ టాపర్గా నిలిచిన డాక్టర్ జానకీ రామ పవన్కుమార్, డాక్టర్ యాదరాల కృష్ణుడులను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ కె.వి.సత్యనారాయణమూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ గొల్లా రామకృష్ణ, తదితరులు అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
చేబ్రోలు: ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఢీ కొన్న సంఘటనలో ఆటో డ్రైవర్ అక్కడక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్లకు చెందిన గోదాటి కిరణ్ (35) ఆటోలో గుంటూరులో ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని బాపట్లకు బయలు దేరాడు. మార్గ మధ్యలో చేబ్రోలు సినిమా హాలు దాటిన తరువాత వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఇంద్ర వాహనం ఢీ కొట్టింది. ఆటో నడుపుతున్న కిరణ్ తలకు బలమైన గాయవటంతో ఆటోలోనే అక్కడక్కడే మరణించాడు. ఆటోలో ఉన్న మిగిలిన ముగ్గురికి ఎటువంటి గాయాలు కాలేదు. చేబ్రోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కిరణ్ బాపట్ల పట్టణంలోని బేతానీ కాలనీ వాసిగా గుర్తించారు. 26 నుంచి ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులు లక్ష్మీపురం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ఏప్రిల్ 26, 27, 28వ తేదీలలో కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి కరపత్రాలు విడుదల చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బందెల నాసర్జీ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఈ సంవత్సరం అమలు చేయలేమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, వెంకట్, అజయ్, అమీర్, సాయి గణేష్, చందు, కిషోర్, ఏలియా, అశోక్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన పాలపర్తి మహేష్బాబు లైంగికంగా వేధిస్తున్నాడని ఈ నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు అందింది. పరారీలో ఉన్న నిందితుడిని రూరల్ ఎస్సై కె. ఆనంద్ మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిపై గతంలో ఆరు కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ తెరుస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రాథమిక విద్య గ్రామంలోనే కొనసాగించాలి అచ్చంపేట: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తమ గ్రామంలోనే నిర్వహించాలని, పాఠశాలను పక్కగ్రామాలకు తరలిస్తే తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని మండలంలోని ఓర్వకల్లు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన పిల్లలు తమ గ్రామంలోనే చదువుకోవాలంటూ నినాదాలు చేశారు. ఓర్వకల్లు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు వరకు ఉండేవి. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి 1,2 తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి 3,4,5 తరగతుల వారిని పక్క గ్రామమైన రుద్రవరానికి మార్చారు. దీంతో ప్రాథమిక విద్య మొత్తం తమ గ్రామంలోనే నిర్వహించాలంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. ధర్నా చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్, డీఈఓ, ప్రజాప్రతినిధులు జోక్యంచేసుకుని తమకు న్యాయం చేయాలంటూ మొర పెట్టుకున్నారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రోడ్డుపై బైఠాయించిన వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపచేశారు. -
అందరి కృషితోనే భూ పరిరక్షణ సాధ్యం
గుంటూరు ఎడ్యుకేషన్: భూమితోపాటు భూమిపై పచ్చదనాన్ని కూడా పరిరక్షించడం అందరి బాధ్యతగా గుర్తించాలని ఏపీ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ వైడీ రామారావు అన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో మంగళవారం ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రామారావు మాట్లాడుతూ భూమి పరిరక్షణకు అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. జిల్లా అటవీశాఖాధికారి హిమ శైలజ మాట్లాడుతూ విరివిగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రరాజు, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నజీనా బేగం , ఇంటాక్ గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రవి వడ్లమాని, పాఠశాల ప్రిన్సిపల్ హేమాంబ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, రెడ్ క్రాస్ వలంటీర్లు పాల్గొన్నారు. -
పత్తి రైతుపై విత్తన భారం
ధరలు పెంచడం బాధాకరం అసలే వ్యవసాయం గిట్టుబాటు కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచడం పుండు మీద కారం చల్లినట్లే. నేను ప్రతి సంవత్సరం 10 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తుంటాను. సుమారు 30 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. అంటే విత్తనాల కోసం అదనంగా రూ.వెయ్యికిపైగానే వెచ్చించాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో పత్తి పంట సాగు చేస్తున్నాం. ఏటా నష్టాలు చవిచూస్తున్నాం. ఇప్పటికై నా పత్తి విత్తన ధరలను తగ్గించాలి. –వంగా నవీన్రెడ్డి, జొన్నలగడ్డ, గుంటూరు రూరల్ మండలం ●కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులు ఖరీఫ్ సీజన్లో సుమారు 1.22 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఇందులో గుంటూరు జిల్లాలో 25 వేల హెక్టార్లు, పల్నాడు జిల్లాలో 97 వేల హెక్టార్లు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఇది ప్రధాన పంటల్లో ఒకటి. గుంటూరు, పల్నాడు జిల్లాలకు సుమారు 11 లక్షల విత్తన ప్యాకెట్లు డిమాండ్ ఉంటుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. 475 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర గతంలో రూ.864 ఉండగా, ప్రస్తుతం రూ.901లకు చేరింది. అంటే ప్యాకెట్కు రూ.37 పెరిగింది. దీంతో గుంటూరు, పల్నాడు జిల్లాల రైతులపై అదనంగా రూ.4.07 కోట్ల భారం పడనుంది. గత ఏడాది సాగు సమయంలో సరిగా వర్షాలు లేక, తర్వాత అధిక వర్షాలతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడింది. ఆ బాధ నుంచి కోలుకోకుండానే ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు పెరగడం ఇబ్బంది కలిగిస్తోంది. -
సివిల్స్లో 146వ ర్యాంకు సాధించిన రుద్రవరానికి చెందిన పవన్ కల్యాణ్
అచ్చంపేట: పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, రుద్రవరం గ్రామానికి చెందిన చల్లా పవన్ కల్యాణ్ ఆల్ ఇండియా స్థాయిలో 146వ ర్యాంకు సాధించాడు. ఈ ఘనతను సాధించిన పవన్ కల్యాణ్ను మండల ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. ప్రాథమిక సహకార సంఘ మాజీ అధ్యక్షుడు చల్లా రమేష్, భువనేశ్వరిల కుమాడుడైన పవన్ కల్యాణ్ ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచలంచెలుగా తన చదువుకు పదునుపెట్టాడు. చిన్నపటి నుంచి సివిల్స్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న పవన్ కల్యాణ్ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుంటూరులోని వెంకటేశ్వర బాలకుటీర్లో పూర్తిచేశాడు. పదిలో 10 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. గుంటూరు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన పవన్ 987 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఎన్ఐఐటీ, తిరుచురాపల్లిలో సీటు సాధించాడు. బీటెక్ అయిపోగానే కొలిన్స్ ఎయిరో స్పేస్లో కాలేజ్ కాంపస్ ప్లేస్మెంట్ సాధించాడు. అయితే సివిల్స్ మీద ఉన్న మక్కువతో వచ్చిన అవకాశాన్ని వదులుకుని, ఢిల్లీ వెళ్లి స్వయం కృషితో పాతకాలం నాటి మెటీరియల్స్ మొత్తం సేకరించి తన మేథస్సుకు పదునుపెట్టి సివిల్స్లో ఆల్ ఇండియా 146వ ర్యాంక్ సాధించాడు. -
కష్టపడ్డాడు.. కలలు నెరవేర్చుకున్నాడు
సివిల్స్లో 797వ ర్యాంకు సాధించిన సత్తెనపల్లికి చెందిన పెండెం ప్రత్యూష్సత్తెనపల్లి: లక్ష్యం, కృషి, పట్టుదల, ప్రణాళిక ఉంటే అపురూప విజయం సాధ్యమవుతుందని పేద కుటుంబానికి చెందిన విద్యార్థి నిరూపించారు. అందుబాటులోని వనరులను వినియోగించుకొని సివిల్స్ విజేతగా నిలిచారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన పెండెం ప్రత్యూష్. సివిల్స్లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరిలో ప్రత్యూష్ 797వ ర్యాంకు సాధించారు. సాధారణ దళిత కుటుంబంలో జన్మించిన ప్రత్యూష్ బాల్యం నుంచి ఎంతో ఇష్టంతో చదివారు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ విజేతగా నిలిచి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సత్తెనపల్లి పట్టణంలోని 31వ వార్డు అంబేడ్కర్నగర్కు చెందిన పెండెం బాబురావు, యనమాల పద్మ దంపతుల కుమారుడు ప్రత్యూష్. తండ్రి పెండెం బాబురావు న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. తల్లి యనమాల పద్మ గృహిణి. ప్రత్యూష్ రెండు పర్యాయాలు ప్రయత్నించి, మూడవసారి కసితో రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరిలో జాతీయస్థాయిలో 797వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. ప్రత్యూష్ సత్తెనపల్లిలోని హోలీ ఫ్యామిలీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదివి, టెన్త్లో 9.7 గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్లో 970 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యనభ్యశించాడు. 2023–24 ఆంత్రోపాలజీ ఆప్షన్గా తీసుకొని ఓ పక్క వైద్యుడిగా వైద్య సేవలు అందిస్తూనే మరో పక్క సివిల్స్కు ప్రిపేర్ అవుతూ జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించాడు. చదువుకు పేదరికం అడ్డం కాదు చదువుకు పేదరికం అడ్డం కాదు. పేదరికం వేధిస్తున్నా అందుబాటులో ఉన్న పుస్తకాలు, వనరులను వినియోగించుకొని చదువుకోవచ్చు. విద్యార్థి దశ నుంచి ఉన్నతాధికారి కావాలనే లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్య సాధనకు ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకోవాలి. ఇంటర్నెట్, గ్రంథాలయాలు, మ్యాగజైన్లు వంటివి చదవాలి. నిత్యం 6–8 గంటల పాటు చదవడం, చదివిన దానిని ఆకలింపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎటువంటి శిక్షణ తీసుకోకపోయినా పట్టుదలతో చదివితే ఖచ్చితంగా విజయం అందుకోవచ్చు. – పెండెం ప్రత్యూష్ -
గుంటూరు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పోలేరమ్మ తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు కొండపాటూరు (ప్రత్తిపాడు): భక్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే జగజ్జననిగా విరాజిల్లుతున్న శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మ వారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేకువజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం దేవాలయం సమీపంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అమ్మ వారిని దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా సిడిమాను.. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో ప్రధాన ఘట్టం సిడిమాను ఊరేగింపు. ఒక పెద్ద దూలానికి చివరి భాగాన ఒక ఇనుప బోను ఏర్పాటు చేసి అందులో ఒక సిడిపోతును ఏర్పాటు చేశారు. సిడిమానుకు రైతులు పండించిన వివిధ రకాల పంటల దిగుబడులు, ధాన్యాలు కట్టి తమను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. సిడిమానును అమ్మ వారి స్వరూపంగా భావించి శిడిమాను బయలుదేరే సమయంలో సిడిపోతుపైకి భక్తులు జీడికాయలు విసురుతారు. ఆ కాయలు బోనులో ఉన్న మేకపోతుకు తాకితే తమ కోర్కెలు నెరవేరుతాయని అనాదిగా భక్తుల నమ్మకం. అనంతరం సిడిమానుకు గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం గుంటూరు, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట డిపోల నుండి ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.7న్యూస్రీల్ వైభవోపేతంగా అమ్మవారి తిరునాళ్ల దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం కనుల పండువగా సిడిమాను ఉత్సవం -
లా అండ్ ఆర్డర్ ఉందా?
అద్దంకి రూరల్: ‘‘అధికారం వచ్చిందని ఏదైనా చేస్తారా.. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగితే లా అండ్ ఆర్డర్ ఏమైంది. దాడి జరిగిన విషయం అక్కడి ఎస్సైకి తెలియదా... ఎందుకు ఇంతవరకు కేసు కట్టలేదు’’ అంటూ వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బల్లికురవ మండల కన్వీనర్ను స్టేషన్కు పిలిపించి బెదిరించటం, వైఎస్సార్ సీపీకి చెందిన వారిపై దాడి జరిగితే ఎస్సై స్పందించడా అని ప్రశ్నించారు. బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామంలో టీడీపీ సానుభూతిపరుల దాడిలో తీవ్రంగా గాయపడి అద్దంకి వైద్యశాలలో చికిత్స పొందుతున్న గోపిరాజుయాదవ్ను నాగార్జున మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గోపిరాజు యాదవ్పై ఇప్పటికి మూడుసార్లు దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి కొట్టటం, మరోసారి కత్తితో నరకటం, ఇప్పుడు కర్రలతో దాడి చేయడమేమిటని ప్రశ్నించాడు. అతను సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడనా, బీసీ కులస్తుడు పేదవాడు ఏమీ చేయలేడనా, దాడి చేశారని ప్రశ్నించారు. అధికారం వచ్చిందని ఏమైనా చేస్తామంటే సరిపోదన్నారు. సోమవారం దాడి జరిగితే ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకపోవటం ఏమిటని ప్రశ్నించారు. అక్కడ ఎస్సైకి దాడి చేసిన విషయం తెలియదా అన్నారు. దాడి విషయమై తాను ఎస్పీతో మాట్లాడానని, ఆయన వెంటనే స్పందించి కేసు రిజిస్టర్ చేయిస్తామని చెప్పామన్నారు. ఉన్నతాధికారి స్పందించిన విధంగా స్థానిక ఎస్సై, సీఐ ఎందుకు స్పందించలేదని అన్నారు. అక్కడ ఎస్సై ఏమి చేస్తున్నాడన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీతోపాటు తామంతా అండగా ఉంటామని ఈ విషయాన్ని మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి సునిశితమైన విచారణతో దాడికి పాల్పడ్డవారిని శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. నాగార్జున వెంట బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పానెం హనిమిరెడ్డి సోదరులు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అద్దంకి పట్టణ వైఎస్సార్ అధ్యక్షడు కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ అద్దంకి మండల కన్వీనర్ జగన్మోహన్రెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వుట్ల నాగేశ్వరరావు సర్పంచ్ నగేష్, కోల్లా భువనేశ్వరి, షేక్ అబిదా, వార్డు కౌన్సిలర్లు, ఇన్చార్జిలు, స్థానిక నాయకులు ఉన్నారు. బీసీ సామాజికవర్గీయుడిపై దాడి జరిగితే కనిపించలేదా? వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున -
సివిల్స్లో విజయ్బాబుకు 681వ ర్యాంక్
ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా చేస్తున్న విజయ్బాబు తెనాలి: సివిల్స్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబు మరోసారి విజయం సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయనకు 681వ ర్యాంకు లభించింది. ఐఆర్ఎస్ అధికారి దోనేపూడి మధుబాబు, రాజ్యలక్ష్మిల కుమారుడు విజయ్బాబు. 2021లోనే సివిల్స్ రాసి అప్పట్లో 682 ర్యాంకు సాధించారు. 22 ఏళ్ల వయసులోనే ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. ప్రస్తుతం విజయవాడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ ఆయన తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్ సాధించారు. ఐఏఎస్/ఐపీఎస్ సాధించాలన్న పట్టుదలతో ఉద్యోగ బాధ్యతల్లో కొనసాగుతూ సివిల్స్ రాశారు. ప్రస్తుతం 681 ర్యాంకుతో మళ్లీ మెరిశారు. ఈ పర్యాయం ఐపీఎస్ వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. -
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్గా సుజిత్ మల్లిక్
లక్ష్మీపురం: సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్కు నూతన కమిషనర్గా సుజిత్ మల్లిక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు కన్నవారితోటలోని సెంట్రల్ జీఎస్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన భువనేశ్వర్ నుంచి గుంటూరుకు ప్రమోషన్పై వచ్చారు. రూర్కెలాలోని ఆర్ఈసీ నుంచి బీఈ (మెకానికల్ ఇంజినీరింగ్) పూర్తి చేశారు. ఒడిశాలోని ఆంగుల్లో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్లో పనిచేశారు. ఆయన 2007లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)లో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసిన తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్కు (సీబీఐసీ) తిరిగి వచ్చారు. తర్వాత ఆయన భువనేశ్వర్ జోన్లో జీఎస్టీ కస్టమ్స్ విభాగాల్లో పనిచేశారు. వివిధ విభాగాలలో సేవలందిస్తూనే, ఆయన సైబర్ లా – సైబర్ ఫోరెన్సిక్స్లో పీజీ డిప్లొమా పొందారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలన
వెలగపూడి(తాడికొండ): తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామంలోని సచివాలయం సమీపంలో మే 2వ తేదీన జరగనున్న అమరావతి తదితర శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజలతో కలిసి మంగళవారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. హెలీప్యాడ్ నిర్మాణం, ప్రధాని రోడ్ షో సాగే మార్గాలు, ప్రధాన వేదిక, పబ్లిక్, వీవీఐపీ, గ్యాలరీల వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏర్పాట్లు నిర్దేశిత సమయం కంటే ముందే వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎం.నవీన్ కుమార్, అడిషనల్ ఎస్పీ సుప్రజ, ఆర్డీవో కె. శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. మేయర్ ఎన్నికకు 28న ప్రత్యేక సమావేశం నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నెహ్రూ నగర్: గుంటూరు నగర మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ఉత్తర్వులను అనుసరించి, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ ఎన్నికకు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. భార్గవ్ తేజను ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల అధికారి ద్వారా ఈ నెల 24 లోపు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లకు, ఎక్స్ అఫిషియో సభ్యులు 28న ప్రత్యేక సమావేశానికి హాజరు కావలసినదిగా నోటీసులు అందనున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 28న ఉదయం 11 గంటలకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మేయర్ ఎన్నిక జరుగుతుందని ఎలక్షన్ అథారిటీ, సీడీఎంఏ డాక్టర్ పి. సంపత్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలేరమ్మ వారి వార్షికోత్సవాలు తెనాలి: స్థానిక వైకుంఠపురం దేవస్థానం సమీపంలోని శ్రీ పోలేరమ్మ వారి ఆలయం 27వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఉదయం విశేష పూజలు చేశారు. రాత్రి ఏడు గంటలకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, విశేష అలంకరణతో మేళతాళాలు, కాళికా వేషం, భాజా భజంత్రీలతో తెనాలి పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఆలయ ధర్మకర్త వీరయ్య, గుంటి వెంకట్ ఆధ్వర్యంలో వేడుకలను జరిపారు. బుధవారం ఉదయం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై చర్చకు వినతి గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని కోరారు. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్లో అసోసియేషన్ నాయకులతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్ల సమస్యలు అనేకం ఉన్నాయన్నారు. జేఎస్సీ సమావేశం ఏర్పాటుతో అనేక అంశాలు చర్చించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.60 అడుగుల వద్ద ఉంది. ఇది 139.6134 టీఎంసీలకు సమానం. -
UPSC CSE 2024:: తెలుగు అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. వారు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Congratulations to all The Telugu Aspirants who have excelled in UPSC Civil Services 2024. Wishing you even greater success in the future and hoping you continue to bring pride to our state and nation.#UPSC— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025 -
జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు.జమ్మూకశ్మీర్ దుర్ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పహెల్ గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025టూరిస్టులపై కాల్పులుమంగళవారం జమ్మూ కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా పహెల్ గామ్లో బైసరీన్ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్లో గన్పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్. -
ఏలూరు సాక్షి కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం
ఏలూరు,సాక్షి: ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించాడు. మంగళవారం తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీస్లో దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సాక్షి జిల్లా కార్యాలయంలోని కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే బాధితుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వేధింపులు తాళలేక బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో తిరగనివ్వను. సాక్షి పత్రిక ప్రతులను తాడేపల్లి గూడెం దాటనివ్వను.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడు బాబురావును అసలు చూడలేదని దబాయిస్తూనే బాబూరావు వివాదం వివరాలన్నీ చింతమనేని ప్రభాకర్ బయటపెట్టడం గమనార్హం.👉గమనిక: చింతమనేని ఆగడాలపై ‘ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణం’ అంటూ రాసిన సాక్షి కథనాన్ని యథాతధంగా ప్రచురిస్తున్నాం ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్తతర్పణంకొద్ది నెలల క్రితం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఉసులూరి సత్యనారాయణ, బోస్, నాగబోయిన సత్యనారాయణ కోరారు. అన్ని అనుమతులతో వస్తే అభ్యంతరం లేదని బాబూరావు తెలిపారు.అయితే ఎలాంటి అనుమతులూ లేకుండానే అడ్డగోలుగా నెల రోజుల్లోనే సుమారు 2,000 లారీల గ్రావెల్ను తవ్వేశారు. ఇదేమిటని ప్రశి్నంచిన దాసరి బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఈ దారుణంపై దెందులూరు తాహసీల్దార్, మైనింగ్ ఏడీ, ఏలూరు ఎస్పీ, దెందులూరు ఎస్సైలకు మూడు నెలల క్రితమే బాబూరావు ఫిర్యాదు చేశారు. జనసేన, టీడీపీ పార్టీ కార్యాలయాల్లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.మరోవైపు తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలని.. లేకుంటే అంతు చూస్తానని చింతమనేని ప్రభాకర్ నుంచి బాబూరావుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబూరావు, ఆయన భార్య నాగలక్ష్మి సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగడంలేదన్న ఆవేదనతో ఒక్కసారిగా ఎన్టీఆర్ విగ్రహం ఎదుట బాబూరావు తన ఎడమ చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆయన భార్య అడ్డుకుని హుటాహుటిన తన భర్తను ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యే శరణ్యం ‘కొద్ది నెలలుగా మా పొలంలో టీడీపీ నేతలు గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలను ఆపి న్యాయం చేయండని తహసీల్దార్ నుంచి ఎస్పీ వరకూ మొరపెట్టుకున్నా ఫలితం లేదు. ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకోకపోగా మాపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు.. ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కాగితాలపై సంతకాలు పెట్టాలని ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీబీలు, లారీలు అన్నీ మా పొలం వద్దే ఉన్నాయి. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.’ – నాగలక్ష్మి, బాబూరావు భార్య -
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
ప్రయాణికుల భద్రతే డ్రైవర్, గార్డుల లక్ష్యం
సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ రవికిరణ్ లక్ష్మీపురం: రైలు ప్రయాణికుల భద్రతే డ్రైవర్, గార్డుల లక్ష్యమని, రైలును సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడంలో ఇద్దరూ చాలా కీలకం అని సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ మద్దాలి రవికిరణ్ అన్నారు. రైలు భద్రత చర్యల పై మీడియా పర్యటన కార్యక్రమంలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్లో సోమవారం ఆయన అసిస్టెంట్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ సీహెచ్. బాపయ్య, డీసీఎం కమలాకర్బాబుతో కలసి 4వ నంబర్ ప్లాట్ఫారంపై ఉన్న క్రూ లాబీ, స్టేషన్ పశ్చిమాన రన్నింగ్ రూమ్లను పరిశీలించారు. సిబ్బంది పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ డివిజన్లో 227 మంది లోకో పైలట్లు, 138 మంది రైలు మేనేజర్లు ఉన్నారని తెలిపారు. స్టేషన్లో ఉన్న క్రూ లాబీ పని చేసే విధానాన్ని వివరించారు. విధుల సమయంలో ఎదురయ్యే సమస్యలను సిబ్బంది క్రూ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎస్)లో కూడా రికార్డు చేయవచ్చని చెప్పారు. క్రూ లాబీలో లోకో పైలెట్ సైన్ ఇన్ చేసి, సైన్ ఆఫ్ చేసిన తరువాత సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తామని వివరించారు. మద్యంపై పాజిటివ్గా వచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది విధులకు వెళ్లేటప్పుడు ఫాగ్ సేఫ్ డివైస్ (ఎఫ్ఎస్డి) పరికరాలు వాకీ టాకీ అందిస్తామని చెప్పారు. సెల్ఫోన్లు క్రూ లాబీలో ఉంచాలని, లోకో పైలెట్ వెంట తీసుకు వెళ్లకూడదని తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ రవిరాజు, డివిజన్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కిశోర బాలికల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జేడీ శిరీష గుంటూరు ఎడ్యుకేషన్: కిశోర బాలికల సమగ్రాభివృద్ధికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. శిరీష పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో కిశోర బాలికల కోసం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై రూపొందించిన ప్రత్యేక కేలండర్పై సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని వివిధ శాఖ అధికారులు, సిబ్బందికి ప్రాంతీయ వర్క్షాప్ నిర్వహించారు. యూనిసెఫ్ సహకారంతో నిర్వహించిన వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న శిరీష బాల్య వివాహాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలల హక్కులు, పోషణ–ఆరోగ్యం, లింగ సమానత్వం, విద్య ఆవశ్యకత, నైపుణ్యాభివృద్ధి–ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కిశోర వికాసంపై గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై చర్చించారు. జిల్లాల వారీగా రూపొందించిన కార్యాచరణకు అనుగుణంగా పని చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. వర్క్షాప్లో జాయింట్ డైరెక్టర్ బి. మనోరంజని, ప్రాంతీయ డెప్యూటీ డైరెక్టర్ ఎస్. జయలక్ష్మి, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కేవీఏఎస్ విజయలక్ష్మి, డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, ప్రోగ్రాం మేనేజర్ కె. కమల్కుమార్, నాగమల్లేశ్వరి, సీడీపీవోలు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ప్రత్తిపాడు: ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలోని సీతారామాంజనేయ స్వామి కల్యాణ మండపంలో సోమవారం వెలుగు ఏపీఎంలు, సీసీలు, వీవోఏలతో సమావేశాన్ని నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, పథకాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మహిళల ముంగిటకు మరెన్నో అవకాశాలను తీసుకొస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బూర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ‘డ్వాక్రా’ అని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళ వ్యాపారవేత్తగా తయారవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. పెమ్మసాని ఆధ్వర్యంలో కేంద్ర దీన్ దయాళ్ ఉద్యోగ్ గ్రామ కౌశిక్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలను చేసేందుకు నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళను గుర్తించనున్నామని తెలిపారు. డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 151 గ్రామైక్య సంఘాల్లో ఐదు వేల ఎస్హెచ్జీ గ్రూపులు, 51 వేల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని తెలిపారు. వీరంతా 25 ఏళ్లుగా పొదుపులు తీసుకుని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నా, జీవనోపాదుల కార్యక్రమం ఆశించినంతగా జరగడం లేదని తెలిపారు. అందువల్ల ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల వెలుగు ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదే లక్ష్యంతో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం -
జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డి హైదరాబాద్కు బదిలీ
నేడు బాధ్యతలు స్వీకరించనున్న సుజిత్ మల్లిక్ లక్ష్మీపురం: ఉద్యోగుల సమష్టి సహకారంతోనే రెవెన్యూ పరంగా సెంట్రల్ జీఎస్టీ శాఖను అగ్రస్థానంలో నిలబెట్టగలిగానని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కమిషనర్గా సుజిత్ మల్లిక్ మంగళవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా స్థానిక కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నరసింహారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో గుంటూరు కమిషనరేట్తో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరువలేనని తెలిపారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కె.యుగంధర్, గాదె శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అనంతరం ఉద్యోగులు కమిషనర్ను ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బి. రవికుమార్, సూపరింటెండెంట్లు గాదె శ్రీనివాసరెడ్డి, కె.యుగంధర్, నవీన్ రాజు, చీదెళ్ల ఈశ్వరరావు, చిట్టే వెంకటేశ్వరరావు, కాకర్ల శ్రీనివాస్, పూర్ణ సాయి పాల్గొన్నారు. లేబర్ కోర్టు ఏజీపీగా ఫారూఖ్ గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని లేబర్ కోర్టుకు ఏజీపీగా షేక్ ఫరూక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అర్జీల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలి
డీఆర్వో షేక్ ఖాజావలి గుంటూరు వెస్ట్: సమస్యలపై ప్రజల నుంచి వచ్చే అర్జీలను మరింత వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని, అధికారులు సమన్వయం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజలు కూడా అర్జీలను స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చని సూచించారు. దీంతో స్థానిక సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన 290 అర్జీలను ఆయనతో పాటు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి, డీపీఓ సాయి కుమార్, జిల్లా అధికారులు పరిశీలించారు. -
హెల్త్ యూనివర్సిటీ టాపర్గా గుంటూరు వైద్యుడు
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ పప్పిరెడ్డి కార్తిక్రెడ్డి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో టాపర్గా నిలిచాడు. డీఎం న్యూరాలజీ పరీక్ష ఫలితాల్లో 800 మార్కులకు గాను 649 సాధించి హెల్త్ యూనివర్సిటీలో ప్రథమ స్థానం సాధించాడు. ద్వితీయ, తృతీయ స్థానం కూడా గుంటూరు జీజీహెచ్ వైద్యులే సాధించి రికార్డు సృష్టించారు. డాక్టర్ అజ్మ హెల్త్ యూనివర్సిటీ సెకండ్ టాపర్గా, డాక్టర్ కాంతిమాల థర్డ్ టాపర్గా నిలిచి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో మారుమోగేలా చేశారు. స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్ ప్రదానం యూనివర్సిటీ టాపర్గా నిలిచిన డాక్టర్ కార్తిక్రెడ్డికి హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం రోజు గోల్డ్మెడల్ అందిస్తారు. కాగా, హెల్త్ యూనివర్సిటీ పరీక్షా ఫలితాల్లో డీఎం న్యూరాలజీలో వరుసగా మూడు సార్లు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్యులే టాపర్లుగా నిలిచి చరిత్ర సృష్టించారు. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఉన్నాయి. పరీక్ష రాసిన నలుగురిలో ముగ్గురు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు యూనివర్సిటీ స్థాయిలో సాధించి రికార్డు సృష్టించారు. గుంటూరు జీజీహెచ్లో న్యూరాలజీ అభ్యసించిన డాక్టర్ లలిత, డాక్టర్ గొట్టిపాటి బిందునర్మద హెల్త్ యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, మూడో సారి డాక్టర్ పి.కార్తిక్రెడ్డి గోల్డ్ మెడల్ అందుకోనున్నారు. కడపకు చెందిన డాక్టర్ పప్పిరెడ్డి కార్తిక్రెడ్డి కర్నూలులో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యనభ్యసించి సూపర్స్పెషాలిటీ పీజీ న్యూరాలజీ గుంటూరులో చేరాడు. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన డాక్టర్ కార్తిక్రెడ్డిని, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన డాక్టర్ అజ్మా, డాక్టర్ కాంతిమాలను గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అభినందించారు. ఆయన గైడెన్స్ వల్లే తాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించగలిగానని డాక్టర్ కార్తిక్రెడ్డి తెలిపారు. -
ఉద్యోగాల పేరిట టోకరా
నగరంపాలెం: ఉద్యోగాల పేరిట మోసగించారంటూ పలువురు బాధితులు వాపోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కొలువులు ఇప్పిస్తామని ఆశ చూపి, లక్షల్లో కాజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఏఎస్పీ (పరిపాలన) జి.వి.రమణమూర్తి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి మొరను ఆలకించారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. డీఎస్పీలు శివాజీరాజు (క్రైం), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్) కూడా అర్జీలు స్వీకరించారు. రూ. లక్షల్లో కాజేశారని బాధితుల ఆవేదన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొర -
నేడు కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల
కొండపాటూరు(కాకుమాను): భక్తుల కొంగు బంగారమైన కొండపాటూరు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ప్రధాన ఘట్టం శిడిమాను మహోత్సవం ఒక పెద్ద దులానికి చివరి భాగాన ఇనుప బోనును ఏర్పాటు చేస్తారు. అందులో మేకపోతును ఉంచి సాయంత్రం ఆరు గంటల సమయంలో గ్రామ పురవీధులలో మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగిస్తారు. శిడిమాను బయలుదేరే ముందు శిడి పెడ్లి కొడుకుని ప్రత్యేకంగా అలంకరించి, దేవాలయ కమిటీ సభ్యులు గ్రామ పురవీధుల్లో తిప్పుతారు. దీంతో శిడిమాను బయలు దేరేందుకు సిద్ధమైందని గ్రామస్తులంతా దేవాలయం వద్దకు చేరుకుంటారు. సోమవారం దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు శిడిమానును ఏర్పాటు చేశారు. ఆ పెద్ద దూలానికి రైతులు పండించిన వివిధ రకాల పంటలను కట్టి, చల్లంగా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నారు. తిరునాళ్లలో వినోదం అందిచేందుకు రంగుల రాట్నాలు, జెయింట్ వీల్లను ఏర్పాటు చేశారు. చిన్నారులకు ఆట వస్తువులు, గృహోపకరణాల దుకాణాలు ఏర్పాటు చేశారు. -
భళా.. రామకృష్ణ విద్యా తృష్ణ
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. సోమవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన పీజీ సూపర్ స్పెషాలిటీ పరీక్ష ఫలితాల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. కార్డియాలజీలో పీజీ పూర్తి చేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నాలుగు పీజీ వైద్య విద్యలు జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, న్యూరాలజీ, కార్డియాలజీ అభ్యసించారు. ఇన్ఫెక్షన్ డిసీజెస్, డయాబెటాలజీలో డిప్లొమో కోర్సులు పూర్తి చేశారు. చావలి వాస్తవ్యులు గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలికి చెందిన గాజుల వీరశేఖరరావు, లీలావతి దంపతుల కుమారుడు రామకృష్ణ గుంటూరు ఎల్ఈఎం స్కూల్లో 7వ తరగతి వరకు చదివారు. బాలకుటీర్ స్కూల్లో 8 నుంచి 10వ తరగతి వరకు, గుంటూరు జేకేజీ కళాశాలలో ఇంటర్ అభ్యసించారు. గుంటూరు వైద్య కళాశాలలో 1986 – 92లో ఎంబీబీఎస్, 1998– 2000లో పల్మనాలజీలో పీజీ చేశారు. 2001 నుంచి 2004 వరకు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2006 వరకు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో ట్యూటర్గా పని చేశారు. 2006 నుంచి 2009 వరకు జనరల్ మెడిసిన్లో గుంటూరులో పీజీ అభ్యసించారు. 2009 నుంచి 2011 వరకు గుంటూరు జీజీహెచ్లో జనరల్ మెడిసిన్ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతి సిమ్స్లో న్యూరాలజీలో పీజీ వైద్య విద్యను అభ్యసించారు. 2014 నుంచి నేటి వరకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తూ 2022లో అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. పీజీ నీట్ ఎంట్రన్స్లో ర్యాంకు సాధించి కార్డియాలజీ సూపర్స్పెషాలిటీ పీజీలో మంగళగిరి ఎన్నారైలో చేరారు. నేడు విజయవంతంగా కార్డియాలజీ పీజీ కోర్సు పూర్తి చేసుకుని, నాలుగు పీజీలు చదివిన ఏకై క వైద్యుడిగా అరుదైన రికార్డు డాక్టర్ రామకృష్ణ సొంతం చేసుకున్నారు. క్రీడల్లోనూ ప్రతిభ తిరుపతిలో పీజీ వైద్య విద్యార్థిగా ఉన్న సమయంలో డాక్టర్ గాజుల రామకృష్ణ 86 స్పోర్ట్స్ మెడల్స్ దక్కించుకున్నారు. 33 న్యూరాలజీ క్విజ్ పోటీల్లో విజేతగా నిలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో నేషనల్ క్విజ్ పోటీలో విన్నర్గా నిలిచారు. -
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ధ్వజం ● కూటమి సర్కార్ దగా ప్రభుత్వం ● పంటలకు గిట్టుబాటు ధర కరువు ● అల్లాడుతున్న రైతులు
పట్నంబజారు: కూటమి సర్కార్ దగా ప్రభుత్వమని, ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలకోరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని ధ్వజమెత్తారు. జేకేసీ కళాశాల రోడ్డులోని ఒక ప్రైవేట్ హోటల్లో సోమవారం వైఎస్సార్ సీపీ 3వ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పలు అంతర్గత అంశాలతో పాటు వివిధ సమస్యలపై నేతలు కూలంకషంగా చర్చించారు. పలు అంశాలను ప్రతిపాదించి, ఆమోదించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మాట్లాడానని, రూ. 11,801 గిట్టుబాటు ధర కల్పిస్తామని అసెంబ్లీ సాక్షిగా, పలు సమావేశాల్లో చెప్పిన చంద్రబాబు ఒక్క టిక్కీ కూడా కొనలేదని మండిపడ్డారు. గుంటూరులో శంకర్ విలాస్ వద్ద ఆర్వోబీ నిర్మా ణాన్ని రూ. 98 కోట్లతో చేపట్టడం వల్ల ప్రజలకు మంచి కంటే చెడు అధికంగా జరిగే అవకాశం ఉందని, దీనిపై పునరాలోచించాలని ప్రభుత్వానికి అంబటి సూచించారు. 2104–19 మధ్యలోనే రూ. 167 కోట్లతో ఐకాన్ బ్రిడ్జి ప్రపోజల్ చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు రూ. 98 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం ఎలా పూర్తవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పు డున్న పరిస్థితుల్లో రూ. 300 కోట్లుతో నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ● వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణం అంశంలో ఒక అడ్వైజరీ కమిటీ వేసి చర్చించాలని సూచించారు. కేవలం ముగ్గురు, నలుగురు కలిసి తీసుకునే నిర్ణయం కాదన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి గుంటూరుతో అసలు సంబంధం లేదని, ఆయనకు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నగర అధ్యక్షులురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, తెనాలి మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మెట్టు వెంకటప్పారెడ్డి, మండేపూడి పురుషోత్తం, ఈమని రాఘవరెడ్డి, సీడీ భగవాన్, కొత్తా చిన్నపరెడ్డి, శేషగిరి పవన్, కొరిటిపాటి ప్రేమ్కుమార్, మామిడి రాము, విజయ్, నందేటి రాజేష్ పాల్గొన్నారు. -
మహిళలను రాత్రి వేళ నిర్బంధించిన పోలీసులు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): పోలీసు యంత్రాంగం టీడీపీ నేతలకు దాసోహమై మహిళలపై వేధింపులకు దిగారు. సోమవారం రాత్రివేళ మహిళలను స్టేషన్కు పిలిపించిన పాత గుంటూరు పోలీసులు దాదాపు మూడు గంటల పాటు నిర్బంధించారు. వైన్ షాపు ఏర్పాటుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు బనాయించి బెదిరింపులకు పాల్పడ్డారు. కొద్దిరోజులుగా గుంటూరు నందివెలుగు రోడ్డులో మణిహోటల్ సెంటర్ వద్ద లక్కీ వైన్స్ దుకాణ ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. మసీదు, ఆలయం, దగ్గర్లోనే పాఠశాలలు కూడా ఉన్నందున నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 20న కూడా స్థానికులు నిరసన తెలియజేసి అడ్డుకున్నారు. దీనిపై బార్ నిర్వాహకుడు ఫిర్యాదు మేరకు పాత గుంటూరు పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి అడ్డుకున్నారంటూ స్థానికులపై కేసు నమోదు చేశారు. స్థానికులు బీరం సునీత, పద్మారెడ్డి, షేక్ సైదా, పవన్, గోిపీలతోపాటు, మరికొంత మందిపై వైన్ షాపును అడ్డుకున్నారంటూ అక్రమ కేసు బనాయించి సతాయిస్తున్నారు. రాత్రి 7 గంటలకు పిలిచి 9.30 గంటల వరకు.. పోలీసులు అక్రమ కేసు బనాయించడమే కాకుండా ఆ మహిళలు స్టేషన్కు రావాలంటూ బెదిరింపులకు దిగారు. రాత్రి ఏడు గంటలకు వారిని పాత గుంటూరు స్టేషన్కు పిలిపించిన పోలీసులు 9.30 గంటల వరకు కూర్చోబెట్టారు. వైన్ షాపును వ్యతికేరిస్తున్న అందరి పేర్లు చెప్పాలని బెదిరించారు. మరోవైపు వైన్ షాప్ నిర్వాహకులు తమపై దాడిచేశారంటూ స్థానికులు చేసిన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదు. వైన్షాపునకు సంబంధించిన వ్యక్తులు వెంకట్, నాగరాజు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానికులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య చేపట్టలేదు. వైన్ షాప్ వద్దని నిరసన తెలిపినందుకు అక్రమ కేసు టీడీపీ నేతల అండదండలతో పోలీసుల ఓవర్ యాక్షన్ -
చంద్రబాబు అబద్ధాలకోరు
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025100 రకాల మొక్కల పెంపకం లక్ష్యం ● 58 ఏళ్ల వయస్సులో కార్డియాలజీ పీజీ పూర్తి చేసిన గుంటూరు వైద్యుడు ● గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుదైన రికార్డు ● నాలుగు పీజీలు పూర్తి ● దక్షిణ భారతంలోనే తొలి పార్కు ● 40 రకాల పైకస్ జాతుల మొక్కలు, చెట్ల పెంపకం ● నిర్వహణను గాలికొదిలేసిన మున్సిపాలిటీ ● కనీసం మొక్కలకు నీరు పెట్టని నిర్లక్ష్యం ● పార్కు మొత్తం అడవిని తలపిస్తున్న గడ్డి ● అందమైన లైట్లు చోరుల పాలు ● నిర్లక్ష్యానికి నిలువెత్తు చిరునామా తెనాలి: ఆంధ్రా ప్యారిస్లో అరుదైన పైకస్ పార్కు అది. ఇప్పుడు లోపలకు ప్రవేశించగానే అడవిని తలపిస్తోంది. పార్కు మొత్తం మోకాలి ఎత్తులో పెరిగిన గడ్డి, అడుగు తీసి అడుగు పెట్టేందుకు అవకాశం లేనట్టుగా ఉంది. పార్కులోని దారుల్లోనూ గడ్డి వ్యాపించింది. అక్కడి అరుదైన జాతుల మొక్కలకు కనీసం నీరు కూడా పోయడం లేదు. విద్యుద్దీపాలు అదృశ్యమయ్యాయి. ఓపెన్ జిమ్లో వ్యాయామ పరికరాలు వృథాగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కళావిహీనమైన స్థితిలో ఉన్న పార్కు నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా ఉంది. వంద రకాల పైకస్ జాతుల మొక్కలు దక్షిణ భారతదేశంలోనే మరెక్కడా లేనటువంటి పైకస్ పార్కు ఇది. దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి వంద రకాల పైకస్ జాతుల మొక్కలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆరంభించారు. మరుగుజ్జు వృక్షాలు, ఆయా జాతుల సాధారణ రకాల మొక్కలను నాటించారు. వివిధ ప్రాంతాల్లోని సుదీర్ఘ జీవితకాలం కలిగిన వృక్షాలను సైతం యంత్రాల సాయంతో ట్రాన్స్లోకేషన్ చేసి, ఇక్కడ నాటారు. మొత్తంమీద 40 జాతుల మొక్కలు, చెట్లతో పార్కుకు కళ తీసుకొచ్చారు. సందర్శకుల కోసం వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్, మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా జిమ్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్ తదితర హంగులను ఏర్పాటుచేశారు. 2017లో ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమోహనరెడ్డి ఆలోచనల్లోంచి పైకస్ పార్కు 2017లో తెనాలిలో సాకారం కావటం విశేషం. పట్టణానికి ఉత్తరం వైపున విజయవాడ రహదారి పక్కన తూర్పు కాలువ అంచున గల మున్సిపల్ మంచినీటి పథకం హెడ్ వాటర్ వర్క్స్ వద్ద సువిశాలమైన మూడు ఎకరాల స్థలాన్ని ఇందుకోసం ఎంచుకున్నారు. నీటి లభ్యత అందుబాటులో ఉండటంతో అనువైనదిగా భావించారు. కేంద్ర ప్రభుత్వ అమృత పథకం, మున్సిపాలిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తారు. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ తగిన మొక్కలను ఎంచుకుని, దేశంలోని వివిధ ప్రాంతాల్నుంచి సేకరించి, మున్సిపాలిటీకి అందజేస్తుంది. వాటిని నాటించి, సంరక్షించటం మున్సిపాలిటీ బాధ్యత. ఎండిపోతున్న మొక్కలు విద్యుత్ సమస్యతో కనీసం మొక్కలకు నీరు పెట్టటం లేదు. కనీసం వాచ్మెన్, ల సంరక్షకుడు కూడా లేరు. విద్యుద్దీపాలు చోరులపరమై స్తంభాలు మొండిగా దర్శనమిస్తున్నాయి. వాకింగ్ ట్రాక్ కనిపించటం లేదు. జిమ్ పరికరాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఓపెన్ ఎయిర్ థియేటర్ గ్యాలరీని మొండిగోడలను తలపిస్తున్నాయి. రూ.లక్షలు వ్యయం చేసి, ఏర్పాటుచేసిన పార్కును ఎందుకూ పనికిరాకుండా చేసేంత నిర్లక్ష్యం ఎందుకో అర్థంకాదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. కొసమెరుపు ఏమంటే, ‘సాక్షి’ ఫొటోలు తీశాక పొక్లయిన్తో గడ్డిని తొలగింపజేస్తున్నారు. దయనీయస్థితిలో పైకస్ పార్కు ఏపుగా పెరిగిన గడ్డి న్యూస్రీల్పైకస్ అంటే మర్రి జాతుల మొక్కలని అర్థం. రావి, మర్రి, జువ్వి, మేడి...తదితర రకాల మొక్కలతో కూడిన పార్కు ఇది. పైకస్ జాతి మొక్కలు దేశవ్యాప్తంగా విస్తారంగా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో 17 రకాలు మాత్రమే ఉన్నాయని అంచనా. ఈ కొరతను నివారించి, కనీసం 100 రకాల మొక్కలను ఒకేచోట పెంచాలనేది ఈ పార్కు ఏర్పాటు లక్ష్యం. నాటి మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. నలభై ఏళ్ల వయసు కలిగిన రెండు మర్రి వృక్షాలను తెనాలి పరిసరాల్లోంచి యంత్రాలతో పెకలించి, పార్కులో నాటించారు. వీటితో పాటు ఎక్కువ వయసు కలిగిన బోన్సాయ్ (మరుగుజ్జు) వృక్షాలనూ రప్పించారు. పైకస్లోనే ఇతర జాతుల మొక్కలు తెప్పించారు. సందర్శకుల కోసమని ‘స్టాండ్ స్టోన్ గజబోస్’గా పిలిచే గోపురం తరహా కుటీర నిర్మాణాలను రాజస్థాన్ వర్కర్లతో చేయించారు. పార్కులో వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్టు, మహిళలు, పురుషులకు వేర్వేరుగా జిమ్ పరికరాలను సమకూర్చారు. ఓపెన్ ఎయిర్ థియేటర్కు అవసరమైన గ్యాలరీ నిర్మించారు. పార్కులో పైకస్ జాతిపై పరిశోధకులకు అన్నీ అందుబాటులో ఉండే మినీ ఫారెస్ట్గా దీన్ని తయారుచేయాలని భావించారు. మొక్క శాసీ్త్రయనామం, కుటుంబం, స్థానికంగా పిలిచే పేరు సహా వివరాలన్నింటినీ ప్రతి మొక్కపైనా లేబిలింగ్ చేయాల్సి ఉంది. ఇంత చక్కటి ఆశయంతో రూపుదిద్దిన పార్కు ఇప్పుడు దయనీయస్థితిలో ఉంది. -
నేడు పార్టీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
తాడేపల్లి,సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) అధ్యక్షతన నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది.పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత.. లోకేష్కు చెప్పినా లాభం లేదని..
గుంటూరు,సాక్షి: మంగళగిరి రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దాసరి బాబురావు అనే వ్యక్తి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డారు. మట్టి మాఫియా వేధింపులతో మనస్తాపం చెంది బ్లేడుతో చేయి కోసుకున్నారు. అప్రమత్తమైన టీడీపీ పార్టీ సిబ్బంది బాబురావును అత్యవసర చికిత్స నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తమ భూముల్ని కబ్జా ప్రయత్నం జరుగుతోందని, మంత్రి లోకేష్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి భార్య మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దాసరి బాబురావు ఆత్మహత్యయత్నంపై ఆమె భార్య దాసరి దాసరి నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ‘మాకు దెందులూరి మండలం చల్ల చింతల పూడిలో పొలం ఉంది. మా పొలంలో జేసీబీలతో మట్టి తవ్వి ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మేం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులం అని బెదిరిస్తున్నారు. ఇదే విషయం గురించి చింతమనేనితో మా బంధువులు మాట్లాడితే మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని చెప్తున్నారు. మేం మట్టి మాఫియాని అడ్డుకోడానికి ప్రయత్నించాం. సాధ్యం కాలేదు. మట్టి మాఫియా గురించి అధికారులు అందరికీ ఫిర్యాదు చేశాం ఎవరూ పట్టించుకోవట్లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. పైగా మధ్యవర్తులు కలగజేసుకుని రూ.90లక్షలు తీసుకుని, రూ.2కోట్లు తీసుకురమ్మని మని అంటున్నారు. లేదా మీ పొలం మాకు అమ్ముతున్నట్లు సంతకాలు చేయమని బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు,ప్రాణభయంతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చాం. పోలీస్ స్టేషన్కు వెళ్లాం. కనీసం మా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. చివరికి ఎస్పీ కార్యాలయానికి కూడా మమల్ని రానివ్వట్లేదు. పోలీసులు మమ్మల్ని మట్టి మాఫియాతో సెటిల్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంత్రి లోకేష్ను కలిసి మా బాధ చెప్పుకున్నాం. మట్టి మాఫియా చివరకు లోకేష్ మాటను కూడా లెక్క చేయలేదు.ఇంకా ఎక్కడికి వెళ్లినా ఉపయోగం లేదని ఉదయం టీడీపీ కార్యాలయానికి వచ్చాం. మట్టి మాఫియా వేధింపులతో మనస్థాపం చెందిన నా భర్త చేయి కోసుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు’ అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
‘కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైంది’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కరువైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు.. ‘హిందూధర్మంపై నిత్యం దాడి జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తిరుమల లడ్డూ గురించి విషప్రచారం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా ఆరుగురు భక్తుల మరణానికి కారకులయ్యారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయితాబేళ్ల సంరక్షనే కాదు, పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మా హయాంలో ఏ పొరపాట్లు జరగకపోయినా ఏదో జరిగినట్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు?, కాశీనాయన క్షేత్రంలో అధికారులే వెళ్లి నిర్మాణాలను కూల్చేస్తే ఎందుకు మాట్లాడలేదు?, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోంది?రెండు వందల తాబేళ్ల పరిరక్షణ కూడా ప్రభుత్వానికి పట్టదా? , మా హయాంలో ప్రతి తాబేలుకూ నెంబర్ ఇచ్చి వాటి పరిరక్షణ చూశాం. కానీ ఈ ప్రభుత్వం తాబేళ్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా ఎలా దహనం చేస్తారు?, అసలు రాష్ట్రంలో హిందూ ధర్మం ఏమవుతోంది? , వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. శ్రీకూర్మం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు -
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. -
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
పెదవడ్లపూడి(మంగళగిరి): ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. -
అలవాట్లలో మార్పులు చేసుకోవాలి
తరచుగా త్రేన్పులు, ఛాతిలో మంట వచ్చే వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులను సంప్రదించాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో భాగంగా ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు జెనెటిక్ టెస్ట్, ఎండ్కోపీ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. నిర్ణీత వేళల్లో ఆహారం తీసుకోవాలి. రాత్రి వేళల్లో 8 గంటల కల్లా భోజనం చేయాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. స్మోక్డ్, ఫాస్ట్ఫుడ్ను తీసుకోకూడదు. కుటుంబంలో ఎవరికై నా ఒకరికి అన్నవాహిక క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యులు జీర్ణకోశ వ్యాధి నిపుణులను తరచుగా సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు. -
ఆక్వా డెవిల్స్ కొత్త కార్యవర్గం
తాడేపల్లి రూరల్: ఉండవల్లి – అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ లైఫ్ చైర్మన్, పార్లమెంట్ మాజీ సభ్యులు గోకరాజు గంగరాజు విచ్చేసి కొత్త కార్యవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్త అధ్యక్షులుగా లింగిపిల్లి రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గోపాళం సాంబశివరావు, కార్యదర్శిగా యార్లగడ్డ వెంకట రమేష్కుమార్, సహాయ కార్యదర్శులుగా అమ్మిరెడ్డి రామిరెడ్డి, గుండు జనార్ధనరావు, కోశాధికారిగా కొల్లిపర వెంకట రామయ్య, కమిటీ సభ్యులుగా విశ్వనాధ పల్లి సురేష్కుమార్, కె. సాంబశివరాజు, పులిపాటి శ్రీనివాసరావు, యు. వెంకటరెడ్డి, వి. రామచంద్రరావు, వై. శ్రీనివాసరావు,పి. నాగేశ్వరరావు, యస్. హరిబాబు, ఎ. వెంకటేశ్వరరాజు, కె. సాంబయ్య, ఆశీర్వాదం, గఫూర్,ఎం. సాంబిరెడ్డిలను నియమించామని వెల్లడించారు. అధ్యక్షులు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ గోకరాజు గంగరాజు అప్పగించిన బాధ్యతలను కమిటీ, అసోసియేషన్ సభ్యుల సహాయ సహకారాలతో నిర్వహిస్తానని వెల్లడించారు. -
పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక
తెనాలి: ది పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ, తెనాలి ఆధ్వర్యంలో స్థానిక ముత్యంశెట్టిపాలెంలోని కల్యాణమండపంలో ఆదివారం 14వ వివాహ పరిచయ వేదికను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 600 మంది వధూవరుల పరిచయ కార్యక్రమం సాయంత్రం వరకు జరిగింది. వివాహ పరిచయ వేదిక పుస్తకాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన అమృతసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కుదరవల్లి రామమోహనరావు ఆవిష్కరించారు. సొసైటీ అధ్యక్షుడు జె.నరసింహారావు, ప్రధాన కార్యదర్శి జేఎస్బీ ప్రభాకరరావు, కోశాధికారి దివి పురుషోత్తం, ఉపాధ్యక్షులు అక్కల శ్రీరామ్, టీవీ కృష్ణారావు, దామర్ల పరమేశ్వరరావు, కార్యదర్శులు బీజేకే నరేంద్రబాబు, దివి హేమంత్, ఓంకార్ ప్రసాద్, కటకం శేషగిరి, మదన్మోహన్, శంకర్ పాల్గొన్నారు. వధూవరుల పరిచయాలను వేదికపై జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తమం, అక్కల శ్రీరామ్, హేమంత్ నిర్వహించారు. అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయిపెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. జర్మనీ అబ్బాయి.. ఆంధ్ర అమ్మాయి ఒక్కటైన వేళ -
ఏఐబీఈఏ వ్యవస్థాపక దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు): ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐబీఈఏ) 80వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాల వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి వద్ద జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం కార్యదర్శి సయ్యద్ బాషా ఏఐబీఈఏ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ సలహాదారుడు పి.కిషోర్కుమార్ మాట్లాడుతూ 1946 ఏప్రిల్ 20వ తేదీన ఏఐబీఈఏను స్థాపించినట్టు తెలిపారు. 1969లో బ్యాంకుల జాతీయకరణ ఉద్యమంలో ఏఐబీఈఏ అగ్రభాగన నిలబడిందని గుర్తు చేశారు. ఉద్యోగుల మొదటి వేతన సవరణ 1966 నుంచి 2024 వరకు 12 వేతన సవరణలు విజయవంతంగా చేశారన్నారు. అనంతరం శ్రీనగర్లోని మాతృశ్రీ వృద్ధాశ్రమం, రింగ్ రోడ్లోని వికలాంగుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ సంఘం జాయింట్ సెక్రటరీ మురళీ, సంఘం నాయకులు శివాజీ, రామకృష్ణ, షరీఫ్, పృధ్వీ, వేణు, పావని, క్రాంతి, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
శ్రీవాసవీ ఆలయంలో సమావేశం
తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి కొత్తగా ప్రకటించుకున్న పాలకవర్గ ప్రథమ సమావేశాన్ని ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. పెండేల వెంకట్రావు అధ్యక్షత వహించారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి జన్మదినం సందర్భంగా ఆలయంలో మే నెల 5,6,7 తేదీల్లో జన్మదిన ఉత్సవాలు జరపాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. న్యాయవాది మద్ది మల్లికార్జునరావును కమిటీ పాలకవర్గ న్యాయసలహాదారుగా నియమించడానికి తీర్మానించినట్టు వివరించారు. పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ముగిశాయి. వారోత్సవాల ముగింపులో భాగంగా ఆదివారం నగరంపాలెంలోని ఫొనిక్స్ మాల్లో సిబ్బంది అగ్నిప్రమాదాల పట్ల అవగాహన కలిగించారు. అగ్నిమాపకశాఖ రేంజ్ ఫైర్ ఆఫీసర్ (ఆర్ఎఫ్వో) ఎంఏక్యూ జిలాని, జిల్లా పోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ రత్నమన్మోహన్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ బి. శ్రీనివాసులరెడ్డి, ఫొనిక్స్మాల్ మేనేజర్ చైతన్య, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక ప్రమదాలు సంభవించిన సమయంలో ఏ విధంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. డెమో నిర్వహించి పరికరాల గురించి తెలియజేశారు. -
వెనిగండ్ల కల్యాణ మండపంలో దోపిడీ
పెదకాకాని: వెనిగండ్లలోని మైత్రి కల్యాణ మండపంలో లైటింగ్, డెకరేషన్కు వేలంపాటలు నిర్వహించకుండా కొందరు పంచాయతీ ఉద్యోగులు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ మాజీ సర్పంచి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొండమడుగుల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వెంటనే పాటలు నిర్వహించి గ్రామ పంచాయతీ ఆదాయం పెంచాలని అధికారులను కోరారు. పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో ప్రభుత్వ భూమిలో కొందరు గ్రామ పెద్దలు సుమారు రూ.కోటి నిధులు సేకరించి కల్యాణ మండపాన్ని నిర్మించారు. గ్రామస్తులకు తక్కువ ధరకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనిని స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మండపాన్ని ఓసీలకు రూ.18,500కి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.12,500కు ఇస్తున్నారు. ప్రతి వేడుకకూ మరుగుదొడ్ల శుభ్రత పేరుతో మరో రూ.500 వసూలు చేస్తున్నారు. మైక్, లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పేరుతో మరింత దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ వసూళ్ళు పంచాయతీ సిబ్బంది కనుసన్నల్లో జరుగుతున్నట్లు సమాచారం. గత ఏడాది మైత్రి కల్యాణ మండపంలో 175 వేడుకలు జరిగాయి. మైక్ అండ్ లైటింగ్, పూల అంకరణను కొందరు ప్రైవేటు వ్యక్తులు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. దీనిలో పంచాయతీ ఉద్యోగులకు వాటాలు వెళ్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కల్యాణ మండపంలో లైటింగ్, పూల అలంకరణకు వేలంపాటలు నిర్వహించకపోవడంతో పంచాయతీ ఏటా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి వేలంపాటలు నిర్వహించాలని మాజీ సర్పంచి కొండమడుగుల శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రజలు కోరుతున్నారు. అలరించిన లఘు నాటికల ప్రదర్శన నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం గుంటూరు హ్యూమర్ క్లబ్ 12వ వార్షికోత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వేడుకలకు సంస్థ ఉపాధ్యక్షులు మధువని అధ్యక్షత వహించారు. అనంతరం ఓర్నీ, పోవోయి అనుకోని అతిథి లఘు నాటికలు ప్రదర్శించారు. ఇవి సభికులను అలరించాయి. దర్శకులు గుడివాడ లహరి, సీహెచ్.అమృతవర్షిణి, క్లబ్ వ్యవస్థాప కార్యదర్శి షేక్ లాల్వజీర్, కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతిలు ప్రసంగించారు. నటీనటులు మధువని, నాగజ్యోతి, ప్రత్తిపాటి మంగయ్య, డాక్టర్ ఎన్వీకృష్ణప్రసాద్, గుడివాడ లహరి, ఎ.రాజశేఖర్, పెండ్యాల రమేష్బాబు, ప్రదీప్కుమార్, ఎం.క్రిష్ణకిషోర్ తమ పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల్తో ముంచెత్తారు. గోల్డెన్ ప్రైమ్ సిటీ బ్రోచర్ ఆవిష్కరణ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): అమరావతి మండలం నరుకుళ్ళపాడు గ్రామంలో 12 ఎకరాలలో సీఆర్డీఏ అఫ్రూవల్తో వారాహి ఇన్ఫ్రా టౌన్షిప్స్ వారి గోల్డెన్ ప్రైమ్ సిటి బ్రోచర్ను ఆదివారం సంస్థ చైర్మన్ కొండవీటి శ్రీనివాసరావు, డైరెక్టర్స్ దేవమిత్ర రాజా, అరుణ్ప్రశాంత్, సాయి ఆదిత్య స్కూల్ డైరెక్టర్ రవీంద్రబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ లక్కీడిప్లో పాల్గొనే అవకాశం కల్పించి గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా కారు, రెండు, మూడు బహుమతులుగా రాయల్ ఎన్ఫీల్డ్, టీవీఎస్ స్కూటీని విజేతలకు అందించారు. ఫ్లాట్ బుకింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ 2 గ్రాముల గోల్డ్ కాయిన్ అందించారు. గతంలో కేఎస్ఆర్ డెవలపర్స్ పెదపరిమి, గొర్లవారిపాలెంలో పంచాక్షరి గార్డెన్స్ దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. జొన్నలగడ్డలో వారాహి ఇన్ఫ్రాజ్యూయల్ సిటి, విజయవాడలో నిడమానూరులో ఎంబసి విల్లాస్ పూర్తి కావస్తుందని నిర్వాహకులు తెలిపారు. మైక్, లైటింగ్, డెకరేషన్ పేరిట వసూళ్లు వేలంపాటలు నిర్వహించకుండా పంచాయతీ ఉద్యోగుల దొంగాట పారిశుద్ధ్యం పేరుతో ప్రత్యేక రుసుం ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు -
సోమవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు విడుదల చేసిన డీఎస్సీ–2025 షెడ్యూల్ అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు జూన్ ఆరో తేదీన పరీక్షల ప్రారంభానికి మధ్యలో 45 రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో అంత తక్కువ కాలంలో పరీక్షలకు సన్నద్ధం కావడం సాధ్యమేనా? అని అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తోందనిసంతోషించాలో, సన్నద్ధమయ్యేందుకు కనీసం గడువు ఇవ్వకుండా హడావుడిగా షెడ్యూల్ జారీ చేసినందుకు బాధపడాలో తెలియని ఆయోమయ పరిస్థితుల్లో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు డీఎస్సీ–2025 ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,143 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 622, ఎస్జీటీ 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నట్లుగా చూపారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లీషు 69, మాధ్స్ 35, ఫిజికల్ సైన్స్ 58, బయాలాజికల్ సైన్స్ 86, సోషల్ 109, ఫిజికల్ ఎడ్యుకేషన్ 166తో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 521 ఉన్నాయి. మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ డీఎస్సీ–2025కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు గడువు ఇచ్చారు. మే 20 నుంచి మాక్టెస్ట్లు జరగనున్నాయి. మే 30 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడింగ్, జూన్ 6వ తేదీ నుంచి జూలై ఆరు వరకు ఆయా కేటగిరీల వారీగా పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ అనంతరం ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదల చేసి, మెరిట్ జాబితా ప్రకటించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్లో పొందుపర్చారు. న్యూస్రీల్ డీఎస్సీ నియామకాలపై అభ్యర్థుల పెదవి విరుపు నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్లగానో 30వేల మంది అభ్యర్థుల నిరీక్షణ మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మే 20 నుంచి మాక్ టెస్ట్లు జూన్ 6 నుంచి జూలై ఆరు వరకు పరీక్షలు సన్నద్ధతకు 45 రోజులే వ్యవధి ప్రిపరేషన్కు కనీసం 90 రోజులు అవసరమంటున్న సబ్జెక్టు నిపుణులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇలా.. భర్తీ చేయనున్న పోస్టులు : 1,143 ఎస్జీటీ పోస్టులు: 521 45 రోజులు సరిపోవు ఏడేళ్ల అనంతరం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 45 రోజుల సమయం సరిపోదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్టు నిపుణులూ అదే విషయం చెబుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ కోసం 30 వేల మంది వరకు అభ్యర్థులు ఎన్నాళ్ల నుంచో నిరీక్షిస్తున్నారు. వీరిలో చాలా మంది వయోపరిమితి పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో వయో పరిమితిని పెంచాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. 90 రోజుల వ్యవధి అవసరం డీఎస్సీ దరఖాస్తు గడువు, పరీక్షలకు మధ్య వ్యవధి చాలా తక్కువ ఉంది. విస్తృత సిలబస్ను పూర్తి చేసేందుకు 45 రోజులు సరిపోవు. విద్యాశాఖ హడావుడిగా షెడ్యూల్ ఖరారు చేసింది. కనీసం 90 రోజుల వ్యవధి అవసరం. అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచాలి. 2018 తరువాత చేపడుతున్న డీఎస్సీ కావడంతో వేలాది మంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో 46ఏళ్లకు వయోపరిమితి పెంచారు. రాష్ట్రంలో 47ఏళ్లకు పెంచాలి. – కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ -
ఎల్ఈడీ లైట్లతో ప్రమాదం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్ బస్సుల్లో లైట్ల వినియోగం పెచ్చుమీరుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్కు గురయ్యారు. నేరుగా ఇంజిన్ నుంచి ఎల్ఈడీ లైట్లకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబంధించి ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. భారీ ఫోకస్ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతోపాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు. వాహనాల చట్టం 1988 (మోటార్ వెహికల్ యాక్ట్) ప్రకారం వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్ఈడీ లైట్లు హాలోజెన్ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్ అప్రూవ్డ్ లైట్లు నిషేధించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్లకు 10 వాట్స్లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి. జైలు శిక్షకు కూడా అవకాశం ఆర్టీఏ రూల్ ప్రకారం ఎల్ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. కొద్ది కాలం క్రితం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్ఈడీ లైట్ల వినియోగం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒక్కోసారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ఇష్టానుసారంగా వినియోగం ద్విచక్రవాహనాలు మొదలుకుని భారీ వాహనాల వరకు పట్టించుకోని ఆర్టీఏ శాఖ అధికారులు ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా హెవీ ఫోకస్ ఉన్న ఎల్ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా కేసులు నమోదు చేయటంతోపాటు, వాహనాలను సీజ్ చేస్తాం. అధిక వెలుగు వచ్చే లైట్లు వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. కంపెనీలు అమర్చిన లైట్లు మినహా ఏ ఒక్కరూ విడిగా ఎల్ఈడీ లైట్లు పెట్టుకోకూడదు. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. –ఎం. రమేష్ (గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ) అడ్డగోలుగా అమ్మకాలు.. మోటార్ వెహికల్ షాపుల్లో ఎల్ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీస చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు. -
పట్టాలు తప్పిన సర్వీసు రైలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో మరమ్మతుల నిమిత్తం వచ్చిన సర్వీసు రైలు ఆదివారం సాయంత్రం పట్టాలు తప్పింది. అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. దీంతో గేటు వద్ద ట్రాఫిక్కు భారీగా అంతరాయం కలిగింది. నేడు టౌన్హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నరసరావుపేట: నరసరావుపేట పట్టణంలోని టౌన్హాలు వేదికగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణంగా కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ వేదిక మార్పును ప్రజలు గమనించుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ఈసారి నరసరావుపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఘనంగా చెన్నుని పుష్పయాగం మాచర్ల: మాచర్లలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు, ఈఓ ఎం పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, గౌరవాధ్యక్షులు పోలిశెట్టి చంద్రశేఖరరావు, పందిరి సాంబశివరావు, షరాబు వెంకటరత్నం, గజవెల్లి కిషోర్, కంభంపాటి అనిల్కుమార్, సూరె యలమంద, తిరివీధి వెంకట నాగేశ్వరరావు, కంభంపాటి వెంకటరమణలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారి పుష్పయాగం మండపంలో జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ నామస్మరణ చేశారు. కార్తికేయుని ఆలయంలో భక్తజన సందడి మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో క్యూలు సందడిగా మారాయి. అన్నప్రసాదం ప్రాంగణం వద్ద భక్తులు బారులు తీరి కనిపించారు. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో సూపరిటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు యువకుడి దుర్మరణం వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై యువకుడు మృతి చెందిన ఘటన పట్టణంలో శనివారం జరిగింది. టీడీపీ యూత్ ఆధ్వర్యంలో కుమ్మరి బజారులో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో స్థానిక రణాహుస్సేన్ బజారుకు చెందిన షేక్ గౌస్బాషా (చంటి)(22) శనివారం సాయంత్రం క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతనిని స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం కొంతసేపటికి అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని చీఫ్విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు సండ్రపాటి సైదా, డాక్టర్లు కేఎల్రావు, కాసుల పార్వతి తదితరులు సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. మృతుడు చంటి స్థానిక నిమ్స్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులు ఉన్నారు. -
వీధి వ్యాపారులపై ఆశీలు భారం
తెనాలి: పట్టణంలో చిరు వ్యాపారులపై మున్సిపాలిటీ ఆశీలు భారం మోపింది. రోజుకు రూ.10 వసూలు చేస్తున్న ఆశీలు మొత్తాన్ని ఇప్పుడు ఏకంగా రూ.30కు పెంచింది. చిన్నాచితకా వ్యాపారాలతో పొట్టపోసుకునే వ్యాపారులకు మున్సిపాలిటీ నిర్ణయం భారమైంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఎదుగూ బొదుగూ లేని ఆదాయంతో జీవిస్తున్న తమపై అదనపు భారాన్ని మోపడం సరికాదని, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. ఏ పట్టణం చూసినా ఏమున్నది గర్వకారణం.. వీధులనిండా తోపుడుబండ్లు, ఫుట్ఫాత్లన్నీ ఆక్రమణలే! అన్న వ్యాఖ్యలు తరచూ వింటుంటాం. స్ట్రీట్ వెండర్లు, హాకర్లుగా పిలిచే ఈ చిరువ్యాపారులు ట్రాఫిక్కు అవరోధమని భావించటం పరిపాటి. ప్రభుత్వ అధికారులు, పోలీసుల అదిరింపులు, బెదిరింపులు, పౌరుల ఛీత్కారాల మధ్య బతుకుదెరువు కోసం అలసట లేని జీవనపోరాటం వారిది. జీవించడానికి వేరే ఏమార్గం లేక, కొద్దిపాటి పెట్టుబడితో రోడ్డుపక్కనే ఉపాధిని ఏర్పాటుచేసుకునే చిరువ్యాపారులు పట్టణ పంపిణీ వ్యవస్థలో ముఖ్య భూమిక వహిస్తున్నారు. పట్టణ ప్రజాజీవనంలో వీరి పాత్రను విభజించలేం. పెద్ద షాపులకు వెళ్లి హెచ్చు ధరలు పెట్టలేని ప్రజలకు నిత్యావరాలైన కూరగాయలు, పండ్లు, పూలు, గాజులు.. ఇలా ఒకటేమిటి? సమస్త ఉత్పత్తులను అందుబాటులో ఉండే ధరల్లో అందిస్తున్నారు. అయినా పాలకులు, అధికారులు, ప్రజలకు వీరంటే చిన్నచూపే. స్థానికంగా ఉండే పోలీస్, మున్సిపల్ సిబ్బంది వల్ల ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి తమ సరుకులను నష్టపోతుంటారు. ఏ రాజకీయ నాయకుడో సభ పెట్టారంటే ఆరోజు వ్యాపారం లేనట్టే. కొన్ని సందర్భాల్లో పోలీసు కేసులను ఎదుర్కోవటం, జరిమానా చెల్లించటం అనివార్యం. వాస్తవంగా వారి హృదయాలను తట్టిచూసే ఓపికా, తీరికా ఎవరికీ లేవు. 2,000 మందికిపైగా వీధి వ్యాపారులు పట్టణంలోని స్ట్రీట్వెండర్లు, హాకర్లు గతేడాది అధికారికంగా 1,650 వరకు ఉన్నారు. ఈ సంవత్సరం వారి సంఖ్య 2,000 పైగానే ఉంటుందని అంచనా. వీరిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, మొక్కజొన్న కండెలు, కొబ్బరి బొండాలు దుస్తులు, చిన్నవస్తువులు విక్రయించేవారే అధికం. ప్రధానంగా మార్కెట్ ఏరియా, మెయిన్రోడ్డు, గాంధీచౌక్, శివాజీచౌక్, చెంచుపేట, నెహ్రూరోడ్డులో అధికంగా ఉంటారు. ఇతర ప్రాంతాల్లో రోడ్డు వెంట ఉండే అమ్మకాలు చేస్తుండే చిరువ్యాపారులు కనిపిస్తుంటారు. ఎక్కువగా సైకిళ్లపై వ్యాపారాలు చేస్తుంటారు. ఇరువైపులా వ్యాపార దుకాణాలు ఉండే మెయిన్రోడ్డు ‘తోపుడుబండ్ల వ్యాపారుల హబ్’ అంటారు. ఉదయం పూట రోడ్డుకు రెండుపక్కలా పదులసంఖ్యలో మహిళలు రోడ్డుపైనే గంపలు లేదా నేలపైనే కూరగాయలు, పూలు, పండ్లు పార్ట్టైమ్ అమ్మకాలు చేస్తుంటారు. స్థానికులతోపాటు సమీపగ్రామాల్నుంచి వీరంతా పట్టణానికి వచ్చి ఉపాధిని పొందుతుంటారు. ఎండలో ఎండుతూ వర్షాలకు తడుస్తూనే వ్యాపారాలు చేస్తుంటారు. వర్షాలు బాగా కురిసే రోజుల్లో ఏరోజైనా కాసేపు తెరిపివ్వకపోతే ఆ రోజుకు నాలుగు రూపాయలు కళ్లచూసే అవకాశాన్ని కోల్పోతారు. ఏకంగా రూ.10 నుంచి రూ.30కు పెంపుదల రోజూ రూ.30 చెల్లించలేమంటున్న చిన్నవ్యాపారులు తెనాలిలో స్ట్రీట్వెండర్లు, హాకర్లు రెండు వేలకు పైమాటే! ఆశీలుపై ఆవేదన ఇలా అవస్థలు పడుతూ వ్యాపారాలు చేస్తూ పొట్టపోసుకునే చిరువ్యాపారులు కూడా చాలామందికి ఆదాయ వనరులయ్యారు. తమ దుకాణం లేదా ఇంటి ముందు రోడ్డుపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల నుంచి రోజుకింతని యజమానులు వసూలు చేసుకుంటూ ఉంటారు. అదేమని అడిగితే ఆ మాత్రం చోటు కూడా ఇవ్వరని, వారు అడిగిన మొత్తం ఇచ్చేస్తుంటారు. ఇలాంటి వారినుంచి రోజుకు రూ.100 వరకు తేరగా వసూలుచేసే యజమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పట్టణ మున్సిపాలిటీ ఒక్కో చిరువ్యాపారి నుంచి రోజుకు రూ.30 చొప్పున వసూలు చేస్తోంది. ఇంతకుముందు రూ.10 చొప్పున వసూలు చేసే ఆశీలు ఇప్పుడే ఏకంగా రూ.30 వరకు పెంచింది. మార్కెట్ షాపులను వేలంపాట నిర్వహించిన తర్వాత వేలం పాడుకున్న వ్యాపారి, చిన్నచిన్న వ్యాపారుల నుంచి కూడా రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. ఇది తమకు భారంగా పరిణమించిందని వ్యాపారులంతా ఆవేదన పడుతున్నారు. ఆశీలు భారం తగ్గించాలని కోరుతున్నారు. -
సూర్యలంకలో పర్యాటకుల సందడి
బాపట్ల: వరుస సెలవుల నేపథ్యంలో సూర్యలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాపట్ల జిల్లాతోపాటు గుంటూరు, కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సూర్యలంక సముద్ర తీర ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ తీరంలో ఆహ్లాదకరంగా గడిపారు. స్నానాల అనంతరం తీరం వెంబడి సేద తీరేందుకు ఏపీ టూరిజం శాఖకు చెందిన రిసార్ట్స్ అందుబాటులో ఉండటంతో ఆన్లైన్ బుక్చేసుకున్న పర్యాటకులు శనివారం రోజునే ఇక్కడికి చేరుకొని ఆదివారం సాయంత్రం తిరుగుపయనమవుతున్నారు. సూదూర ప్రాంతాల నుంచి వివిధ వాహనాల ద్వారా సూర్యలంక చేరుకున్న పర్యాటకులు స్నానాల అనంతరం తీరం వెంబడి ఉన్నటువంటి జీడిమామిడి తోటలో వనభోజనాలు చేసి సేదతీరారు. సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న పర్యాటకులు జీడిమామిడి తోటలో సేదతీరుతున్న వైనం -
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22వ తేదీ (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
గుంటూరులో మహిళల ధర్నా
సాక్షి, గుంటూరు: నగరంలోని మణి హోటల్ సెంటర్లో లక్కీ వైన్స్ను తొలగించాలంటూ మహిళలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మద్యం షాపు దగ్గరకు వచ్చిన ఎక్సైజ్ సీఐ లతను మహిళలు నిలదీశారు. వైన్ షాపు కారణంగా మద్యం తాగి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని సీఐ లత దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. ధర్నా చేస్తున్న స్థానికులపై ఎక్సైజ్ సీఐ లత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి మద్యం షాపును తొలగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రూల్స్ ప్రకారమే ఇక్కడ షాప్ కేటాయించామని సీఐ తెలిపారు. వైన్స్ దగ్గర తాగుబోతులు.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా సెక్యూరిటీ కల్పిస్తామంటూ సీఐ లత చెప్పుకొచ్చారు. దీంతో సీఐ లతపై మహిళలు ఆగ్రహించారు. దీంతో సీఐ, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్నా చేస్తున్న స్థానికులతో వైన్స్ యాజమాన్యం కూడా గొడవకు దిగింది.ఇక్కడ నుంచి వైన్స్ తీసే ప్రసక్తే లేదంటూ మహిళలపై వైన్స్ యజమాని చిందులు తొక్కారు. ప్రభుత్వమే మాకు మద్యం అమ్ముకోమని లైసెన్స్ ఇచ్చిందని.. మీరేంటి చేసేదంటూ స్థానికులపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఐదేళ్లపాటు మమ్మల్ని మీరేం చేయలేరంటూ ధర్నా చేస్తున్న వారిపై చిందులేశారు. -
‘ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్ కుమార్ వివరించారు.‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్కుమార్ పేర్కొన్నారు. ‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్కుమార్ ప్రశ్నించారు. -
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు.టీచర్ పోస్ట్ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే..డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు?.గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా?తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్లో పిటీషన్ వేయించారు. కోర్ట్లో కేసు పెండింగ్లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది.వైఎస్సార్సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు.స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్లో ఎస్సీల్లో ఆర్ఓఆర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.టీచర్ పోస్ట్ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ?ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16 వేల పోస్ట్లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉండే టీచర్ పోస్ట్లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది.అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? జూన్లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్లకు కేబినెట్లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ?అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీవో మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్గా మారిపోతున్నాయి.ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.కేవలం 17 శాతం స్కూళ్లను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్లలో విద్యాబోధన కల్పించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది.ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా?చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లువ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.తాజా నోటిఫికేషన్లో వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళకల పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్లు మాత్రమే భర్తీ చేశారు. వైఎస్ జగన్ అయిదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు.2018 డీఎస్సీ కింద వైఎస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్లు ఇచ్చింది. 602 పోస్ట్లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.కేవలం పదివేల పోస్ట్లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్డే గిఫ్ట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైఎస్ జగన్పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. -
చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025 -
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఈస్టర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరిపై యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిచారు. Wishing everyone a blessed and joyful Easter! May the resurrection of Lord Jesus Christ fill your hearts with hope, peace, and the promise of new life to you and your loved ones.#Easter— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025 -
గుంటూరు
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025అధిక బరువుపై అవగాహన తెనాలి: పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా తెనాలిలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమావేశాలను జరిపారు. పిల్లల్లో అధిక బరువుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరించారు. యునెస్కో గుర్తింపుపై హర్షం కూచిపూడి: యునెస్కో నాట్య శాస్త్రాన్ని గుర్తించిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో కూచిపూడి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. కుంకుమ పూజలు బాపట్ల: బాపట్ల అధిష్టాన దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవాలయం వద్ద శనివారం అంత్యంత వైభవంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. 3 -
వైఎస్సార్ సీపీ నిరంతరం ప్రజాపక్షం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అధికారంలో ఉన్నా.. లేకున్నా.. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమేనని రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా కొత్త కార్యాలయ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సర్వమత ప్రార్థనలు జరిపి కార్యాలయాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కాకాని వైజంక్షన్ నుంచి భారీ బైక్ ర్యాలీతో వైవీ సుబ్బారెడ్డికి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం సూపర్సిక్స్ హామీలను గుప్పించిందని విమర్శించారు. ప్రజలు వాటిని ఎక్కడ అడుగుతారో అని అక్రమ అరెస్టులు, బెదిరింపులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా.. అక్రమ అరెస్టులు చేసినా.. వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని, కార్యకర్తలు, నాయకులు కలిసి కట్టుగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నిల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ కొత్తగా నగర కార్యాలయాన్ని ప్రారంభించటం సంతోషదాయకమన్నారు. రాబోయే రోజుల్లో అన్ని డివిజన్లు, నగర కమిటీ, అనుబంధ విభాగాల సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయాన్ని ప్రారంభించటం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అరాచక పాలనకు వ్యతిరేకంగా కొండంత ధైర్యంతో ముందుకు సాగేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. నూరిఫాతిమా తమకు సోదరిలాంటిందని, అమెకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. గోవుల మృతిపై విచారణ జరపాలి అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో గోవులు మృతి చెందటం బాధాకరమన్నారు. దీనిపై కచ్చితంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోశాలలో 1,500పైగా గోవులు ఉండేవని, అనారోగ్యంతో మృతి చెందితే ఆ దారి వేరని, కూటమి ప్రభుత్వం లోపాల వల్ల మరణించడం బాధాకరమన్నారు. వైఎస్సార్ సీపీలో నెంబర్ వన్.. టూ అంటూ ఉండదని.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రతి ఒక్కరం ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పార్టీలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డికి కోటరీల గురించి తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీలో ఎవరికీ ప్రాధాన్యం తగ్గించడం, పెంచడం ఉండవని, అప్పజెప్పిన బాధ్యతను అందరూ చిత్తశుద్ధితో చేసుకుంటూ పోవడమేనని పేర్కొన్నారు. పోరాటానికి వెనుకాడం : నూరిఫాతిమా ప్రజల పక్షాన పోరాటాలకు వెనుకాడబోమని, వారి సమస్యలపై గొంతెత్తి నినదిస్తామని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా స్పష్టం చేశారు. జగనన్న తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కచ్చితంగా పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, డెప్యూటీ మేయర్ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అధికారం ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే ప్రయాణం రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పార్టీ గుంటూరు నగర కార్యాలయం ప్రారంభం -
భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: భూ సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో పలు రెవెన్యూ అంశాలపై నిర్వహించిన వర్క్షాపులో కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, వెబ్ ల్యాండ్ టెక్నికల్ సమస్యలు, రీసర్వే తదితర అంశాల నుంచి అధిక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సమస్యలకు కారణాలు పరిశీలించాలని, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. వెబ్ల్యాండ్కు సంబంధించి సమస్యల పరిష్కారం జాయింట్ కలెక్టర్ లాగిన్లోనే చేయాల్సి ఉందన్నారు. కలెక్టర్ స్థాయిలోనే అన్ని సమస్యలూ పరిష్కారం కావడం వల్ల జాప్యం అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని సమస్యల పరిష్కారానికి అర్జిదారులు పదేపదే వస్తున్నారని, దీన్ని అధికారులు గుర్తించాలన్నారు. సమస్య పరిష్కారం కాని వాటిని వారికి వివరించి చెప్పాలన్నారు. అధికంగా వస్తున్న సమస్యలపై రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు. ఒక వేళ భూ సమస్య పరిష్కారం కాకపోతే దానిని రికార్డు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్థాలు పర్యావరణానికి పెనుముప్పు అని, వాటిని శాసీ్త్రయ పద్ధతిలో నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ చెప్పారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ–వ్యర్థాల నిర్వహణపై గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాభిరామ్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ తేజ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఇన్చార్జి మేయర్ షేక్ సజీలా, ఎమ్మెల్యేలు మహమ్మద్ నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులతో కలిసి విజ్ఞాన మందిరం ఆవరణలో మెక్కలు నాటి, నగరంలో ఈ – వ్యర్థాల సేకరణ చేసే వాహనాన్ని ప్రారంభించి, సిగ్నేచర్ క్యాంపెయిన్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ ఈ–వ్యర్థాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని, వాటిని ఎక్కడపడితే అక్కడ పారేస్తే భూ కాలుష్యం, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. ఈ–వ్యర్థాల సేకరణకు గుంటూరుతోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రెడ్యూస్, రీ యూజ్, రీసైక్లీంగ్ (ఆర్ఆర్ఆర్) సెంటర్లును ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ–వ్యర్థాలను ఆర్ఆర్ఆర్ సెంటర్ల నిర్వహణ ద్వారా సంపద సృష్టించవచ్చని, దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీని త్వరలో తీసుకురానుందని వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ – వ్యర్ధాల సేకరణకు ప్రత్యేకంగా ఆర్ ఆర్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వ్యర్థాలకు నగదు కూడా ఇస్తారని వివరించారు. గుంటూరులోని ప్రతి సచివాలయంలో ఆర్ ఆర్ ఆర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నదీమా ఖాన్, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మి, డ్వామా పీడీ శంకర్, డీపీఓ సాయికుమార్, మెప్మా పీడీ విజయలక్ష్మీ, ఎస్సీ కార్పరేషన్ ఈడీ దుర్గాబాయి, ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
గుంటూరు ఎడ్యుకేషన్: నల్లచెరువులోని అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో సర్దుబాటుపై పని చేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్, డి.రవిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, విద్యార్థుల హాజరు నమోదులో అవకతవకలు, మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచి చూపడం, సరైన రికార్డులను నిర్వహించకపోవడం వంటి అంశాలపై ఎంఈఓ, డీవైఈఓలతో విచారణ జరిపించిన డీఈఓ రేణుక వారి నివేదిక ఆధారంగా సంబంధిత ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. పాఠశాలను డీఈఓ రేణుక తనిఖీ చేసిన సమయంలో 46 మంది విద్యార్థులను ఆన్లైన్ హాజరులో నమోదు చేయడం, తీరా పాఠశాలలో భౌతికంగా హాజరైన విద్యార్థులు తొమ్మిది మందే ఉండటంపై విచారణకు ఆదేశించారు. దీనిపై రెండు రోజుల క్రితం డీవైఈవో, ఎంఈవో పాఠశాలకు స్వయంగా వెళ్లి, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు తాత్కాలిక సీనియార్టీ జాబితా గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు అర్హులైన వారితో తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండోసారి విడుదల చేసిన సీనియార్టీ జాబితాలను htt pr//doegunturblogspot.com, htt pr//doenellore.50webs.com, www.prakasamschooledu.com సైట్లలో సందర్శించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 22లోపు సమర్పించాలని సూచించారు. సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తి నరసరావుపేటటౌన్: స్థానిక ప్రత్యేక ఉపకారాగారాన్ని శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి. ప్రవళిక సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిమాండ్ ఖైదీలు ఉచిత న్యాయ సహాయం పొందే విధివిధానాలను వివరించారు. బెయిల్ లభించి జామీనదారులను పెట్టుకునే స్తోమత లేని వారి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను వివరించారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ రవికుమార్ యాదవ్, ప్యానల్ న్యాయవాది, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన వినుకొండ: మదమంచిపాటి వీరాంజనేయస్వామి తిరునాళ్ల సందర్భంగా మక్కెన చినరామయ్య ఆడిటోరియంలో జాతీయ ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు కొనసాగుతున్నాయి. నాలుగ పళ్ల సైజు విభాగంలో 10 జతలు పాల్గొన్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మక్కెన వెంకట్రావు, అనుమాల సుబ్బారెడ్డి, మదాల చిరంజీవి, కుంటా కోటిరెడ్డి, జగ్గరెడ్డి, అక్కిరెడ్డి, రొడ్డా నాగిరెడ్డి, జక్కిరెడ్డి కోటిరెడ్డి, జక్కిరెడ్డి, నాగిరెడ్డి, గురువారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలు యూడైస్లో రిజిస్టర్ కావాలి నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 1వ తరగతి ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ శనివారం తెలిపారు. ప్రభుత్వం ఆర్టీఈ 12 (1)సీ ఉత్తర్వులు ఇచ్చినందున జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు cre.ap.gov.in పోర్టల్లో యుడైస్ యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. దానిలో పాఠశాల గుర్తింపు కాపీని అప్లోడ్ చేయాలని తెలిపారు. ఈనెల 19వతేది నుంచి 25వతేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. -
రాజధాని రైతులకు న్యాయం చేయండి
తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్కు రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని, సీఆర్డీఏ అధికారులు ఆ ప్రచారాన్ని ఖండించాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. శనివారం ఉండవల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉండవల్లి నుంచి ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్నారని, ప్లాట్లు కేటాయించారు గానీ, 11 ఏళ్లవుతున్నా.. వాటిని అభివృద్ధి చేయలేదని, ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వాలని రైతులను సీఆర్డీఏ అధికారు కోరుతున్నారని పేర్కొన్నారు. రైతులు భూములు ఇవ్వకుండానే ఇచ్చారంటూ కొన్ని పత్రికలు, యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరుగుతోందని, గతంలో ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసేటప్పుడు రైతుల అభిప్రాయం తీసుకోవాలని పేర్కొన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రభుత్వం రైతులను గుప్పెట్లో పెట్టుకోవడానికి యత్నిస్తోందని విమర్శించారు. రాజధాని రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉండవల్లిలో జోన్–9 ఎత్తివేయాలని, బహుళ అంతస్తులు కట్టుకునేలా రైతులకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని, అప్పుడు రైతులు సానుకూలంగా స్పందించి స్పీడ్ యాక్సెస్ రోడ్కు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది సంపర శ్రీనివాసరావు, రైతులు డాక్టర్ గాదె కన్నారావు నాయుడు, దంటు బాలాజీ రెడ్డి, పి.వీరాస్వామి, కోటేశ్వరరావు, ఆళ్ల వాసు, గాదె శివరామకృష్ణ, మున్నంగి అంజిరెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర‘ ర్యాలీ పాల్గొన్న సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తాడికొండ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు శనివారం ఉదయం నుంచి వెంకటపాలెం, మందడంలోని టిడ్కో గృహ సముదాయాలు, మల్కాపురం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు తదితర ప్రాంతాలను సందర్శించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం స్థానిక రైతులు, అధికారులతో రాజధాని అభివృద్ధి పనుల పురోగతి, గ్రామస్తులు వెల్లడించిన పలు సమస్యలపై చర్చించారు. సీఆర్డీఏ చేపడుతున్న కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. స్వర్ణాంధ్ర–2047 సంకల్పంలో భాగంగా వెలగపూడిలో పారిశుధ్య కార్మికులు, గ్రామస్తులతో కలిసి నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. ర్యాలీ స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయంతో, రాజధాని ప్రాంతంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో నిర్వహించారు. ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణాంధ్ర‘ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ఈ–వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం’ అనే థీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఎంపిక చేసినందున రాజధాని గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ, చెత్తను డంప్ చేస్తున్న విధానం, చెత్తను జిందాల్ సంస్థకు తరలిస్తున్న వాహనాల పనితీరు తదితర అంశాలను గురించి అధికారులతో కమిషనర్ చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛతా కార్యక్రమాల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. అలాగే సిటీస్ ప్రాజెక్టు కింద అమరావతిలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, ఈ– హెల్త్ కేంద్రాలు, పాఠశాలలను కమిషనర్ సందర్శించారు. ఈ భవనాలలో పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా సిటీస్ ప్రాజెక్టు కింద నిర్మించిన భవనాలను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. సిటీస్ ప్రాజెక్టు కింద అమరావతిలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలు, ఈ– హెల్త్ కేంద్రాలు, పాఠశాలల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా, అలాగే వీటిలో పనిచేసే సిబ్బంది నియామక అంశాల్లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు. ఆయా పనులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మూడేళ్ల గడువులోపు ఆయా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే మే 2న జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన సన్నాహాలనూ కమిషనర్ పరిశీలించి, అధికారులకు సూచనలు ఇచ్చారు. -
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన ముస్లింలు
తాడేపల్లి రూరల్ : రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డిని శనివారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో ముస్లిం పెద్దలు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మైనార్టీ నాయకులు మొహమ్మద్ గోరేబాబు ఆధ్వర్యంలో తాడేపల్లిలోని పలువురు ముస్లిం పెద్దలు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డిని కలిసి వక్ఫ్బోర్డు బిల్లును లోక్సభ, రాజ్యసభలో ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వక్ఫ్బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని, దానికి రాష్ట్రంలోని కూటమి సర్కారు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అబ్దుల్ రహీమ్, నూర్ మొహమ్మద్, మొహమ్మద్ అన్వర్, యండి బాబ్జి, సర్దార్, ఇర్ఫాన్, ఖలీల్, బేగ్, షేక్ కరీముల్లా, ఇబ్రహీం, షఫీ, సలీం బాషా, ఖుర్దుస్ తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో కొత్తగా నిర్మిస్తున్న రెడంతస్తుల భవన నిర్మాణ పనుల్లో శనివారం ఓ వ్యక్తి పనిచేస్తూ కిందపడి చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రామ్పూర్సిటీకి చెందిన షేక్ షాకీర్ అలీ (22) కొంతకాలంగా గుంటూరు జీజీహెచ్లో ఎంసీహెచ్ భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు. సూపర్స్పెషాలిటీ భవనంపైన వెల్డింగ్ పనులు చేసేందుకు శనివారం పైఅంతస్తుకు ఎక్కి ప్రమాదవశాత్తూ పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో జీజీహెచ్ వైద్యులు వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. షాకీర్ అలీ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
ఉత్తమ ప్రదర్శన ‘ఇది అతని సంతకం’
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరిగిన జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ నాటిక ఉత్తమ ప్రదర్శన గా ఎంపికైంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతులను నటుడు, దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి స్వీకరించారు. నాటికల పోటీలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా కళాంజలి, కట్రపాడు వారి ‘కిడ్నాప్’ నాటిక ఎంపికైంది. ఇదే నాటికకు ద్వితీయ ఉత్తమ నటిగా ఎస్.పూజిత, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ బాలనటుడు బహుమతు లు లభించాయి. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా శ్రీకిరణం మెమోరియల్, గుంటూరు వారి ‘తరమెళ్లిపోతుందిరా’ నాటిక ఎంపికైంది. గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటికకు ఉత్తమ రచన బహుమతి రాగా, అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘విడాకులు కావాలి’ నాటికలో నటించిన గంగోత్రి సాయి ఉత్తమ నటుడు బహుమతిని అందుకున్నారు. శ్రీకృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారి ‘అపస్వరం’ నాటికకు ఉత్తమ సంగీతం , శ్రీసాయికార్తీక్ క్రియేషన్స్, కాకినాడ వారి ‘దేవుడు కనిపించాడు’ నాటి కకు ఉత్తమ రంగాలంకరణ, స్వర్ణసూర్య డ్రా మా లవర్స్, హైదరాబాద్ వారి ‘సాహితీ సూక్తం’కు ఉత్తమ ఆహార్యం బహుమతులు లభించాయి. న్యాయనిర్ణేతలుగా ఎ.నర్సిరెడ్డి, బొర్రా నరసయ్య వ్యవహరించారు. ముగింపు సభలో విజేతలకు బహుమతులందించారు. నాటకకళకు ప్రోత్సాహం అవసరం ముగింపు సభలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పరిషత్ పోటీలను నిర్వహిస్తున్న ఆరాధ్యుల కన్నా, లక్ష్మణశాస్త్రిలను అభినందించారు. కళాభిమానులు, కళాపోషకులు ప్రోత్సహించాలని కోరారు. సభకు కొల్లిపరలోని శ్రీకళానిలయం కార్యదర్శి బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత నృత్యగురువులు ఆలపాటి ప్రజ్ఞ, చిలకలపూడి ముకుందప్రియను సత్కరించారు. ముగిసిన జాతీయస్థాయి నాటికల పోటీలు -
శక్తి బృందాలు నెలకొల్పాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు రేంజ్ పరిధిలో శక్తి బృందాలను ఏర్పాటు చేసి మహిళలపై నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి శనివారం మంత్రి వచ్చారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురుతో ఊడ్చారు. చెత్తను ఎత్తారు. అనంతరం గుంటూరు రేంజ్లోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాల ఎస్పీలు, ఏఎస్పీలు, డీఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అధ్యక్షత వహించారు. నేరాల నియంత్రణపై ఎస్పీలకు సూచనలు చేశారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై మాట్లాడారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల వినియోగంపై అవగాహన అవసరం అన్నారు. ప్రతి పోలీస్స్టేషన్లో మహిళా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సఖివన్ స్టాప్ కేంద్రాలను పటిష్టం చేయాలని సూచించారు. మత్తుకు బానిసలైన వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. అనంతరం ఎస్పీలు జిల్లాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి వివరించారు. పోలీస్ అధికారుల సంఘం నాయకులు హోంమంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. పోలీస్ అసోసియేషన్ విభాగ గుంటూరు సంయుక్త కార్యదర్శి లక్ష్మయ్య, కో–ఆప్షన్ సభ్యులు కరీముల్లా, కరుణాకర్ పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు రాష్ట్ర హోంమంత్రి అనిత -
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025 -
‘సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు జగన్’
తాడేపల్లి : సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, అన్ని జిల్లాల బీసీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం. అధికారంలోకి రాగానే దోచుకోవడం, దాచుకోవడమే. ఈసారి మరింత బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ పది నెల చంద్రబాబు పాలన చూస్తేనే జనానికి అర్ధమవుతుంది. ఈ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలు నియమించుకుందాం’ అని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రంలో నియంతృత్వ పాలనను చూస్తున్నాంఅధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది.అందరూ కలిసి ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తున్నారు, విశాఖలో నానారకాలుగా అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారు. కూటమి నేతల ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను గట్టిగా తిప్పికొడదాం’ అని సజ్జల సూచించారు. -
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే -
కృష్ణవేణిని అరెస్ట్ చేసి.. దాచేపల్లి సీఐ వేధింపులు: అంబటి
సాక్షి, గుంటూరు: ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్ట్ చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి? అని ప్రశ్నించారు.సోషల్ మీడియా కేసులో అరెస్టై గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలేటి కృష్ణవేణిని ములాకత్ ద్వారా పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతి రెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం, మాజీ అంబటి మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని పాలేటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్.. సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదు.కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యంగా మాట్లాడాడు. తాము చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించాడని ఆమె చెబుతోంది. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు పెడతానని సీఐ బెదిరించాడట. కృష్ణవేణి బంధువులు పోలీస్ స్టేషన్కు రాకుండా సీఐ స్టేషన్ గేట్లకు బేడీలు వేశాడు. తనను సీఐ భాస్కర్ వేధించారని కృష్ణవేణి మేజిస్ట్రేట్కి వాంగ్మూలం ఇచ్చింది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలి.సీమ రాజా, కిరాక్ ఆర్పీ.. మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలు. మాపైన అసభ్యంగా పోస్టులు పెట్టినందుకు సీమ రాజా, కిరాక్ ఆర్పీపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసులు కట్టరు. వాళ్లని లోకేష్ పోషిస్తున్నాడు కనుక వాళ్లపై కేసులు కట్టడం లేదు. గతంలో పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులకు పైగా జైలుకు పంపారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని సీఐ తనను హింసించాడని కృష్ణవేణి చెప్తోంది. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనని చెప్పే చంద్రబాబు ఇప్పుడేం చేస్తాడో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి
తెనాలిఅర్బన్: వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభు త్వం స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తుందని పలువురు ముస్లిం మత పెద్దలు ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మజ్లిసుల్ ఉలమా వల్ అయిమ్మా జమీయతే ఉలమా యే హింద్ లౌకిక వాదులు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో శుక్ర వారం మధ్యాహ్నం నిరసన, శాంతి ర్యాలీని నిర్వ హించారు. వహాబ్చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ సత్యనారాయణ టాకీస్, బోసు రోడ్డు, శివాజీచౌక్ వరకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మతానికి సమానమైన హక్కులు, ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డును కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడం రాజ్యాంగ విలువలను కాలరాయడమేనని ఆరోపించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ముస్లిం మతపెద్దలు, వివిధ సంఘాల ముస్లిం నాయకులు, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఎస్ఎఫ్ఐ, ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలిలో నిరసన శాంతి ర్యాలీ పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లింలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు -
ఆద్యంతం.. సందేశాత్మకం
ఉత్సాహంగా నాటికల పోటీలు తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం రెండు నాటికలను ప్రదర్శించారు. తొలుత అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ నాటికను ప్రదర్శించారు. ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ ఉంటుంది. నిర్దిష్ట ప్రణాళిక ఉంటుంది. సమస్యలను వాటిని ఆచరణలో పెట్టి సాధించుకునేవారి జీవితం పరిపూర్ణమవుతుంది. రాజీపడితే ఆ మనిషి వ్యక్తిత్వం మరణిస్తుంది. సమయస్ఫూర్తితో ఇంటాబయటా నెగ్గుకురాగలిగినవాడే నిజమైన యజమాని అవుతాడు అనే సందేశాన్ని చాటిందీ నాటిక. స్నిగ్ధ రచించిన ఈ నాటికను ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. ప్రధానమైన కృష్ణమూర్తి పాత్రలో దర్శకుడు ఎన్.రవీంద్రరెడ్డి నటించారు. ఇతర పాత్రల్లో వీసీకేహెచ్ ప్రసాద్, ఎన్.సూర్య, టి.శ్రీలేఖ, కుసుమసాయి నటించారు. సంగీతం లీలామోహన్. తల్లీబిడ్డల అనుబంధం ‘దేవుడు కనిపించాడు’.. చివరగా శ్రీసాయికార్తీక్ క్రియేషన్, కాకినాడ వారి ‘దేవుడు కనిపించాడు’ నాటికను ప్రదర్శించారు. తల్లీబిడ్డల అనుబంధాన్ని చాటిందీ నాటిక. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న కొడుకుల కథలను వింటున్న నేటిరోజుల్లో తాను చనిపోతానని తెలిసీ, తల్లికి ఆసరా కోసం కొడుకు పడే వేదన, ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా, కొడుకు కోసం కిడ్నీనే దానం చేసి, కొడుకు ప్రాణాలను దక్కించుకోవటానికి తల్లి పడే ఆవేదనను కళ్లకు కట్టిందీ నాటిక. ఊపిరున్నంతవరకు విడదీయలేనివీ అనుబంధాలు మరచిపోకూడదన్న సందేశాన్నిచ్చిందీ నాటిక. డాక్టర్ సింహప్రసాద్ మూలకథకు మార్కొండ దుర్గాప్రసాద్ నాటకీకరించారు. చట్రా విజయలక్ష్మీ మహేష్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో శ్రీలేఖ, సీహెచ్ మహేష్, డి.రఘుబాబు, మార్కొండ దుర్గాప్రసాద్, ఎన్.కృష్ణకాంత్, కొప్పుల శ్రీనివాసరావు నటించారు. సంగీతం రమణ. తొలుత నృత్యగురువులు ఆలపాటి ప్రజ్ఞ, చిలకలపూడి ముకుందప్రియ శిష్యబృందాలు కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరిగిన ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి పర్యవేక్షించారు. 70 గ్రాముల బంగారం చోరీ కాజ(మంగళగిరి): కాజ రామాలయం సెంటర్లో చోరీ ఘటన చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. కాజ రామాలయం సెంటర్లో ఉంటున్న ఆర్ధల నిర్మల కుమారుడు, కుమార్తెలు హైదరాబాద్లో ఉంటున్నారు. నిర్మల 15 రోజుల క్రితం హైదరాబాద్ వెల్లింది. గురువారం సాయంత్రం ఇంటి పక్కన ఉన్న వారు చూడగా తలుపులు తీసి ఉన్నట్లు చూసి హైదరాబాద్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం హైదరాబాద్ నుంచి కాజ చేరుకుని ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి అందులోని బంగారం బిస్కెట్లు ఐదు, కొన్ని బంగారు వస్తువులు మొత్త 70 గ్రాములు బంగారం చోరీకి గురైందని తెలుసుకున్నారు. రూరల్ స్టేషన్కు చేరుకుని నిర్మల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పొగాకు రైతులను ఆదుకోవాలి
కాకుమాను: ఈ ఏడాది పొగాకు సాగు చేస్తున్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెదనందిపాడులో రైతులు పండించిన పొగాకును కృష్ణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధర సగానికి సగం తగ్గిందని ఆవేదన చెందారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల కష్టాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించిందని కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల నుంచి పంటను రూ.18వేలకు కొనాలని కోరారు. కార్యక్రమంలో కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, కౌలురైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు గంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెకటశివరావు, దొప్పలపూడి రమేష్ బాబు పాల్గొన్నారు. -
కప్పం కడితే రైట్ రైట్
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కూటమి సర్కార్ దోపిడీ శృతిమించి రాగానపడింది. గ్రానైట్ పరిశ్రమల నుంచి పెద్దఎత్తున దండుకునేందుకు పచ్చనేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెల్లించే పన్ను సంగతి దేవుడెరుగు ముందు మా సంగతి చూడమంటున్నారు. పన్ను ఎగనామం పెట్టినా ఫర్వాలేదు మాకు మాత్రం నెల మామూళ్లు ఇవ్వాల్సిందేనని హుకుం జారీచేశారు. అడిగిన మొత్తం చెల్లించకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటినిచ్చేది లేదని బెదిరింపులకు దిగారు. పచ్చనేతల నెల మామూళ్లు ప్రభుత్వానికి చెల్లించే పన్ను కంటే అధిక మొత్తంలో ఉండడంతో బయ్యర్లు బెదిరిపోతున్నారు. మీకు కప్పం చెల్లించి వితౌట్(టాక్స్ లేకుండా)లో గ్రానైట్ పంపే దానికంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించి దర్జాగా తీసుకెళ్లడమే మేలని వ్యాపారులు భావిస్తున్నారు. చినబాబు కప్పం రూ.50 కోట్లు బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న గ్రానైట్ క్వారీలు, పరిశ్రమల నుంచి నెలకు రూ.50 కోట్లు ఇవ్వాలని చినబాబు జిల్లా గ్రానైట్ మంత్రిని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హుటాహుటిన గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, బయ్యర్లతో సమావేశం పెట్టి వ్యవహారం చక్కబెట్టాలని రెండు జిల్లాల మైనింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో ఇటీవల గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీ యజమానులతో అధికారులు తొలుత సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా మంత్రి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకరిద్దరికై తే కప్పం చెల్లించగలంకానీ పదుల సంఖ్యలో ఉన్న పచ్చనేతలందరికీ నెల మామూళ్లు ఇవ్వడం కుదరదని క్వారీ, పరిశ్రమల యజమానులు తేల్చి చెప్పినట్లు సమాచారం. మీరడిగినంత మొత్తం కట్టలేమని, ఇలాగైతే వ్యాపారమే మానుకుంటామని మరికొందరు వ్యాపారులు ఏకంగా మంత్రికే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇలాగైతే బయ్యర్లు పలకలు తీసుకెళ్లేందుకు ఇష్టపడరని అదే జరిగితే వ్యాపారాలు మూత పడతాయని మరికొందరు వ్యాపారులు మంత్రికి వివరించినట్లు సమాచారం. అన్నీ విన్న మంత్రి పైనుంచి వచ్చిన ఆదేశాలు పాటించడం తప్ప తాను చేయగలిగిందేమీ లేదని వ్యాపారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో మైనింగ్, విజిలెన్స్ అధికారులు మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, ప్రకాశం జిల్లా పరిధిలోని చీమకుర్తి ప్రాంతాల్లోని క్వారీలు, ఫ్యాక్టరీలపై దాడులకు దిగారు. పచ్చనేతల తీరుతో విసిగి పోయిన క్వారీ, పరిశ్రమల యజమానులు వితౌట్లో మైనింగ్ చేయడం దాదాపుగా మానుకున్నారు. కొందరు మంత్రి అనుచరులకు ముడుపులు చెల్లించి రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా గ్రానైట్ తరలిస్తున్నట్లు సమాచారం. పచ్చనేతలకు కప్పం చెల్లించి వ్యాపారం చేయడం కంటే మానుకోవడమే మేలని కొందరు బయ్యర్లు వ్యాపారానికి తాత్కాలికంగా స్వస్తిపలికారు. ఇప్పుడు ఈ విషయం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. భూగర్భ గనులశాఖలో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. గ్రానైట్లో వసూళ్ల దందా చినబాబు నెల మామూళ్లు రూ.50 కోట్లు అద్దంకి, పర్చూరు పచ్చనేతలకుచెరో రూ.8 వేలు రూ.10 వేలు డిమాండ్ చేస్తున్న గురజాల పచ్చనేత తనకు రూ.8 వేలు కావాలంటున్న నరసరావుపేట నాయకుడు కప్పం కట్టకపోతే సేల్టాక్స్, లోకల్ పోలీసులను ఉసిగొల్పుతున్న వైనం ఫ్యాక్టరీ యజమానులతో మంత్రి గొట్టిపాటి సమావేశం వసూళ్ల విషయం మీరే చూసుకోవాలని ఫ్యాక్టరీ యజమానులకు ఆదేశం తలలు పట్టుకుంటున్న పరిశ్రమల యజమానులు, బయ్యర్లు పచ్చ దోపిడీపై సర్వత్రా ఆగ్రహం శృతిమించిన పచ్చనేతల మామూళ్ల దందా చినబాబు కప్పం వ్యవహారం పక్కనబెడితే స్థాని క పచ్చనేతలంతా గ్రానైట్పై పడ్డారు. గ్రానైట్ పాలీషింగ్ పలకలు టాక్స్ లేకుండా తీసుకెళ్లేందు కు లారీకి ఏఎమ్మార్ టోకెన్కు రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. వాస్తవానికి ఏఎమ్మార్ ఇచ్చే టోకెన్ రూ.8 నుంచి రూ.10 వేలకు మించి ఉండదు. పేరుకు ఏఎమ్మార్ చెక్పోస్టులు నడుపుతున్నా అనధికారికంగా పచ్చనేతలే టోకెన్ల వ్యవహారం చూస్తున్నట్లు ప్రచారం. ఇది కాకుండా గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న పర్చూరు, అద్దంకి పచ్చనేతలకు వ్యాపారులు నెలకు చెరో రూ.8 వేలు కప్పం కడుతుండగా నరసరావుపేట పచ్చనేత రూ.8 వేలు డిమాండ్ చేస్తున్నారు. ఇక గ్రానైట్ దందాకు ఆద్యుడైన గురజాల నేత తనకు రూ.10వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండగా చిలకలూరిపేట నేత మాత్రం తనకు రూ.6 వేలు చాలన్నట్లు సమాచారం. మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 150కి తగ్గకుండా లారీలు వితౌట్లో హైదరాబాద్ కు తరలిపోతుండగా ఇందులో చిలకలూరిపేట, విజయవాడ మీదుగా 30, నరసరావుపేట, గురజాల మీదుగా 120 లారీలు వెళుతున్నట్లు సమాచారం. వీరంతా ప్రతి లారీకి కప్పం చెల్లించాల్సిందేనని బయ్యర్లకు హుకుం జారీచేశారు. ఏఎమ్మార్ టోకెన్తోపాటు పచ్చనేతలకు ఇస్తున్న కప్పంతో కలుపుకుంటే ఒక్కో లారీకి రూ.58 వేలు ఖర్చు వస్తోంది. వాస్తవంగా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించినా ఇంత మొత్తంలో ఖర్చురాదు. దీంతో బయ్యర్లు పచ్చనేతలు చెప్పిన మొత్తాన్ని చెల్లించలేమంటూ అడ్డు తిరిగినట్లు సమాచారం. ఒకవేల ఏఎమ్మార్ టోకెన్కు చెల్లించే మొత్తాన్ని రద్దు చేయిస్తే పచ్చనేతలు అడిగిన మేరకు కప్పం చెల్లిస్తామని బయ్యర్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. -
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మారో లారీ
క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ అద్దంకి: ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టిన ఘటనలో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయిన సంఘటన మండలంలోని శింగరకొండ వద్ద నామ్ రహదారిలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు నాగార్జున సిమెంటు కంపెనీ నుంచి డ్రైవర్ నరేంద్ర లారీలో ిసిమెంటు లోడు చేసుకుని ఒంగోలు బయలుదేరాడు. ఈ క్రమంలో లారీ శింగరకొండకు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దాంతో లారీ క్యాబిన్ లోపలికి చొచ్చుకుపోవడంతో డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై రవితేజ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని, క్యాబిన్లో నుంచి డ్రైవర్ను బయటకు తీసేందుకు రెండు గంటలపాటు కష్టపడ్డారు. ఎట్టకేలకు పొక్లెయిన్తో జాగ్రత్తగా క్యాబిన్ను వెనుక్కు వచ్చే విధంగా చేసి డ్రైవర్ను బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ను 108 వాహనంలో ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్యాబిన్లో డ్రైవర్ ఒక్కడే ఉండడం, అతను అపస్మారక స్థితిలో ఉండడంతో అతని వివరాలు తెలియరాలేదు. -
మంగళగిరిలో మిస్సింగ్.. నంద్యాలలో హత్య..
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఒక కానిస్టేబుల్ కనిపించడం లేదంటూ అతని భార్య, బంధువులు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో మిస్ అయిన కానిస్టేబుల్ నంద్యాల–కడప ఘాట్రోడ్లో శుక్రవారం శవమై కనిపించాడు. సేకరించిన వివరాల మేరకు నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం, తోటకందుకూరు గ్రామానికి చెందిన ఫారుక్ (30) ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా మంగళగిరి ఆక్టోపస్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. మంగళగిరి పట్టణంలోనే ఉంటున్నాడు. ఏప్రిల్ 8న ట్రైనింగ్ ఉందంటూ వెళ్లిన ఫారుక్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో 12న భార్య బషీరున్ తన బంధువులతో కలిసి ఆక్టోపస్ కార్యాలయానికి వెళ్లింది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు ఫారుక్ సెలవు పెట్టాడని అక్కడి అధికారులు చెప్పడంతో మంగళగిరి పట్టణ పోలీస్స్టేషన్లో తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 14న ఫిర్యాదు చేశారు. మంగళగిరి పట్టణ పోలీసులు మిస్సింగ్గా కేసు నమోదు చేశారు. పథకం ప్రకారం.. ఫారుక్ను హతమార్చేందుకు ఇద్దరూ పథకం పన్నారు. అతనికి ఫోన్ చేసి కొన్ని రోజులు సెలవు పెట్టుకుని రావాలని అనీష కోరింది. ఫారుక్ మంగళగిరి నుంచి నంద్యాలకు ఏప్రిల్ 8న సాయంత్రం బయలు దేరాడు. 9న అక్కడకు చేరుకున్న ఫారుక్ తనకు పరిచయమున్న వ్యక్తిని కలిశాడు. అక్కడి నుంచి బయటకు వెళ్దామంటూ ఆ వ్యక్తి మరో ఇద్దరిని తీసుకుని ఫారుక్తో కారులో బయలుదేరారు. మద్యం సేవించిన అనంతరం నంద్యాలలో కారులో వెళుతుండగా ఎదురు సీట్లో కూర్చున్న ఫారుక్ను వెనుక ఉన్న వ్యక్తి ఓ వైర్తో మెడకు గట్టిగా బిగించాడు. దీంతో ఊపిరి ఆడక ఫారుక్ అక్కడికక్కడే మరణించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వీరు మృతదేహాన్ని ఒక కవర్లో చుట్టి నంద్యాల శివారు ప్రాంతంలో ఉన్న ఓ చెరువులో పడవేశారు. కొంత సమయం తరువాత వచ్చి చూడడంతో మృతదేహాన్ని కవర్తో చుట్టడం వల్ల చెరువులో తేలుతూ కనబడింది. మరుసటి రోజు ఎవరూ లేని సమయంలో వచ్చి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి నంద్యాల – కడప ఘాట్రోడ్లో ఫారెస్ట్ ప్రాంతంలో పైనుంచి కిందకు పడవేశారు. నంద్యాల సీసీఎస్ పోలీసులు అనీషను, మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోగా, మరో యువకుడు పరారయ్యాడు. ఆ ముగ్గురిని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. నిందితులు తెలిపిన వివరాలతో ఫారుక్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫారుక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆక్టోపస్ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం పథకం ప్రకారం హత్య చేయించిన ప్రియురాలు కూతురుతో కూడా సన్నిహితంగా ఉండడాన్ని సహించలేక ఘాతుకంవిచారణలో వెలుగు చూసిన నిజాలు ఫారుక్ ఫోన్ స్విచ్చాఫ్గా ఉండడంతో ఆక్టోపస్ అధికారుల ఆదేశాల మేరకు అతని కాల్ డేటాను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. ఫారుక్ ఫోన్ లొకేషన్ నంద్యాలలో ఉన్నట్లు తేలడంతో చివరగా ఫోన్ చేసిన వారిని నంద్యాల జిల్లా పోలీసులు విచారణ చేశారు. ఈ నేపథ్యంలో నంద్యాలకు చెందిన అనీషను కూడా విచారణ చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. ఫారుక్కు పెళ్లికాక ముందు నుంచి అనీషతో పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో అనీష కుమార్తెతో కూడా ఫారుక్ సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఈ విషయమై ఫారుక్తో తరచూ గొడవ పడేది. ఫారుక్ నంద్యాలలోని తెలిసిన వ్యక్తి ద్వారా అనీషకు డబ్బులు పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో అనీష కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఫారుక్ను అడ్డు తొలగిస్తేనే పెళ్లికి అంగీకరిస్తానని అనీష చెప్పింది. -
మెగా ఫ్లయ్ఓవర్ నిర్మించాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా శంకర్ విలాస్ మెగా ఫ్లయ్ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేయాలని రాజకీయ, ప్రజా, వర్తక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. శుక్రవారం ‘బెటర్ శంకర్ విలాస్ ఫ్లయ్ఓవర్ జేఏసీ’ ఆధ్వర్యంలో గుంటూరు అరండల్పేటలోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్. భారవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ సంఘాలు, పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఫ్లయ్ఓవర్ నిర్మాణంపై ప్రజల అభీష్టానికి అనుగుణంగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్.భారవి మాట్లాడుతూ గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టును యథావిధిగా అమలు పర్చాలని కోరుతున్నామని, ప్రజల అవసరాలకు సరిపోని బ్రిడ్జిని అంగీకరించబోమన్నారు. సీపీఎం నగర కార్యదర్శి నళినీకాంత్ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు విజన్ లేకుండా నిర్మిస్తున్న ఫ్లయ్ఓవర్ నిర్మాణంపై స్పందించాలని అన్నారు. రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆర్వోబీ నిర్మాణానికి ముందుగా ఆర్యూబీ నిర్మించేందుకు నిపుణులతో సాంకేతికంగా పరిశీలన జరపాలన్నారు. ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షుడు మేడూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పీ–4 విధానాన్ని అమలు చేయడం ద్వారా ఫ్లయ్ఓవర్ నిర్మాణాన్ని చేపట్టవచ్చన్నారు. హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ మెగా ఫ్లయ్ఓవర్ నిర్మాణానికి అవసరమైన విధంగా చేస్తున్న పోరాటంలో తాము భాగస్వాములవుతామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎండీ మస్తాన్వలీ, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆప్ నాయకుడు టి.సేవా కుమార్, నర్రా శ్రీనివాసరావు, ఆడిటర్ పీవీ మల్లిఖార్జునరావు, వల్లూరు సదాశివరావు, పౌర, వర్తక, వాణిజ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ ఫ్లయ్ఓవర్ అంశంలో రాజకీయపార్టీలు, సంఘాల డిమాండ్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం వైఎస్సార్ సీపీ నుంచి హాజరైన అంబటి రాంబాబు, నూరి ఫాతిమా ప్రజాభీష్టం మేరకు నిర్మించాలని నినాదం మెగా ఫ్లయ్ఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలుపుతూ ప్రజల ట్రాఫిక్ అవసరాలను తీరుస్తున్న శంకర్విలాస్ ఆర్వోబీ స్థానంలో ప్రతిపాదించిన ఫ్లయ్ఓవర్ను మెగా ఫ్లయ్ఓవర్గా మార్చి నిర్మించాలి. సేతు బంధన ప్రాజెక్టు ద్వారా కేంద్రం మంజూరు చేసిన రూ.98 కోట్లతో సాధారణ బ్రిడ్జిగా నిర్మించడం వల్ల ప్రజల అవసరాలను తీర్చకపోగా, కొత్త సమస్యలు ఉత్పన్పమయ్యే ప్రమాదముంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని గత ఎంపీ గల్లా జయదేవ్ హయాంలో ప్రతిపాదించినట్టు హిందూ కళాశాల సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వరకు మెగా ఫ్లయ్ఓవర్ నిర్మాణాన్ని లక్షలాది మంది ప్రజలు కోరుతున్నారు. మెగా ఫ్లయ్ఓవర్తోపాటు ఆర్యూబీని నిర్మించడం ద్వారా ట్రాఫిక్ కష్టాలను తీర్చవచ్చు. – అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
గుంటూరులో అర్ధరాత్రి ఐజీ, ఎస్పీ తనిఖీలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాడీపేట నాలుగో లైన్లో గురువారం అర్ధరాత్రి గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ సతీష్ కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తదితర పోలీసు అధికారులు ఆకస్మికంగా పర్యటించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిబంధనలు అమలు, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలు వంటి పలు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణా, బహిరంగ మద్యపానం వంటి కార్యకలాపాలను అరికట్టడానికి తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు భరోసా కల్పించేలా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రికి పెరిగిన రద్దీ విజయవాడ : వారాంతం, పండుగలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన యాత్రికులతో ఉదయం 7 గంటల నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లలో రద్దీ కనిపించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రద్దీ కొనసాగగా, ఆది దంపతులకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. -
సువర్ణ అక్షరం
జగనన్న పాలన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలకు ప్రాణం పోసిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన చదువుల విప్లవం భావి ప్రభుత్వాలకు దారి చూపుతోంది. విద్యారంగానికి దశ, దిశ చూపిన ఆయన ముందుచూపు, పేదల చదువుల కోసం పడిన తపన చిరస్థాయిగా నిలిచింది. ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను ‘‘జగనన్న ఆణిముత్యాలు’’ కార్యక్రమం ద్వారా నగదు ప్రోత్సాహాలతో సత్కరించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మహత్తరమైన నిర్ణయం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాటడుతున్న ప్రభుత్వ పాఠశాలలను మనబడి నాడు–నేడు ద్వారా సకల హంగులతో ఆధునికీకరించి, పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులకు పెన్నిధిగా నిలిచిన వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చిన జగనన్న ఆణిముత్యాలు బాటలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న షైనింగ్ స్టార్స్ రూపుదిద్దుకుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల ప్రతిభావంతుల కోసం ఆణిముత్యాలు 2003 మార్చి, ఏప్రిల్లో జరిగిన ఇంటర్మీడియెట్, టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులతో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా సత్కరించారు. గుంటూరు జిల్లాలోని నియోజకవర్గ స్థాయిలో టెన్త్లో 23 మంది, ఇంటర్లో 15 మంది విద్యార్థులకు అదే ఏడాది జూన్ నెలలో జరిగిన కార్యక్రమాల ద్వారా అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. వీరితో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో ప్రతి పాఠశాల నుంచి టెన్త్లో తొలి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సైతం ఎంపిక చేసి, అదనంగా మరో 469 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు 2003 జూన్ 20న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష చొప్పున నగదు ప్రోత్సహకాన్ని అందుకున్నారు. జగనన్న ఆణిముత్యాలు ప్రోత్సాహకాలు ఇలా.. జిల్లాస్థాయిలో టెన్త్, ఇంటర్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.50వేలు, రూ.30వేలు, రూ.10వేలు చొప్పున, నియోజకవర్గ స్థాయిలో తొలిమూడు స్థానాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వరుసగా రూ.15వేలు, రూ.10వేలు, రూ.ఐదు వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. వీరితోపాటు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ఎంపిక చేసిన తొలి ముగ్గురు విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా రూ.మూడువేలు, రూ.రెండువేలు, రూ.వెయ్యి చొప్పున అందజేశారు. ప్రతిభ చూపిన విద్యార్థుల తల్లిదండ్రులను, సంబంధిత హెచ్ఎం, ప్రిన్సిపాల్స్ను సైతం సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలకు దశ, దిశ చూపిన వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఊపిరిపోసుకున్నాయి. నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, గోరుముద్ద కార్యక్రమాలతో ప్రగతిబాట పట్టిన ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక విద్య దిశగా అడుగులు వేశాయి. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీతోపాటు తరగతి గదుల్లో ఐఎఫ్పీల ద్వారా డిజిటల్ విద్యాబోధనకు నాంది పలికారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యాబ్స్, నగదు అందించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తొలి సీఎంగా నిలిచిన వైఎస్ జగన్ విద్య ప్రభుత్వ బాధ్యత కాదన్న వారితోనే ప్రస్తుతం విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేలా చేశారు. ప్రభుత్వ విద్యారంగానికి ఊపిరి మనబడి నాడు–నేడు, విద్యాకానుక, అమ్మఒడి, గోరుముద్ద కార్యక్రమాలతో ప్రగతిబాట పట్టిన ప్రభుత్వ పాఠశాలలు ట్యాబ్స్ పంపిణీ, ఐఎఫ్పీలతో డిజిటల్ విద్యాబోధనకు నాంది టెన్త్, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జగనన్న అణిముత్యాలు ద్వారా నగదు ప్రోత్సాహకాలు అదే బాటలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం చేపట్టిన ప్రస్తుత కూటమి సర్కారు ల్యాప్ట్యాప్తో సరిపెట్టిన వైనం ఇంటర్ విభాగంలో జిల్లా నుంచి ఒక్క విద్యార్థిని ఎంపిక ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి ఎంఈసీ గ్రూప్లో 967 మార్కులు సాధించిన గుంటూరు నగరానికి చెందిన సర్వేపల్లి రాజేశ్వరిని షైనింగ్ స్టార్ కింద ప్రభుత్వం ఎంపిక చేసి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అభినందించింది. ఈనెల 18న ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజేశ్వరికి ల్యాప్టాప్ అందజేశారు. గుంటూరు జిల్లా నుంచి ఒక్క విద్యార్థినినే ఎంపిక చేసి, ల్యాప్టాప్ అందజేసి మమ అనిపించారు -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపరిశీలన
తాడికొండ: మే 2న వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, జేసీ భార్గవ్తేజ తదితరులు పరిశీలించారు. డాక్టరేట్ పొందిన ఆటో డ్రైవర్ శంకర్రావుకు అభినందనలు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఆటో డ్రైవర్గా పనిచేస్తూనే కాలికట్ యూనివర్సిటీ ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన గండికోట శంకర్రావును ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్టిడబ్ల్యూఎఫ్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య సత్కరించారు. శుక్రవారం స్థానిక పాతగుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు అధక్షతన అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ లక్ష్మయ్య మాట్లాడుతూ గండికోట శంకరరావు ఆటో డ్రైవర్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా, ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు, నాయకులు పాల్గొన్నారు. 21న చీరాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చీరాల మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజల సౌలభ్యం కోసం చీరాల నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహి స్తున్నట్లు తెలిపారు. చీరాల నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. చెలరేగిన మృగాడు క్రోసూరు: స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు. పాక్ జలసంధిని ఈదిన గణేష్ విజయవాడస్పోర్ట్స్: తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు ఉన్న పాక్ జలసంధిని ఆంధ్రప్రదేశ్ పారా స్విమ్మర్ బి.గణేష్ సాహసోపేతంగా ఈదాడు. శుక్రవారం ఉదయం 5.50 గంటలకు తలైమన్నార్లో ఈతను ప్రారంభించి సాయంత్రం 4.20కి ధనుష్కోటికి చేరుకున్నారు. 28 కిలోమీటర్లు పొడవున్న సముద్రాన్ని 10.30 గంటల్లో ఈదాడు. తెలుగు రాష్ట్రాల్లోని పారా స్విమ్మర్లలో పాక్ జలసంధిని ఈదిన మొట్టమొదటి పారా స్విమ్మర్గా ఖ్యాతిగడించారు. స్విమ్మర్ గణేష్ ప్రస్తుతం ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్ కోచ్గా పని చేస్తున్నాడు. -
అనుమానంతో బ్లేడుతో భార్య గొంతు కోసిన భర్త
క్రోసూరు(పల్నాడు): స్థానిక బోయ కాలనీలో భార్యపై అనుమానం పెంచుకుని భర్త బ్లేడుతో గొంతుకోసిన సంఘటన శుక్రవారం జరిగింది. స్టేషన్ రైటర్ దాసు వివరాల ప్రకారం.. బోయ కాలనీకి చెందిన చార్ల శ్రీను భార్య మల్లమ్మ. ఆమె ఎవరితోనో ఫోనులో మాట్లాడుతుండటంతో అనుమానపడి శ్రీను బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. చుట్టపక్కల వారు ఆమెను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు 25 కుట్లు వేశారు. ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించాలని వైద్యులు సూచించారు. శ్రీను, మల్లమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా అయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైటర్ దాసు తెలిపారు. -
పవన్.. ‘సనాతన ధర్మం అంటే కాషాయ దుస్తులు ధరించడం కాదు’
పల్నాడు జిల్లా,సాక్షి: తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెట్టే ప్రయత్నించారు. ఇదే అంశంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారుతిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయంపై కాసు మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈ విశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేంతవరకు విషయం బయటికి రాలేదు.టీటీడీ ఈవో,ఛైర్మన్ గోవులు చనిపోతున్నాయని చెప్తుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రం గోవులు చనిపోవటం లేదని చెబుతున్నారు. తొమ్మిది పది నెలల నుంచి నెలకు 10 నుంచి 15 గోవులు చనిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? గోవుల మరణాలపై చర్చకి సిద్ధమని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.భూమన కరుణాకర్రెడ్డి చర్చకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకున్నారు. చర్చ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం కోసం వాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని హడావిడి చేశాడు. సనాతన ధర్మం అంటే కాషాయం బట్టలు వేసుకొని తిరగటం కాదు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.గతంలో లడ్డు వ్యవహారంలో కట్టు కధ అల్లి రాజకీయం చేసి వైఎస్ జగన్ మీద వేసే ప్రయత్నించారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు. ప్రభుత్వం రాజకీయాలు పక్కనపెట్టి గోవులు ఎందుకు చనిపోతున్నాయో కారణాలు కనుక్కోండిగిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు 20 వేలుఇస్తానని ప్రకటించారు. ఇప్పటికి 40 వేలు రైతులకి బకాయి ఉన్నారు. చంద్రబాబు రైతులకు ఇస్తానన్న డబ్బులు చెల్లిస్తే వారికి ఎంతో కొంత ఉపయోగపడతాయి’అని సూచించారు. -
Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు. -
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పల్నాడు జిల్లా,సాక్షి: దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ తనను బాగా ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి గురజాల కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.రెడ్బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు గురువారం గురజాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో పాలేటి కృష్ణవేణి అరెస్టుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ‘దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఐదు గంటల పది నిమిషాలకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. రాత్రి తినడానికి నాకు ఆహారం కూడా ఏమి పెట్టలేదు. మూడున్నరకి కొంత ఆహారం పెట్టారు. మేం చెప్పినట్టు వినకపోతే సీఐ భాస్కర్ కేసులు పెడతామని బెదిరించారు.నా భర్త రాజ్ కుమార్పైన గంజాయి కేసు పెడతామని సీఐ భాస్కర్ బెదిరించారు. నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని సీఐ భాస్కర్ నన్ను వేధించాడు. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని టార్చర్ చేశారు. ఈ పోస్టులు వెనక పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పమని ఇబ్బంది పెట్టారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని బలవంతం చేశారు’ అని అన్నారు. అయితే తాను పెట్టిన పోస్టులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కృష్ణవేణి న్యాయమూర్తికి చెప్పారు. అనంతరం మిమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నన్ను బాగా ఇబ్బంది పెట్టారని కృష్ణమూర్తి చెప్పగా.. పోలీసులు పైన కంప్లైంట్ ఇస్తారా? అని న్యాయమూర్తి కృష్ణవేణిని అడిగారు. అందుకు తాను పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా.. కృష్ణవేణి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె తరుఫు న్యాయవాది.. న్యాయమూర్తిని కోరారు. వాదన సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలతో తాళాలు వేసిన విజువల్స్ న్యాయమూర్తిగా చూపించారు. అనంతరం, కృష్ణవేణికి 14 రోజులు పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను గుంటూరు కోర్టుకు తరలించారు. కృష్ణవేణి కస్టోడియల్ టార్చర్పై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్కు కోర్టు మెమో జారీ చేసింది. -
బంధువే.. రాబందై
తాడేపల్లి రూరల్: మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి సోదరిపైన కూడా అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అంజిరెడ్డి కాలనీలో ఇటీవల జరగ్గా..ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు..కాలనీలోని ఓ మహిళ తన భర్తను వదిలేసి..తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి లంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పదేళ్లు. రెండవ కుమార్తెకు తొమ్మిదేళ్లు. వీరి తల్లి మద్యానికి బానిస అయ్యింది. చిన్నారులకు మేనమామ వరుస అయ్యే లంకబాబు పదేళ్ల చిన్నారిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బుధవారం తల్లి మద్యం తాగి ఉన్నప్పుడు ఆమె రెండో కుమార్తెతో లంకబాబు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ చిన్నారి ఇంట్లో నుంచి పరుగులు తీసి బయటకు వచ్చి పక్క ఇంట్లో మహిళలకు చెప్పింది. దీంతో వారు లంకబాబును చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా లంకబాబు పరారయ్యాడు. లంకబాబు ఆ మహిళ పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ చిన్నారి భయంతో బయటకు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడిందని, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో బాధిత చిన్నారులను పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి ఏం జరిగిందో తెలుసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లంకబాబు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుని ఆయనపై పోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
గురుశిష్యుల అనుబంధం వెలకట్టలేనిది
ఏఎన్యూ(గుంటూరు): గురుశిష్యుల అనుబంధం వెలకట్టలేనిదని హైదరాబాద్లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ ఎం.బాలలత అన్నారు. వర్సిటీలో గురువారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విలువలతో సమాజంలో బాధ్యతాయుతంగా ఆదర్శవంత జీవనాన్ని సాగించాలన్నారు. ప్రతిభతోపాటు స్థిరత్వం ముఖ్యమని సూచించారు. వ్యక్తి తలుచుకుంటే ఒక వ్యవస్థగా మారి, ఒక గొప్పశక్తి కాగలడని పేర్కొన్నారు. గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి కార్యాలయ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధికారి చిటికెల చిన్నారావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, కృత్రిమ మేధ ప్రాముఖ్యాన్ని తెలుసుకోవాలని చెప్పారు. వార్షికోత్సవానికి ఏఎన్యూ ఆర్ట్స్, కామర్స్, లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. తర్వాత బాలలతను సత్కరించారు. అనంతరం రెక్టార్ ఆచార్య కె.రత్నషీలామణి, వీసీ కె.గంగాధరరావుతోపాటు పలువురిని సన్మానించారు. రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు పొందిన వర్సిటీ ప్రొఫెసర్లు ఎం.త్రిమూర్తిరావు, వై.అశోక్ కుమార్, ఎన్.వి.కృష్ణారావు, పూర్ణచంద్రరావులను వర్సిటీ వీసీ రెక్టార్ రిజిస్ట్రార్, ఓఎస్డీ తదితరులు సత్కరించారు. కార్యక్రమానికి ఎం. త్రిమూర్తిరావు, సీహెచ్ లింగరాజు, డాక్టర్ రవి శంకర్ రెడ్డి కన్వీనర్లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో పూర్వ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ విభాగాధిపతి డాక్టర్ జి.కొండలరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ వీరయ్య, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రమీల రాణి పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగ కళాకార స్వర నేత్ర బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద గాయకులు దామోదర గణపతి రావు బృందం పలు గీతాలను ఆలపించింది. సినీ గాయకురాలు సాయి శిల్ప గీతాలాపనతో అలరించారు. వర్సిటీలోని డ్యాన్స్ విభాగం విద్యార్థులు నృత్యాలతో ఆహూతులను ఆకట్టుకున్నారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, బృందాలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత -
యోగా టీచర్లకు జీతాలు చెల్లించాలి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఏపీలోని సుమారు 800 ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తించే యోగా ఇన్స్ట్రక్టర్స్, సహాయకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం యోగా టీచర్లు పోలీస్ కార్యాలయం (డీపీఓ) వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వలి మీడియాతో మాట్లాడుతూ సుమారు 1,700 మంది నిరుద్యోగులకు రావాల్సిన రూ.40 కోట్లకుపైగా యోగా ఫౌండేషన్ మోసం చేసిందని ఆరోపించారు. ఫౌండేషన్ నిర్వాహకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో యోగా ఉపాధ్యాయులను నియమించాలని గతంలో అధికారులు ఆదేశాలు ఇచ్చారని, ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని ఓ యోగా హెల్త్ ఫౌండేషన్కు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. దీంతో కొందరు నిరుద్యోగులకు రెండు నెలలు యోగాలో తర్ఫీదిచ్చారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తించేలా ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. ప్రతి నెలా రూ.35 వేలు జీతం చెల్లిస్తామని చెప్పి, ఇప్పటికి ఫౌండేషన్ నిర్వాహకులు జీతాలు సక్రమంగా చెల్లించలేదని ఆరోపించారు. జీతాలు చెల్లింపులు, ఉద్యోగ రక్షణతోపాటు ఫౌండేషన్ నిర్వాహకుల నుంచి రక్షణ కల్పించాలని యోగా టీచర్లు కోరారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మస్తాన్రావు, రెహ్మాన్, అల్లాబక్షు, సుభాని, బాధితులు సునీత, గొల్ల బాబ్జి, సంతోష్, అరుణ, విమల పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
గుంటూరు వెస్ట్: అమరావతి రాజధాని పరిధిలో భారీ నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్న దృష్ట్యా అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ఇతర అంశాలు పునఃప్రారంభం కానున్న దృష్ట్యా అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. నిర్మాణాలకు వచ్చే కార్మికులకు భద్రత ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అసాంఘిక శక్తుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ రంగంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోపాటు, అనుకోని ఘటనలు జరిగినప్పుడు వైద్యులు, అంబులెన్సులు, మందులను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రాజధాని పరిధిలో పీహెచ్సీని ఇప్పటికే 30 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. కార్మికులకు అవసరమైన చికిత్స అక్కడ చాలా వరకు అందుబాటులో ఉంటుందన్నారు. నిర్మాణ పనులకు కార్మికులు కుటుంబ సభ్యులతో వస్తారు కనుక, చదువుకునే పిల్లలను స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ రాజధానిలో భారీ నిర్మాణాలతో చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అయితే వారి రక్షణకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. రాజధాని పరిధిలో శాంతి భద్రతలు చక్కగా ఉండేలా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులకు చట్టపరంగా అందించాల్సిన సౌకర్యాలపై కార్మిక శాఖ దృష్టి పెట్టాలన్నారు. నిర్మాణ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీపీఓ నాగసాయికుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. కలెక్టర్ వర్చువల్గా మాట్లాడుతూ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు భూములను గుర్తించామని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఈ–వేస్ట్ కార్యక్రమాన్ని ప్రతి నెలా మూడో శనివారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను నగరపాలక సంస్థతో అనుసంధానమైన ఏజెన్సీకి అందిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, జడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీపీఓ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు -
అగ్నిప్రమాదాల నివారణపై మాక్డ్రిల్
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతిరోడ్డులోని నెక్ట్స్జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాకి డ్రిల్కు రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్ని ప్రమాదాలను నివారించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలను రక్షించే విధానాలను అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కరపత్రాలను మాదిరెడ్డి ప్రతాప్ విడుదల చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన డీజీ ప్రతాప్ వారితో కలిసి ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కె. శ్రీకాంత్బాబు, డాక్టర్ కె.శ్రీవిద్య, అగ్నిమాపక శాఖాధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేటి నుంచి మిర్చి యార్డుకు వరుస సెలవులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శుక్రవారం గుడ్ఫ్రైడే, శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఇచ్చినట్టు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని కోరారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సరుకును యార్డులోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. సోమవారం నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని వివరించారు. 1,58,818 బస్తాలు మిర్చి విక్రయం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 1,39,333 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,58,818 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 57,411 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. నిలిచిన మట్టి తవ్వకాలు తాడికొండ: తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో తెలుగు తమ్ముళ్లు అక్రమంగా చేపట్టిన మట్టి తవ్వకాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అప్రమత్తమైన అధికారులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు నిలుపుదల చేయించారు. చెరువు బలోపేతం పేరుతో జరుగుతున్న దందాకు బ్రేక్ పడడంతో ‘సాక్షి’ చొరవను పలువురు గ్రామస్తులు అభినందించారు. హనుమ ఆలయంలో అవినీతిపై అధికారులు సీరియస్ ! పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు నాజ్ సెంటర్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న అవినీతి తంతుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ‘సాక్షి’ దినపత్రిక జిల్లా పేజీలో గురువారం హనుమా.. అవినీతి కనుమా శీర్షికన ప్రచురించిన కథనానికి దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు స్పందించినట్టు తెలుస్తోంది. ఆలయ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్న ఆలయ ప్రధాన అర్చకుడు, సిబ్బంది, ఆలయ దుకారణదారుడి అంశంపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. దీనిపై దేవదాయశాఖ ఆర్జేసీ స్థాయి అధికారి విచారణ చేయనున్నారని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడి ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్కిశెట్టి బుచ్చమ్మ, రాగాల భువనేశ్వరిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పోలీసుల ద్వారానే అక్రమ కేసులు బనాయించడం, అర్ధరాత్రి అరెస్టులు చేయడం, బెదిరించడం వంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రోద్బలంతోనే గ్రామాల్లో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ దాడులకు ఎవరూ భయపడరని, ఎదురు తిరిగే రోజు వస్తుందన్నారు. మహిళలని కూడా చూడకుండా దాడి చేసి కాలు విరగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా దారుణం ఎక్కడుందని కూటమి పాలకులను నిలదీశారు. చిన్న గొడవలు జరిగినా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి దెబ్బలు తగలకపోయినా 307 కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడులను ఖండించాల్సింది పోయి ప్రోత్సహించడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే వెంట పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెనాలి: బుర్రిపాలెం రోడ్డులోని మున్సిపల్ కంపోస్టు యార్డు ఖాళీ చేసే ప్రక్రియ పనులు నత్తనడక నడుస్తున్నాయి. రెండునెలలుగా 20 వేల టన్నుల వ్యర్థాలను మాత్రమే విభజన చేశారు. ఇంకా 80 వేల టన్నుల చెత్తనిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఏప్రిల్ ఆఖరుకు యార్డు ఖాళీ చేస్తామన్న అధికారులు హామీ నెరవేరేలా కనిపించటం లేదు. ఎంతోకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న కంపోస్టు యార్డు సమస్యకు ఇప్పట్లో మోక్షం లభించేలా లేదని పెదవి విరుస్తున్నారు. రోజుకు 80 టన్నుల చెత్త ఉత్పత్తి తెనాలి పట్టణ జనాభా ఏటికేడాది విస్తరిస్తుండటం తెలిసిందే. జనాభా రెండు లక్షలకు చేరుకుంది. రోజురోజుకీ చెత్త పెరుగుతోంది. ప్రస్తుతం పట్టణంలో రోజుకు 80 టన్నుల చెత్త వస్తోంది. ఇందులో తడిచెత్త, పొడిచెత్త, ప్లాస్టిక్ సంచులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటున్నాయి. రోజువారీ చెత్తను తగ్గించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇదే కంపోస్టుయార్డులో తడిచెత్తనుంచి వర్మీకంపోస్టు, బయోగ్యాస్ తయారీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మిగిలిన చెత్తంతా యార్డులో పేరుకుపోతోంది. ప్రజలందరికీ కష్టాలే..! కంపోస్టు యార్డు సమీపంలోని పంటపొలాలకు చెత్త సమస్యగా మారిందని సమీప రైతులు ఎప్పటి నుంచో ఫిర్యాదుచేస్తున్నారు. ఈ చెత్త వల్ల ప్రహరీలు పడిపోతుండటం మరో సమస్య. వీటికితోడు చెత్తనుంచి మిథైల్ గ్యాస్ విడుదలవుతూ, చెత్త దానికదే తగులబడుతోంది. వ్యర్థాల దగ్థంతో రోజుల తరబడి హానికరమైన పొగలు చుట్టుపక్కల అరకిలోమీటరు వరకూ వ్యాపిస్తున్నాయి. ప్రజలు కళ్లు మండడంతోపాటు ఊపిరి పీల్చుకో వటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ దారిలోనే పలు విద్యాసంస్థలు, దాల్ మిల్లులు ఉన్నాయి. అతిదగ్గర్లోనే అపార్టుమెంట్లు, బీసీ కాలనీ ఉన్నాయి. కంపోస్టు యార్డు కారణంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలంతా బాధపడుతున్నారు. చెత్త తొలగించాలని కోరుతున్నారు. 9న్యూస్రీల్ మున్సిపల్ కంపోస్టు యార్డు వ్యర్థాల తొలగింపులో జాప్యం ఏప్రిల్ ఆఖరుకు ఖాళీ చేస్తామన్నఅధికారుల హామీకి తూట్లు రెండునెలల్లో కేవలం 20 వేల టన్నులు మాత్రమే తొలగింపు యార్డులో ఇంకా 80 వేల టన్నులు పేరుకున్న లక్ష టన్నుల వ్యర్థాలు!24 గంటలు పనిచేసేలా ప్రణాళిక కంపోస్టు యార్డు నుంచి వ్యర్థాల తొలగింపు పనుల వేగవంతానికి 24 గంటలు పనిచేసేలా ప్లాన్ చేస్తున్నాం. కాంట్రాక్టు ప్రకారం 63 వేల టన్నులు తొలగించాలి. తర్వాత మిగిలిపోయే దాదాపు 35 వేల టన్నుల వ్యర్థ్యాల తొలగింపు విషయం తర్వాత ఆలోచిస్తాం. ఇదే కంపెనీకి ఇవ్వాలా? మళ్లీ టెండర్లు పిలవాలా? అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. – ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ ఇన్చార్జి ఇంజినీరు తొలగించింది 20వేల టన్నులే..! గత జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రాక్టు గడువు జులై 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. టెండరు పిలిచినపుడు 63 వేల టన్నుల తొలగింపునకు కాంట్రాక్టు ఇచ్చారు. ప్రస్తుతానికి ఇందులో మూడో వంతు అంటే 20 వేల టన్నులను మాత్రమే తీయగలిగారు. టెండరు ప్రకారం ఇంకా 43 వేల టన్నుల వ్యర్థాలున్నాయి. ఏప్రిల్ నాటికి యార్డు ఖాళీచేస్తామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఇలాగే పనులు కొనసాగితే జూలై పూర్తయ్యేలోగానైనా వ్యర్థాల తొలగింపు జరుగుతుందనే నమ్మకం లేదు. కాంట్రాక్టు పూర్తయ్యాక ఇంకా తొలగించాల్సిన వ్యర్థ్యాలు మరో 35 వేల టన్నులు ఉండిపోతాయి. మరి వాటి సంగతి ఏం చేస్తారనేది తెలియాల్సి ఉంది. మొత్తంమీద కంపోస్టు యార్డు కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించటం లేదు. కంపోస్టు యార్డులోని వ్యర్థాల పరిమాణంపై 2022లో డ్రోన్తో సర్వే చేశారు. అప్పటికి 63,555 టన్నులు ఉన్నట్టు అంచనా వేశారు. గత రెండేళ్లలో మరో 35 వేల టన్నులు చేరి ఉంటుందన్నది అంచనా. మొత్తం లక్ష టన్నుల వ్యర్థాలు అన్నమాట. సమీప బుర్రిపాలెంకు చెందిన కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కంపోస్టుయార్డును అక్కడ్నుంచి తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టన్నుకు రూ.503 చొప్పున రూ.3.17 కోట్లకు టెండరు ఖరారైంది. అమృత్ నిధులు, మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. టెండరు దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధునిక ట్రెమ్మెల్ను ఫిబ్రవరిలో ఇక్కడకు చేర్చింది. ముందుగా కూలీలను నియమించి చెత్తలోని పెద్ద టైర్లు, కర్రలు, రాళ్లను తొలగించేశారు. తర్వాత ట్రెమ్మెల్తో ప్లాస్టిక్, ఇతర చెత్త ఒకవైపు చేర్చుతుండగా, మరోవైపున మట్టి, ఇసుక, కంకర వంటివి గుట్టపోస్తున్నారు. మట్టిని కొందరు రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లకు తీసుకువెళుతున్నారు. ప్లాస్టిక్, ఇతర చెత్తను జిందాల్/సిమెంటు ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. మరోవైపు రోజువారీ పట్టణంలోంచి వచ్చే చెత్తను ఇందులో చేర్చకుండా కంపోస్టు యార్డులోనే ప్రత్యేకంగా వేయిస్తున్నారు. మున్సిపల్ వాహనాల్లో ఆ చెత్తను జిందాల్కు పంపేస్తున్నారు. -
చట్టబద్ధంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి
అమరావతి: పల్నాడు జిల్లాలోని అమరావతి – బెల్లంకొండ రోడ్డు విస్తరణ పనులు ఇటీవల రెండు నెలలుగా ధరణికోట, అమరావతి పరిధిలోని గ్రామాలలో చేపట్టారు. పలువురు గ్రామస్తులు అభ్యంతరం తెలిపినా ఆర్ అండ్ బీ అధికారులు ఇష్టారాజ్యంగా నోటీసులు, నష్ట పరిహారాన్ని ఇవ్వకుండానే భవనాలను, ఇళ్లను కూలుస్తున్నారు. కట్టా రాధికాదేవి సహా మరికొందరు అధికారుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించాలని కోరుతూ పిటిషనర్లు తరఫున న్యాయవాది కోడె రమేష్ బుధవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి... ఆర్ అండ్ బీ శాఖ చట్టబద్ధంగా సర్వే నిర్వహించి, సంబంధికులకు నోటీసులు జారీ చేయాలన్నారు. చట్ట ప్రకారం ప్రక్రియను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది బాలాజీని హైకోర్టు ఆదేశించింది. దీినిపై పలువురు ఇళ్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. లేకుంటే పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీలో నిలిచిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి చీరాల అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవిబాబు, పి.దయాబాబులు మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అలానే ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్లు మంజూరు చేయాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్యవిధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 114 జీవోలో పొందుపరచిన మేరకు నైట్ అవుట్ అలవెన్సులను రూ.150 నుంచి రూ.400 వరకు చెల్లింపులు చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డెలిగేట్ డి.ప్రవీణ్కుమార్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. చీరాల కేంద్రంగా గోవా మద్యం చీరాల: చీరాల కేంద్రంగా గోవా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రైళ్లలో గోవా నుంచి చీరాల వాడరేవు, తీర ప్రాంతాలకు తరలించి రిసార్టులకు విక్రయిస్తున్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. గురువారం సమాచారం అందుకున్న ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎకై ్సజ్ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గోవా మద్యం నిల్వ ఉంచిన స్థావరాలపై దాడులు నిర్వహించారు. వాడరేవు వైఎస్సార్ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.55 వేలు విలువ చేసే 550 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏసీ విజయ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ మద్యంను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా తరచూ మద్యం తరలించిన వారిపై కఠినమైన చట్టాలను ఉపయోగిస్తామన్నారు. దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు సీఐ రామారావు, చీరాల ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు బి.శ్రీహరి, రమాదేవి, రాజేంద్రప్రసాద్, టూటౌన్ ఏఎస్సై టి.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు ప్రారంభం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): బృందావన్గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై ఏపీ ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతీ సమితి, భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ టీవీ, కళాంజలి క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు మొదలయ్యాయి. ఆలయ పాలక మండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి పుట్ట గుంట ప్రభాకరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఏపీ నాటక అకాడమీ నిర్వాహకులు గుమ్మడి గోపాలకృష్ణ, హంస అవార్డు గ్రహీత కావూరి సత్యనారాయణ, ఉగాది పురస్కార గ్రహీత నల్లక శ్రీనివాసరావు, టీవీ నటుడు, నిర్మాత డాక్టర్ వలేటి అప్పారావు ప్రసంగించారు. శనివారం వరకు స్వర్ణాంధ్ర నాటకోత్సవాలు జరుగుతాయని కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం శ్రీదుర్గాభవాని నాట్యమండలి (తెనాలి) ఆధ్వర్యంలో ఆరాధ్యుల ఆదినారాయణరావు నిర్వహణలో శ్రీకృష్ణ తులాభారం, పౌరాణిక పద్య నాటకం ప్రదర్శిం చారు. నటీనటులు వారి పాత్రల్లో పౌరాణిక పద్యాలతో నాటక అభిమానులను మెప్పించారు. డోలక్పై సాంబిరెడ్డి చక్కటి సహకారాన్ని అందించారు. -
కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
చేబ్రోలు: కుమార్తె పెళ్లికి వెళ్లి వస్తుండగా కారు ప్రమద వశాత్తూ బ్రిడ్జి సైడ్వాల్ను వేగంగా ఢీ కొట్టడంతో తల్లిదండ్రులతోపాటు వధువు అన్నకు గాయాలైన ఘటన చేబ్రోలులో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పొన్నూరు రూరల్ మండలం కట్టెంపూడి గ్రామానికి చెందిన రోహా, రాధిక దంపతులు తమ కుమార్తెను తాడికొండకు చెందిన అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం భార్యాభర్తలు, తమ కుమారుడు నవీన్ కుమార్రెడ్డితో కలిసి తాడికొండ నుంచి కారులో స్వగ్రామానికి గురువారం బయలు దేరారు. నవీన్కుమార్రెడ్డి కారు నడుపుతున్నాడు. చేబ్రోలులోని సినిమాహాలు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వంతెన సైడ్ వాల్ను వేగంగా ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు బాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న ముగ్గురికీ ముఖానికి, కాళ్లు, చేతులు, నడుంకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనం ద్వారా క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు వధువు అన్నకు కూడా.. చేబ్రోలులో అదుపుతప్పిన కారు -
గోవుల మృతిపై విచారణ చేపట్టాలి
చినకాకాని(మంగళగిరి): తిరుపతిలో గోవుల మృత్యువాతపై ప్రభుత్వం విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ మంటలు సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చినకాకానిలో జరుగుతున్న జనసేవాదళ్ శిక్షణ తరగతులకు హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతిలో లడ్డూ కల్తీ అయిందని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రంలో ప్రధానిగా ఉన్న మోదీ 11 ఏళ్లలో హిందువులకు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ పడిపోయిందని విమర్శించారు. ప్రధాని అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ మోదీ పాలనలో మహిళలపై దాడులు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జంగాల అజయ్కుమార్, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్బాబు, గని, ఆరేటి రామరావు పాల్గొన్నారు. -
రైతుల దుస్థితిని కళ్లకు కట్టిన ‘అన్నదాత’
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక నాటక కళాపరిషత్, తెనాలి ఆధ్వర్యంలో ఇక్కడి రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రెండు నాటికలను ప్రదర్శించారు. తొలుత కళాంజలి, హైదరాబాద్ వారి అన్నదాత నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో రైతుల పరిస్థితిని కళ్లకు కట్టిందీ నాటిక. అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్న వర్తమాన స్థితిని ఎత్తిచూపింది. రైతాంగం మనుగడ ప్రశ్నార్థకం కావటం వ్యవసాయాధారిత దేశంలో ఓ గొప్ప విషాదంగా వర్ణించిందీ నాటిక. వల్లూరు శివప్రసాద్ రచించిన ఈ నాటికను కొల్లా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించారు. వివిధ పాత్రల్లో శోభారాణి, సురభి ప్రియాంక, భుజంగరావు, పున్నయ్యచౌదరి, రాధాకృష్ణ, తిరుమల, శివరాం, ప్రశాంత్ నటించారు. వినోదాన్ని పంచిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’.. అనంతరం సహృదయ, ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ నాటికను ప్రదర్శించారు. నలభీముడిలా వంటల చేయగల దిట్ట అయిన సుధీర్ సాఫ్ట్వేర్ ఇంజినీరుగా చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్లో అటు వృత్తిపని, ఇంట్లోకి తరచూ వచ్చే చుట్టాలకు వంటలు చేస్తూ సతమతమైన వ్యవహారాన్ని ఆద్యంతం హాస్య సన్నివేశాలకు వినోదాత్మకంగా సాగిందీ నాటిక. చివరకు ఉద్యోగానికి రిజైన్ చూసి ‘సౌమ్యలక్ష్మీ హోమ్ ఫుడ్స్’ పేరుతో స్టార్టప్ను ప్రారంభిస్తాడు. కేకే భాగ్యశ్రీ మూలకథను అద్దేపల్లి భరత్కుమార్ నాటకీకరించగా, డి.మహేంద్ర దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో కొత్త శివరాంప్రసాద్, ఆళ్ల హరిబాబు, షేక్ షఫీ ఉజ్మా, వి.నాగేశ్వరరావు, లహరి నటించారు. తొలుత యనమదల రీతిక శిష్యబృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆహుతుల అభినందనలు అందుకుంది. తెనాలి కళాకారుల సంఘం నిర్వహణలో జరుగుతున్న ఈ నాటికల పోటీలను గౌరవాధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, కార్యదర్శి పిట్టు వెంకటకోటేశ్వరరావు పర్యవేక్షించారు. -
ఇసుక లారీ బీభత్సం
●ఆర్టీసీ బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన వైనం ● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం చేబ్రోలు: ప్రమాదవశాత్తూ ఇసుక లారీ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న షాపుల్లోకి దూసుకుపోయిన ఘటన చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో గురువారం జరిగింది. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు గుంటూరుకు బయలుదేరి వేజండ్ల అడ్డరోడ్డు వద్ద ప్రయాణికులను ఎక్కించుకోవటం కోసం నిలిచి ఉంది. అదే సమయంలో తెనాలి నుంచి నారా కోడూరు వైపు వేగంగా వస్తున్న టర్బో ఇసుక లారీ ఆర్టీసీ బస్సును వెనుకవైపు ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, మెకానిక్ షాపులలోకి దూసుకువెళ్లింది. ప్రమాద సమయంలో షాపుల వద్ద ఎవరూ లేకపోవటంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చేబ్రోలు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని ఇసుక లారీని, ఆర్టీసీ బస్సును పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒడిశా టు ఆంధ్రా గంజాయి రవాణా
తాడేపల్లి రూరల్ : ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతోందని రుజువైంది. తాజాగా గురువారం తాడేపల్లి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు వివరాలను నార్త్జోన్ డీఎస్పీ మురళీకృష్ణ విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. తాడేపల్లి కృష్ణాకెనాల్ జంక్షన్ వద్ద కొందరు గంజాయి తాగుతున్నారన్న సమాచారం రావడంతో తాడేపల్లి సీఐ కల్యాణ్రాజు, ఇతర సిబ్బంది నిఘా పెట్టారు. పక్కా పథకం ప్రకారం.. గంజాయి తాగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. పాత ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద వార్పునకు చెందిన పీతా దినేష్ కుమార్, పోలకంపాడుకు చెందిన కోడె సూర్యగణేష్, ఉండవల్లికి చెందిన మల్లిశెట్టి అనీల్, పెనుమాకకు చెందిన కళ్ళం అనీల్రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. వీరు ఒడిశాలోని బరంపురంలో గంజాయి కొని అక్కడి నుంచి రైలు ద్వారా తాడేపల్లికి తీసుకువచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్టు నిర్ధారణైంది. ఈ నలుగురిలో పీతా దినేష్కుమార్పై కృష్ణాజిల్లాలో ఓ గంజాయి కేసు నమోదై ఉంది. మిగిలిన ముగ్గురు తొలిసారి పట్టుబడ్డారు. వీరు డబ్బులు అవసరమైనప్పుడు ద్విచక్ర వాహనాలు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఒడిశా వెళ్లి గంజాయి కొని తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్ముతుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. గంజాయికి అలవాటు పడిన అంతర్జాతీయ స్విమ్మర్ నిందితుల్లో మల్లిశెట్టి అనీల్ అంతర్జాతీయ స్విమ్మర్ అని, అతనూ గంజాయికి అలవాటు పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని డీఎస్పీ తెలిపారు. వ్యాయామాలపై అవగాహన కలిగిన క్రీడాకారులూ వ్యసనాలకు అలవాటు పడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో ప్రతిభ కనబర్చిన తాడేపల్లి సీఐ కల్యాణ్రాజు, సిబ్బందిని ఎస్పీ సతీష్కుమార్ అభినందించారని డీఎస్పీ వెల్లడించారు. తాడేపల్లి పోలీసులకు పట్టబడిన నలుగురు యువకులు నిందితుల్లో అంతర్జాతీయ స్విమ్మర్! -
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎండ తీవ్రత దృష్ట్యా మే నెల అంతా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని, మినీ అంగన్వాడీ టీచర్లందరికీ మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒ.లలిత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.సారమ్మ కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక అమరావతి రోడ్డులోని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల సమస్యలను విన్నవించారు. వృత్తిపరమైన ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వాణిశ్రీ, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నట్టు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నోటీసు కూడా కమిషనర్కు అందించినట్టు వివరించారు. సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రతినిధుల వినతి -
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న తెనాలి–బుర్రిపాలెం రోడ్డులో బాలిక సైకిల్పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అటకాయించాడు. బాలికను ఎత్తుకుని పొలాల్లోకి తీసుకెళుతుండగా ఆమె కేకలు వేసింది. పరిసరాల్లో ఉన్న వారు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని దుగ్గిరాలకు చెందిన బక్కెన రవిబాబుగా గుర్తించారు. తెనాలి రైల్వేస్టేషన్ వద్ద ఉన్న అతన్ని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బాలికపై లైంగిదాడి తాడికొండ: బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోక్సో కేసు నమోదు చేసినట్లు తాడికొండ సీఐ వాసు తెలిపారు. వివరాల ప్రకారం తాడికొండకు చెందిన బాలిక ఈనెల 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన శ్రీకాంత్ ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వాసు తెలిపారు. స్థలం వివాదంలో ముద్దాయిలకు జరిమానా, జైలు అద్దంకిరూరల్: స్థల వివాదంలో ఆరుగురు ముద్దాయిలకు ఎఎస్జే కోర్టు జడ్జి జరిమానా, శిక్ష విధించినట్లు సీఐ సుబ్బరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలు.. అద్దంకి మండలం మైలవరం గ్రామంలో 2020లో జరిగిన స్థల వివాదంలో అప్పటి ఎస్సై వీ.మహేష్ మన్నేపల్లి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ఫైల్ చేశారు. విచారణలో భాగంగా ముద్దాయిలైన ఉడుములపల్లి సోమయ్య, కొండనాగరాజు, కుడుములపల్లి పెదకోటయ్య, కుడుములపల్లి శ్రీనివాసరావు, కుడుములపల్లి కోటయ్య, కొండా చిరంజీవిలపై కేసు నిరూపణ కాగా గురువారం అద్దంకి ఎఎస్జే కోర్టు జడ్జి డీ. నాగ వెంకటలక్ష్మి ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. చీరాలలో డ్రోన్లతో నిఘా చీరాల: చీరాల పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు తెలిపారు. గురువారం రాత్రి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి, మద్యం సేవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకునే దిశగా నిఘాను మరింత కఠినతరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం ద్వారా చీరాలలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ నాగభూషణం, పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక నిఘా కార్యక్రమాన్ని నిర్వహించారు. -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మానవాళి కోసం జీసస్ చేసిన మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలని వివరించారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలోనూ ఆయన తాజాగా ఓ సందేశం ఉంచారు. On this Good Friday, we remember the ultimate sacrifice of Jesus Christ for humanity and reflect on the power of love, forgiveness, patience, and hope.— YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2025 -
చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని.. ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించటం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పది నెలల్లోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దోచుకుంటుందని ధ్వజమెత్తారు.‘‘సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే పేరుతో కొత్తరకం దోపిడీ మొదలు పెట్టారు. ప్రతి యూనిట్కి రూ.40 పైసలు చొప్పున పెంచి దోచుకుంటున్నారు. రూ. 4 వేల కోట్లు ఈ కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారు. కరెంటు వాడుకునేది తక్కువ, బిల్లుల మోత ఎక్కువగా ఉంది. అదనపు ఛార్జీలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని అరుణ్కుమార్ పేర్కొన్నారు. -
88 ఏళ్ల వృద్ధుడికి అరుదైన ఆపరేషన్
విలేకరుల సమావేశంలో డాక్టర్ ఫణీంద్ర కుమార్ వెల్లడి గుంటూరు మెడికల్: స్వర పేటికకు పెరాలసిస్ వచ్చి ఎనిమిది నెలలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న 88 సంవత్సరాల వృద్ధుడికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన ఆపరేషన్ చేసి గొంతు సమస్యను సరిచేసినట్లు గుంటూరులోని శ్రీ సత్య సాయి ఫణింద్ర కుమార్ ఈఎన్టీ అండ్ వాయిస్ క్లినిక్ అధినేత, వాయిస్ సర్జన్ డాక్టర్ వి.ఫణీంద్ర కుమార్ చెప్పారు. బుధవారం గుంటూరు బ్రాడీపేటలో ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 88 సంవత్సరాల లక్ష్మణరావు 8 నెలలుగా స్వర పేటిక పెరాలసిస్కు గురై మాట రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. లక్ష్మణరావు కుమారులు అమెరికాలో ఉండటంతో అక్కడికి వెళ్లిన వృద్ధుడు అమెరికాలో వైద్యులను సంప్రదిస్తే ఇండియాలో ఆపరేషన్ చేసే వైద్యులు ఉన్నారని అక్కడే చేయించుకోవాలని సూచించారు. దీంతో లక్ష్మణరావు పిల్లలు ఇండియాలోని తమ బంధువుల సలహా మేరకు ఫిబ్రవరి నెలలో చికిత్స కోసం లక్ష్మణరావును తమ వద్దకు తీసుకు వచ్చారన్నారు. వైద్య పరీక్షలు చేసి స్వర పేటిక పెరాలసిస్ వల్ల గొంతు రాకపోవడం, పీలగా మారటం చాలా చిన్నగా మాట్లాడటం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఎలాంటి కారణం లేకుండానే స్వర పేటిక పెరాలసిస్ రావడంతో ఫిబ్రవరి 17న సుమారు రెండు గంటలసేపు థైరోప్లాస్టి ఆపరేషన్ చేసి సమస్యను నివారించామన్నారు. కొద్దిరోజులపాటు వాయిస్ థెరపిస్ట్ పర్యవేక్షణలో లక్ష్మణరావుకు స్పీచ్ థెరపి చేయించడంతో నే డు పూర్తిస్థాయిలో మాట్లాడుతున్నట్లు డాక్టర్ ఫణీంద్ర కుమార్ వెల్లడించారు. మెడికల్ జర్నల్స్ లో 88 సంవత్సరాల వయసున్న వృద్ధుడికి ఆపరేషన్ చేయటం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి వెల్లడించారు. ఆపరేషన్ ప్రక్రియలో ఈఎన్టీ వైద్యులు డాక్టర్ భార్గవ్, మత్తు వైద్యులు డాక్టర్ సురేంద్ర పాల్గొన్నట్లు తెలిపారు. అరుదైన ఆపరేషన్ చేసి స్వర సమస్యను సరిచేసి మామూలు వ్యక్తి లాగా మాట్లాడే విధంగా చేసిన డాక్టర్ ఫణీంద్ర కుమార్ కు సీనియర్ సినీ నటుడు, లక్ష్మణరావు బావ అయిన మురళీమోహన్ అభినందనలు తెలిపారు. -
పెట్రోలు ట్యాంకర్ బోల్తా
చేబ్రోలు: సడన్గా బ్రేక్ వేయడంతో పెట్రోలు ట్యాంకర్ లారీ బోల్తా పడిన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి నుంచి చీరాలకు పెట్రోలుతో వెళ్తున్న హెచ్పీ కంపెనీ లారీ చేబ్రోలు మండలం నారాకోడూరు జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. దగ్గరకు వచ్చేవరకు స్పీడ్ బ్రేకర్ కనిపించక, డ్రైవర్ సడన్ బేక్ర్ వేయడంతో ఘటన జరిగింది. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ కె.వీరాస్వామికి గాయాలవటంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా ప్రాంతానికి ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ జనార్థన్, పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణ, తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బెంబేలెత్తిన స్థానికులు, వాహనదారులు సుమారు ఎనిమిదివేల లీటర్లు పెట్రోలు ఉన్న ట్యాంకర్ లారీ బోల్తా పడటంతో పాటు కొంత లీకేజీ అవుతుండటంతో స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది పెట్రోలు ట్యాంకర్ చుట్టూ నురగ (ఫోమ్)ను స్ప్రే చేసి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. పొన్నూరు–గుంటూరు రోడ్డులో వాహన రాకపోకలను పోలీసులు నిలుపుదల చేశారు. ట్రాఫిక్ను ఇతర ప్రాంతాల ద్వారా మళ్లించారు. ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు త్రుటిలో తప్పిన ప్రమాదం.. డ్రైవర్కు గాయాలు చేబ్రోలు మండలం నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ వద్ద ఘటన నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ ఎదురు జీబీసీ రహదారిపై పెట్రోలు ట్యాంకర్ బోల్తా పడటంతో పొన్నూరు–గుంటూరు రోడ్డులో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను నారాకోడూరు వద్ద, పొన్నూరు వైపు నుంచి వచ్చే వాహనాలను చేబ్రోలు వద్ద వేరే రహదారుల వైపు మళ్లించారు. ఆ రోడ్లు సింగిల్ లైన్లు కావటంతో వాహ నాలు ఎదురు ఎదురుగా వచ్చి పలు చోట్ల గంటల కొద్దీ నిలిచిపోయాయి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. -
గుంటూరు
గుణదలకు క్రైస్తవుల పాదయాత్రదుగ్గిరాల: ఆర్సీఎం మత పెద్దలు, దీక్ష తీసుకున్న క్రైస్తవులు బుధవారం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి డాక్టర్ సురేష్ యామర్తి ఆధ్వర్యాన పాదయాత్ర చేశారు. సంకటహర చతుర్థి పూజలు అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరుడి ఉపాలయంలో బుధవారం సంకట హర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. అర్చకుడు శేషసాయిశర్మ ఆధ్వర్యంలో ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 515.00 అడుగుల వద్ద ఉంది. ఇది 140.3150 టీఎంసీలకు సమానం. గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 20257 -
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పల్లె పడక
● కూటమి పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులే ● వారి కష్టాలు తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం ● వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ రేపల్లె రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ ఆరోపించారు. చెరుకుపల్లి మండలం గుల్లపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముకాయడమే కాకుండా పేదలను ఇబ్బంది పెట్టేలా కూటమి పాలన ఉందన్నారు. పది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన ‘పల్లె పడక’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. చెరుకుపల్లి మండలం అల్లావారిపాలెంలో ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అదే రోజు గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. రాత్రికి గ్రామంలో బస చేసి, ప్రజలతో మమేకమై అక్కడే నిద్రించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
మద్యం మత్తులో సముద్రంలోకి దిగితే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: మద్యం మత్తులో సముద్రంలోకి దిగే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, ఈ మేరకు పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. బుధవారం సూర్యలంక తీరంలో జిల్లా ఎస్పీ పర్యటించారు. తీరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, గజ ఈతగాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సూర్యలంక బీచ్ పర్యాటకంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిందన్నారు. వేసవి కావడంతో యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దానికి అనుగుణంగా సందర్శకుల రక్షణ కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. తీర ప్రాంతంలో పోలీస్ గస్తీని ముమ్మరం చేయడంతోపాటు యాత్రికులు ప్రమాదాలకు గురైనప్పుడు వారిని రక్షించేందుకు స్థానిక, మైరెన్ పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కువ లోతులోకి వెళ్లే వారిని సులభంగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు డ్రోన్లను వినియోగించాలని పేర్కొన్నారు. సముద్ర తీరాలకు విహారానికి వచ్చే యాత్రికులు పోలీస్ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సముద్రంలో నిర్దిష్ట లోతు దాటి లోపలకి వెళ్లకుండా యాత్రికులను అప్రమత్తం చేస్తూ సముద్రంలో జెండాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. యాత్రికులు బీచ్ పరిసరాల్లో వ్యవహరించాల్సిన తీరును వివరిస్తూ తీరంలో ప్రచార బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. లోతుకు వెళ్తున్న యాత్రికులను అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండాలన్నారు. గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది లైఫ్ జాకెట్స్ ధరించి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించేందుకు ఆంబులెన్్స్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగినా జైలు శిక్ష తప్పదు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదు బీచ్ సందర్శకులకు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్డూడీ హెచ్చరిక -
హనుమా.. అవినీతి కనుమా!
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరం లాలాపేటలోని శ్రీ వేంకటేశ్వస్వామి గ్రూప్ ఆలయాలకు సంబంధించి కొంత మంది సిబ్బంది, అర్చకులు వ్యవహరిస్తున్న తీరు భక్తులకు తీరని మనోవ్యథను కలిగిస్తోంది. వేంకటేశ్వరస్వామి గ్రూప్ ఆలయాల కింద నాజ్సెంటర్లోని అభయాంజనేయస్వామి, జగన్నాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. దీనిలో భాగంగా ఇటీవలి కాలంలోనే ఆంజనేయస్వామి దీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సిబ్బందిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆలయ ప్రధాన అర్చకుడిపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించటంతో పాటు సిబ్బందిని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆయన చెప్పిన మాట వినకుంటే అక్కడ వేధింపుల పర్వం తప్పదని చెబుతున్నారు. ఫిర్యాదుల పరంపర ఆంజనేయస్వామి దేవస్థానం, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై, దేవదాయ ధర్మదాయ శాఖ ఉద్యోగులపై పలు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో హనుమాన్ దీక్షా సమాజంలోని కొంతమంది సభ్యులు నేరుగా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన శ్రీరామనవమి రోజున కల్యాణోత్సవంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.40వేల వరకు వసూలు చేసి, వారివరకే కల్యాణం నిర్వహించటంతో పాటు, ఆలయానికి కట్టాల్సిన రూ.2వేలు రశీదు ఇవ్వలేదని, దాతలకు సైతం ఎటువంటి రశీదులు ఇవ్వలేదని చెబుతున్నారు. హనుమాన్ దీక్షా సమాజంలో సైతం స్వామి వారి మాలధారణలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం బెంగళూరు నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన అనుచరగణం చెప్పిన విధంగానే కార్యక్రమాలు జరిపిస్తున్నారని తెలుస్తోంది. హనుమాన్ దీక్షా సమాజానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా.. గత కొన్నేళ్లుగా స్వాములకు భిక్ష పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ దీక్షా సమాజానికి సంబంధించి కొంత మంది వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వీటితో పాటుగా ఎటువంటి అనుమతులు లేకుండా వారి కుటుంబసభ్యులు కొంత మందిని అర్చకులుగా నియమించుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో గోడలకు వేయించిన స్వామి వారి బొమ్మల రంగులు పెయింటింగ్స్, పాలరాయితో చేయించిన బొమ్మలకు సంబంధించి రూ.లక్షలు భక్తుల నుంచి వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో ఇదే పరిస్థితి నగరంలో లాలాపేట గ్రూప్ ఆలయాలతో పాటు పాతగుంటూరులోని అగస్తేశ్వరస్వామి రికార్డ్ అసిస్టెంట్ 15 ఏళ్లకు పైగా అక్కడే తిష్టవేసి ఉండటంతో దోపిడీకి తెరదీశారని భక్తులు చెప్పుకుంటున్నారు. కొత్తపేట శివాలయంతో పాటు నగరంలో ప్రముఖ ఆలయాల్లో ఉద్యోగులు, ఈఓలు, అర్చకులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై దేవదాయశాఖ డీసీ కేబీ శ్రీనివాస్ను వివరణ అడగగా ఆయన తనకు ఏమి సంబంధం లేదంటూ చెప్పటం గమనార్హం. దుకాణదారులతోనూ కుమ్మక్కు విచారించి చర్యలు తీసుకుంటాం నాజ్సెంటర్ ఆంజనేయస్వామి దేవస్థానంపై వస్తున్న ఆరోపణలను విచారిస్తాం. పూర్తిస్థాయిలో అన్ని విషయాలు తెలుసుకున్న తరువాత అధికారులకు నివేదిక అందజేస్తాం. టోకెన్లు తెంచకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఖచ్ఛితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. – ఎ.రామకోటిరెడ్డి, లాలాపేట గ్రూప్ ఆలయాల ఏసీ దేవదాయ శాఖ ఆదాయానికి శఠగోపం గుంటూరులోని దేవదాయశాఖ ఆలయాల్లో అవినీతి పర్వం నాజ్సెంటర్ ఆంజనేయస్వామి ఆలయంలో తారస్థాయికి.. పూజలకు టోకెన్లకు కూడా ఇవ్వకుండా భక్తుల నుంచి డబ్బులు వసూలు అనుమతులు లేకుండా సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్న అర్చకులు పూర్తిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం ఆంజనేయస్వామి దేవస్థానంలో వేలం ద్వారా దుకాణాలను దక్కించుకున్న వారితోనూ ఆలయ అర్చకులు, సిబ్బంది కుమ్మకై ్క వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనపడుతోంది. తమలపాకుల పూజ, తులసీపూజ, అంకుర్పాణ మొదలగు ప్రతి పూజలకు ఖచ్ఛితంగా దేవదాయ శాఖకు నగదు చెల్లించాల్సిందే. ఈ పూజలు చేయించుకోదలచిన భక్తులు ముందు రోజే రూ.300 చలానా కట్టి వారి పేర్లు నమోదు చేసుకోవాలి. అయితే ఆలయ ప్రధాన అర్చకుడు, సిబ్బంది ఆలయం బయట ఉన్న దుకాణంలో మాత్రమే సామగ్రిని కొనాలని లేకుంటే పూజలకు ఇతరత్రా సామగ్రి పనికిరావని భక్తులకు చెప్పి భయపెడుతున్న పరిస్థితి ఉందని తెలుస్తోంది. దీంతో దేవదాయశాఖ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. పూజకు రూ.300, సామాగ్రి కిట్కు రూ.600 కలుపుకొని మొత్తం రూ.900 చెల్లిస్తే.. దుకాణదారుడు ఉదయం పూజకు వచ్చిన భక్తులకు ఆలయంలో పూజా సామగ్రి బుట్టలు ఇచ్చానని చెబుతాడు. ఇదీ ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. చిన్న పల్లికల బుట్టలో ఏదో నామ్కే వాస్తే.. వస్తువులు ఇచ్చి భక్తులను మభ్య పెడుతున్నారనే వాదనలు వినవస్తున్నాయి. కిట్లో రావాల్సిన 27 వస్తువులకు గాను కేవలం 10 మాత్రమే ఇస్తున్నారని భక్తులు చెబుతున్నారు. -
యార్డుకు 1,59,032 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,59,032 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,57,640 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.9,800 నుంచి రూ.13,500 వరకు లభించింది. తాలు రకం మిర్చి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 76,896 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. పసుపు ధరలు దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో 572 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ● కొమ్ములు 388 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠ ధర రూ.10,750, గరిష్ట ధర రూ.12,200, మోడల్ ధర రూ.11,700, ● కాయలు 184 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ఠ ధర రూ.10,750, గరిష్ట ధర రూ.12,200, మోడల్ ధర రూ.11,700, మొత్తం 429 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు ఆయన తెలిపారు. కీబోర్డులో గిన్నిస్ రికార్డు పెదకాకాని: మ్యూజికల్ కీ బోర్డులో కొప్పురావూరుకు చెందిన ఉషారాణి రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్లో స్థానం దక్కించుకుంది. పెదకాకాని మండలంలోని కొప్పురావూరు గ్రామానికి చెందిన టి.ఉషారాణి స్ఫూర్తి మహిళా సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2024 డిసెంబరు 1వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ గంట సమయం పాటు 17 దేశాలకు చెందిన 1090 మంది ఒకే టైమ్లో నాన్స్టాప్గా కీ బోర్డు ప్లే చేయడం జరిగింది. ఈ వీడియో రికార్డును నాస్టర్ అగస్టీన్ దండంగి ఆధ్వర్యంలో ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ వారు కొప్పురావూరుకు చెందిన టి.ఉషారాణిని గిన్నిస్బుక్ రికార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ మణికొండలో నిర్వహించిన కార్యక్రమంలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండంగి, బ్రదర్ అనిల్ కుమార్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్ల చేతుల మీదుగా సర్టిఫికెట్, మెడల్ను టి.ఉషారాణికి అందజేశారు. -
మణిపాల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్, లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ తెలిపారు. బుధవారం మణిపాల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలేయం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అవయవాల్లో ప్రధానమైనదని, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, శరీరానికి శక్తి సరిగ్గా అందాలన్నా, విష పదార్థాలు బయటకు వెళ్లాలన్నా లివర్ సరిగ్గా పనిచేయాలన్నారు. మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ప్రోగ్రామ్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న 60 మంది రోగులలో దాదాపు 13 మంది రోగులు ఈ కొత్త ఎర్లీ రికవరీ ఆఫ్టర్ సర్జరీ ఈఆర్ఏఎస్ కార్యక్రమం నుంచి విజయవంతంగా ప్రయోజనం పొందారని వివరించారు. మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ తక్కువ సమయంలో మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా మారిందన్నారు. పిల్లలలో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడిని నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలల క్రితం కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న నాలుగు సంవత్సరాల బాలుడికి జీవించి వున్న దాతనుంచి కాలేయ మార్పిడిని విజయవంతంగా మణిపాల్ హాస్పిటల్ వైద్యబృందం శస్త్రచికిత్స నిర్వహించిందని తెలిపారు. సాధారణంగా కాలేయ మార్పిడి తరువాత రోగిని 20 రోజులలో డిశ్చార్జి చేస్తారని, కానీ ఇటీవల 56 సంవత్సరాల వయస్సు గల కాకినాడకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్కు కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం 5 రోజుల్లో డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ అరవింద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ రాజేష్ చంద్ర పాల్గొన్నారు. -
ప్రధాని సభకు పటిష్ట ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్: మే 2వ తేదీన అమరావతిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్ కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా లతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులకు విధులు కేటాయించిందన్నారు. జిల్లా అధికారులకు కూడా వారు నిర్వహించాల్సిన విధులపై సూచనలు జారీ చేశామన్నారు. ప్రధాని పర్యటనను అధికారులు ప్రతిష్టగా భావించి విజయవంతం చేయాలన్నారు. ప్రధాన సభలో పాల్గొనే ముందు ప్రధాని రోడ్షో ఉంటుందని వాటి ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాంగణమంతా శానిటేషన్ చక్కగా ఉండాలని చెప్పారు. ప్రాంగణమంతా సుందరీకరణ చేయాలన్నారు. అవసరమైన సిబ్బందిని ఆయా శాఖలు నియమించుకోవాలన్నారు. సభా ప్రాంతంలో సీటింగ్ ఏర్పాటుతో పాటు మంచినీరు, స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు. రూట్మ్యాప్పై అవగాహన ఉండాలి.. కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్పై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని తెలిపారు. వాహనాల పార్కింగ్కు 5 ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనే వాహనాలు పార్క్ చేసే విధంగా చూడాలని తెలిపారు. బ్యారికేడ్లు, మొబైల్ టాయ్లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతారని, వారు సురక్షితంగా ఇంటికి చేరే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివరించారు. అడిషన్ ఎస్పీ సుప్రజ, డీఆర్ఓ ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.గంగరాజు, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన.. వెలగపూడి(తాడికొండ): మే 2వ తేదీన తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో వివిధ శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపధ్యంలో ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, వీవీఐపీలు ప్రయాణించే మార్గాలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్లు నవీన్, ప్రవీణ్ చంద్, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, సీఆర్డీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి -
చెరువును చెరబట్టారు
● అక్రమ తవ్వకాలు జరిపి జేబులు నింపుకొంటున్న వైనం ● ట్రాక్టరుకు రూ.650 వసూలు చేస్తూ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి ● గ్రామంలో బావుల్లో నీరు ఇంకిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలు ● టీడీపీలో ఇరువర్గాల పోరుతో షాడో ప్రజా ప్రతినిధి వద్దకు చేరిన మట్టి పంచాయితీ పాములపాడు చెరువులో టీడీపీ నేతల మట్టి దందా పాములపాడు(తాడికొండ): తాడికొండ మండలం పాములపాడు గ్రామంలో టీడీపీ నాయకుల మట్టి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతుంది. పూడికతీత పేరుతో గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా తెలుగుతమ్ముళ్లు అక్రమ దందాకు తెరలేపారు. తాగునీటి చెరువులో అక్రమ తవ్వకాలకు తెరలేపి మట్టిని అందిన కాడికి అమ్ముకొని జేబులు నింపుకొంటున్నారు. ట్రాక్టరుకు రూ.650 నుంచి దూరాన్ని బట్టి రూ.1000 వరకు వసూలు చేస్తూ అక్రమ సంపాదనకు తెరలేపారు. నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి సమాచారం ఇచ్చి తీర్మానం చేసిన అనంతరం అందరి ఆమోదంతో చెరువు అభివృద్ధి చేసి గట్లు పట్టిష్టం చేయాలి. సీనరేజీ రూపంలో వచ్చిన ఆదాయాన్ని పంచాయతీలో జమచేయాల్సి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా జమ చేయకుండా వెనకేసుకుంటున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. షాడో ప్రజా ప్రతినిధి చెంతకు పంచాయితీ పాములపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల పంచాయితీ షాడో ప్రజా ప్రతినిధి చెంతకు చేరింది. ఇరువర్గాలు తమకు వాటా అందడం లేదంటూ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదులు చేయడంతో తెరవెనుక ఉన్న సదరు ప్రజా ప్రతినిధి పోలీసు, రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేసి బుధవారం మట్టి తవ్వకాలను నిలుపుదల చేయించారు. అనంతరం అక్రమ మైనింగ్ చేస్తున్న తమ్ముళ్లు కార్యాలయానికి చేరుకొని ఏం మాట్లాడారో ఏమో తెలియదు కానీ సాయంత్రానికి అంతా చక్కబెట్టుకొని మళ్లీ దందా ప్రారంభించారు. ● దీనిపై తాడికొండ సీఐ కె.వాసును వివరణ కోరగా ఎలాంటి అనుమతులు లేనందున మట్టి తవ్వకాలు నిలిపివేయించడం జరిగిందన్నారు. తిరిగి ప్రారంభించిన సంగతి తమకు తెలియదని, మైనింగ్ జరుగుతుంటే నిలుపుదల చేయిస్తానని తెలిపారు. నిబంధనలకు పాతర నిబంధనల ప్రకారం మైనింగ్ నిర్వహించాలంటే పంచాయతీ తీర్మానం, రెవెన్యూ, మైనింగ్ అధికారుల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి అనుమతులు ఏమీ లేకుండానే జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గత 5 రోజులుగా ఈ తంతు రాత్రి పగలు, తేడా లేకుండా కొనసాగుతుండటంతో గ్రామస్తులు జేబులు గుల్ల చేసుకొని మట్టిని తోలుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు మరమ్మతుల పేరుతో పరిమితికి మించిన లోతు తవ్వి టీడీపీ నాయకులు జేబులు నింపుకొంటుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి సరే దోపిడీకి తెరలేపి జనం జేబులు గుల్ల చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
పీఎఫ్ పనులపై వచ్చి ఉపాధ్యాయుడు మృతి
● గుంటూరులోని డీఈఓ కార్యాలయంలో కుప్పకూలిన ఉపాధ్యాయుడు చల్లా వెంకటరెడ్డి ● జూన్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఇంతలోనే మృత్యువాత గుంటూరు ఎడ్యుకేషన్: బోధన వృత్తిలో సుదీర్ఘ సేవలందించిన ఉపాధ్యాయుడు హఠాన్మరణం చెందారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న చల్లా వెంకటరెడ్డి (62) బుధవారం పీఎఫ్ క్లియరెన్స్, ఎన్ఓసీ కోసం గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని విజిటర్స్ కుర్చీలో కూర్చుని ఉండగానే, తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన వెంట ఉన్న కుమారుడు ప్రసన్నాంజనేయులు రెడ్డితో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది హుటాహుటిన సమీపంలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తక్షణమే సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక రమేష్ ఆస్పత్రికి వచ్చి వెంకటరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆయన కుమారుడిని పరామర్శించి, అంబులెన్స్లో ఆయన స్వస్థలమైన పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి పంపారు. మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొంది, కుటుంబ సభ్యులతో కలసి శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన ఉపాధ్యాయుడు ఈ విధంగా హఠాన్మరణం చెందడంతో తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా పీఎఫ్ క్లియరెన్స్, ఎన్ఓసీ కోసం నరసరావుపేట డీఈఓ కార్యాలయానికి వెళ్లాల్సిన వెంకటరెడ్డి సరైన సమాచారం లేకపోవడంతో గుంటూరు డీఈఓ కార్యాలయానికి వచ్చి ఈ విధంగా మృతి చెందారు. -
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
పట్నంబజారు: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందితో పలు ప్రాంతాల్లో ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. సంగడిగుంట, పొన్నూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ తీగల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలపై మాక్డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం ప్రచార వాల్పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. గుంటూరు–2 ఫైర్ స్టేషన్ అధికారి పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. కేరళకు తరలిస్తున్న గోవులు పట్టివేత మంగళగిరి: నగర పరిధిలోని కాజ టోల్గేట్ వద్ద 30 గోవులను పట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి కేరళకు గోవులను తరలిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం వీహెచ్పీ నేతలు టోల్గేట్ వద్ద కాపలా వుండి 30 గోవులను తరలిస్తున్న కంటైనర్ను, డ్రైవర్ అన్సారీని పట్టుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు గోవులను గో ఆశ్రమానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సబ్ జైలులో జిల్లా జడ్జి పరిశీలన రేపల్లె రూరల్: రేపల్లె సబ్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సయ్యద్ జియావుద్దీన్ బుధవారం సందర్శించారు. జైలు పరిసరాలను, ఖైదీల గదులను, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. నేరం ఆరోపించబడి ప్రైవేటు న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రభు త్వ న్యాయవాదిని ఏర్పాటు చేసిందన్నారు. అవసరమైన వారు ప్రభుత్వ న్యాయవాది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. కార్య క్రమంలో ప్యానెల్ న్యాయవాది గుమ్మడి కుమార్బాబు, సబ్ జైల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు యద్దనపూడి: మండలంలోని పూనూరు, చింతగుంటపాలెం, గన్నవరం గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన పంట కల్లాల్లో తడిసి ముద్ద కావటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే అకాల వర్షంతో మరింత నష్టం చేకూరిందని వాపోతున్నారు. సుమారు 2 గంటలపాటు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిగా వర్షం పడటంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న, పందిళ్లపై ఉన్న పొగాకు పంటలు పూర్తిగా తడిసిపోయాయి. తద్వారా పంటకు బూజు, ఫంగస్ పట్టి పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైభవంగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం పిడుగురాళ్ల : పట్టణంలోని శ్రీ రామ తీర్థ సేవాశ్రమం బజార్లోని శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవల ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. బుధవారం గాయత్రి పీఠం ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ శర్మ శాస్రోక్తంగా పూజలు నిర్వహించి మేధా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం కందుల శ్రీనివాసరావు తండ్రి జ్ఞాపకార్థం రూ. 17 లక్షలను ఆలయ పునర్నిర్మాణానికి అందించారు. వేలమంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కళా పురస్కారాలు ప్రదానం
తెనాలి: డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి చతుర్ధ ఆహ్వాన నాటికల పోటీల్లో అయిదోరోజైన బుధవారం తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన సాంఘిక, పౌరాణిక పద్యనాటక కళాకారులు బద్దుల తిరుపతయ్య, దేవిశెట్టి కృష్ణారావు, చెన్నం సుబ్బారావును సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించి, కళాపురస్కారాన్ని ప్రదానం చేశారు. తొలుత గుంటూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యగురువు సరిత శిష్యబృందం, ఆరిశెట్టి ఐశ్వర్య శిష్యబృందం, యనమదల రీతిక, శవ్వా గ్రీష్మశ్రీలు కూచిపూడి, జానపద నృత్యాంశాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, అధ్యక్షుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి పర్యవేక్షించారు. ఆరో రోజైన గురువారం సాయంత్రం కళాంజలి, హైదరాబాద్ వారి ‘అన్నదాత’, సహృదయం ద్రోణాదుల వారి ‘వర్క్ ఫ్రమ్ హోం’ నాటికల ప్రదర్శనలు వుంటాయని తెలియజేశారు. -
వెయిట్ లిఫ్టింగ్లో సత్తాచాటడం అభినందనీయం
పెదకాకాని: వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తేవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న బిట్రా రోచిష్మతి ఈనెల 7వ తేదీ నుంచి 12 వరకు మణిపూర్లో జరిగిన 68వ జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అండర్–17 విభాగంలో పాల్గొన్న రోచిష్మతి ఉత్తమ ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో రోచిష్మతిని డీఈఓ రేణుక సమక్షంలో కలెక్టర్ నాగలక్ష్మి సత్కరించారు. జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడమే కాకుండా రానున్న రోజుల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి మంచిపేరు తేవాలని కలెక్టర్ ప్రోత్సహించారు. అదేవిధంగా పాఠశాల పీఈటీ చండ్ర వినయ్కుమార్ను అభినందించారు. వ్యాయామ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కరీముల్లా చౌదరి, గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాస్, జిల్లా సెక్రటరీ మెల్లెంపూడి రవి, నేషనల్ టీం కోచ్ నాగ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
తెనాలి డీఎస్పీకి ఏబీసీడీ అవార్డు
తెనాలి రూరల్: సంచలనం సృష్టించిన దళిత బాలిక హత్య కేసును ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు ఏబీసీడీ (అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) కన్సోలేషన్ ప్రైజ్ అవార్డు (డీజీపీ మెడల్) అందుకున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన ఏడో తరగతి చదువుతున్న దళిత బాలిక పేరిపోగు శైలజను గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేసే కృష్ణా జిల్లాకు చెందిన నరమామిడి నాగరాజు గతేడాది దారుణంగా హత్య చేయడం.. ఘటన రాష్ట్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడం తెలిసిందే. కేసును చేబ్రోలు పోలీసులు నమోదు చేయగా, డీఎస్పీ జనార్ధనరావు దర్యాప్తు చేశారు. హత్యకు పాల్పడి పరారైన నాగరాజు, తన సెల్ఫోన్, సిమ్ను మార్చి వేసి పోలీసులకు సవాల్ విసిరాడు. సుమారు మూడు నెలల పాటు నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి అతికష్టం మీద అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. కీలకమైన కేసును ఛేదించడంలో కృషి చేసిన డీఎస్పీ, చేబ్రోలు పోలీసులను డీజీపీ హరీష్కుమార్ గుప్తా అభినందించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెనాలి డీఎస్పీకి ఏబీసీడీ కన్సోలేషన్ ప్రైజ్ అవార్డును డీజీపీ అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీకి తెనాలి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. పోలీసులకు అవార్డులు.. చేబ్రోలు: కొత్తరెడ్డిపాలెం గ్రామంలో సంచలనం కలిగించిన దళిత బాలిక హత్య కేసును చేధించిన పోలీసులకు రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా బుధవారం బెస్ట్ అవార్డులను అందజేశారు. పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, చేబ్రో లు ఎస్ఐ డి.వెంకట కృష్ణ, చేబ్రోలు పీఎస్ కానిస్టేబుళ్లు ఎ.అప్పలనాయుడు, జి.నాగరాజులకు డీజీ అవార్డులు అందజేశారు. -
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి: బుగ్గన
సాక్షి, విజయవాడ: రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణన 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు.పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి:16వ ఆర్థిక సంఘానికి పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా గురించి ప్రస్తావించాం. 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్ వైవీ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32 శాతం నుంచి 42 శాతం వరకు పెంచుతూ సిఫార్సు చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం డాక్టర్ ఎన్కె సింగ్ ఉన్నప్పుడు 41 శాతం ఇచ్చారు.అయితే 42 శాతం సిఫార్సు చేసినా, వాస్తవంగా నిధులు వచ్చే సరికి అందులో 10 శాతం తగ్గుతుంది. అంటే మనకు నికరంగా వచ్చేది 32 శాతమే. ఎందుకంటే కేంద్రం సెస్సులు, సర్ఛార్జ్ల పేరుతో ఆ వాటాలో కోత పెడుతుంది. అందుకే మా పార్టీ నుంచి ఏం కోరామంటే, పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వమని కోరాము. ఎందుకంటే, రాష్ట్రాలకు అవసరాలు, ఖర్చులు ఉంటాయి అని చెప్పాం. అందుకే కనీసం 50 శాతం ఇస్తే, 40 శాతం నిధులు వస్తాయి కాబట్టి.ఆ రాష్ట్రాలకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలి:రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు నష్టం జరుగుతోంది. కాబట్టి, కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసి, జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా బోనస్ ఇవ్వాలని కోరాం.2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు ఎక్కువ:రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత 14,15 ఆర్థిక సంఘాలు వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం సమయంలో టీడీపీ, 15వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది. ఒక కఠోర వాస్తవం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు దారుణంగా పెరిగాయి. కానీ, గత కొన్నేళ్లుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వైయస్సార్సీపీ ప్రభుత్వంపై దారుణంగా దుష్ప్రచారం చేసింది. ఇంకా చేస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే ఎక్కువ అప్పు చేశారు. అప్పుడే అప్పు శాతం ఎక్కువ. 2019–24 మధ్య కోవిడ్ ఉన్నా, వైఎస్పార్సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు శాతం తక్కువ. ఆ లెక్కలు కేంద్ర ప్రభుత్వ విభాగాలే తేల్చి చెబుతున్నాయి. అన్నింటికీ పక్కాగా గణాంకాలు ఉన్నాయి. అయినా ఇష్టానుసారం అప్పుల లెక్కలు చెప్పారు. రూ.14 లక్షల కోట్లు అని, రూ.12 లక్షల కోట్లు అని నోటికొచ్చిన అంకెలు చెప్పారు.ఇప్పుడు వారంతా ఏమయ్యారు?:వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతోందని విషం చిమ్మారు. అదే పనిగా దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వారంతా ఏమయ్యారు?. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత కంటే దారుణంగా ఎక్కువ అప్పు చేస్తోంది. పైగా, ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా, ఒక్క పథకం కూడా ఆపలేదు.5 ఏళ్లలో ఏం కడతారు?:మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకా? అంత కంటే ఎక్కువా?. ఆ సమయంలో ఒక రాజధాని కడతారా? లేక ఒక నగరం కడతారా?. అసలు మనకున్న శక్తి ఎంత?. మన దగ్గర ఒక బైక్, ఒక కారు కొనే డబ్బులు ఉన్నప్పుడు విమానం కొంటానంటే ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది అదే. మరి ఆ అప్పు తిరిగి ఎవరు చెల్లించాలి. మా పార్టీ విధానం అప్పుడైనా, ఇప్పుడైనా ఒక్కటే. సామాన్యులు బాగుండాలి. వారు అభివృద్ధి చెందాలి. వారికి ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ జగన్పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలీస్ శాఖ ని‘శ్రేష్ట’ం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులకు ఒక న్యాయం..బలహీనవర్గ అధికారులకు మరో న్యాయం అన్న చందాన రేంజ్ అధికారి సర్వశ్రేష్ట త్రిపాఠి వ్యవహార శైలి ఉంది. దీనిపై జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసిన సమయంలో వేటు పడిన ఇద్దరు ఎస్ఐలూ బలహీనవర్గాలకు చెందినవారే. ఆ సమయంలో అక్కడే ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ సామాజికవర్గ పోలీసు అధికారులపై మాత్రం కనీస చర్యల్లేకపోవడంపై పోలీసుశాఖలో నిరసన వ్యక్తమవుతోంది. ఆద్యంతం టీడీపీ సామాజికవర్గ అధికారుల కనుసన్నల్లోనే.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను, ఆయన అనుచరులను మంగళగిరిలో అరెస్టు చేసి ముందుగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఎస్హెచ్ఓ వంశీధర్ వద్దకు తరలించారు. కోర్టులో హాజరు పరిచే ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్ళహరి శ్రీనివాస్, కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచే సమయంలో మాధవ్ తన అనుచరుల వద్ద ఫోన్ తీసుకుని తన లాయర్తో మాట్లాడుతుండగా సీఐ వీరాస్వామి దానిని లాక్కున్నారు. ఈ సమయంలో సీఐ వీరయ్యచౌదరి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్లహరి శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. వారు మాధవ్ ఫోన్లో మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. సీఐ వీరాస్వామి ఫోన్ లాక్కున్నారు. అయితే మాధవ్ ఫోన్ మాట్లాడుతతున్నా.. నిర్లక్ష్యంగా ఉన్నారన్న సాకుతో సీఐ వీరాస్వామితోపాటు పట్టాభిపురం ఎస్ఐ రాంబాబు, నగరంపాలెం ఎస్ఐ రామాంజనేయులుతోపాటు 12 మందిని రేంజ్ ఐజీ సస్పెండ్ చేశారు. వాస్తవానికి అరెస్టు సమయంలో నిందితుడికి బంధుమిత్రులు, లాయర్తో ఫోన్లో మాట్లాడే హక్కుంది. అతని వద్ద ఫోన్ లాక్కునే అధికారం పోలీసులకు లేదని సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాధవ్ ఫోన్ మాట్లాడుతున్నా.. చోద్యం చూసిన వారిని వదిలేసి ఫోన్ లాక్కున్న సీఐ వీరాస్వామిపై వేటు పడడం విస్తుగొలుపుతోంది. ఒక వేళ మాజీ ఎంపీ వ్యవహారంలో తప్పు జరిగినట్టు పోలీస్ బాస్ భావిస్తే మంగళగిరి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ వరకు ఎంత మంది పోలీసు అధికారులు ఉన్నారో అందరినీ సస్పెండ్ చేయాలి కానీ ఎస్సీ, బీసీలనే టార్గెట్గా చేసి సస్పెండ్ చేయడమేమిటని సిబ్బంది ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నా వేటు నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామంజనేయులు ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్నారు. కొద్దిరోజుల్లో సీఐ కానున్నారు. దీంతో ఆయన కూడా తన తప్పు లేకుండా సస్పెన్షన్ వేటు వేశారని మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. బలహీనవర్గాలపై వివక్ష? ఆరునెలల్లో రెండు సార్లు సస్పెండైన ఎస్ఐ సీఐ ఉద్యోగోన్నతి జాబితాలో ఉన్న ఎస్ఐపైనా వేటు అధికారపార్టీ సామాజికవర్గానికి రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి వంత జిల్లాలో హాట్ టాపిక్గా మారిన పోలీస్బాస్ తీరు ఆరునెలల్లో రెండోసారి సస్పెన్షన్ పట్టాభిపురం ఎస్ఐ రాంబాబు ఆరునెలల్లో రెండోసారి సస్పెండ్ అయ్యారు. దీంతో ఆయన తన తప్పు లేకున్నా వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. దీని వల్ల తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారతాయని బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. వీరిపై చర్యలేవీ.. మాజీ ఎంపీ మాధవ్ సెల్ఫోన్ మాట్లాడిన వ్యవహారంలో 12 మందిని సస్పెండ్ చేసిన పోలీసుశాఖ టీడీపీ సామాజికవర్గానికి చెందిన మంగళగిరి ఎస్ఐ వెంకట్, కొత్తపేట సిఐ వీరయ్య చౌదరి, నల్లపాడు సీఐ వంశీధర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఆళ్ళ హరి శ్రీనివాస్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని వెస్ట్ డీఎస్పీ ముందు సస్పెండ్ అయిన ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బందోబస్తుకు వెళ్లి దూరంగా ఉన్న తమపై వేటు వేయడం ఏమిటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో అరండల్పేట పోలీస్ స్టేషన్లో సస్పెండ్ అయి ఏఆర్ నుంచి సివిల్కు కన్వర్షన్ అయిన బలహీనవర్గాల వారిని ఆరునెలలైనా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదు. కానీ వీఆర్లోకి వెళ్లిన టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐకి మాత్రం తుళ్ళూరు ఎస్హెచ్ఓగా వెంటనే బాధ్యతలు అప్పగించారు. ఈ వివక్ష ఎందుకో అధికారులే సమాధానం చెప్పాలి. -
బాబూ.. రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నావ్..?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నావ్ బాబూ.. అంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సీఎం చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే 58వేల ఎకరాలు సేకరించారని, మరలా 44వేల ఎకరాలు దేనికోసమంటూ నిలదీశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మళ్లీ పాత పద్ధతిలో వెళ్లొద్దంటూ చంద్రబాబుకు హితవు పలికారు. రైతులకు, రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో వాటిని చేయాలని సూచించారు. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది కేవలం 2700 ఎకరాలు మాత్రమేనన్నారు. తాత్కాలికం పేరుతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించారని, ఇప్పుడు అదనంగా మరో 44వేల ఎకరాలు తీసుకుంటామని ప్రకటించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ‘‘రాజధాని కోసం రూ.31 వేల కోట్లు అప్పుచేశారు... ఇంకా రూ.69 వేల కోట్లు అవసరమంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలి’’ అని వడ్డే ప్రశ్నించారు. ప్రజలకు ఉప యోగపడేవి వదిలేసి అవుటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు అంటారేంటి చంద్రబాబు అని నిలదీశారు. హైపర్ లూప్ అనే రైలు అమెరికా, జపాన్, జర్మనీ వంటి దేశాల్లోనే లేదని, ఏపీలో హైపర్ లూప్ రైలుకు డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పడం చంద్రబాబు అనాలోచిత...తొందరపాటు చర్యకు నిదర్శనమని విమర్శించారు. రాజధానిలో 40 అంతస్తుల భవనాలతో ప్రజలకు ఒరిగేదేమిటని, ప్రజలకు కావాల్సింది ఎత్తైన భవనాలు కాదు.. మంచి పరిపాలన అని అన్నారు. అదనంగా 44 వేల ఎకరాలు దేనికోసం? రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తారా? సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఽధ్వజం -
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు మహిళా ప్రాంగణంలో ఉద్యోగినుల వసతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.27 కోట్లతో నిర్మించిన సఖినివాస్ ప్రస్తుత సర్కారు సాగదీత తీరు వల్ల ఇంకా అందుబాటులోకి రాలేదు. ఫలితంగా వసతి దొరక్క ఉద్యోగినులు అవస్థలు పడుతున్నారు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 2023 చివరిలోనే పూర్తి సఖి నివాస్(వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్) 2023 చివరిలోనే పూర్తయింది. 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అప్పట్లో ప్రారంభం కాలేదు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సఖి నివాస్ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తరువాత ఈ నెల 4న రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సఖి నివాస్ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే హాస్టల్ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. 35 మంది దరఖాస్తు సఖి నివాస్లో ఉండేందుకు 35 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 30 మంది ఫోన్లో టచ్లో ఉన్నారు. ప్రభుత్వం రుసుములు ఖరారు చేయనిదే హాస్టల్ నిర్వహణ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగినులు నిరాశ చెందుతున్నారు. సఖి నివాస్కు తాళాలు వేసి ఉన్న దృశ్యం సింగిల్ షేరింగ్ రూమ్ న్యూస్రీల్ గత ప్రభుత్వంలోనే సఖి నివాస్ నిర్మాణం పూర్తి ఉద్యోగినుల వసతి కోసం నిర్మించిన భవనం ఈ నెల 4న ప్రారంభించినా అందుబాటులోకి రాని దుస్థితి ప్రభుత్వం రుసుములు ఖరారు చేయకపోవడమే కారణం సంస్థల నుంచి లేఖ తప్పనిసరి సఖి నివాస్లో వసతి కోరే ఉద్యోగినులు పనిచేసే సంస్థ నుంచి లేఖలు సమర్పించాల్సి ఉంటుంది. వసతి గదుల్లో చేరే ముందు రూ.1500 అడ్వాన్స్ చెల్లించాలి. తిరిగి గది ఖాళీ చేసేటప్పుడు ఆ మొత్తం ఇస్తారు. విద్యార్థినులు కూడా ఇందులో వసతి పొందొచ్చు. అయితే సంబంధిత సంస్థల నుంచి లేఖలు సమర్పించాలి. ఖరారు కాగానే అందుబాటులోకి.. వసతి గదుల రెంట్ ఫిక్స్ సఖినివాస్లో ఏసీ, నాన్ ఏసీ కలిపి మొత్తం 19 గదులు ఉన్నాయి. వీటి అద్దె ప్రతిపాదనలను అధికారులకు ప్రభుత్వానికి పంపారు. డబుల్ షేరింగ్ ఏసీ రూమ్ 1 (అద్దె నెలకు రూ.3,500), డబుల్ షేరింగ్ నాన్ ఏసీ రూమ్ 1 (అద్దె నెలకు 2,500), సింగిల్ షేరింగ్ ఏసీ రూమ్ 2(అద్దె నెలకు రూ.4,500), ఫైవ్ షేరింగ్ ఏసీ రూమ్స్ 4(అద్దె నెలకు రూ.2500), ఫైవ్ షేరింగ్ నాన్ ఏసీ రూమ్స్ 7(అద్దె నెలకు రూ.2,000), డార్మిటరీ నాన్ ఏసీ 8 షేరింగ్ రూమ్స్ 3(అద్దె నెలకు రూ.1,500), డార్మిటరీ ఏసీ 8 షేరింగ్ రూమ్ 1(అద్దె నెలకు రూ.200)గా అధికారులు ప్రతిపాదించారు. వీటిల్లో మొత్తం 92 మంది వరకు ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాని కారణంగా అద్దెలు ఖరారు కాలేదు. ఫలితంగా వసతి గృహం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ గదుల్లో ఆర్వో డ్రింకింగ్ వాటర్, గీసర్, వాషింగ్మెషిన్, టీవీ, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి. ఆహారానికి అయ్యే ఖర్చును ఉద్యోగినులు భరించాలి. ఈ సఖినివాస్లో ఉద్యోగినుల కోసం పకడ్బందీ భద్రతా చర్యలు ఉన్నాయి. హాస్టల్ నుంచి బయటకు వెళ్లే టప్పుడు, వచ్చేటప్పుడు పేస్ ఆధారిత బయోమెట్రిక్ ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీసీ కెమెరాల నిఘాలో హాస్టల్ ఉంటుంది. వసతి గృహం నిర్వహణకు ప్రత్యేకంగా మేనేజర్, వార్డెన్, ఇద్దరు వాచ్మెన్లు, ఇద్దరు శానిటేషన్ సిబ్బంది ఉంటారు. వీరి నియామానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. సఖి నివాస్లో మహిళా ఉద్యోగులు ఉండేందుకు ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి అద్దె ప్రతిపాదనలను పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించాం. రసుములు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు రాగానే నిర్వహణ ప్రారంభిస్తాం. – బి.రమణ శ్రీ, మహిళా ప్రాంగణం ఇన్చార్జ్జి మేనేజర్ -
మైనారిటీలకు అండగా జగనన్న
పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనారిటీలకు అన్ని వేళలా అండగా నిలబడతారని, వక్ఫ్ బిల్లుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయటం ద్వారా మరోసారి సుస్పష్టమైందని పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా చెప్పారు. లోక్సభలో వ్యతిరేకించి.. రాజ్యసభలో మద్దతునిచ్చారని పిచ్చిపట్టిన వ్యాఖ్యలు చేస్తున్న కొంత మంది పచ్చ మీడియాకు పిటిషన్ దాఖలుతో బుద్ధి వచ్చినట్టు అయిందన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఫాతిమా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్ కల్పిస్తే, జగనన్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారన్నారు. సీఎంగా ఉన్న సమయంలో ఎన్ఆర్సీని సైతం వ్యతిరేకించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మైనారిటీల పక్షాన పోరాడుతున్న జగనన్నకు యావత్తూ మైనారిటీలు కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ పార్టీలకు అతీతంగా రాజీనామా చేయగలరా...? గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్అహ్మద్ రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామా చేయగలరా అని నూరిఫాతిమా ప్రశ్నించారు. వారం క్రితం ప్రభుత్వానికి మద్దతుగా ఒక మాట చెప్పి, గత శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తాను కూడా బిల్లుకు వ్యతిరేకమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ అసలు ఈ బిల్లు ఏవిధంగా మంచిదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు అవేమి పట్టవని, కేవలం సీటు కోసం తాపత్రయ పడుతున్నారని, కేవలం మాట చెప్పటం కాదని.. దమ్ముంటే ఆ మాట మీద నిలబడాలని సవాల్ విసిరారు. ఎన్ఆర్సీ బిల్లుకు వ్యతిరేకంగా ఆ రోజున మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ముస్తఫా, పూర్తిస్థాయిలో అంశాన్ని జగనన్నకు వివరించి దానిని వ్యతిరేకించేలా చేశారని, ఇప్పుడు ఎమ్మెల్యే నసీర్ చంద్రబాబుకు చెప్పి బిల్లుకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి మైనారిటీలతో ఎటువంటి అవసరం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే నసీర్అహ్మద్ బిల్లు అంశంపై డిబేట్కు రావాలని, తాను ఒక సాధారణ మైనారిటీ మహిళగా వస్తామని, చర్చకు సిద్ధమో కాదో చెప్పాలన్నారు. కచ్చితంగా వైఎస్సార్ సీపీ స్టాండ్ ఒక్కటేనని, వక్ఫ్ బిల్లు రద్దు చేయటమేనన్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ప్రజల కోసమే పాటుపడుతుందని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మైనారిటీ నేతలు పలువురు పాల్గొన్నారు. వక్ఫ్బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలపై మైనారిటీల్లో హర్షం ఎమ్మెల్యే నసీర్అహ్మద్ రాజకీయాలు, పార్టీలకు అతీతతంగా రాజీనామా చేయగలరా..? వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా -
చెన్నుని బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం
మాచర్ల రూరల్: శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని గరుడు వాహనంపై ఊరేగించనున్నారు. మంగళవారం ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి రాజగోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాటి ప్రజల ఇలవేల్పు శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. భక్తులు వేలాదిగా తరలివస్తారన్నారు. ఈఓ ఎం. పూర్ణచంద్రరావు, జేఏ వీరారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కొమెర అనంతరాములు, బండ్ల బ్రహ్మం, గాజుల గణేష్, కోమటి వీరు, మద్దిగపు శ్రీనివాసరెడ్డి, సుంకె వాసు, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ డీడీగా రాజా దేబోరా నెహ్రూనగర్: గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా రాజా దేబోరా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ డీడీగా పనిచేస్తున్న డి.మధుసూదన్రావు 3 నెలలకుపైగా సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు ఏఓగా పనిచేస్తున్న మాణిక్యవరరావు ఇన్చార్జిగా వ్యవహరించారు. తాజాగా ఆయన స్థానంలో బాపట్ల జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తున్న రాజ్ దేబోరాకు గుంటూరు జిల్లా డీడీగా (పూర్తి అదనపు) బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్సైట్లో ఎస్ఏల సీనియార్టీ జాబితా గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లతో రూపొందించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఈవోజీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్ సైట్లో ఉంచిన సీనియార్టీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 20వ తేదీలోపు గుంటూరు డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని తెలిపారు. మున్సిపల్ యాజమాన్యంలోని పాఠశాలల్లో ఉద్యోగోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను ఇప్పటికే విడుదల చేశామని గుర్తుచేశారు. దుర్గమ్మ సన్నిధిలో 241 గ్రాముల బంగారం చోరీ వన్టౌన్(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి 241 గ్రాముల బంగారాన్ని ఆగంతకులు చోరీ చేసిన ఘటన మంగళవారం జరిగింది. హైదరాబాద్ బృందావనకాలనీలో నివసించే ఆచంట దుర్గారావు కుటుంబం అమలాపురంలో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో ఆగారు. దుర్గగుడి ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ సమీపంలో తమ కారు నిలిపారు. 241 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను కారులోనే ఉంచి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చిన తరువాత కారులో నగల బ్యాగ్ కనపడలేదు. వెంటనే సమీపంలోని పోలీసు అవుట్పోస్టులో ఉన్న పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి చుట్టు పక్కల వెతికారు. అయినా ప్రయోజనం లేకపోవ టంతో మంగళవారం రాత్రి వస్తువుల ఆధారాలతో వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 515.20 అడుగుల వద్ద ఉంది. ఇది 140.6684టీఎంసీలకు సమానం. -
చలివేంద్రానికి పోలీసు అనుమతి నిరాకరణ
పర్చూరు (చిన్నగంజాం): చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు రోటరీ క్లబ్ చేసుకున్న విన్నపాన్ని పర్చూరు పోలీసులు తిరస్కరించారు. బొమ్మల సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్న కారణంతో పోలీసులు అనుమతిని నిరాకరించినట్లు తెలిసింది. దీంతో పాదచారులు, ప్రయాణికులు ఎండ తీవ్రతకు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చటానికి బొమ్మల సెంటర్లో చలివేంద్రం లేకపోవడంతో స్థానికులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు రోటరీ క్లబ్ గత 23 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో నిస్వార్థ సేవలు అందిస్తుంది. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి దాతల సహకారంతో 45 రోజుల పాటు మజ్జిగను కూడా అందిస్తుంది. ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నా ఇంకా చలివేంద్రం మొదలు కాక పోవడంతో స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. పంచాయతీ వారు అనుమతిని మంజూరు చేసినా, పోలీసులు నిరాకరించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాల నుండి లేని ట్రాఫిక్ సమస్య ఇప్పుడే తలెత్తిందా అన్న ప్రశ్నను స్థానికులు లేవనెత్తుతున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించడం వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఏదేమైనా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బొమ్మల సెంటర్లో చిన్నపాటి చలివేంద్రం ఏర్పాటుకై నా పోలీసులు అనుమతిని మంజూరు చేయాలని కోరుతున్నారు. -
తెనాలి కళాకారులు ఐదుగురికి ‘కందుకూరి’ పురస్కారాలు
తెనాలి: ప్రఖ్యాత నాటక రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి రోజున ఆయన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బహూకరించనున్న ప్రతిష్టాత్మక కందుకూరి వీరేశలింగం అవార్డును రాష్ట్రంలోని ముగ్గురు కళారంగ ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో తెనాలికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు ఒకరు. కందుకూరి వీరేశలింగం జిల్లా అవార్డుకు గుంటూరు జిల్లా నుంచి 12 మంది ఎంపికకాగా, వీరిలో ఐదుగురు తెనాలికి చెందిన నటీనటులున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంగళవారం సాయంత్రం ఈ అవార్డులను ప్రకటించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం ఆరుగంటలకు ఏర్పాటయే వేడుకలో జిల్లాస్థాయి అవార్డులకు ఎంపికై న కళాకారులకు రూ.10 వేల చొప్పున నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేసి, సత్కరిస్తారు. ఎంపికై న వారిలో పట్టణానికి చెందిన ప్రముఖ పౌరాణిక పద్యనాటక నటీమణి, పురుషపాత్రల్లో నటించిన ప్రతిభాశాలి గుమ్మడి విమలకుమారి ఉన్నారు. ప్రముఖ పౌరాణిక నటుడు, శ్రీదుర్గాభవానీ నాట్యమండలి వ్యవస్థాపకుడు ఆరాధ్యుల ఆదినారాయణ కూడా జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. కొలకలూరుకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ సమాజంతో నాటకరంగ ప్రయాణం చేస్తూ, ప్రస్తుత అటు నాటకాల్లో, ఇటు సినిమాలు ముమ్మరంగా నటిస్తున్న సురభి ప్రభావతి, శ్రీసాయి ఆర్ట్స్ సమాజం దర్శకుడు, నటుడు, సినీనటుడు గోపరాజు విజయ్, పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుగ్రహీత, పద్యకవి, నటుడు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు కందుకూరి అవార్డులను స్వీకరించనున్నారు. -
వాసవీ కన్యక గుడి సత్రం కమిటీ ఎన్నిక
తెనాలి: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ వివాదాస్పదంగా మారిన తరుణంలో మంగళవారం కొత్త కమిటీని ప్రకటించారు. విస్తృత పోలీసు బందోబస్తు నడుమ నూతన అధ్యక్షుడిగా తనను ఎన్నిక చేసుకున్నట్టు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండేల వెంకట్రావు ప్రకటించారు. వాస్తవానికి కమిటీ సర్వసభ్య సమావేశం జరగాల్సిన ఈనెల 13వ తేదీనే సభ్యులు తనను ఎన్నుకున్నారనీ, ఈరోజు సమావేశంలో ప్రకటన చేస్తున్నట్టు పెండేల వెంకట్రావు తెలియజేశారు. దేవస్థానం ఆఫీసు తాళం పగులగొట్టి స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశం ఈనెల 13న జరగాల్సి వున్న విషయం తెలిసిందే. ఆరోజు వివాదం నెలకొనటం, ఇరువర్గాల సభ్యులతోపాటు బయట వ్యక్తుల ప్రవేశంతో ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. అదేరోజు నూతన కమిటీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీని ప్రకటిస్తామని కమిటీ నాయకులు ప్రకటించారు. ఆ ప్రకారం పత్రికా ప్రకటన చేశారు. మరోవైపు సత్రం కమిటీ కాలపరిమితి పూర్తయిందనీ, మార్చాల్సిందేనని పట్టుబట్టిన సభ్యులు 300 మందికి పైగా, 13వ తేదీనే తనను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండేల వెంకట్రావు మీడియాకు వెల్లడించారు. ముందు ప్రకటించిన ట్టుగా మంగళవారం ఆయన వర్గం సభ్యులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సత్రం కమిటీ నాయకులూ హాజరయ్యారు. ముందస్తు జాగ్రత్తగా సబ్డివిజనులోని పోలీసులను ఇక్కడ మోహరించారు. గుంటూరు నుండి అదనపు ఎస్పీ స్వయంగా వచ్చి పర్యవేక్షించారు. ఏకపక్షంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకోవటంతో కమిటీ నాయకులు బయటకు వెళ్లిపోయారు. అనంతరం పెండేల వెంకట్రావు తన ఎన్నిక విషయాన్ని వెల్లడించారు. కార్యదర్శిగా తాతా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా బచ్చు సాంబశివరావు, సంయుక్త కార్యదర్శిగా పెండేల సుబ్బారావు, కోశాధికారిగా శ్రీరాం రాజా, సభ్యులుగా నూకల రాధాకృష్ణమూర్తి, కొప్పురావూరి కిశోర్, మువ్వల సుబ్బారావు, డోగిపర్తి చంద్రశేఖర్, చందోలు రమేష్బాబు, మాజేటి కృష్ణకిశోర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, దేసు యుగంధర్, దేసు రవికుమార్, కూరపాటి రవికుమార్, మానేపల్లి చంద్రశేఖర్, తవ్వా నాగప్రసాద్ ఎన్నికై నట్టు ప్రకటించారు. నూతన కార్యవర్గం కాలపరిమితి 2025–28 వరకు ఉంటుందని తెలిపారు. గతంలో సీనియర్ రాజకీయవేత్త కొణిజేటి రోశయ్య సూచనపై నూకల వెంకట వేణుగోపాలరావుకు కమిటీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చామని, గత ఇరవై ఏళ్లుగా ఆయన ఎన్నో దురాగతాలకు పాల్పడినందునే పోరాటం చేసి మార్చుకోవాల్సి వచ్చిందని పెండేల వెంకట్రావు అన్నారు. దేవస్థానం ఆఫీసు తాళం పగులగొట్టి, కొత్త తాళం వేశారు. నూతన కమిటీని హాజరైన సభ్యులు శాలువాలతో సత్కరించారు. సర్వసభ్య సమావేశం జరగటం, అందులో ఏకగ్రీవం చేసుకోవటం లేదా ఎన్నిక అనివార్యమైతే తేదీని ప్రకటించి ఎన్నికలు జరుపుకోవటం వంటి అంశాల జోలికి పోకుండా వెయ్యిమంది సభ్యులున్న ఆలయ కమిటీపై విస్తృత పోలీసు బందోబస్తు నడుమ అతి సునాయాసంగా ఆధిపత్యం సాధించటం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త అధ్యక్షునిగా వెంకట్రావు ఎన్నిక పోలీసు బందోబస్తు నడుమ ఆలయ ఆఫీసు తాళం పగలగొట్టి స్వాధీనం -
విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు డీ–5 సెక్షన్, ఆర్టీసీ బస్టాండ్, పాత గుంటూరు, బాలాజీ నగర్, సుద్దపల్లి డొంక, ప్రగతినగర్లలో విద్యుత్ శాఖ విజిలెన్స్, ఆపరేషన్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి.శ్రీనివాసబాబు ఆధ్వర్యంలో 59 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, శ్రీనివాసబాబు మాట్లాడుతూ తక్కువ లోడ్కు సర్వీసు తీసుకొని అదనపు లోడు వాడుతున్న 140 సర్వీస్ల కింద రూ.4.83 లక్షలు, మీటరు ఉన్నప్పటికీ అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఐదుగురికి రూ.2.19 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఇద్దరికి రూ.లక్ష, అసలైన వాడకం కంటే బిల్లు తక్కువగా ఇవ్వబడిన రెండు సర్వీసులు గుర్తించి రూ.50 వేలు మొత్తం రూ.8.52 లక్షలు అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహావసరాలకు, వాణిజ్య సముదాయాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని, విద్యుత్ మీటర్లు తిరగకుండా చేస్తే అటువంటి వాటిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదులకు 9440812263, 9440812360, 9440812361 నంబర్లకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు అని వారు వెల్లడించారు. దాడుల్లో డీఈఈలు కె.రవికుమార్, ఎన్.మల్లిఖార్జున ప్రసాద్, పీహెచ్ హుస్సేన్ఖాన్, ఏఈలు కె.కోటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్, ఎం.సతీష్కుమార్, యు.శివశంకర్, షేక్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. రూ.8.52 లక్షలు అపరాధ రుసుం వసూలు