Bhadradri
-
నేడు రాత పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1, సెక్యూరిటీ జమేదార్ టీఎస్ గ్రేడ్–26 పోస్టులకు ఈ నెల 13న సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1 పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకోగా, జమేదార్ పోస్టులకు 78 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి యాజమాన్యం హాల్ టికెట్లు పంపిణీ చేసింది. ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఐఎన్టీయూసీ నేతకు వినతి మణుగూరుటౌన్: జేఏంఓల ప్రమోషన్ పాలసీలో మార్పులు చేయాలని కోరుతూ.. ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు శనివారం ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ–1 గ్రేడ్లో ఐదేళ్ల అనుభవం ఉంటేనే జేఎంఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉందని, ఏ–1 గ్రేడ్కు రావడానికి ఉద్యోగులకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. ఉద్యోగ విరమణ దశలో అర్హత పొందుతున్నారని, ఫలితంగా గత నోటిఫికేషన్లో 87 పోస్టులకు గాను 15 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఎంపికయ్యారన్నారు. సమస్యను గుర్తించి త్వరితగతిన నోటిఫికేషన్ జారీ అయ్యేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్యయాదవ్, జయరాజు, దారా సుకుమార్ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేత కొత్తగూడెంఅర్బన్: నిషేధిత నాటుసారాయికి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా శనివారం కొత్తగూడెం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ జయశ్రీ, ఎస్ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని పెద్దబజార్లో బెల్లం ఉందనే సమాచారంతో ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీహరిరావు తన సిబ్బందితో దాడి చేసి, ట్రాలీలో ఉన్న 360 కేజీల బెల్లం, 15 కేజీల స్పటికం పట్టుకున్నారు. ట్రాలీని ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి, బెల్లం కొనుగోలు చేసిన రాంకుమార్, డ్రైవర్ మంగీలాల్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నది పెద్ద వాహనమని, సమాచారం వెల్లడించే సమయంలో చిన్న వాహనం చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు షురూ.. కొణిజర్ల: మండలంలోని తనికెళ్లలో ఐదు రాష్ట్రాలస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి అటవీ శాఖ చెక్పోస్టు మీదుగా ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న కలపను సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు పరిశీలిస్తుండగా కలప పట్టుబడింది. ఈ మేరకు ట్రాక్టర్ను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించగా, కలప విలువ రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిసింది. గుండెపోటుతో యువకుడు మృతి ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఏరియాకు చెందిన లోదు కార్తీక్సోనూ (24) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. అయితే, ఆయన అస్వస్థతకు గురికాగానే కుటుంబీకులు, స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉన్నందున కొత్తగూడెం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ కుటుంబీకుల వినతితో వైద్యం చేస్తుండగానే కార్తీక్ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు వైద్యుడిని నిలదీయగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి సీఐ మత్తుల సత్యనారాయణ చేరుకుని నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. క్రికెట్ ఆడుతూ కుప్పకూలి... ఇల్లెందు: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న ఇల్లెందు సబ్జైల్ బస్తీకి చెందిన ఆంటోనీ విమల్ (30) గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఉద్యోగులతో కలిసి ఆయన అక్కడ శనివారం క్రికెట్ ఆడుతూనే కుప్పకూలినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఆడపిల్లలు పుట్టారని అక్రమంగా దత్తత?
చింతకాని: మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు.. మూడో కాన్పులోనూ ఆడపిల్ల అని తెలియగా అబార్షన్ చేయించడమే కాక.. నాలుగో కాన్పులో కవల ఆడ శిశువుల జన్మించడంతో శిశువులను బంధువులకు దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం తెలిసి ఐసీడీఎస్ అధికారులు శిశువుల ఆచూకీపై ఆరా తీస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన నల్లగాజు మల్లేష్ – ఉమ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడో కాన్పులోనూ గర్భంలో ఆడపిల్ల పెరుగుతోందని తెలియగా ఉమ అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చగా గత నెల 31న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో కవల శిశువులను ఆస్పత్రిలోనే ఉమ తన అక్కకు దత్తత ఇచ్చేసి ఇంటికి వచ్చారు. మూడు రోజుల క్రితం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కలిసి ఉమ, శిశువు ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లగా శిశువులు కానరాలేదు. ఏమైందని ఆరా తీయగా పోషించలేకనే బంధువులకు దత్తత ఇచ్చామని బదులిచ్చారు. అనంతరం ఐసీడీఎస్ సీడీపీఓ కమలప్రియ, ఏసీడీపీఓ శివకుమారి, సూపర్వైజర్ పద్మావతి కలిసి మల్లేష్ ఇంటికి వెళ్లగా ఆయన ‘మా పిల్లలు మా ఇష్టం.. ఏమైనా చేసుకుంటాం.. అడగానికి మీరెవరు’ అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. చట్టానికి లోబడి దత్తత ఇవ్వాలని, అలాకాకుండా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉంటున్న ఉమ అక్కకు పిల్లలను దత్తత ఇచ్చామని, సోమవారం వరకు తీసుకొస్తామని, లేనిపక్షంలో ఏ చర్యలైనా తీసుకోవచ్చని లేఖ రాసి ఇచ్చారు. కాగా, ఐసీడీఎస్ అధికారులకు వీడియో కాల్ ద్వారా కవల ఆడ శిశువులను చూపించారు. ఆలస్యంగా బయటపడడంతో అధికారుల విచారణ -
పాత ఇనుప దుకాణంలో అగ్నిప్రమాదం
పాల్వంచ: పాత ఇనుమ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని తెలంగాణనగర్ వద్ద గల బీఎల్ నాయుడుకు చెందిన పాత ఇనుప దుకాణం యార్ద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సిగరేట్ తాగి పడేయడంతో చెత్తకు అంటుకుని మంటలు చెలరేగాయి. స్క్రాప్నకు వచ్చిన సుమారు పది కార్లకు నిప్పంటుకుని భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో ఫైర్ ఆఫీసర్ పుల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఆయూబ్, ఉదయ్, ప్రతాప్, వెంకటేశ్వర్లు మంటలను ఆర్పివేశారు. కారు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతిపాల్వంచరూరల్: ద్విచక్రవాహనంపై రిటైర్డ్ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన, భద్రాచలం ఐటీడీఏ ఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయిన కటుకూరి నాగభూషణం (63) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎదురుగా భద్రాచలంవైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగభూషణాన్ని ఖమ్మం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కోయిల విజయ్కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. మృతుడికి భార్య పవిత్ర, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణ (40) మృతిచెందాడు. ఎల్లాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరైన కృష్ణ బైక్పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కొమరారం పోలీసులు కృష్ణను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే కృష్ణ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు. సివిల్ లైన్లో చోరీ.. ఇల్లెందు: పట్టణంలోని సివిల్లైన్లో పెద్దపల్లి కుమారస్వామికి చెందిన ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు కుమారస్వామి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పరిశీలించారు. 18 తులాల బంగారం, రెండు జతల వెండి పట్టీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. -
● బతుకుబండి సాగుతోంది..
పాత బైక్తో ఐస్ క్రీమ్ వ్యాపారం కరకగూడెం: కష్టపడి పనిచేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. సృజనాత్మకతతో పాత ద్విచక్రవాహనం ముందు భాగంలో ఉండే చక్రాన్ని తొలగించి దాని స్థానంలో రెండు చక్రాల ఐస్ క్రీమ్ బండిని అమర్చుకొని ఊరూరు తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. రంగురంగుల కాగితాలు, బొమ్మలతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి రోజుకు మంచి ఆదాయం పొందుతున్నాడు. ఈ యువకుడి కృషిని అందరూ అభినందిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
పాల్వంచ: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శనివారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో సీఐ సుంకరి రమేశ్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణె జిల్లా, ధౌండ్ తాలూకా, పింపల్గాం గ్రామానికి చెందిన సాగర్ హరిదాస్ దోబ్లే, నీలేశ్, కిషోర్ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకు గంజాయిని ఒడిశాలోని మల్కన్గిరిలో కొనుగోలు చేసి కారులో అమర్చారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా పుణెకు తరలిస్తుండగా పాల్వంచ వద్ద ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేశ్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకటేశ్, విజయ్కుమార్, ఉపేందర్ పట్టుకున్నారు. కారులో ఉన్న 51.27 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.28.80 లక్షలు, అన్ని వస్తువులు కలిపి రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను సీఐ ప్రసాద్కు అప్పగించారు. రూ.28.80 లక్షల గంజాయి, కారు స్వాధీనం -
అగ్నిప్రమాదాలతో జాగ్రత్త
రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ●● జిల్లాలో ఐదు ఫైర్స్టేషన్లు ● ప్రమాదం జరిగితే డయల్–101కు సమాచారం ఇవ్వాలి కొత్తగూడెంటౌన్: వేసవికాలం వస్తే అగ్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు, గుడిసెల్లో పంటలు కోసిన తర్వాత వాటికి నిప్పు పెట్టే విషయంలో అజాగ్రత్తగా ఉంటే నిప్పు రవ్వలు ఎగసిపడి ఇతర ఇళ్లకు అంటుకుని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి మురహరి క్రాంతికుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయట పడాలి, ఎలా రక్షించుకోవాలనే విషయాలను ప్రాక్టికల్గా డ్రిల్ చేసి అవగాహన కల్పిస్తారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట ఫైర్ స్టేషన్ల పరిధిలో 51 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 28 మంది ఉన్నారు. మరో 23 మంది కొరత ఉంది. 1944లో ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్లోని నౌకలో అగ్ని ప్రమాదం సంభవించగా, విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. వారి జ్ఞాపకార్థం వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మూడేళ్లలో జరిగిన ఘటనలు.. ● 2022లో మొత్తం 351 అగ్ని ప్రమాదాలు సంభవించగా.. రూ.2,62,4000 నష్టం వాటిల్లింది. 62 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2023లో మొత్తం 265 అగ్నిప్రమాదాలు జరగగా రూ.32,19,6000 నష్టం జరిగింది. రూ.15,31,64000 సొత్తును రక్షించారు. 77 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2024లో మొత్తం 232 అగ్నిప్రమాదాలు సంభవించాయి. రూ.07,38,10,000 నష్టం వాటిల్లింది. 66 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2025లో మార్చి వరకు మొత్తం124 అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.1,12,40,007 నష్టం జరిగింది. 66 ఘటనల్లో మనుషులు, పశువును రక్షించారు. డయల్101కి సమాచారం ఇవ్వాలి ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో 972 ప్రమాదాలు సంభవించగా దాదాపు రూ.13,88,70,007 ఆస్తులకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్నతాధికారులకు అధికారులకు నివేదిస్తాం. ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే డయల్–101కు సమాచారం ఇవ్వాలి. మురహరి క్రాంతికుమార్, డీఎఫ్ఓ ఈ సూత్రాలు పాటించాలి.. అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, దుకాణ సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అపార్డుమెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్మాళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ప్లాట్కు నీరు అందేలా పైపులైన్ను ఏర్పాటు చేయాలి. షాపుల్లో మండే స్వభావం ఉన్న వస్తువులను పెట్టకూడదు ఇంట్లో ఉండే సిలిండర్లకు వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇళ్లల్లో, షాపుల్లో వెంటిలేషన్ను సరిగ్గా ఉండేలా చూడాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. గృహాలు, రైస్మిల్లులు, ఆఫీసులు, దుకాణాల్లో నాణ్యమైన కరెంట్ వైరింగ్ చేయించుకోవాలి. -
రైస్ పుల్లింగ్ మిషన్ పేరుతో బురిడీ
బూర్గంపాడు: రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం బూర్గంపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. శనివారం సిబ్బందితో సారపాకలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా.. అదుపులోకి తీసుకుని విచారించడంతో రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని నమ్మించి పలువురిని మోసగించామని ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన కొమరం రాజబాబు వద్ద రూ.లక్ష తీసుకున్నారు. అతను రైస్ పుల్లింగ్ మిషన్ అడుగగా మరో రూ.లక్ష కావాలని డిమాండ్ చేయగా.. జనవరి 25న రాజబాబు డబ్బుతో మండలంలోని క్రాస్రోడ్డు వద్దకు వచ్చాడు. ఈ ముఠా రాజబాబును కొట్టి రూ.లక్ష తీసుకుని కారులో పరారైంది. వీరితో పాటు జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ ఉన్నారు. కాగా, భద్రాచలంలో కొందరిని కలిసి రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని నమ్మించి మోసగించేందుకు యత్నిస్తున్న ఈ ముఠా సారపాకలో పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠాలో పాల్వంచలోని తెలంగాణనగర్కు చెందిన ఆటోడ్రైవర్ దొనకొండ సురేశ్బాబు, భద్రాచలం పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్ రవూఫ్, చర్ల మండలం విజయకాలనీకి చెందిన టైలర్ ఉర్ల శ్రీనివాసరావు ఉన్నారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని ఎస్ఐ వెల్లడించారు. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు -
సవాళ్లను స్వీకరించారు
● మైనింగ్ రంగంలో మహిళా ఇంజనీర్లు ● భూగర్భ గనుల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు ● సింగరేణిలో 38 మంది అధికారిణులుపోలీస్ చేతిలో లాఠీలా ఈ మహిళల చేతిలో కనిపించే ఊత కర్రను బంటన్ స్టిక్ అంటారు. భూగర్భ గనుల్లోకి వెళ్లినప్పుడు ఈ కర్రతో పైకప్పును కొట్టడం ద్వారా ఆ ప్రదేశం పనికి అనుకూలంగా ఉంది లేనిది గుర్తిస్తారు. అయితే నిన్నామొన్నటి వరకు ఈ స్టిక్ పట్టుకునే హక్కు పురుషులదే. కఠినమైన పరిస్థితులు ఉండే భూగర్భ గనుల్లో ఈ పని చేయలేరంటూ ఈ అవకాశం మహిళలకు ఇవ్వలేదు. అదంతా కాలం చెల్లిన అభిప్రాయమని నిరూపిస్తున్నారు ఈ యంగ్ విమెన్ మైనర్స్. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంనో చాన్స్ దేశంలో బొగ్గు తవ్వకాలకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం పురుషులతో సమానంగా మహిళలకు గనుల్లో పని చేశారు. పని ప్రదేశాల్లో ఉండే కఠినమైన పరిస్థితులు, మహిళల భద్రత దృష్ట్యా స్వాతంత్య్రం వచ్చాక గనుల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పించడంపై చట్టపరంగా నిషేధించారు. ఆ ప్రభావం సింగరేణిపై కూడా పడింది. దీంతో 2000 ఆరంభం వచ్చే సరికి నర్సులు, డాక్టర్లు, క్లరికల్ పోస్టులు తప్పితే మిగిలిన చోట్ల మహిళలకు అవకాశమే లేకుండా పోయింది. 2017 తర్వాత కారుణ్య నియామకాల ద్వారా మరికొందరికి అవకాశం దక్కినా అవి కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకే పరిమితమయ్యాయి. భిన్నమైన మార్గంలో సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని 1970వ దశకంలో కొత్తగూడెంలో మైనింగ్ కాలేజీ ప్రారంభమైంది. దశాబ్దాల పాటు ఈ కాలేజీలో బాలికలకు ప్రవేశం ఇవ్వలేదు. 2013లో తొలిసారిగా ఇంజనీరింగ్ మైనింగ్ బ్రాంచిలో మహిళలకు ప్రవేశం కల్పించారు. తొలి బ్యాచ్లో ఐదుగురు, రెండో బ్యాచ్లో ఏడుగురు చేరారు. అలా చేరిన, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కృష్ణవేణి అందరిలా కాకుండా సవాల్ విసిరుతూ మైనింగ్ రంగంలోకి వచ్చింది. బంధువులు, స్నేహితులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్ వరకు బ్రాంచి మార్చుకోవాలంటూ సూచించారు. కానీ ఐదుగురు బాలికలు స్థిరంగా నిలబడ్డారు. దీంతో మైనింగ్ కోర్సు మహిళలకు కూడా అనే భావనకు బలం వచ్చింది. ఆ మరుసటి ఏడాది బ్యాచ్లో కొత్తగూడెం పట్టణానికే చెందిన రమ్యశ్రీ చేరింది. చిన్నప్పటి నుంచి సింగరేణి వాతావరణంలో పెరగడంతో ఇందులోనే కెరీర్ ఎంచుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత బ్యాచ్లో అనుపమ వచ్చి చేరింది. అలా మైనింగ్ కోర్సులో అడ్మిషన్లు తీసుకునే బాలికల సంఖ్య నిలకడగా ఉంటూ వస్తోంది. ఆ ఫలితంగానే కేఎస్ఎం, జేఎన్టీయూ (మంథని)తో పాటు మరో ఐదు ప్రైవేటు కాలేజీలు సైతం మైనింగ్ కోర్సును మహిళలకు ఆఫర్ చేస్తున్నాయి. అడ్డంకులు దాటుకుని.. మహిళలు మైనింగ్ ఇంజనీరింగ్ చదవడమేంటనే మాటలు వింటూనే కోర్సు పూర్తి చేశారు. అప్పటికీ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో మహిళా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా విమెన్ మైనింగ్ గ్రాడ్యుయేట్లు వెనక్కి తగ్గలేదు. ప్రైవేటు కంపెనీల్లో ఆఫర్లు వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు వెళ్లారు. సాధారణంగా గనుల తవ్వకాలు జరిగే ప్రదేశాలు చాలా వరకు రిమోట్ ఏరియాలుగానే ఉంటాయి. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దుమ్ము ధూళి ఎక్కువ. ఎండా వానలు లెక్క చేయకుండా పని చేయాలి. దీనికి తోడు బయటి రాష్ట్రాల్లో ఉండే భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు విభిన్నం. అయినా వారు వెరవలేదు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే మైనింగ్ ఇండస్ట్రీలో సమర్థంగా పని చేశారు. మైనింగ్ ఫీల్డ్ ఒక్కటే కాదు ఆహారం, సంస్కృతి, కాలుష్యం ఏవీ తమ పట్టుదల ముందు దిగదుడుపే అని నిరూపించారు. సగర్వంగా నిలిచారు గనుల్లో మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం తొలిసారిగా 2024లో జారీ చేసిన నోటిఫికేషన్లో మేనేజ్మెంట్ ట్రైనీలుగా మహిళలకు సింగరేణి అవకాశం కల్పించింది. దీంతో ఒక్కసారే 38 మంది ఇంజనీర్లు గనుల్లో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. వీరంతా సింగరేణిలోని వివిధ ఏరియాల్లో సమర్థంగా విధులు నిర్వహిస్తూ హమ్ కిసీ సే కమ్ నహీ అంటూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తున్నారు. దృక్పథం మారాలి ఒక అబ్బాయి ఏదైనా పని చేయడంలో విఫలమైతే కేవలం ఆ అబ్బాయి ఒక్కడే విఫలం అయ్యాడు అని అంటారు. అదే ఎవరైనా ఒక అమ్మాయి ఒక పని చేయడంలో తడబడితే చాలు, అమ్మాయిలంతా ఇంతే, ఏ పని చేయలేరంటూ ముద్ర వేస్తారు. ఈ ఆలోచన తీరులో మార్పు రావాలి. – కృష్ణవేణిమొదట్లో వినేవాళ్లు కాదు మేనేజ్మెంట్ ట్రైనీలుగా మా సూచనలు పాటించేందుకు కార్మికులు మొదట్లో సందేహించే వారు. మేము ఎంత విపులంగా చెప్పినా పురుష అధికారుల దగ్గరకు వెళ్లి కన్ఫర్మ్ చేసుకునే వాళ్లు. కానీ త్వరగానే మార్పు వచ్చింది. మహిళా అధికారులకు మద్దతు పెరిగింది. – రమ్యశ్రీ -
బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’
భద్రాచలం వద్ద గోదావరిలో వైభవంగా చక్రస్నానంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గత నెల 30న ప్రారంభమైన వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం కమనీయంగా జరిపారు. సుదర్శన చక్రాన్ని, ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర గోదావరి వద్దనున్న పునర్వసు మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు మండపంలో స్నపన తిరుమంజనం, హారతి సమర్పించారు. అనంతరం గోదావరిలో సుదర్శన చక్రానికి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం జరిపారు. సాయంత్రం ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు నిర్వహించారు. యాగశాలలో పుష్పయాగం, పూర్ణాహుతిలతో బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. సాయంత్రం శేష వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ గావించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామాలయంలో భక్తుల రద్దీ వరుస సెలవుల నేపథ్యంలో శనివారం రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడు రోజుల సెలవులతోపాటు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో హనుమాన్ మాలధారులు భద్రగిరికి తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకోగా, మాలధారులు మాల విరమణ గావించారు. నేటి నుంచి నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడా మండపంలో నిలిపివేసిన నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. స్వామివారి నూతన పర్యంకోత్సవం ఈ నెల 22వ తేదీన జరపనున్నారు. పవళింపు సేవలు కూడా అదే రోజు నుంచి నిర్వహించనున్నారు. ఆదివారం చిత్తనక్షత్రం సందర్భంగా సుదర్శన హోమ పూజలను జరుపుతారు. -
మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● మణుగూరులో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం బూర్గంపాడు/అశ్వాపురం/మణుగూరుటౌన్/ కరకగూడెం/పినపాక: మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పినపాక నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మణుగూరు మండలం కూనవరంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే విద్య ప్రాముఖ్యతను చాటారని పేర్కొన్నారు. మణుగూరు డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.4.33 కోట్లతో నిర్మించనున్న 30 అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రామానుజవరం–గొల్ల కొత్తూరు పీతురు వాగుపై రూ.1.90 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు, పగిడేరు–రామానుజవరం మార్గంలో పగిడేరు వాగుపై రూ.1.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరు స్టేజీ నుంచి గ్రామానికి రూ.63 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, జగ్గారంలో జగ్గారం నుంచి కుర్సంవారిగూడెం వరకు రూ.1.92 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. జగ్గారంలో అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ పూజలు చేశారు. బూర్గంపాడు– సోంపల్లి గ్రామాల మధ్య రూ.90 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక మండలంలో సుమారు రూ. 4 కోట్లతో నిర్మించునున్న బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. మల్లారం గ్రామంలో చిలకమ్మ దేవాలయ అభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు రామనాథానికి ఆర్థికసాయం చేశారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామ బొడ్రాయి వద్ద నుంచి సమీపంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. స్వార్థ రాజకీయాలకు చిరునామా బీజేపీ బీజేపీ స్వార్థ రాజకీయాలకు చిరునామా అని, రాజ్యాంగ వ్యవస్థలను తన స్వార్థానికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని, ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం ఏడాదిపాటు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలోనే నూతన అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందిస్తామని అన్నారు. కాగా గోదావరి వరద ముంపు నుంచి బూర్గంపాడు మండలాన్ని కాపాడాలని, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, తుక్కాని మధుసూదన్రెడ్డి, బేతం రామకృష్ణ, కమటం నరేష్, ఓరుగంటి భిక్షమయ్య, పోలేబోయిన శ్రీవాణి, చందా సంతోష్, బట్టా విజయ్గాంధీ, పీరినాకి నవీన్, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పోలెబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, కాటబోయిన నాగేశ్వరరావు, శివ, సామా శ్రీనివాసరెడ్డి, రవి, అబ్దుల్లా, సర్వేశ్వరరావు సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి భూ భారతి చట్టం అమలు భూ సమస్యల పరిష్కారానికి ఈనెల 14 నుంచి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెస్త్నుట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ, ఇప్పుడూ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే గిరిజన ప్రాంతానికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చే జూన్ 2 నుంచి నియోజకవర్గానికి 4, 5 వేల మంది లబ్ధిదారులకు చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 14 నెలల్లోనే పినపాక నియోజకవర్గంలో రూ.30కోట్ల మేర రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నేతృత్వంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు విజయవంతం చేశారని, శభాష్ రాహుల్ అంటూ అశ్వాపురం మండలం బీజీకొత్తూరు వద్ద ఐటీడీఏ పీఓను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. -
సమ్మర్ క్యాంపులు..
సర్కారు స్కూళ్లలో ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ అధికారులు ● వివిధ రకాల క్రీడల్లో, యోగా శిక్షణకు ఏర్పాట్లు.. ● ప్రైమరీలో రీడింగ్, రైటింగ్ నైపుణ్యం పెంచే చర్యలు ● వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో విద్యా సంవత్సరం ముగియనుండగా, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఫైనల్ ఎస్ఏ–2 పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో పాఠశాలల్లోనే సమ్మర్ క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. సమ్మర్ క్యాంపుల్లో గతంలో యోగా శిక్షణ ఇచ్చేవారు. ఈయేడాది అన్ని రకాల క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పాఠశాలలో రూ.20 వేల విలువైన అన్ని రకాల క్రీడా పరికరాలు వచ్చి ఉన్నాయి. క్రీడల నిర్వహణ, శిక్షకుల, ఎలా శిక్షణ ఇవ్వాలి తదితర అంశాలపై ఎంఈఓలు, హెచ్ఎంలతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠ్యంశాలు, బోధనలు లేని క్రీడలతో పాటుగా వినోదాత్మక అంశాలను కూడా జోడించి క్యాంపులు నిర్వహించనున్నారు. దీంతో వేసవి సెలవుల్లో కూడా పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. విత్తనాల సేకరణకు ప్రత్యేక బహుమతులు ఈ నెల 24 నుంచి వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సూచించారు. పూలు, పండ్లు, ఆకుకూరలకు సంబంధించిన విత్తనాలను సేకరించి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాక ఆ విత్తనాలను పాఠశాలలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్కువగా విత్తనాలు సేకరించిన విద్యార్థులు, పాఠశాలలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించనున్నారు. సేకరించిన విత్తనాలను ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి అడవుల్లో చల్లే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు.. జిల్లాలో 1,299 ప్రభుత్వ పాఠశాలల్లో 63,399 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ సమ్మర్ క్యాంపులు జరిగే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం పెంచేందుకు రీడింగ్, రైటింగ్ నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇళ్ల వద్దనే రీడింగ్, రైటింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైమరీ విద్యార్థులు వారు ఆడేగలిగే క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్, షటిల్, ఫుట్బాల్, చెస్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు. ఎండదెబ్బ తగలకుండా విద్యార్థులకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న ఎల్ఈడీ టీవీల్లో విద్యార్థులకు ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను సైతం ప్రదర్శించనున్నారు. ఇక ఉపాధి హామీ కార్మికులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టనున్నారు. -
కనుల పండువగా..
● ఆకట్టుకున్న సీతారాముల వసంతోత్సవం ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలుభద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరాయి. శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం బ్రహ్మోత్సవాలలో నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపటం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రంగుల హోళీగా భావించే వసంతోత్సవం కనుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన బేడా మండపంలో నిత్యకల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అర్చకులు విశ్వక్షేన పూజ, పుణ్యావాచనం తదితర ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. తొలుత మూలమూర్తులకు, అనంతరం లక్ష్మీ అమ్మవారికి, ఆండాళ్ అమ్మవారికి, భద్రుని గుడి, ఆంజనేయస్వామి వార్లకు చివరగా ఉత్సవమూర్తులకు వసంతాన్ని చల్లారు. నూతన వధూవరులైన సీత, రామయ్యలను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తులపై స్వామివారి వసంతాన్ని చల్లి అర్చకులు ఆశీర్వదించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, నవాహ్నిక తిరుకల్యాణ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజున చక్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలను జరపనున్నారు. ఆదివారం నుంచి స్వామి వారి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. -
ముత్యాలమ్మ గుడిలో కూలిన వందేళ్ల చెట్టు
పాల్వంచ: పట్టణంలోని గాంధీనగర్లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలోని వందేళ్లకు పైబడిన పాల చెట్టు గురువారం రాత్రి కూలింది. రెండు రోజుల కిందట వీచిన గాలికి చెట్టు కొంత వరకు ఒరిగింది. గురువారం మొత్తం కూలి ముత్యాలమ్మ గుడిపై పడటంతో ధ్వసమైంది. పక్కనే ఉన్న రెండు రేకుల ఇళ్లపై కూడా పడటంతో దెబ్బతిన్నాయి. ఇంటి బయట పడుకున్న బాగం సుకన్య, సుగుణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్రావు, రెవెన్యూ ఆర్ఐ తదితరులు సందర్శించారు. పాఠశాలలో తప్పిన ప్రమాదం వంటగది స్లాబ్ పెచ్చులు ఊడి పడి వంటమనిషికి గాయాలు టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలోని వంట గది స్లాబ్ పెచ్చులు ఊడి వంటచేస్తున్న మహిళపై పడ్డాయి. వంటలపైనా పడటంతో అవి దెబ్బతిన్నాయి. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెచ్చులు ఊడి పడుతున్న సమయంలో అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి వంటమనిషి సరోజ బయటపడింది. కానీ, ఆమె చేతికి గాయమైంది. శిథిలావస్థలో ఉన్న కిచెన్షెడ్కు మరమ్మతులు చేయాలని గత డిసెంబర్ 31న జరిగిన పేరెంట్స్ మీటింగ్లో తీర్మానం చేసి, ఉన్నతాధికారులకు పంపించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎస్పీ ఆకస్మిక తనిఖీ ములకలపల్లి: ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ రోహిత్రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు అర్ధగంట పాటు పోలీస్ స్టేషన్లో గడిపిన ఎస్పీ.. క్రైం వివరాలు, కేసుల తాలూకూ రికార్డులు పరిశీలించారు. ఈ విషయమై ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ను వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్పీ స్టేషన్ను సందర్శించినట్లు తెలిపారు. ఎస్పీ వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ ఉన్నారు. వేధింపులపై ఏఎస్పీకి ఫిర్యాదు భద్రాచలంటౌన్: చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్ను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్న ఘటనపై బాధితురాలు శుక్రవారం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. చర్లలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పందా రమేశ్ కొంతకాలంగా ఆశ వర్కర్ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు అతని భార్య, అత్తలకు విషయం చెప్పింది. దీంతో రమేశ్ అలా ఎందుకు చెప్పావని వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న బాధితురాలిని దుర్భాషలాడుతూ దాడి చేశాడు. చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో తనకు ప్రాణహాని ఉందని, రమేశ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన్నట్లు ఆశ్వ వర్కర్ తెలిపారు. మహిళ అదృశ్యంపై కేసు టేకులపల్లి: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ సురేశ్ కథం ప్రకారం.. టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన ప్రమీలకు ఇదే గ్రామానికి చెందిన గుమ్మడి సుధాకర్తో కొన్నేళ్ల కిందటే వివాహమైంది. కొంతకాలంగా ప్రమీల తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వెతికినా దొరక్కపోవడంతో శుక్రవారం బాధితురాలి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. కొనసాగుతున్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు తల్లాడ: మండలం కుర్నవల్లిలో నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. వేంకటాచలపతి దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యాన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు జరిగిన మ్యాచ్లో ఏపీలోని వైజాగ్ జట్టుపై తమిళనాడు జట్టు విజయం సాధించింది. శనివారం పోటీలు ముగియనుండగా, విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
జమలాపురంలో మాజీ సీజేఐ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారికి ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత వారికి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు.. శేషవస్త్రాలు, ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ కె.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామికి పూజలు చేసిన జస్టిస్ ఎన్.వీ.రమణ -
పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికి పటిష్ట ప్రణాళిక తయారు చేసుకోవాలని, విద్యారంగంలో జిల్లాను ముందుస్థాయిలో నిలపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో ఎంఈఓలు, హెచ్ఎంలతో శుక్రవారం నిర్వహించిన వార్షిక సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని, ఎక్కువ సేకరించిన పాఠశాలకు కాంప్లెక్స్ స్థాయిలో రూ.1000, మండల స్థాయిలో రూ. 5000, జిల్లాస్థాయిలో రూ. 50000 నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అనంతరం జిల్లాలోని 3,4,5 తరగతుల పిల్లలకు ఒక్కొక్కరికి రెండు నోటు పుస్తకాలను అందించే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులు అభ్యసనకు దూరం కాకుండా ఐటీసీ సంస్థ ఇచ్చిన నోట్ పుస్తకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. కాగా శుక్రవారం కొత్తగూడెం మండలంలోని హనుమాన్ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను అందించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, అధికారులు ఏ.నాగరాజు శేఖర్, ఎస్.మాధవరావు, ఎస్. శ్రీనివాస్, ఐటీసీ అధికారి చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. దరఖాస్తుదారుల పడిగాపులుచుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఆన్లైన్ కష్టాలు తప్పడం లేదు. రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ తరుచూ మొరాయిస్తోంది. మరోవైపు గడువు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. గంటల కొద్దీ మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా తాజాగా ఆఫ్లైన్లోనూ అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక నమూనా దరఖాస్తులను జిల్లాకు పంపగా, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. కానీ ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఆన్లైన్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. -
రజతోత్సవ సభను జయప్రదం చేయండి
భద్రాచలంటౌన్: భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీగా హాజరై బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. స్థానిక రాఘవ నిలయం (రెడ్డి సత్రం)లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఏప్రిల్ 27న గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని తెలిపారు. సమావేశంలో పినపాక మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, రాంబాబు, నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, కణితి రాముడు, బుచ్చయ్య, రేసు లక్ష్మి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబందించిన వాల్పోస్టర్లను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుమేరకు వరంగల్లో ఈ నెల 27న బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్య సోన, కొట్టి వెంకటేశ్వర్లు, మంతెపూరి రాజుగౌడ్, బత్తుల వీరయ్య పాల్గొన్నారు. -
మొక్కజొన్న లోడు లారీని అడ్డుకున్న రైతులు
జూలూరుపాడు: మొక్కజొన్న కంకులు తీసుకెళ్తున్న లారీని జూలూరుపాడులో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. పంటకు డబ్బు చెల్లించకుండా విత్తన కంపెనీ బాధ్యులు జూలూరుపాడులోని ఓ వే బ్రిడ్జి వద్ద లారీలో లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా, చండ్రుగొండ మండలం పోకలగూడెం, గానుగపాడు, బాల్యాతండా, జూలూరుపాడు మండలం గంగారంతండాకు చెందిన రైతులు అడ్డగించారు. వివిధ కంపెనీల ఏజెంట్లు ఎకరాకు 4 – 5 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి, అలా జరగకపోతే రూ.75 వేలు పరిహారం ఇస్తామని నమ్మించినట్లు తెలిపారు. కానీ, పరిహారం చెల్లించకపోగా పండిన పంటకు డబ్బు చెల్లించకుండా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గ్రామాల నుంచి కంకులతో లారీని జూలూరుపాడు వే బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి, సాయంత్రం వరకు డబ్బు ఇవ్వకపోవడంతో అడ్డుకున్నామని తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించగా, విత్తన కంపెనీలపై ఫిర్యాదు చేశారు. కాగా, రైతులను నమ్మించి మోసం చేసిన మొక్కజొన్న విత్తన కంపెనీ డీలర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐయూకేఎస్ నాయకుడు బానోత్ ధర్మా డిమాండ్ చేశారు. రైతులు భూక్యా లక్ష్మణ్, వస్రాం, బాలు, మంగీలాల్, రాంబాబు, ప్రసాద్, వెంకటేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి
జూలూరుపాడు/చండ్రుగొండ: జిల్లాలోని రైతులకు గోదావరి జలాలు ఇచ్చాక మిగులు నీటిని పక్క జిల్లాకు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి, కేరళ రాష్ట్ర ఇన్చార్జి గోలి మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కిసాన్ మోర్చా నాయకులు వినోభానగర్ గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ను పరిశీలించారు. మద్దుకూరు గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ నీళ్లను జిల్లాలోని అన్ని చెరువులను నింపాకే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు గోదావరి జలాలు ఇవ్వకుండా సాగర్ నీళ్లు వస్తున్న కాలువకే మళ్లించడం దుర్మార్గమని విమర్శించారు. అకాలవర్షాలు, గాలిదుమారాలకు పంటలు నష్టపోయిన బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుకూరి రమేష్, చావా కిరణ్ కుమార్, రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, మాదినేని సతీష్, నున్నా రమేష్, సిరిపురపు ప్రసాద్, చంద్రశేఖర్, నల్లమోతు రఘుపతిరావు, జుబ్బురి రమేష్, భోగి కృష్ణ, గుగులోతు రాజేష్, భూక్యా కుమార్, గుగులోతు రాంబాబు పాల్గొన్నారు. -
వాగు.. బాగుపడేనా..?
● మొదలుకాని బుగ్గవాగు సుందరీకరణ పనులు ● గత జనవరిలో జరిగిన శంకుస్థాపన ● రూ.9 కోట్లతో టెండర్ పూర్తి ● కాగితాలకే పరిమితమైన ఒప్పందం ఇల్లెందు: ఇల్లెందు మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం జరిగినా పనులు మొదలు పెట్టడం లేదు. ఈ ఏడాది జనవరి 22న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. టీయూఎఫ్ఐడీసీ, డీఎంఎఫ్ నిధులు రూ.9 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నిధులతో బుగ్గవాగు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే బుగ్గవాగు పూడిక తీయకపోతే నీరు ఇళ్లల్లోకి వస్తోంది. దీంతో బుగ్గవాగు ప్రక్షాళన కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో వాగు వెంట ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్లు రిటైన్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇరు వైపులా వాకింగ్ ట్రాక్లు వాగులో చెత్తా చెదారం వేయకుండా ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన జరిగిన జనవరిలో పనులు మొదలై ఉంటే వచ్చే వర్షాకాలం నాటికి అంటే జూన్ – జూలై వరకు పూర్తయ్యే అవకాశం ఉండేది. కానీ, సుందరీకరణ మొదుల కాకపోవటంతో వచ్చే వర్షాకాలాన్ని తలచుకుని పట్టణ ప్రజలు.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. పట్టణం మధ్య నుంచి ప్రవహించే బుగ్గవాగు ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. ఎంతో మంది వాగులోకి వచ్చి నిర్మాణాలు చేసుకున్నారు. ఇళ్లు, దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వాగులో వదిలేస్తుండటంతో పూడిక పేరుకుపోతోంది. అధిక వర్షాలకు వాగు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది. బుగ్గవాగు మీద రెండు చోట్ల లోలెవల్ కాజ్వేలు ఉన్నాయి. వాగు పొంగితే కాజ్వేల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. చెత్తాచెదారం కాజ్వే ఖానాలకు అడ్డుపడి నీరు పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఒకవైపు బుగ్గవాగు, అలుగు వాగుల వల్ల అటు సత్యనారాయణపురం, ఇటు ఇల్లెందులపాడు ప్రజలకు వరదపోటు తప్పటం లేదు. కాగా, పట్టణం మధ్య నుంచి అంటే హిందూ శ్మశాన వాటిక నుంచి స్టేషన్ బస్తీ చివరి వరకు కిలోమీటర్ దూరం ఈ వాగు ప్రవహిస్తోంది. నంబర్–2 బస్తీ, ఎల్బీఎస్నగర్, స్టేషన్బస్తీలకు ముప్పు ఉంటుంది. సత్యనారాయణపురం 1, 2వ వార్డులకు అలుగు వాగు ఆటంకంగా మారింది. ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మాణం ఊసే లేదు. ఏటా వాగు ఉప్పొంగటం వాగు దాటకుండా ఎటు ప్రజలు అటే నిలిచిపోవటం సర్వసాధారణంగా మారింది. గత వర్షాకాలంలో ఓ వ్యక్తి వాగు దాటుతూ బైక్తో సహా కొట్టుకుపోయి కొంత దూరంలో ఒడ్డుకు చేరాడు. సత్యానారాయణపురం వాసులకు పట్టణం నుంచి వెళ్లాలంటే బర్లపెంట రహదారి వైపు బుగ్గవాగు మీద లోలెవర్ కాజ్వే ఉన్నప్పటికీ వాగు పొంగితే ఆటంకంగా మారుతుంది. చొరవ తీసుకోవాలి.. గత జనవరిలో శంకుస్థాపన జరిగినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వచ్చే వర్షాకాలం నాటికి పూడిక తీసే పనులు అయినా పూర్తి కాకపోతే కష్టంగా మారుతుంది. అధికారులు తక్షణం చొరువ తీసుకోవాలి. టెండర్, ఒప్పందం జరిగినా ఎందుకు చేపట్టడం లేదో అంతుపట్టడం లేదు. –దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇప్పటికై నా మొదలు పెట్టాలి.. బుగ్గవాగు ప్రధానంగా 4వ వార్డు గుండా ప్రవహిస్తోంది. వర్షాకాలం వాగు ఉప్పొంగితే ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతారు. సుందరీకరణ వేగంగా చేపట్టి వర్షాకాలం నాటికి పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. –సయ్యద్ ఆజమ్, మాజీ కౌన్సిలర్ ఇల్లెందు పాలకవర్గం లేక.. గత జనవరిలో పాలక వర్గం పదవీ కాలం ముగిసింది. పాలక వర్గం లేకపోవటం వల్ల అభివృద్ధి కుంటు పడిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా ఇప్పట్లో ఎన్నికలు పెట్టే స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించటం లేదు. ఎన్నికల ఊసే లేకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పట్టణంలో సగభాగం గుండా ప్రవహించే ఈ వాగు ప్రక్షాళన, సుందరీకరణ జరిగితేనే కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. -
జింక పిల్ల స్వాధీనం
దమ్మపేట: అడవిలో దారి తప్పి, మేకల గుంపులోకి చేరిన మచ్చల జింక పిల్లను ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ రేంజర్ కరుణాకరచారి కథనం ప్రకారం.. శుక్రవారం మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ మేకలను మేత కోసం గ్రామ శివారుకు తోలుకుని వెళ్లారు. ఈ క్రమంలో మచ్చల జింక పిల్ల తమ గొర్రెల గుంపులో కలవడం గమనించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలపగా.. రేంజర్, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని జింక పిల్లను స్వాధీనం చేసుకుని, రేంజర్ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆ జింక పిల్లను కిన్నెరసాని అభయారణ్యానికి సురక్షితంగా తరలించామని రేంజర్ తెలిపారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోటేశ్వరరావు, బీట్ ఆఫీసర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. కత్తితో ఇద్దరిపై దాడి చర్ల: మండలంలోని పూసుగుప్పకు చెందిన ఓ వ్యక్తి ఆటో నడుపుతూ మద్యం మత్తులో ద్విచక్రవాహనం మీదకు పోనిచ్చాడు. ఆటోను ఇలా నడపటమేంటని ప్రశ్నించడంతో మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ప్రశ్నించిన ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. పూసుగుప్పకు చెందిన పండా కృష్ణమూర్తి గురువారం రాత్రి మద్యం సేవించి, ఆటో నడుపుతూ అదే గ్రామానికి చెందిన తాటి భూపతి, సోడే వినోద్పైకి పోనిచ్చాడు. తర్వాత వారిద్దరు పూసుగుప్పకు వెళ్లి ఓ షాపు వద్ద కూల్ డ్రింక్స్ తాగుతుండగా అక్కడ ఉన్న పండా కృష్ణమూర్తిని ప్రశ్నించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి కత్తితో వీరిద్దరిపై దాడి చేశాడు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు చర్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, కత్తితో దాడి చేసిన పండా కృష్ణమూర్తిని స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని చర్ల పోలీసులు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సుజాతనగర్: కుమారుడిని తీసుకొని రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి మృతి చెందగా ఆరేళ్ల కుమారుడికి గాయాలైన ఘటన సుజాతనగర్ సెంటర్లో చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుంచి ఎనిమిదేళ్ల కిందట వలస వచ్చిన పొడియం దినేశ్ (39) ములకలపల్లి మండలం ధర్మన్ననగర్లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఆయన సుజాతనగర్ మండలంలోని రాఘవపురంలో తన సోదరుడు గంగయ్య వద్ద ఉన్న కుమారుడు భీమాను తీసుకుని సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న భద్రాచలం డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేశ్ మృతి చెందగా, భీమాకు గాయాలయ్యాయి. కాగా, ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ కోటగిరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. దిక్కు లేని స్థితిలో కుటుంబం రోడ్డు ప్రమాదంలో దినేశ్ చనిపోగా, గాయపడిన ఆయన కుమారుడు భీమాను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ఆయనను ఆరా తీస్తే వివరాలు చెప్పలేకపోగా, తండ్రి మృతి చెందాడనే బాధలో తన గాయాలను మర్చిపోయి చికిత్సకు సహకరించలేదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, దినేశ్ చనిపోయిన విషయం తెలిసిన ఆయన భార్య లక్ష్మి, మిగతా పిల్లలతో ఆస్పత్రికి చేరుకుని భీమాను పట్టుకుని రోదించడం కలిచివేసింది. అయితే, వలస వచ్చిన కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆయన భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఆయన కుమారుడికి గాయాలు -
గాలిదుమారానికి నేలరాలిన మామిడి
అశ్వారావుపేటరూరల్: అకాల గాలిదుమారం, వర్షం కారణంగా మామిడి, పొగాకు రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. మండలంలోని వినాయకపురం, మల్లాయిగూడెం, తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, ఆసుపాకతోపాటు పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి సమయంలో వచ్చిన గాలి దుమారం కారణంగా సుమారు 150 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మరో 50 ఎకరాల్లో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పసుపులేటి సుబ్బారావుకు చెందిన తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. మల్లాయిగూడెంలో ఉప్పల దుర్గప్రసాద్కు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో వందల సంఖ్యలో కాయలు రాలిపోవడంతోపాటు కొమ్మలు విరిగిపడ్డాయి. అశ్వారావుపేటలోని శివయ్యబజార్ వద్ద కొబ్బరి చెట్టు విరిగి, రోడ్డుకు అడ్డంగా పడింది. మండలంలోని చెన్నాపురం –గాండ్లగూడెం మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, వైర్లు తెగిపోవడంతో పలు గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆయా గ్రామాల్లో తాగునీటి పథకాల బోర్లు పని చేయక గిరిజనులు తాగునీటి కోసం అవస్థ పడ్డారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: గుర్తు తెలియని వ్యక్తి కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలోని బస్సు షెల్టర్ వద్ద 70 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి స్పృహతప్పి పడిపోయి ఉండగా, మైలారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, మృతుడు మైలారంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. సింగరేణి ఉద్యోగి కాజీపేటలో ఆత్మహత్య సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని సెంట్రల్ వర్క్షాపులో టర్నర్గా విధులు నిర్వహిస్తున్న యూ.సంజయ్కుమార్ ఆర్థిక ఇబ్బందులతో కాజీపేటలోని తన అమ్మమ్మ ఇంట్లో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వర్క్షాపు ఉద్యోగులు, జీఎం దామోదర్, డీజీఎం ప్రకాశ్, ఇంజనీర్ నారాయణ, సూపర్వైజర్లు, సింగరేణి ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. బియ్యం లారీ పట్టివేత అశ్వాపురం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని మండల కేంద్రంలో గౌతమీనగర్ కాలనీ వద్ద గురువారం రాత్రి అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం మణుగూరు నుంచి పాల్వంచకు లారీ (ఏపీ20టీఏ 3366)లో తరలిస్తుండగా సీఐ అశోక్రెడ్డి వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారు. లారీలో సుమారు 100 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. లారీని పోలీస్ స్టేషన్కు తరలించి, అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ శ్రీనుపై కేసు నమోదు చేశామని సీఐ అశోక్రెడ్డి తెలిపారు. -
దాహం తీరాలంటే రాష్ట్రం దాటాలి..
అశ్వారావుపేట రూరల్: దాహం తీర్చుకోవడానికి ఆ రెండు గ్రామాల గిరిజనులు ఏకంగా.. రాష్ట్ర సరిహద్దు దాటాల్సి వస్తోంది. నెల రోజులుగా వారిని వేధిస్తున్న తాగునీటి సమస్య గురువారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొండరెడ్ల గ్రామాలైన గోగులపూడి, కొత్త కన్నాయిగూడెంల్లో నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది.ఈ గ్రామాల్లో 50కి పైగా గిరిజన కుటుంబాలు నివసిస్తుండగా, ఒకే తాగునీటి పథకం ద్వారా నీరు అందేది. అయితే, బోరు నుంచి ట్యాంక్లోకి నీరు ఎక్కించే ప్రధాన పైపు విరగడంతో సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ఉద్యోగుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదు. దీంతో గ్రామస్తులు తాగునీటి అవవసరాల కోసం నిత్యం రెండు కిలోమీటర్లు ప్రయాణించి.. ఆంధ్రప్రదేశ్లోని ఓ రైతు పొలంలోని బోర్ నుంచి ట్యాంకర్తో నీరు తెచ్చుకుని బిందెలు, బకెట్లలో పట్టుకుంటున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రవీణ్ను వివరణ కోరగా సమస్య దృష్టికి రాలేదని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పురోగమనంలో పయనిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరోగమన దిశలో పయనిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, మాజీ ఎంపీపీలు బాదావత్ శాంతి, భూక్య సోన, బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, నాయకులు కొట్టి వెంకటేశ్వర్లు, రాజుగౌడ్, కాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సభకు తరలిరావాలి మణుగూరు రూరల్: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. మండలంలోని గుట్టమల్లారంలో గురువారం జరిగిన పినపాక నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఉన్నప్పుడు చుట్టూరా తిరిగి అధికారం లేనప్పుడు దొంగల్లా వ్యవహరిస్తున్న వారందరిని గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, మండలాల అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు -
మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
ఇల్లెందురూరల్: ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కుమారుడు ఊకే ప్రభాకర్ (45) అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. అనారోగ్యంతో గతేడాది నవంబర్ 24న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మృతి చెందారు. అప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రభాకర్ను మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ బుధవారం గుండె సంబంధిత శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేక గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రభాకర్ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.విద్యుదాఘాతంతో గేదెలు మృతిదమ్మపేట: విద్యుత్ వైర్లు తెగిపడటంతో రెండు గెదేలు, దూడ మృతి చెందిన ఘటన మండలంలోని రంగువారిగూడెం గ్రామ పంచాయతీ వెంకటరాజాపురం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని వెంకటరాజాపురం గ్రామానికి చెందిన దుంగల నాగమణి తన రెండు గెదేలు, దూడను గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మేత కోసం తోలుకుని వెళ్లింది. గెదేలు మేస్తుండగా అకస్మాత్తుగా 11 కేవీ విద్యుత్ వైరు తెగిపోయి గెదేలపై పడింది. దీంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి ఆదుకోవాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.నాలుగు ఇసుక ట్రాక్టర్లు సీజ్ములకలపల్లి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని సీతారాంపురం శివారు వాగు నుంచి ఇసుక తోలుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దాడులు నిర్వహించి, అనుమతిపత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.పీవీకే–5 గనిలో ప్రమాదంకాంట్రాక్ట్ కార్మికుడికి గాయాలుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పద్మావతి ఖనిలో కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్కు గాయమైంది. ఇతను గెయిన్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నాడు. గురువారం గనిలో సీఎంఆర్ వద్ద పనిచేస్తున్న క్రమంలో పైనుంచి బొగ్గుపెళ్ల పడి తలకు గాయమైంది. వెంటనే కార్మికుడిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా సదరు కంపెనీ నిర్వాహకులు ప్రమాద విషయాన్ని బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. గాయపడిన కార్మికుడిని ఎవరూ కలిసే వీలులేకుండా అడ్డుకుని గెస్ట్ హౌస్లో ఉంచారు.మందుపాతరలు నిర్వీర్యంచర్ల: చర్ల మండల శివారు రాంపురం అడవుల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన నాలుగు శక్తిమంతమైన మందుపాతరలను గురువారం కోబ్రా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని బీమారం క్యాంపునకు చెందిన కోబ్రా 204 బెటాలియన్కు చెందిన పోలీసు బలగాలు సమీప అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బీమారానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మందుపాతరలను గుర్తించారు. బాంబు డిస్పోజబుల్ బృందం వచ్చి ప్రెజర్బాంబు, మూడు బీరు బాటిల్ బాంబులుగా నిర్ధారించి, అక్కడే నిర్వీర్యం చేశారు. దీంతో పోలీసులకు పెనుప్రమాదం తప్పిందని బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
మణుగూరు టౌన్: మణుగూరు యువకులు జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపి ఈ నెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారని స్కై జిమ్ కోచ్ పొడిశెట్టి నాగరాజు గురువారం తెలిపారు. ఖమ్మంలో 53,72,77 కేటగిరీలలో లక్ష్మణ్, ఖైరుద్దీన్, ఖమర్, హఫీజ్, 93 కేటగిరీలో మాథిన్, 66 కేటిగిరీలో జిమ్ ట్రైనర్ నాగరాజు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువకులను పలువురు అభినందించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతిదమ్మపేట : రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సూర్యాపేట జిల్లా కాసరబండ గ్రామానికి చెందిన మచ్చ ఎల్లయ్య (37) మండలంలోని గట్టుగూడెం గ్రామంలో వేరుశెనగ కోత కోసే పనికి వచ్చాడు. గురువారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని వస్తున్న క్రమంలో రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో ఖమ్మం నుంచి అశ్వారావుపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎల్లయ్యకు తీవ్రగయాలు కాగా, స్థానికులు 108 అంబులెన్స్లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్యదమ్మపేట : యువకుడి ఆత్మహతపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన గీగా శివ (28) పంపు ఆపరేటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులపాలు కావడంతో బుధవారం భార్యతో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో అదే రోజు ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు దుప్పటితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. భూ వివాదంలో ఇరువర్గాల ఘర్షణఅశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురంలో భూ వివాదంలో గురువారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. గ్రామంలో 190/1 సర్వే నంబర్లో ఎకరం 20 కుంటల భూమిపై గ్రామస్తులకు, సారపాకకు చెందిన కనకమేడల హరిప్రసాద్ కుటుంబసభ్యులకు ఏళ్లుగా వివాదం నెలకొంది. గ్రామ కంఠం భూమి అని రెవెన్యూ అధికారులు నిర్ధారించి గ్రామ పంచాయతీకి అప్పగించారని గ్రామస్తులు చెబుతుండగా, తమకు తాత ముత్తాల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి అని హరిప్రసాద్ కుటుంబీకులు చెబుతున్నారు. హైకోర్టును ఆశ్రయించగా, తనకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని గురువారం హరిప్రసాద్ తన అనుచరులతో జేసీబీని తీసుకుని వచ్చాడు. భూమికి ఫెన్సింగ్ వేసే ప్రయత్నం చేయగా రామచంద్రాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హరిప్రసాద్ అనుచరుడి కారు అద్దాలు పగిలాయి. సీఐ అశోక్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. ఈ క్రమంలో సివిల్ డ్రస్లో ఉన్న సీఐ గన్మెన్ రమేష్ను హరిప్రసాద్ అనుచరుడిగా భావించి అతనిపై ఓ వ్యక్తి చేయి చేసుకోగా, గ్రామస్తులు నిలువరించారు. అనంతరం ఇరువర్గాలు అశ్వాపురం పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఆక్రమిత భూముల్లో జామాయిల్ నరికివేతఅశ్వారావుపేట: ఆక్రమిత అటవీ భూముల్లో సాగవుతున్న జామాయిల్ తోటలను ఆక్రమణదారులు నరికివేశారు. వినాయకపురం అటవీ ప్రాంతంలోని దమ్మపేట రేంజ్ తిరుమలకుంట సెక్షన్ దిబ్బగూడెం బీట్లో అడవులను ఆక్రమించుకుని కొందరు కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఈ నెల 3న ‘అటవీ భూమి ఆక్రమణ’అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. మరుసటి రోజు దమ్మపేట రేంజ్ అధికారి కరుణాకరాచారి విచారణ నిర్వహించి ఆక్రమణలు ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కానీ ఏ ఒక్కరిపైనా కేసులు నమోదు చేయలేదు. పైగా అటవీభూమిలో ఉన్న సంపద ప్రైవేటు వ్యక్తులు తరలించుకుపోతున్నా అటవీశాఖాధికారులు పట్టించుకోవడంలేదు. అటవీశాఖ, రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులు సైతం అటవీ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అటవీశాఖకు చెందిన ఓ అధికారి భోరోసాతోనే జామాయిల్ నరుకుతున్నట్లు సమాచారం. దీనిపై ఓ బీట్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయగా దురుసుగా సమాధానం చెప్పారని సమీప రైతులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై దమ్మపేట రేంజ్ అధికారి కరుణాకరాచారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
మక్కలు కొనేదెప్పుడో..?
● మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ● మద్దతు ధర కంటే తక్కువ చెల్లిస్తున్న వ్యాపారులు ● ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు ఇల్లెందురూరల్: జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చింది. యాభై శాతానికి పైగా నూర్పిడి కూడా పూర్తి కావడంతో మక్కలను కల్లాల్లో ఆరబెట్టారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తామని ఇటీవల మార్క్ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆశించిన దిగుబడి రాకున్నా కనీసం మద్దతు ధరైనా దక్కుతుందని భావించారు. ప్రకటన వెలువడి రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవడం, మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 11 కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా 11 చోట్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇల్లెందు, చల్లసముద్రం, కొమరారం, టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల, మర్కోడు, శెట్టుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేటతోపాటు దిగుబడిని బట్టి మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 16,938 ఎకరాల్లో సాగు జిల్లాలో ప్రస్తుత యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 16,938 ఎకరాలుగా నమోదైంది. అనధికారికంగా (పట్టాదారు పాస్పుస్తకాలు లేని భూములు) మరో పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. ఇందులో అత్యధిక విస్తీర్ణం ఇల్లెందు ఏజెన్సీలోనే సాగవుతోంది. సాధారణంగా వానాకాలం కంటే యాసంగిలోనే మొక్కజొన్న దిగుబడి అధికంగా ఉంటుంది. కానీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈసారి మొక్కజొన్న దిగుబడి తగ్గింది. ఎకరానికి 30 క్వింటాళ్లు దాటడం లేదు. ఈ చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు.. ప్రస్తుత సీజన్లో ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాల్కు రూ.2,225 మద్దతు ధర ప్రకటించింది. కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వాతావరణంలో మార్పులు, తరచూ వర్ష సూచనలతో ఆందోళనకు గురై వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అదే అదునుగా వ్యాపారులు తక్కువ ధరకు కొంటున్నారని, క్వింటాల్కు రూ.2 వేల నుంచి చెల్లించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏటా మక్కల కొనుగోళ్ల సమయంలో ఎర్రజెండా పార్టీలు రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి మద్దతు ధరను నిర్ణయించే సంప్రదాయం ఇల్లెందు ఏజెన్సీలో ఉంటుంది. ఈసారి కూడా సమావేశం నిర్వహిస్తామని పది రోజుల క్రితం ప్రకటించినా.. ఆ తర్వాత మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. తక్కువకే విక్రయిస్తున్నాం మొక్కజొన్న కంకులను నూర్పిడి చేసి పక్షం రోజులైంది. వాతావరణంలో మార్పులు, వర్ష సూచనతో ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటా రూ.2,050కి విక్రయించాను. క్వింటాకు రూ.200 నష్టపోయాను. – మంచె శ్రీను, రైతు, కొమరారం, ఇల్లెందు మండలంకేంద్రాలు ప్రారంభించాలి ఏటా మొక్కజొన్న కొనుగోళ్లు యాభైశాతం పూర్తయిన తరువాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తోంది. దీంతో రైతులకు నష్టం జరుగుతోంది. ఇప్పటికే అత్యధిక మంది రైతులు నూర్పిడి పూర్తి చేసి పంట విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్క్ఫెడ్ తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – అజ్మీర సీతారాం, రైతు, బోయితండా, ఇల్లెందు మండలం -
మృతుడి గుర్తింపు.. అంత్యక్రియలు
ఖమ్మంవైద్యవిభాగం: ఏన్కూరు పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ వ్యక్తి మృతి మృతదేహాన్ని గుర్తించగా, ఆయన ఆచూకీ తెలియకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పత్రికల ద్వారా విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం చుంచుపల్లి వాసులు, కుటుంబీకులు ఆ మృతదేహం గోడి విజయబాబుదిగా గుర్తించారు. విజయబాబు మతిస్థిమితం కోల్పోయినట్లు చెబుతూ, అంత్యక్రియలు నిర్వహించే స్థోమత లేదని అన్నం ఫౌండేషన్ను సంప్రదించారు. దీంతో ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు నేతృత్వాన బల్లేపల్లి వైకుంఠధామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్ప పువ్వు పానకం ధ్వంసంమణుగూరు టౌన్: మండలంలోని పగిడేరు పెద్దిపల్లి గొత్తికోయ గుంపులో నిల్వ ఉంచిన ఇప్ప పువ్వు పానకాన్ని ఎకై ్సజ్, పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ధ్వంసం చేశారు. సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో గొత్తికోయ గుంపు, పగిడేరు గ్రామాల్లో దాడులు నిర్వహించి 800 లీటర్ల ఇప్ప పువ్వు పానకాన్ని పారబోశారు. ‘అవి రేషన్ బియ్యమే..’ములకలపల్లి: తాము పట్టుకున్న లారీలో ఉన్నవి రేషన్ బియ్యమేనని ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు. ఎటువంటి అనుమతిపత్రాలు లేకుండా బియ్యం తరలిస్తున్న లారీని మండల పరిధిలోని జగన్నాథపురం శివారులో మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకుని, స్టేషన్కు తరలించిన విషయం విదితమే. లారీలో ఉన్నవి రేషన్ బియ్యమా? కాదా? నిర్ధారించేందుకు సివిల్ సప్లై డీటీ సుంకర శ్రీనివాసరావు బియ్యం శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపారు. కాగా ల్యాబ్ రిపోర్టులో రేషన్ బియ్యంగా తేలినట్లు ఎస్సై తెలిపారు. లారీలో 50 కేజీల బరువుగల 700 బస్తాలు ఉన్నాయని, మొత్తం 34 టన్నుల పీడీఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులకు వైద్య శిబిరం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్తగూడెంలోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు 100 మంది విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, కార్డియాలజీ విభాగాల వారు పరీక్షించి తగిన సూచనలు చేశారు. కేన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించారు. విద్యుత్ ఎస్ఈ జి మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంకాలజిస్ట్ కోట్ల బాలరాజు, కార్డియాలజిస్ట్ డాక్టర్ మజీద్, విద్యుత్ డీఈ ఎన్.కృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ డీఈలు జి.రంగస్వామి, పీఎస్వీఎస్ నందయ్య, సర్కిల్ కార్యాలయ ఏఓ శ్రీధర్, టెక్నికల్ ఏడీఈ కె. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పావు గంటలోనే ప్రక్రియ
● రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ● పైలట్గా మూడు కార్యాలయాల్లో అమలు ● తొలిరోజు చిన్నచిన్న సమస్యలు మినహా సాఫీగానే.. ● వచ్చే నెల 1నుంచి అన్ని కార్యాలయాల్లో అమలుకు కసరత్తు ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెం అర్బన్: ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం రోజంతా వేచి ఉండకుండా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ముందుగానే సమయాన్ని నిర్దేశించుకుని స్లాట్ బుక్ చేసుకునే విధానాన్ని అమలుచేస్తుండగా, పావు గంటలోనే ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్కు వచ్చిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇక స్లాట్ దొరకని వారు, బుక్ చేసుకోలేని వారి కోసం ప్రతిరోజు సాయంత్రం 5 – 6 గంటల మధ్య వాకిన్ విధానంలో ఐదు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా, ఉమ్మడి జిల్లాలోని మూడు కార్యాలయాల్లో గురువారం మొదలైంది. తొలి రోజు మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 68 స్లాట్లు బుక్ కాగా, 66 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే, వాకిన్ విధానంలో ఏడు దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకుని.. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుండడం.. ఒకే సమయంలో ఎక్కువ మంది వస్తే అధికారులు దస్తావేజులను సక్రమంగా పరిశీలించలేని పరిస్థితి ఎదురయ్యేది. దీంతో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం అమలుకు నిర్ణయించగా, పైలట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను జాబితాలో చేర్చారు. గురువారం మొదలైన ఈ విధానంలో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న సమయం ఆధారంగా వచ్చిన వారి దస్తావేజులను అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అంతేకాక రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అందజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుండి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి రానుంది. చిన్న చిన్న సమస్యలు మినహా.. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం స్లాట్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో తొలిరోజు సర్వర్లో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. సర్వర్ నెమ్మదించడం, డాక్యుమెంట్ వివరాలను నమోదు చేస్తున్న సమయంలో వాటికవే డిలీట్ కావడంతో మళ్లీ మొదటి నుంచి నమోదు చేయాల్సి వచ్చింది. దీంతో వీటిని సరిచేసి, ఇంకొన్ని అంశాలను సైట్లో చేరిస్తే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతుందని అధికారులు వెల్లడించారు. అధికారుల పర్యవేక్షణ ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకావడంతో అధికారులు పర్యవేక్షించారు. జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు ఖమ్మం, కూసుమంచి కార్యాలయాల్లో, చిట్ రిజిస్ట్రార్ కార్తీక్ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్లాట్ బుక్ చేసుకుని డాక్యుమెంట్లతో సబ్రిజిస్ట్రార్ వద్దకు వచ్చిన క్రయవిక్రయదారులకు పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేయడం, ఆపై పది నిమిషాల్లో పత్రాలు ఇవ్వడం విశేషం. బయోమెట్రిక్, ఫొటో, డాక్యుమెంట్ల పరిశీలన, స్కానింగ్ అంతా ఈ సమయంలోనే పూర్తయింది. తొలి రోజు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల వివరాలు.. కార్యాలయం స్లాట్ ద్వారా వాకిన్ మొత్తం రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు ఖమ్మం ఆర్వో 3 1 06 37కూసుమంచి 1 3 00 1 3కొత్తగూడెం 22 0 1 23 -
ఊంజల్ సేవలో కల్యాణ రామయ్య
భద్రాచలం: సీతాలక్ష్మణ సమేతుడైన కల్యాణ రామయ్యకు గురువారం వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతన వధూవరులైన సీతారాములను ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో కొలువుదీర్చిన అర్చకులు లాలలు.. జోలలు పాడారు. ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలు ఆలపించగా ఊంజల్ సేవ ఆద్యంతం ఆకట్టుకుంది. అనంతరం స్వామివారికి స్వర్ణ పూరిత సింహవాహనంలో తిరువీధి సేవ జరిపారు. 13 నుంచి నిత్యకల్యాణాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారికి వసంతోత్సవం జరపనున్నారు. శనివారం జరిపే చక్రతీర్థం, ధ్వజావరోహణం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా స్వామి వారి నిత్యకల్యాణాన్ని 13వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటనబూర్గంపాడు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బూర్గంపాడులోని గౌతమీపురం – సోంపల్లి బీటీ రోడ్డు, అశ్వాపురం మండలంలో అశ్వాపురం – బీజీ కొత్తూరు, అశ్వాపురం – జగ్గారం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మణుగూరు సమితి సింగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగదుల నిర్మాణం, మణుగూరు – రామానుజవరం మధ్య హైలెవల్ బ్రిడ్జి, మణుగూరు – పగిడేరు మధ్య హైలెవల్ బ్రిడ్జి, పినపాక మండలంలో పినపాక – ఉప్పాక క్రాస్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పినపాక – పోతిరెడ్డిపల్లి మధ్య బీటీ రోడ్డు, పినపాక – మల్లారం మధ్య బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక పినపాక–గడ్డంపల్లి మధ్య బీటీ రోడ్డును, పినపాకలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభిస్తారు. 19న వెబినార్కొత్తగూడెంఅర్బన్: భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా స్పెస్ వీక్ న్యూ ఢిల్లీ వారిచే ఈనెల 19న ఆన్లైన్ వెబినార్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబినార్లో పాల్గొనే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈనెల 17వ తేదీ లోగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంలో ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వివరాలకు డీఎస్ఓ(92472 96012)ను సంప్రదించాలని తెలిపారు. సాగర్ కాల్వలకు నీరు నిలిపివేత నాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వ లకు గురువారం సాయంత్రం నీటి విడుదల నిలిపివేశారు. యాసంగి పంటలకు గాను అధికారులు గత ఏడాది డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీరు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అలాగే, ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 115 రోజుల పాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశామని అధికారులు వెల్లడించారు. -
పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి
● అడవుల సంరక్షణ అందరి బాధ్యత ● డీఎఫ్ఓ కిష్టాగౌడ్ చండ్రుగొండ / అన్నపురెడ్డిపల్లి : అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి కిష్టాగౌడ్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లోని ప్లాంటేషన్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆదాయ వనరులు పెరుగుతాయని అన్నారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని చెప్పారు. కొత్తగా పోడుపేరుతో అడవులను ధ్వంసం చేసినా, అక్రమించుకున్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అడవుల్లో ఉచ్చులు, తుపాకులు, విద్యుత్ వైర్లు అమర్చి వన్యప్రాణులను వేటాడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సహకరించే వారిపై కూడా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ కోటేశ్వరరావు, రేంజర్ ఎల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
కేజీబీవీల్లోనూ చార్జీల పెంపు
● విద్యార్థినులకు కాస్మొటిక్స్, డైట్ బిల్లులు పెంచుతూ నిర్ణయం ● ఉమ్మడి జిల్లాలో 28 కేజీబీవీలు.. 8,480 మంది బాలికలు ● పెరిగిన చార్జీల అమలుతేదీపై కొరవడిన స్పష్టతపాల్వంచరూరల్ : ఎట్టకేలకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో కాస్మొటిక్స్, డైట్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 13న సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల విద్యార్థులకు చార్జీలు పెంచిన ప్రభుత్వం.. తాజాగా కేజీబీవీ విద్యార్థినులకూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అమలు చేసిన చార్జీలకు, నిత్యం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల్లో తేడాలు ఉండడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ క్రమంలో కస్తూ ర్బా విద్యార్థినులకూ డైట్, కాస్మొటిక్స్ చార్జీలు పెంచుతూ రాష్ట్ర ఉన్నతాధికారులు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో అన్ని తరగతులకూ ఒకే చార్జీలు.. గతంలో 6 నుంచి ఇంటర్మీడిఝెట్ వరకు అన్ని తరగతుల విద్యార్థినులకు డైట్ చార్జీలు నెలకు రూ.1,225, కాస్మొటిక్స్ చార్జీలు రూ.100 చెల్లించేవారు. కాగా, తాజా నిర్ణయం ప్రకారం 6, 7 తరగతుల వారికి డైట్ చార్జీలు రూ.1,330 చొప్పున, కాస్మొటిక్స్ చార్జీలు రూ.175 చెల్లించాలని నిర్ణయించారు. ఇక 8, 9, 10 తరగతుల విద్యార్థినులకు డైట్ చార్జీలు రూ.1,540, కాస్మొటిక్స్ చార్జీలు రూ.275 ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థినులకు డైట్ చార్జీలు రూ.2,100, కాస్మొటిక్స్ చార్జీలు రూ.275 చొప్పున చెల్లించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 28 విద్యాలయాల్లో.. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 14, భద్రాద్రి జిల్లాలో 14 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 6 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థినులు 4,780 మంది ఉండగా, భద్రాద్రి జిల్లాలో 3,700 మంది ఉన్నారు. బాలికలకు బలవర్థకమైన ఆహారం అందించే లక్ష్యంతో ప్రభుత్వం మెనూ బిల్లులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బాలికల్లో రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో నెలలో నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ వడ్డించడమే కాక, బుధవారం మినహా మిగితా రోజుల్లో అరటి, లేదా సీజనల్ పండ్లు, సేమియా, గులాబ్జామ్, అటుకులు, స్నాక్స్, పల్లీపట్టి, మిక్చర్, టీ అందించాల్సి ఉంది. పాత మెనూ ప్రకారం వాటిని అమలు చేయాలంటే విద్యార్థినులకు వచ్చే బిల్లులు సరిపోక అరకొరగా పెట్టాల్సి వచ్చేది. కొన్ని స్కూళ్లలో అయితే చికెన్, మటన్ పెట్టిన సందర్భాలు తక్కువే. గత చార్జీలతో మెనూ పక్కాగా అమలు చేయడం అధికారులకు ఇబ్బంది గానే ఉండగా ప్రస్తుతం చార్జీల పెంపుతో కేజీబీవీ కో ఆర్డినేటర్లు, ప్రత్యేకాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమలుపై కొరవడిన స్పష్టత.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం విద్యార్థినులకు పౌష్టికాహారం, కాస్మొటిక్స్ చార్జీలు పెంచినా.. ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయంలో స్పష్టత లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో నిర్దిష్ట తేదీ పేర్కొనలేదు. మరో 10రోజులు దాటితే వేసవి సెలవులు వస్తాయి. అయితే పెరిగిన చార్జీలు ఈ నెలలో అమలు చేస్తారా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తారా అనేది స్పష్టత రాలేదని కేజీబీవీల ప్రత్యేకాధికారులు చెబుతున్నారు. -
పురిటిగడ్డపై ప్రత్యేక దృష్టి
● ఇల్లెందు ప్రాంతానికి నష్టం కలగనివ్వం ● ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ ఇల్లెందు: బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లెందుకు ఢోకా ఉండదని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని, ఎలాంటి నష్టం కలగనివ్వబోమని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన చట్టం సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం ఇల్లెందు జేకే ఓసీలో జరిగిన ఫిట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల కాలంలో నాటి పాలకులు ఇల్లెందుపై శీతకన్ను ప్రదర్శించారని ఆరోపించారు. ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోతున్నా గుర్తింపు సంఘాల నాయకులు పట్టించుకోలేదని విమర్శించారు. నూతన గనుల ప్రారంభానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఇల్లెందు ఏరియాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నూతన గనుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు వచ్చేలా చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇల్లెందు జేకే ఓసీ పొడిగింపు ఆదేశాలు, అనుమతులు త్వరలోనే వస్తాయని అన్నారు. పూసపల్లి ఓసీ కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఇక్కడి కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జనక్ప్రసాద్, నర్సింహారెడ్డి, త్యాగరాజులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో జనరల్ సెక్రటరీ వికాస్కుమార్ యాదవ్, ఆల్బర్ట్, జె.వెంకటేశ్వర్లు, గోచికొండ సత్యనారాయణ, భూక్యా నాగేశ్వరరావు, మహబూబ్, కళ్లం కోటిరెడ్డి, పడిదల నవీన్, కొండూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
పక్షం దాటితే.. ప్రమాద ఘంటికలే!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మే నెల రాకముందే గోదావరి వట్టిపోతోంది. దుమ్ముగూడెం ఆనకట్ట దిగువ భాగంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక కార్యాచరణ అవసరం కానుంది. కాటన్ ఆనకట్ట నుంచే.. జిల్లాలోని మెజారిటీ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఇందుకోసం పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా ఓవర్హెడ్ ట్యాంక్లు నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. అయితే ఇందుకు అవసరమైన రా వాటర్ను అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన కాటన్ ఆనకట్ట దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మిషన్ భగీరథకు ప్రతీ రోజు 150 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంట విస్తరించిన హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాచలం స్పెషల్ పేపర్ బోర్డ్ లిమిటెడ్లకూ ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహాలు సంతృప్తికర స్థాయిలో కొనసాగడంతో ఆనకట్ట నుంచి తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఎదురుకాలేదు. కానీ ఈసారి ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తేలిన బండరాళ్లు.. కాటన్ ఆనకట్టకు ఎగువన ఉన్న లక్ష్మి, సమ్మక్క బరాజ్ల నుంచి కనీస ప్రవాహాలే దిగువకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీటికి, ఉపయోగిస్తున్న నీటికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో క్రమంగా గోదావరి ఎండిపోతోంది. నదిలో ఎడమ వైపు మిషన్ భగీరథ, హెవీవాటర్ ప్లాంట్ ఇన్టేక్ వెల్స్ దగ్గరగానే ప్రవాహాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న పర్ణశాల వైపు నదిలో ఇసుక మేటలు వేయగా, నదీ గర్భంలోని బండలు బయటకు కనిపిస్తున్నాయి. చివరకు సరుకు రవాణ కోసం ఉద్దేశించిన కెనాల్లోనూ నీటి నిల్వలు తగ్గిపోయి అడుగు కనిపిస్తోంది. దీంతో ఈ కెనాల్పై నిర్మించిన హైడల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది. పక్షం రోజులకే.. ప్రస్తుతం బరాజ్లో ఉన్న 0.98 టీఎంసీల నీటి నిల్వలు ఈ నెలాఖరు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథకు సరిపోతాయనే ధీమాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎండలు మరింతగా ముదిరితే నీటి ఆవిరి నష్టాలు పెరిగి ఈ సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. పైనున్న లక్ష్మి, సమ్మక్క బరాజ్ల నుంచి విడుదల చేయించడంతో పాటు వచ్చే ప్రవాహాలను జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సీతమ్మ సాగర్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా కాటన్ ఆనకట్టలో పూడిక తీత, లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేసి ప్రతీ బొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరముంది.తగ్గుతున్న నీరు.. అశ్వాపురం – దుమ్ముగూడెం మధ్య గోదావరిపై నిర్మించిన ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఆరు టీఎంసీలు. ఈ బరాజ్ను నిర్మించినప్పుడు డెడ్ స్టోరేజీ లెవల్ 36 మీటర్లు ఉండగా 49.5 మీటర్ల దగ్గర అలుగు పారుతుంది. అయితే 150 ఏళ్ల క్రితం నాటి నిర్మాణం కావడంతో బరాజ్లో భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో బరాజ్ డెడ్ స్టోరేజీ లెవల్ 42 మీటర్లకు చేరుకోగా, నీటి నిల్వ సామర్థ్యం నాలుగు టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం 47.7 మీటర్ల ఎత్తులో 0.98 టీఎంసీల నీరే ఇక్కడ నిల్వ ఉంది. -
పైన మావోయిస్టులు... కిందన జవాన్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వం–మావోయిస్టుల మధ్య శాంతి చర్చలకు ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న తరుణంలో కర్రిగుట్టల్లో బాంబుల అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ–ఛత్తీస్గఢ్ మధ్య సహజ సరిహద్దుగా సుమారు వంద కిలోమీటర్ల పొడవునా కర్రిగుట్టలు విస్తరించి ఉన్నాయి. వీటిని సడేమలమ్మ గుట్టలు, సోములమ్మ గుట్టలని కూడా పిలుస్తారు. ఈ గుట్టలకు అవతలి వైపు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఉండగా, తెలంగాణ వైపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొంత భాగం ఉంది. ఎప్పటినుంచో ఈ ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉంది. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత నిర్బంధం తీవ్రం కావడంతో గత వేసవి నుంచే మావోయిస్టులతోపాటు ప్రభుత్వ బలగాలంటే బెదిరిపోయే జన మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు కూడా పెద్ద సంఖ్యలో కర్రిగుట్టలపైకి చేరుకున్నారు. వివిధ కోణాల్లో పోలీసువర్గాలకు అందిన పక్కా సమాచారం సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అయితే కర్రిగుట్టల మీదకు వెళ్లి మావోయిస్టులపై దాడులు చేయడమంటే జవాన్ల ప్రాణాలను రిస్క్లో పెట్టడమేననే అభిప్రాయం ప్రభుత్వ భద్రతాదళాల్లో వ్యక్తమవుతోంది. దీంతో సుదీర్ఘ కాలం గుట్టలపై మావోలు ఉండలేరని, కచ్చితంగా కిందకు రాక తప్పదనే అంచనాతో ఈ గుట్టల చుట్టూ మాటు వేసి ఉన్నారు. దీంతో తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దులో టెన్షన్ నెలకొంది.ఎన్కౌంటర్లు.. లొంగుబాట్లు నెలల తరబడి పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో సానుభూతిపరులను కర్రి గుట్టలపై ఉంచుకోవడం మావోలకు భారంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో నిత్యావసరాలు, మందులు, ఇతర అవసరాల కోసం జట్లు జట్లుగా సానుభూతిపరులను కర్రిగుట్టల నుంచి వారి స్వస్థలాలకు వెళ్లాలని కోరినట్టు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలు ఉన్న కామ్రేడ్లను వైద్యసాయం కోసం కర్రిగుట్టల నుంచి కిందకు పంపుతుండగా, ఇలా వస్తున్న సీనియర్ మావోలు ఎన్కౌంటర్లలో మృతి చెందుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీసులకు పట్టుబడిన సానుభూతిపరులు అరెస్టవడమో లేక లొంగిపోవడమో జరుగుతోంది. శాంతి చర్చలపై ఒత్తిడి పెంచేందుకేనా..?రెండు వారాలు గడిచినా శాంతి చర్చలపై ప్రభుత్వం నుంచి బహిరంగ స్పందన రాలేదు. దీంతో ఈ ప్రతిపాదన విఫలమైతే బస్తర్ అడవుల్లో తీవ్రహింస తప్పదనే సంకేతాలు పంపేందుకే కర్రిగుట్టల్లో బాంబులు పెట్టిన అంశాన్ని మావోలు బహిర్గతం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా మరోసారి శాంతిచర్చల అంశాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం మావోల వ్యూహమనే వాదనలు వినిపిస్తున్నాయి.శాంతి చర్చలకు మేం సిద్ధమే!మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేశ్ చర్ల: శాంతి చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని.. ఇందుకోసం ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించాలని మావోయిస్టు పార్టీ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం రూపేశ్ పేరిట విడుదలైన లేఖలోని వివరాలిలా ఉన్నాయి. శాంతి చర్చలకు సంబంధించి తమ కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేస్తూ చర్చలకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరగా, ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్శర్మ తిరస్కరించారని తెలిపారు. అనుకూల వాతావరణం లేకుండా చర్చలు సాధ్యం కాదనే విషయం ప్రభుత్వానికి తెలుసని, బస్తర్లో జరుగుతున్న మారణకాండను ఆపడం వల్ల శాంతిచర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మరోసారి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ మారణకాండతో ప్రజలు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని, అది వారి జీవనోపాధిపై ప్రభావం చూపిస్తూ యువత వలసబాట పడుతున్నారని పేర్కొన్నారు.శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలనే తమ డిమాండ్కు ప్రజాస్వామ్య ప్రేమికులు, మేధావులు, మానవ హక్కుల సంఘాలు, సామాజిక సంస్థల కార్యకర్తలు, పాత్రికేయులు మద్దతు తెలపాలని రూపేశ్ కోరారు. ప్రభుత్వం – మావోయిస్టుల మధ్య శాంతిచర్చల కోసం ఏర్పాటైన కమిటీ సభ్యులు కూడా చొరవ తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. -
మూడింటికీ ఒక్కరే !
● పాల్వంచ మున్సిపల్ కమిషనరే కొత్తగూడెం, అశ్వారావుపేటకు ఇన్చార్జ్ ● కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ● ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కిందిస్థాయి సిబ్బందికొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో ఎ’ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడేనికి, ఇటీవలే అప్గ్రేడ్ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి పర్మనెంట్ కమిషనర్లు లేరు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ప్రస్తుతం ఆ రెండు పట్టణాలకూ ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. దీంతో ఆమె ఎక్కడా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. అనేక పనులు పెండింగ్ పడడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్స్వామి గత నెలలో తన మాతృ సంస్థకు బదిలీ అయ్యారు. దీంతో పాల్వంచ కమిషనర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వారావుపేట ఇటీవలే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కాగా, అక్కడా సుజాతే ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు మున్సిపాలిటీల్లో విధులు నిర్వహించడం ఆమెకూ కష్టంగానే మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆమె ఎప్పుడు వస్తారు.. ఎప్పుడు వెళ్తారనే విషయాలపై కింది స్థాయి అధికారులకు స్పష్టత లేక సమన్వయం కొరవడుతోంది. దీంతో కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం వస్తున్న ప్రజలు సిబ్బంది లేక వెనుదిరగాల్సి వస్తోంది. ఇదిలాగే కొనసాగితే మున్సిపాలిటీ పాలన గాడి తప్పే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పనుల్లో జాప్యంతో ఇక్కట్లు.. కొత్తగూడెం మున్సిపాలిటీలో రెవెన్యూ విభాగాన్ని పరిశీలిస్తే మ్యుటేషన్ ఫైళ్లు కుప్పలుతెప్పలుగా పెండింగ్లో ఉన్నాయి. ఇళ్లు కొనుగొలు చేసిన వారు తమ పేర్లపై మారకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఇంటి నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి మున్సిపాలిటీ చుట్టూ తిరుగాల్సి వస్తోంది. కమిషనర్ లేకపోవడంతో సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, వచ్చిన వారు సైతం అంతంతగానే పనులు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నెల వరకు ఇంటి పన్నుల వసూళ్లు 80 శాతం దాటలేదంటే సిబ్బంది నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇష్టానుసారంగా టెండర్లు.. కొత్తగూడెం మున్సిపాలిటీలో డీఎంఎఫ్ నిధులతో వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఎంపవర్మెంట్ సెంటర్ల నిర్మాణం కోసం రెండు నెలల క్రితం ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. దీంతో కొత్తగూడెం, పాల్వంచ నుంచి దాదాపు 40 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. అయితే గత శనివారం సెలవు రోజు అయినప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు సిబ్బంది.. తమకు అనుకూలమైన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో టెండర్లు ఓపెన్ చేశారు. పని దినాల్లోనే టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉండగా రహస్యంగా సెలవు రోజు ఓపెన్ చేయడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇలాంటి ఘటనలు కొత్తగూడెం మున్సిపాలిటీలో అనేకం జరుగుతున్నాయి. జిల్లాలో ఏ గ్రేడ్ మున్సిపాలిటీకి శాశ్వత కమిషనర్ను నియమించాల్సిన అవసరం ఉందని పట్ణణ వాసులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఇన్చార్జ్ కమిషనర్ సుజాతను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
చుంచుపల్లి: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం ఐడీఓసీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పేదరిక నిర్మూలన, పౌష్టికాహారం, సుస్థిర వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతుల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందులో 30 శాతం నిధులు తాగునీటి పైప్లైన్ సౌకర్యం లేని ప్రాంతాలకు, మరో 30 శాతం నిధులు కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, గృహ ఇంకుడు గుంతలు, నాడెపు కంపోస్ట్ పిట్లకు కేటాయించాలని అన్నారు. సబ్కా యోజన–సబ్కా వికాస్ పథకం ద్వారా 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని, ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పనుల ఎంపికలో విధి విధానాలు పాటించాలని, నిధుల దుర్వినియోగం జరగకుండా చూడాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, డీపీఓ వి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు ప్రదర్శించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, ల్యాబ్ పరీక్షలకు డీఆర్ఏ నిర్ణయించిన ధరలనే తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన డీఆర్ఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సమస్యలు, వాటి పనితీరుపై చర్చించారు. అస్పత్రుల ముందు భాగంలో అంబులెన్స్లు తిరగడానికి, పార్కింగ్కు స్థలం ఉండాలని సూచించారు. అనుమతి లేని ఆస్పత్రులతో పాటు అర్హతలేని వారు చికిత్సలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ కృష్ణప్రసాద్, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మధువరన్, ఏఓ డాక్టర్ బాలాజీ, ఫైజ్ మొహినుద్దీన్, జూని యర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
కుక్కల దాడిలో పందెం కోళ్లు మృతి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం పట్టణం రామవరంలో వీధి కుక్కలు దాడి చేయడంతో పది పందెం కోళ్లు మృతి చెందాయి. బుధవారం తెల్లవారుజామున 6వ వార్డులో నివాసుముంటున్న రమేష్ పాసి ఇంట్లో వీధి కుక్కలు కోళ్లపై దాడి చేశాయి. దీంతో పది కోళ్లు మృతి చెందాయి. రామవరం ప్రధాన రహదారిలో ఉన్న మటన్, చికెన్ దుకాణాల వద్దపడేసిన వ్యర్థాలకు అలవాటు పడిన వీధి కుక్కలు.. ఆ వ్యర్థాలు దొరకకపోవడంతో కోళ్లపై దాడి చేసి, చంపి తింటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనుషులపై కూడా దాడి చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఇద్దరిపై కేసు నమోదు పాల్వంచరూరల్: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామశివారులో డబ్బుల విషయంలో ఇరువర్గాలు చర్చించకుంటున్న క్రమంలో గొడవ తలెత్తిందని ఎస్ఐ.సురేష్ తెలిపారు. ఈ క్రమంలో పాకాల వెంకట్రావు, ఖాజాలు తమపై దాడి చేశారని బాధితులు ఇట్టి వెంకట్రావు, నిమ్మల రాంబాబు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడి ఘటనలో ఆరుగురిపై.. పాల్వంచరూరల్: దాడి ఘటనలో పోలీసులు బుధవారం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో సెల్ఫోన్ల్ వాట్సాప్ వీక్షించే క్రమంలో జగన్నాధం రాంబాబు, రవీందర్ మధ్య వాగ్వాదం నెలకొని రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈక్రమంలో రాంబాబు, అనిల్, రాములమ్మలపై రవీందర్, శాంతి, దాసరి లక్ష్మి, అశోక్, అబ్రహం, లక్ష్మి కలిసి గత నెల 9న దాడి చేశారు. బాధితుడు రాంబాబు బుధవారం ఫిర్యాదు చేయగా దాడిచేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్రవాహదారుడిపై.. పాల్వంచరూరల్: ప్రమాదానికి కారణమైన ద్విచక్రవాహనదారుడిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన మాలోత్ భగవాన్ గత నెల 5న ద్విచక్రవాహనంపై వెళ్లి పెద్దమ్మగుడి వద్ద కొబ్బరికాయ తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న మున్నవన్ శ్రీను ఢీకొట్టాడు. దీంతో భగవాన్ తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు క్షతగాత్రుడి కాలును తొలగించారు. బాధితుడి కుమారుడు నరేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. థియేటర్ అడ్డాగా ఇసుక వ్యాపారంఇల్లెందు: పట్టణంలో మూతపడిన థియేటర్ అడ్డాగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. అటవీ ప్రాంతంలోని వాగులు, వర్రెల నుంచి తరలించి ఇసుక అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలను మేనేజ్ చేసి వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. కాగా పూసపల్లి–జెండాల వాగు అటవీ ప్రాంతం నుంచి ఓ ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో అడ్డుకున్నట్లు ఆ సంఘం నాయకులు తాటి మధు, గుమ్మడి రాంకుమార్ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ సీజ్పాల్వంచ: అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను బుధవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నాగారం నుంచి ఇసుక తరలిస్తుండగా వెంగళరావు కాలనీ వద్ద పట్టణ పోలీసులు పట్టుకుని స్టేషన్ తరలించారు. కేసు నమోదు చేశారు. -
పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలి
సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు మణుగూరు టౌన్: పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం ఆయన జీఎం దుర్గం రాంచందర్తో కలిసి కొండాపురం భూగర్భ గనిని సందర్శించారు. బంకర్ను, మ్యాన్రైడింగ్ సిస్టం ద్వారా గనిని సందర్శించి పరిశీలించారు. జియోలాజికల్ కండీషన్స్, రక్షణ తదితర అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మ్యాన్ పవర్, యాంత్రిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్లు, వీరభద్రరావు, శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, వెంకట్రావ్, వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఈద్ మిలాప్సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్షాపులో బుధవారం ఈద్మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్క్షాపు ఇన్చార్జ్ శ్రీకాంత్, ఏరియా ఉపాధ్యక్షుడు రజాక్, కేశవరావు, యోహాన్, అబ్దుల్ బాసిత్, అబ్దుల్ సలాం, ఎ.ఉపేందర్బాబు, సత్తార్, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. దాహార్తి తీరుస్తున్న చలివేంద్రాలు పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చుంచుపల్లి: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో తగిన రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికులు, బయటకు వచ్చిన వారు వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాగునీటి బాటిళ్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అన్ని గ్రామాలు, వార్డుల్లోనూ పూర్తిస్థాయిలో చలివేంద్రాలను అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. అంబులెన్స్లో ప్రసవంటేకులపల్లి: మండలంలోని రామచంద్రునిపేట పంచాయతీ పాతర్లగడ్డ గ్రామానికి చెందిన మమతకు పురిటినొప్పులు రావడంతో 108లో అంబులెన్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. నొప్పులు అధికం కావడంతో మార్గమధ్యలోనే కాన్పు పొందింది. ఈఆర్సీపీ డాక్టర్ శివ సలహా మేరకు ఆశా వర్కర్తోపాటు ఈఎంటీ పూర్ణచందర్, పైలట్ శ్రీనివాసరావు సేవలందించారు. ఆడ బిడ్డ జన్మించిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఈఎంఈటీ తెలిపారు. దుక్కిటెద్దు మృతిజూలూరుపాడు: మండలంలోని కరివారిగూడెం గ్రామంలో దుక్కిటెద్దు మొక్కజొన్న కంకులు తిని అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ రైతు సీడ్ మొక్కజ్నొ పంటను సాగు చేశాడు. పంట చేతికి రావడంతో మూడు రోజుల క్రితం రైతు కంకులు విరిచి, అక్కడక్కడా కంకులు విరవకుండా వదిలేశారు. మొక్కజొన్న పొలంలోకి మేత కోసం వెళ్లిన భూక్య తిరుపతయ్య అనే రైతు దుక్కిటెద్దు రెండు రోజులుగా కంకులు తినడంతో అనారోగ్యానికి గురైంది. పశువైద్యాధికారితో చికిత్స అందించినా చనిపోయినట్లు బాఽధిత రైతు తెలిపాడు. రూ.60 వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఆటో బోల్తా ముగ్గురు మహిళలకు గాయాలు పాల్వంచరూరల్: ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళలు గాయపడ్డ ఘటన బుధవారం జరిగింది. మండల పరిధిలోని నర్సింహాసాగర్ గ్రామానికి చెందిన లక్ష్మ, అనూష, కనకమ్మలు తునికి కాయలను విక్రయించడం కోసం ఆటోలో పాల్వంచ వస్తున్నారు. ఈ క్రమంలో ఉల్వనూరు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
జల వనరుల వృద్ధికి చర్యలు
● సింగరేణి ఆధ్వర్యంలో ‘నీటి బిందువు– జలసింధువు’ కార్యక్రమం.. ● త్వరలో సింగరేణి వ్యాప్తంగా 50 చెరువుల ఏర్పాటుకు ప్రణాళిక ● మూతపడిన ఓసీ సంపులను నీటి వనరులుగా మార్చే యోచన సింగరేణి(కొత్తగూడెం): గనుల పరిసర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. రెండు కిలోమీటర్ల పరిధిలో 50 సహజ చెరువులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కుంటల్లో నీటి నిల్వకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది. భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి ‘నీటి బిందువు–జల సింధువు’ నినాదంతో పర్యావరణ హిత కార్యక్రమాన్ని చేపట్టనుంది. మైనింగ్ ప్రాంతంలోనూ, ప్రాంతానికి వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలోనూ సకల జీవరాశులకు, పంటలకు నీరందేలా చెరువులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుత చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తోంది. పంచాయతీల అనుమతులు తీసుకోని చెరువులను అభివృద్ధి చేయనుంది. నీటి కుంటలుగా ఓసీ సంపులు మూతపడిన ఓసీ సంపులను నీటి కుంటలుగా మార్చనుంది. సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటిశాతం (మట్టాన్ని) పెంచనుంది. తద్వారా సమీప ప్రాంతాల్లో వాటర్ టేబుల్ (నీటిఫలకం)ను వృద్ధి చేసేందుకు, భూగర్భ జలాల పెంపుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓవర్ బర్డెన్డంప్ల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను ఇకపై చిన్నపాటి నీటి తటాకాలుగా తీర్చిదిద్దాలని, వీటిని వర్షపు నీటితో/ఓపెన్కాస్ట్ గనుల నుంచి వెలువడే నీటితో నింపాలని భావిస్తోంది. కార్మికవాడలకు తాగునీరు కూడా.. సింగరేణి భూగర్భ గనుల్లో బొగ్గుతోపాటు వెలువడే నీటిని పైపుల ద్వారా ఫిల్టర్ బెడ్లకు పంపించి, శుద్ధి చేసి కార్మిక వాడలకు యాజమాన్యం తాగునీరు సరఫరా చేస్తోంది. సుమారు 130 ఏళ్లుగా ఇదే విధానం అవలంబిస్తోంది. 2018 నుంచి మాత్రం కొన్ని చోట్ల కాలనీల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తోంది. యాజమాన్యం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో శుద్ధమైన నీరు కార్మికులకు అందనుంది. జీవావరణ పరిరక్షణకు చర్యలు సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల వృద్ధికి, ఆ ప్రాంతంలో జీవావరణ పరిరక్షణకు దోహదం చేసే చర్యలు తీసుకుంటాం. పర్యావరణ అనుమతులతో త్వరలో చెరువుల పనులు ప్రారంభిస్తాం. కార్మికులకూ తాగునీటి సమస్య కూడా తీరుతుంది. –ఎన్.బలరామ్ నాయక్, సింగరేణి సీఎండీ శుద్ధమైన నీటిని అందించాలి సింగరేణి వ్యాప్తంగా చెరువులు ఏర్పాటు చేయాలని తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయం. వీలైనంత త్వరలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి, కార్మికులకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలి. కొత్తగూడెం ఏరియాలో సుమారు6 చెరువులనుఅభివృద్ధి చేయాలి. –ఎండీ.రజాక్, కార్మిక నాయకుడు -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
బూర్గంపాడు: సారపాక గాంధీనగర్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సారపాక కండక్టర్స్ కాలనీకి చెందిన బ్రహ్మాచారి(60) వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అశ్వాపురం మండలం ఎలుకలగూడెం మోటార్సైకిల్పై వెళ్లి మంగళవారం రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు అతని కోసం పలుచోట్ల వెతికారు. బుధవారం ఉదయం సారపాక గాంధీనగర్లోని ఓ ఇంట్లో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తన తండ్రి మృతిపై అనుమానాలున్నాయని, మృతుని కుమారుడు అశోక్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు, బైక్ ఢీ: దంపతులకు తీవ్రగాయాలుజూలూరుపాడు: బైక్, కారు ఢీకొని దంపతులు గాయపడ్డ సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొమ్ముగూడెం వద్ద ఖమ్మం వైపు నుంచి కొత్తగూడెం వెళుతున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న కరివారిగూడెం కాలనీకి చెందిన గుగులోత్ కోటియా, లక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీకి ఢీకొని ఆగిపోయింది. ప్రహరీ కూడా ధ్వంసమైంది. గాయపడ్డ దంపతులు కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోటియా, లక్ష్మి దంపతులు కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
శ్రీకాంత్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి
ఖమ్మంమయూరిసెంటర్: సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ ఔన్నత్యాన్ని చాటుతూ ఆయన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. మధురైలో జరిగిన సీపీఎం అఖిల భారత మహాసభలకు వెళ్లిన శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన అంత్యక్రియలు బుధవారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ నివాసంలో జరిగిన సంతాపసభలో అరుణ్కుమార్ మాట్లాడారు. జిల్లాలో విద్యార్థి ఉద్యమాభివృద్ధికి ఆయన తోడ్పడ్డారని గుర్తుచేశారు. ఆయన కుటుంబం పార్టీ కోసం నిలబడినందున, ఇప్పుడు వారికి పార్టీ చేదోడుగా నిలవాలని సూచించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. శ్రీకాంత్ లాంటి పోరాట యోధుడు దూరం కావడం బాధాకరమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మాట్లాడుతూ.. శ్రామికవర్గాల రాజ్యస్థాపనకు పనిచేసిన శ్రీకాంత్ సేవలు మరువలేనివని చెప్పారు. అనంతరం అంతిమయాత్రలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా, ఆయన పాడెను అరుణ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు మోశారు. ఇంకా మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు ఎం.సాయిబాబు, బి.వెంకట్, వై.వెంకటేశ్వరరావు, జూలకంటి రంగారెడ్డి, బాగం హేమంతరావు, పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్, ప్రభాకర్, చావా రవి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. అలాగే, దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ జిల్లా కమిటీ బాధ్యులు షేక్ అబ్దుల్ రెహమాన్, మావిడాల ఝాన్సీ, దామల్ల జయ తదితరులు కూడా శ్రీకాంత్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. సంతాప సభలో సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు అరుణ్ -
మెరుగైన వైద్యం అందించాలి
● విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దు ● ఐటీడీఏ పీఓ రాహుల్ మణుగూరు రూరల్/అశ్వాపురం : ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు సబ్ డివిజన్ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వైద్య సిబ్బందికి సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని, అశ్వాపురం పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. పేషెంట్లకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పని తీరు, భోజన సౌకర్యంపై సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా, భోజనం ఎలా ఉంది అని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే వారిని ఆప్యాయంగా పలకరించాలని, మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వ్యాఽధితో వచ్చిన వారు పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉత్తమ సేవలు అందించాలన్నారు. సకాలంలో విధులకు హాజరుకావాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్య తప్పదని హెచ్చరించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని రకాల మందులతో పాటు వేసవికాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం అశ్వాపురం తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేశారు. కొత్త ఓటరు నమోదు, చేర్పులు, మార్పుల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీఓ కార్యాలయంలో రాజీవ్ యువవికాసం దరఖాస్తులను పరిశీలించారు. ఈనెల 14వరకు గడువు ఉన్నందన ఎక్కువ మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేలా ప్రచారం కల్పించాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని పీఓ దృష్టికి తేగా.. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మణుగూరు ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ గౌరీప్రసాద్, అశ్వాపురం, మణుగూరు తహసీల్దార్లు స్వర్ణలత, రాఘవరెడ్డి, మణుగూరు ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఏడీఎంహెచ్ఓ చైతన్య, యూడీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
● పడిపోతున్న ‘దుమ్ముగూడెం’ నీటిమట్టం
అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతోంది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో గోదావరి వట్టిపోతోంది. ఆనకట్ట సమీపంలో మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్, భారజల కర్మాగారం ఇన్టేక్ వెల్ ఉన్నాయి. మిషన్ భగీరథ ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. భారజల కర్మాగారానికి ఇన్టేక్వెల్ ద్వారా నీరు సేకరిస్తారు. ప్రస్తుతం ఉన్న నీటి మట్టంతో ఈ నెలాఖరు వరకు నీటి సమస్య ఉండదని, వచ్చే నెలలో నీటి సమస్య ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. –అశ్వాపురం -
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
సింగరేణి(కొత్తగూడెం): అమర వీరుల త్యాగాలు స్మరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాష అన్నారు. రుద్రంపూర్లో పునర్నిర్మించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు దేవూరి శేషగిరిరావు విగ్రహాన్ని, సీపీఐ రాష్ట్ర నేత బందెల నర్సయ్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. తొలుత నేతల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి శేషగిరిరావు నాటి తెల్లదొరల దోపిడీని వ్యతిరేకించి, కార్మిక హక్కుల సాధనకు కృషి చేశారని గుర్తుచేశారు. నాయకులు బి. అయోధ్య, కొరిమి రాజ్కుమార్, వాసిరెడ్డి మురళి, గనిగెల్ల వీరస్వామి, తోట రాజు, ముత్యాల విశ్వనాథం, తాటి వెంకటేశ్వర్లు, డి.వెంకన్న, పుల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. -
రైతులకు ప్రత్యేక బడ్జెట్ తేవాలి
సూపర్బజార్(కొత్తగూడెం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా వ్యవసాయ రంగం దిబ్బతిని సంక్షోభంలో ఉందని ఆవేదనవ్యక్తం చేశారు. స్వామినాథన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మిర్చి క్వింటాకు రూ.25 వేలు చెల్లించాలి, పత్తికి రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరారు. అనాదిగా పోడుసాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్, జిల్లా నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, నరాటి రమేష్, సపావట్ రవి, విజయలక్ష్మి, సుబ్బారెడ్డి, బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ధర్నా -
12న పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా చండీహోమం నిర్వహించనున్నారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని ఈఓ ఎన్.రజనీకుమారి సూచించారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. అడవుల పరిరక్షణ అందరి బాధ్యతడీఎఫ్ఓ కిష్టాగౌడ్ కరకగూడెం: అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని అనంతారం రిజర్వ్ ఫారెస్ట్ ప్లాంటేషన్లను, అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, అడవులను నరకడానికి ప్రయత్నించినా, వన్యప్రాణులను వేటాడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అటవీ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడవుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మణుగూరు డివిజన్ అటవీ అధికారి సయ్యద్ మక్సుద్ మొయినొద్దీన్, అనంతారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. 12 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతిపాల్వంచరూరల్ : జిల్లాలో 12 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు లైవ్స్టాక్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించిందని పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. తమ కార్యాలయంలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించామని, వెటర్నరీ అసిస్టెంట్లుగా రెండేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఉద్యోగోన్నతి పొందిన 12 మందిలో 8 మందిని జిల్లాలో ఖాళీగా ఉన్న వెటర్నరీ ఆస్పత్రులకు కేటాయించామని, మరో నలుగురు బదిలీపై ఖమ్మం జిల్లాకు వెళ్లారని తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలందించాంభద్రాచలంటౌన్ : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్వంలో మెరుగైన సేవలందించామని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, పర్ణశాల, కొత్తగూడెంలో రెండు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా 14,789 మంది భక్తులు ఈ శిబిరాలను వినియోగించుకున్నారని వివరించారు. ఏఓ బాలాజీ నాయక్, చైతన్య, మధువరన్ ఈ శిబిరాలను పర్యవేక్షించారని పేర్కొన్నారు. దెబ్బతిన్న పంటల పరిశీలన నష్టం అంచనాల్లో అధికారులు అన్నపురెడ్డిపల్లి / చండ్రుగొండ : రెండు మండలాల్లో రెండురోజులపాటు గాలిదుమారంతో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా రెండు మండలాల్లో అరకొరగా ఉన్న మామిడిపంట గాలిదుమారానికి నేలరాలింది. దీంతో రూ.లక్షల్లో నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. కోతదశలో ఉన్న వరిపంట నేలవాలింది. వర్షం పడటంతో తేమకారణంగా ధాన్యం రంగుమారుతుందని, కోత కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. చండ్రుగొండ, దామరచర్ల, అయన్నపాలెం, మద్దుకూరు, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం తదితర గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయశాఖాధికారులు పంటనష్టం అంచనా వేస్తున్నారు. -
‘పేట’ అడవిలో అలజడి
● నాటు తుపాకులతో వన్యప్రాణుల వధకు వెళ్లిన వేటగాళ్లు ● తారసపడ్డ బేస్ క్యాంపు సిబ్బందిపై దాడి? ● పెనుగులాటలో నాటు తుపాకీ మిస్ఫైర్ ? అశ్వారావుపేట: తెలంగాణ, ఏపీ సరిహద్దు గుబ్బలమంగమ్మ ఆలయ అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తుపాకులతో సంచరిస్తున్న వేటగాళ్లు అలజడి సృష్టించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గుబ్బలమంగమ్మ గుడి సమీపంలో ఏపీకి చెందిన ఆరుగురు వ్యక్తులు నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు వచ్చారు. బేస్క్యాంపు సిబ్బంది గమనించడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మిస్ఫైర్ చోటుచేసుకుంది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. బేస్క్యాంపు సిబ్బందిపై వేటగాళ్లు తుపాకీతో దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా అటవీశాఖ సిబ్బంది ఒక తుపాకీ లాక్కోగా వేటగాళ్లు పరారయ్యారు. తెల్లవారుజాము కావడంతో ఎవరూ దొరకలేదు. బుధవారం ఉదయానికి మిస్ఫైర్ ఉదంతం అశ్వారావుపేట ప్రజలకు తెలిసింది. పరారైన వేటగాళ్లు ఏపీ సరిహద్దులోని గోపన్నగూడెం చేరుకున్నారు. పొద్దునే తుపాకులతో కొత్త వ్యక్తులు గ్రామంలో తిరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. కొద్ది రోజులుగా జిల్లా చర్ల సరిహద్దు ఉన్న పొరుగు రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తుపాకులతో వచ్చిన వారు పోలీసులా..? మావోయిస్టులా.? వేగటాళ్లా..? అనే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. మధ్యవర్తిని ఆశ్రయించి పట్టుబడ్డారు? బేస్క్యాంపు సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ కోసం వేటగాళ్లు ఆరుగురు గోపన్నగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించినట్లు సమాచారం. కొంత నగదు ఇస్తామని, తుపాకీ తెచ్చివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి మధ్యవర్తిత్వం వహిస్తూ బేస్క్యాంపు సిబ్బందిని సంప్రదించగా.. అటవీశాఖ సిబ్బంది అతన్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మధ్యవర్తి ఇరుక్కుపోవడంతో వేటగాళ్లు దొరికినట్లు తెలుస్తోంది. కాగా ఆరుగురు వేటగాళ్లలో ముగ్గురినే అరెస్ట్ చూపడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రేంజ్ అధికారి మురళిని వివరణ కోరగా.. ఇద్దరు వ్యక్తులు తుపాకులతో ఉండగా మరో వ్యక్తి మందుగుండు సామగ్రి, నీళ్లు మోస్తున్నాడని, మరో ముగ్గురు వ్యక్తులున్నా వారికి వేటకు సంబంధం లేదని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వేటతో సంబంధం లేని పొరుగు రాష్ట్రం వ్యక్తులు రాత్రి 2 గంటల సమయంలో వేటగాళ్లతో పాటు అటవీ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటవీశాఖకు చెందిన ఓ క్షేత్రస్థాయి అధికారి అనధికార అనుమతితోనే వేటగాళ్లు వేటకు వెళ్లారని, ఈ విషయం తెలియక బేస్ క్యాంప్ సిబ్బంది పట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బేస్క్యాంపు సిబ్బందిపై దాడి చేసినా ముగ్గురినే అరెస్ట్ చేసి, మరో ముగ్గురిని వదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్ చేశాం : ఎఫ్ఆర్వో నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని అశ్వారావుపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళి తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎఫ్ఆర్వో కథనం ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అశ్వారావుపేట రేంజ్ కావడిగుండ్ల సెక్షన్ కంట్లం బీట్ పరిధిలోని అడవిలో కంట్లం బేస్ క్యాంపు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు రెండు నాటు తుపాకులతో తారసపడగా అదుపులోకి తీసుకుని అశ్వారావుపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన వారిని విచారించగా ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన కారం రవి, కామ మంగరాజు, వంజం నవీన్లుగా తేలింది. వన్యప్రాణుల వేటకు వచ్చినట్లు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. -
వైభవం.. జలవిహారం
● శ్రీ సీతారాముల వారికి గోదావరిలో తెప్పోత్సవం ● కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల వారు బుధవారం గోదావరిలో జలవిహారం చేయగా.. ఈ వేడుక అద్భుతంగా సాగింది. తొలుత స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా గోదావరి వద్దకు తీసుకొచ్చారు. అలంకరించిన పడవలో స్వామి వారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రమాదేవి గోదావరి మాతకు పసుపు, కుంకుమ సమర్పించాక స్వామి వారికి జలవిహారం గావించారు. రాత్రికి దొంగల దోపు ఉత్సవాన్ని కనులపండువగా జరిపారు. ఈ వేడుకలో ఆలయ సిబ్బంది వేషధారణలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి వారికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కాగా, తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఊంజల్ సేవ జరపనున్నారు. -
పచ్చి, పుచ్చు గెలలు..!
● పామాయిల్ ఫ్యాక్టరీకి తీసుకొస్తున్న రైతులు ● నాణ్యత లేక నూనె దిగుబడిపై ప్రభావం ● పట్టించుకోని ఉద్యోగులు, అధికారులుఅశ్వారావుపేట: వేసవి కాలంలో పామాయిల్ గెలల దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ధర ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం టన్ను ధర రూ.21 వేలుగా ఉంది. అయితే పలువురు రైతులు పచ్చి, పుచ్చులు ఉన్న గెలలను ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. అధికారులు, సిబ్బంది మాత్రం గెలల నాణ్యతను పరిశీలించకుండానే అన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో గెలల నుంచి రికవరీ అయ్యే నూనె శాతం తగ్గి.. మంచి గెలలు తెచ్చిన రైతులు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఏడాది మొత్తం రైతుల శ్రమ ఈ మూడు నెలల్లో ఆవిరైపోయే ముప్పు పొంచి ఉంది. ఇదేం కొత్త కాదు.. ప్రస్తుతం అన్ సీజన్ కావడంతో దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీని నడపకుండా అశ్వారావుపేట ఫ్యాక్టరీని మాత్రమే నడుపుతున్నారు. దమ్మపేట మండలంలో సన్న, చిన్నకారు రైతులు టన్నులోపు గెలలను అప్పారావుపేట ఫ్యాక్టరీకి చేర్చితే అక్కడి నుంచి రోజుకోసారి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి ఆయిల్ఫెడ్ అంతర్గత రవాణా చేస్తోంది. ఇలా నిత్యం 30 నుంచి 40 టన్నుల గెలలు అప్పారావుపేట నుంచి అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తాయి. టన్నుకు మించి గెలలున్న రైతులు నేరుగా అశ్వారావుపేట ఫ్యాక్టరీకే తరలించాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 300 నుంచి 450 టన్నులు అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వస్తాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం గత సోమవారం అశ్వారావుపేట ఫ్యాక్టరీలో అన్లోడ్ చేస్తున్న మూడు ట్రాక్టర్లను పరిశీలించగా ఒక్కో ట్రాక్టర్కు పది వరకు పచ్చి గెలలు, పుచ్చు గెలలు ఉన్నాయి. ఇలా నిత్యం 10 నుంచి 20 శాతం పచ్చి, పుచ్చు గెలలు వస్తే రైతులకు గిట్టుబాటు ధర దక్కదు. గతంలో ట్రాక్టర్లలో గెలలు తరలించే క్రమంలో మధలో భారీ రాళ్లు పెట్టి కార్పొరేట్ రైతులు పంపేవారు. వీటిని కన్వేయర్ వద్ద తొలగించే వారు. ఆ తర్వాత సూపర్వైజర్లను ఏర్పాటు చేయడంతో రాళ్ల రవాణా తగ్గుముఖం పట్టింది. ఇక కొంతకాలంగా వేసవిలో పచ్చి, పుచ్చు గెలల రవాణా పరిపాటిగా మారింది. గెలలను నరికి లోడ్ చేసే ముఠాకు టన్నుల వారీగా చెల్లింపులు ఉంటాయి. యజమాని లేకుండా గెలలు నరికే క్షేత్రాల్లో పచ్చి, చచ్చు, పుచ్చు గెలలు లోడ్ చేసి పంపుతారు. ముఖ్యంగా అధిక ధర ఉన్నప్పుడు కౌలు రైతులు ఇలాంటి గెలలు తరలిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపులు.. తాయిలాలు గెలలు దిగుమతి చేసే సమయంలో కూలీలు పచ్చివాటిని గుర్తించి పక్కన పెడితే కొందరు రైతులు వారిని బెదిరిస్తున్నారని తెలుస్తోంది. దిగుమతి సమయంలో సూపర్వైజర్ ఉన్నా ఉపయోగం లేదు. ‘మేం తలుచుకుంటే మీ ఉద్యోగాలుండవు’ అంటూ కొందరు రైతులు బెదిరిస్తుండడంతో చిరుద్యోగులు ఏమీ చేయలేకపోతున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు నడుచుకుంటే నజరానాలు కూడా కురిపిస్తారు. గతంలో ఈ దందా సాయంత్రం వేళల్లో ఎవరూ చూడకుండా చేస్తే.. ఇప్పుడు మాత్రం పట్టపగలే సాగుతోంది. పచ్చి గెలల బాగోతం హమాలీ నుంచి మేనేజర్ దాకా తెలిసినా నోరు మెదపకపోవడం గమనార్హం. పచ్చి, పుచ్చు గెలలు వేస్తే.. పచ్చి, పుచ్చు గెలలు క్రషింగ్ చేస్తే వాటిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో సుమారు 30 శాతం వరకు నూనె ఉత్పత్తి తగ్గుముఖం పడుతుంది. ఏడాదిలో మూడు నెలల పాటు రికవరీపై దుష్ప్రభావం పడితే అది ఏడాది నూనె ధరపై ప్రభావం చూపుతుంది. ఆయిల్ఫెడ్కు క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో రైతులు, ముఠా ఇష్టారాజ్యంగా గెలలు నరుకుతున్నా నియంత్రణ లేదు. మిగిలిన పంటల వలె తేమ, పక్వం పరిశీలించే యంత్రాలను ఆయిల్ఫెడ్ వినియోగించకపోవడం ఈ దుస్థితికి మరో కారణం. పరిశీలించి వెనక్కి పంపుతున్నాం ఫ్యాక్టరీకి వచ్చే గెలలను పరిశీలించాకే అన్లోడ్ చేయాలని సిబ్బందికి చెబుతున్నాం. రైతులు, సిబ్బంది కుమ్మక్కయ్యారనే విషయం మా దృష్టికి రాలేదు. పచ్చి గెలలు, చచ్చు గెలలుంటే నిర్మొహమాటంగా వెనక్కు పంపుతున్నాం. పూర్తిగా పక్వానికి వచ్చాకే గెలలను ఫ్యాక్టరీకి తీసుకురావాలని రైతులను కోరుతున్నాం. – నాగబాబు, ప్లాంట్ మేనేజర్, అశ్వారావుపేట -
భద్రాద్రి బిడ్డ వాదనా పటిమ
● దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ తరఫున వాదించిన విష్ణువర్ధన్రెడ్డి ● నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష విధించిన హైకోర్టు ● ఎన్ఐఏ పీపీగా రాణిస్తున్న రెడ్డిపాలెం లాయర్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు తెలంగాణ హైకోర్టు మంగళవారం మరణ శిక్ష విధించింది. ఈ కేసులో ఎన్ఐఏ తరఫున వాదించింది జిల్లా న్యాయవాది పత్తి విష్ణువర్ధన్రెడ్డి కావడం విశేషం. దిల్సుఖ్నగర్లో ప్రసిద్ధి చెందిన సాయిబాబా గుడికి వచ్చే భక్తులే లక్ష్యంగా 2013 డిసెంబర్ 21న బాంబు పేల్చగా 18మంది మృతి చెందారు. ఇదే ఘటనలో మరో 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులకు మరణశిక్ష ఖరారు చేసింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. తొమ్మిదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతుండగా, 18 కుటుంబాల ఆవేదనకు కారణమైన నిందితులకు ఏ శిక్ష పడుతుందనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. కాగా, ఈ కేసులో నిందితులు తప్పించుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కోర్టు ముందు బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పి.విష్ణువర్ధన్రెడ్డి సమర్థమైన వాదనలు వినిపించారు. దీంతో దిల్సుఖ్నగర్ జంట బాంబుపేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. రెడ్డిపాలెం టు హైకోర్టు విష్ణువర్ధన్రెడ్డి స్వస్థలం బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం కాగా, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివారు. ఆ తర్వాత జక్కం పెద్ద బుచ్చయ్య మెమోరియల్ విద్యాసంస్థలో, ఆపై ఏలూరులోని సీఆర్.రెడ్డి కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం చదివారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలోకి వచ్చిన విష్ణువర్ధన్రెడ్డి ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2000 నుంచి వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కేవలం 35 ఏళ్ల వయసులోనే 2010లో ఎంపికయ్యారు. ఆ తర్వాత 2014లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా నియమితులయ్యారు. దేశరక్షణకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వం తరఫున ప్రతిభావంతంగా వాదనలు వినిపిస్తూ దోషులకు శిక్ష పడేలా చూశారు. మృతుల్లో భద్రాద్రి వాసి.. 2013 డిసెంబర్ 21న దిల్సుఖ్నగర్లో జరిగిన బాంబుదాడిలో మృతి చెందిన వారిలో భద్రాద్రి జిల్లా యువకుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనలో కొత్తగూడెం పట్టణానికి చెందిన అజాజ్ అహ్మద్(18) ప్రాణాలు కోల్పోగా, అప్పుడు ఆయన పాలిటెక్నిక్ చదువుతున్నాడు.కీలక కేసుల్లో వాదనలు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి తొలుత ఎన్ఐఏ కోర్టులో, ఆ తర్వాత హైకోర్టులో వాదనలు వినిపించిన విష్ణువర్ధన్రెడ్డి ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష పడేలా చేశారు. అంతకు ముందు ఎన్ఐఏ తరఫున గోకుల్ చాట్, లుంబిని పార్క్ బాంబు పేలుళ్ల ఘటనలోనూ ఆయన ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు పూరి జగన్నాథ్, చార్మిపై నమోదు కాగా, ఆ కేసులోనూ ప్రభుత్వం తరఫున వాదించారు. 2019లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎన్నికై న విష్ణువర్ధన్రెడ్డి, తెలంగాణ నుంచి 47 వేల మంది లాయర్లకు ఇండియా బార్ కౌన్సిల్లో ప్రతినిధిగా ఉన్నారు. నల్సార్ వర్సిటీకి ఎగ్జిక్యూటివ్ అకడమిక్ కౌన్సిల్ మెంబర్గా 2019 నుంచి, నేషనల్ లా యూనివర్సిటీ, బెంగళూరులోని అకడమిక్ కౌన్సిల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాగా, విష్ణువర్ధర్రెడ్డి తండ్రి పత్తి నర్సిరెడ్డి అప్పట్లోనే బీకాం పూర్తి చేసి ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్లో కాంట్రాక్టర్గా వ్యవహరించారు. -
వైభవంగా మహదాశీర్వచనం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు వేద పండితులు మహదాశీర్వచనం అందజేసే కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురాగ్యోలు ప్రసాదించాలని కోరుతూ ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామివారికి మహదాశీర్వచనం అందజేయడం అనాధిగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ ఎల్.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. చాతకొండ బెటాలియన్ అభివృద్ధికి రూ.20 లక్షలు ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్లో అభివృద్ధి పనుల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్రెడ్డి, ఆర్ఐ జీ.వీ.రామారావుకు మంగళవారం ఖమ్మంలో అందజేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తే బెటాలియన్లో సెల్యూటింగ్ డయాస్, గ్యాలరీ నిర్మాణ పనులు చేపడతామని వారు వెల్లడించగా, ఎంపీ రూ.20లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపీకి కమాండెంట్ కృతజ్ఞతలు తెలిపారు. రేపు జాబ్మేళాసింగరేణి(కొత్తగూడెం): పాల్వంచ డిగ్రీ కళాశాలలో గురువారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పాన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేపీఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో 25 ఖాళీలు, ముత్తూట్ మైక్రోఫైనాన్స్ కొత్తగూడెం బ్రాంచ్లో 20 ఖాళీల భర్తీకి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం సింగరేణి సీఎంఓ కిరణ్ రాజ్కుమార్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిరక్షణే సంస్థ ధ్యేయమని సీఎంఓ కిరణ్ రాజ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంస్థ నిబంధనల మేరకు కార్పొరేట్ మెడికల్ బోర్డును పారదర్శకంగా నిర్వహిస్తామని, దళారీ వ్యవస్థను అరికడతామని తెలిపారు. కార్మికులకు ఏదైనా జబ్బు చేస్తే సకాలంలో సరైన మందులు అందించేలా ఏడు ఏరియాల్లోని 21 డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సింగరేణి ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామని అన్నారు. రామగుండం రీజియన్ ఆస్పత్రిలో కార్డియో క్యాత్లాబ్ ఏర్పాటు చేసి గోల్డెన్ హవర్ సేవలు అందించేందుకు రూ.13 కోట్లతో పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల్లో గర్భిణుల డెలివరీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, తప్పని పరిస్థితుల్లోనే ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. -
పేదలకు పక్కా ఇళ్లే లక్ష్యం
● లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవచ్చు ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి ● కోయగూడెంలో ఎమ్మెల్యే, పీఓతో కలిసి శంకుస్థాపనటేకులపల్లి: పేదలంతా పక్కా ఇళ్లల్లో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తమకు నచ్చినట్టుగానే నిర్మించుకోవచ్చని చెప్పారు. మండలంలోని కోయగూడెంలో మంజూరైన 303 ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ బి.రాహుల్తో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే పట్టుదలతో రూ.15.15 కోట్లతో 303 ఇళ్లు మంజూరు చేశామన్నారు. మొత్తం నాలుగు విడతల్లో రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన, సహజ సిద్ధమైన ఇటుకలు, మెటీరియల్ వినియోగించాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయబోదని స్పష్టం చేశారు. సన్న బియ్యంతో లంచ్.. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న నేపథ్యంలో మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి సురేష్ – శశికళ దంపతుల ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే, పీఓ తదితరులు మధ్యాహ్న భోజనం చేశారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు తమ ఇంటికి రావడంతో సురేష్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో హౌసింగ్ పీడీ శంకర్, ఏఈ డేవిడ్, ఏటీడీఓ రాధ, సివిల్ సప్లై డీటీ పాషా, డీఎస్పీ చంద్రభాను, తహసీల్దార్ నాగభవానీ, ఎంపీడీఓ రవీంద్రరావు, మాజీ సర్పంచ్ కోరం ఉమ, కోరం సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుదుత్పత్తి చేయాలి
● జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా ● పాల్వంచ పర్యటనలో ఆద్యంతం ఆంక్షలుమణుగూరు రూరల్/పాల్వంచ: బీటీపీఎస్, కేటీపీఎస్ల నుంచి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని టీజీ జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన మణుగూరు బీటీపీఎస్, పాల్వంచలోని కేటీపీఎస్ ప్లాంట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను విద్యుత్ కోతల నుంచి విముక్తి చేసేందుకు, విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పలు పవర్ ప్రాజెక్టులు నిర్మిస్తూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు చేపడుతోందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసేంతగా తెలంగాణ ఎదిగిందని తెలిపారు. కేటీపీఎస్ కాంప్లెక్స్లో జెన్కో ట్రైనింగ్ సెంటర్ను సందర్శించి శిక్షణ పొందుతున్న ఇంజనీర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. శిక్షణతో సాంకేతిక పరిజ్ఞానం ఎంత మేర కలిగిందనే అంశంపై ఆరా తీశారు. ఆ తర్వాత కలెక్టర్ జితీష్ వి.పాటిల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. బీటీపీఎస్ రైల్వే లైన్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని జరుగుతున్న ఆందోళన, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కలెక్టర్తో చర్చించినట్లు సమాచారం. ఆంక్షలతో పలువురి అసహనం.. సీఎండీ పర్యటనలో ఆద్యంతం ఆంక్షలు విధించడంతో పలు కార్మిక, ఇంజనీరింగ్ ఉద్యోగ సంఘాల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీఎండీ తొలుత గెస్ట్హౌస్కు చేరుకోగా కవరేజ్ కోసం వెళ్లిన మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. ఎంతో కాలంగా విద్యుత్ సంస్థల్లో నెలకొన్న సమస్యలపై సీఎండీని కలిసేందుకు ప్రయత్నించిన సంఘాల వారిని సైతం లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఎండీ పర్యటన గతానికి భిన్నంగా సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయా కార్యక్రమాల్లో జెన్కో డైరెక్టర్లు అజయ్కుమార్, సచ్చిదానందం, బి.లక్ష్మయ్య, కేటీపీఎస్చ బీటీపీఎస్ సీఈలు రత్నాకర్, పి.శ్రీనివాసబాబు, ప్రభాకర్ రావు, బి.బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 20వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగే పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు 720 మంది ఉండగా మూడు పరీక్ష కేంద్రాలు, 826 మంది ఇంటర్ విద్యార్థులకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘యువిక’కు దమ్మపేట గురుకులం విద్యార్థి దమ్మపేట/నేలకొండపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తున్న యువ విజ్ఞాని కార్యక్రమ్(యువిక)కు నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లికి చెందిన విద్యార్థి బారి ఉదయ్ ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన బారి వెంకన్న–సునీత దంపతుల కుమారుడు ఉదయ్ దమ్మపేటలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆసక్తి పెంచేందుకు ‘యువిక’ కార్యక్రమం నిర్వహిస్తుండగా 15రోజుల శిక్షణకు ఆయన ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఉదయ్ను జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఎం.ధనలక్ష్మి, గ్రామస్తులుపోలంపల్లి నాగేశ్వరరావు, మరికంటి ఉమ తదితరులు అభినందించారు. ఆఫ్టైప్ మొక్కలకు నష్టపరిహారం ఇవ్వాలి అశ్వారావుపేటరూరల్: ఆఫ్టైప్ మొక్కలతో తీవ్రంగా నష్టపోయిన పామాయిల్ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ఆయిల్పాం రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్ చేశారు. మండలంలోని నారంవారిగూడెంలోని ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా చేయగా.. ఆయన మాట్లాడారు. ఆయిల్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు అందించిన ఆఫ్టైప్ మొక్కలతో తీరని నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను గుర్తించి తక్షణమే నష్ట పరిహారం అందించాలని కోరారు. అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల పరిధిలో ఆయిల్ రిఫైనరీ యూనిట్, ఐఐఓపీఆర్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయిల్ఫెడ్ డివిజనల్ అధికారి నాయుడు రాధాకృష్ణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యలమంచిలి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, రైతులు తుంబూరు మహేశ్వరరెడ్డి, తలసీల ప్రసాద్, కారం శ్రీరాములు, ఆళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నేడు వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్ ఖమ్మంవ్యవసాయం: పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించేందుకు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జోన్–1 నుంచి జోన్–7 వరకు 373 మంది వెటర్నరీ అసిస్టెంట్ల(పశువైద్య సహాయకులు)లో అర్హులకు లైవ్ స్టాక్ అసిస్టెంట్లు(పశుసంపద సహాయకులు)గా పదోన్నతి కల్పిస్తారు. జోన్–4లోకి వచ్చే హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి 46 మంది అర్హత సాధించగా, బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌన్సెలింగ్లో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె.వెంకటనారాయణతో పాటు మరో అసిస్టెంట్ డైరెక్టర్, కార్యాలయ మేనేజర్ పాల్గొని, రోస్టర్ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తారు. బొలేరో వాహనం బోల్తా చర్ల: మండలంలోని దండుపేటలో మంగళవారం రాత్రి మిర్చి లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడింది. చర్లకు చెందిన టీఎస్28 టీఏ 1573 నంబర్ గల బొలేరో వాహనం కొత్తపల్లి నుంచి మిర్చి లోడుతో గుంటూరుకు బయలుదేరింది. దండుపేట మూలమలుపు వద్ద అదుపుతప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. -
అమ్మా.. ఇక నువ్వు లేవవా?
మృతి చెందిన ఆవు వద్ద లేగదూడ నరకయాతన అశ్వాపురం: అశ్వాపురం మండలం రామచంద్రాపురం జీపీ శివలింగాపురం పల్లె ప్రకృతి వనం సమీపాన వేటగాళ్ల అమర్చిన ఉచ్చులో చిక్కుకుని ఆవు మృతి చెందింది. మల్లెలమడుగు జీపీ వలస ఆదివాసీ గుంపునకు చెందిన సోడె లక్ష్మయ్య ఆవు నాలుగు రోజులుగా కానరాకపోగా, మంగళవారం శివలింగాపురంలో చనిపోయి కనిపించింది. అయితే, నాలుగు రోజులుగా తల్లి కనిపించక 20రోజుల వయస్సు కలిగిన లేగదూడ తల్లడిల్లుతోంది. ఇంతలోనే ఆవు మృతి చెందిందనే సమాచారంతో రైతు కుటుంబం వెళ్తుండగా వారితో పాటు వచ్చిన లేగ దూడ తల్లిని తట్టి లేపేందుకు, పాలు తాగేందుకు యత్నించడం అందరినీ కలిచివేసింది. -
చేతబడి నెపంతో వ్యక్తి హత్య
దుమ్ముగూడెం: మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా చేతబడులంటూ కొందరు హత్యలు చేస్తున్నారు. జడ్.వీరభద్రాపురం గ్రామానికి చెందిన కొమరం రాముడు(53)ను చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఉరి వేసి చంపి, గోనె బస్తాలో కుక్కి, చెరువులో పడేసిన అమానవీయ ఘటనకు సంబంధించి సీఐ అశోక్ మంగళవారం వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కొమరం రాముడు గత మార్చి 11వ తేదీన గ్రామంలో జరిగిన వివాహానికి భార్యతో కలిసి వచ్చాడు. అనంతరం భార్య ఇంటికి వెళ్లగా రాముడు రాకపోవడంతో ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో మార్చి 16న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కొమరం వెంకటేశ్, మణుగూరు మండలం చిన్నరావిగూడెంవాసి పద్దం బాలరాజు మంగళవారం తామే హత్య చేశామని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కాగా, రెండు నెలల కిందట వెంకటేశ్ తమ్ముడు కొమరం రాంబాబు చర్ల వెళ్తుండగా.. కొమరం రాముడు ఎట్టు వెళ్తున్నావని ప్రశ్నించాడని, చర్ల వెళ్తున్నానని చెప్పడంతో ‘నువ్వు చచ్చిపోతావ్’ అని అన్నాడని వెంకటేశ్ పోలీసులకు తెలిపాడు. చర్ల నుంచి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో రాంబాబు మృతి చెందాడని, కొన్నేళ్ల కిందట తన తండ్రి మృతి చెందాడని, తన భార్య సైతం పక్షవాతానికి గురైందని, దీనికంతటికీ కారణం కొమరం రాముడు చేతబడి చేశాడని చెప్పాడు. దీంతోనే తన బావమరిది పద్దం బాలరాజుతో కలిసి, రాముడుకు మద్యం తాగించి ఉరివేసి చంపి, గోనె బస్తాలో మూటగట్టి చెరువులో పడేశామని విచారణలో అంగీకరించాడు. కాగా, మంగళవారం గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి గజఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించామని సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని చెరువులో పడేసిన వైనం -
అకాల వర్షం.. ఆగమాగం..
ఇల్లెందురూరల్/అశ్వారావుపేటరూరల్/గుండాల/పాల్వంచరూరల్/టేకులపల్లి: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులతో చేతికందే దశలో ఉన్న పంటల నేలరాలాయి. ప్రధానంగా ఇల్లెందు, అశ్వారావుపేట, గుండాల, ఆళ్లపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, పాల్వంచ, టేకులపల్లి తదితర మండలాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట గింజదశక చేరకోగా భారీ వర్షాలతో పంట నీటమునిగింది. మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న 50 శాతానికి పైగా కోయగా, మిగిలిన పంట గాలిదుమారంతో నేలవాలింది. కోసిన మొక్కజొన్నలు సైతం కల్లాల్లో ఆరబెట్టగా వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షంతో కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న గింజలు మొలకలు వస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలో ఈ మూడింటితో పాటు వేరుశనగ, ముగన, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. గుండాల మండలంలో పంటలతో పాటు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడి రవాణాకు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడి అనేక గ్రామాల్లో సరఫరాకు అంతరాయం వాటిల్లింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు, బాధితులు వేడుకుంటున్నారు. అయితే మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మాత్రం జిల్లాలో వరికి పెద్దగా ముప్పు వాటిల్లలేదని, మొక్కజొన్న పంటకు మాత్రం కొంతమేర నష్టం జరిగిందని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 7,562 ఎకరాల్లో మామిడి సాగు కాగా, అందులో 20 శాతం మేర నేలరాలినట్టు అంచనా వేస్తున్నారు. టేకులపల్లి: మండలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల కారణంగా మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. గంగారం, సంపత్నగర్, చింతోనిచెలక, బోడు గ్రామాల్లో మామిడి కాయలు రాలిపడ్డాయి. -
ఫుడ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..
కొత్తగూడెంఅర్బన్: ఆహార సంబంధిత వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ఫోస్టాక్ ఫుడ్ సేఫ్టీ శిక్షణ సర్టిఫికెట్ తప్పనిసరిగా పొంది ఉండాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, ఫోస్టాక్ ట్రైనర్ ప్రవీణ్ తెలిపారు. పాన్ ఇండియా ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ భాగస్వామి, జాతీయ ఆహార భద్రత సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న, ఆమోదించిన ఫోస్టాక్ శిక్షణ, సర్టిఫికెట్ కార్యక్రమం మంగళవారం డీఎంహెచ్ఓ సమావేశపు హాల్లో నిర్వహించగా.. వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, కల్తీని గుర్తించాలని తెలిపారు. ఎవరైనా ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తినుబండారాలకు సంబంధించి దుకాణాదారులు, వ్యాపారులంతా ఫుడ్ లైసెన్స్తో పాటు ఫోస్టాక్ ట్రైనింగ్ సర్టిఫికెట్ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేవీజీవీఎం సౌత్ ఇండియా ఇన్చార్జ్లు టి.సింధు, ఇ.మోహన్బాబు, కొత్తగూడెం జిల్లా టీం హెడ్ శివకల్పన, జిల్లా ఎగ్జిక్యూటివ్లు సోహెల్, యాకూబ్, శేఖర్, షఫీ, సమీర్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే..
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంలో రెండు రోజుల పాటు పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలిగింది. దీంతో దేవస్థానం చుట్టూ ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. అపరిశుభ్రత తాండవిస్తోంది. క్యూలైన్లు, పురవీధుల్లో చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉంది. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు దుర్గంధం భరించలేకపోతున్నారు. భక్తులకు అందజేసేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ప్యాకెట్ల బస్తాలను అలాగే వదిలేయడంతో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీధుల్లో చెత్త వేయడానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డ్రమ్ములను తరలించకపోవడంతో అందులో నుంచి దుర్వాసన వెదజల్లుతోంది. కరకట్టపైన, చెట్ల కింద చెత్త అలాగే పేరుకుపోయింది. -
ఫిల్టర్బెడ్లో ఇసుక మార్పిడి
ఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లో నీటిని శుద్ధి చేసే ఇసుకను మారుస్తున్నారు. పదిహేను రోజులుగా పనులు నిర్వహిస్తున్నారు. 2010లో ఫిల్టర్ బెడ్ నిర్మించి, అధునాతన గ్రావిట్ ర్యాపిడ్ ఫిల్టరేషన్ పద్ధతిలో తాగునీరు శుద్ధి చేస్తున్నారు. ఇల్లెందులపాడు తాగునీటి చెరువు నుంచి నీటిని తరలించి, ఇక్కడ శుద్ధి అనంతరం పట్టణంలోకి వదులుతున్నారు. అయితే ఫిల్టర్బెడ్లో నీటి శుద్ధి ప్రక్రియలో ఇసుకను నాలుగైదేళ్లకోసారి మార్చాల్సి ఉండగా, ప్రారంభం నుంచి ఇప్పటివరకు మార్చలేదు. ఎట్టకేలకు గత పాలకవర్గం రూ. 25 లక్షలు కేటాయించి ఇసుక మార్పిడి పనులు చేపట్టింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ గత 15 రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇందుకోసం చీరాలలోని సముద్ర తీరం నుంచి ఇసుక, గులకరాళ్లు తెప్పించారు. ఫిల్టర్బెడ్లో గులక రాళ్లు, ఇసుక పొరలు పొరలుగా అమర్చుతున్నారు. పొరలపై రా వాటర్ వదిలితే ఇసుక, రాళ్లు నీటిలోని మలినాలు, మడ్డిని ఫిల్టర్ చేస్తాయి. అనంతరం నీరు పైపుల నుంచి సంప్లో చేరాక, ప్రజలకు సరఫరా చేస్తారు. పేరుకుపోయిన మలినాలను నెలకోసారి తొలగిస్తారు. ఇక్కడ రెండు బెడ్లు ఉండగా, ఒకదానిలో మరమ్మతులు చేపడుతున్నారు. మరో బెడ్ నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఇసుక తొలగింపు ఫిల్టర్బెడ్ మీడియా చేంజ్ పనులు మరో 15 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ‘రా’వాటర్ ఫిల్టరైజేషన్ను ఢోకా ఉండదు. కాగా పట్టణంలోని మూడొంతుల జనాభాకు ఈ ఫిల్టర్బెడ్ నుంచే తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇల్లెందులో రూ.25 లక్షలతో సాగుతున్న పనులు సముద్ర తీరం నుంచి సేకరించిన గులక రాళ్ల వినియోగం తాగునీటి శుద్ధి వ్యవస్థ మెరుగయ్యేలా మరమ్మతు పనులు వేగంగా చేపట్టాలి పట్టణ ప్రజలకు నీరందించే ఫిల్టర్ బెడ్లో ఇసుక మార్పిడి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి. వేసవి కాలం కావడంతో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి. నాణ్యతలో రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పట్టణవాసులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి. – కొడారి రాజేందర్, ఇల్లెందు మరో 15 రోజుల్లో పూర్తి.. మున్సిపల్ ఫిల్టర్బెడ్లో ఇసుక మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇక్కడ రెండు బెడ్లు ఉండగా, ఒక బెడ్లో నీటిని నిలిపి వేసి, మరో బెడ్లో ఇసుక, రాయి లేయర్ల వారీగా వేస్తున్నాం. ఈ ప్రక్రియ మరో 15 రోజులో పూర్తి అవుతుంది. నీటి శుద్ధికి ఢోకా ఉండదు. –సీహెచ్ శ్రీకాంత్, కమిషనర్, ఇల్లెందు -
గవర్నర్కు ఘనస్వాగతం
బూర్గంపాడు: భద్రాచలం శ్రీరామ పట్టాభిషేకానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సారపాకలో ఘనస్వాగతం లభించింది. సారపాకలోని ఐటీసీ అనుబంధ భద్రాచలం పబ్లిక్స్కూల్ ఆవరణలోని హెలీప్యాడ్కు చేరుకున్న గవర్నర్కు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకున్న గవర్నర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపు గెస్ట్హౌస్లో విశ్రాంతి తీసుకున్న అనంతరం భద్రాచలం రామాలయానికి వెళ్లారు. శ్రీరామ పట్టాభిషేకం అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్కు తిరిగి వచ్చిన అనంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత హెలీప్యాడ్కు చేరుకుని హైదరాబాద్ వెళ్లారు. రెడ్ క్రాస్ సేవలు విస్తృతపరచాలి రెడ్ క్రాస్ సేవలు మరింతగా విస్తృతపరచాలని రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్ వర్మ సూచించారు. ఐటీసీ గెస్ట్హౌస్లో సోమవారం గవర్నర్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం శాఖ ప్రతినిధులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా భద్రాచలం రెడ్క్రాస్ సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం గవర్నర్ పలు సూచనలు చేశారు. రెడ్క్రాస్ సొసైటీ బాధ్యులు ఎస్ఎల్ కాంతారావు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, రాజారెడ్డి, గాలిబ్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటన సాగిందిలా... భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సోమవారం గవర్నర్ పర్యటన 3: 31 గంటల పాటు సాగింది. ఉదయం 10:59 గంటలకు సారపాక ఐటీసీలోని బీపీఎల్ స్కూల్ హెలీప్యాడ్లో దిగారు. అనంతరం ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుని, 11:28 గంటలకు అక్కడి నుంచి భద్రాచలానికి రోడ్డుమార్గాన బయల్దేరారు. 11:42 గంటలకు రామాలయం, లక్ష్మీతయారు అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకుని పట్టాభిషేకానికి హాజరయ్యారు. 12:55 గంటలకు మిథిలా స్టేడియం నుంచి బయల్దేరి ఐటీడీఏకు వెళ్లారు. అక్కడ గిరిజన మ్యూజియం ప్రారంభించి, 1:58 గంటలకు తిరిగి ఐటీసీ గెస్ట్హౌస్ చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం హెలీకాప్టర్లో హైదరాబాద్కు బయల్దేరి వెళ్లారు. -
మళ్లీ ట్రాఫిక్ పాట్లు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో సోమవారం వీవీఐపీల తాకిడి పెద్దగా లేకపోయినా స్థానికులు ట్రాఫిక్పాట్లు తప్పలేదు. శ్రీరాముడికి పట్టాభిషేకం జరపగా, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కోరం కనకయ్య కూడా పాల్గొన్నారు. వీరితోపాటు ముగ్గురు, నలుగురు వీఐపీలు మాత్రమే ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం ట్రాఫిక్ నిబంధనల పేరుతో ఆదివారం రాత్రి చాలా సేపు వరకు బారికేడ్లు తొలగించకుండా స్థానికులను ఇబ్బందికి గురిచేశారు. సోమవారం ఉదయం గవర్నర్ భద్రాచలం వచ్చే 20 నిమిషాల ముందు నుంచే బ్రిడ్జి సెంటర్లో ట్రాఫిక్ నిలిపివేయగా భక్తులు, ద్విచక్రవాహనదారులు ఎండ వేడి కారణంగా అవస్థ పడ్డారు. మిథిలా స్టేడియంలో పట్టాభిషేకం కార్యక్రమాన్ని గవర్నర్ ముగించుకుని ఐటీడీఏలో గిరిజన మ్యూజియాన్ని ప్రారంభించేందుకు బయలుదేరిన సమయంలో కూడా బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ రోడ్డు వరకు అన్ని వాహనాలను ఆపేశారు. అనంతరం ఐటీడీఏలో కార్యక్రమాలను ముగించుకుని గవర్నర్ సారపాకకు తిరిగి వెళ్తున్న క్రమంలో మరోసారి ఐటీడీఏ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ఉన్న కాలనీల వీధుల్లోని వాహనాలను మెయిన్ రోడ్డు మీదకు రాకుండా దాదాపు 20 నిమిషాల వరకు నిలిపివేశారు. భద్రాచలంలో 6,7 తేదీల్లో జరిగిన శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాలలో పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో పాటు, భక్తులు, స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు. వాహనాలు నిలిపివేయడంతో స్థానికుల అవస్థ -
ట్రాన్స్జెండర్లను గౌరవంగా చూడాలి
కొత్తగూడెంటౌన్: ట్రాన్స్జెండర్లను, సెక్స్ వర్కర్లను అందరూ గౌరవించాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. సోమవారం కొత్తగూడెంలోని భవిత సెంటర్లో ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. న్యాయమూర్తి బియ్యం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ నెల ఉచితంగా బియ్యం ఇస్తామని, పంపిణీ కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలని సెక్యూర్ ఎన్జీఓ ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్ను ఆదేశించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్రావు, సెక్యూర్ ఏన్జీఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలివీసీలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి హన్మకొండ: ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి సూచించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం ఆయన 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరాను పరిశీలిస్తూ అంతరాయం ఎదురైతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడినా, ట్రిపింగ్, బ్రేక్డౌన్లు వచ్చినా త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, పంట కోతలు జరుగుతున్నందున పెండింగ్లో ఉన్న వ్యవసాయ సర్వీసుల మంజూరులో వేగం పెంచాలని, అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సీఎండీ ఆదేశించారు. విజేతలకు బహుమతుల ప్రదానంకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో సోమవారం జరిగిన జిల్లాస్థాయి మ్యాక్స్ అండ్ సైన్స్ క్విజ్ కార్యక్రమం ముగింపు ఉత్సవానికి డీఈఓ వెంకటేశ్వరాచారి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్టీయ్ర ఆవిష్కార అభియాన్ కార్యక్రమంలో భాగంగా 8, 9తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయిలో మ్యాథ్స్, సైన్స్ క్విట్ పోటీలు నిర్వహించారు. 9వ తరగతి విభాగంలో సీహెచ్.రేణుక, లక్ష్మీమణి, ఎస్.సుబ్రహ్మణ్యం, ఎం.భరత్ చంద్ర, 8వ తరగతి విభాగంలో బి. జాహ్నవి, కే.భవ్య శ్రీ, ఎన్.గీతిక బహుమతులు గెలుచుకున్నారు. డీఈఓ బహుమతులు అందించి మాట్లాడారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు హాజరుకాగా, కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఏ.నాగరాజశేఖర్, ఎస్కే సైదులు, ఎన్.సతీష్ కుమార్ పాల్గొన్నారు. నవమితో ఆర్టీసీకి ఆదాయం భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఈ నెల 6,7 వ తేదీల్లో జరిగిన శ్రీ రామనవమి, పట్టాభిషేకం సందర్భంగా ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో భద్రాచలం డిపోకు సుమారు రూ.9.5 లక్షల ఆదాయం పెరిగింది. సాధారణంగా భద్రాచలం డిపో పరిధిలో రోజూ 92 సర్వీసులు నడుపుతుండగా, రూ. 23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా 5న అదనంగా మరో 26 సర్వీసులు తిప్పగా రూ.3 లక్షల మేర ఆదాయం పెరిగింది. 6న అదనంగా 30 సర్వీసులు నడపగా రూ. 4.50 లక్షలు, 7వ తేదీన అదనంగా 16 సర్వీసులు నడపగా రూ. 2 లక్షల వరకు ఆదాయం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిపై ఆత్యహత్య ఇల్లెందు: ఇల్లెందు మండలం ధనియాలపాడు సమీపాన జామాయిల్ తోటలో ఓ వ్యక్తి ఆత్యహత్య పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలం చెన్నంగులగడ్డకు చెందిన డి.సురేష్(38) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబంలో గొడవలు జరుగుతుండగా, సోమవారం ధనియాలపాడు సమీపాన జామాయిల్ తోటలో ఉరి వేసుకున్నాడు. ఘటనపై ఆయన భార్య వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. -
వైభవంగా సాగిన శ్రీరామ పట్టాభిసేకం
● అయోధ్యపురిగా మారిన మిథిలా స్టేడియం ● రాజదండం, రాజముద్రిక, రాజ ఖడ్గాలకు పూజలు ● సిరియపాదుక శ్రీ ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు ● పట్టాభిషేకానికి హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మమంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పట్టాభిషేకానికి హాజరైన భక్తజనంరాజ లాంఛనాలతో పట్టాభిషేకం.. పట్టాభిషేక రాజ లాంఛనాల అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు మొదలైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. ఆ తర్వాత రాజముద్రిక తొడిగారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలు ఉంచి, ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింపజేశారు. స్వర్ణ ఛత్రం నీడలో రాజముద్రిక, రాజదండం, రాజఖడ్గం ధరించిన తర్వాత పట్టాభిషేకం కార్యక్రమాన్ని రుత్విక్కులు ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపి చివరగా మంగళహారతి సమర్పించారు. మండప్రతయ ఆరాధన.. రుత్విక్కరణం తర్వాత పండితులు మండపత్రయ పూజలు ప్రారంభించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేయడం ఈ మండపత్రయ ఆరాధన ప్రధాన ఉద్దేశం. పట్టాభిషేకం వేదిక దిగువ భాగాన మూడు కలశాలను ఏర్పాటు చేశారు. మధ్య కలశంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. ప్రధానంగా తూర్పున పూరీ, దక్షిణాన ధనుష్కోటీ, పశ్చిమాన ద్వారకకు చెందిన సముద్ర జలాలు అవాహన చేయగా ఆగ్నేయం నుంచి గంగా, నైరుతి నుంచి కృష్ణా, వాయువ్యం నుంచి గోదావరి, ఈశాన్యం నుంచి కావేరీ నదీ జలాలను ఆవాహన చేశారు. నదీ, సముద్ర జలాలను ఆవాహన చేసిన కలశానికి కుడివైపున ఉన్న కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు రామపరివారాన్ని ఆవాహన చేశారు. ఇందులో తూర్పున హనుమ, పడమర లక్ష్మణ, ఉత్తరాన శతృఘ్నుడు, దక్షిణాన భరతుడు, ఆగ్నేయంలో అంగదుడు, వాయువ్యంలో సుగ్రీవుడు, ఈశాన్యంలో విభీషణుడు, నైరుతిలో జాంబవతుడిని ఆవాహన చేశారు. ఎడమవైపు కలశంలో అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. పట్టాభిషేకం చేసే రాజముద్రికలో లక్ష్మీదేవిని, రాజదండంలో విశ్వక్సేనుడిని, చామరలో వైనతేయుడు, గరుత్మంతుడు, ఖడ్గంలో నందకుడు, స్వర్ణఛత్రంలో అనంతుడు, పాదుకల్లో ఆదిశేషుడు, దేవేరులు ధరించే ఆభరణాల్లో భూదేవిని ఆవాహన చేశారు. మండపత్రయ ఆరాధాన ముగిసిన తర్వాత శ్రీరాముడికి అష్టోత్తర శతనామార్చన చేశారు. అనంతరం త్రిదండి దేవనాథ జీయర్స్వామి ఆనాటి శ్రీరాముడి పాలన విశిష్టతలను వివరించారు. ఆలయం నుంచి మిథిలా స్టేడియానికి.. పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని సీతాసమేత శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి భక్తుల కోలాహలం నడుమ ప్రధాన ఆలయం నుంచి ప్రత్యేక పల్లకీలో ఉదయం 10:17 గంటలకు మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అర్చకులు మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం చేసేందుకు వీలుగా పండితులు రుత్విక్కులైన వశిష్టుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమలో ఆవాహన చేసుకున్నారు. హనుమంతుని మెడలో ముత్యాల దండ.. రామయ్య పట్టాభిషేకం అనంతరం రామయ్యకు ముత్యాల దండ ధరింప చేశారు. ఇదే దండను సీతాదేవి మెడలోనూ ధరింపచేశారు. చివరకు అదే దండను ఆంజనేయుడి మెడలో వేశారు. దీంతో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ముగియగా.. పట్టాభిషేకం అనంతరం సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు తాతగుడి సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. రథస్థం రాఘవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే’ అని బ్రహ్మ పురాణం చెబుతోందని, రథోత్సవంలో శ్రీ రాముడిని సేవించిన వారికి ముక్తి లభిస్తుందని అర్చకులు వివరించారు. సిరియ తిరువుడి పట్టాభిషేకం.. వాల్మీకి రామయాణంలో పట్టాభిషేకానికి ముందు రోజు శ్రీరాముడు అయోధ్యను వదిలి వనవాసానికి వెళ్తారు. దీంతో ముందుగా శ్రీరాముడి పాదుకలకు పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత రామయణ క్రమంలో సుగ్రీవుడికి, విభీషణుడికీ పట్టాభిషేకాలు జరిగాయి. ఆ తర్వాతే శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అయితే విష్ణువుకు అన్ని అవతారాల్లోనూ గరుత్మంతుడు సేవలు అందించగా రామావతారంలో మాత్రం హనుమంతుడు సేవ చేశాడు. దీంతో గరుత్మంతుడిని పెరియ తిరువుడిగా, హనుమంతుడిని సిరియ తిరువుడిగా కొలుస్తారు. శ్రీరాముడి పాదుకలతో మొదలైన పట్టాభిషేక మహోత్సవం సిరియ తిరువుడైన హనుమంతుడి పట్టాభిషేకంతో ముగిసింది. పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్ పట్టువస్త్రాలు అందించడం ఆనవాయితీ. ఈ క్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఉదయం 10 గంటల సమయంలో హెలీకాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే అయోధ్యాపురికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఈదురు గాలులు.. వడగళ్లవాన
అశ్వారావుపేటరూరల్: జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. సోమవారం అశ్వారావుపేట మండలంలో అకాల వర్షం, గాలి దుమారం రావడంతో మామిడి, మొక్కజొన్న పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అశ్వారావుపేట, వినాయకపురం, మామిళ్లవారిగూడెం, ఆసుపాక, మల్లాయిగూడెం తదితర గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. రామన్నగూడెం, పండువారిగూడెం, అనంతారం, నారాయణపురం, గాండ్లగూడెం గ్రామాల్లో పొలాల్లో ఉన్న మొక్కజొన్న, వేరుశెనగ, నాటు పొగాకు వర్షం కారణంగా స్వల్పంగా తడిసినట్లు రైతులు తెలిపారు. వాగొడ్డుగూడెం–రామన్నగూడెం మార్గంలో పలు చోట్ల ప్రధాన రహదారిపై వృక్షాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విరిగిపడ్డ చెట్లుదమ్మపేట: మండలంలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీగా వర్షం పడింది. దుమ్ముతో కూడిన ఈదురు గాలులు బలంగా వీచాయి. అంకంపాలెం, పట్వారిగూడెం, బాలరాజుగూడెం, జగ్గారం, మొద్దులగూడెం, మల్కారం గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. తీవ్రమైన గాలుల ప్రభావానికి బాలరాజుగూడెం, అంకంపాలెం గ్రామాల శివారులో రోడ్డుపై చెట్లు పడిపోగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పార్కలగండి ఆశ్రమ పాఠశాలలో పెద్ద చెట్టు వేళ్లతో సహ పక్కకు ఒరిగిపోయింది. మామిడి, మొక్కజొన్న పంటలకు స్వల్పం నష్టం జరిగింది. కూలిన విద్యుత్ స్తంభాలు పాల్వంచరూరల్: మండలంలో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసింది. గాలివానకు ఉల్వ నూరు కొత్తూరు గ్రామాల మధ్య చెట్లు విరిగిపడ్డాయి. మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఏఈ రవీందర్ జగన్నాథపురం సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వర్షానికి వీధుల్లో వరద ప్రవహించింది. పంట పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం, మిర్చి రాశులు తడవకుండా పరదాలు కప్పుకుని రక్షించుకున్నారు. వర్షం రెండు రోజులపాటు ఉంటుందని వాతవరణశాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయంగుండాల: ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో గాలిదుమారం బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి బలమైన గాలులు వీయడంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు ఆటంకం కలిగింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మామిడి తోటలల్లో కాయలు రాలిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు లేచిపోయాయి. ఉరుములు, పిడుగులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇల్లెందు: ఇల్లెందులో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వర్షంతో 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ ఆఫీస్ వద్ద ఓ చెట్టు విరిగి కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో అంతరాయం ఏర్పడింది. -
ఆదివాసీ సంస్కృతి అందరికీ తెలియాలి
● గిరిజన మ్యూజియం ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ● గుడ్ జాబ్ అంటూ పీఓకు కితాబుభద్రాచలంటౌన్: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో ప్రాచుర్యం ఉందని, వాటి ప్రత్యేకతలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మ్యూజియంలో పొందుపర్చిన ప్రతీ వస్తువు విలువైనదని, వీటిని సేకరించడం గొప్ప విషయమని అన్నారు. పూర్వీకులు ఎలాంటి జీవనం గడిపారో ఈ వస్తువులను చూస్తే అర్థమవుతోందని అన్నారు. పూర్వపు గుర్తులతో పాటు ఆదివాసీ పల్లెలు గుర్తొచ్చేలా ఆహ్లాద వాతావరణం సృష్టించడం అభినందనీమన్నారు. గుడ్జాబ్ అంటూ కితాబు.. ఆదివాసీల అచార వ్యవహారాల వస్తువులను సేకరించి ఒకచోట చేర్చడం సామాన్యమైన విషయం కాద ని, ‘గుడ్ జాబ్’ అంటూ పీఓ రాహుల్ను గవర్నర్ అ భినందించారు. మ్యూజియాన్ని మరింతగా అధునికీకరించేలా కృషి చేసి పర్యాటకులు, సందర్శకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వంటలు బాగున్నాయి.. మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులోని స్టాళ్లను సందర్శించిన గవర్నర్.. ఆదివాసీ వంటకాల్లో బొద్ది కూర పచ్చడిని రుచి చూసి బాగుంది అన్నారు. ‘తెలుగు రాక రుచి చెప్పలేకపోతున్నా దీన్ని ఏమంటారు’ అని ఇంగ్లిష్లో అడిగారు. భాష రాక మాట్లాడలేక పోతున్నా.. ఏమీ ఎనుకోకండి అని ఆదివాసీ మహిళలతో అన్నారు. ఈసారి తెలుగు నేర్చుకుని వచ్చి అన్ని వంటల రుచులు చెబుతానని అనగా.. మహిళలు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు. వారు తయారు చేసి మూలికల అయిల్, ఇప్ప లడ్డూలతో పాటు పలు రకాల స్వీట్లు గవర్నర్కు ఇవ్వగా వాటికి డబ్బు చెల్లించారు. కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, పీఓ బి.రాహుల్, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. కోయ భాషలో పలకరించిన తుమ్మల మ్యూజియం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గవర్నర్కు స్వాగతం పలికేందుకు వచ్చిన విద్యార్థులతో కోయ భాషలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ‘నాటే చదవ మిన్నారే.. రోడ్డుకు మంచిక మిన్నాకే’ అంటూ కోయభాషలో యోగక్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి తుమ్మల కోయ భాషలో అనర్గళంగా మాట్లాడగా అందరూ ఆసక్తిగా విన్నారు. -
సమన్వయంతో సాఫీగా..
● భద్రాచలంలో ఘనంగా ముగిసిన శ్రీరామనవమి, పట్టాభిషేకం ● పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, సమీక్షించిన మంత్రులు పొంగులేటి, తుమ్మల భద్రాచలం: రామభక్తులంతా భక్తితో ఎదురుచూసిన శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనంగా జరిగాయి. పట్టాభిషేకం కార్యక్రమంతో ముఖ్య ఘట్టాలన్నీ పూర్తయ్యాయి. వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణోత్సవాలు గత నెల 30న మొదలుకాగా, ఈ నెల 6న శ్రీరామనవమి, సోమవారం పట్టాభిషేకం జరిగాయి. ఈ వేడుకలు చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు స్వయంగా ఈ వేడుకలకు హాజరై ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దీంతో వేడుకల నిర్వహణకు జిల్లా యంత్రాంగం నెల రోజుల నుంచి శ్రమిస్తోంది. ఎండ నుంచి ఉపశమనం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో భద్రాచలం ఒకటి. మార్చి నుంచే ఇక్కడ మండే ఎండలు మొదలవుతాయి. ఈసారి నవమి వేడుకలు ఏప్రిల్ 6న రావడంతో ఎండ, ఉక్కపోత నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు మిస్ట్ ఫాగ్ సిస్టమ్ను చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఓసారి భక్తులపై సన్నని చిరుజల్లులు కురవడంతో ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం లభించింది. తొమ్మిదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఈ వేడుకలకు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం వెబ్సైట్ను ఆధునీకరించడంతోపాటు మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చారు. తీరని సమస్యలు భద్రాచలం వచ్చే భక్తులకు తాగునీరు అందించేందుకు నవమి రోజు వాటర్బాటిళ్లు విరివిగా అందుబాటులో ఉంచారు. కానీ ఒకరోజు ముందే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం చేరుకున్నారు. ఇక్కడే వండుకుని నిద్ర చేసి కల్యాణ వేడుకలు చూడాలనుకునే భక్తులకు నీటి సమస్య, వసతి సమస్య వేధించింది. ప్రతీసారి అందుబాటులో ఉండే భారీ తాత్కాలిక షెడ్లు ‘ప్రసాద్’ పనులతో ఈసారి కనిపించలేదు. వీఐపీ తాకిడి పెరగడంతో ఉభయ దాతల టికెట్లకు కోత పడింది. కొద్ది మంది ఖర్చు చేసి ఈ టికెట్లు కొనుగోలు చేసినా వీఐపీ గ్యాలరీ, లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్ల వల్ల వారికి కల్యాణవేదిక సరిగా కనిపించలేదు. ఎప్పటిలాగే మిథిలా స్టేడియం గ్యాలరీల్లో కూర్చున్న భక్తులకు పందిళ్లే అడ్డుగా వచ్చాయి. ఎల్ఈడీ తెరలపై కల్యాణ వేడుకలు వీక్షిస్తూ సంతృప్తి చెందాల్సి వచ్చింది. కరకట్ట, గోదావరి తీర ప్రాంతాలతో పాటుగా పట్టణంలో ముఖ్యకూడల్లో ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఊహించని స్థాయిలో భక్తుల రాక పెరగగా.. తాత్కాలిక వసతి లేక కరకట్ట, గోదావరి ఒడ్డునే సేద తీరారు. సమష్టిగా కృషి.. నవమి వేడుకలను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధిలు సమష్టిగా పని చేశారు. మిథిలా స్టేడియంలో జరిగే పనులను మంత్రి పొంగులేటి స్వయంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఆ తర్వాత నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజులు అధికారులతో సమన్వయం చేసుకున్నారు. నీటి, ట్రాఫిక్ సమస్యలు తప్పితే వేడుకలు సాఫీగా జరిగాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
రోజుకు 8 గంటలు పనిచేయాలి
● యంత్రాల వినియోగం పెంచాలి ● 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు ● సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ వెల్లడి మణుగూరు టౌన్: ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే కార్మికులు రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాలని, యంత్రాల వినియోగాన్ని 22 గంటలకు పెంచాలని సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు ఏరియాలోని పీకేఓసీ, కొండాపురం భూగర్భగని, మణుగూరు ఓసీలను సందర్శించారు. ఓసీ–2లో నూతన సైట్ ఆఫీస్తో పాటు కేపీయూజీ మైన్ రెస్క్యూ స్టేషన్ను, ఓసీ–4 ప్రీ వెయిట్ ట్రక్ లోడింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యంత్ర సామర్థ్య వినియోగంలో పీకేఓసీ ఉత్తమ గని అవార్డు సాధించడం అభినందనీయమని, కార్మికులు, అధికారులు ఇదే ఒరవడి సాగించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని అధిగమించి 127 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం హర్షణీయమన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు, కోలిండియా నుంచి సింగరేణికి గట్టి పొటీ ఎదురవుతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాక్ల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్తో పాటు కొత్తగూడెం వీకే, ఇల్లెందులోని రొంపేడు ఓసీ, గోలేటి(బెల్లంపల్లి) ఓసీలను ప్రారంభించేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా 245.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, వీటిని 1000 మెగావాట్లకు పెంచాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ రంగాల వ్యాపార విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మణుగూరు పీవీ కాలనీ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్సీ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, గైనకాలజిస్ట్, పీడియాట్రీషియన్ను నియమిస్తామన్నారు. అంతకుముందు కార్మికులతో కలిసి క్యాంటీన్లో అల్పాహారం చేసి నాణ్యతపై ఆరా తీశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సత్యనారాయణ, ఎల్.వి.సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం దుర్గం రాంచందర్, జీఎంలు సురేశ్, శ్రీనివాసరెడ్డి, ఎస్ఓటు డైరెక్టర్ కేవీరావు, ఏజీఎం బొజ్జ రవి, అధికారులు లక్ష్మీపతిగౌడ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసాచారి, వెంకట్రావ్, రమేశ్, శ్రీనివాస్, అనురాధ, బాబుల్ రాజ్, యూనియన్ నాయకులు రాంగోపాల్, కృష్ణంరాజు, వెంకటరత్నం పాల్గొన్నారు. -
ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా యూసీఈ
● అప్గ్రేడ్ చేస్తూ జీఓ జారీ చేసిన ప్రభుత్వం ● కొత్తగూడేనికి ప్రత్యేక గుర్తింపు ● అందుబాటులోకి కొత్త కోర్సులుకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(యూఈసీ – కేయూ)ను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీఓ జారీ చేసింది. ఈ కళాశాల దాదాపు 400 ఎకరాల్లో విస్తరించి ఉండగా 300 ఎకరాల్లో యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రాష్ట్ర విద్యార్థులు ఇన్నాళ్లూ ఎర్త్ సైన్సెస్ కోర్సు చదవాలంటే సెంట్రల్ యూని వర్సిటీలకు వెళ్లాల్సి వచ్చేది. కొత్తగూడెంలోనే ఈ కోర్సులు అందుబాటులోకి రానుండడంతో విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లా వాతావరణం కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎండ, వాన, చలి అన్నీ ఎక్కువే. ఇక అలాంటివాటిపై అధ్యయనం చేసే అవకాశం విద్యార్థులకు దక్కనుంది. యూనివర్సిటీగా అప్గ్రేడ్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు సీఎంకు వినతులు ఇవ్వగా ఇప్పుడు ఆయన కృషి ఫలించినట్టయింది. సహజ వనరులు, మినరల్స్ ఉన్న కొత్తగూడెంలో యూనివర్సిటీ ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు లభించనుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాకు మంజూరు కావడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంబరాలు జరుపుకున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం సింగరేణి, వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు.. ఇంజనీరింగ్ కళాశాల విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ కానుండగా అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వేల సంఖ్యలో యువ శాస్త్రవేత్తలు ఇక్కడి నుంచే దేశ భవిష్యత్కు బాటలు వేసే అవకాశం ఉంటుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో అడ్మిషన్లతో జిల్లాకు జాతీయస్థాయిలో పేరు రానుంది. ఈ యూనివర్సిటీలో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్యా పెరగనుంది. కేయూ నుంచి విడిపోనుంది.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయడంతో ఈ కాలేజీ కేయూ నుంచి విడిపోనుంది. 1978లో స్కూల్ ఆఫ్ మైన్స్గా ఓయూ పరిధి నుంచి కొత్తగూడెంలో పీజీ సెంటర్ ఏర్పాటైంది. తొలినాళ్లలో బీఈ మైనింగ్తో పాటు ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులు ఉండగా, కేయూ ఏర్పాట య్యాక 1996లో ఆ పరిధిలోకి చేర్చి కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చారు. ఆ సమయాన ఈఈఈ, సీఎస్ఈ, 2010లో ఐటీ, ఈసీఈ కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చినా మధ్యలో ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు తొలగించా రు. ఇప్పుడు కేయూ నుంచి విడిపోతున్నందున బోధన, బోధనేతర పోస్టులే కాక కాలేజీ ఆస్తులన్నీ బదలాయిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో 41 అధ్యాపకుల పోస్టులకు గాను ప్రస్తుతం 16మంది రెగ్యులర్, మిగతా వారు కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. 106 నాన్టీచింగ్ పోస్టులకు 60 మంది పనిచేస్తున్నారు. వర్సిటీగా అప్గ్రేడ్ కాగా పోస్టులు పెరిగే అవకాశముంది. ఇక ఈ కాలేజీలో నియామకమైన అసోసియేట్ ప్రొఫెసర్లు బిక్షాలు, వెంకటరమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాధిక, సుమలత కేయూలో డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం వీరి డిప్యూటేషన్లు రద్దు చేస్తారా, ఆప్షన్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. -
అభివృద్ధికి కేంద్రం అవుతుంది
కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తుండడం హర్షణీయం.యూనివర్శిటీ ఏర్పాటుతో విద్యార్థులు జియాలాజీ, ఎలక్ట్రికల్, మైనింగ్, వాతావరణ శాఖ, అఫ్లైడ్ఫిజిక్స్, క్వాంటం ఫిజిక్స్ వంటి కోర్సుల్లో అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తో పాటు కొత్తగూడెం ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. – జగన్మోహన్రాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అందరికీ మేలు జరుగుతుంది ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీతో అందరికీ మేలు జరుగుతుంది. ఇంజనీరింగ్ తరువాత ఎర్త్ సైన్సెస్ కోర్సుల్లో చేరాలంటే రాష్ట్రాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ సీట్లు దొరుకుతాయో, లేదో తెలియదు. ఎందరికో సమయం, డబ్బు వృథా అయింది. కొత్తగూడెంలో యూనివర్సిటీ వస్తే విభిన్న కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. – వి.సృజన, ఈఈఈ విద్యార్థినిశాస్త్రవేత్తలుగా.. ఇంజనీరింగ్ కళాశాల అప్గ్రేడ్ కావడం సంతోషం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఏర్పాటయ్యే కొత్త కోర్సుల్లో చేరి విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. – నివేదిత, సీఎస్ఈ విద్యార్థిని● -
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జగదభిరాముడికి సోమవారం పట్టాభిషేక మహోత్సవం çవైభవోపేతంగా జరిగింది. సీతారాముల కల్యాణం మరుసటి రోజున పుష్యమి నక్షత్రం సందర్భంగా మిథిలా స్టేడియంలో రామయ్యకు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 10 గంటలకు శంఖ, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను పల్లకీ సేవగా బయటికి తెచ్చారు. మేళతాళాలు, కోలాటం, భజంత్రీలు, భక్తుల జయజయ ధ్వానాల నడుమ సింహాసనంపై కొలువుదీర్చారు. వైదిక మంత్రాలతో వశిష్టుడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజ్ఞుడును వేద పండితులు వరింప జేసుకున్నారు. సప్త సముద్రాలు, సకల నదుల జలాలు పట్టాభిషేకం జరిగే ప్రధాన మండపానికి ముందు మూడు ఉప మండపాల్లో మూడు కలశాలను ఏర్పాటు చేశారు. ఒక మండపంలో సముద్ర, నదీ జలాలను ఆవాహన చేశారు. మరో కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు రామ పరివారాన్ని ఆవాహన చేశారు. మరో కలశంలో అష్టదిక్పాలకులను, పట్టాభిషేకానికి ఉపయోగించే వస్తువులతోపాటు ఆది దేవతలను ఆవాహన చేస్తూ చతుర్వేద హవన పురస్కృతంగా మండపత్రయ ఆరాధన నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన చేశారు. అటు రాజదండం, ఇటు రాజఖడ్గం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్ర కిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవాహన చేసిన రాజముద్రికను కుడి చేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు.స్వర్ణఛత్రం నీడలో ఎడమ వైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడిని అలంకరించారు. తలపై సామ్రాట్ కిరీటంతో గరుత్మంతుడు, వైనేతుడులు అందించే చామరల సేవను ఆస్వాదిస్తూ భక్తులకు రామయ్య దర్శనం ఇచ్చారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తికి మంగళహారతి ఇచ్చారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు.పట్టువ్రస్తాలు సమర్పించిన గవర్నర్ పట్టాభిషేక వేడుకకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయానికి వచ్చిన గవర్నర్కు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం గవర్నర్ పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం వైభవంగా సాగింది. తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హోదాలో రేవంత్రెడ్డి శ్రీరామనవమి వేడుకలకు హాజరై జానకి రాములకు పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా భద్రాచలం తరలివచ్చారు. 12:01 గంటలకు అభిజిత్ లగ్నంలో.. జై శ్రీరామ్ నినాదాల మధ్యన సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఉదయం పది గంటల సమయంలో మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ముందుగా కల్యాణ వేడుకకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా విష్వక్సేన పూజ చేశారు. ఆ తర్వాత పుణ్యవాచనం, శ్రీయోద్వాహం, యో్రక్తాబంధనం, అలంకరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12:01 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో వధూవరులైన సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. 12:13 గంటల సమయంలో మాంగళ్య ధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాల వేడుక నిర్వహించారు. చివరిగా మధ్యాహ్నం 12:36 గంటల సమయంలో హారతి ఇవ్వడంతో పెళ్లి తంతు ముగిసింది. సీఎంతో పాటు ఆయన సతీమణి గీత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు. నేడు పట్టాభిషేకం.. సోమవారం శ్రీరాముడి పట్టాభిషేకం జరగనుంది. కల్యాణం ముగిసిన మరుసటి రోజు భద్రాచలంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకలకు గవర్నర్ జిషు్ణదేవ్ వర్మ ముఖ్య అతిథిగా రానున్నారు. తలంబ్రాలపై శ్రీరామ నామం జనగామ: జనగామకు చెందిన కె.శ్రీలత శ్రీరామ నవమిని పురస్కరించుకొని వారం రోజులు కష్టపడి 5,100 బియ్యం గింజల (తలంబ్రాలు)పై శ్రీరామ సూక్ష్మ అక్షరాలు రాసి వేద పండితులకు అందజేశారు. భక్తులకు ట్రాఫిక్ ఇక్కట్లు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:20 గంటల వరకు మొత్తంగా 3.20 గంటల పాటు ముఖ్యమంత్రి భద్రాచలంలో ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసుల ఆంక్షలు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. 3:30 గంటలకు ఆంక్షలు ఎత్తివేయడంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచి్చన వాహనాలతో పట్టణంలో అనేక చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రాములోరికి తలంబ్రాలు సమర్పించిన ముస్లిం అధికారిరాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీసీతారాముల కల్యాణ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ నుంచి తలంబ్రాలు తీసుకొచ్చే ఆనవాయితీ ఉంది. అయితే స్థానిక తహసీల్దార్ ఖయ్యూం ఈ గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. దీంతో ఆదివారం ఆయన కులమత భేదాలను పక్కనపెట్టి తలంబ్రాలను తీసుకొచ్చి రాములోరి వివాహంలో పాల్గొన్నారు. రాజన్న సన్నిధిలో రామన్న కల్యాణం వేములవాడలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణంభారీగా తరలివచ్చిన భక్తజనంవేములవాడ: హరిహర క్షేత్రంగా వెలుగొందుతూ దక్షిణకాశీగా పేరుగాంచిన రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి జాతరను తలపించేలా దాదాపు లక్షన్నరకుపైగా భక్తులు హాజరయ్యారు. శనివారం రాత్రికే వేములవాడ చేరుకున్న భక్తులు, వసతి గదులు దొరక్క రోడ్లపైనే తలదాచుకున్నారు. వేములవాడలోని వీధులన్నీ భక్తజనంతో సందడిగా మారాయి. మున్సిపాలిటీ తరఫున కమిషనర్ అన్వేశ్, అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున విప్ ఆది శ్రీనివాస్, ఈవో వినోద్రెడ్డి, ఆలయ అర్చకులు పట్టువ్రస్తాలు అందించారు. ఇదిలా ఉండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివపార్వతులు నెత్తిన జీలకర్ర, చేతిలో త్రిశూలంతో, అక్షింతలు చల్లుకుంటూ రాజన్నను వివాహమాడారు. గుడిచెరువు ఖాళీ స్థలంలో 25వేల మందికి ఉచిత అన్నదానం అందించారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, తదితరులు హాజరయ్యారు. కిక్కిరిసిన యాదగిరి క్షేత్రం యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామనవమితో పాటు ఆదివారం సెలవు రోజు కలిసి రావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, క్యూలైన్లు, ముఖ మండపం, బస్టాండ్, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట వంటి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు, వీఐపీ దర్శనానికి 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కాగా వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.29,36,468 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. -
నేటి ప్రజావాణి రద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో సోమవారం శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున ఐడీఓసీలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. శ్రీరామనవమికి వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో కిన్నెరసానిని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 428 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.15,355, 200 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.11,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రామయ్యకు నేడు పట్టాభిషేకం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజున పట్టాభిషేకం వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేయనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఇలా.. ● ఉదయం 9–45కు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ ప్రారంభం ● 10.45కు సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు ● 11.20 గంటలకు గెస్ట్హౌస్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వస్తారు ● 11.45కు దేవస్థానం నుంచి మిథిలా స్టేడియానికి చేరుకుంటారు ● 12.45 వరకు స్టేడియంలో పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షిస్తారు ● 12,45కు స్టేడియం నుంచి బయలుదేరి 1 గంటకు ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు ● 1.25కు హెలీప్యాడ్కు.. ఆతర్వాత 1.30కు హెలీకాప్టర్లో పయనం -
పెద్దమ్మతల్లి ఆలయంలో ముగిసిన ఉత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా సాగుతున్న శ్రీదేవి వసంత నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజున శ్రీరామనవమి కూడా కలిసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు నాద నీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, శ్రీలలితా సహస్రనామ హవనం, పూర్ణాహుతి తదితర పూజలు చేశాక అమ్మవారికి హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు.. బీఆర్ఎస్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రాచలం శ్రీరామనవమి వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆయన పెద్దమ్మతల్లి సన్నిధికి రాగా.. అర్చకులు, ఈఓ ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. -
పోటెత్తిన భక్తులు.. వెంటాడిన అసౌకర్యాలు
● తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ● భద్రాచలంలో ఎప్పటిలాగే సామాన్య భక్తులకు తప్పనిపాట్లు ● కౌంటర్ల సమాచారం లేక తలంబ్రాల కోసం అవస్థలు ● మూడుసార్లు ట్రాఫిక్ నిలిపివేతతో ఎండలో అల్లాడిపోయారు.. ● షామియానాలు లేక చెట్ల కిందనే సేదదీరాల్సిన పరిస్థితి ● కరకట్ట సమీపంలో తాగునీరు దొరకలేదని పలువురి ఆవేదన ● కల్యాణానికి గతంకంటే భక్తులు పెరగగా..ఆ స్థాయిలోలేని వసతులు తాగునీరు దొరకలేదు 30 ఏళ్లుగా కల్యాణానికి వస్తున్నాం. ప్రతీసారి మా గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాల వారం ఏలూరు నుంచి భద్రాచలానికి మూడు రోజులపాటు కాలినడకన చేరుకుని ఇక్కడ కల్యాణం, పట్టాభిషేకం చూసి తిరిగి వెళ్తాం. ఈ సారి కూడా వచ్చాం. కానీ వంటా వార్పు చేసుకునేందుకు కరకట్ట ప్రాంతంలో తాగునీరు దొరకలేదు. – పెద్దింటి రమ, కై కలూరుచెట్ల కిందే సేదదీరాం.. రెండు రోజులపాటు ఇక్కడే ఉండి రామయ్య కల్యాణం, పట్టాభిషేకం చూడాలని 20 కుటుంబాల వారం ట్రాలీ తీసుకుని వచ్చాం. తలదాచుకునేందుకు రామాలయ ప్రాంతంలో షామియానాలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కరకట్ట కింద రోడ్డుకు ఇరువైపులా చెట్ల కిందనే సేదదీరాం. – రాము, ఆకివీడుఎల్ఈడీ స్క్రీన్లు లేవు.. కల్యాణాన్ని తిలకించేందుకు మిథిలా స్టేడియంలో మాత్రమే ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశా రు. రాజమండ్రి నుంచి వచ్చిన మాకు మిథిలా స్టేడియంలోకి వెళ్లే అవకాశం దొరకలేదు. స్టేడియం బయట కూడా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే బాగుండేది. కల్యాణాన్ని తంతును మైకులో మాత్రమే వినాల్సి వచ్చింది. ప్రత్యక్షంగా చూడలేక పోయాం. – ఈశ్వర్రావు, రాజమండ్రిదర్శనం కష్టంగా మారింది... వ్యయ ప్రయాసలకోర్చి రామ య్య కల్యాణానికి వస్తే.. స్వా మివారిని దర్శించుకోవడం కష్టతరంగా మారింది. క్యూలై న్లు లేకపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు, పిల్లలు, వృద్ధులను వెనుకకు నెట్టివేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేస్తే రామయ్య దర్శనంగా సులువుగా జరిగిదే. – దుర్గా, పోతులూరు ఇరవై ఏళ్లుగా వస్తున్నా... రామయ కల్యాణం కనులారా వీక్షించేందుకు 20 ఏళ్లుగా భద్రాచలం వస్తున్నాను. ఎండలు మస్తుగా ఉన్నాయి. టీవీలో వస్తాది కల్యాణం చూడు నాన్న అని నా బిడ్డలు చెప్పినా.. వినకుండా నా భార్య, నేను వచ్చాం. టీవీలో కంటే రామయ్య కల్యాణం దగ్గరుండి చూస్తేనే మనస్సు నెమ్మదిస్తుంది. – కేశవరావు, నల్లగొండఏర్పాట్లు బాగున్నాయి.. రామయ్య కల్యాణం చూసేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఐదేళ్లుగా భద్రాచలం రామయ్య కల్యాణం చూసేందుకు వస్తున్నాను. ఆలయ అధికారులు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు ఇంకా ఎక్కువ వేస్తే బాగుండేది. – నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం, ఏపీతలంబ్రాల కోసం ఇబ్బంది.. కల్యాణం అనంతరం ఒక్కసారిగా జనం స్టేడియం నుంచి బయటకు రావడంతో తలంబ్రాల ఎక్కడ దొరుకుతాయే తెలియక ఇబ్బంది పడ్డాం. మొదటిసారి రామయ్య కల్యాణం చూసేందుకు భద్రాచలం వచ్చాం. తలంబ్రాల కోసం ప్రచారం తక్కువగా చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. – వెంకటరమణ, మంగళగిరి, ఏపీశ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాతోపాటు పలు రాష్ట్రాల నుంచి భద్రాచలం తరలివచ్చారు. చాలామంది శనివారమే చేరుకోగా, ఆదివారం ఉదయం పవిత్ర గోదావరిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణం వీక్షించారు. గతేడాది కంటే ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అయితే భక్తుల సంఖ్య తగినట్లు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు దొరకక ఇబ్బందులు పడ్డారు. షామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో కరకట్ట పక్కన చెట్ల కిందనే సేదదీరారు. ఆలయ పరిసరాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయకపోవడంతో పలువురు కల్యాణం వీక్షించలేకపోయారు. ఇక ఎప్పటిలాగే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రతీసారి విమర్శలు ఎదుర్కొంటున్నా పోలీసు శాఖ తీరు ఈ సారి కూడా మారలేదు. బారికేడ్ల వద్ద సామాన్య భక్తులను నిలిపివేసి, తమశాఖ వారిని మాత్రం అనుమతించారని పలువురు ఆరోపించారు. –భద్రాచలం అర్బన్/భద్రాచలంటౌన్/చర్ల వీవీఐపీ, వీఐపీలు.. శ్రీరామనవమి వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, తెలంగాణ హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ నందా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరహరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, ఇంటెలిజెన్స్ డీజీపీ బత్తుల శివధర్రెడ్డి, హైదరాబాద్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ జడ్జి వెంకట్, హైదరాబాద్ సిటీ సివిల్ జడ్జి భవాని, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తులు రాజగోపాల్, వసంత్పాటిల్, కొత్తగూడెం న్యాయమూర్తి భానుమతి, భద్రాచలం న్యాయమూర్తి శివనాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, చామల కిరణ్కుమార్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మట్టారాగమయి, కార్పొరేషన్ చైర్మన్లు పొదెం వీరయ్య, మువ్వా విజయ్బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సినీతారలు కొణిదల నిహారిక, వితిక షేరు వేడుకల్లో పాల్గొన్నారు. బస్టాండ్లోకి రాని ఏపీ బస్సులు వేడుకలకు ఏపీ నుంచి భక్తులకు అధిక సంఖ్యలో వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నడిపిన బస్సులను బస్టాండ్లోకి అధికారులు అనుమతించలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిలిపివేయగా, రామాలయం నుంచి కిలోమీటర్ మేర కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. చాలామంది భక్తులకు విషయం తెలియక బస్టాండ్కు చేరుకుని ఆందోళన చెందారు. మండుటెండలో నడుస్తూ మైదానానికి చేరుకున్నారు. 25 మంది కుటుంబాలకు అప్పగింత శ్రీసీతారామ చంద్రస్వామివారి కల్యాణం తిలకించేందుకు వచ్చి 25 మంది వృద్ధులు తప్పిపోయి మిథిలా స్టేడియం వద్ద అధికారులు ఏర్పాటు చేసిన బాలల సంరక్షణ కేంద్రం వద్ద ఉండిపోయారు. దీంతో అధికారుల పలు మార్లు మైక్ ద్వారా ప్రచారం చేసి వారిని కటుంబ సభ్యులకు అప్పగించారు. కనిపించని తలంబ్రాల కౌంటర్లు కల్యాణం అనంతరం తలంబ్రాల కోసం భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. వీవీఐపీలు వెళ్తుండటంతో పోలీసుల హడావుడి నడుమ ప్రధాన రహదారికి చేరుకున్న భక్తులు తలంబ్రాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 80 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించినా.. అన్నీ ఆలయ చుట్టుపక్కలే ఉన్నాయి. సరైన సూచికలు లేకపోవడంతో పలువురు గందరగోళానికి గురయ్యారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రెండు కౌంటర్లు ఉన్నా తోపులాట జరిగింది. ఇక భక్తులను నియంత్రించాలని పోలీసులు బందోబస్తు విధులు మాని తలంబ్రాల కోసం ఎగబడ్డారు. ఒకేట కాకుండా ప్రధాన కేంద్రాల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. చెట్ల కిందే సేద రామయ్య కల్యాణానికి వచ్చిన భక్తులను అసౌకర్యాలు వెంటాడాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీరు, షామియానాలు వంటి సౌకర్యాలు సరిపడా ఏర్పాటు చేయలేదు. గతంలో కరకట్టకు వెళ్లే ప్రాంతంలో, రామాలయం ఎదురుగా పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేసేవారు. ఈసారి ఏర్పాటు చేయకపోవడతో రెండు రోజులుగా కరకట్ట సమీపంలో ఉన్న చెట్ల కిందనే సేదదీరారు. ఇక రెండు రోజులపాటు ఇక్కడే ఉండి కల్యాణం, పట్టాభిషేకం తిలకించేందుకు పిల్లాపాపలతో ఊర్లకు ఊర్లుగా పలువురు కదిలిరాగా.. వారికి వంటా వార్పు చేసుకునేందుకు కనీసం నీళ్లు కూడా దొరకలేదు. రామాలయ పరిసర ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో మిథిలా స్టేడియంలోకి వెళ్లలేని భక్తులు కల్యాణం వీక్షించలేకపోయారు. రామయ్య కల్యాణ క్రతువును మైకుల్లోనే వినాల్సి వచ్చిందని పలువురు పేర్కొన్నారు. తీరు మారని పోలీస్ వీఐపీల తాకిడి పెరగడంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకాగా, ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షణలో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు కేవలం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సేవలు చేయడమే సరిపోయింది. ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఎప్పటిలాగే పోలీసు వాహనాలను, పోలీసు సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడంతో సామాన్య భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల వాదనలకు దిగారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరులో మాత్రం మార్పు రావడం లేదని పలువురు పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలతో అవస్థ.. భద్రాచలంలో మూడుసార్లు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం రేవంత్ కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు 30, 25 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో ద్విచక్రవాహనదారులు మండుటెండల్లోనే ఉండాల్సి వచ్చింది. ఎండ వేడిమిని తట్టుకోలేక కొందరు అసహనం వ్యక్తం చేస్తూ బైక్ల హారన్ మోగించారు. ఆ తర్వాత బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వెళ్తన్న వాహనాలను పంపించే క్రమంలో ప్రతి 15 నిమిషాలకు వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను పోలీసులు చక్కదిద్దలేకపోయారు. ఫలితంగా 3, 4 గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. కొందరు స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికుల వద్ద నుంచి ప్రతి వస్తువుపూ అధిక ధరలు వసూలు చేసి జేబులు నింపుకున్నారు. 25 ఏళ్లుగా సైకిల్ పైనే.. భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఓ భక్తుడు 25 ఏళ్లుగా సైకిల్పై వస్తున్నాడు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పెద్దపల్లవపాలేనికి చెందిన కొల్లాటి రాధాకృష్ణ స్వామికి రాముడంటే ఎనలేని భక్తి. ఏటా కల్యాణానికి సైకిల్పై వస్తూ, స్వామివారిని దర్శించుకుని తిరుగు పయనమవుతున్నాడు. ఆదివారం కూడా సైకిల్పైనే వచ్చాడు. కాగా, గత నెలలో ఉత్తర్ప్రదేశ్లో జరిగిన కుంభమేళాకు సైకిల్పైనే వెళ్లి వచ్చిన్నట్లు రాధాకృష్ణ స్వామి తెలిపాడు. అడ్డుగా గొడుగులు..భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు టికెట్లు కొని స్టేడియానికి భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. టికెట్ల కోతతో పాటు వీవీఐపీ, వీఐపీల తాకిడి పెరగటంతో కొందరు నిలబడే వీక్షించాల్సి వచ్చింది. దీనికితోడు స్టేడియానికి ఎదురుగా ఉన్న సెక్టార్లలో లైవ్ టెలికాస్టింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్న గొడుగులతో వెనుక వైపు ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రూ. వేలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసినా స్వామివారి కల్యాణం ప్రశాంతంగా చూడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. -
పులకించిన భక్త గిరి
భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు ● అభిజిత్ లగ్నంలో ఒక్కటైన జానకిరాములు ● కల్యాణోత్సవానికి హాజరైన సీఎం రేవంత్రెడ్డి ● 11.57 గంటలకు మండపం వద్దకు మఖ్యమంత్రి ● కల్యాణం అనంతరం సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనంకల్యాణ ఘట్టాలు ● ఉదయం 9:50 గంటలు : కల్యాణ మండపానికి దేవేరుల ఆగమనం ● 10:22 : విశ్వక్సేన పూజ ● 10:33 : పుణ్యావాచనం ● 10:49 : శ్రీయోద్వాహం ● 11:13 : యోక్త్రా బంధనం, యజ్ఞోపవీత ధారణ ● 11:17 : శ్రీరాముడికి పాద ప్రక్షాళన ● 11:19 : అలంకరణ ● 11:26 : మధుపర్క నివేదన ● 11:33 : మహా సంకల్పం ● 11: 46 : కన్యాదానం ● 11:57 : పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్రెడ్డి ● మధ్యాహ్నం 12:01 గంటలు : అభిజిత్ లగ్నంలో వధూవరుల తలలపై జీలకర్ర బెల్లం ● 12:13 : మాంగళ్య ధారణ ● 12:22 : తలంబ్రాల వేడుక ● 12:36 : స్వామి, అమ్మవార్లకు హారతి సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన భక్తులు తన్మయత్వంతో వేడుకలను కనులారా వీక్షించి పులకించిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సతీ సమేతంగా వేడుకలకు హాజరై స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉదయం 8 గంటలకు మొదట గర్భగుడిలో మూలవిరాట్కు లఘు కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం తదితర కార్యక్రమాలు నిర్వహించాక అభిజిత్ లగ్నంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్యధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాల వేడుక, హారతి సమర్పణతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములకు తిరువీధి సేవ నిర్వహించారు. లగ్నానికి కొంచెం ముందుగా.. షెడ్యూల్ టైం ప్రకారం ఉదయం 10:45 గంటలకు భద్రాచలం ఆలయానికి సీఎం రేవంత్రెడ్డి చేరుకోవాలి, అక్కడ పూజా కార్యక్రమాలు చూసుకుని ఉదయం 11:10 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ ఆయన ఆలయానికి చేరుకునేసరికే ఉదయం 11:32 గంటలైంది. దీంతో అభిజిత్ లగ్నం సమయానికి సీఎం రేవంత్రెడ్డి కల్యాణ మండపానికి చేరుకుని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందిస్తారా అనే సందేహాం ఏర్పడింది. సాధారణంగా సీతారాముల వివాహ తంతులో అలంకరణలు, మధుపర్కం నివేదించిన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటారు. మధుపర్కం కార్యక్రమం ముగిసినప్పటికీ సీఎం కల్యాణ మండపానికి చేరుకోకపోవడంతో ఆ తర్వాత ఘట్టమైన కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అర్చకులు ప్రారంభించారు. ఈ క్రమంలో అభిజిత్ లగ్నానికి మూడు నిమిషాల ముందు.. అంటే 11:57 గంటలకు రేవంత్రెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. వెంటనే పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ ఘట్టం ముగియగానే అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:01గంటల సమయంలో వధూవరులైన సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. ఆ తర్వాత ఇతర మంత్రులు, శ్రీరామదాసు, తూమూ నర్సింహదా సు వంశీయులు, త్రిదండి పీఠం, టీటీడీ తరఫున, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వస్త్రాలు సమర్పించారు.ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసే కార్యక్రమంలో భాగంగా బూర్గంపాడు మండలం సారపాకలోని ముత్యాలమ్మ గుడి దగ్గరున్న నాయక్పోడు తెగకు చెందిన బూరం శ్రీనివాస్ ఇంటికి సీఎం రేవంత్రెడ్డి చేరుకున్నారు. ఇంటి ముందు కారు దిగి అక్కడున్న ప్రజలకు అభివాదం, దగ్గరగా ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ లోపలికి వెళ్లారు. శ్రీనివాస్ తల్లి పద్మావతి సీఎం రేవంత్రెడ్డికి ఎదురెళ్లి హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. అప్పటికే సీఎం రాక సందర్భంగా ‘ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయొద్దు. రోజు మీ ఇంట్లో ఎలా వంటలు చేస్తారో.. ఎలా తింటారో అవే ఏర్పాట్లు ఉండాలి’ అని జిల్లా అధికారులు సూచించడంతో రెండు గదులు ఉన్న ఆ ఇంట్లో మొదటి గదిలో సీఎం భోజనం చేసేందుకు చాప పరిచారు. మునక్కాయ కూర.. గోంగూర చట్నీ భోజనానికి సీఎం రేవంత్రెడ్డి కూర్చున్న వరుసలో బూరం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, సీఎస్ శాంతికుమారి కూర్చోగా ఎదురు వరుసలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కూర్చున్నారు. మంత్రి తుమ్మల భోజనం వడ్డింపు ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో భాగంగా నిల్చునే ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు రోజువారీగా ఉపయోగించే స్టీలు పళ్లెంలో సన్నబియ్యంతో చేసిన అన్నం, పులిహోర, పాయసం, గోంగూర చట్నీ, మునక్కాయ, దోసకాయ, టమాటా కూరలను వడ్డించారు. వీటితో పాటు మజ్జిగ, పెరుగు, పానకం కూడా సిద్ధం చేశారు. ఖమ్మం వంటలు బాగుంటాయి వడ్డింపు మొదలు పెట్టగానే ‘ఖమ్మం వంటలు బాగుంటాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. మొదటి ముద్ద తింటూనే.. ‘ఇంతకుముందు తుమ్మలనే ఈ వంటలు నాకు పరిచయం చేశారు’ అని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. భోజనం చేస్తూ మధ్యమధ్యలో ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు ఉచిత బస్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ పథకాలు ఎలా ఉన్నాయంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను సీఎం అడిగారు. పెరుగుతో భోజనం పూర్తి చేశారు. అంతకు ముందే రేవంత్రెడ్డికి వడ్డించే భోజనాన్ని ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్లు (టెస్ట్ అండ్ టే్స్ట్) పరిశీలించారు. వీళ్లకు ఉద్యోగం చూడండి.. భోజనం పూర్తయిన తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి సాయం చేయాలంటూ సీఎంను పద్మావతి కోరారు. దీంతో వారికి అవసరమైన సాయం చేయాలంటూ కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చివరగా శ్రీనివాస్ తల్లిదండ్రులు శంకర్రావు, పద్మావతికి రేవంత్రెడ్డి వస్త్రాలు అందజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2:21 గంటల వరకు మొత్తంగా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు సీఎం రేవంత్రెడ్డి భద్రాచలం పర్యటన కొనసాగింది. -
చేపలకు వల వస్తే.. బైక్ చిక్కింది
అశ్వారావుపేటరూరల్: చెరువులో చేపల వేటకు వెళ్లిన గిరిజనులకు బైక్ దొరికింది. ఆదివారం మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామ శివారులో ఊర చెరువులో స్థానిక గిరిజనులు చేపల వేటకు వెళ్లారు. వలలు వేయగా ద్విచక్రవాహనం చిక్కింది. అందరూ కలిసి నీళ్లలో ఉన్న బైక్ను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. నంబరు ఆధారంగా విచారించిన పోలీసులు బైక్ బూర్గంపాడుకు చెందిన రవీందర్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. బాధితుడికి సమాచారం ఇవ్వగా, తన బైక్ సుమారు 8 నెలల క్రితం చోరీకి గురైనట్లు చెప్పినట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. బైక్ చోరీ, చెరువు నీళ్లలో పడేయటం వెనుక కారణాలేమిటో విచారిస్తామని పేర్కొన్నారు. -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
చుంచుపల్లి: జిల్లాలో అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పిలుపునిచ్చారు. అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సీఎస్సార్ నిధుల ద్వారా కొనుగోలు చేసిన 70 ట్రై మోటర్ సైకిళ్లను ఆదివారం దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అటవీ అభివృద్ధి సంస్థ వినూత్న కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి, గ్రామాల్లో మౌలిక వసతులు, దివ్యాంగులకు చేయూత నందించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమని అన్నారు. దివ్యాంగులు మోటార్ సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో అడవులు అంతరించి పోకుండా ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత దివ్యాంగులపై ఉందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం వివిధ సంస్థలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. జిల్లాలో పోడు కొట్టడం ద్వారా కొంత అటవీ విస్తీర్ణం తగ్గిందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. అడవులు, చెట్ల నరకివేతతో మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ స్కైలాబ్, కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి డివిజన్ మేనేజర్లు చంద్రమోహన్, కవిత, గణేష్ తదితరులు పాల్గొన్నారు.టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ పొదెం వీరయ్య -
లబ్ధిదారులతో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలోని సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పలు కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సారపాకలో రేవంత్ రెడ్డి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యరాలు తులసమ్మను ఆరా తీశారు సీఎం.దొడ్డు బియ్యం పంపిణీ చేసినప్పుడు అసలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవాళ్లం కాదని సీఎం రేవంత్ కు చెప్పిన తులసమ్మ.. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసింది. 200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు సీఎం రేవంత్. తమకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సంతోషకరంగా ఉందని తులసమ్మ చెప్పుకొచ్చారు.యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగిలో రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. గతంలో దొడ్డు బియ్యం పెట్టినప్పుడు దళారులు, రైస్ మిల్లర్లు మాత్రమే బాగుపడేవారని, ఇప్పుడు సన్నబియ్యంతో ఆ పరిస్థితి లేదన్నారు. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించిన రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. -
సీతారాముల కల్యాణము చూతము రారండి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి రోజున ఆగమ శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో నేడు సీతారాముల కల్యాణం జరగనుంది. ఆ వివాహ వేడుక వివరాలు.. భజంత్రీలు, కోలాటాలతో స్వాగతం..ఉదయం 9:30 గంటల తర్వాత శంఖు, చక్ర, ధనుర్బాణాలను ధరించి సీతమ్మతో కూడిన రాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకీలో వెలుపలకు తీసుకొస్తారు. కల్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. జై శ్రీరామ్ నినాదాల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి స్వామి, అమ్మవార్లు చేరుకుంటారు. మండప శుద్ధికల్యాణ మండపానికి చేరుకున్న సీతారాములు, లక్ష్మణుడిని అక్కడ వేంచేపు చేస్తారు. కల్యాణ వేడుకలకు ఎలాంటి విఘ్నాలు రాకుండా ముందుగా విశ్వక్సేన పూజ నిర్వహిస్తారు. పుణ్యాహవచన మంత్రాలతో కల్యాణ వేడుకలకు ఉపయోగించే స్థలం, వస్తువులు, ప్రాంగణం, వేడుకలో పాల్గొనే వారిని మంత్ర జలంతో శుద్ధి చేస్తారు.రాముడి ఎదురుగా సీతమ్మ..శ్రీయోద్వాహము నిర్వహించి అప్పటివరకు మండపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చుండబెడతారు. శ్రీరాముడు సింహాసనంపై ఆసీనులు కాగా సీతమ్మ గజాసనంపై ఆసీనులవుతారు. సీతారాముల వంశగోత్రాల ప్రవరలు చెబుతారు.సీతారాములు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత ద్వాదశ దర్భలతో తయారుచేసిన యోక్త్రంతో సీతమ్మకు యోక్త్రా బంధనం చేస్తారు. ఇలా చేయడం వల్ల గర్భస్థ దశలో కలిగే దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. మరోవైపు శ్రీరాముడు గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడనే దానికి సూచనగా యజ్ఞోపవీతధారణ చేస్తారు. యజ్ఞోపవీతధారణ, యోక్త్రాబంధన కార్యక్రమాలు జరిగిన తర్వాత శ్రీరాముడి పాదప్రక్షాళనతో వరపూజ నిర్వహిస్తారు.అలంకరణలుకల్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపజేస్తారు. అనంతరం రామదాసు చేయించిన చింతాకు పతకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమాడను ధరింపజేస్తారు. సీతారాములకు తేనె, పెరుగు కలిపిన మధుపర్కంతో నివేదన చేస్తారురాష్ట్ర ప్రభుత్వం తరఫున, శృంగేరీ పీఠంలతో పాటు భక్తరామదాసు, తూము నర్సింహదాసు వంశస్తుల తరఫున వధూవరులకు పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది.కన్యాదానంవేదమంత్రాలను ఉచ్ఛరిస్తూ కన్యాదానం సందర్భంగా భూదానం, గోదానం చేస్తారు. అనంతరం మహాసంకల్పం, చూర్ణిక పఠనం గావిస్తారు. మంగళాష్టకాలు జపిస్తూ శ్రీరాముడికి సంబంధించి ఎనిమిది శ్లోకాలను, సీతమ్మకు సంబంధించి ఎనిమిది శ్లోకాలను పఠిస్తారు. ఈ మంగళాష్టకంలో వధూవరులకు సంబంధించిన ఏడు తరాల వివరాలను, ఘనతలను తెలియజేస్తారు. అభిజిత్ లగ్నంలో..చైత్రశుద్ధ నవమి నాడు అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి కల్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది, సాధారణంగా నవమి రోజున అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటుఇటుగా రావడం పరిపాటి. ముహూర్త లగ్నం రాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది.భద్రాచల వీధుల్లో వధూవరుల ఊరేగింపు..తలంబ్రాల కార్యక్రమం ముగిసిన సీతారాములకు తర్వాత తాత్కాలిక నివేదన చేయిస్తారు. నివేదన అనంతరం సీతమ్మ చీరకు, రామయ్య పంచె/«ధోతితో కలుపుతూ బ్రహ్మముడి వేస్తారు. అనంతరం మంగళ హారతి అందిస్తారు. బ్రహ్మముడి అనంతరం కల్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు. తలంబ్రాలు..ముత్యాలు కలిపిన, గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. సాధారణంగా తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. కానీ భద్రాచల రామయ్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు గులాబీ రంగులో ఉంటాయి. ఇక్కడ తలంబ్రాల తయారీలో పసుపుతో పాటు గులాల్ను కూడా ఉపయోగించడం తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది.సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకమ్ము!ఆలయ నిర్మాణం సహా సీతారాములకు ఆభరణాల తయారీమ్యూజియంలో కంచర్ల గోపన్న ఆభరణాలుభద్రాచలం: హస్నాబాద్ (పాల్వంచ) తహసీల్దార్గా పనిచేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీసీతారాముల ఆలయం నిర్మించాడని తెలిసిందే. అయితే, ఆయన ఆలయాన్ని నిర్మించడమే కాకుండా.. సీతారామ లక్ష్మణులకు పలు ఆభరణాలను ఆ సమయంలోనే తయారు చేయించాడు. వీటిని ఆలయ ప్రాంగణంలోని మ్యూజియంలో భక్తులకు అందుబాటులో ఉంచారు. ప్రధాన ఉత్సవాలైన ముక్కోటి, శ్రీరామనవమి రోజుల్లో ఈ ఆభరణాలను మూలవరులు, ఉత్సవ విగ్రహాలకు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.భద్రశిల మహత్మ్యం భద్రగిరిపై శ్రీ సీతారామచంద్రస్వామి వారి కరుణా కటాక్షాల కోసం భద్ర మహర్షి కఠోర తపస్సు చేశాడు. రామాలయం ప్రాంగణంలో గర్భగుడి వెనుక ఇప్పటికీ భద్రుని శిల.. చరిత్రకు నిదర్శనంగా దర్శనమిస్తోంది. ఆ మహర్షి కఠోర తపస్సుకు సంతుష్టుడైన శ్రీరామన్నారాయణుడు.. శంఖుచక్రాలతో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడి అవతారంలో సాక్షాత్కరించిన తపో భూమి భద్రాచలమని భక్తులు భావిస్తారు. ఇంతటి చారిత్రక నేపథ్యం గల ఈ శిలను తాకేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. భద్రుడికి గుడి కట్టించి పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం తొలుత భద్రగిరి, అనంతరం భద్రాచలంగా ప్రఖ్యాతి గాంచింది. అదరహో... శిల్పకళా నైపుణ్యంజగదభిరాముడికి భద్రాచలంలో జరిగే కల్యాణం ఎంతో ప్రత్యేకమైంది. ఈ కల్యాణం నిర్వహించే మండపం మొత్తాన్ని శిలతోనే నిర్మించారు. దీనిపై రామాయణ ఇతివృత్తాలకు చెందిన అనేక అపురూప శిల్పాలను చెక్కారు. ఈ శిల్పాలను నాటి మద్రాస్, ప్రస్తుత చెన్నైకి చెందిన గణపతి స్థపతి నేతృత్వంలో చెక్కారు. శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా అలంకరించి కల్యాణాన్ని ఇదే వేదికపై జరుపుతారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణాన్ని.. మొదట్లో ఆలయంలోని పొగడ చెట్టు ముందున్న రామకోటి స్తూపం వద్ద నిర్వహించేవారు. ఆ తర్వాత చిత్రకూట మండపంలో వేదిక నిర్మించి కల్యాణం జరిపేవారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో.. రామాలయానికి సమీపంలో 1960 మే 30న ప్రస్తుత కల్యాణ మండపానికి అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళితో శంకుస్థాపన జరిగింది. దీన్ని 1964 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డితో ప్రారంభించి.. అదే రోజు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఆ తర్వాత మహాసామ్రాజ్య పట్టాభిషేకం సందర్భంలో.. 1988లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కల్యాణ మండపం ప్రాంగణంలో.. స్టేడియం మాదిరిగా గ్యాలరీలు ఏర్పాటు చేసి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టేడియంలో ప్రస్తుతం 35 వేలమంది భక్తులు కూర్చుని స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉంది.సుదర్శన చక్ర దర్శనం.. సర్వ పాపహరణంభద్రగిరిపై కొలువుదీరిన మూలమూర్తులకు ఎంతటి ప్రత్యేకత ఉందో.. ప్రధాన ఆలయంపైనున్న గోపురంపై సుదర్శన చక్రానికీ అంతే ప్రత్యేకత ఉంటుంది. భక్త రామదాసు రామాలయాన్ని ప్రత్యేక రాతి శిల్పాలతో నిర్మించాక.. ఆలయ శిఖరంపై విమాన ప్రతిష్ట కోసం సుదర్శన చక్రం తయారు చేయించాలని నిర్ణయించారు. ఇలా సుదర్శన చక్రాన్ని ఎంతమందితో తయారు చేయించినప్పటికీ అది భిన్నం (ముక్కలు) అయిపోయేదట. భక్త రామదాసు చివరకు రామయ్య తండ్రిని ప్రార్థించగా.. స్వామివారు స్వప్నంలో కనిపించి మానవుడు నిర్మించిన ఏదీ ఇందుకు పనికిరాదని, గోదావరి నదిలో సుదర్శన చక్రం ఆవిర్భవించి ఉందని చెప్పినట్లు పురాణం చెబుతోంది. దీంతో నాలుగు వందల మంది గోదావరి నదిలో దానికోసం వెతికినా.. కనిపించలేదు. రామదాసు భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రస్వామి వారిపై కీర్తనలు ఆలపించగా.. సుదర్శన చక్రం గోదావరి నదిలో దొరికిందట. ఇలా గోదావరి నదిలో దొరికిన సుదర్శన చక్రాన్ని ఆలయ గర్భగుడిపై భక్త రామదాసు ప్రతిష్టించారు.రాములోరి మొదటి కల్యాణం గర్భగుడిలోనే..నేడు తెల్లవారుజామున రెండు గంటలకే పూజలు మొదలుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సాధారణ రోజుల్లో తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పుతారు. ఆ తర్వాత తిరువారాధన, మంగళాశాసనం, అభిషేకం తదితర పూజలు నిర్వహిస్తారు. కానీ శ్రీరామనవమిని పురస్కరించుకుని గర్భగుడిలో ఉన్న సీతారాములను రాత్రి రెండు గంటల సమయంలోనే మేల్కొల్పుతారు. ఆ తర్వాత నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలు చేపడతారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయంలో భద్రాచలం ఆలయం గర్భగుడిలో ఉన్న మూల విరాట్లకు శాస్త్రోక్తంగా లఘు కల్యాణం జరుపుతారు. 40 నిమిషాల వ్యవధిలోనే ఈ తంతును ముగిస్తారు.ఆ రోజుల్లో పొగడ చెట్టు నీడలో..శ్రీరామదాసు కాలంలో భద్రాచలం ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడలో సీతారాముల కల్యాణం నిర్వహించేవారు. ఆ తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో పొగడ చెట్టు నుంచి బేడా మండపంలోకి పెళ్లి వేదికను మార్చారు. గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. బేడా మండపంలో అంతమంది వీక్షించే పరిస్థితి లేకపోవడంతో ఆలయ ప్రాంగణం నుంచి బయట కల్యాణం జరిపించాలని నిర్ణయించారు. దీంతో ఉత్తర ద్వారానికి ఎదురుగా నవమి కల్యాణం కోసం ప్రత్యేకంగా మండపాన్ని 1964లో నిర్మించారు. సుమారు రెండు దశాబ్దాలపాటు ఎత్తైన కల్యాణ మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా చుట్టూరా భక్తులు చేరి చూసేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1988లో కల్యాణ మండపం చుట్టూ భక్తులు కూర్చుని చూసేందుకు వీలుగా మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.పెళ్లి పెద్దలుగా..శ్రీరామదాసు కాలం నుంచి భద్రాచలంలో నిత్య పూజలు, శ్రీరామనవమి, పట్టాభిషేకం తదితర వేడుకలు నిర్వహించేందుకు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వేద పండితులను భద్రాచలం తీసుకువచ్చారు. ఇలా తీసుకువచ్చిన వారిలో కోటి, అమరవాది, పొడిచేటి, గొట్టుపుళ్ల, తూరుబోటి ఇంటిపేర్లు గల కుటుంబాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాలే వంశపారంపర్యంగా, వంతుల వారీగా నవమి వేడుకల బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. శ్రీరామ నవమికి మిథిలా స్టేడియంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలలో కీలక పాత్ర పోషించేది ఆచార్య. ఇతని చేతుల మీదుగానే కల్యాణం మొత్తం జరుగుతుంది. ఆయనకు సూచనలను అందించే వ్యక్తిని బ్రహ్మగా పేర్కొంటారు. వీరిద్దరికి సహాయకులుగా ఇద్దరు చొప్పున నలుగురు రుత్వికులు ఉంటారు. పూజా సామగ్రి అందించేందుకు నలుగురు పరిచారకులు ఉంటారు. ప్రస్తుతం ఆలయంలో ప్రధాన అర్చకులైన ఇద్దరు వీరందరికీ అధర్వులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా 12 మంది సీతారాముల పెళ్లి వేడుకలో కీలకంగా వ్యవహరిస్తారు. వీరందరిని ఉత్సవాలలో భాగస్వామ్యం చేస్తూ కల్యాణ తంతు శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా స్థానాచార్యులు స్థలశాయి పెద్దన్న పాత్రను నిర్వర్తిస్తారు. -
దక్షిణ అయోధ్యలో ‘పంచారామ క్షేత్రాలు’
భద్రాచలం: దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లు తున్న భద్రాచలం.. భద్రుని తపో ఫలంతో ఆవిర్భా వమైన పుణ్యక్షేత్రం. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న పంచారామ క్షేత్రాల వివరాలు..వైకుంఠ రాముడు (భద్రాచలం)పంచారామ క్షేత్రాలలో మొదటిది భద్రాచలంలో ఉన్న సీతారామచంద్రస్వామి దేవస్థానం. దక్షిణ అ యోధ్యగా పిలుచుకునే ఈ క్షేత్రంలోని శ్రీరాముడిని భోగరాముడుగానూ పిలుస్తారు. చతుర్భుజాలతో శ్రీరాముడు దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం ఇది. భక్తరామదాసుగా పేరు తెచ్చుకున్న కంచర్ల గోపన్న ఈ ఆలయాన్ని నిర్మించడంతో పాటు పూజాధికాలను ఏర్పాటు చేశారు. నేటికీ ఈ క్షేత్రంలో ఇంచుమించుగా అవే పూజలు కొనసాగుతున్నాయి.శోకవిరాముడు (పర్ణశాల)తులసీదాసు రచించిన రామచరిత మానస్లో సీతారాములు వనవాసం (11మాసాల 10 రోజులు) చేసిన ప్రదేశాన్ని పర్ణశాలగా పేర్కొంటారు. ఇక్కడ పంచవటి కుటీరం, సీతమ్మను అపహరించిన ప్రాంతం, మాయలేడి పాదముద్రలు, శూర్పణఖ దాగి.. వేషాన్ని మార్చుకున్న చుప్పనాతి చెట్టు గల ప్రాంతం, సీతమ్మ పసుపు కుంకుమలుగా వాడుకున్న పసుపురాళ్లు. కుంకుమరాళ్లు, నారచీరలు ఆరవేసుకున్న చారబండలు, సీతారాములు ఆడుకున్న వామనగుంటలు, కందమూలాలను ఆరగించిన రాతి కంచాలు, సీతమ్మ ప్రత్యేక దినములలో స్నానం చేసిన పద్మసరస్సు (సీత వాగు) ఆమెకు రక్షణగా శ్రీరాముడు కూర్చున్న రాతి సింహాసనం వంటి గుర్తులు కనిపిస్తాయి. సీతాపహరణం తర్వాత శ్రీరాముడు శోకించిన ప్రాంతం కావడంతో ఇక్కడున్న రాముడిని శోకవిరాముడిగా పేర్కొంటారు.ఆత్మారాముడు (దుమ్ముగూడెం)ముక్కు, చెవులు కోసిన తర్వాత తన అన్నదమ్ము లైన ఖర–దూషణ, త్రిశిర తదితర 14 వేలమంది రాక్షసులతో శూర్పణఖ మొరపెట్టుకుంది. దీంతో వారంతా రాముడిపైకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో వారంతా రాముడి చేతిలో అంతమయ్యారు. 14 వేలమందితో రాముడొక్కడే యుద్ధం చేస్తున్నా... రాక్షసులకు ఒక్కొక్కరితో ఒక్కో రాముడు తలపడినట్లుగా యుద్ధం సాగిందని, రాముడొక్కడే అంతమందిగా అత్మస్వరూపంతో యుద్ధం చేసినందున ఇక్కడి రాముడిని ఆత్మారాముడని అంటారు. ఇక్కడే రాక్షసులకు రాముడికి దొమ్మి(యుద్ధం) జరిగిన ప్రాంతం కావడం వల్ల దొమ్మిగూడెం గాను, క్రమేణా దుమ్ముగూడెం గానూ మారినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. యోగరాముడు (శ్రీరామగిరి క్షేత్రం)ఇది గోదావరి, శబరి నదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతం. నిండుగా ప్రవహించే గోదావరి నదీతీరాన ఎత్తయిన కొండపై నెలకొన్న క్షేత్రానికి శ్రీరామగిరి అని పేరు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాంతం ఏపీలోకి వెళ్లింది. ఈ కొండపై శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై చాతుర్మాస్యవ్రతాన్ని ఆచరించాడని స్థలపురాణం. పర్ణశాలలో సీతాపహరణం తర్వాత శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ వనక్షేత్రం చేరి, సేదతీరి మళ్లీ సీతమ్మను వెదుకుతూ ఈప్రాంతానికి చేరుకున్నారు. ఇది అప్పుడు మాతంగముని ఆశ్రమ ప్రాంతం. ఇక్కడే శబరిని కలసి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆ తల్లికి ముక్తిని ప్రసాదించాడని పురాణ కథనం. ఈ విధంగా శ్రీరామాయణ కథకు సన్నిహిత సంబంధం గల పవిత్ర ప్రాంతమిది. ఈ ప్రాంతానికి సమీపంలో రేఖపల్లిలో (రెక్కపల్లి) (జటాయువు యొక్క రెండో రెక్క పడిపోయిన చోటు) జటాయువును చూశారు. రామలక్ష్మణులు జటాయువు ద్వారా సీత వృత్తాంతాన్ని తెలుసుకుని, మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు చేశారు. గోదావరి తీరంలో ఓ పెద్దశిలపై దానికి పిండ ప్రదానం చేసినట్లు స్థల చరిత్ర చెబుతోంది. ఈ కొండపై శ్రీరాముడు యోగం చేయడం వల్ల ఇక్కడి రాముడిని ఈ ప్రాంతవాసులు యోగరాముడుగా పిలుస్తారు. జటావల్కలధారిగా ఉండే ఈ స్వామికి సుందరరాముడు అని కూడాపేరు. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ లక్ష్మణస్వామి అంజలి ఘటిస్తూ ఉంటాడు. తొలుత ఈ కొండపై రామలక్ష్మణుల విగ్రహాలు, ఆ తరువాత మాతంగి మహర్షి వంశీయ మహర్షులు సీతమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థల చరిత్ర చెబుతోందివన రాముడు (దండకారణ్య భాగం) దండకారణ్య భాగం భద్రాచలం క్షేత్రానికి తూర్పు ఆగ్నేయ దిశలో శబరి నది దాటగానే ఉన్న వరరామచంద్రపురానికి (వీఆర్పురం) 23 కి.మీ. దూరంలో ఉంది (ప్రస్తుతం ఇది ఏపీలో ఉంది). ఇక్కడికి కాలిబాట తప్ప మరో మార్గం లేదు. సీతాపహరణం జరిగిన తర్వాత బాధలో ఉన్న శ్రీరాముడిని లక్ష్మణుడు ఓదార్చిన ప్రాంతమని భక్తుల విశ్వాసం. ఇక్కడి రాముడిని ఒక వృక్షరూపంలో ఆరాధిస్తారు. కొన్ని వందల ఏళ్లకు ముందు నుంచి ఇక్కడున్న రెండు భారీ టేకు, మద్ది చెట్లను ఆ ప్రాంత గిరిజనులు కొలుస్తున్నారు. అటవీశాఖ వారు కూడా చాలాకాలం క్రితమే వాటిని పురాతన వృక్షాలుగా గుర్తించి, ఆ రెండు చెట్లకు రామ, లక్ష్మణ వృక్షాలని పేరు పెట్టారు. ఆ రెండింటినీ దండకారణ్య వృక్షాల ప్రతినిధులుగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని వన రామక్షేత్రంగా సంబోధిస్తున్నారు. -
నేడే సీతారాముల కల్యాణం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఈ వేడుకలు చూసేందుకు ఇరు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వేడుకలకు స్వయంగా హాజరై సీతారాములకు పట్టు వ్రస్తాలు సమర్పించనున్నారు. అభిజిత్ లగ్నంలో..: చైత్రశుద్ధ నవమి, అభిజిత్ లగ్న ముహూర్తం రాగానే సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రం సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన, భక్తులు గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత తాత్కాలిక నివేదన చేయించి, అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందిస్తారు. కాగా, ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు తొమ్మిది రోజులపాటు మగ్గంపై నేసిన రెండు ఇక్కత్ చీరలు, ఆరు పట్టు పంచెలను కల్యాణం సందర్భంగా స్వామివారికి, సీతమ్మకు అలంకరించనున్నారు. పట్టు వ్రస్తాలు సమర్పించనున్న సీఎం: తానీషా కాలం నుంచి భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి పాలకులు వచ్చి ముత్యాల తలంబ్రాలు, పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. నవాబుల కాలం నుంచి తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2016 వరకు ఈ సంప్రదాయం కొనసాగింది, ఆ తర్వాత నుంచి సీఎం హోదాలో పట్టు వ్రస్తా ల సమర్పణ జరగడం లేదు. ఈసారి సీఎం హోదాలో రేవంత్రెడ్డి భద్రాచలం వస్తున్నారు. పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత సారపాకకు చెందిన బూరం శ్రీనివాస్ అనే గిరిజనుడి ఇంట్లో ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యంతో వండిన భోజనం చేయనున్నారు. కట్టుదిట్టమైన భద్రత భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు ప్రభావిత జిల్లా కావడంతో సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాకు చెందిన 500 మంది, పొరుగు జిల్లాల నుంచి మరో 1,300 మంది పోలీసులు భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీతారాముల కల్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం.. భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భా గంగా శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి వైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే కల్యాణానికి ముందు రోజు ఈ వేడుక జరిపిస్తామని అర్చకులు తెలిపారు. మిథిలా స్టేడియం సీతమ్మవారికి మిథిలా నగరంగా, వైకుంఠ ద్వారం రామయ్యకు చెందిన అయోధ్యగా అభివర్ణిస్తూ పండితులు కనులపండువగా ఈ తంతు జరిపించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్తో పాటు కొందరు అర్చకులు సీతమ్మ వారి వైపు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్తో పాటు మరికొందరు అర్చకులు రామయ్య వారి వైపు చేరి ఈ వేడుకను రక్తి కట్టించారు. ఈ సందర్భంగా గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాచల దేవస్థానంలో సంప్రదాయాన్ని పాటిస్తూ భక్తులపై గులాములు చల్లారు. -
సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు.!
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారివంశాల విశిష్టతలను, గొప్పతనాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుని వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మా వంశం గొప్పదంటే ... కాదు మా వంశమే గొప్పదని చెబుతూ సీతమ్మ వారివైపు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ బృందం, రామయ్య వారివైపు కమిషనర్ శ్రీధర్ బృందం చేరి వేడుక నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి ౖవైభవాన్ని లోకానికి తెలియజెప్పేందుకే ఎదుర్కోలు ఉత్సవ కార్యక్రమం జరిపినట్లు పండితులు తెలిపారు. హిందూ, ముస్లింల మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, వేదపండితుడు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, రామకోటి స్వరూప్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులను అలరించిన ఎదుర్కోలు ఉత్సవం -
తొమ్మిదేళ్ల తర్వాత..
● సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రాక ● సీఎం రేవంత్రెడ్డితోపాటు హాజరుకానున్న పలువురు మంత్రులు భద్రాచలం: నేడు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భద్రాచలం సమీపంలోని టోబాకో బోర్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుని పది నిమిషాలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని మిథిలా స్టేడియానికి చేరుకుని కల్యాణ వేడుకల్లో భాగం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కాగా 2016లో సీఎం హోదాలో చివరిసారిగా కేసీఆర్ ఈ సంప్రదాయం పాటించారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన హాజరుకాలేదు. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు రేవంత్రెడ్డి ఆదివారం వస్తున్నారు. వీఐపీల తాకిడి గతేడాది నవమి వేడుకల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఎంతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ వర్తించలేదు. కొందరు ఎమ్మెల్యేలు సాధారణ భక్తుల్లాగే వేడుకలకు హాజరయ్యారు. కానీ, ఈసారి ఉత్సవాలకు వీఐపీల తాకిడి పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రానుండటంతో వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు కిక్కిరిసిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ దాతల కోటా కింద జారీ చేసే టికెట్లను కూడా తగ్గించారు. జిల్లాకు మూడోసారి సీఎం రేవంత్రెడ్డి సీఎం హోదాలో గతేడాది ఏప్రిల్లో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభానికి, ఆ తర్వాత కొత్తగూడెంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార సభకు.. రెండుసార్లు వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత జిల్లాకు మూడోసారి వస్తున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత రిజర్వ్ చేసిన 45 నిమిషాల వ్యవధిలో సీఎంను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కాగా భద్రాచలంలో మెరుగులు దిద్దిన ట్రైబల్ మ్యూజియంతోపాటు మాఢవీధుల విస్తరణ పనులను ప్రారంభిస్తారని ప్రచారం సాగినా సీఎం టూర్ షెడ్యూల్లో వీటి ప్రస్తావనలేదు. కాగా సారపాకలో ఓ గిరిజనుడి ఇంట్లో సీఎం మధ్యాహ్న భోజనం చేయనుండగా, సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఉదయం 8:45 గంటలకు బేగం పేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10 గంటలకు భద్రాచలం హెలిప్యాడ్కు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. 10:10 నుంచి 10:30 గంటల వరకు రిజర్వ్ టైం కాగా, 10:30 గంటలకు గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి 10:45 గంటలకు ఆలయానికి వస్తారు. 10:45 గంటల నుంచి 11:00 గంటల వరకు దర్శనం చేసుకుని, అనంతరం మిథిలా స్టేడియం చేరుకుంటారు, 11:10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కల్యాణ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిథిలా స్టేడియం నుంచి సారపాకకు బయల్దేరుతారు. 12:35 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత ఐటీసీ గెస్ట్హౌజ్ చేరుకోనుండగా, 1:15 నుంచి 2 గంటల వరకు రిజర్వ్ టైం. 2:15 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుని హైదరాబాద్ బయల్దేరతారు. -
1,800 మందితో బందోబస్తు
భద్రాచలంఅర్బన్: ఉత్సవాలకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎస్పీ రోహిత్రాజు పర్యవేక్షణలో 1,800 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. అదనపు ఎస్పీ, 16 మంది డీఎస్పీలు, 66 మంది సీఐలు, 186 ఎస్ఐలు, 859 మంది ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, 208 మహిళా కానిస్టేబుళ్లు, 414 మంది హోంగార్డులతోపాటు, ఆర్ముడ్ రిజర్వుడు సిబ్బంది, బాంబ్ డిస్బోజబుల్ బృందాలతో పాటు 50 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు కలిగి ఉండటంతో భద్రాచలం చేరుకునే మార్గాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. జగ్జీవన్రామ్ను స్ఫూర్తిగా తీసుకోవాలిసూపర్బజార్(కొత్తగూడెం): స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను నిర్వహించారు. మొదట కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలకపాత్ర పోషించారని, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు పోరాడారని గుర్తుచేశారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, అధికారులు అనసూర్య, సంజీవరావు, రమాదేవి, భాస్కర్ పాల్గొన్నారు. అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అనంతం ఈఓ రజనీకుమారి అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను జడ్జికి అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
ట్రాఫిక్.. టెన్షన్!
‘ఎర్త్ సైన్సెస్’కు సీఎం ఆమోదంట్రాఫిక్ పరిష్కారానికి కసరత్తు ● ఏటా నవమికి భద్రాచలంలో రాకపోకలకు ఇక్కట్లు ● ఈసారి ముందస్తు కార్యాచరణగా ప్రత్యేక పార్కింగ్ స్థలాలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఆమోదం తెలిపారు. మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటిది కావడంతోపాటు సహజ వనరులు, మినరల్స్ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. కాగా సహజ వనరులు, మెరుగైన అవకాశాలు ఉన్న మైనింగ్ కళాశాలను ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని మంత్రి తుమ్మల చొరవ చూపి పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీరామనవమినే. శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణాన్ని తిలకించి తిరిగి భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఏటా తిప్పలు తప్పడం లేదు. ప్రతీ సంవత్సరం అధికార యంత్రాంగం సమీక్షలైతే నిర్వహిస్తోంది కాని దీనికి పూర్తిస్థాయి పరిష్కారాన్ని కనుగొనలేకపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పదేళ్లుగా నత్తనతకగా సాగుతున్న రెండో వంతెనను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో గతేడాది అప్పటి కలెక్టర్ ప్రియాంక ఆల ప్రారంభించారు. దీని కారణంగా గతేడాది ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ కొంత మేర తగ్గినా, స్వామి వారి కల్యాణం కోసం వచ్చే భక్తగణంతో భద్రాద్రి పట్టణం కిక్కిరిసిపోతోంది. ఇంటికే రామయ్య తలంబ్రాలు.. రామయ్య తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే చేరవేస్తారు. ఇందుకోసం రూ.151 చెల్లించాల్సి ఉండగా, పోస్టల్ శాఖలో రూ.150 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 వరకు బుకింగ్ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఆకాశాన్నంటుతున్న వసతి గదుల రేట్లు.. రాముల వారి కల్యాణం సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రైవేట్ వసతి గదుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. భద్రాచలంలో సుమారు 70 లాడ్జీలు ఉండగా.. వీటిల్లో 695 రూములను కేటగిరీలుగా విభజించి 50 శాతం రెవెన్యూ శాఖ అధికారులకు, 25 శాతం పోలీస్ శాఖకు, మిగిలిన 25 శాతం ప్రైవేట్ లాడ్జీలకు కేటాయించారు. సాధారణ రోజుల్లో ఒక లాడ్జీ రూ.2,500 ఉంటే ఇప్పుడు రూ.25వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం.అద్భుతంగా వెదురు ఉత్పత్తులు.. చండ్రుగొండ : వెదురు ఉత్పత్తుల తయారీ అద్భుతంగా ఉందని నీతి ఆయోగ్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ దేవిప్రసాద్ అన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామశివారులో ఉన్న బ్యాంబో క్లస్టర్ను శనివారం ఆయన సందర్శించారు. వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదురు ఉత్పత్తుల తయారీదారులకు సాంకేతికత జోడించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం వెదురు నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, సెక్రటరీ రోహిత్, క్లస్టర్ చైర్మెన్ ఈసం నాగభూషణం, డైరెక్టర్లు మల్లం కృష్ణయ్య, బొర్రా సురేష్, వర్సా శ్రీను, పద్దం రమేష్, రవి, సైదులు పాల్గొన్నారు. -
గిరిజనుడి ఇంట సీఎంకు భోజనం
● ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో.. ● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్బూర్గంపాడు: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణం అనంతరం సారపాకకు చెందిన గిరిజనుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఆదివారం భోజనం చేయనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదల ఇంట్లో భోజనం చేసి లబ్ధిదారులతో మాట్లాడాలనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎంఓ నుంచి శనివారం టూర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కాగా, శ్రీనివాస్ ఇంటిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఇతర అధికారులు శనివారం పరిశీలించి ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతోనే అన్నం వండి పప్పు, చారు, కూర, పచ్చడితో భోజనం వడ్డిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈనేపథ్యాన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నాయకపోడు తెగకు చెందిన గిరిజనుడి ఇంట భోజనానికి సీఎం రావడం సంతోషకరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం గిరిజనుడి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. -
భద్రాద్రి కొత్తగూడెం: భారీగా దళ సభ్యుల లొంగుబాటు
భద్రాద్రి కొత్తగూడెం, సాక్షి: మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. శనివారం కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 86 మంది దళ సభ్యులు లొంగిపోయారు. వీళ్లంతా బీజాపూర్, సుక్మా జిల్లా దళ సభ్యులుగా తెలుస్తోంది. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి.. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం.. అంటూ ఆపరేషన్ చేయూతను చేపట్టింది పోలీస్ శాఖ. ఈ కార్యక్రమం కింద.. లొంగిపోయిన ప్రతి సభ్యుడికి ఇవాళ రూ. 25 వేల చెక్కును ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అప్పగించారు.లొంగిపోయిన వాళ్లలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులు అడ్డంకిగా మారారు. పైగా మావోయిస్టు పార్టీ పేరుతో కొందరు బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. తక్షణమే ఆ పనిని ఆపాలి. గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యుల లొంగిపోయారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 203 మంది లొంగిపోగా.. మరో 66 మందిని అరెస్ట్ చేశాం అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగ జిల్లా ఎస్పీ శబరీష్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.కిందటి నెలలోనూ ఆపరేషన్ చేయూతకు విశేష స్పందన లభించింది. ఒకేరోజు 64 మంది దళ సభ్యులు లొంగిపోయారు. ఇదిలా ఉంటే.. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్ట్ రహిత భారత్కు కేంద్ర హోం శాఖ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో గత నాలుగు నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ క్రమంలో తాము శాంతి చర్చలకు సిద్ధమని, అవసరమైతే కాల్పుల విరమణ పాటిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టులు ఓ లేఖ రాశారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్.. ‘గిరిజన పల్లె’ ముస్తాబు..
ఆదివాసీ సంప్రదాయ దుస్తులు, కొమ్ముకోయ తలపాగ, వాయిద్యాలు.. ఇలా గిరిజన పల్లెను ప్రతిబింబించే థీమ్తో భద్రా చలంలోని గిరిజన మ్యూజియం ప్రాంగణంలో ఓ సెట్ రూపుదిద్దుకుంటోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసీల జీవితాన్ని పరిచయం చేయబోతున్నారు. నిర్మాణ దశలో ఉండగానే ఈ పల్లెకు ఆదరణ వస్తున్న నేపథ్యంలో మరిన్ని సదుపాయాల కల్పనకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.గిరిజన సంస్కృతికి ప్రాచుర్యం కలి్పంచడమే ప్రధాన లక్ష్యం కావడంతో నామమాత్రపు రుసుముతోనే పర్యాటకులు, ఫొటో, ప్రీ వెడ్డింగ్ షూట్లకు వచ్చే వారికి ప్రవేశం కల్పించనున్నారు. భద్రాచలంలో సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులకు గోదావరి తీర ప్రాంత గిరిజన సంప్రదాయాలను పరిచయం చేయాలనే ఆలోచనతోనే శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం వచ్చే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియం, గిరిజన పల్లెను ప్రారంభించేలా ఐటీడీఏ పీఓ రాహుల్ నేతృత్వాన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంముక్కోటితో మొదలుజనవరిలో భద్రాచలంలో జరిగిన ముక్కోటి సందర్భంగా ‘ఏరు’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గడ్డి గుడిసెలు, మంచె, మట్టి ఇళ్ల నమూనాలను ఐటీడీఏ క్యాంపస్లో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఆవరణలో నిర్మించారు. భద్రాచలం వచి్చన భక్తులను ఈ గడ్డి గుడిసెలు ఆకట్టుకున్నాయి. వీటి ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీంతో ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న గిరిజన మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.ఆబాల గోపాలంగిరిజన మ్యూజియం ఆవరణలో పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్, ప్లే ఏరియా, యువకుల కోసం బాక్స్ క్రికెట్, శాండ్ వాలీబాల్, ఆర్చరీ గేమ్, ఓపెన్ జిమ్లు నిర్మించారు. ఆదివాసీ రుచుల నుంచి చైనీస్ వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టు కూడా రెడీ చేశారు. మరోవైపు మ్యూజియాన్ని గిరిజనుల పండుగలు, వేటలో ఉపయోగించే ఆయుధాలు, ఇళ్లలో వినియోగించే పనిముట్లు, కళాకృతులు, వాయిద్యాల థీమ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వెరసి మూడు నెలల్లోనే గిరిజన మ్యూజియం ‘మినీ స్టూడియో’గా మారిపోయింది. ఓవైపు నిర్మాణ పనులు జరుగుతుండగానే.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాబోయే వధూవరులు, బర్త్డే పారీ్టల కోసం గ్రూపులు గ్రూపులుగా స్థానికులు ఇక్కడికి రావడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ షూట్ నిర్వహించుకునేలా మరిన్ని సదుపాయాలు జత చేయాలని నిర్ణయించారు. ఇక గిరిజన మ్యూజియం చూడాలనుకునే విద్యార్థుల కోసం స్కూలు మొత్తానికి కేవలం రూ.500 ఎంట్రీ ఫీజుగా నిర్ణయించారు. -
● నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: రామాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం భద్రాచలం పట్టణానికి చెందిన మల్లెల వెంకట శ్రీనివాస్–పార్వతి దంపతులు రూ.1,01,116 లక్ష, బీవీ సీతారామరాజు–కృష్ణవేణి దంపతులు రూ.50 వేలు విరాళం అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ● 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు.. కొత్తగూడెంఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు వైద్య సేవలందించేందుకు జిల్లా వ్యాప్తంగా 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ ఎల్.భాస్కర్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 మంది వైద్యులు, 217 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించామని, శనివారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 5 అంబులెన్స్లు, సీపీఆర్ క్వాలిఫైడ్ ఎంఎల్హెచ్పీఎస్ను నియమించామని, ఏరియా ఆస్పత్రుల్లో 50 బెడ్లు, ప్రతి ప్రైవేటు నర్సింగ్ హోంలలో 5 బెడ్లు, అన్ని రకాల గ్రూప్ల రక్తం అందుబాటులో ఉంచామని వివరించారు. ● రేపటి నుంచి పునర్వసు దీక్షలు భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తామని ఆలయ ఈఓ ఎల్.రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు దీక్ష విరమణ, భద్రగిరి ప్రదక్షిణ మే 3న నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ పునర్వసు దీక్షాధారణ చేయాలని కోరారు. ● నవమికి ముస్తాబైన దర్గాఇల్లెందురూరల్: సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం వేడుకలకు మండలంలోని హజరత్ నాగుల్మీరా దర్గా ముస్తాబైంది. దర్గాలో పద్నాలుగేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా, ఏటా హిందూ ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా దర్గాలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శనివారం దమ్మక్క వారసుల చేత గోటితో ఒలిచిన తలంబ్రాలను దర్గాలో సమర్పించనున్నారు. 6న కల్యాణం, 7న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రగిరి శ్రీసీతారామ చంద్రస్వామివారి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణాన్ని వైభవోపేతంగా జరిపారు. శ్రీ మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. గరుడాధివాసం కార్యక్రమాన్ని కమనీయంగా జరిపారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఎటువంటి విఘ్నాలూ కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనుడికి అర్చన జరిపి, కర్మణ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహన, భ్రదక మండల ఆరాధన, ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్ఠాపన జరిపారు. ● గరుడ ప్రసాదం పంపిణీ యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకుని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్ప ం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకాలను తర్పానందంగా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేనివారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ● నేడు ఎదుర్కోలు ఉత్సవం సీతారాముల కల్యాణ వేడుకలకు ముందు వధూవరుల విశిష్టతలను వర్ణించే, గొప్పలను వివరించే ఎదుర్కోలు ఉత్సవం శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. వేడుకల్లో హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరిపై పన్నీరు, గులాల్ చల్లుతారు. భద్రాచలం దేవస్థానంలో గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. నవాహ్నిక తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, సోమవారం పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి దంపతులు, ఏఈవోలు శ్రవణ్కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం తానీషాను స్మరిస్తూ భక్తులపై గులాల్ చల్లే విశేషం రేపు సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేకం -
వానాకాలంలో 6,03,124 ఎకరాల్లో సాగు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రాబోయే వానాకాలం పంటల విస్తీర్ణాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత వానాకాలం సీజన్ కంటే ఈసారి పంటల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. గత వానాకాలంలో 5,92,264 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేయగా వచ్చే వానాకాలంలో 6,03,124 ఎకరాలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఎప్పటిలాగే వరి, మొక్కజొన్న, పత్తి, ఆయిల్పామ్ పంటల విస్తీర్ణం అధికంగా ఉంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రోత్సాహంతో గతేడాది 550 ఎకరాల్లో మునగ సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాలకు చేరుకోనుంది. మునగ సాగు పెరిగే అవకాశం కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలో వచ్చే వానాకాలంలో మునగసాగు పెరగనుంది. గత సంవత్సరం మునగసాగు కంటే మరో నాలుగురెట్లు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన పంట కావడంతో రైతులు మక్కువ చూపుతున్నారు. –వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారివచ్చే సీజన్పై అంచనా వేసిన వ్యవసాయ శాఖగత, రానున్న వానాకాలం సీజన్లలో పంటల విస్తీర్ణం వివరాలు.. పంట గత సీజన్ రానున్న సీజన్ ఆగ్రో ఫారెస్ట్రీ 28,414 28,982 వరి 1,64,663 1,60,956 మొక్కజొన్న 85,828 85,544 పత్తి 2,03,561 2,04,632 వేరుశెనగ 2,736 2,791 పండ్ల మొక్కలు 9,995 10,195 జీడిపప్పు 11,670 11,903 కోకోవ 640 652 కొబ్బరి 1,769 1,805 ఆయిల్పామ్ 63,486 75,000 మినుము 840 857 పెసర 128 131 కంది 1,136 1,159 మిర్చి 10,284 10,489 కూరగాయలు 492 501 ఇతర పంటలు 6,073 5,025 మునగ 550 2,500 మొత్తం 5,92,264 6,03,124 -
● సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేడుకల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్ రెడి రానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది శనివారం నుంచే విధుల్లో ఉండాలని ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీలు, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ● సకలం సిద్ధం స్వామివారి తలంబ్రాల పంపిణికీ 80, ప్రసాదాల పంపిణీకి 19 ప్రత్యేక కౌంటర్లు, 13 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను, పారిశుద్ద్య పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రోజూ లక్షన్నర లడ్డూలను భక్తులకు అందిస్తామని, 200 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశామని వివరించారు. రెండు రోజులపాటు భద్రాచలం, సారపాకలలో ఉన్న వైన్ షాపులను మూయించాలన్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు, సూచనలను అందించారు. ● అధికారులపై మంత్రి ఆగ్రహం కూనవరం రోడ్డులో కరకట్ట నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట పనులను పరిశీలించి మాట్లాడారు. మే 31 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ రమాదేవి పాల్గొన్నారు. -
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఏరియాలోని జేవీఆర్ఓసీ–2లో 10 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 3 వేల టన్నులతోపాటు కిష్టారం ఓసీలో 1500 క్యూబిక్ మీటర్ల ఓబీ, జేవీఆర్ఓసీ–2లో 50 వేల క్యూబిక్ మీటర్ల ఓబీకి అంతరాయం వాటిల్లింది. ఎన్డీ జిల్లా కార్యదర్శి రమేశ్ విడుదల ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్) ఎన్డీ జిల్లా కార్యదర్శి, ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం బాబు అలియాస్ రమేశ్ శుక్రవారం ఖమ్మం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. గత నవంబర్ 28న ఆయన్ను ఇంటి వద్ద గుండాల పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. 20 ఏళ్లుగా ఉద్యమంలో, ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న రమేశ్ పలు దఫాలు జైలు జీవితం గడిపారు. లింగన్న ఎన్కౌంటర్ తర్వాత ఎన్డీ దళాలు క్రమక్రమంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయినా రమేశ్ మాత్రం అజ్ఞాతం వీడలేదు. అనారోగ్యంతో ఇంటికి చేరిన ఆయన పోలీసులకు చిక్కి నాలుగు నెలల నాలుగు రోజులు ఖమ్మం జైలులో గడిపారు. ఆయనపై ఇల్లెందు, బోడు, ఆళ్లపల్లి, గుండాల పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులున్నాయి. ఎన్డీ నేతలు పొడుగు నర్సింహారావు, టి.నాగేశ్వరరావు స్వాగతం పలికారు. వచ్చే నెల 19న ఆత్మలింగేశ్వరాలయం ప్రతిష్ఠాపన పాల్వంచ: పాల్వంచలోని చింతలచెర్వు వద్ద ఉన్న ప్రాచీన ప్రముఖ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో మే 15 నుంచి 19వ తేదీ వరకు జీర్ణోధరణ పూర్వక ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు కార్యక్రమాల కరపత్రాలను శుక్రవారం విడుదలచేసిన ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు మాట్లాడారు. కాకతీయుల పరిపాలనలో ప్రతాపరుద్రుడి హయాంలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ప్రతిష్ఠాపనకు కాకతీయ వారసుడు కమల్చంద్బంజ్దేవ్, పాల్వంచ సంస్థానాదీళుల వారసులు కృష్ణకుమార్ అప్పారావు అశ్వరాయ, మధుకుమార్ అప్పారావు అశ్వరాయ, అశ్వారావుపేట పరగణాధిపతుల వారసులు దామెర కుమారమురళి మహిపాల్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. వచ్చేనెల 19వ తేదీన ఆదిశంకరాచర్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతీ మహాస్వామి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభికం ఉంటాయని తెలిపారు. సమావేశంలో యల్లావులు కోటేశ్వరరావు, యల్లావుల వెంకన్న, వల్లపు యాకయ్య, రమణ, ఫణి, సాంబయ్య, అచ్యుత్ రావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఆదివారం జరగనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ అధికారుల నుంచి భద్రాచలం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పవన్కల్యాణ్ శనివారం సాయంత్రమే భద్రాచలం చేరుకునే అవకాశముందని, ఆదివారం ఉదయం కల్యాణాన్ని తిలకించాక తిరిగి వెళ్తారని సమాచారం. అంతేకాక పలువురు కేంద్ర మంత్రులు, టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు కూడా భద్రాచలం రానున్నట్లు తెలిసింది. డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి పాల్వంచ: మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన కొంపెల్లి వెంకటేశ్వర్లు (55) గురువారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో డ్రెయినేజీలో పడ్డాడు. వర్షం వల్ల డ్రెయినేజీ పొంగింది. వెంకటేశ్వర్లు బయటకు రాలేక మృతి చెందాడు. స్థానికులు కొంత సేపటి తర్వాత గుర్తించి, బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య స్వరూప శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్లే మృతి నవభారత్ వైన్స్ సమీపంలో డ్రెయినేజీ ఓపెన్ చేసి ఉండటంతో రాత్రి వేళ కనిపించక వెంకటేశ్వర్లు అందులో పడి మృతి చెందాడని, ఇది మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీ శుభ్రం చేసేందుకు పైకప్పును సిబ్బంది పగులగొట్టారని, అనంతరం అలానే వదిలేశారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. -
ఏపీ గెలలకూ ఓఈఆర్ 19.36 శాతం..
● అశ్వారావుపేటలో పరీక్షించాక నిర్ధారణ ● జగన్ హయాంలో మాదిరి టన్ను ధర చెల్లించక తప్పని పరిస్థితి అశ్వారావుపేటరూరల్: ఏపీలో రైతులు సాగుచేస్తున్న ఆయిల్పామ్ గెలల ఓఈఆర్ (నూనె దిగుబడి శాతం) 19.36 శాతంగా నమోదవడంతో ఆ ప్రకారం వారికి ధర చెల్లించనున్నారు. ఏపీలోని ఆయిల్ఫెడ్కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలు పాతవి కావడంతో నూనె దిగుబడి శాతం కేవలం 17.30గా నమోదవుతోంది. తెలంగాణలో మాత్రం ఇది 19.36 శాతం ఉండడంతో రైతులకు టన్ను గెలలకు రూ.21 వేల చొప్పున, ఏపీ రైతులకు రూ.17 నుంచి రూ.18 వేల మధ్యే అందుతోంది. ఏపీ సీఎంగా వైఎస్.జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ఆయిల్ఫెడ్ నిర్ణయించే ఓఈఆర్ ప్రకారమే ఐదేళ్ల పాటు ధర చెల్లించారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీ ఓఈఆర్ ప్రకారమే టన్ను ధర చెల్లించేలా నిర్ణయించగా రైతులకు నష్టం ఎదురవుతోంది. ఈ మేరకు రైతుల వినతితో ఏపీ గెలలను అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసి ఓఈఆర్ శాతాన్ని నిర్ధారించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో ఏపీలో రైతులు సాగు చేసిన 862 టన్నుల గెలలను బుధ, గురువారం క్రషింగ్ చేయగా 19.36 శాతంగా ఓఈఆర్ నమోదైనట్లు ఫ్యాక్టరీ మేనేజర్ నాగబాబు శుక్రవారం ప్రకటించారు. ఈ ఓఈఆర్ ప్రకారం ఏపీ రైతులకు ధర చెల్లించనుండగా టన్నుకు రూ.3 వేలకు పైగా లబ్ధి జరగనుంది. కాగా, గెలల క్రషింగ్ అవకాశం కల్పించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ఫెడ్ ఎండీ యాస్మిన్బాషా, అధికారులకు ఏపీ రైతు సంఘం నాయకులు బొబ్బా రాఘవరావు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. -
నష్టం మిగిల్చిన వర్షం..
అనుకోని వర్షం అన్ని పంటలను దెబ్బకొట్టింది.. మండే వేసవిలో కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి.. ఇక పంట చేతికొస్తుందనుకున్న రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చెప్పా పెట్టకుండా వచ్చిన వాన అన్నదాతల కంట కన్నీళ్ల వరదలు పారించింది. పాల్వంచరూరల్: వర్షానికి నేలవాలిన వరి పంట పాల్వంచ మండలంలో.. పాల్వంచరూరల్: మండలంలోని కోడిపుంజుల వాగులో తేజావత్ కీమా మిర్చి తడిసి ముద్దయింది. నారాయణరావుపేటలో దాసరి మస్తాన్రావుకు చెందిన ఎనిమిది ఎకరాలు, అప్పొజు సత్యనారాయణకు చెందిన ఆరు ఎకరాలు, వెంకట్రావుకు చెందిన 3 ఎకరాల వరి పంట నేలవాలింది. నాగారం, దంతలబోరు, సోములగూడెం, రంగాపురం గ్రామాల్లో వరి దెబ్బతిన్నది. ఏఓ శంకర్ రంగాపురంలో వరి పంటలను పరిశీలించారు.ఇల్లెందులో.. ఇల్లెందురూరల్: అకాల వర్షాటనికి మండలంలో మొక్కజొన్న పంట సుమారు 300 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు సమాచారం. పూబెల్లిలో కల్లంలో ఆరబెట్టిన మొక్కజొన్న తడిసిపోవడంతో మహిళా రైతు కల్తీ కోటమ్మ చేలోనే సొమ్మసిల్లి పడిపోయింది. ఐదెకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న నూర్పిడి చేసి కల్లంలో ఆరబెట్టింది. గురువారం వాహనం దొరక్కపోవడంతో తీసుకెళ్లకపోవడంతో.. భారీ వర్షం నట్టేట ముంచింది. శుక్రవారం ఉదయం చేనుకు వెళ్లిన ఆమె తడిసిన పంటను చూసి అక్కడే కుప్పకూలింది. సమీప రైతులు గమనించి ఇంటికి చేర్చారు. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి కూడా కూడా తడిసిపోయింది. ఏడీఏ లాల్చంద్, ఏఓ సతీశ్ గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సీపీఎం నాయకులు అబ్దుల్ నబీ, ఆలేటి కిరణ్, వజ్జ సురేశ్ కూడా పంటలను పరిశీలించారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: శ్రీదేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి ) ఆలయంలో శుక్రవారం వసంత మహోత్సవాలను పురస్కరించుకుని నాదానీరాజనం, సూక్తి పారాయణ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, లక్ష కుసుమార్చన, శ్రీలలితా సహస్రనామహవనం జరిపారు. అమ్మవారికి హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ముగిసిన కుష్ఠు బాధితుల గుర్తింపు సర్వేకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ముగిసిన కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపు సర్వే ముగిసిందని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు వ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహించామని, శుక్రవారంతో ఆన్లైన్ ప్రక్రియ కూడా ముగిసిందని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. సర్వేలో 1,702 మందిని అనుమానిత లక్షణాలు ఉన్న వారిగా గుర్తించామని తెలిపారు. 2,88,368 ఇళ్లను సందర్శించి 12,13,576 మందిని పరీక్షించామని, మొత్తం ఐదు కొత్త కేసులను గుర్తించామని వివరించారు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధి కారక క్రిమి శరీరంలోకి ప్రవేశించాక లక్షణాలు బయటపడడానికి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని వివరించారు. టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో శిక్షణకొత్తగూడెంఅర్బన్: రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్లలో మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటు లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత సాధించినవారు శిక్షణకు అర్హులని, ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని అడ్మిట్ కార్డు పొందాలని వివరించారు. అడ్మిషన్లు ఈ నెల 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని, పూర్తి వివరాలకు 99890 27943 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. 7న మ్యాథ్స్,సైన్స్ క్విజ్ పోటీలుకొత్తగూడెంఅర్బన్: మ్యాథ్స్ అండ్ సైన్స్ సర్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా 8, 9 తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో జరుగుతుందని, 8, 9 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరుకావాలని తెలిపారు. పాల్గొనే విద్యార్థుల వివరాలు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్కు అందించాలని కోరారు. నేడు ఐజీ పర్యటన కొత్తగూడెంటౌన్: జిల్లాలో శనివారం మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి పర్యటించనున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురం హెడ్ క్వార్టర్స్లో విలేకరులతో సమావేశం కానున్నారని ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమనీయం... శ్రీవారి కల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణం జరిపించారు. ఇటీవల నిర్మించిన వకుళామాత స్టేడియానికి శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించాక కల్యాణ క్రతువు ఆరంభించారు. ఈక్రమాన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈవో జగన్మోహన్రావు దంపతులు సమర్పించారు. -
పోక్సో కేసు నమోదు
ఇల్లెందు: స్థానిక పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పట్టణానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి చేశాడని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరాఖాన్పఠాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిపై కేసు జూలూరుపాడు: మండల కేంద్రంలోని చికెన్ సెంటర్ నడుపుతున్న నిర్వాహకుడిని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం.. జూలూరుపాడులోని చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద గుండెపుడి గ్రామానికి చెందిన బోడా శ్రీను చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. వెంగన్నపాలేనికి చెందిన తంబర్ల నరసింహారావు, జూలూరుపాడుకు చెందిన కంచెపోగు నరసింహారావు చికెన్ సెంటర్లోకి ప్రవేశించి విలేకరులమని చెప్పి సెల్ఫోన్తో వీడియోలు తీస్తూ, తమకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చనిపోయిన కోళ్లు, రోగాలతో ఉన్న కోళ్లను అమ్ముతున్నట్లు పేపర్లలో రాయడంతోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి పేర్కొన్నారు. తహసీల్లో పాము కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓ పాము కలకలం రేపింది. ఎలుకను వేటాడుతూ వచ్చిన పామును గుర్తించిన ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన స్నేక్ రెస్క్యూ సంతోష్కు సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని పామును బంధించారు. ఆ తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు ఆయన తెలిపారు. -
● సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేడుకల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్ రెడి రానున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది శనివారం నుంచే విధుల్లో ఉండాలని ఆదేశించారు. వీఐపీ, వీవీఐపీలు, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ● సకలం సిద్ధం స్వామివారి తలంబ్రాల పంపిణికీ 80, ప్రసాదాల పంపిణీకి 19 ప్రత్యేక కౌంటర్లు, 13 మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కల్యాణ మండపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ప్రత్యేక అధికారులను, పారిశుద్ద్య పనులకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రోజూ లక్షన్నర లడ్డూలను భక్తులకు అందిస్తామని, 200 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేశామని వివరించారు. రెండు రోజులపాటు భద్రాచలం, సారపాకలలో ఉన్న వైన్ షాపులను మూయించాలన్నారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు, సూచనలను అందించారు. ● అధికారులపై మంత్రి ఆగ్రహం కూనవరం రోడ్డులో కరకట్ట నిర్మాణ పనుల్లో ఆలస్యంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట పనులను పరిశీలించి మాట్లాడారు. మే 31 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్రాజు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ రమాదేవి పాల్గొన్నారు. -
● నిత్యాన్నదానానికి విరాళం
భద్రాచలంటౌన్: రామాలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శుక్రవారం భద్రాచలం పట్టణానికి చెందిన మల్లెల వెంకట శ్రీనివాస్–పార్వతి దంపతులు రూ.1,01,116 లక్ష, బీవీ సీతారామరాజు–కృష్ణవేణి దంపతులు రూ.50 వేలు విరాళం అందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ● 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు.. కొత్తగూడెంఅర్బన్: శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు వైద్య సేవలందించేందుకు జిల్లా వ్యాప్తంగా 18 ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ ఎల్.భాస్కర్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 మంది వైద్యులు, 217 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించామని, శనివారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. 5 అంబులెన్స్లు, సీపీఆర్ క్వాలిఫైడ్ ఎంఎల్హెచ్పీఎస్ను నియమించామని, ఏరియా ఆస్పత్రుల్లో 50 బెడ్లు, ప్రతి ప్రైవేటు నర్సింగ్ హోంలలో 5 బెడ్లు, అన్ని రకాల గ్రూప్ల రక్తం అందుబాటులో ఉంచామని వివరించారు. ● రేపటి నుంచి పునర్వసు దీక్షలు భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తామని ఆలయ ఈఓ ఎల్.రమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు దీక్ష విరమణ, భద్రగిరి ప్రదక్షిణ మే 3న నిర్వహిస్తామని పేర్కొన్నారు. శ్రీరామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరామ పునర్వసు దీక్షాధారణ చేయాలని కోరారు. ● నవమికి ముస్తాబైన దర్గాఇల్లెందురూరల్: సీతారాముల కల్యాణం, మహా పట్టాభిషేకం వేడుకలకు మండలంలోని హజరత్ నాగుల్మీరా దర్గా ముస్తాబైంది. దర్గాలో పద్నాలుగేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తుండగా, ఏటా హిందూ ముస్లిం భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ ఏడాది కూడా దర్గాలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దర్గా కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శనివారం దమ్మక్క వారసుల చేత గోటితో ఒలిచిన తలంబ్రాలను దర్గాలో సమర్పించనున్నారు. 6న కల్యాణం, 7న పట్టాభిషేకం నిర్వహించనున్నారు. -
వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రగిరి శ్రీసీతారామ చంద్రస్వామివారి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణాన్ని వైభవోపేతంగా జరిపారు. శ్రీ మహా విష్ణువుకి ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. గరుడాధివాసం కార్యక్రమాన్ని కమనీయంగా జరిపారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవాకాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఎటువంటి విఘ్నాలూ కలుగకుండా ఉండడానికి సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనుడికి అర్చన జరిపి, కర్మణ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహన, భ్రదక మండల ఆరాధన, ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్ఠాపన జరిపారు. ● గరుడ ప్రసాదం పంపిణీ యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకుని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్ప ం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకాలను తర్పానందంగా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేనివారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ● నేడు ఎదుర్కోలు ఉత్సవం సీతారాముల కల్యాణ వేడుకలకు ముందు వధూవరుల విశిష్టతలను వర్ణించే, గొప్పలను వివరించే ఎదుర్కోలు ఉత్సవం శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. వేడుకల్లో హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరిపై పన్నీరు, గులాల్ చల్లుతారు. భద్రాచలం దేవస్థానంలో గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. నవాహ్నిక తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, సోమవారం పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి దంపతులు, ఏఈవోలు శ్రవణ్కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు కల్యాణంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం తానీషాను స్మరిస్తూ భక్తులపై గులాల్ చల్లే విశేషం రేపు సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేకం -
బైక్ను ఢీకొన్న లారీ.. ఒకరు మృతి
దమ్మపేట: అతివేగంతో ప్రయాణిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని పట్వారిగూడెంశివారులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మపేట అర్బన్కాలనీకి చెందిన గాజుబోయిన ప్రశాంత్కుమార్ (19) తాపీ పనిచేస్తుంటాడు. శుక్రవారం సొంత పనిమీద బైక్పై దమ్మపేట నుంచి కొత్తగూడెం వెళ్లి తిరిగి వస్తున్నాడు. మండలంలోని పట్వారిగూడెం శివారుకు రాగానే పాల్వంచ వైపుకు అతివేగంగా వెళ్తున్న లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రశాంత్కుమార్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి తల్లి, సోదరి ఉన్నారు. చేతికందిన కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తల్లి శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామంలో 25 క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని అశ్వాపురం పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వంతెన వద్ద ఎస్ఐ రవూఫ్, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తుండగా టాటా ఏస్ వాహనంలో మణుగూరు నుంచి పాల్వంచ తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యానిన పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై కేసు పాల్వంచరూరల్: బాలిక బాత్రూమ్లో స్నానం చేస్తుంటే ఇంటి పక్కన ఉన్న యువకుడు కిటికిలోనుంచి చూస్తున్నాడనే ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కేశవాపురంలో గురువారం ఓ ఇంట్లోని బాత్రూమ్లో బాలిక స్నానం చేస్తుండగా పక్క ఇంటి కిటికిలో నుంచి బాలరాజు తొంగిచూడడంతో బాలిక కేకలు వేసింది. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
నవమి భక్తులకు ప్రత్యేక బస్సులు
● భద్రాచలానికి 197, అక్కడి నుండి పర్ణశాలకు 30 ● హైదరాబాద్ భక్తులకు రిజర్వేషన్ కూడా.. ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం, పట్టాభిషేకానికి హాజరయ్యే భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నారు. ఈనెల 6, 7వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుండి భద్రాచలానికి ఈ సర్వీసులు ఉంటాయి. అలాగే, హైదరాబాద్ నుండి భద్రాచలం, భద్రాచలం నుండి హైదరాబాద్కు సైతం బస్సులు ఏర్పాటు చేసి, రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవి కాక ఖమ్మం నుండి హైదరాబాద్కు ప్రతీ పది నిమిషాలకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. ఖమ్మం రీజియన్లోని డిపోల నుండి భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులు, భద్రాచలం నుండి పర్ణశాలకు 30 బస్సులు నడిపించనుండగా, భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ నేతృత్వాన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రోజు వారి సర్వీసులకు అదనం భద్రాచలం నుండి హైదరాబాద్, భద్రాచలం నుండి ఖమ్మంకు రోజువారి తిరిగే వంద సర్వీసులతో పాటు అదనంగా సర్వీసులు నడిపిస్తారు. ఈనెల 6వ తేదీన అదనంగా 35సర్వీసులు, భద్రాచలం నుంచి కొత్తగూడెంకు నిత్యం తిరిగే సర్వీసులకు తోడు అదనంగా పది బస్సులు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి భద్రాచలానికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు నడుస్తాయి. భద్రాచలం నుండి మణుగూరుకు రోజు వారీగా తిరిగే ఎనిమిది బస్సులతో పాటు అదనంగా పది బస్సులు, సత్తుపల్లి నుండి 20 బస్సులు, మధిర నుండి 17 బస్సులు, ఇల్లెందు నుండి భద్రాచలానికి ఐదు బస్సులు నడిపించనున్నారు. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు కేంద్రాలకే కాక భద్రాచలం నుండి హనుమకొండ, కరీంనగర్కు సర్వీసులు ఏర్పాటు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. కాగా, భద్రాచలం నుండి విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, ఏలూరు, కాకినాడ, అమలాపురం వైపు వెళ్లే బస్సుల కోసం జూనియర్ కాలేజ్ మైదానంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు రెండు బస్సులు నడిపిస్తామని అధికారులు వెల్లడించారు.ప్రత్యేక సర్వీసుల సమాచారం కోసం ఫోన్ నంబర్లు డిపో సెల్ నంబర్ భద్రాచలం 99592 25987ఖమ్మం కొత్త బస్టాండ్ 99592 25979మణుగూరు 89853 61796కొత్తగూడెం 99592 25982ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలంలో స్వామివారి కల్యాణం తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. రాకపోకల సమయాన ఎవరూ ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడిపిస్తాం. ఈనెల 6న భక్తుల కోసం అన్ని బస్టాండ్ల నుండి రద్దీకి అనుగుణంగా బస్సులు ఉంటాయి. అంతేకాక భద్రాచలం నుంచి ఖమ్మం, హైదరాబాద్కు రెగ్యులర్ సర్వీసులు తోడు అదనపు సర్వీసులు నడిపిస్తాం. – ఏ.సరిరామ్, ఆర్ఎం, ఖమ్మం రీజియన్ -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: శ్రీదేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆలయంలో అర్చకులు అమ్మవారికి 108 సువర్ణపుష్పాలతో పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి ) ఆలయంలో శుక్రవారం వసంత మహోత్సవాలను పురస్కరించుకుని నాదానీరాజనం, సూక్తి పారాయణ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, లక్ష కుసుమార్చన, శ్రీలలితా సహస్రనామహవనం జరిపారు. అమ్మవారికి హారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ముగిసిన కుష్ఠు బాధితుల గుర్తింపు సర్వేకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ముగిసిన కుష్ఠు వ్యాధి బాధితుల గుర్తింపు సర్వే ముగిసిందని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు వ్యాధి గ్రస్తుల గుర్తింపు సర్వే నిర్వహించామని, శుక్రవారంతో ఆన్లైన్ ప్రక్రియ కూడా ముగిసిందని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. సర్వేలో 1,702 మందిని అనుమానిత లక్షణాలు ఉన్న వారిగా గుర్తించామని తెలిపారు. 2,88,368 ఇళ్లను సందర్శించి 12,13,576 మందిని పరీక్షించామని, మొత్తం ఐదు కొత్త కేసులను గుర్తించామని వివరించారు. ప్రారంభ దశలో గుర్తించి చికిత్స పొందితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. వ్యాధి కారక క్రిమి శరీరంలోకి ప్రవేశించాక లక్షణాలు బయటపడడానికి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుందని వివరించారు. టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో శిక్షణకొత్తగూడెంఅర్బన్: రాష్ట్రంలోని హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్లలో మే 1 నుంచి జూన్ 11వ తేదీ వరకు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటు లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత సాధించినవారు శిక్షణకు అర్హులని, ఆన్లైన్ దరఖాస్తు చేసుకుని అడ్మిట్ కార్డు పొందాలని వివరించారు. అడ్మిషన్లు ఈ నెల 17 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని, పూర్తి వివరాలకు 99890 27943 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. 7న మ్యాథ్స్,సైన్స్ క్విజ్ పోటీలుకొత్తగూడెంఅర్బన్: మ్యాథ్స్ అండ్ సైన్స్ సర్కిల్స్ కార్యక్రమాల్లో భాగంగా 8, 9 తరగతుల విద్యార్థులకు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో జరుగుతుందని, 8, 9 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని, అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరుకావాలని తెలిపారు. పాల్గొనే విద్యార్థుల వివరాలు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్కు అందించాలని కోరారు. నేడు ఐజీ పర్యటన కొత్తగూడెంటౌన్: జిల్లాలో శనివారం మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి పర్యటించనున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రాపురం హెడ్ క్వార్టర్స్లో విలేకరులతో సమావేశం కానున్నారని ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కమనీయం... శ్రీవారి కల్యాణం ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణం జరిపించారు. ఇటీవల నిర్మించిన వకుళామాత స్టేడియానికి శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించాక కల్యాణ క్రతువు ఆరంభించారు. ఈక్రమాన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈవో జగన్మోహన్రావు దంపతులు సమర్పించారు. -
వానాకాలంలో 6,03,124 ఎకరాల్లో సాగు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రాబోయే వానాకాలం పంటల విస్తీర్ణాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత వానాకాలం సీజన్ కంటే ఈసారి పంటల విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. గత వానాకాలంలో 5,92,264 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను రైతులు సాగు చేయగా వచ్చే వానాకాలంలో 6,03,124 ఎకరాలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. ఎప్పటిలాగే వరి, మొక్కజొన్న, పత్తి, ఆయిల్పామ్ పంటల విస్తీర్ణం అధికంగా ఉంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రోత్సాహంతో గతేడాది 550 ఎకరాల్లో మునగ సాగు చేయగా, ఈసారి 2,500 ఎకరాలకు చేరుకోనుంది. మునగ సాగు పెరిగే అవకాశం కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలో వచ్చే వానాకాలంలో మునగసాగు పెరగనుంది. గత సంవత్సరం మునగసాగు కంటే మరో నాలుగురెట్లు ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉంది. లాభదాయకమైన పంట కావడంతో రైతులు మక్కువ చూపుతున్నారు. –వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారివచ్చే సీజన్పై అంచనా వేసిన వ్యవసాయ శాఖగత, రానున్న వానాకాలం సీజన్లలో పంటల విస్తీర్ణం వివరాలు.. పంట గత సీజన్ రానున్న సీజన్ ఆగ్రో ఫారెస్ట్రీ 28,414 28,982 వరి 1,64,663 1,60,956 మొక్కజొన్న 85,828 85,544 పత్తి 2,03,561 2,04,632 వేరుశెనగ 2,736 2,791 పండ్ల మొక్కలు 9,995 10,195 జీడిపప్పు 11,670 11,903 కోకోవ 640 652 కొబ్బరి 1,769 1,805 ఆయిల్పామ్ 63,486 75,000 మినుము 840 857 పెసర 128 131 కంది 1,136 1,159 మిర్చి 10,284 10,489 కూరగాయలు 492 501 ఇతర పంటలు 6,073 5,025 మునగ 550 2,500 మొత్తం 5,92,264 6,03,124 -
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. ఏరియాలోని జేవీఆర్ఓసీ–2లో 10 వేల టన్నులు, కిష్టారం ఓసీలో 3 వేల టన్నులతోపాటు కిష్టారం ఓసీలో 1500 క్యూబిక్ మీటర్ల ఓబీ, జేవీఆర్ఓసీ–2లో 50 వేల క్యూబిక్ మీటర్ల ఓబీకి అంతరాయం వాటిల్లింది. ఎన్డీ జిల్లా కార్యదర్శి రమేశ్ విడుదల ఇల్లెందు: సీపీఐ (ఎంఎల్) ఎన్డీ జిల్లా కార్యదర్శి, ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ ఎల్లాపురం గ్రామానికి చెందిన పూనెం బాబు అలియాస్ రమేశ్ శుక్రవారం ఖమ్మం జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. గత నవంబర్ 28న ఆయన్ను ఇంటి వద్ద గుండాల పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. 20 ఏళ్లుగా ఉద్యమంలో, ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న రమేశ్ పలు దఫాలు జైలు జీవితం గడిపారు. లింగన్న ఎన్కౌంటర్ తర్వాత ఎన్డీ దళాలు క్రమక్రమంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయినా రమేశ్ మాత్రం అజ్ఞాతం వీడలేదు. అనారోగ్యంతో ఇంటికి చేరిన ఆయన పోలీసులకు చిక్కి నాలుగు నెలల నాలుగు రోజులు ఖమ్మం జైలులో గడిపారు. ఆయనపై ఇల్లెందు, బోడు, ఆళ్లపల్లి, గుండాల పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులున్నాయి. ఎన్డీ నేతలు పొడుగు నర్సింహారావు, టి.నాగేశ్వరరావు స్వాగతం పలికారు. వచ్చే నెల 19న ఆత్మలింగేశ్వరాలయం ప్రతిష్ఠాపన పాల్వంచ: పాల్వంచలోని చింతలచెర్వు వద్ద ఉన్న ప్రాచీన ప్రముఖ శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో మే 15 నుంచి 19వ తేదీ వరకు జీర్ణోధరణ పూర్వక ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు కార్యక్రమాల కరపత్రాలను శుక్రవారం విడుదలచేసిన ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు మాట్లాడారు. కాకతీయుల పరిపాలనలో ప్రతాపరుద్రుడి హయాంలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ప్రతిష్ఠాపనకు కాకతీయ వారసుడు కమల్చంద్బంజ్దేవ్, పాల్వంచ సంస్థానాదీళుల వారసులు కృష్ణకుమార్ అప్పారావు అశ్వరాయ, మధుకుమార్ అప్పారావు అశ్వరాయ, అశ్వారావుపేట పరగణాధిపతుల వారసులు దామెర కుమారమురళి మహిపాల్ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. వచ్చేనెల 19వ తేదీన ఆదిశంకరాచర్య హంపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతీ మహాస్వామి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాకుంభాభికం ఉంటాయని తెలిపారు. సమావేశంలో యల్లావులు కోటేశ్వరరావు, యల్లావుల వెంకన్న, వల్లపు యాకయ్య, రమణ, ఫణి, సాంబయ్య, అచ్యుత్ రావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఆదివారం జరగనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ అధికారుల నుంచి భద్రాచలం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పవన్కల్యాణ్ శనివారం సాయంత్రమే భద్రాచలం చేరుకునే అవకాశముందని, ఆదివారం ఉదయం కల్యాణాన్ని తిలకించాక తిరిగి వెళ్తారని సమాచారం. అంతేకాక పలువురు కేంద్ర మంత్రులు, టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు కూడా భద్రాచలం రానున్నట్లు తెలిసింది. డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి పాల్వంచ: మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన కొంపెల్లి వెంకటేశ్వర్లు (55) గురువారం రాత్రి మద్యం సేవించాడు. అనంతరం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో డ్రెయినేజీలో పడ్డాడు. వర్షం వల్ల డ్రెయినేజీ పొంగింది. వెంకటేశ్వర్లు బయటకు రాలేక మృతి చెందాడు. స్థానికులు కొంత సేపటి తర్వాత గుర్తించి, బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య స్వరూప శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలున్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్యం వల్లే మృతి నవభారత్ వైన్స్ సమీపంలో డ్రెయినేజీ ఓపెన్ చేసి ఉండటంతో రాత్రి వేళ కనిపించక వెంకటేశ్వర్లు అందులో పడి మృతి చెందాడని, ఇది మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రెయినేజీ శుభ్రం చేసేందుకు పైకప్పును సిబ్బంది పగులగొట్టారని, అనంతరం అలానే వదిలేశారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. -
‘పెదవాగు’ ఆనకట్టకు మట్టి పరీక్షలు
అశ్వారావుపేటరూరల్: పెదవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు స్థానిక నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో శుక్రవారం మట్టి(సాయిల్) పరీక్షలు చేశారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా మండల పరిధిలోని గుమ్మడవల్లి వద్ద ఉన్న పెదవాగు ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ తిరిగి నిర్మించేందుకు నీటిపారుదల శాఖ రూ.90 కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రూ.40 కోట్ల నిధులను కేటాయించారు. ప్రాజెక్టు రీడిజైన్ ప్రకారంలో ఇప్పుడు ఉన్న మూడు గేట్లతోపాటు అదనంగా మరో ఐదు గేట్లతో నిర్మించేలా ప్రతిపాదించారు. దీంతో అదనపు గేట్ల నిర్మాణానికి ఆనకట్ట వద్ద అనువుగా ఉందా.? లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు చేపట్టారు. యంత్రాల సాయంతో భూగర్భంలో నుంచి మట్టి బయటకు తీస్తున్నారు. ఇలా సేకరించిన మట్టి హైదరాబాద్లోని పరీక్షా కేంద్రానికి పంపిస్తామని, అక్కడి నుంచి వచ్చే నివేదిక ప్రకారం ముందుకెళ్తామని స్థానిక నీటి పారుదల శాఖ ఏఈఈ శ్రీనివాస్ తెలిపారు. -
అడవికి నిప్పు.. నిర్లక్ష్యంతో ముప్పు
అశ్వారావుపేటరూరల్: వేసవి నేపథ్యంలో చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా పర్యావరణానికి, అటవీ సంపదకు తీరని ముప్పు వాటిల్లుతుంది. అశ్వారావుపేట ఫారెస్టు రేంజ్ పరిధిలోని ఊట్లపల్లి బీట్, వేదాంతపురం రిజర్వు ఫారెస్టులో ప్రధాన రహదారి పక్కనే మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు చెలరేగుతూ, వ్యాపించడంతో ఫారెస్టులోని చెట్లు కాలిపోగా పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. దట్టమైన పొగ కారణంగా ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు అవస్థలు పడ్డాల్సి వచ్చింది. కాగా, మంటల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ఫారెస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వాచర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
● భక్తుల మన్ననలు పొందాలి
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాల్లో సక్రమంగా విధులు నిర్వహించి భక్తుల మన్ననలు పొందాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. లైజన్, సెక్టోరియల్ అధికారులతోపాటు వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లను, అనారోగ్యంతో ఉన్న వారి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులు అస్వస్థతకు గురైతే సమీపంలోని వైద్య శిబిరానికి తరలించాలన్నారు. విధుల్లో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత కలెక్టర్ రామయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఐటీడీఏ పీవో బి. రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీఓ విద్యాచందన, ఆర్డీఓ దామోదర్ రావు, ఈఓ ఎల్.రమాదేవి పాల్గొన్నారు. -
భద్రాద్రి రామా.. కనవేమి ఈ కష్టాలు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ఘనతకెక్కిన భద్రాచలంలో రాములోరి భక్తులకు సీతమ్మ కష్టాలు తప్పటం లేదు. శతాబ్దాలుగా పెద్దగా అభివృద్ధికి నోచుకోకపోవటంతో ప్రధాన ఉత్సవాల సమయంలో తరలివచ్చే లక్షల మంది భక్తులకు మౌలిక వసతులలేమి తీవ్ర సమస్యగా మారుతోంది. శ్రీరామ నవమి వంటి ఉత్సవాల సమయంలో సామాన్య భక్తులకు కనీసం తలదాచుకొనేందుకు చోటు లేక గోదావరి ఇసుక తిన్నెలు, కరకట్ట వెంట సేద తీరాల్సి వస్తోంది. 17వ శతాబ్దంలో కుతుబ్షాహీల కాలంలో భద్రగిరిపై కంచర్ల గోపన్న నిర్మించిన ఆలయం ప్రధాన గోపురానికి కొద్దిపాటి మార్పులు తప్ప పూర్తిస్థాయిలో దేవస్థానాన్ని ఆధునీకరించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యాదగిరిగుట్ట ఆలయంతో పాటు భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది. ప్రముఖ అర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్ప్లాన్ సైతం సిద్ధం చేశారు. కానీ, అభివృద్ధి పనుల శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. అదే సమయంలో యాదగిరిగుట్ట ఆలయ పునఃనిర్మాణం మాత్రం పూర్తయింది. మాస్టర్ప్లాన్లో మళ్లీ కదలిక పదేళ్లుగా మూలన పడిన మాస్టర్ ప్లాన్ను కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీ మేరకు మళ్లీ బయటికి తీసింది. ఈ నెల 6న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పట్టువ్రస్తాలు సమర్పించడానికి సీఎం రేవంత్రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిలో ప్రధానమైన మాడ వీధుల విస్తరణకు భూ, ఇళ్ల నిర్వాసితుల పరిహారం కోసం ప్రభుత్వం రూ.34 కోట్లు విడుదల చేసింది. ఈ అభివృద్ధి పనులకు 6న సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశముంది. మాస్టర్ప్లాన్లో ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాలు, మౌలిక వసతులకు చోటు కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. వసతులు కల్పిస్తే మరింత ఆదరణ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తే భద్రాచలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. భద్రాచలంలో ఏటా ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వీటికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతోపాటు భద్రాచలం ఏజెన్సీలో ప్రకృతి అందాల వీక్షణకు పర్యాటకులు వస్తున్నారు. కానీ, సరిపడా వసతులు లేక వారు ఇబ్బందులు పడుతున్నా రు.ఉత్సవాల సమయంలో భద్రాచలంలోని వసతి గదులు ముప్పావు భాగం విధుల కోసం వచ్చే సిబ్బందికే సరిపోతా యి. కాటేజీలు దాతలకు, వీఐపీలకే పరిమితం. దీంతో రెండురోజుల వసతి కోసం ప్రైవేటు లో రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు వెచ్చించలే ని సామాన్య భక్తులు గోదావరి ఇసుక తిన్నెలు, కరకట్ట ప్రాంతాల్లో సేద తీరుతున్నారు. ప్రధాన ఆలయం, గోదావరి, ఉపాలయాలను కలిపి స్పెషల్ కారిడార్ రూపొందిస్తే భక్తులు, పర్యాటకుల రాక పెరుగుతుందని స్థానికులు అంటున్నారు. ‘భద్రాచలం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ స్పెషల్ అథారిటీ’ని ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. 1964లో సీతారాముల కల్యాణం కోసం నిర్మించిన మిథిలా స్టేడియం నేడు సరిపోవటంలేదు. ఈ స్టేడియాన్ని పునఃనిర్మించి, గోదావరి నుంచి మోతెగడ్డ ద్వీపంలోని శివాలయానికి బోటింగ్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. అలాగే, పర్ణశాల ఆలయ అభివృద్ధిపైనా దృష్టి సారించాలని, కరకట్టపై సోలార్ షెడ్ నిర్మిస్తే భక్తులకు నీడతో పాటుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సూచిస్తున్నారు. శ్రీరామ నవమికి పటిష్ట భద్రత క్యూఆర్ కోడ్తో భద్రగిరి సమస్త సమాచారం భద్రాచలం అర్బన్/కొత్తగూడెంటౌన్: భద్రాచలంలో ఈనెల 6న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు 200 మంది సిబ్బందితో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజు వెల్లడించారు. ఈనెల 6న శ్రీసీతారాముల కల్యాణం, 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో భక్తుల భద్రత కోసం పోలీసు శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్కింగ్ స్థలాలు, ఆలయం, కల్యాణ మండపం, లడ్డూ, తలంబ్రాల కౌంటర్లను చేరుకోవడంతో పాటు తాగునీటి వసతి ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ రూపొందించామని వెల్లడించారు. అంతేకాక ఆన్లైన్ లింక్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. వీటి ద్వారా భక్తులు సులభంగా తమకు అవసరమైన ప్రాంతాలకు చేరుకోవచ్చని చెప్పారు. రెండు రోజులపాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విధించే ఆంక్షలకు భద్రాచలం పట్టణవాసులు సహకరించాలని ఎస్పీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య ● వివరాలు వెల్లడించిన మానుకోట ఎస్పీ సుధీర్రాంనాథ్ మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం గ్రామ శివారు బోరింగ్తండా సమీపంలో గత నెల 31వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన పార్ధసారథి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్యే.. తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం.. భద్రాచలంలోని జగదీశ్ కాలనీకి చెందిన తాటి పార్థసారథి, స్వప్న దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వప్నకు తన తల్లిగారి ఇంటి సమీపంలో అద్దెకు ఉండే, ఏపీలోని ఎటపాక మండలం నెల్లిపాకలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం పార్థసారథికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. రూ. 5 లక్షలకు సుపారీ.. పార్థసారథికి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎంజేపీలో హెల్త్ సూపర్వైజర్ ఉద్యోగం రాగా గతేడాది ఫిబ్రవరి నుంచి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వివాహేతర సంబంధానికి భర్త అడ్డు ఉన్నాడని, అతడిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్కు చెప్పింది. దీంతో అతడు కొత్తగూడేనికి చెందిన తెలుగూరి వినయ్కుమార్, శివశంకర్, ఎటపాక మండలానికి చెందిన వంశీతో మాట్లాడి హత్య చేయించాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులకు రూ.5 లక్షలకు సుపారీ ఇచ్చాడు. సెలవులకు వచ్చి వెళ్తుండగా.. ఉగాది, రంజాన్ సెలవుల కోసం పార్థసారథి భద్రాచలం వచ్చి, మార్చి 31న సాయంత్రం దంతాలపల్లికి వెళ్లే క్రమంలో కొత్తగూడెంలో దంపతులు షాపింగ్ చేశారు. అనంతరం పార్థసారథి తన బైక్పై బయలుదేరాక స్వప్న తన ప్రియుడికి సమాచారం అందించింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును అద్దెకు తీసుకుని పార్థసారథిని వెంబడిస్తూ బోరింగ్తండా సమీపంలో అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో స్వప్న, వెంకట విద్యాసాగర్లను అరెస్ట్ చేయగా వినయ్కుమార్, శివశంకర్, వంశీ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడాది క్రితం పార్థసారథిపై దాడి జరిగిన ఘటనలో రెక్కీ నిర్వహించినట్లు కూసం లవరాజు అనే వ్యక్తిని గుర్తించగా అతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు సర్వయ్య, సూర్యప్రకాశ్, హథీరాం,నరేందర్, రవికుమార్, ఎస్సైలు దీపిక, మురళీధర్, సతీశ్, ఐటీకోర్ పీసీ సుమన్, క్లూస్టీం, డాగ్స్క్వాడ్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
భారీ వర్షం.. రైతుల ఆందోళన
మణుగూరు టౌన్/చర్ల/పాల్వంచరూరల్/గుండాల/అశ్వాపురం/టేకులపల్లి/ఇల్లెందు: జిల్లాలోని పలు చోట్ల గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వస్తున్న గాలి దుమారానికి తోడు రాత్రి వర్షం పడింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. మణుగూరు, చర్ల, పాల్వంచ, గుండాల, ఆళ్లపల్లి, అశ్వాపురం, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో వర్షం కురిసింది. దీంతో పంటలను కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పుకుని పంటలను కాపాడుకున్నారు. అయినా కొన్ని చోట్ల ధాన్యం, మిర్చి స్వల్పంగా తడిసింది. చేతికి అందిన మొక్క జొన్న చేన్లు పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వరద నీటితో టేకులపల్లి ప్రధాన రహదారి సెంటర్ చెరువులా మారింది. పలు దుకాణాల్లోకి వరద నీరు చేరింది. మణుగూరులో రోడ్లు జలమయంగా మారాయి. సింగరేణిలో సెకండ్, నైట్ షిఫ్ట్ల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. -
శిథిల ఇళ్లకు నోటీసులు
భద్రాచలంఅర్బన్: పట్టణంలో శిథిలావస్థలో ఉన్న 23 ఇళ్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భద్రాచలంలో పోకల వీధిలో నివాసం ఉండే శ్రీపతి శ్రీనివాస్ అనే వ్యక్తి తన పాత ఇంటిపై మరో ఐదంతస్తులు నిర్మాణం చేపట్టి, పనులు పూర్తి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న 23 ఇళ్లను గుర్తించి, సంబంధిత యజమానులకు నోటీసులిచ్చారు. ఏజెన్సీ ప్రాంతం భద్రాచలంలో అనధికారికంగా (జీ+3)గా నిర్మించిన 131 ఇళ్లను గుర్తించారు. వారిలో 20 మంది ఇంటి యజమానులకు గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు అందించారు. -
కదల్లేక.. కాలిపోయి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : మండలంలోని ఎర్రగుంట గ్రామశివారు తాలుక్దార్బంజర్లో బుధవారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి రెండిళ్లు దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. గ్రామానికి చెందిన ఎస్కే గౌస్పాష ఇంట్లోని విద్యుత్ స్విచ్బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి మంటల చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న అందరూ లేచేసరికి మంటలు ఇల్లంతా వ్యాపించాయి. కుటుంబీకులు కేకలు వేసుకుంటూ బయటకు పరుగెత్తారు. కానీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌస్పాష (35) మంటల్లో చిక్కుకున్నాడు. అగ్ని కీలలు ఇల్లంతా వ్యాపించడంతో అతన్ని బయటకు తీసుకొచ్చే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అతడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మృతుడికి భార్య హసీనా, ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. కాగా మంటలు పక్కనే ఉన్న తాపీమేసీ్త్ర యాకుబ్ ఇంటికి వ్యాపించాయి. చూస్తుండగానే రెండు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. గౌస్పాష ఇంట్లో రూ. 30 వేలు నగదు, ఇద్దరి ఇళ్లలో సామగ్రి అగ్నికి ఆహుతైంది. అర్ధరాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో మంటలు ఆర్పే పరిస్థితి లేకపోయింది. స్థానికుల సమాచారంతో కొత్తగూడెం నుంచి వచ్చిన ఫైరింజన్ ఇతర ఇళ్లకు నష్టం జరగకుండా మంటలను అదుపుచేసింది. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎమ్మెల్యే జారే పరామర్శ బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఆర్ఐ మధు సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టం అంచనా వేశారు. తక్షణసహాయం కింద బాధిత కుటుంబాలకు చెరో రూ. 5 వేలు నగదు, 30 కేజీల బియ్యం అందించారు. మంటల్లో వ్యక్తి సజీవ దహనం -
‘కాలుష్య’ అనుమతులు రాగానే ఉత్పత్తి ప్రారంభం
సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం శాలెంరాజు సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిందని, ప్రస్తుతం కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతుల ప్రక్రియ సాగుతోందని సింగరేణి ఏరియా జీఎం ఎం.శాలెంరాజు తెలిపారు. అవి వచ్చిన మూడు మాసాల్లో వీకే–7 ఓసీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అనుమతులు రాగానే మట్టి పనులు ప్రారంభించి వీలైనంత త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఓసీకి సంస్థ నిర్దేశించిన 10 లక్షల టన్నుల లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. కొత్తగూడెం ఏరియాకు గత ఆర్థిక సంవత్సరంలో వీకే–7ఓసీ మినహాయించి ఏరియాలో 143.50 లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 144.18 లక్షల టన్నుల బొగ్గు వెలికితీశామని వివరించారు. అధికారులు శ్రీరమేష్, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. -
● మూడు, నాలుగు నెలలుగా తెలంగాణ, ఏపీ సరిహద్దు గ్రామాల్లో పనులు ● మిర్చి కోతలు చివరి దశకు చేరడంతో తిరిగి వెళ్తున్న ఛత్తీస్గఢ్ ఆదివాసీలు ● విప్ప పూలు రాలే సీజన్ కావడంతో వడివడిగా గూడేల వైపు అడుగులు
సరుకులు ఇక్కడి నుంచే.. ఛత్తీస్గఢ్లోని ఆదివాసీ గ్రామాల్లో నిత్యావసర సరుకుల కొనుగోలుకు సరైన దుకాణాలు ఉండవు. ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలోనే ఆదివాసీలు వర్షాకాలం మొత్తానికి సరిపడా సరుకులను కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. దీంతో చర్లలోని దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. గత ఆదివారం కూడా చర్లలో జరిగిన వారపు సంతలో బియ్యం, నూకలు ఇతర నిత్యావసరాల విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. ఆదివాసీ యువకులు మొబైల్ ఫోన్లు, రేడియోలు, వాచ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మిర్చి కోత పనులకు వలస వచ్చిన ఆదివాసీలు తిరిగి ఇళ్లకు చేరుకుంటుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మిర్చి కోతలు పూర్తి కావడంతో స్వగ్రామానికి వెళ్తున్న ఆదివాసీలు డిసెంబర్, జనవరిలలో వచ్చి.. సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని అటవీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీలు స్వగ్రామాల్లో పనుల్లేక డిసెంబర్, జనవరి నెలల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు మిర్చి కోతల కోసం తరలివచ్చారు. తోటలకు సమీపంలోని వాగులు, నదులు, చెరువుల ఒడ్డునే తాత్కాలికి నివాసాలను ఏర్పాటు చేసుకుని మూడు, నాలుగు నెలలపాటు పనులు సాగించారు. రోజుకు రూ. 300 మేర కూలి చేసుకుంటూ ఒక్కొక్కరు రూ. 20 వేల నుంచి రూ. 22 వేల మేర సంపాదించుకున్నారు. విప్ప పూలు రాలుతుండటంతో.. మిర్చి కోత పనులు చివరి దశకు చేరాయి. మరోవైపు ప్రకృతి సహజసిద్ధంగా లభ్యమయ్యే పంట విప్పపూలు రాలుతున్నాయి. దీంతో వాటిని ఏరుకుని విక్రయించునేందుకు ఆదివాసీలు తమ గ్రామాలకు తరలివెళ్తున్నారు. రైతులు ఏర్పాటు చేసిన వాహనాల్లో గూడేలకు తరలిపోతుండగా అటవీ ప్రాంత రహదారులు సందడిగా మారాయి. దగ్గర గ్రామాలవారు కాలినడకనే వెళ్తున్నారు. బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లే కుర్నపల్లి, తిప్పాపురం, పూసుగుప్ప రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. వారం రోజుల నుంచి ఆదివాసీలు తిరిగి పయనమవుతున్నారు. పోషణ కోసం పోరాటం ప్రతీ సంవత్సరం మిర్చి కోతల సీజన్లో పనుల కోసం వస్తాం. పొట్టపోషణ కోసం మూడు, నాలుగు నెలల పాటు పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలి వస్తాం. ఇక్కడ పని చేసి వచ్చిన డబ్బులతో వర్షాకాలానికి సరిపడా సరుకులన్నీ కొనుక్కొని వెళ్తాం. –పొడియం సింగ, డోకుపాడుపనుల్లేక ఇక్కడికి వచ్చాం మా దగ్గర పనులు ఏమీ ఉండక పోవడం వల్ల పొరుగున ఉన్న ప్రాంతాలకు కూలి పనులకు పోతాం. ఏటా ఇదే మా జీవన విధానం. పనులు పూర్తవ్వడంతో ఇళ్లకు చేరి పిల్లలు, పెద్దలతో సంతోషంగా గడుపుతాం. –కుంజం దేవి, తెట్టెమడుగు -
దార్శనికుడు మాజీ ప్రధాని వాజ్పేయి
చుంచుపల్లి: దేశ అభివృద్ధిలో నవశకానికి నాంది పలికిన దార్శనిక నేత మాజీ ప్రధాని వాజ్పేయి అని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో వారు మాట్లాడారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యం, విలువల ఆధారిత రాజకీయాలను బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గోలి మధుసూదన్ రెడ్డి, ఉపేందర్ సింగ్, లక్ష్మి, ఎల్లంకి మురళీమోహన్, సుబ్బారావు, పైడిపాటి రవీందర్, జీవికే మనోహర్, కుంజా ధర్మరావు, డాక్టర్ విజయ లక్ష్మి, సీతారామరాజు, బాలరాజు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.రామయ్యకు విరివిగా తలంబ్రాల సమర్పణభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి కల్యాణ మహోత్సవంలో వినియోగించే తలంబ్రాలను రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు విరివిగా సమర్పిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని గోటితో వలిచి రామయ్యకు అందించేందుకు రోజూ భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామ కోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలను తెచ్చి ఆలయంలో అందించారు. రాజమండ్రికి చెందిన రామ భక్తులు కూడా కోటి గోటి తలంబ్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్, ఉప ప్రధాన అర్చకులు అమరవాది మురళీ కృష్ణమాచార్యులకు, శ్రీరామానుజ శ్రీనివాసాచార్యులు, భక్తుడు రామకోటి రామరాజు పాల్గొన్నారు. సరైన పత్రాలు చూపి వాహనాలు తీసుకెళ్లండికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులతో సంబంధం ఉన్న 116 ద్విచక్ర వాహనాలు, 10 ఇతర వాహనాలు హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లలో ఉంచినట్లు జిల్లా పోలీస్ మోటార్ వాహనాల అధికారి ఓ.సుధాకరరావు తెలిపారు. సరైన పత్రాలు చూపి వారి వాహనాలను శుక్రవారం నుంచి 6 నెలలలోపు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. పత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో సమర్పించి, అక్కడి నుంచి రుజువు పత్రాన్ని తీసుకుని, మోటారు వాహనాల అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అన్క్లెయిమ్డ్ వాహనాల జాబితా జిల్లా పోలీస్ సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచినట్లు పేర్కొన్నారు. రామాలయంలో మాక్ డ్రిల్భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం భద్రాచలం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న సిబ్బంది స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, దేవస్థానం ఎస్పీఎఫ్, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. తాలిపేరు ప్రాజెక్ట్కు మరమ్మతులు..ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ చర్ల: తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్కు, కాలవలకు మరమ్మతులు చేపట్టాలని ప్రాజెక్టు ఈఈ సయ్యద్ అహ్మద్ జానీ అధికారులకు సూచించారు. గురువారం ఆయన తాలిపేరుతోపాటు ప్రధాన కాలువను పరిశీలించారు. రెండో జోన్లో రైతులు సాగు చేసిన పంటలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత రబీలో రెండో జోన్కు సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. సాగు చివరి దశకు చేరిందని, ఈ నెల 10 తర్వాత సాగునీటి విడుదలను నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలన్నారు. కాలువపై అండర్ టన్నెల్ నిర్మాణ పనులను చేపట్టి వర్షాకాలం ఆరంభమయ్యేలోపు పూర్తి చేయాలని డీఈ తిరుపతిని ఆదేశించారు. ఏఈలు ఉపేందర్, సంపత్, సిబ్బంది ఉన్నారు. -
ఘనంగా ధ్వజపట లేఖనం
నేడు రామాలయంలో ధ్వజారోహణం భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గరుడాధివాసం, ధ్వజపట లేఖనం కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మను జీయర్ మఠంలో ఆలయ అర్చకులు వస్త్రంపై లిఖించారు. ప్రత్యేక పూజల అనంతరం గరుత్మంతుడి చిత్రపటానికి హారతి సమర్పించారు. ఈ సందర్భంగా దేవనాథ జీయర్ స్వామి భక్తులకు ప్రవచనం అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుఃస్థానార్చన జరపనున్నారు. ఈ సందర్భంగా సంతాన ప్రాప్తి కోసం మహిళలకు గరుడ ప్రసాదాన్ని అర్చకులు అందజేస్తారు. పూజల్లో ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, స్థానాచార్యులు స్థలశాయి తదితరులు పాల్గొన్నారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నాదనీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, లక్ష కుసుమార్చన, శ్రీలలితా సహస్ర నామ హవనం తదితర కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన సమర్పించి హారతి ఇచ్చాక అర్చకులు మంత్రపుష్పం పఠించారు. రామయ్యను దర్శించుకున్న కేరళ ఐఏఎస్ అధికారి భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి సాయికృష్ణ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వాగతం పలకగా, ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్కుమార్, పీఆర్ఓ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో నేడు తుమ్మల పర్యటనభద్రాచలం: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ రూట్ మ్యాప్ను గురువారం విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు సుభాష్నగర్లో నిర్మాణం చేపడుతున్న కరకట్ట పనులను పర్యవేక్షిస్తారని, 10:30 గంటలకు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లు పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉత్సవాల నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. రేపటి వరకు తేలికపాటి వర్షాలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 5వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ వి.నారాయణమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు కోసి ఆరబెడుతున్న పంట ఉత్పత్తులపై టార్పాలిన్లు కప్పుకోవాలని, కోత దశలో ఉన్న పంటలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
పరిశ్రమలు స్థాపించాలి
సంపద పెంచేకలెక్టర్ జితేష్ వి పాటిల్సూపర్బజార్(కొత్తగూడెం): వ్యవసాయ భూముల్లో ఫామ్పాండ్ల నిర్మాణంతో రైతులు ఆర్థికాభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా సంపద పెరిగే పరిశ్రమలు స్థాపించేలా రైతులు, యువతను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తమ భూముల్లో ఫాంపాండ్ల నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ భూముల్లో సుమారు 52వేల బోర్లు ఉన్నాయని, కనీసం 50వేల ఫామ్ పాండ్లు ఉండాలని అన్నారు. తద్వారా చేపలు, అజొల్లా పెంపకం వంటి వాటి ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని చెప్పారు. ఉపాధిహామీ కూలీలందరికీ జీవనజ్యోతి, జీవన సురక్ష పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, హౌసింగ్ పీడీ శంకర్, డీపీఓ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఈఈలు నళిని, తిరుమలేష్, ఎస్సీ సంక్షేమాధికారి అనసూయ, బీసీ సంక్షేమాధికారి ఇందిర పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య జీవితం ఆదర్శం.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య చూపిన స్పూర్తి నేటి తరాలకు ఆదర్శమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన దొడ్డి కొమరయ్య జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాగ సాయుధ పోరాటంలో మొదట గుర్తుకొచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. 1927లో ఉమ్మడి వరంగల్ జిల్లా కడివెండిలో జన్మించిన ఆయన మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు. అంతకుముందు కొమరయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, బీసీ సంక్షేమాధికారి ఇందిర, కలెక్టరేట్ ఏఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పెదవాగును సందర్శించిన ఏపీ అధికారులు
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్ద గల పెదవాగు ప్రాజెక్టును గురువారం ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు సందర్శించారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తెలంగాణ, ఏపీ ఉమ్మడి పరిధిలో ఉండడంతో ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించి ఆయకట్టు రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఏపీ వాటా నిధుల కేటాయింపు, మరమ్మతులు పూర్తి చేస్తే ఏపీలోని ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం తదితర అంశాలపై చర్చించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో జరిగే గోదావరి రివర్ బోర్డు సమావేశానికి హాజరై, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు నీటిపారుదల శాఖ ఎస్ఈ నాగార్జునరావు, నీరు–ప్రగతి పథకం ఎస్ఈ వెంకటస్వామి, స్థానిక ఐబీ డీఈఈ కృష్ణ, ఏఈఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అధునాతన హంగులతో రీడింగ్ రూమ్లు
భద్రాచలంటౌన్: నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అధునాతన హంగులతో రీడింగ్ రూమ్స్ను నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ వెల్లడించారు. భద్రాచలం తాత గుడి సెంటర్లోని గ్రంథాలయాన్ని గురువారం సాయంత్రం సందర్శించిన ఆయన రీడింగ్ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రంథాలయంలో నిరుద్యోగులకు కావాల్సిన పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు తమకు తెలిసిందన్నారు. దీంతో వంద మంది ఒకేసారి చదువుకునేలా హాల్ నిర్మిస్తున్నామని, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సౌకర్యం కల్పించడమే కాక టేబుళ్లు, కుర్చీలు సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్, డి.హరీష్, టీఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ‘యువ వికాసం’ను సద్వినియోగం చేసుకోవాలి గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకో వాలని పీఓ రాహుల్ సూచించారు. గిరిజన నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయాల్లో ఈనెల 14వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
‘నవమి’కి అన్ని శాఖలూ సన్నద్ధం
● ఏపీ, తెలంగాణ నుంచి భద్రాచలానికి 300 బస్సులు.. ● 16 ప్రథమ చికిత్స కేంద్రాలు, 52 మంది వైద్యులు, 178 మంది సిబ్బంది విధులు ● 66 మందితో అగ్నిమాపక శాఖ, 15 మందితో సింగరేణి రెస్క్యూ టీమ్ ● ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన టూరిజం శాఖ భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈనెల 6,7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారి కల్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. దీంతో ఖమ్మం ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి ఈనెల 5, 6, 7 తేదీల్లో 200 బస్సులు ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా ఏపీ నుంచి మరో 100 బస్సులు రానున్నాయని భద్రాచలం ఆర్టీసీ డీఎం తిరుపతి తెలిపారు. ఇంకా భద్రాచలం నుంచి కూకట్పల్లికి రెండు, మియాపూర్కు రెండు సర్వీసులు నడిపిస్తున్నట్లు చెప్పారు. భద్రాచలం బస్టాండ్లో 6వ తేదీన రెడ్డిసత్రం వారి సౌజన్యంతో రెండు వేల మంది భక్తులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామని, ఐటీసీ సహకారంతో మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నామని వివరించారు. ఇప్పటికే బస్టాండ్లో ఒక చలివేంద్రం ఏర్పాటు చేశామని, మరికొన్ని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు రోజులు వైద్య సేవలు.. శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఏమైనా అనారోగ్య సమస్య ఎదురైతే వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమైంది. గతంలో భద్రాచలంలో ఎనిమిది, పర్ణశాలలో రెండు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈ ఏడాది వాటిని 16కు పెంచారు. తొలిసారి సారపాకలో సైతం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య తెలిపారు. కల్యాణాన్ని వీక్షించే ప్రతి సెక్టార్లో ఒక వైద్యుడితో పాటు నలుగురు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, ఇలా మొత్తం 52 మంది వైద్యులు, 178 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. అత్యవసర సేవల కోసం 50వేల ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయగా, భక్తుల కోసం 50 బెడ్లతో ప్రత్యేక వార్డు, పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐదు బెడ్ల చొప్పున అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ఇక వేడుకల సందర్భంగా విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఏఎస్పీ, 15 మంది డీఎస్పీలు, 59 మంది సీఐలు, 188 మంది ఎస్సైలతో సహా మొత్తం 2వేల మంది సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. భద్రాద్రితో పాటు ఖమ్మం, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి పోలీసులు రానున్నారు. రూ.10 లక్షలతో విద్యుత్ మరమ్మతులు.. ఈనెల 6, 7 తేదీల్లో భద్రాచలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఆ శాఖ ఎస్ఈ మహేందర్ ఆదేశాల మేరకు భద్రాచలం డీఈ జీవన్ కుమార్ రూ.10లక్షల వ్యయంతో అవసరమైన మరమ్మతులు చేపట్టారు. మిథిలా స్టేడియం వద్ద గత పదేళ్లుగా 250 కేవీ జనరేటర్ మాత్రమే ఉండేది. ఈ ఏడాది 500 కేవీ జనరేటర్ను అధికారులు అందుబాటులో ఉంచారు. శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలంలో 70 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న పంచాయతీ.. రామయ్య కల్యాణానికి భక్తులు భారీగా రానుండగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్య సహజం. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు జిల్లాలోని 19 మంది ఎంపీఓలు, 75 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు రానున్నారు. జిల్లా పంచాయతీ అధకారి చంద్రమౌళి పర్యవేక్షణలో డీఎల్పీఓ సుధీర్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం 140 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో 28 చోట్ల తాగునీటి కేంద్రాలు. బ్రిడ్జి వద్ద లైటింగ్, బ్లీచింగ్, ఫినాయల్, యాసిడ్ స్ప్రే తదితర సేవలు అందించనున్నారు. ఇందుకు గాను గ్రామ పంచాయతీ అధికారులు రూ.35 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. ఇక టూరిజం శాఖ ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో భద్రాచలం, పర్ణశాలలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదం జరిగితే.. శ్రీరామనవమి సందర్భంగా ఇల్లెందు, ఆశ్వారావుపేట, పినపాక, భద్రాచలం అగ్నిమాపక కేంద్రాల నుంచి మొత్తం 66 మంది విధుల్లో పాల్గొంటారు. వీరికి అదనంగా సింగరేణి నుంచి 15 మంది రెస్క్యూ సిబ్బందితో పాటు రెస్కూ ఫైర్ ఇంజిన్, కేటీపీఎస్, హెవీవాటర్ ప్లాంట్ల నుంచి ఆరు వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజన్లు, 2 ఫైర్ బుల్లెట్ బైక్లు, 70 అగ్నిమాపక యంత్రాలను (సిలిండర్లు) సిద్ధం చేసినట్లు భద్రాచలం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. -
ఆకట్టుకుంటున్న గిరిజన పల్లె
భద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో నిర్మించిన గిరిజన మ్యూజియం అందరినీ ఆకట్టుకుంటోంది. హంగూ ఆర్భాటాలకు దూరంగా పూర్తిగా ఆదివాసీల పల్లె జీవితం సాక్షాత్కరించేలా నిర్మించిన ఈ మ్యూజియాన్ని ఈనెల 6న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా బోటింగ్, ప్లే ఏరియా, యువకుల కోసం బాక్స్ క్రిక్రెట్, శాండ్ వాలీబాల్, ఆర్చరీ గేమ్, ఓపెన్ జిమ్లు ఇక్కడ నిర్మించారు. ఆదివాసీ రుచుల నుంచి చైనీస్ వంటకాలతో కూడిన ఫుడ్ కోర్టు రెడీ చేశారు. మరోవైపు మ్యూజియాన్ని గిరిజనుల పండుగలు, వేటలో ఉపయోగించే ఆయుధాలు, ఇళ్లలో వినియోగించే పనిముట్లు, కళాకృతులు, వాయిద్యాల థీమ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వెరసి మూడు నెలల కాలంలోనే గిరిజన మ్యూజియం ‘మినీ స్టూడియో’గా మారిపోయింది. దీంతో ప్రారంభానికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాబోయే వధూవరులు, బర్త్డే పార్టీల కోసం గ్రూపులు గ్రూపులుగా స్థానికులు ఇక్కడికి రావడం మొదలైంది. -
గోదావరిని పరిశీలించిన సీడబ్ల్యూసీ బృందం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం వద్ద గోదావరిని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు గురువారం సందర్శించారు. ఉత్తరాఖండ్లోని రూర్కీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి చెందిన డాక్టర్ రవీంద్ర విఠల్ కాలే, ప్రొఫెసర్ ముత్తయ్య పెరుమాళ్ భద్రాచలం కేంద్ర జల సంఘం కార్యాలయ సబ్ డివిజన్ ఇంజనీర్ కె.పృథ్వీరాజ్ నేతృత్వంలో పరిశీలించారు. నూతన బ్రిడ్జిపై ‘ఎంట్రోపీ ఇమేజ్ ప్రాసెసింగ్ బేస్డ్ నాన్ కాంటాక్ట్ డిశ్చార్జ్ మానిటరింగ్ టెక్నిక్’ అనే యంత్రాన్ని అమర్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో నది ఉపరితల ప్రవాహ వేగాన్ని విశ్లేషించి కచ్చితమైన సమాచారం వస్తుంది. వర్షాకాలం వరదల సమయంలో ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఉపయోగపడనుందని, రానున్న 24 గంటల్లో ఎగువ నుంచి ఎంత వరద వస్తుందో అంచనా వేయవచ్చని తెలిపారు. భద్రాచలంలో ప్రతీ నిమిషానికి పెరుగుతున్న నీటి వేగాన్ని అంచనా వేసి హెచ్చరిక స్థాయి వరద ఎన్ని గంటలకు వస్తుందో గుర్తించవచ్చని, తద్వారా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయొచ్చని వివరించారు. -
శాంతి చర్చలకు మేం సిద్ధం..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో కొనసాగుతున్న తీవ్ర నిర్బంధం నేపథ్యంలో శాంతిచర్చలకు తాము సిద్ధమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రకటించింది. అయితే, శాంతిచర్చలు జరిపేందుకు అనువైన వాతావరణం తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో చర్చల ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజాపక్ష మేధావులు, రచయితలు, హక్కుల సంఘాలు, దళిత, గిరిజన, విద్యార్ధి, యువజన సంఘాలు, పర్యావరణ కార్యకర్తలను ఆ పార్టీ కోరింది. మీడి యా కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా విడుదల చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. అమానవీయంగా చంపేస్తున్నారు..: ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి విప్లవ ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్రం నరసంహారం కొనసాగిస్తోందని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. సాధారణ ఆదివాసీ ప్రజానీకం, దళసభ్యులు, కమాండర్లు, అగ్రనేతల వరకు 400 మందికి పైగా కగార్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్డన్ – కిల్ (చుట్టుముట్టి చంపేయడం) ఆపరేషన్లలో పట్టుబడిన తమ పార్టీ నేతలు, సభ్యులు, సానుభూతిపరులను అమానీయంగా చిత్రహింసలకు గురిచేసి చంపేస్తున్నారని, మహిళా కామ్రేడ్లపై అత్యాచారాలకు పాల్పడి ప్రాణాలు తీస్తున్నారని ప్రకటించింది. అందుకే ఈ యుద్ధాన్ని జినోసైడ్ (నరసంహారం)గా పేర్కొంటున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగ విరుద్ధం.. విప్లవోద్యమ ప్రాంతాలను కల్లోలిత ప్రదేశాలుగా ప్రకటించకుండానే అంతర్గత భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కమాండో బలగాల ముసుగులో కేంద్రం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించిందని ఆరోపించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీ యువతను సాయుధ బలగాల్లో చేర్చుకుని వారితోనే ఆదివాసీలను హత్య చేయిస్తున్నారని తెలిపింది. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా.. ఆదివాసీ, పేదల రక్తపు పునాదులపై వికసిత్ భారత్ ఏర్పాటు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ.. షరతులు శాంతిచర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోలు.. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర (గడ్చిరోలి), ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అమలవుతున్న ఆపరేషన్ కగార్ను ఆపేయాలని, విప్లవ ప్రభావిత ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కొత్త క్యాంపులు ఏర్పాటు చేయొద్దని ఆ పార్టీ సూచించింది. తమ షరతులకు ఒప్పుకుంటే తక్షణమే కాల్పుల విరమణకు సిద్ధమని ప్రకటించింది. ప్రజా ప్రయోజనాల కోసమే తాము శాంతి చర్చలకు ముందుకొచ్చామని పేర్కొంది. రౌండ్ టేబుల్ తర్వాత.. శాంతి చర్చల కమిటీ మార్చి 24న హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇందులో ‘మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, సీపీఐ (మావోయిస్టు) భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి’అని కోరింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మావోయిస్టు పార్టీ స్వాగతిస్తూ.. ‘శాంతి చర్చలు – కాల్పుల విరమణ – షరతులు’అని పేర్కొంటూ మార్చి 28న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచి్చంది. -
గల్లాపెట్టె గలగల..!
● స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు పెరిగిన ఆదాయం ● గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.206.25 కోట్ల రాబడి ● ఉమ్మడి జిల్లాలో 45,783 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ● గత ఏడాదితో పోలిస్తే రూ.8 కోట్లు అ‘ధనం’ సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది గణనీయమైన ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2024 – 25 ఏడాదిలో 45,783 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.206.25 కోట్లు వచ్చాయి. 2023 – 24తో పోలిస్తే ఇది రూ.8 కోట్లు అదనమే అయినా.. 2022 – 23తో పోలిస్తే మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక గత ఆర్థిక సంవత్సరం కంటే తాజాగా ముగిసిన సంవత్సరంలో డాక్యుమెంట్లు పెరగడంతో అదేస్థాయిలో ఆదాయం నమోదైంది. 2024 – 25లో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మూడు జిల్లాల్లోనే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరగ్గా.. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఉంది. 11 కార్యాలయాలు.. ఉమ్మడి జిల్లాలో ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్తోపాటు ఖమ్మంరూరల్, కూసుమంచి, మధిర, స త్తుపల్లి, వైరా, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, ఇల్లెందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 45,783 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా రూ.206.25 కోట్ల ఆదాయం వచ్చింది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ఈ ఆదాయం నమోదైంది. 2023 –24లో 44, 201 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.198.21 కోట్ల ఆదాయం సమకూరింది. తగ్గిన రియల్ బూమ్.. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల తర్వాత ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగేది. కానీ కొద్ది నెలలుగా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. ఖమ్మం చుట్టుపక్కల, రూరల్ ప్రాంతాల్లో కొద్దో గొప్ప వ్యాపారం నడుస్తున్నా.. జిల్లా కేంద్రంలో మాత్రం నామమాత్రమైంది. భూముల క్రయవిక్రయాలు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లూ జరగలేదు. రెండేళ్ల క్రితం 50వేలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగితే, గతేడాది నుంచి 50 వేల లోపే అవుతుండడం గమనార్హం. అయితే ఖమ్మంలో ప్రధాన రహదారుల వెంట ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయితే మళ్లీ వ్యాపారం ఊపందుకుంటుందని, తద్వారా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రూ.250 కోట్ల లక్ష్యం ప్రభుత్వం ఈ ఏడాది (2025 – 26) స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తోంది. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఆ మేరకు ఆదాయం వచ్చేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లా నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లకు పైగా ఆదాయం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు అందనున్నట్లు తెలిసింది. 2020–21 నుంచి డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, ఆదాయం ఇలా.. ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2020-21 50,276 రూ.100,05,20,1142021-22 57,570 రూ.206,68,18,9742022-23 47,102 రూ.227,34,80,0002023-24 44,201 రూ.198,21,00,0002024-25 45,783 రూ.206,25,00,000 -
అందరికీ సరిపడా వసతులు
భద్రాచలం: శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తులందరికీ సరిపడా వసతులు కల్పిస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం ప్రత్యేకమని, అందుకే దేశ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారని చెప్పారు. అందరికీ తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని, చలువ పందిళ్లు, ఎండ నుంచి ఉపశమనం కలిగేలా మిస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 26 సెక్టార్లు ఏర్పాటు చేస్తుండగా అన్నింటిలోనూ ఎల్ఈడీ టీవీలు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. కల్యాణం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులకు తలంబ్రాలు అందించేందుకు 80 కౌంటర్లు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ బస్సుల్లోనూ ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. సీఎం రాక కోసం మూడు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నామన్నారు. రెండు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్డీఓ దామోదర్ రావు, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ రామయ్యను దర్శించుకున్న కమిషనర్ భద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనుబంధ ఆలయాలనూ దర్శించుకోగా అధికారులు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. -
తునికాకు సేకరణపై చిగురిస్తున్న ఆశలు
పాల్వంచరూరల్: ఎట్టకేలకు ఈ ఏడాది తునికాకు సేకరణకు ఆశలు చిగురిస్తున్నాయి. తునికాకు సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మూడు సార్లు ఆన్లైన్లో టెండర్లు ఆహ్వానించగా భద్రాద్రి జిల్లాలోని 31 యూనిట్లకు 26 యూనిట్లలో ఖరారయ్యాయి. ఫిబ్రవరి 27, 28, మార్చి 10, 11వ తేదీల్లో 20, 21వ తేదీల్లో మూడు దఫాలుగా టెండర్లు ఆహ్వానించారు. జిల్లాలో ఈ ఏడాది 17,200 స్టాండర్డ్ బ్యాగ్ల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు భద్రాచలం డివిజన్లో ఐదు యూనిట్లకు గాను మూడు, మణుగూరు డివిజన్లోని ఐదుకు ఐదు, పాల్వంచ డివిజన్లో నాలుగుకు నాలుగు, వైల్డ్లైఫ్ డివిజన్ పరిధిలో ఐదు యూనిట్లకు ఐదు, కొత్తగూడెం డివిజన్ పరిధిలో నాలుగుకు ఒకటి, ఇల్లెందు డివిజన్లో ఎనిమిది యూనిట్లకు ఎనిమిది యూనిట్లను కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. మొత్తం కాకున్నా మెజార్టీ యూనిట్లు అమ్ముడైనందున తునికాకు సేకరణ ఆశించిన స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం డివిజన్లో రెండు, సత్తుపల్లిలోని మూడు యూనిట్లపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో జిల్లాలో తునికాకు సేకరణకు మరోమారు టెండర్లు పిలుస్తారా, వదిలేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో పలు యూనిట్ల ఖరారు -
ప్రారంభానికి మ్యూజియం సిద్ధం
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉందని పీఓ బి.రాహుల్ తెలిపారు. యూనిట్ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్ల గురించి అందరికీ తెలిసేలా మ్యూజియంలో సుందర దృశ్యాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈనెల 6న మ్యూజియాన్ని ప్రారంభించనుండగా ఈలోగా జీసీసీ, వ్యవసాయ ఉత్పత్తుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు చంద్రశేఖర్, సున్నం రాంబాబు, ఉదయభాస్కర్, ఉదయ్ కుమార్, రమణయ్య, అశోక్ కుమార్, గోపాలరావు, నరేష్, వేణు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ‘పది’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: గత నెల 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరా చారి తెలిపారు. చివరి రోజు సోషల్ పరీక్షకు 12,273 మంది విద్యార్థులకు 12,240 మంది హాజరయ్యారని, 33 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. సప్లిమెంటరీ విద్యార్థులు 26 మందికి 17 మంది హాజరయ్యారని తెలిపారు. తాను రెండు కేంద్రాల్లో, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆరు సెంటర్లలో, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది 26 కేంద్రాల్లో తనిఖీ చేసినట్లు వివరించారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ఏడు కేంద్రాల్లో గురువారం ఒకేషనల్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
అగ్నిమాపక సిబ్బందికి విపత్తు నిర్వహణ డీజీపీ సూచనభద్రాచలంఅర్బన్ : వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని, ఈ ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక శాఖ డీజీపీ వై.నాగిరెడ్డి సూచించారు. భద్రాచలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఇటీవల ఐదంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతిచెందిన ప్రాంతాన్ని పరిశీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, సిబ్బంది తీసుకున్న చర్యలు, ఉపయోగించిన సామగ్రి తదితర వివరాలపై ఆరా తీశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి చేరుకుని సిబ్బంది సరిపడా ఉన్నారా? పట్టణ ప్రజలను ఆపద నుంచి రక్షించేందుకు అవసరమైన అన్ని పరికరాలు ఉన్నాయా? అని ఆడిగి తెలుసుకున్నారు. ఏమైనా అవసరాలుంటే నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ నెల 6, 7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకల సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, వేడుకల్లో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, జిల్లా అగ్నిమాపక శాఖ ఇన్చార్జి క్రాంతి, భద్రాచలం టౌన్ సీఐ రమేష్, భద్రాచలం అగ్నిమాపక శాఖ ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు నిరాశేనా..?
స్టేడియాన్ని పునర్నిర్మిస్తే భేష్.. ప్రస్తుతం ఉన్న మిథిలా స్టేడియాన్ని 1964లో నాటి సీఎం నీలం సంజీవ రెడ్డి ప్రారంభించగా మూడు వైపులా అదనపు గ్యాలరీలను 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. అయితే అప్పటికి ఇప్పటికీ భక్తుల సంఖ్య భారీగా పెరుగడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. దీనికి తోడు 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆ సమయానికై నా మిథిలా స్టేడియాన్ని పునర్నిర్మిస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. భద్రాచలం: శ్రీరామనవమి రోజున రామయ్య కల్యాణ ఘట్టం టీవీల్లో కనిపించినా, రేడియోలో వ్యాఖ్యానం వినిపించినా.. భద్రాచలం మిథిలా స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలనేది భక్తుల కోరిక. ఆ ఆశతో భద్రాచలం వచ్చే చాలా మందికి నిరాశే ఎదురవుతోంది. వీవీఐపీ, వీఐపీ సెక్టార్లలో మినహా ఇతర సెక్టార్లలో, సామాన్య భక్తులు ఉచితంగా కూర్చునే షెడ్లలో పూర్తి స్థాయిలో ఎల్ఈడీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వేదికకు దూరంగా ఉన్నవారు కల్యాణ తంతును కనులారా వీక్షించలేని పరిస్థితి నెలకొంటోంది. దీనికి తోడు ప్రతి ఏడాదీ వీవీఐపీ, వీఐపీల తాకిడి పెరుగుతుండగా ఇతర సెక్టార్ల టికెట్లను కుదించే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది శ్రీరామనవమికి సీఎం రేవంత్రెడ్డి హాజరు కానుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వీవీఐపీలు, వీఐపీల తాకిడి పెరగనుంది. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండు రోజులుగా భద్రాచలంలోనే ఉండి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సీఎం, వీవీఐపీల సెక్టార్లను పెంచాలని దేవస్థానం అధికారులకు సూచించారు. దీంతో 1000 టికెట్లు గల ఉభయదాతల సెక్టార్ను 775కు కుదించారు. వీఐపీ సెక్టార్ను సైతం కుదిస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది వీవీఐపీలు, వీఐపీల రాకతో ఇతర సెక్టార్ల విభజన జరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్టేడియాన్ని పునర్నిర్మిస్తే శాశ్వత రీతిలో సెక్టార్లను విభజించే అవకాశం ఉంటుంది. తద్వారా భక్తులందరికీ స్వామివారి కల్యాణ దర్శన భాగ్యం దక్కుతుంది. ఎల్ఈడీలైనా పెంచాలి.. మిథిలా స్టేడియంలో ప్రస్తుతం వీవీఐపీ, వీఐపీ, ఉభయదాతలకు కలిపి సుమారు 13 వేల టికెట్లు విక్రయిస్తున్నారు. స్టేడియానికి మూడు వైపులా ఏర్పాటు చేసిన ఉచిత గ్యాలరీల్లో మరో 15 వేల మంది భక్తులు కూర్చునే అవకాశం ఉంది. అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పలువురు నిల్చుని కల్యాణాన్ని చూస్తుంటారు. స్టేడియం మధ్య భాగంలో కల్యాణ మండపం ఉంటుంది. సుమారు రెండున్నర ఎకరాల్లో కూర్చునే వారందరికీ కల్యాణ తంతు కనిపించడం కష్టమే అయినా దూరంగా చూస్తూనే అనేక మంది భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. అయితే స్టేడియంలో కూర్చునే 13 వేల మంది కోసం 30 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తుండగా.. ఉచిత గ్యాలరీల్లో కూర్చునే 15 వేల మందికి 15 టీవీలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. వీటి సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు. రామయ్య కల్యాణాన్ని వీక్షించడం కష్టమే.. వీవీఐపీల తాకిడితో ఉభయదాతల టికెట్ల కుదింపు మిథిలా స్టేడియంలో సామాన్యులకు తప్పని ఇక్కట్లు సరిపడా ఏర్పాటు చేయని ఎల్ఈడీ స్క్రీన్లు -
రామయ్యకు సార్వభౌమ సేవ
బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజపట లేఖనం భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు వైభవంగా సార్వభౌమ సేవ నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. సాయంత్రం స్వామివారిని సార్వభౌమ సింహాసనంపై ఆశీనులను చేసి తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం గరుడాధివాసం, ధ్వజపట లేఖనం తదితర కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. రామాలయంలో గోటి తలంబ్రాల సమర్పణభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు బుధవారం కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు. ఎకరం పొలంలో పండించిన ధాన్యాన్ని ఐదువేల మంది భక్తులతో ఒలిపించిన ఎనిమిది క్వింటాళ్ల తలంబ్రాలను అందజేశారు. ముందుగా వాటికి ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు, ఆలయ పీఆర్ఓ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి లక్ష కుసుమార్చనపాల్వంచరూరల్ : శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం పెద్దమ్మతల్లి అమ్మవారికి లక్ష కుసుమార్చనను వైభవంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు నాదనీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, శ్రీలలితా సహస్రనామ హవనం తదితర పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. రామయ్యను దర్శించుకున్న దేవనాథ జీయర్భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జీయర్స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. తాగునీటికి ఇబ్బంది లేదు అశ్వాపురం : మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉమ్మడి జిల్లా ఎస్ఈ జి.శేఖర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కుమ్మరిగూడెం ఇన్టేక్ వెల్, దుమ్ముగూడెం ఆనకట్ట, రథంగుట్ట వద్ద వాటర్ట్రీట్ మెంట్ ప్లాంట్ను బుధవారం ఆయన సందర్శించారు. ఆనకట్ట, ఇన్టేక్ వెల్ వద్ద గోదావరి నీటిమట్టాన్ని పరిశీలించారు. నీటి మట్టం తగ్గితే తీసుకోవా ల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ నళిని, డీఈ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మొగలాయిలను ఎదిరించిన వీరుడు
సూపర్బజార్(కొత్తగూడెం): హస్తిన పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన తొలి తెలంగాణ తేజం, గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించి సమ సమాజ స్థాపనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన, పేదల పాలిట ఆపద్భాందవుడు అని, క్షత్రియుడే కత్తి పట్టాలన్న సూత్రాన్ని ఆయన మార్చారని, సబ్బండ వర్గాల బలగంతో రాజ్యాధికారం సంపాదించాడని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సభలో అదనపు కలెక్టర్ -
ఆదాయం అదుర్స్
లక్ష్యాన్ని మించి వసూలు చేసిన మార్కెట్ కమిటీలు ● ఆరు ఏఎంసీల నుంచి రూ.22.66 కోట్ల రాబడి బూర్గంపాడు: జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలు గతేడాది నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాయి. గతేడాది జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల నుంచి రూ.21.69 కోట్ల ఆదాయాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. మార్చి 31 వరకు ఈ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంది. అయితే జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్దేశించిన లక్ష్యాలను మించి రాబడి సాధించాయి. జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లు వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వం విధించే ఒక శాతం మార్కెట్ ఫీజును వసూలు చేయటంలో సఫలీకృతమయ్యాయి. జిల్లాలోని బూర్గంపాడు, ఇల్లెందు, కొత్తగూడెం, దమ్మపేట, భద్రాచలం, చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలు తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేశాయి. ఒక్క చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాత్రం లక్ష్యానికి కొంత వెనుకబడి ఉంది. గతేడాది ప్రభుత్వం బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.5.86 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది. బూర్గంపాడు ఏఎంసీ మార్చి 29వ తేదీ నాటికి రూ.6.41 కోట్ల రాబడి సాధించింది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఇచ్చిన రూ.4.64 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.5.71 కోట్ల ఆదాయం రాబట్టింది. కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీకి విధించిన రూ.3.30 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.26 కోట్ల ఆదాయంతో లక్ష్యం దిశగా ఉంది. దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి నిర్దేశించిన రూ.3.25 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.3.87 కోట్ల ఆదాయం సాధించింది. భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పెట్టిన రూ.2 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.2.06 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది. చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి విధించిన రూ.2.62 కోట్ల టార్గెట్కు రూ.1.95 కోట్ల ఆదాయం సాధించి లక్ష్యసాధనలో వెనుకబడింది. జిల్లాకు మొత్తంగా విధించిన రూ.21.69 కోట్ల టార్గెట్కు గాను రూ.22.66 కోట్ల ఆదాయంతో లక్ష్యాన్ని అధిగమించింది. పత్తి, వరి, మిర్చిపైనే ఆదాయం జిల్లాలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులపై వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఒక శాతం మార్కెట్ ఫీజును వసూలు చేస్తాయి. జిల్లాలో ఎక్కువగా పండే పత్తి, వరి, మిర్చి పంటలపై మార్కెట్ కమిటీలకు ఎక్కువ ఆదాయం వస్తుంది. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జామాయిల్, సుబాబుల్ కర్రతో అధిక ఆదాయం వస్తుంది. సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీకి వచ్చే జామాయిల్, సుబాబుల్ కర్రపై విధించే మార్కెట్ ఫీజుతో బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిల్లాలోనే అధిక ఆదాయం వస్తుంది. ఈ ఏడాది మిర్చి కోతలు ఆలస్యమవటం, మిర్చికి ధర తక్కువగా ఉండటంతో రైతులు మిర్చి అమ్మకాలు జరపటం లేదు. ఈ పరిస్థితులు చర్ల మార్కెట్ కమిటీ లక్ష్యసాధనలో కొంత వెనుకబడినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల టార్గెట్ను రూ.25 కోట్లకు పెంచే అవకాశాలున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంటల క్రయ విక్రయాలు జరిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కు వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. ట్రేడర్లను, వ్యాపారులను ఆ దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు. సిబ్బంది సహకారంతోనే లక్ష్యసాధన జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధికారులు, సిబ్బంది పనితీరుతో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకున్నాం. జిల్లాలో మొత్తంగా లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని సమకూర్చుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం మరింతగా పెంచుకునేలా దృష్టి సారిస్తాం. –నరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
ఇసుక లారీ పట్టివేత
అశ్వారావుపేటరూరల్: ఏపీ రాష్ట్రం నుంచి అక్రమంగా తెలంగాణలోకి రవాణా చేస్తున్న ఓ ఇసుక లారీని బుధవారం తెల్లవారుజామున స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా తాటిపూడి నుంచి టిప్పర్లో సుమారు 15 టన్నుల ఇసుకను అశ్వారావుపేటకు తీసుకురాగా, సమాచారం మేరకు గ్రామ శివారులో పట్టుకున్నారు. టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేయగా, ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన లారీ యజమాని గంటా కొండబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అటవీ భూమి ఆక్రమణ?
అశ్వారావుపేట: మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వెనుక అటవీ భూభాగం ఆక్రమణకు గురైనట్లు సమాచారం. దమ్మపేట రేంజ్ పరిధిలోని తిరుమలకుంట బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమి సరిహద్దు దాటి కొందరు ఆక్రమణకు పాల్పడినట్లు తెలిసింది. అటవీ భూమి సరిహద్దును చూపే కాంపౌండ్ దిమ్మెలను దాటి ఫెన్సింగ్ నిర్మించి మరీ వ్యవసాయం చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అటవీ శాఖకు చెందిన దమ్మపేట, అశ్వారావుపేట రేంజ్లు, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ సరిహద్దులుగా ఉంటాయి. దీంతో ముగ్గురి మధ్య ఉన్న అటవీ భూభాగాన్ని వినాయకపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, కొందరు అధికారులు కబ్జా చేసి ఏళ్ల తరబడి వినియోగించుకుంటున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ విషయాన్ని దమ్మపేట రేంజ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లగా బీట్ అధికారిని విచారణకు పంపుతామని, ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తామని చెప్పారు. -
మోరంపల్లిబంజర సంత వేలం రూ.33.50 లక్షలు
బూర్గంపాడు: మోరంపల్లిబంజర సంత వేలంపాట రూ.33.50 లక్షలకు ఖరారైంది. డీఎల్పీఓ సుధీర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సంత వేలం పాటలో ఆరుగురు పాల్గొన్నారు. ప్రతి గురువారం, శుక్రవారం నిర్వహించనున్న పశువుల సంత, కూరగాయల సంతకు సంయుక్తంగా నిర్వహించిన వేలం పాటను బానోత్ రవీందర్ రూ.33.50 లక్షలకు దక్కించుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి భవాని, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా, బూర్గంపాడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే వారపు సంత వేలంపాటను బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటను జక్కం శ్రీనివాసరావు రూ.2.54 లక్షలకు దక్కించుకున్నాడు. ప్రతి బుధవారం బూర్గంపాడులో నిర్వహించే సంత వేలంపాటలో ఎనిమిదిమంది పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి బర్ల రామకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
విద్యుదుత్పత్తిలో కేటీపీఎస్ భేష్
● ఏడో దశ కర్మాగారానికి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ ● జెన్కోలో ప్రథమ స్థానం పాల్వంచ: గత ఆర్థిక సంవత్సరం విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీఎస్ ఆశాజనక ఫలితాలు సాధించింది. సూపర్ క్రిటికల్ సామర్థ్యం గల 800 మెగావాట్ల ఏడో దశ కర్మాగారం తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. 79.04 పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించి దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. గుజరాత్లోని లారా స్టేషన్ ప్రథమ, ఒడిశాలోని దార్లపల్లి ద్వితీయ స్థానాల్లో ఉండగా కేటీపీఎస్ ఏడో దశ తృతీయ స్థానంలో ఉంది. టీజీ జెన్కోలో మాత్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ కర్మాగారం 2022 – 23లో 4211.3262 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించగా 2023 – 24లో 6,011.2768 మిలియన్ యూనిట్లు, 2024 – 25లో 5,538.9876 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించింది. ఇక 2023 – 24లో పీఎల్ఎఫ్లో 85.54 శాతం ఉండగా ఈ సారి 79.04 సాధించింది. బొగ్గు వినియోగం గతంలో 30,45,889 మెట్రిక్ టన్నులకు గాను 2024 – 25లో 29,88,125.90 మొట్రిక్ టన్నులకు తగ్గించారు. టీజీ జెన్కోలో 5, 6 దశలూ రికార్డే.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారం అత్యధిక రోజులు బ్యాక్ డౌన్లో నడిచింది. దీంతో పీఎల్ఎఫ్ తగ్గగా, నిరంతరాయ ఉత్పత్తిలో మాత్రం రికార్డ్ సాధించింది. పీఎల్ఎఫ్ 93.45 శాతంతో జెన్కోలో ద్వితీయ స్థానంలో నిలిచింది. 3,054.680 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి సాధించింది. సమష్టి కృషితో రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సమష్టి కృషితో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాం. జెన్కోలో ప్రథమ స్థానం, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గల 800 మెగావాట్లలో జాతీయ స్థాయిలో తృతీయ స్థానం సాధించాం. ఇందుకు సహకరించిన సిబ్బంది, అధికారులకు ధన్యవాదాలు. వచ్చే ఏడాది మరింత ఉత్పత్తి సాధించేలా కృషి చేస్తాం. – కె.శ్రీనివాసబాబు, ఏడో దశ సీఈ -
ఐదుగురికి జరిమానా
కొత్తగూడెంటౌన్: డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఐదుగురికి జరిమానా విధిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. పాల్వంచటౌన్ ఎస్ఐ సుమన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు వ్యక్తులు అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా అధిక మోతాదులో మద్యం సేవించినట్లు తేలింది. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా విచారణ అనంతరం ఐదుగురికి రూ.6,500 జరిమానా విధిస్తూ జడ్జి మెండు రాజమల్లు తీర్పు ఇచ్చారు. అనంతరం సదరు వ్యక్తులు కోర్టులో జరిమానా చెల్లించారు. ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి దుమ్ముగూడెం: ట్రాక్టర్ బోల్తాపడి మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పడిగపాటి వెంకటకృష్ణారెడ్డి (39) మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గణేశ్ కథనం ప్రకారం.. వెంకటకృష్ణారెడ్డి తన వ్యవసాయ అవసరాల నిమిత్తం ట్రాక్టర్ కొనుగోలు చేశారు. తన ట్రాక్టర్పైనే పొలానికి వెళ్తూ ముట్ల వాగు బ్రిడ్జి సమీపానికి వెళ్లేసరికి అదుపుతప్పి ఎడమవైపు ఉన్న కాల్వలో పడిపోయింది. ట్రాక్టర్ కింద పడిన వెంకటకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వాకింగ్ చేస్తున్న రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వ్యక్తులు ఘటనను చూసి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: మద్యం మత్తులో పురుగులమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని దంతలబోరు ఎస్సీకాలనీలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన వ్యవయ కూలీ కాటూరి సుందరం బుధవారం మద్యం మత్తులో ఇంట్లో గొడవపడి పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెంనకు తరలించారు. కేసు నమోదు పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీలో తనకు స్థానం కలిపించలేదనే అక్కసుతో ఆలయ పూజారిని దుర్భాషలాడాడని, బోర్డును ధ్వంసం చేశాడమని తల్లాడ రామాచారిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేశ్ వెల్లడించారు. గుట్కా ప్యాకెట్లు, గుడుంబా స్వాధీనం ˘ ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం, పోచారంతండాల్లోని పలు దుకాణాల్లో బుధవారం రాత్రి కొమరారం పోలీసులు తనిఖీ చేశారు. మర్రిగూడెం గ్రామానికి చెందిన కమల్ ఇంటి నుంచి రూ.1,800 విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, పోచారంతండాలో రాంబాబు ఇంట్లో ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు. ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య పాల్వంచ: పట్టణంలోని ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. గుండాల మండలం మార్కోడుకు చెందిన బొందు రాజు (25) పాల్వంచలోని ప్రైవేట్ ఆస్పత్రికి అనుసంధానంగా ఉన్న ఎక్స్రే ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మంచికంటినగర్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చేతి నరాలు కట్ చేసుకుని, ఐరన్ రాడ్కు వైర్తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య జ్ఞానేశ్వరి, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్ రైలు
కారేపల్లి: సిగ్నల్స్లో సాంకేతిక లోపం తలెత్తడంతో.. కారేపల్లిలోని ఇల్లెందు, పేరుపల్లి రైల్వే గేట్ల వద్ద గూడ్స్ రైలు నిలిచిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కొత్తగూడెం నుంచి వయా కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా డోర్నకల్ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు ఇల్లెందు (2కేకే) రైల్వే గేట్, పేరుపల్లి (1కేకే) రైల్వే గేట్లకు సమీపించి సిగ్నల్స్లో తలెత్తిన సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో ఈ రెండు గేట్లు తెరుచుకోకపోవటంతో సుమారు గంట పాటు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా.. ఈ రెండు రైల్వే గేట్లకు రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి లేదా అండర్ లోలెవల్ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రజా ప్రతినిధులను, రైల్వే ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇల్లెందు, పేరుపల్లి రైల్వే గేట్ల వద్ద ఇబ్బందులు పడిన వాహనదారులు -
స్వల్పంగా పెరిగిన ఆయిల్పాం గెలల ధర
అశ్వారావుపేటరూరల్: ఆయిల్పాం టన్ను గెల ధర స్వల్పంగా పెరిగిందని ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్రెడ్డి తెలిపారు. టన్ను ధర ఫిబ్రవరిలో రూ.20,871 ఉండగా రూ.129 పెరిగి రూ.21,000కి చేరిందని, మార్చి నుంచి సేకరించిన గెలలకు ఈ ధర అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాగా, టన్ను ధర పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.పీఆర్ డీఈగా నాగేందర్ బాధ్యతల స్వీకరణచుంచుపల్లి: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కొత్తగూడెం డివిజనల్ ఇంజనీర్గా జె.నాగేందర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ డీఈగా పనిచేసిన సత్యనారాయణ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో డీఈగా నాగేందర్కు పదోన్నతి ద్వారా అవకాశం దక్కింది. నాగేందర్ 2015–17 వరకు కొత్తగూడెం మున్సిపాలిటీలో, తరువాత 2018–24 వరకు చుంచుపల్లి ఏఈగా పనిచేస్తూనే నాలుగు నెలల కిందట డీఈగా పదోన్నతి పొందారు. డీఈ నాగేందర్ను ఈఈ శ్రీనివాసరావు, పలువురు ఏఈలు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.చీఫ్ మెడికల్ ఆఫీసర్గా కిరణ్రాజ్కుమార్సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మెయిన్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఆర్జీ–1 ఏరియాలో ఏసీఎంఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.కిరణ్రాజ్కుమార్ను యాజమాన్యం నియమించగా.. ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఏసీఎంఓ ఎం.ఉష, డీవైసీఎంఓ జి.సునీల, డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, ఏఐటీయూసీ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ నాయకులు జి.వీరస్వామి, గట్టయ్య, సుధాకర్, శేషగిరిరావు, మధు, కృష్ణ, హీరాలాల్, ప్రసాద్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసుకున్న మాణిక్యారం గ్రామానికి చెందిన ఈసం సిద్ధార్థ్, ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకున్న అదే గ్రామానికి చెందిన పొనక విష్ణు కొమరారానికి బైక్పై బయలుదేరారు. ముత్తారపుకట్ట గ్రామానికి చెందిన కల్తీ ప్రకాష్ గుండాల మండలం వెన్నెలబైలు గ్రామంలో వ్యవసాయ పనులు ముగించుకొని స్వగ్రామానికి బైక్పై వెళ్తున్నాడు. రెండు బైక్లు కొమరారం శివారులో ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కల్తీ ప్రకాష్ను 108లో ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఈసం సిద్ధార్థ్ను కుటుంబ సభ్యులు ఇల్లెందులోని ప్రైవేట్ ఆస్పత్రికి, పొనక విష్ణును కొమరారం పీహెచ్సీకి తరలించారు.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దుఖమ్మంవైద్యవిభాగం: విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడొద్దని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్ సూచించారు. ఖమ్మంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. నకిలీ యాప్లు, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఈ మెయిల్, ఫేస్బుక్ ఖాతాలతో పాటు బెట్టింగ్ గేమ్ల ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. గుర్తుతెలియని సైట్లు, వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలనానరు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు ఫోన్ చేయడం లేదా www. cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని డీఎస్పీ తెలిపారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, సరిత పాల్గొన్నారు. -
ఊరంతా చేపల కూరే...!
వేసవి వచ్చిందంటే గ్రామాల్లోని చెరువుల్లో నీరు తగ్గుముఖం పడుతుంది. దీంతో స్థానికులు చేపల వేటకు ఉపక్రమిస్తారు. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామంలోని పెద్ద చెరువుకు మంగళవారం ఉదయమే చేరిన జనం జలపుష్పాలు వేటాడటంలో నిమగ్నమయ్యారు.ఊతలు, వలల సాయంతో చేపలు పట్టగా అందరికీ సరిపడా చేపలు (Fishes) దొరకడంతో ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు. దీంతో కుర్నవల్లి గ్రామమే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని దాదాపు అందరి ఇళ్ల నుంచి మంగళవారం సాయంత్రానికి చేపల కూర (Fish Curry) వాసన ఘుమఘుమలాడింది. – కరకగూడెం అడుగంటిన మత్తడివాగుమార్చి మొదటివారం నుంచే భానుడు ప్రతాపం చూపడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు (Summer) దంచికొడుతున్నాయి. దీంతో భూగర్భ జలమట్టం గతంలో ఎన్నడూలేని విధంగా పది మీటర్ల లోతుకు పడిపోయింది. తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు తాగునీటిని అందించే తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్టు డెడ్స్టోరేజీకి చేరింది.ప్రాజెక్టు నీటిమట్టం (Water Level) 0.571 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.111లకు పడిపోయింది. నీరంతా అడుగంటడంతో ప్రాజెక్టు పూర్తిగా నెర్రెలు వారింది. ఏటా ఏప్రిల్ నెలాఖరు, మే మొదటివారంలో అడుగంటాల్సిన ఈ ప్రాజెక్టు ఏప్రిల్ మొదటి వారానికే ఎండిపోవడం జిల్లాలోని భూగర్భజలాలు పడిపోతున్న తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్చదవండి: సైకిల్ చక్రం.. బతుకు చిత్రం -
పాముకాటుతో బాలుడి మృతి
ములకలపల్లి: పాము కాటువేయడంతో బాలుడు మృతి చెందిన ఘటన జగన్నాథపురంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వ్యాపారి బొల్లిపల్లి సురేశ్, హేమలత దంపతుల కుమారుడు సాయి సుకుమార్ (11) ఇంటి ఆవరణలో బాల్తో ఆడుకుంటున్నాడు. కాగా బాల్ సమీపంలోని రంధ్రంలోకి వెళ్లింది. సాయిసుమార్ బాల్ తీస్తుండగా చేతిపై ఏదో కుట్టింది. దీంతో బాలుడు కొద్దిసేపటి తర్వాత కుటుంబీకులకు విషయం తెలిపాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వాంతులై పరిస్థితి విషమించింది. పాల్వంచ ఆస్పత్రికి చేరాక పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బెల్లం, పటిక స్వాధీనంజూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన వర్షిత్కు చెందిన కిరాణా దుకాణంలో మంగళవారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు చేశారు. నాటు సారాకు వినియోగించే 90 కిలోల బెల్లం, 8 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎల్.జయశ్రీ, తెలిపారు. జామాయిల్ తోట దగ్ధంబూర్గంపాడు: మండల పరిధిలోని ఇరవెండి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ సాగు చేసిన జామాయిల్ తోట ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం జామాయిల్ తోటలో మంటలు వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు రైతులు రామకృష్ణకు సమాచారమిచ్చారు. ఆయన అక్కడకు చేరుకునే సరికే తోట మొత్తం కాలిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులే జామాయిల్ తోటకు నిప్పు పెట్టి ఉంటారని బాధితరైతు ఆరోపిస్తున్నారు. జామాయిల్ తోట కాలిపోవటంతో సుమారు రూ 8 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.