
రామయ్యకు నేడు పట్టాభిషేకం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజున పట్టాభిషేకం వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో సోమవారం రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేయనున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
గవర్నర్ పర్యటన షెడ్యూల్ ఇలా..
● ఉదయం 9–45కు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ ప్రారంభం
● 10.45కు సారపాకలోని ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు
● 11.20 గంటలకు గెస్ట్హౌస్ నుంచి రోడ్డు మార్గంలో శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి వస్తారు
● 11.45కు దేవస్థానం నుంచి మిథిలా స్టేడియానికి చేరుకుంటారు
● 12.45 వరకు స్టేడియంలో పట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షిస్తారు
● 12,45కు స్టేడియం నుంచి బయలుదేరి 1 గంటకు ఐటీసీ గెస్ట్హౌస్కు చేరుకుంటారు
● 1.25కు హెలీప్యాడ్కు.. ఆతర్వాత 1.30కు హెలీకాప్టర్లో పయనం