Bhadradri District Latest News
-
కేదార్నాథ్ యాత్రలో విషాదం
● అశ్వారావుపేట వాసి మృతి ● ఆలయ సమీపంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన భక్తుడు అశ్వారావుపేట : అశ్వారావుపేటకు చెందిన కొందరు కేదార్నాథ్ యాత్రకు వెళ్లగా అందులో ఓ భక్తుడి యాత్ర విషాదాంతమైంది. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం కోసం అశ్వారావుపేట నుంచి ఆరుగురు భక్తులు ఈనెల 1వ తేదీన కారులో బయలుదేరారు. 11 యాత్రలు ముగించుకుని చివరిదైన కేదార్నాథ్కు సోమవారం ఉదయం చేరుకున్నారు. కింది భాగంలోని గౌరీకుంఢ్ నుంచి 8 గంటలకు కొందరు పాదయాత్ర ప్రారంభించగా మరి కొందరు గుర్రాలు, డోలీలపై వెళ్లారు. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న అశ్వారావుపేటకు చెందిన వ్యాపారి గుత్తికొండ వెంకటేశ్వరరావు(47).. 17 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాత్రి 9 గంటలకు ఆలయ సమీపానికి చేరుకున్నాడు. కాగా, మధ్యలో ఆయాస పడుతూనే ఉన్నాడని పక్కనున్న భక్తులు తెలిపారు. ఎట్టకేలకు యాత్ర పూర్తి చేసి క్షేత్రానికి చేరువలోకి వెళ్లాక సహచరులతో కలిసి భోజనం చేసి టెంట్ కింద పడుకున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు అభిషేకానికి వెళ్లేందుకు వెంకటేశ్వరరావును నిద్ర లేపేందుకు పక్కవారు ప్రయత్నించగా ఎంతకూ స్పందించకపోవడంతో సమీపంలోని వైద్యులకు చూపించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులకు తెలియజేయగా మృతదేహాన్ని హెలికాప్టర్లో గౌరీకుంఢ్కు తరలించారు. అక్కడి నుంచి రుద్ర ప్రయాగలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సాయంత్రానికి పోస్ట్మార్టం పూర్తి చేసి సహచర భక్తులకు మృతదేహాన్ని అప్పగించారు. అక్కడి నుంచి మంగళవారం రాత్రి 9 గంటలకు బయలుదేరగా.. 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అశ్వారావుపేటకు బుధవారం రాత్రి వరకు చేరుకోవచ్చని అంటున్నారు. వెంకటేశ్వరరావు మరణ వార్త తెలియడంతో ఇంటివద్ద భార్య, పిల్లలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. నెరవేరని చివరి కోరిక.. ఆరుగురు భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలలో 11 యాత్రలు ముగించుకుని చివరిది, కఠోరమైన కేదారినాథ్కు చేరుకున్నారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత బద్రీనాథ్ వెళ్లాలని, అక్కడ తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయాలని వెంకటేశ్వరరావు చెప్పాడని సహచరులు తెలిపారు. దీంతో పాటు తనకు కుమారులు లేనందున తాను కూడా ఆత్మ పిండ ప్రదానం చేసుకోవాలని చెప్పాడని, అయితే చివరి కోరిక నెరవేరకుండానే తుదిశ్వాస విడిచాడని విలపించారు. -
లైన్ క్లియరెన్స్ ఇక సులభం
● నూతన యాప్ను ప్రవేశపెట్టిన టీజీఎన్పీడీసీఎల్ ● ఉద్యోగులకు తప్పనున్న ఇబ్బందులు ● అధికారులు, ఉద్యోగులకు శిక్షణ భద్రాచలంఅర్బన్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈ క్రమంలో లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్సీ (ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యేక యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటివరకు ఎల్సీ తీసుకుంటే.. సబ్ స్టేషన్ ఆపరేటర్కు, తీసుకున్న ఉద్యోగికి మాత్రమే తెలిసేది. ఈ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది. ఏఈ పర్యవేక్షణ.. ఈ యాప్ను ఏఈలు పర్యవేక్షిస్తారు. సిబ్బంది ఏ ఫీడర్ వద్ద పనిచేస్తున్నారో అందులో సమాచారం ఇవ్వాలి. లైన్మెన్ యాప్ను తెరిచి సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని ఏఈకి సమాచారం పంపాలి. దాన్ని ఏఈ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సమాచారాన్ని అక్కడున్న లైన్మెన్కు చేరవేస్తారు. సంబంధిత ఉప కేంద్రం ఫీడర్ ఆపరేటర్కు యాప్ ద్వారా వివరాలు వెళ్తాయి. దాన్ని పరిశీలించిన అనంతరం ఆ ఫీడర్కు సంబంధించిన లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) ఇస్తారు. సూచనలిస్తూ.. పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్ అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. ప్రమాదాల నివారణకే.. విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. దీంతో భవిష్యత్లో ఎలాంటి ప్రమాదాలు జరగవు. –మహేందర్, ఎస్ఈ, భద్రాద్రి కొత్తగూడెం -
రమణీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. నేడు మంత్రి పొంగులేటి పర్యటనభద్రాచలం: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఉదయం 9.20 గంటలకు వాజేడు మండలం టేకులగూడెం, నగరం, ఎడ్జర్లపల్లి, అనంతరం 11.20 గంటల నుంచి వెంకటాపురం మండల కేంద్రం, పాత్రపురం, పాలెంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి చర్ల మండలంలోని సుబ్బంపేట, లక్ష్మీ కాలనీ, తేగడ గ్రామాల్లో, 3.45 గంటలకు దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు, సింగవరం, సాయంత్రం 4.45 గంటలకు భద్రాచలం మండలంలో పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. నిర్ణయించిన ఫీజులే వసూలు చేయాలికొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ల్యాబ్లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రజలకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ఫీజులు నిర్ణయించామని, ఆయా యాజమాన్యాలు ఆ మేరకే వసూలు చేయాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ కార్యాలయంలో సంప్రదించాలని ప్రజలను కోరారు. పట్టెడు కోయ సంస్కృతి పుస్తకావిష్కరణకరకగూడెం: మండలంలోని వీరాపురానికి చెందిన ఆదివాసీ మహిళ కుంజా వరలక్ష్మి రూపొందించిన పట్టెడు కోయ సంస్కృతి పుస్తకాన్ని హైదరాబాద్లో మంత్రి సీతక్క మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ తెగల చరిత్ర మరుగునపడుతున్న సమయంలో, వారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా నిలిపేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుందని చెప్పారు. పూర్వ కోయ తెగల చరిత్రను జానపద సాహిత్య రూపంలో సమాజానికి పరిచయం చేసిన వరలక్ష్మిని అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ భట్టు రమేష్, నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఆప్కా నాగేశ్వరరావు, రచయిత శోభ రమేష్తో పాటు గట్టుపల్లి రాంబాబు, వజ్జా నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. 21 మంది ఈఅండ్ఎం అధికారుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 21 మంది ఈఅండ్ఎం అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఒక అడిషినల్ జీఎం, ఏడుగురు డీజీఎంలు, 9 మంది ఎస్ఈలు, ఇద్దరు డిప్యూటీ ఎస్ఈలు, ఇద్దరు ఈఈలు ఉన్నారు. వీరంతా ఈ నెల 15వ తేదీ లోగా కేటాయించిన ఏరియాల్లో విదుల్లో చేరాలని యాజమాన్యం ఆదేశించింది. -
ఫలితాలు అథమం.. అధికారుల ఆగ్రహం
● గురుకులాల్లో ఇంటర్ ఉత్తీర్ణత తగ్గడంపై సెక్రటరీ సీరియస్ ● ఎనిమిది మందికి షోకాజ్ నోటీసులు జారీ ● త్వరలో పది ఫలితాలపైనా అదే పంథా భద్రాచలం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గురుకుల కళాశాలల్లో కొన్నిచోట్ల తక్కువ ఫలితాలు నమోదు కావడంపై గురుకులాల సెక్రటరీ కె.సీతాలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్కువ ఉత్తీర్ణత నమోదైన గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు సబ్జెక్టు అధ్యాపకులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఎనిమిది మంది నోటీసులు అందుకున్నారు. దీనిపై లిఖిత పూర్వక వివరణతో కూడిన నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకుంటే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పదో తరగతిపైనా పోస్ట్మార్టమ్.. ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఆశ్రమ పాఠశాలల్లో మెరుగుపడగా గురుకులాల్లో మాత్రం కొంత తగ్గింది. ఐటీడీఏ పరిధిలో ఉన్న 12 గురుకులాల్లో 849 మందికి 825 ఉత్తీర్ణులై 97.17 శాతం నమోదైంది. 2024లో ఇది 98.90 కాగా, ఈ ఏడాది 1.73 శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయి. దీనిపైనా గురుకులం ఉన్నతాధికారులు పోస్ట్మార్టమ్ చేస్తున్నారు. కాగా ఇదే ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో పది ఫలితాలు ఈ ఏడాది కొంత పెరిగాయి. ఐటీడీఏ పరిఽఽధిలో 45 ఆశ్రమ పాఠశాలలు, 13 వసతి గృహాలు, ఒక బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఈ ఏడాది 93.05 శాతం ఫలితాలు వచ్చాయి. 2024లో ఈ ఫలితాలు 90.60 శాతం కాగా ఈ ఏడాది 2.45 ఉత్తీర్ణత శాతం పెరిగింది. తక్కువ ఫలితాలు నమోదైన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలపై పీఓ రాహుల్ సమీక్షిస్తున్నారు. తక్కువగా నమోదైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గతంలోనే హెచ్చరిక జారీ చేసినప్పటికీ కొందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి సైతం త్వరలో షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024లో 11 మంది ప్రధానోపాధ్యాయులకు, 30 మంది సబ్జెకు టీచర్లుకు నోటీసులు అందజేశారు. కాగా, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ప్రధానోధ్యాయులు, ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల జారీపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. షోకాజ్ నోటీసులు సరికాదు తక్కువ ఫలితాలు నమోదయ్యాయనే పేరుతో షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరికాదు. అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థుల మేధస్సు ఒకేలా ఉండవు. వారిపై స్థానిక పరిసరాల ప్రభావం సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుని నోటీసులు జారీ చేయడం సబబు కాదు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి. – మునిగడప రామాచారి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, టీఎఫ్టీఎఫ్ నేత షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి ఇంటర్లో తక్కువ ఫలితాలు నమోదైన కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఎనిమిది మందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అందజేశాం. వీటిపై వారు వివరణ అందజేసిన అనంతరం తగు చర్యలు తీసుకుంటాం. – ఆరుణకుమారి, గురుకులాల ఆర్సీఓ సింగరేణి కళాశాలలో అతి తక్కువగా.. ఇటీవల ప్రకటించిన ఇంటర్ మీడియట్ ఫలితాల్లో కొన్ని కళాశాలల్లో ఉత్తీర్ణత ఆశాజనకంగానే ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలం స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 87.32 శాతం ఫలితాలు రాగా, అతి తక్కువగా సింగరేణి కళాశాలలో 34.62 శాతమే నమోదయ్యాయి. ఇంకా తిరుమలాయపాలెంలో 46.34, దమ్మపేటలో 57.58, కృష్ణసాగర్లో 62.90 శాతం మేర ఫలితాలు వచ్చాయి. 70 శాతం కంటే తక్కువ ఫలితాలు నమోదైన కళాశాలలపై గురుకుల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కళాశాలలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెక్రటరీ.. ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు షోకాజ్ నోటీసుల ద్వారా వివరణ అడిగారు. నోటీసులు అందుకున్న వారిలో కృష్ణసాగర్ గురుకుల ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, సింగరేణి గురుకులం ప్రిన్సిపాల్తో పాటు మరో అధ్యాపకుడు, దమ్మపేట గురుకుల ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులకు, తిరుమలాయపాలెం గురుకులం ప్రిన్సిపాల్ ఉన్నారు. కాగా, గుండాల కళాశాల 100 శాతం ఫలితాలు సాధించి అధికారుల అభినందనలు అందుకుంది. -
14 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్ : ఛత్తీస్గఢ్తో పాటు జిల్లాకు చెందిన 14 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్రాజ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన ఏసీఎం కేడర్ గలవారు ఇద్దరు, నలుగురు పార్టీ సభ్యులు, ముగ్గురు మిలీషియా సభ్యులు, కిసాన్ మజ్దూర్ సంఘ్కు చెందిన ఒకరితో పాటు దండకారణ్య కిసాన్ మజ్దూర్ సంఘ్కు చెందిన నలుగురు ఉన్నారని, వారిలో ముగ్గురు మహిళలని వివరించారు. హింసకు కాలం చెల్లిందని, మావోయిస్టుల సిద్ధాంతాలను ఎవరూనమ్మడం లేదని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 227 మంది లొంగిపోయారని, పోలీసులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై లొంగిపోతున్నారని తెలిపారు. పార్టీలో సీనియర్ల పోకడలు నచ్చక పోవడంతో పాటు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కూడా కలిసి వస్తోందన్నారు. ఇప్పుడు లొంగిపోయిన 14 మందిలో వారి స్థాయిని బట్టి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 227 మంది మావోయిస్టులు లొంగిపోగా, 130 మందికి రివార్డులు అందించడంతో పాటు పునరావాసం కల్పించామని తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు అనుసరిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దాడులు, మందుపాతరలను అమర్చడం వంటి చర్యలతో ఆదివాసీలను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, 81,141 బెటాలియన్ అధికారులు ఆర్ఎస్ శర్మ, కమల్వీర్ యాదవ్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 227 మంది.. 130 మందికి పునరావాసం కల్పించామని ఎస్పీ వెల్లడి -
యువకుడి మృతదేహం వెలికితీత
జూలూరుపాడు: పూడ్చి పెట్టిన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీసిన ఘటన మంగళవారం జూలూరుపాడులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జూలూరుపాడు ఎస్సీకాలనీకి చెందిన కత్తి రాములు, నాగమణి దంపతుల కుమారుడు కత్తి అరవింద్ (26) ఇటీవల మృతి చెందగా.. మృతిపై అనుమానాలున్నాయని తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ స్వాతిబిందు సమక్షంలో జేసీబీ సాయంతో సమాధి తొలగించి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. ఫోరెన్సిక్ నిపుణులు రమణమూర్తి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవి, సీఐ ఇంద్రసేనారెడ్డి వివరాలు వెల్లడించారు. ఐదు నెలల కిందట అరవింద్కు ఏన్కూర్కు చెందిన సింధుతో వివాహమైంది. గత నెల 1వ తేదీన పుట్టింటికి వెళ్లిన సింధు అత్తగారింటికి వచ్చింది. ఏప్రిల్ 2న ఫ్రైడ్ రైస్, నూడుల్స్ తిన్న అరవింద్ విరేచనాలు, వాంతలు కావడంతో ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. 7వ తేదీన అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా.. ఐదు రోజుల అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ 16న మృతి చెందాడు. కాగా, ఈ నెల 4న మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికితీసి, తహసీల్దార్ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించామని సీఐ పేర్కొన్నారు. ఎస్ఐ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఐ సీహెచ్ ఆదినారాయణ, పంచాయతీ సెక్రటరీలు హరిబాబు, లక్ష్మణ్, పోలీసులు పాల్గొన్నారు. -
ముంపు ముప్పుపై.. మరో అధ్యయనం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత 2022 జూలైలో వచ్చిన వరదలు నదీ పరివాహక ప్రాంతాలకు కొత్త అనుభవాలను చూపించాయి. బ్యాక్ వాటర్ ప్రభావంపై గతంలో వచ్చిన నివేదికల్లో పేర్కొన్న అంచనాలు ‘వరద’లో గల్లంతయ్యాయి. దీంతో బ్యాక్ వాటర్ ప్రభావంపై తిరిగి అధ్యయనం చేయాలనే డిమాండ్లు పెరిగాయి. మరోసారి అధ్యయనం చేయాల్సిందే.. 2022 గోదావరి వరదల తర్వాత పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై మరోసారి అధ్యయనం చేయాల్సిందేనని తెలంగాణ సర్కారు డిమాండ్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండగా ఈ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం కొట్టివేస్తూ వచ్చింది. చివరకు మరో సర్వేకు ఏపీ సర్కారు ఒప్పుకోక తప్పలేదు. ఈ మేరకు సీడబ్ల్యూసీ తరఫున వరద ముంపు ప్రభావంపై సర్వే జరగనుంది. అయితే 2016లో చేపట్టిన సర్వే ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కారు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాలపై ఏ మేరకు ఉంటుంది.. కిన్నెరసాని, ముర్రేడు వాగులపై ఎలాంటి ప్రభావం చూపతుందనే అంశంపై ఐఐటీ – హైదరాబాద్ ఇంజనీర్ల బృందంతో సర్వే చేయించాలని ఇరిగేషన్ శాఖకు గత జనవరి 5న సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాజాగా కేంద్ర జల సంఘం సర్వే.. గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పోలవరం వెనుక వైపు 146 కి.మీ దూరంలో ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట వరకు ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని ఐఐటీ – హైదరాబాద్ను కోరుతూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఈ ఏడాది జనవరి 29న లేఖ రాసింది. దీంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ముందు గతంలో ఈ అంశంపై జరిగిన పలు సర్వేలు, ఇతర వివరాలను ఐఐటీ – హైదరాబాద్ సేకరించింది. అయితే అప్పటి నుంచి ఈ అంశంపై పెద్దగా కదలిక కనిపించ లేదు. కాగా గోదావరి వరదలు, వాటి తాలూకు ప్రభావాలను కేంద్ర జల సంఘానికి చెందిన బృందం పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో సోమవారం సర్వే చేపట్టింది. దీంతో మరోసారి ఐఐటీ – హైదరాబాద్ సర్వే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించగా.. సర్వేకు అవసరమైన వివరాలను ఐఐటీ – హైదరాబాద్ బృందానికి అప్పగించామని, వచ్చే నెలలో క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు. వరద భయాలు.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై కేంద్ర జలసంఘం 2016లో సర్వే చేపట్టింది. ఈ ప్రాజెక్టును 46 మీటర్ల ఎత్తు వద్ద గేట్లు మూసి పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో నింపితే ఎంత ముంపు ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు. అలాగే రికార్డు స్థాయి వరద వస్తే భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలపైనా వివరాలు సేకరించారు. 1986లో భద్రాచలం వద్ద వచ్చిన గరిష్ట వరద 35 లక్షల క్యూసెక్కులు, 76 అడుగుల వరకై తే తెలంగాణలో ముంపు ఉండదని అంచనా వేశారు. కానీ 2022 జూలైలో వచ్చిన వరద ఈ అంచనాలను తారుమారు చేసింది. భద్రాచలం వద్ద 24.50 లక్షల క్యూసెక్కుల వరద, 71.60 అడుగులు నమోదు కాగా, ఈ వరదకే జిల్లాలోని 102 గ్రామాల్లో 16 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయి. అంటే 2016 నాటి సీడబ్ల్యూసీ నివేదిక అంచనాలు తప్పాయి. గోదావరి వరద ప్రవాహం కేవలం ఈ నదికే కాకుండా ఉపనది అయిన కిన్నెరసాని, దాని ఉపనదైన ముర్రేడు వాగుపై కూడా కనిపించింది. -
ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం
చుంచుపల్లి: రామవరం రేంజ్, పెనగడప సెక్షన్ పరిధిలోని జగ్గారం గ్రామం అటవీ ప్రాంతంలో రేంజ్ ఆఫీసర్ ఎల్లయ్య, సెక్షన్ ఆఫీసర్ సలూజా, బీట్ అధికారులతో మంగళవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ సరిహద్దులు పరిశీలిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన గొత్తికోయలు దాడి చేసేందుకు యత్నించారు. కొందరు అటవీ సిబ్బంది తప్పించుకుని బయటపడ్డారు. ఈ ఘటనపై కొత్తగూడెం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడవి గేదెల దాడిలో ఇద్దరికి గాయాలు సత్తుపల్లిరూరల్: రహదారిపై వెళ్తున్న ఆటోకు అడ్డుగా వచ్చిన అడవి గేదెలు దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెనగడప నుంచి పలువురు కూలీలు మంగళవారం సత్తుపల్లికి బయలుదేరారు. ఈ ఆటో యాతాలకుంట వద్ద రోడ్డు దాటుతుండగా, పక్క నుంచి అడవి గేదెలు దూసుకొచ్చి ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న పల్లపు రాజు, బోసు ఓదేలుకు గేదెల కొమ్ములు తాకడంతో తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బెదిరింపు ఫోన్పై కేసు నమోదు కొత్తగూడెంటౌన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న గుండా శ్రీనివాస్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మంగళవారం కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ కరుణాకర్ కఽథనం ప్రకారం.. తనకు తెలిసిన ఓ మహిళను సింగరేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ను చేయాలని, తాను మంత్రి అనుచరుడినని సింగరేణి ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో సెక్రటరీగా పనిచేస్తున్న గుండా శ్రీనివాస్కు గుర్తు తెలియని వ్యక్తి (రఘు) ఫోన్ చేసి బెదిరించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఏసీబీ అదుపులో సింగరేణి ఉద్యోగి సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని మెయిన్ వర్క్షాపులో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావును మంగళవారం అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్సీ రమేశ్ తెలిపారు. ఇల్లెందు గెస్ట్హౌజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకున్న సింగరేణి ఉద్యోగుల వివరాలు తెలుసుకొని డబ్బులు వసూలు చేశాడని, ఉద్యోగాలు పెట్టిస్తానని అమాయకులను వలలో వేసుకొని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సింగరేణి విజిలెన్స్ విచారణలో తేలిందని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నామని, ఆయన బ్యాంకు ఖాతాల్లోకి రూ.32 లక్షలు లావాదేవీలు నడిచాయని తెలిపారు. రేపు ఆయన్ను వరంగల్లోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామని, దీని వెనుక మరికొందరు ఉన్నట్లు తెలిసిందని, వివరాలు సేకరించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ వివరించారు. ఉద్యోగి ఆత్మాహత్యాయత్నం దుమ్ముగూడెం: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న కృష్ణమ్మ ఎలుకలమందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతోపాటు మెమో జారీ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై ఎంపీడీఓ బద్ది రామకృష్ణ వివరణ కోరగా.. కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో మెమో జారీ చేశామని, గతంలో కూడా పలుమార్లు మెమోలు జారీ చేశామని వాటికి సమాధానం కూడా ఇవ్వలేదని తెలిపారు. -
34 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొత్తగూడెంటౌన్: ఏపీ నుంచి ఛత్తీస్గఢ్కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కొత్తగూడెంలో పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. రైటర్బస్తీలో ఎస్ఐ విజయలక్ష్మి సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన లారీని ఆపి తనిఖీ చేయగా.. రేషన్ బియ్యం దొరికాయి. రూ.12.36 లక్షల విలువైన 687 బస్తాల్లోని 34 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నామని ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన చప్పిడి వెంకటకృష్ణ, లింగపాలెంకు చెందిన చల్లాగుల రామ్మోహన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లా రాజీం మండలం జెంజ్రా గ్రామానికి చెందిన భువనేశ్వర్ సాహు, అదే మండలానికి చిత్తరంజన్ తారక్లు విచారణలో తెలిపారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన చిట్టెల రమకనకాచారి, నాగరాజు (డ్రైవర్), పరమ్ ప్రీత్సింగ్ (లారీఓనర్), కృతిక గోస్వామి పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. ఈ ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని సీఐ ఎం.కరుణాకర్ తెలిపారు. -
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
మణుగూరుటౌన్: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అంతమొందించేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోలతో చర్చలు జరిపేది లేదని కగార్ ఆపరేషన్ను వెనక్కు తీసుకోబోమని మాట్లాడటం వికృత చర్య అని, నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనుల హత్యలు చేస్తున్నా మాట్లాడకపోవడం విచారకరమన్నారు. ఈ నెల 12వ తేదీన అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు జరిగే శాంతి ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు అయోధ్య, నెల్లూరు నాగేశ్వరరావు, ఏనుగు చంద్రం, రూపురెడ్డి మధుసూదన్రెడ్డి, సువర్ణపాక నాగేశ్వరరావు, వజ్జా జ్యోతిబసు, ఇమామ్, సిరాజ్, నూరుద్దీన్, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నాలక్ష్మీకుమారి, సత్రపల్లి సాంబశివరావు, దుర్ాగ్యల సుధాకర్, జక్కుల రాంబాబు, కోమరం గణేశ్ తదితరులు ఉన్నారు. -
10న ‘సౌరగిరి’కి శ్రీకారం
● ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి పైలట్ గ్రామంగా బెండాలపాడు ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం ● ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ చండ్రుగొండ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి ఈనెల 10న శ్రీకారం చుట్టనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. గిరిజనుల పోడు భూముల్లో సాగునీటి సదుపాయం కల్పన కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడులో ప్రారంభిస్తారని వెల్లడించారు. పోడుపట్టాలు పొందిన ప్రతీ రైతుకు 2.5 ఎకరాల భూమిలో రూ. 6 లక్షల వ్యయంతో బోరుబావుల నిర్మించనున్నట్లు తెలిపారు. అంతకంటే తక్కువ భూమి ఉన్నవారికి ఇతర రైతులను అనుసంధానం చేస్తూ బోరు మంజూరు చేస్తారని వివరించారు. పోడుభూముల్లో సాగునీటి సదుపాయంతోపాటు డ్రిప్ ఇరిగేషన్, భూమి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆయిల్పామ్ సేద్యం వైపు పోడురైతులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, నాయకులు భోజ్యానాయక్, ఫజల్, బొర్రా సురేష్, మల్లం కృష్ణయ్య పాల్గొన్నారు. -
కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలి..
సింగరేణి(కొత్తగూడెం): సంస్థ నిర్వహించే రెస్క్యూ శిక్షణలో ప్రావీణ్యం సాధించి, కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలని ఏరియా జీఎం ఎం.శాలేంరాజు పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని 3 ఇంక్లైన్లోని రెస్క్యూ స్టేషన్లో తొలిసారిగా మహిళలకు ఇస్తున్న శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఈ శిక్షణకు ముందు బేసిక్ టెస్ట్ ఉంటుందని, అందులో ఉత్తీర్ణులైనవారికే శిక్షణ ఇస్తారని, ఒక్క ట్రెయినీ సుమారు 10 మంది ప్రాణాలను కాపాడే నైపుణ్యం సంపాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఎస్ఓటూ జీఎం కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, అనంత రామయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 8న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని ఆర్గనైజర్ సీహెచ్.గోపి తెలిపారు. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన అండర్ – 7, 9, 11 విభాగాల్లో బాలబాలిలకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వివరాలకు 94401 62749 నంబర్లో సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో డీపీఓ పర్యటన జూలూరుపాడు: మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) చంద్రమౌళి పర్యటించారు. కొమ్ముగూడెం, శంభునిగూడెం, అనంతారం,గుండెపుడి,జూలూరుపాడుల్లో జరుగుతున్న ఇంకుడుగుంతల నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. వర్షాకాలంలో నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడుగుంతలు ఉపయోగపడతాయన్నారు. ఎంపీఓ తులసిరామ్, పంచాయతీ సెక్రటరీలు ఖాదర్మియా, శ్రీహరి, సతీశ్, శైలజ, రవి పాల్గొన్నారు. పేకాట స్థావరంపై దాడి అశ్వారావుపేటరూరల్: పేకాట స్థావరంపై మంగళవారం స్థానిక పోలీసులు దాడి చేశారు. ట్రెయినీ ఎస్ఐ అఖిల కథనం ప్రకారం.. స్థానిక మోడల్కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,300 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ట్రెయినీ ఎస్ఐ తెలిపారు. వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఏడాది జైలు భద్రాచలంఅర్బన్: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన భద్రాచలం పట్టణానికి చెందిన లక్ష్మణ్కు ఏడాది జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ మంగళవారం తీర్పు చెప్పారు. తనను లక్ష్మణ్ లైంగికంగా వేధిస్తున్నాడని 2022లో భానుమతి అనే మహిళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. రెండు బైకులు ఢీ ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు దమ్మపేట: ఆగి ఉన్న బైకును ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టిన ఘటనలో రోడ్డుపై నిలబడి ఉన్న యువకుడు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పార్కలగండి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జగ్గారం సమీపంలోని గుర్వాయిగూడెంనకు చెందిన వగ్గెల వంశీ, జగ్గారం గ్రామానికి చెందిన సోయం సిద్ధార్థ, మణుగూరుకు చెందిన కొమరం చందు డ్యూక్ బైక్పై జగ్గారం నుంచి దమ్మపేటలో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు వస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్ మిడియం దుర్గారావు, చీపురుగూడెం గ్రామానికి చెందిన బొక్కా ఉపేంద్ర (21)తో కలిసి దమ్మపేట వైపునకు బైక్పై వస్తున్నారు. పార్కలగండి శివారులో బైకును ఆపి రోడ్డుపై నిలబడ్డారు. మరో ఇద్దరు పల్సర్ బైక్పై వెళ్తూ ఉపేంద్రను అంబర్ కావాలని అడిగారు. ఉపేంద్ర వారికి అంబర్ ఇవ్వబోతుండగా వగ్గెల వంశీ బైక్ను వేగంగా నడుపుకుంటూ వచ్చి ఉపేంద్రతో పాటు ఆగి ఉన్న బైక్ను బలంగా ఢీకొట్టాడు. ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా.. డ్యూక్ బైక్పై ఉన్న ముగ్గురు, పల్సర్పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 ద్వారా అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వ్యవసాయ వ్యాపారులుగా ఎదగాలి
● ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఉపాధి కల్పకులుగా మారాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ అశ్వారావుపేట: వ్యవసాయ విద్యార్థులు భావి వ్యవసాయ అనుబంధ వ్యాపారులుగా ఎదగాలని, ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా పలువురికి ఉపాధి కల్పించేవారుగా మారాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాలలో సాగువుతున్న మామిడి, మునగ, ఇతర ఉద్యాన పంటలు, జరుగుతున్న పరిశోధనలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. వ్యవసాయ విద్య అభ్యసించిన తర్వాత ఉద్యోగాన్వేషణ చేయకుండా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఎదగాలని సూచించారు. తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందన్నారు. విద్యాభ్యాసంలో భాగంగా గ్రామాల్లో రైతులను కలిసి సూచనలు చేయడమే కాక వారి అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలన్నారు. అర్హులకు భూ భారతి పట్టాలు అశ్వారావుపేట రెవెన్యూ 911, కన్నాయిగూడెం రెవెన్యూ 152 సర్వే నంబర్లలో అర్హులకు భూ భారతి చట్టం ప్రకారం నూతన పట్టాలు జారీ చేస్తామని కలెక్టర్ అన్నారు. జాయింట్ సర్వే ద్వారా సమస్యల పరిష్కరిస్తామని చెప్పారు. ఆ తర్వాత గోగులపూడిలో వెదురు కళాకృతుల తయారీదారులతో మాట్లాడి.. వారి ఆర్థిక అభ్యున్నతికి శిక్షణ, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తామని అన్నారు. అనంతరం గుబ్బలమంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏడీఏ రవికుమార్, ఏఓ శివరామప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, నాయబ్ తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారం లోగా ఇంకుడు గుంతలు పూర్తవ్వాలి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వారం రోజుల్లోగా ఇంకుడుగుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలన్నారు. వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. పనులు పూర్తయ్యాక జల్ సంచెయ్ జెన్ భాగీ దారి పోర్టల్లో పంచాయతీ కార్యదర్శులతో అప్లోడ్ చేయించాలని చెప్పారు. వ్యవసాయ భూముల్లోనూ నిర్మాణాలకు మార్కింగ్ చేయాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మాణాలు చేపడతామని, ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి వేణుగోపాల్, విద్యాచందన పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ సందర్శన.. ములకలపల్లి : ములకలపల్లి పోలీస్స్టేషన్ను కలెక్టర్ పాటిల్ మంగళవారం సందర్శించారు. స్టేషన్ ఆవరణలో చేపట్టిన ఇంకుడుగుంతల నిర్మాణాలను పరిశీలించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యశాలలు, హెల్త్ సబ్సెంటర్లు, పోలీస్స్టేషన్లలో టాయిలెట్లు నిర్మిస్తామని తెలిపారు. పీహెచ్సీని సందర్శించి ఆశా వర్కర్ల పనితీరును కలెక్టర్ అభినందించారు. ఆస్పత్రి చుట్టూ ప్రహరీని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీఓ గద్దె రేవతిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, డీఎంఅండ్హెచ్ఓ భాస్కర్నాయక్, ఎంఈఓ సత్యనారాయణ, డాక్టర్లు సాయికల్యాణ్, కృష్ణదీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లు ఏర్పాటు చేయాలి
పాల్వంచరూరల్: సీతారామ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లను ఏర్పాటు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ అన్నారు. మండలంలోని పెద్దమ్మగుడి సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగిన జిల్లా వర్క్షాప్లో ఆయిన మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుకు డిస్ట్రిబ్యూటర్ కెనాళ్లను ఏర్పాటు చేయకపోతే జిల్లా ఎండిపోయే ప్రమాదం ఉందని, జిల్లా నుంచి నీరుపోతున్నా జిల్లాకు చుక్కనీరు ఇవ్వకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఈ సమస్యపై ఈ నెల 20 వరకు ఊరూరా గ్రామసభల నిర్వహణ, 30న మండలస్థాయిలో ధర్నాలు, అనంతరం కలెక్టరేట్ను దిగ్బంధిస్తామని వెల్లడించారు. సమావేశంలో మచ్చా వెంకటేశ్వర్లు, అన్నారపు కనకయ్య, అన్నారపు సత్యనారాయణ, ధర్మ, దొడ్డ లక్ష్మీనారాయణ, కొండబోయిన వెంకటేశ్వర్లు, రవికుమార్, సత్యనారాయణ, కేశవరావు, తిరుపతిరావు, శ్రీకాంత్, శంకర్ పాల్గొన్నారు. -
ప్రజాసమస్యలు పరిష్కరించాలి
ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. 8లోమరింత ప్రణాళికాయుతంగా.. హరితహారం కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రధానంగా వాసి కంటే రాశి మీదనే దృష్టి కేంద్రీకృతమైంది. గతంలో పాఠశాల్లలో కానుగ, వేప వంటి నీడ నిచ్చే చెట్లనే ఎక్కువగా నాటేవారు. ఆ తర్వాత వీటిని పట్టించుకునే అంశంపై అంతగా శ్రద్ధ పెట్టేవారు కాదు. కానీ గతేడాది ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చి, ఆయా ప్రదేశాల్లో పరిస్థితులు, అక్కడి ప్రయోజనాల ఆధారంగా మొక్కలు నాటడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా స్కూళ్లలో మునగ, తులసి, కలబంద, ఉసిరి, కరివేపాకు వంటి చెట్లను నాటారు. గతంలో పోల్చితే ఈ ప్రయోగం పాఠశాలల్లో విజయవంతమైంది. అనేక స్కూళ్లలో గతేడాది నాటిన చెట్లు బతికి ఉండటంతో పాటు తమవంతు ప్రయోజనాలు అందిస్తున్నాయి. దీంతో ఈసారి వన మహోత్సవంలో మరింత ప్రణాళికాయుతంగా ఈ పని చేయబోతున్నారు. ఎకై ్సజ్ శాఖ తాటి, ఈత చెట్లు, ఇరిగేషన్ శాఖ సుబాబుల్, వట్టి వేర్లు, అటవీశాఖ వెదురు, విద్యాశాఖ ఔషధ మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రైతులను సైతం భాగస్వాములను చేసేందుకు ఎర్ర చందనం, టేకు, వెదురు మొక్కలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. -
లెక్కలు కాదు.. మొక్కలు
గతంలో శాఖల వారీగా హరితహారం లక్ష్యాలు ● ఈసారి ఒక్కో శాఖకు ఒక్కో రకం మొక్కల కేటాయింపు ● తాటి, సుబాబుల్, వెదురు వంటి వాటికి ప్రాధాన్యత ● వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్న కలెక్టర్ పాటిల్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో అడవులు, పచ్చదనం పెంచేందుకు గత పదేళ్లుగా హరిత హారం, వన మహోత్సవం పేరుతో ప్రత్యేకంగా మొక్కలు నాటుతున్నారు. ప్రారంభంలో ఈ కార్యక్రమం ప్రణాళియుతంగా సాగినా.. ఆ తర్వాత మొక్కుబడిగా మిగిలిపోయిందనే విమర్శలు వచ్చాయి. అయితే పదేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని సరికొత్త పంథాలో తీసుకెళ్లేందుకు కలెక్టర్ జితేశ్ పాటిల్ ప్రయత్నాలు మొదలెట్టారు. శాఖల వారీగా.. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 70 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించిన కలెక్టర్.. ఈ మేరకు శాఖల వారీగా ఎన్ని మొక్కలు నాటాలనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చారు. అత్యధికంగా గ్రామీణాభివృద్ధి శాఖకు 30 లక్షల మొక్కలు లక్ష్యంగా నిర్దేశించగా తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖకు 12 లక్షలు, సింగరేణికి 10 లక్షలు, అటవీ శాఖకు 10 లక్షల చొప్పున కేటాయించారు. ఇంకా ఇతర విభాగాలకు కూడా లక్ష్యాలను నిర్ణయించారు. గత పదేళ్లుగా ఇదే తరహాలో మొక్కలు పెంపకంపై ప్రణాళికలు ఘనంగా కనిపించినా వాటి తాలూకు ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో అంతగా కనిపించడం లేదు. నాటిన మొక్కలను కాపాడలేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి జవాబుదారీతనం పెంచే ప్రయత్నం ఈసారి జరుగుతోంది. వెదురు యాక్షన్ ప్లాన్.. రాష్ట్రంలో అడవులు ఎక్కువగా విస్తరించిన జిల్లాగా భద్రాద్రికి గుర్తింపు ఉంది. కానీ ఇక్కడ ఆశించిన స్థాయిలో వెదురు వనాలు లేవు. వెదురుతో ఫర్నిచర్ తయారు చేసే నైపుణ్యం గలవారు జిల్లాలో ఉన్నా ముడి వెదురు ఆశించిన స్థాయిలో లభించడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు వీలుగా వెదురు మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖకే కేటాయించారు. దీంతో అడవి చిక్కబడటంతో పాటు వృత్తి నైపుణ్యం గల వారికి ఉపాధి లభిస్తుంది. అంతేకాక.. జిల్లాలో చేపట్టాలని ఆశిస్తున్న సమ్మిళిత సాగుకు వెదురు వనాల పెంపకం తోడ్పాటును అందించనుంది. ఇదే తరహాలో సాగునీటి కాల్వల వెంట వట్టివేర్లు, సుబాబుల్ వంటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇస్తే ఇతర జిల్లాలకు భద్రాద్రి ఆదర్శంగా నిలిచే అవకాశముంది. -
వేసవి శిబిరం షురూ..
● 15 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ● ఒక్కో సెంటర్ నిర్వహణకు రూ.50 వేలుమణుగూరు టౌన్: ఇప్పటివరకు హైదరాబాద్తో పాటు పాత జిల్లా కేంద్రాలోన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే నిర్వహించిన యంగ్ ఇండియా వేసవి శిక్షణ శిబిరాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. ఈ మేరకు పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, బూర్గంపాడు, ఆళ్లపల్లి మండలాల్లో మొత్తం 12 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం శిక్షణ క్యాంప్లు ప్రారంభమయ్యాయి. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కనీసం 20 మందికి పైగా హాజరయ్యే విద్యార్థుల కోసం ఒక్కో సెంటర్కు ప్రభుత్వం రూ.50 వేల చొప్పున కేటాయించగా శిక్షణ ఖర్చులతో పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి వలంటీర్లను నియమించి శిక్షణ ఇప్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. ఏమేం నేర్పిస్తారంటే..? యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ల కోసం జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేశారు. విద్యార్థులు ప్రతిరోజూ హాజరయ్యేలా ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి 15 పని దినాల్లో ఒక్కో రోజు ఒక్కో అంశంపై శిక్షణ ఇస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే శిక్షణలో ప్రతిరోజూ మొదటి 20 నిమిషాలు ప్రాణాయామం, ఎక్సర్సైజులు, తర్వాత 10 నిమిషాలు విరామం, అనంతరం గంటన్నర పాటు యాక్టివిటీలు, చివరి గంట నీతి కథలు, వాటి నుంచి విద్యార్థులు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలపై ఆడియో, వీడియో రూపంలో శిక్షణ ఇస్తారు. ప్రధానంగా చెస్, యోగా, క్యారమ్స్, సైన్స్ ప్రయోగాలు, పెయింటింగ్, చేతిరాత మెరుగు కోసం, నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, డ్రాయింగ్, కాగితాల బొమ్మలు, సాధన వంటి ఆటలపై శిక్షణతో పాటు స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్పై అవగాహన కల్పిస్తారు. పిల్లలకు మానసికోల్లాసం పభుత్వం ఇలాంటి అంశాలకు శ్రీకారం చుట్టడంతో ఎప్పుడూ చదువుకునే విద్యార్థులకు మానసికోల్లాసం కలుగుతుంది. వారిలో సూక్ష్మగ్రహణ శక్తి పెరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆటల్లో పాటించాల్సిన మెళకువలపై అవగాహన పెంచుకోవచ్చు. –జి.నాగశ్రీ, హెచ్ఎం, మణుగూరు జెడ్పీ హైస్కూల్ సమ్మర్ క్యాంపు ప్రారంభం అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం ప్రభుత్వ పాఠశాలలో యంగ్ ఇండియా సమ్మర్ క్యాంపును ఎంపీడీఓ వరప్రసాద్, ఎంఈఓ వీరస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ నెల 21 వరకు నిర్వహించనున్న ఈ క్యాంప్లో చదువు, ఆటలు, డ్రాయింగ్, గార్డెనింగ్ వర్క్, సీడ్ కలెక్షన్, పేపర్ క్రాప్ట్స్, కంప్యూటర్ స్కిల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రేపు పొంగులేటి పర్యటన దుమ్ముగూడెం : మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం హాజరు కానున్నారని తెలిసింది. చిన్నబండిరేవులో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాల పంపిణీ, సింగవరం – ఎన్ లక్ష్మీపురం గ్రామాల మధ్య పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన, కె దంతెనం పంచాయతీలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తారని సమాచారం. అయితే మంత్రి పర్యటనపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన వెలువడలేదు. జూన్ 9 నుంచి లోక్ అదాలత్జిల్లా జడ్జి పాటిల్ వసంత్ వెల్లడి కొత్తగూడెంటౌన్: జూన్ 9 నుంచి 14 వరకు జరిగే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ఒక ప్రకటనలో సూచించారు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఈనెల 19 వరకు అన్ని కోర్టులో ముందస్తు లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఇతరులు వేసిన చెక్బౌన్స్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రియదర్శిని మరణం తీరని లోటు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని మరణం తీరని లోటని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. 2008లో జిల్లా జడ్జిగా సేవలు ప్రారంభించి, పలు జిల్లాల్లో విధులు నిర్వహించారని తెలిపారు. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారని, న్యాయ వ్యవస్థకు ఆమె వినూత్న సేవలు అందించారని కొనియాడారు. అంతకుముందు ప్రియదర్శిని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జడ్జి ఎస్,సరిత, సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్కుమార్, అదనపు సివిల్ జడ్జి కె.కవిత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్, కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, జూనియర్ సివిల్ జడ్జీలు సుచరిత, కె.సాయిశ్రీ, బి.రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జె.గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సహాయ కార్యదర్శి కాసాని రమేష్, కోశాధికారి కె.చిన్నికృష్ణ, మహిళా కార్యదర్శి ఆడపాల పార్వతి, క్రీడల కార్యదర్శి ఉప్పు ఆరుణ్, గ్రంథాలయ కార్యదర్శి మాలోతు ప్రసాద్ పాల్గొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలిపాల్వంచ: విద్యుత్ ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ అన్నారు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుంటారని, ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు అవసరమని సూచించారు. ఐఎస్ఐ ప్రమాణాలు గల రక్షణ పరికరాలనే వినియోగించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈ నందయ్య, ఏడీఈ హుస్సేన్, ఏఈలు మధు, ప్రతాప్, నరేష్, రవీందర్ పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమానికే ‘భూ భారతి’
సుజాతనగర్ : రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ మండలాన్ని పైలట్ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా.. గరీభ్పేట, బేతంపూడి గ్రామాల్లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ వివాదాల పరిష్కారానికి ఈ చట్టం దోహదం చేస్తుందన్నారు. రైతులకు వారి భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్ఓఆర్ తెచ్చిందని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 15 వరకు సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, తహసీల్దార్ శిరీష, ఆర్లు వీరభద్రం, కాంతారావు పాల్గొన్నారు. పంటల మార్పిడితో అధిక లాభాలు..సూపర్బజార్(కొత్తగూడెం): పంటల మార్పిడి పద్ధతి అనుసరిస్తే అధిక లాభాలు గడించొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాబోయే వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం పెనగడపలో సోమవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 13 వరకు సదస్సులు కొనసాగుతాయన్నారు. పంటల సాగులో యూరియా వాడకాన్ని తగ్గించాలని, అవసరమైన మేరకే రసాయనిక ఎరువులు వాడుకుని ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల వైపు కూడా రైతులు ఆసక్తి చూపాలని అన్నారు. కేవీకే శాస్త్రవేత్తల సేవలను ఉపయోగించుకోవాలని, సాగులో శాసీ్త్రయత పెంపొందించుకుని అధిక లాభాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, ఉద్యాన శాస్త్రవేత్త బి.శివ, కొత్తగూడెం ఏడీఏ నరసింహారావు, చుంచుపల్లి ఏఓ రాజేశ్వరి, ఏఈఓ మమత పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల ప్రారంభంలో కలెక్టర్ పైలట్ ప్రాజెక్ట్గా సుజాతనగర్ మండలం -
ఇద్దరు నకిలీ మావోయిస్టులు అరెస్ట్
గుండాల: మూడు నెలల నుంచి మావోయిస్టు పార్టీ పేరుతో వ్యాపారులను బెదిరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గుండాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గుండాల ఎస్సై సైదా రవూఫ్ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా తూరుబాక వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకున్నారు. విచారించగా గుండాల మండలం గణాపురం గ్రామానికి చెందిన కల్తిపాపయ్య అలియాస్ సర్పంచ్, ఆళ్లపల్లి మండలం నడిమిగూడెం గ్రామానికి చెందిన పాయం రాజేందర్గా తేలింది. వీరు గతంలో ప్రజాప్రతిఘటన దళంలో పని చేశారు. జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం మావోయిస్టు పార్టీ పేరుతో మూడు నెలలుగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వ్యాపారులను ఫండ్ కావాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిపై నిఘా ఉంచగా తప్పించుకుని తిరుగుతున్నారు. సోమవారం పట్టుబడగా, వారి నుంచి రూ. 5వేలు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్, ఎస్సై సైదా రహూఫ్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులను ఆయన అభినందించారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
అశ్వారావుపేట: అంతర్రాష్ట్ర దొంగను సోమవారం అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ కథనం ప్రకారం... అశ్వారావుపేట ఎస్ఐ అఖిల భద్రాచలం రోడ్లో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ ముత్యాల గణేష్ దొంగిలించిన బైక్తో పరారవుతుండగా పోలీసులు గమనించి పట్టుకున్నారు. విచారించగా గతంలో 10 బైక్లను చోరీ చేసినట్లు తేలింది. అశ్వారావుపేటలో 3, దమ్మపేటలో 1, ఏపీలోని తడికలపూడిలో 6 బైక్లు అపహరించినట్లు తెలిపాడు. పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. సమావేశలో సీఐ నాగరాజు, ఎస్ఐ యయాతి రాజు, ఎస్ఐ అఖిల, సిబ్బంది నాగేంద్రరావు, వెంకటేశ్వరావు, సిబ్బంది ఉన్నారు. -
ఓసీ–4లో కార్మికుడికి గాయాలు
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–4లో పనులు నిర్వహిస్తున్న క్రమంలో జారిపడి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన సోమవారం జరిగింది. వివరాలు ఇలా.. ఫిట్టర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యనాయుడు ల్యాడర్పై వెల్డింగ్ పనులు జరుగుతున్న క్రమంలో స్టాండ్ ఒక్కసారిగా వైపునకు ఒరిగిపోయింది. దీంతో 12 అడుగుల ఎత్తు పైనుంచి జారిపడ్డాడు. దీంతో కార్మికుడి తలకు, ఛాతీ పక్కటెముకకు, మెడకింద భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స అందించి మెరుగైన వైద్యసేవలకు కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిడుగుపాటుతో మూడు పశువులు మృతిదుమ్ముగూడెం : మండలంలోని మారాయిగూడెం పంచాయతీ పరిధి జిన్నెగట్టు గ్రామానికి చెందిన అపకా రామారావుకు చెందిన మూడు పశువులు ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాయి. పశు వైధ్యాధికారి లిఖిత పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తనకు పరిహారం చెల్లించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టుఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామపంచాయతీ కట్టుగూడెం గ్రామం శివారు పురాతన పెంకు పరిశ్రమలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.46వేల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు, కారు, రెండు బైక్లను స్వాదీనం చేసుకున్నారు. కాగా స్థావరం నిర్వాహకుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు. మహిళపై కేసు నమోదు కూసుమంచి: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.3.29 లక్షలు కాజేసిన మహిళపై సోమవారం కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేశారు. కూసుమంచికి చెందిన దామళ్ల రామచంద్రయ్యను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడుకు చెందిన గుదిబండ్ల ఆదిలక్ష్మి పరిచయం చేసుకుంది. రామచంద్రయ్య కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆయన నుంచి విడతల వారీగా రూ.3.29లక్షలు తీసుకుని ముఖం చాటేసింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఆయన చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. వైటీపీఎస్ డీఈ మృతికి సంతాపంమృతుడి అవయవాలను దానం చేసిన కుటుంబీకులు పాల్వంచ: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ డీఈ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పాల్వంచలో సోమవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కేటీపీఎస్ కాంప్లెక్స్లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించిన డీఈ ధరావత్ రమేష్ (47) రెండు నెలల క్రితం వైటీపీఎస్కు బదిలీపై వెళ్లాడు. వారం రోజుల క్రితం బైక్పై ఖమ్మం నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డాడు. దీంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతని అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ ట్రస్ట్కు అందించారు. మృతదేహాన్ని సోమవారం పాల్వంచలోని కేటీపీఎస్ క్వార్టర్ (నివాసం)కు తీసుకొచ్చారు. పలువురు అధికారులు, ఉద్యోగులు సందర్శించి నివాళులర్పించారు. -
విలువైన సొత్తు.. చోరీకి అదును
● ఖమ్మం కేబుల్ బ్రిడ్జి సామగ్రిపై దొంగల కన్ను ● ఇటీవల అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడిఖమ్మంక్రైం: ఖమ్మంలోని కాల్వొడ్డులో మున్నేటిపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం నిర్మాణ సంస్థ సమకూర్చుకున్న సామగ్రిపై దొంగల కన్ను పడింది. ఈ ప్రాంతంలో విలువైన సామగ్రి తరచుగా చోరీ అవుతుండడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, సెక్యూరిటీ సిబ్బందికి తలనొప్పిగా మారింది. వర్షాలు వస్తే మున్నేటిలో వరద పెరిగి నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడుతుందనే భావనతో ఇటీవల భారీగా సామగ్రిని సమకూర్చుకుని పనుల్లో వేగం పెంచారు. ఈ ప్రాంతంలో పలువురు సెక్యూరిటీ గార్డులను నియమించినా, వారి కళ్లుగప్పుతున్న కొందరు చోరీ చేస్తున్నారు. అయితే, ఇక్కడ సామగ్రి చోరీపై ఖమ్మం త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు. దీంతో అనుమానితులను పట్టుకుని విచారించగా సమీప ప్రాంతానికి చెందిన అకతాయిలుగా గుర్తించినట్లు సమాచారం. అయితే, కేసు నమోదు చేయకుండా వారి తరఫున కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండడంతో చోరీలు సర్వసాధారణమయ్యాయి. సెక్యూరిటీ గార్డ్పై కత్తులతో దాడి... ఇదిలా ఉండగా గతవారం చోరీ వచ్చిన కొందరు వ్యక్తులు అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుపై కత్తులతో దాడి చేశారు. నిర్మాణ ప్రాంతం నుంచి విలువైన సామగ్రిని ఎత్తుకెళ్తుండగా బిహార్కు చెందిన సెక్యూరిటీ గార్డు అశుతోష్కుమార్ రాయ్ అడ్డుకున్నాడు. దీంతో ఆయనపై కత్తులతో దాడి చేసిన వారు, తమ వెంట పడకుండా తొడపై తీవ్రగాయం చేసారు. ఈ సమయాన అశుతోష్ కేకలు వేయగా మిగతా సిబ్బంది వచ్చే సరికి పారిపోయారు. దీంతో క్షతగాత్రుడిని సూపర్వైజర్ కోటి జిల్లా ఆస్పత్రిలో చేర్పించడమే కాక త్రీటౌన్పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశారు. ఓపక్క వర్షాలు వచ్చేలోగా ఎక్కువ శా తం పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉండగా.. వరుస చోరీలతో ఎటూ పాలుపోలేని పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
ములకలపల్లి: ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ములకలపల్లిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి తహసీసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉపాఽధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్ట్ సాగునీరు భద్రాద్రి జిల్లాకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ గద్దె రేవతి, డీటీ భాగ్యలక్ష్మి, ఎంఏఓ అరుణ్బాబులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, ఊకంటి రవికుమార్, పొడియం వెంకటేశ్వర్లు, గౌరి నాగేశ్వరరావు, మాలోతు రావూజా, నిమ్మల మఽధు, మంచాల సారయ్య గొగ్గెల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మార్క్సిజమే మానవాళి విముక్తి మార్గంసింగరేణి(కొత్తగూడెం): మానవాళి విముక్తికి మార్క్సిజమే మార్గమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకట్ అన్నారు. సోమవారం మంచికంటి భవన్లో కమ్యూనిస్ట్ పితామహుడు కార్ల్మార్క్స్ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సంపద సృష్టికర్తలు శ్రామికులేనని, వారి శ్రమ ద్వారా లాభాలు వస్తున్నాయని అన్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభాలకు పరిష్కార మార్గాలను మార్క్స్ రాసిన క్యాపిటల్ గ్రంథం చదివి తెలుసుకుంటున్నారని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్ -
ఆపై ఇరుకు భవనాలు
అసలే అద్దె.. ● ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఇక్కట్లు ● భవన నిర్మాణాలకు స్థల సేకరణ సమస్య ● జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల్లో అదే పరిస్థితిటేకులపల్లి: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలకు సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అవి కూడా ఇరుకుగా ఉండటంతో సమావేశాలు నిర్వహించేందుకు, సామగ్రి భద్రపరిచేందుకు గోదాం లేక సీడీపీఓలకు ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లాలో మొత్తం 11 ప్రాజెక్టులు ఉండగా చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, టేకులపల్లి, చండ్రుగొండ, దమ్మపేట ప్రాజెక్టులకూ సొంత భవనాలు లేవు. ఈ సమస్యను గత డిసెంబర్ 11న జరిగిన రివ్యూ మీటింగ్లో సీడీపీఓలు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో భవన నిర్మాణం కోసం 600 – 1000 గజాల స్థలం గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. 2016లో టేకులపల్లి ప్రాజెక్ట్ ఏర్పాటు.. టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాల అంగన్వాడీ కేంద్రాలు గతంలో సుదిమళ్ల ప్రాజెక్టు పరిధిలో ఉండేవి. 2016లో ఆ ప్రాజెక్టు నుంచి విడదీసి పరిపాలనా సౌలభ్యం కోసం ఐసీడీఎస్ టేకులపల్లి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ గుండాలలో 60, ఆళ్లపల్లిలో 42, టేకులపల్లిలో 126 మొత్తం 228 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 209 టీచర్లు పనిచేస్తున్నారు. 5,074 మంది చిన్నారుల, 1,098 గర్భిణులు, బాలింతలు లబ్ధిపొందుతున్నారు. 228 కేంద్రాల్లో 88 అంగ్వాడీలకు సొంత భవనాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో 50, పాఠశాలల్లో 90 కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల పోస్టులు 15, హెల్పర్ పోస్టులు 19 ఖాళీగా ఉన్నాయి. భవన నిర్మాణమెప్పుడో..? 2016 నుంచి 2025 జనవరి వరకు టేకులపల్లి సెంటర్లోని అద్దె భవనంలో ప్రాజెక్ట్ కార్యాలయం కొనసాగించారు. మూడు నెలల క్రితమే టేకులపల్లి పోలీసుస్టేషన్ సమీపంలోకి మార్చారు. ఇక్కడ చాలీచాలని గదుల్లో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా ప్రాజెక్టు స్థాయి, మండల స్థాయి సమావేశాలు జరుగుతుంటాయి. 228 కేంద్రాల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఒకేసారి కూర్చునే సౌకర్యం లేదు. మీటింగ్ హాల్, టాయిలెట్స్ లేవు. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయాల్సిన సామగ్రి, ప్రీస్కూల్ కిట్లు, యూనిఫామ్లు, మెడికల్ కిట్లు భద్రపరిచే గోదాం సదుపాయం కూడా లేదు. స్థలం కోసం సీడీపీఓలు అధికారుల ద్వారా ప్రయత్నిస్తున్నారు.అద్దె భవనంలో ఇబ్బందులు టేకులపల్లి ప్రాజెక్ట్కు సొంత భవనం లేదు. దీంతో అద్దె భవనంలో సమావేశాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నాం. స్థలం కేటాయించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి కూడా తీసుకెళ్లాం. –కేఎం తార, టేకులపల్లి ప్రాజెక్టు సీడీపీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వీటిలో ఏడింటికి సొంత భవనాలు లేవు. వీటికి స్థలం గుర్తించాలని కలెక్టర్ త హసీల్దార్లను ఆదేశించారు. ఎ మ్మెల్యేలను కలిసి స్థలం కోసం ప్రయత్నిస్తున్నాం. దాతలు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ అధికారి -
క్రమపద్ధతిలో ఎరువులు వాడాలి
అశ్వారావుపేట : అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికతో పాటు మండలంలోని వినాయకపురంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్ మాట్లాడుతూ.. భూసార పరీక్షలు నిర్వహించాక నిర్ణీత మోతాదుల్లోనే ఎరువులు వేయాలని రైతులకు సూచించారు. యూరియా వినియోగం తగ్గిస్తూ భూసారాన్ని కాపాడుకుని అధిక దిగుబడి సాధించాలని అన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వి. బాబూరావు మాట్లాడుతూ రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని సూచించారు. ఏళ్లుగా ఒకే పంట కాకుండా మార్పు చేస్తే అధిక లాభాలు సాధించవచ్చని తెలిపారు. అశ్వారావుపేట పీఏసీఎస్ చైర్మన్ చిన్నంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలను ఒక దగ్గరకు చేర్చి అన్నదాతలకు విజ్ఞానం పెంచేలా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా లాభాల గురించి ఏడీఏ రవికుమార్ వివరించారు. వ్యవసాయంతో పాటు పశుపోషణపై దృష్టి సారించాలని ఏడీహెచ్ డాక్టర్ ప్రదీప్ అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఐ.వి.శ్రీనివాసరెడ్డి, కె.నాగాంజలి, ఎం.రాంప్రసాద్, ఎస్.మధుసూదన్ రెడ్డి, శ్రావణ్కుమార్, పావని, నీలిమ, శ్రీలత, కోటేశ్వర్, కృష్ణతేజ, ఆర్.రమేష్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో అధికారుల సూచన -
ఇల్లెందు నుంచి కొత్త సర్వీసులు...
మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాలకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభం ఇల్లెందు: ఇల్లెందు బస్డిపో నుంచి రెండు నూతన సర్వీస్లను ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. ఇల్లెందు నుంచి మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాలకు నడిపే ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త సర్వీసులతో ప్రయాణికులకు ఉపయోగం ఉంటుందని అన్నారు. ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, అశ్వాపురం మీదుగా మణుగూరు సర్వీస్, కొత్తగూడెం, చండ్రుగొండ, వీఎం బంజర మీదుగా సత్తుపల్లి సర్వీసు నడుస్తుందని తెలిపారు. డిపో మేనేజర్ ఎం.దేవేందర్గౌడ్ మాట్లాడుతూ త్వరలో ఇల్లెందు– భూపాలపల్లి సర్వీస్ కూడా ప్రారంభిస్తామన్నారు. ఇల్లెందు డిపోకు 8 కొత్త బస్సులు వచ్చాయని తెలిపారు. ఆర్టీసీ అధికారులు సునీత, శ్రీనివాస్, రాంనర్సయ్య, వేమూరి నాగరాజు, మాజీ కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావు, సయ్యద్ ఆజం, నవీన్, వారా రవి, మడుగు సాంబమూర్తి, చిల్లా శ్రీనివాస్, బోళ్ల సూర్యం, డానియేల్ పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలంటౌన్: గిరిజన దర్బార్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ యూనిట్ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తమ పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరిస్తామని, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తామని తెలిపారు. గిరిజనులు సమర్పించిన అర్జీల్లో పోడు భూములకు పట్టాలు, భూ సమస్యలు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ భూములకు కరెంటు మోటార్ల వంటి సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చుకోవాలి.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గిరిజన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, కుటీర పరిశ్రమ నెలకొల్పి తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో గుర్తింపు తెచ్చుకోవాలని పీఓ రాహుల్ అన్నారు. దుమ్ముగూడెం మండలం అంజుబాక గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పి జీవనోపాధి పెంచుకోవడం అభినందనీయమని అన్నారు. ఇటుకల తయారీ, మార్కెటింగ్ సౌకర్యంపై యూనిట్ సభ్యులను ఆరా తీశారు. ఇటుకలు తయారీకి అవసరమైన ముడి సరుకులను సరసమైన ధరలకు కొనుగోలు చేసి, మన్నికై న ఇటుకలు తయారు చేయాలని సూచించారు. పాఠశాలలో మరమ్మతులు పూర్తి చేయాలి.. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని పీఓ రాహుల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలతో పాటు గ్రంథాలయంలో జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలో డైనింగ్ హాల్, గ్రంథాలయంలో పాఠకులకు రీడింగ్ రూమ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు రవీంద్రనాథ్, చంద్రశేఖర్, అరుణకుమారి, రాంబాబు, ఉదయభాస్కర్, ఉదయ్కుమార్, వేణు, ఆర్. లక్ష్మీనారాయణ, అశోక్ కుమార్, హరీష్, శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. దరఖాస్తులలో కొన్ని.. ● ఒంటరి మహిళనైన తనకు ఏ ఆధారం లేదని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణం మంజూరు చేయాలని పాతపాల్వంచ శ్రీనివాసపురం కాలనీకి చెందిన ఎండీ షాకీరా బేగం దరఖాస్తు చేయగా, మైనార్టీ సంక్షేమాధికారికి ఎండార్స్ చేశారు. ● తమకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా గల 4.20 ఎకరాల భూమి ఉందని, ఇప్పటివరకు రైతుభరోసా, రుణమాఫీ మంజూరు కాలేదని పినపాక మండలం ఎల్లాపురానికి చెందిన చర్ప చినలక్ష్మి దరఖాస్తు చేయగా జిల్లా వ్యవసాయాధికారికి పంపించారు. ● తాను 20 ఏళ్లుగా అద్దె ఇంటో ఉంటున్నానని, దివ్యాంగుడినైన తనకు అద్దె చెల్లించడం భారం అవుతోందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని భద్రాచలం సుభాష్నగర్కు చెందిన గండేపల్లి రామకృష్ణ అందించిన దరఖాస్తును హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన -
ధాన్యం కొనడంలేదని రైతుల నిరసన
సుజాతనగర్: సొసైటీ ఆధ్వర్యంలో సుజాతనగర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కొనడం లేదని ఆరోపించారు. తరలింపునకు లారీలు రావడం లేదని, ధాన్యానికి అనుగుణంగా తూర్పారబట్టే మిషన్లను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో అద్దెకు తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 40 కిలోల 500 గ్రాముల ధాన్యం తూకానికి బదులుగా 41 కిలోల 200 గ్రాముల తూకం వేయడం సరికాదన్నారు. దీనికి తోడు మరో 5 కిలోల ధాన్యం తారం తీస్తామని చెప్పడం ఏంటన్నారు. తరుగు పేరుతో మిల్లర్లు, వ్యవసాయాధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగా కొనుగోళ్లను వేగవంతం చేస్తామని సివిల్ సప్లై డీటీ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఎస్ఐకి రియల్ హీరోస్ అవార్డుకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం టాస్క్ఫోర్ ఎస్ఐ జలకం ప్రవీణ్ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రియల్ పోలీసు హీరోస్–2025 అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 మందికి అవార్డులు రాగా అందులో ప్రవీణ్ కూడా ఉన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు అవార్డు ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో ఎదురుకాళ్లతో కవలల జననం పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో ఎదురు కాళ్లతో కవల పిల్లలు జన్మించారు. వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. సోమవారం ఇంటర్నేషనల్ మిడ్ వైఫరీ దినోత్సవం రోజే క్లిష్టమైన డెలివరీ చేయడం విశేషం. మండలంలోని రేపల్లెవాడకు చెందిన గర్భిణి జూపల్లి పల్లవి రెండో కాన్పు కోసం ప్రభుత్వాస్పత్రికి రాగా వైద్యులు పరీక్షించి కవలలు పిల్లలు ఉన్నారని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సుఖ ప్రసవం కోసం కొన్ని వ్యాయామాలు చేయించి శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ వ్యాయామాలు చేసింది. సోమవారం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. తల్లి, కవలలు ఆరోగ్యంగా ఉన్నారు. కాగా ఇలాంటి ప్రసవాలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. వైద్య సేవలందించిన డాక్టర్ అనూష, సిబ్బంది సుజాత తదితరులను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్ అభినందించారు. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలిపాల్వంచ: ప్రభుత్వం క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయుసీపీఏ రాష్ట్ర కార్యదర్శి గోనె సాల్మన్ కోరారు. సోమవారం అంబేద్కర్ కాలనీ మెర్సీ ప్రార్థన మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. క్రైస్తవులు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. తొలుత పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జయకుమార్, బిషప్ స్టీవెన్, జాన్ విల్సన్, విజయ్కుమార్, సదానందం, అనిల్, దయాకర్, యేసుదాస్, రవి తదితరులు పాల్గొన్నారు. అక్రమ కలప స్వాధీనందుమ్ముగూడెం : మండలంలోని పైదిగూడెం గ్రామ శివారులో అక్రమంగా దాచి ఉంచిన కలపను సోమవారం అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. రూ.1,38,688 విలువైన 11 టేకు దిమ్మలను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు రేంజర్ కమల తెలిపారు. -
అన్నదాతకు కన్నీరు..
బూర్గంపాడు: ఈ ఏడాది యాసంగి వడ్లు అమ్ముకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. అకాల వర్షాలతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు. జిల్లాలో ఏప్రిల్ రెండో వారంలో యాసంగి వరికోతలు మొదలైనప్పటి నుంచి అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. రెండు, మూడు రోజులకోసారి కురుస్తున్న వర్షాలు రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మబ్బు పట్టడంతో ఉరుకులు, పరుగులతో ధాన్యం రాశులపై టార్పాలిన్లు పట్టాలు కప్పుకోవటం, మబ్బులు తేలిపోయాక మళ్లీ ధాన్యం ఆరబెట్టుకోవడం నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో కల్లాలు, కేంద్రాల్లో ధాన్యం ఆరేందుకు ఇరవై రోజులు పడుతోంది. ఆరినా కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతో వర్షాలకు మళ్లీ తడుస్తున్నాయి. కొన్నిచోట్ల వరి కోసిన నెలరోజులకు కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలేదు. అకాల వర్షాలు, కొనుగోళ్ల జాప్యంతో పలువురు రైతులు పచ్చి వడ్లనే తక్కువ ధరలకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. భారీ వర్షానికి తడిసిన ధాన్యం జిల్లాలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు మండలాల్లో కల్లాల్లో, కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఉరుములు మెరుపులు కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు రాశులపై కప్పిన పరదాలు, టార్పాలిన్లు లేచిపోయాయి. దీంతో కొనుగోలుకు సిద్ధమైన ధాన్యం కూడా మళ్లీ తడిసింది. ఇప్పటికే రెండు మూడుసార్లు తడిసి ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఽ భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ధాన్యపు రాశుల అడుగున నీరు చేరింది. మరికొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యంలో నీరుపారింది. సిమెంట్ కాంక్రీట్ ప్లాట్ఫామ్లు లేకపోవటంతో రైతులు పొలాల్లోనే పరదాలు వేసుకుని వడ్లు ఆరబోసుకున్నారు. అకాల వర్షాలతో భూమి నెమ్ముకుని అడుగు భాగంలో వడ్లు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు రోజులు తరబడి ఉండాలంటే అకాల వర్షాలతో నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. తడిసిన వడ్లను కూడా కొనాలని కోరుతున్నారు. అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం 20 రోజులుగా వెంటాడుతున్న వానలు కొనుగోలు కేంద్రాల్లో కాంటాలకు తీవ్ర జాప్యం -
రామయ్య చెంతకు..
అంజన్న మాలధారులుభద్రాచలం: భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుంటారు. ఆ రెండు వేడుకల తర్వాత హనుమాన్ జయంతి వేడుకలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. రామయ్య స్వామికి హనుమాన్ వీర భక్తుడు కావడంతో ఇటీవల కాలంలో ఆంజనేయ మాలధారులు అధిక సంఖ్యలో భద్రగిరి వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భద్రాద్రి రామయ్య చెంతన ఇరుముడి విరమిస్తున్నారు. సుమారు వారం రోజులపాటు 50 వేల మందికి పైగానే స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతి క్రమంగా ఉత్సవంగా మారుతోంది. ఈ నెల 22న హనుమాన్ జయంతి నిర్వహించనుండగా, భద్రాచలంలో కనీస ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. భజనలకు వేదికేది..? మాలవిరమణకు వచ్చిన భక్తులు తొలుత పవిత్ర గోదావరిలో స్నానాలు ఆచరిస్తారు. అనంతరం టికెట్తో ప్రధాన దేవస్థానంలోని ఆంజనేయస్వామి ఉపాలయంలో మాలవిరమణ చేస్తారు. ఉపాలయం కావటంతో రద్దీ ఉంటోంది. సామూహిక మాల విరమణ కోసం తగిన హాల్ లేదు. మాల విరమణ టికెట్తోనే ఉచిత దర్శనం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. రామయ్య చెంతన భజన, హనుమాన్ చాలీసా పారాయణం చేసేందుకు వేదిక లేదు. చిత్రకూట మండపంలో అవకాశం ఉన్నా ఇటీవల స్వామివారికి దాతలు సమర్పించిన బంగారు పూత వాహనాలు అక్కడ ఉంచటంతో, అక్కడ జరిగే కార్యక్రమాలను నిలిపివేశారు. కేవలం రద్దీ సమయంలో నిత్యకల్యాణం అక్కడ జరుపుతున్నారు. హనుమాన్ జయంతికి కనీసం వారం రోజుల ముందే దేవస్థానం అధికారులు భజన మందిరం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఏటా స్వామివారి ప్రసాదం, లడ్డూల విక్రయ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రసాదాల విక్రయాలకు తాత్కాలిక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వసతులు కల్పిస్తే శబరిమల తరహాలో అభివృద్ధి.. తెలంగాణలో ఆంజనేయ మాల విరమణకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి, అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి మాత్రమే మాలధారులు తరలివస్తారు. క్రమంగా ప్రధాన ఉత్సవంగా మారుతున్న హనుమాన్ జయంతికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు, వసతులను కల్పిస్తే మరో శబరిమలగా మారే అవకాశం ఉంది. ముక్కోటి, శ్రీరామనవమిలకు రూ. కోట్లు వ్యయం చేసినా అదే స్థాయిలో ఆదాయం వస్తుంది. హనుమాన్ మాలధారులకు కూడా కనీస వసతులు కల్పిస్తే ఆలయానికి ఆదరణ, హుండీ ఆదాయం భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుంది. ఇప్పటికై న దేవాదాయ శాఖ స్పందించి హన్మాన్ మాలధారులకు తగిన సౌకర్యాలు కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఏటా అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులు భద్రాచలంలో మాల విరమణకు ఆసక్తి ముక్కోటి, నవమి తర్వాత రద్దీ వేడుక ఈ నెల 22న హనుమాన్ జయంతికి ఏర్పాట్లు చేయాలని విన్నపం -
ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తున్నా..
● ఎంపీ రామసహాయం రంఘురాంరెడ్డి ఖమ్మంవన్టౌన్: తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తూ, వాటి పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమది తొలి నుంచి ప్రజలతో ముడిపడిన జీవితమని, మున్నేరు వరదలప్పుడు సైతం అనేక కాలనీల్లో సహాయక చర్యల్లో పాల్గొని, నిత్యావసరాలు పంపిణీ చేశానన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా జాతీయ రహదారులు, సర్వీస్రోడ్లు, అండర్పాస్ల రూపకల్పనకు కృషిచేశానని, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాను తిరిగి ఫైల్ తెరిపించి విమానయాన శాఖ అధికారులను సర్వేకు పిలిచానని పేర్కొన్నారు. పాలేరులో ప్రత్యామ్నాయ రైల్వే రూట్, పులిగుండాల ఎకో టూరిజం పార్క్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై తాను గళం విప్పానని స్పష్టం చేశారు. ఉపాధి కోసం వెళ్లి విగతజీవులుగా మారి.. ● చోరీ ఘటనలో హత్యకు గురైన వృద్ధ దంపతులు ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కనకయ్య, రాజమ్మ ఉపాధి కోసం హైదరాబాద్లోని ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అక్కడే అపార్ట్మెంట్ల వద్ద వాచ్మెన్గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు రాంబాబు, రమేష్ ఉన్నారు. చిన్న కుమారుడు ఉపాధి కోసం హైదరాబాద్కు మకాం మార్చడంతో వృద్ధ దంపతులు అతన్ని అనుకరిస్తూ అక్కడికే వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధ దంపతులను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారం, డబ్బులను అపహరించుకెళ్లారు. ఉపాధి కోసం వెళ్లి విఘత జీవులుగా మారడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కలప పట్టివేత అశ్వాపురం: మండల పరిధిలోని అమెర్ద గ్రామంలో గోదావరి ఒడ్డున అక్రమంగా నిల్వ ఉంచిన కలపను ఆదివారం ఎఫ్ఆర్ఓ రమేష్ ఆధ్వర్యాన ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.20లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బొగ్గు టిప్పర్ బోల్తా.. మణుగూరు టౌన్: బొగ్గు లోడ్తో వెళ్తున్న ఓ టిప్పర్కు పశువులు అడ్డుగా రావడంతో బోల్తా పడింది. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను స్థానికుల ఇలా తెలిపారు. మణుగూరు నుంచి బీటీపీఎస్కు బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్కు మండలపరిధి రామానుజవరం ఊరి చివరన గేదెలు అడ్డుగా రావడంతో వాటిని తప్పించబోయే క్రమంలో పక్కనే కాల్వలోకి వెళ్లడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● భార్య మృతి.. భర్త, కుమార్తె పరిస్థితి విషమం ఏన్కూరు: బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వివాహిత మృతిచెందగా.. ఆమె భర్త, కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రామతండాకు చెందిన సొడియం బ్రహ్మ ఆయన భార్య సంధ్య, కూతురు అమృత కలిసి ద్విచక్రవాహనంపై ఏన్కూరు ప్రధాన సెంటర్కు రాగానే మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు 108 ద్వారా ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా సంధ్య (38) మృతి చెందింది. భర్త, కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి ఎస్ఐ రఫీ చేరకుని, కేసు నమోదు చేశారు. -
ఖమ్మం మహిళ హైదరాబాద్లో..
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భర్తే కొట్టి చంపాడని అనుమానాలు -
పిడుగుపాటుతో పూరిల్లు దగ్ధం
ములకలపల్లి: పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధమైన సంఘటన మండలపరిధిలోని చలమన్ననగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాతగుండాలపాడు జీపీలోని చలమన్ననగర్కు చెందిన పర్సిక సీతయ్య గ్రామ శివారులో ఇటీవల నూతనంగా పూరిల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం ఉరుములు మెరుపులతో వర్షం కురిసిన సమయాన అతడి పూరిల్లుపై పిడుగు పడి పూర్తిగా దగ్ధమైంది. మరో రెండు రోజుల్లో ఇంట్లోకి వెళ్లే తరుణాన ఇలా అగ్నికి ఆహుతైందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరాడు. మణుగూరులో రెండు ఇళ్లల్లో చోరీ..● రూ.1.30లక్షల నగదు, తులం బంగారంతో ఉడాయింపు మణుగూరు టౌన్: పట్టణంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో బియ్యం, బంగారం, డబ్బు చోరీ చేసిన సంఘటన ఆదివారం ఉదయం సుందరయ్యనగర్లో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. సుందరయ్యనగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఎస్కె.హసీనా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చే సరికి తాళం పగలగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.1.30లక్షల నగదు, తులం బంగారం, 20 తులాల వెండితో పాటు కింటా బియ్యం, 10 చీరలు చోరీకి గురైనట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా హసీనా ఇంటికి రెండు ఇళ్ల పక్కనే ఉన్న గణేశ్ కుటుంబంతో కలిసి శనివారం సాయంత్రం అశ్వాపురం మండలానికి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. దీంతో ఇంట్లోని బీరువాలో ఉన్న వెండి సామగ్రి, పిల్లల దుస్తులు, బొమ్మలు దోచుకెళ్లినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సంఘటనా స్థలాలను ఏడూళ్లబయ్యారం సీఐ, మణుగూరు ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వరరావు, మణుగూరు ఎస్ఐ రంజిత్లు సందర్శించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టి.. జాగిలాలతో గాలింపు చేపట్టారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బేతాళపాడు గ్రామ పంచాయతీ పీక్లాతండాకు చెందిన గుగులోత్ బుల్లి(58), ఆమె సోదరుడు బానోత్ కసనతో కలిసి శనివారం బైక్పై పని నిమిత్తం పడమటనర్సాపురం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యలో రేగళ్లతండా గ్రామ శివారులోని కోళ్ల ఫారమ్ వద్దకు రాగానే వెనుక నుంచి కారు ఆ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు అప్పునాయక్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ బానోత్ రవిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పురుగుల మందు తాగిన వ్యక్తి.. ములకలపల్లి: పురుగుమందు తాగి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సవలం శివ(32) భార్య నాగమణితో కలసి జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమాన మద్యానికి బానిసైన ఆయన గురువారం గ్రామశివారులోని మామిడితోటలో పురుగుల మందు సేవించాడు. గమనించిన సమీపస్తులు హుటాహుటిన పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ పుల్లారావు తెలిపారు. -
సాగుకు సమాయత్తం..!
ముగిసిన యాసంగి పనులు ● ముందే పంట పొలాలను సిద్ధం చేసుకుంటున్న ఏజెన్సీ వాసులు ● వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు యత్నాలు ● యాజమాన్య పద్ధతులు మేలంటున్న వ్యవసాయాధికారులుచర్ల: ఖరీఫ్, రబీ పంటల సాగు పూర్తవ్వడంతో రైతులు కాస్తా ఉపశమనం పొందుతూనే మళ్లీ జూన్ నుంచి ఆరంభమయ్యే ఖరీఫ్ పనుల సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈనేపథ్యాన ఉదయం, సాయంత్రం వేళల్లో మిర్చి, పత్తి పంట పొలాలను సందర్శిస్తూ సాగుకు అవసరమయ్యే పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం మెట్ట, మాగాణి భూములన్నీ ఖాళీగా ఉండగా.. రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. భూసారం పెంపునకు ప్రయత్నాలు.. జూన్ నుంచి పంటల సాగు చేసేందుకు రైతులు మళ్లీ సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 1.70 లక్షల ఎకరాల్లో వరి, 33 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 2 వేల ఎకరాల్లో పెసర పంటలు సాగు చేయగా, 2.02 లక్షల ఎకరాల్లో పత్తి, 15,550 ఎకరాల్లో మిర్చి పంటలు సాగు చేశారు. అయితే పత్తి, మిర్చి పంటలను సాగు చేసిన రైతులు మోట్లు నరకడం, పంట చేలను శుభ్రం చేయడం వంటి పనులు కొనసాగిస్తూ భూసారాన్ని పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురుస్తుండగా.. పంట చేలల్లో ట్రాక్టర్ల ఫ్లవ్లతో లోతుగా వేసవి దుక్కులు చేయడం వంటి పనులకు ఉపక్రమిస్తున్నారు. భూమిని 25–30 సెంటీమీటర్ల లోతు దున్నుకుంటే మంచి ఫలితాలను పొందొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. వేసవి దుక్కులతో లాభాలు వేసవిలోనే భూమిని లోతుగా దున్నడంతో వర్షాకాలంలో తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా చేస్తుంది. భూమి పైపొరలు తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. భూమిలో తేమశాతం పెరిగి, భూసారం వృద్ధి చెందుతుంది. పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణ చేసుకోవచ్చు. దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలు, మేకలు, పశువుల మందలు తోలడం వలన వాటి విసర్జన పదార్థాలు భూసారాన్ని పెంచుతాయి. పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువులు, చెరువులోని పూడిక మట్టి వేయడంతో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. పంటలు చేతికి వచ్చే ముందు ఎండు ఆకులు, చెత్త చెదారాన్ని కాల్చివేయకుండా వాటిని పొలంలోనే కలిసిపోయేలా దున్నితే ఎరువుగా మారుతుంది. కలుపు మొక్కలు పంటల దిగుబడిని తగ్గిస్తున్న నేపథ్యాన లోతుగా దున్నడంతో అవి నేలపైకి వచ్చి అధిక ఉష్ణోగ్రతలతో నశించి తదుపరి సాగుకు బెడద తగ్గే అవకాశాలు ఉంటాయి. వేసవి దుక్కులతో మేలు వానకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగు పూర్తయిన తరువాత తప్పనిసరిగా పొలాన్ని దున్నాలి. లేకుండా పంటలకు నాశనం చేసే పురుగులు వృద్ధి చెందుతాయి. దుక్కులు చేసే ముందు పశువుల పెంట సేంద్రియ ఎరువులను వేస్తే పొలానికి మరింత బలం చేకూరి అధిక దిగుబడికి దోహదపడుతుంది. – లావణ్య, ఏఓ, చర్లదుక్కులు దున్నకపోతే నష్టాలే.. యాసంగి పంటల కోతల తర్వాత భూమిని వదిలేస్తే కలుపు మొక్కలు, ఇతర గడ్డిజాతి మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేసి భూసారాన్ని తగ్గిస్తాయి. భూమి లోపలి పొరల్లోని నీరు ఆవిరై పోతుంది. వేసవి దుక్కులు లేకుంటే తొలకరి వాన నీరు భూమిలోకి ఇంకకుండా పోతుంది. వర్షాలతో భూమి కోతకు గురవుతుంది. ఖాళీ భూముల్లో చీడపురుగులు భారీగా వృద్ధి చెందుతాయి. ఫలితంగా రాబోయే పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. -
రామయ్యకు పునర్వసు పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారికి ఆదివారం పునర్వసు నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం కమనీయంగా జరిపారు. స్వామివారికి ఆదివారం సందర్భంగా అభిషేకం, సువర్ణ పుష్పార్చన గావించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి చిత్రకూట మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతర పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలు పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుళాయిలో నీళ్లురాక భక్తుల ఇక్కట్లు ఆలయానికి వచ్చిన భక్తులు తొలుత కుళాయిల వద్ద పాదాలను శుభ్రం చేసుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కుళాయిల ద్వారా నీళ్లు రాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. నీళ్లులేక స్నానాల గదుల వద్ద, కల్యాణకట్టవద్ద కూడా ఇక్కట్లు ఎదురయ్యాయి. నీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ఈఓకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సౌకర్యంలేక, జనరేటర్ పనిచేయని కారణంగా ఉదయం నీళ్లు రాలేదని, తర్వాత సమీపం నుంచి నీళ్లు తెప్పించి భక్తులకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకున్నామని ఈఓ రజనీకుమారి తెలిపారు.కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతి వేడుకలు నిర్వహించారు. మొదట భగీరథ చిత్రపటానికి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పర సంఘం నాయకులు అనిశెట్టి భిక్షపతి, జి.సురేష్, జి.నవీన్, ఎ.కృష్ణ, గుంటి కుమారస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రిజర్వాయర్లో జలవిహారం చేశారు. 535 మంది పర్యాటకులు కిన్నెరసానిలో ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.29,600 ఆదాయం లభించగా, 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,400 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
చేకూరి కాశయ్య ఆదర్శప్రాయుడు
చుంచుపల్లి: రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జెడ్పీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాశయ్య మానవతావాది అని, నేటితరం రాజకీయ నాయకులకు మార్గదర్శకుడని పేర్కొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేకూరి కాశయ్య సేవలు ఎనలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు, కృష్ణమోహన్, కోటేశ్వరరావు, రజాక్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వరరావు, కొదమ సింహం పాడురంగా చార్యులు, గురుదక్షిణ ఫౌండేషన్ సభ్యులు, చేకూరి కాశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సామాజికవర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలి: తుమ్మల సమాజసేవతోపాటు కమ్మ సామాజిక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మినీ కల్యాణ మండపానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. కల్యాణ మండప నిర్మాణానికి చేయూతనందించేందుకు ముందుకొచ్చిన మాచవరం కోటేశ్వరరావును శాలువాతో సన్మానించారు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, బిక్కసాని నాగేశ్వరరావు, కృష్ణమోహన్, తాళ్లూరి వెంకటేశ్వరరావు, కమ్మ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
95 శాతం ఉత్పత్తి
● నెలవారీ లక్ష్యానికి చేరువగా సింగరేణి ● రెండు ఏరియాల్లో నూరుశాతానికి మించి బొగ్గు వెలికితీతసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ గత ఏప్రిల్లో 95 శాతం మేర బొగ్గు ఉత్పత్తి సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 76 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత నెలలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లోని 19 ఓపెన్ కాస్ట్ గనులకు, 21 భూగర్భ గనుల్లో 52.78 లక్షల టన్నుల లక్ష్యం నిర్దేశించగా 49.19 లక్షల టన్నుల బొగ్గు వెలికితీశారు. 95 శాతం ఉత్పత్తి సాధించారు. భూగర్భ గనుల్లో 67 శాతం, ఓపెన్ కాస్ట్ గనుల్లో 97 శాతం ఉత్పత్తి నమోదైంది. రానున్న వర్షాకాలంలో ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండగా, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అధికంగా బొగ్గు వెలికి తీయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల 1 నుంచి అధికారులు గనుల వారీగా పర్యవేక్షణ చేపడుతూ, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉత్పత్తి పెంచాలని సూచించారు. కాగా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఏప్రిల్లో ఆర్జీ–2 ఏరియా 219 ఉత్పత్తి శాతంతో మొదటి స్థానంలో, మణుగూరు ఏరియా 117 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. అధికారులు మరింత శ్రద్ధ పెట్టాలి గనుల్లో ఎల్హెచ్డీలు తరచూ మొరాయిస్తున్నాయి. డంపర్లు, డోజర్ల మెయింటెనెన్స్ కూడా తగ్గింది. సంస్థ ఉన్నతాధికారులు మరింత శ్రద్ధ పెడితే 100 శాతం బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. –రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీలక్ష్యాలు సాధించాలి సంస్థ నిర్దేశించిన రోజు, నెలవారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు కచ్చితంగా సాధించాలి. గనుల్లో యాంత్రిక సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. యంత్రాల పని గంటలు పెంచాలి. –ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఏప్రిల్లో సాధించిన ఉత్పత్తి (లక్షల టన్నుల్లో) ఏరియా నిర్దేశిత ఉత్పత్తి ఉత్పత్తి లక్ష్యం శాతం కొత్తగూడెం 13.06 12.08 93 ఇల్లెందు 3.10 2.55 82 మణుగూరు 9.26 10.88 117 మందమర్రి 2.21 1.55 70 శ్రీరాంపూర్ 5.53 5.11 92 ఆర్జీ–1 4.06 2.06 51 ఆర్జీ–2 2.28 4.99 219 ఆర్జీ–3 5.75 5.09 89 బెల్లంపల్లి 3.50 2.73 78 భూపాలపల్లి 3.85 2.69 70 అడ్రియాల 0.15 0.12 84 -
కేంద్రాల్లో తడిసి మొలకెత్తిన ధాన్యం
పాల్వంచరూరల్: అకాల వర్షంతో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో ఉన్న మిర్చి కూడా తడిసి ముద్దయింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. భారీ వర్షం కారణంగా సోములగూడెంలో కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు చేసి ధాన్యం తడిసింది. రెడ్డిగూడెం కొనుగోలు కేంద్రం వద్ద మూడు రోజులక్రితం యాస నర్సింహారెడ్డికి చెందిన ధాన్యం కొనుగోలు చేసి గోనె సెంచుల్లో నింపారు. మిల్లుకు తరలించకుండా జాప్యం చేయడంతో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి వడ్లు తడిసి మొలకలు వచ్చాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఇద్దరిపై పిచ్చి కుక్క దాడి
కరకగూడెం: పిచ్చి కుక్క దాడిలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని మొగిలితోగు గ్రామానికి చెందిన కోరం పొట్టయ్య శనివారం ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చింది. బాధితుడు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాటిగూడెం గ్రామంలో గాంధర్ల నరసయ్య అనే వ్యక్తి ఇంట్లో పడుకుని ఉండగా పిచ్చి కుక్క దాడి చేసి ముఖం, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్తులు అతడిని 108లో కరకగూడెం పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. కుక్కల దాడిలో బాలుడికి గాయాలుఅశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు ఎస్సీ కాలనీ సరవయ్య గుంపులో బాలుడు కదురు జశ్వంత్ శనివారం కుక్కల దాడిలో గాయపడ్డాడు. బా లుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు కరిశాయి. బాలుడిని తల్లిదండ్రులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరి పంట దగ్ధంకరకగూడెం: మండలంలోని రాయనిపేట గ్రామానికి చెందిన కాలం సాంబశివరావు వరి పంట శనివారం మంటలు చెలరేగి దగ్ధమైంది. పక్క పొలం రైతు వరి గడ్డి కాల్చి వేస్తుండగా మంటలు వ్యాపించి పంట దగ్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో పినపాక నుంచి ఫైరింజన్తో వచ్చిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ.50 వేల వరకు పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిదమ్మపేట: మినీ వ్యాన్ను బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మందలపల్లి రహదారిపై శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...సిద్దిపేటకు చెందిన బాణోత్ గణేష్(23)తన మిత్రుడితో కలిసి బైక్పై స్వగ్రామం నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వచ్చాడు. శనివారం తిరిగి వెళ్తుండగా మందలపల్లి వద్ద మినీ వ్యాన్, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గణేష్, అతడి మిత్రుడికి తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్లో సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గణేష్ మృతి చెందాడు. గాయపడిన వ్యక్తి మృతిపాల్వంచ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని యానంబైల్ గ్రామానికి చెందిన బల్లే శివ (35) పాల్వంచలోని నటరాజ్ సెంటర్ వద్ద గల ఓ బార్ షాపులో పనిచేస్తున్నాడు. గత నెల 12న రాత్రి విధులు ముగించుకుని అల్లే నరసింహారావు బైక్పై ఇంటికి బయలు దేరాడు. కాగా కేఎస్పీ రోడ్లో ఇండివెల్ కంపెనీ క్వార్టర్స్ వద్ద ఎదురుగా వస్తున్న గేదెలను ఢీకొట్టారు. దీంతో కిందపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు సర్వేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసై ఆత్మహత్యదుమ్ముగూడెం: మద్యానికి బానిసై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఆంధ్ర కేసరి నగర్ గ్రామానికి చెందిన గుర్రం రాము (44)మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం మధ్యాహ్నం అతిగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. మళ్లీ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడుగగా, ఆమె లేవని చెప్పింది. దీంతో ఆమెను కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో కుమారుడు వెతకగా గ్రామ శివారులో గోదావరి నది ఒడ్డున పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. దీంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య గుర్రం లక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.6 కోట్లకు ఐపీ దాఖలు ఖమ్మంలీగల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మషాట్టి నాగేశ్వరరావు రూ.6,37,21,858కు గాను దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశాడు. మహబూబాబాద్తో పాటు ఖమ్మం జిల్లా పరిధిలో ధాన్యం వ్యాపారం చేసిన ఆయన పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. ప్రస్తుతం తనకు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ తన న్యాయవాది ఎం.జె.ప్రవీణ్ కుమార్ ద్వారా ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం దివాలా పిటిషన్ దాఖలు చేశాడు. కాగా, పిటీషన్లో 30 మందిని ప్రతివాదులుగా చేర్చాడు. మైనర్ డ్రైవర్ల తల్లిదండ్రులకు జరిమానా ఖమ్మంక్రైం: ఏడుగురు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు రూ.వేయి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో చేపట్టిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ ఏడుగురు మైనర్లు పట్టుబడగా, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. ఈ మేరకు వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్) కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి శనివారం తీర్పు చెప్పారన్నారు. అలాగే, మద్యం తాగి వాహనం నడిపిన మరో వ్యక్తికి రూ.2,500 జరిమానా విధించారని ఏసీపీ తెలిపారు. -
ధాన్యంలో తరుగు పేరిట దోపిడీ
చండ్రుగొండ: తరుగు పేరిట ధాన్యం క్వింటాకు 5 నుంచి 7 కేజీల వరకు తరుగు తీస్తున్నారంటూ స్థానిక కొనుగోలు కేంద్రంలో రైతులు శనివారం ఆందోళన చేశారు. పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు కుమ్మకై ్క తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి చర్య తీసుకోవాలని కోరారు. అక్రమ దత్తతపై కేసు నమోదుఅశ్వాపురం: మండలంలోని కురవపల్లి కొత్తూరు గ్రామానికి చెందిన మెస్సా నరసింహారావు, అమల దంపతులు తమ నాలుగో సంతానమైన మూడు నెలల పాపను పెంచుకునే ఆర్థిక స్తోమత లేక తెలిసినవారి ద్వారా దుమ్ముగూడెం మండలానికి చెందిన ఆదిలక్ష్మి, రమేష్ దంపతులకు అక్రమంగా దత్తత ఇచ్చారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో దత్తత ఇచ్చిన, తీసుకున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ రెడ్డి శనివారం తెలిపారు. -
సాగునీటి వనరులకు మహర్దశ
● మరమ్మతులకు రూ.4.78 కోట్ల నిధులు మంజూరు ● 4,294 ఎకరాల ఆయకట్టుకు తీరనున్న ఇక్కట్లుఅశ్వారావుపేటరూరల్: వ్యవసాయానికి, భూగర్భజలాల పెరుగుదలకు ఆధారమైన సాగునీటి వనరులకు మహర్దశ పట్టనుంది. గతేడాది జూలైలో కురిసిన భారీ వర్షాలు, పెదవాగు వరద కారణంగా దెబ్బతిన్న సాగునీటి వనరుల అభివృద్ధికి మోక్షం లభించింది. చెరువులు, చెక్డ్యామ్లు, పంట కాలువలు తదితర సాగునీటి వనరుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ‘ఇందిరమ్మ చెరువు బాట’తో పనులు అశ్వారావుపేట మండలంలో 152 చెరువులు, 18 చెక్డ్యామ్లు, దమ్మపేట మండలంలో 274 చెరువులు, 8 చెక్ డ్యామ్లు ఉన్నాయి. వీటిలో అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెంలో నర్సింహాసాగర్ చెరువు, మద్దికొండ గ్రామంలోని కొడిశెలవాగు చెరువు, మొద్దులమడ చెరువు, నందిపాడు గ్రామంలోని చెక్డ్యామ్, ఖమ్మంపాడు గ్రామంలోని పరికల వాగుపై కొత్తగా చెక్డ్యామ్ నిర్మాణం, అనంతారం గ్రామంలోని పెదవాగుపై ఉన్న చెక్డ్యామ్, నారాయణఫురంలోని పెదవాగు చెక్డ్యామ్, కొత్త మామిళ్లవారిగూడెం గ్రామంలోని చింతల చెరువు, కొత్త కావడిగుండ్ల గ్రామంలోని అల్లులాకుల కుంటతోపాటు గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టు నిర్వహణ పనుల కోసం 9 పనులకు రూ.2.53 కోట్లు మంజూరయ్యాయి. దమ్మపేట మండలంలో 8 పనులకు రూ.25 లక్షలు కేటాయించారు. కొద్ది రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే ‘ఇందిరమ్మ చెరువు బాట’పేరుతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకొని సాగునీటి వనరులు అభివృద్ధి కానుండగా, అశ్వారావుపేట మండలంలో 3,694 ఎకరాలు, దమ్మపేట మండలంలో 600 ఎకరాల ఆయకట్టుకు లబ్ధిచేకూరనుంది. అయితే పనులు వచ్చే వానాకాలం సీజన్ నాటికి పూర్తి చేయాలని, లేకపోతే పొలాలకు సాగునీరు అందదని రైతులు పేర్కొంటున్నారు. చెక్డ్యామ్కు అటవీశాఖ అడ్డంకులు ఎమ్మెల్యే చొరవతో సాగునీటి వనరుల మరమ్మతులకు నిధులతోపాటు నాబార్డు ద్వారా కొత్తగా అశ్వారావుపేట మండలం ఖమ్మంపాడు గ్రామంలోని పరికల వాగుపై చెక్డ్యామ్ మంజూరైంది. చెక్డ్యామ్కు సుమారు రూ.2 కోట్లు మంజూరు కాగా, ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయింది. అటవీ శాఖ అభ్యంతరాలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిలిపివేశారు. చెక్డ్యామ్ నిర్మాణం పూర్తయితే 80 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. మొత్తంగా రెండు మండలాల్లో కలిపి రూ.4.78 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జూన్ 15నాటికి పనులు పూర్తి చేస్తాం ఈ ఏడాది జూన్ 15వ తేదీ నాటికి చెరువులు, చెక్డ్యామ్, పంట కాలువ మరమ్మతులు పూర్తి చేస్తాం. అధిక వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, పంట కాలువలు, చెక్డ్యామ్లకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను సకాలంలో పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. – కోటగిరి సురేష్, ఈఈ, నీటిపారుదల శాఖ -
వాహన రిజిస్ట్రేషన్ దూరం..భారం
మణుగూరు రూరల్: సింగరేణి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిశ్రమలతో అభివృద్ధి చెందుతున్న మణుగూరులో క్రమంగా వాహనాల కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. కానీ వాహన రిజస్ట్రేషన్లు చేయించుకోవాలంటే భద్రాచలం వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. దీంతో అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రెవెన్యూ శాఖ స్థలం కూడా కేటాయించింది. దీంతో అధికారులు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆర్టీఓ శాఖ కార్యాలయం ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైంది. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించినా రవాణా శాఖ కార్యాలయానికి నిధులు మంజూరు చేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం పినపాక నియోజకవర్గ వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాహన రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. మణుగూరులో ప్రకటనలకే పరిమితమైన రవాణాశాఖ కార్యాలయ ఏర్పాటు -
బీజేపీ మండల అధ్యక్షుల నియామకం
చుంచుపల్లి/దుమ్ముగూడెం/ఇల్లెందురూరల్ /పాల్వంచ రూరల్ : బీజేపీ పలు మండలాలకు అధ్యక్షులను నియమించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం నియామక పత్రాలు అందజేశారు. అశ్వాపురం మండలానికి ఉమ్మా సుధాకర్ రెడ్డి, ఇల్లెందు మున్సిపాలిటీ పాసి సుచిత్ర, ఇల్లందు రూరల్ భట్టు రమేష్, కొత్తగూడెం మున్సిపాలిటీ సీలం విద్యాసాగర్, చుంచుపల్లి బలగం శ్రీధర్, పాల్వంచ టౌన్ రాపాక రమేష్, పాల్వంచ రూరల్ పాలోజు క్రాంతి కుమార్, అశ్వారావుపేట మెట్టా వెంకటేష్, దమ్మపేట పల్లపు వెంకటేశ్వరరావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షుడిగా కండ్రపు త్రినాథ్ రెడ్డి నియమితులయ్యారు. రేపు జాబ్ మేళాకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 5న ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్న ట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన జిల్లాలోని బ్రాంచ్లలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 98667 74459 నంబర్లో సంప్రదించాలని కోరారు. నేడు చేకూరి కాశయ్య విగ్రహావిష్కరణచుంచుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, గురుదక్షిణ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చేకూరి కాశ య్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించనున్నారు. కొత్తగూడెం జెడ్పీ కార్యాలయం వద్ద జరిగే ఈ కార్యక్రమానికి కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య తదితరులు హాజరుకానున్నారు. భద్రత సూచనలు పాటించాలిసుజాతనగర్: విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భద్రత సూచనలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ అన్నారు. సుజాతనగర్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక రైతు వేదికలో విద్యుత్ భద్రతా వారోత్సవాలపై శనివారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ నెల 7 వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా రైతులు విద్యుత్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈదురు గాలులు, ప్రకృతి వైపరీత్యాలతో తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగి పడిన స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట పొలాల్లో కరెంట్ వైర్లు తెగితే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకు రావాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈలు రంగస్వామి, కృష్ణ, ఏడీఈ రవికుమార్, ఏఈలు కిషన్, సతీష్, తరుణ్, నరసింహరావు, సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి ఖమ్మంమామిళ్లగూడెం: ఆర్టీసీలో సమ్మె ప్రకట న చేసిన నేపథ్యాన కార్మిక సంఘాలతో ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపాలని ఆర్టీసీ ఎస్డబ్లు్ఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యద ర్శి గడ్డం లింగమూర్తి, ఉపాధ్యక్షుడు ఎర్రంశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమ్మె విషయమై స్పందించినందున, వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. వేతన సవరణలో లోపాలు, ఎరియర్స్ చెల్లింపు, మరో రెండు వేతనసవరణలు, ఉద్యో గ భద్రత, అధికారుల వేధింపులపై చర్యలు జరపాలని వారు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నేడు నెట్బాల్ ఎంపిక పోటీలు ఖమ్మంస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ నెట్బాల్ బాలబాలికల జట్ల ఎంపికకు ఆదివారం పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు దీప్తి తెలిపారు. ఖమ్మంరూరల్ మండలం పెద్ద వెంకటగిరిలో ఈ పోటీలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డుతో పాటు వయసు ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఎం.ఫణికుమార్ (91338 94967)ను సంప్రదించాలని తెలిపారు. -
ఆందోళన బాటలో ఉపాధి ఉద్యోగులు
● నాలుగు నెలలుగా జీతాలు అందక అవస్థలు ● వేతనాల కోసం పెన్డౌన్తో నిరసన ఖమ్మంమయూరిసెంటర్: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం పనుల కల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు రాక ఆందోళన చెందుతున్నారు. మూడు నుంచి నాలుగు నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయని వారిలో ఆవేదన నెలకొంది. ఏడాదికాలంగా వేతనాల మంజూరులో ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, మూడు, నాలుగు నెలలకోసారి జీతాలు విడుదల చేయడంతో విధులు నిర్వర్తించలేకపోతున్నామని వాపోతున్నారు. తాజాగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, సిబ్బంది నిరసనలకు దిగారు. ఇప్పటికే వేతనాలు ఇప్పించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేయగా.. శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతేకాక రెండు రోజుల నుంచి పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. వేతనాలతోపాటు డిమాండ్లూ పరిష్కరించాలి వేతనాల కోసం ఆందోళన బాట పట్టిన ఉపాధి హామీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి మూడునెలలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, వాటిని వెంటనే మంజూరు చేయడంతోపాటు పేస్కేల్ను స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల సమస్య పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వీటిని పరిష్కరించే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. సిబ్బంది పెన్డౌన్.. ఖమ్మం జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది పెన్డౌన్ చేపట్టారు. వేతనాలు చెల్లించే వరకు తాము విధులు నిర్వర్తించబోమని అధికారులకు తేల్చిచెప్పారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని వెల్లడించారు. రెండు రోజుల నుంచి జిల్లాలో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బంది పెన్డౌన్ చేపట్టడంతో గ్రామాల్లో జరుగుతున్న పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు నమోదు పూర్తిస్థాయిలో జరగడం లేదు. దీంతో పని ప్రదేశాల్లో కూలీల హాజరుతోపాటు పనుల కొలతలను నమోదు చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు విధులకు దూరంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులపై భారం పడుతోంది. కూలీలను పనులకు తీసుకురావడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఉపాధి సిబ్బంది విధులు నిర్వహిస్తేనే కూలీలకు పని సక్రమంగా దొరుకుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.ఖమ్మం జిల్లాలో వేతనాలు రాని సిబ్బంది సీఓలు, ఏపీఓలు, ఈసీలు : 100 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు : 345 మంది -
ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టాలి
బూర్గంపాడు: ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలని, అందుకోసం ప్రతి కార్యాలయం, ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బూర్గంపాడు మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇంకుడుగుంతల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. పలుగు, పార పట్టి ఇంకుడుగుంత తవ్వారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణానికి వేసవికాలమే సరైన సమయమన్నారు. మీటర్ వెడల్పు, మీటర్ పొడవు, మీటర్ లోతు గొయ్యి తీసి అందులో శిథిలాల వ్యర్థాలు, చిన్న రాళ్లు నింపితే ఇంకుడు గుంత నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీసిన కలెక్టర్.. డార్మెటరీ హాల్, రెండు తరగతి గదుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీపీఓ సంజీవరావును ఆదేశించారు. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మోరంపల్లి బంజర పీహెచ్సీ, నాగినేనిప్రోలు జెడ్పీఎస్ఎస్, అంగన్వాడీ కేంద్రంలో ఇంకుడుగుంతల పనులను ప్రారంభించారు. నాగినేనిప్రోలులో నర్సరీని, లక్ష్మీపురంలో మునగతోటను పరిశీలించారు. సారపాకలో యూనిఫామ్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి కొత్తగూడెంఅర్బన్: సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. క్యాంప్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు 100 మంది కేజీబీవీ విద్యార్థినులకు భద్రాచలంలో క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మ్యూజిక్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, స్పోర్ట్స్, కంప్యూటర్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్, స్పీడ్ మాథ్స్ వంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తారని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, బూర్గంపాడు తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, అధికారులు జె.అన్నామణి, ఎన్.సతీష్ కుమార్, ఎస్కే. సైదులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూపర్బజార్(కొత్తగూడెం): అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎండలతో వడదెబ్బ, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిలిపి ఉన్న వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచొద్దని, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వంట చేయకుండా ఉండాలని, ఆల్కహాల్, టీ, కాఫీ, స్వీట్లు, శీతల పానీయాలు తీసుకోవద్దని వివరించారు. ఎండలో పనిచేసే వారు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని సూచించారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
రోడ్లు, పార్కులే అడ్డా..
● మందుబాబుల చిందులు.. ఇబ్బందుల్లో ప్రజలు ● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న మహిళలు, యువతులు ● పోలీస్ పెట్రోలింగ్ పెంచాలనంటున్న పట్టణ వాసులు కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో వైన్షాపులు ఉండడంతో ఆ రోడ్డు వెంట వెళ్లే మహిళలు, యువతులు, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి అయితే మరొకరి సాయం లేకుండా ఆ వీధుల్లో వెళ్లే పరిస్థితి లేదు. కొత్తగూడెంలో బహిరంగ మద్యపానంపై శనివారం రాత్రి ‘సాక్షి’ విజిట్ చేయగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగుచూశాయి. కొత్తగూడెం సూపర్బజార్ సెంటర్ ట్రీంబాక్స్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ ఎదురు రోడ్డు, బాబుక్యాంపు రోడ్ల వెంటే వైన్షాపులు ఉన్నాయి. రామవరంలో కూడా రెండు మద్యం షాపులు రోడ్డు వెంటే ఉన్నాయి. ఆయా వీధుల్లో మద్యం సేవించే వారు గుంపులుగా గుమిగూడడంతో అటువైపు వెళ్లే సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మందుబాబులో రోడ్డుపైనే మూత్ర విసర్జన చేస్తుండడంతో అటుగా మహిళలు, యువతులు వెళ్లలేకపోతున్నారు. ఇక రాజీవ్ పార్కు లోపల, బయట రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకూ పలువురు మద్యం సేవిస్తూనే ఉన్నారు. అంతేకాక వీధుల్లో బైక్ స్వారీలు, హారన్ల మోతతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రగతినగర్, గొల్లగూడెం, బూడిదగడ్డ, సింగరేణి ప్రధాన ఆస్పత్రి ఏరియా, గాజులరాజంబస్తీ, హనుమాన్బస్తీ వంటి ఏరియాలలో రాత్రి 10 గంటల వరకు కూడా ప్రధాన రోడ్డుపైనే మద్యం సేవిస్తూ ఆ మత్తులో ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, మందుబాబుల ఆగడాలను అరికట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు. -
‘చేయూత’పై ఆశలు!
● రెండేళ్లుగా పింఛన్ కోసం పలువురి ఎదురుచూపులు ● ప్రజాపాలనలో భారీగా వచ్చిన అర్జీలు ● త్వరలోనే దరఖాస్తులకు మోక్షం చుంచుపల్లి : కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల కోసం పలువురు రెండేళ్లుగా నిరీక్షిస్తుండగా వారందరికీ త్వరలో పెన్షన్ అందనుంది. నూతన పింఛన్ల మంజూరుకు అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో అర్హులను గుర్తించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు సమర్పించి ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కొన్ని పెండింగ్లో ఉండగా, కొత్త ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన ప్రజాపాలన సభల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు అర్హుల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఆసరా పింఛన్ అర్హత వయసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం జిల్లాలో అర్హులైనవారి నుంచి 2021 ఆగస్టు వరకు దరఖాస్తులు స్వీకరించి 2022 ఆగస్టులో కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. అయితే అప్పట్లో కొత్త పింఛన్ల మంజూరులో కొంత గందరగోళం ఏర్పడి కొన్ని దరఖాస్తులు తిరస్కరించారు. మరికొందరు సకాలంలో దరఖాస్తులు సమర్పించలేక అవకాశం కోల్పోయా రు. ఆ తర్వాత మరి కొందరు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం పంచాయతీ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, మరికొందరు మీ –సేవా కేంద్రాలతో పాటు ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వెళ్లి ఫిర్యాధులు అందజేస్తున్నారు. కొత్తగా 69,136 దరఖాస్తులు.. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా ప్రతీ నెల దివ్యాంగులకు రూ.4,016, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు రూ.2,016 చొప్పున అందజేస్తోంది. దీంతో జిల్లాలో అర్హులైన కొందరు కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 అక్టోబర్లో కొత్త వారి నుంచి దరఖాస్తులు స్వీకరించగా, జిల్లా వ్యాప్తంగా 33,663 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 26,351 మందికి 2022 ఆగస్టులో కొత్త పింఛన్లను మంజూరు చేశారు. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మళ్లీ దరఖాస్తులు స్వీకరించగా 57 ఏళ్లు దాటిన వారంతా అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరే కాకుండా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువు, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధి గ్రస్తులు.. మొత్తం 69,136 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు కోసం అర్హులను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని సూచించడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,16,290 మంది చేయూత లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 26.23 కోట్లు పింఛన్ల రూపంలో అందజేస్తోంది.దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తిస్తాం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని సూచించింది. జిల్లాలో వివిధ రకాల పింఛన్లకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆత్యంత పారదర్శకంగా వ్యవహరించి అర్హులను ఎంపిక చేస్తాం. – ఎం.విద్యాచందన, డీఆర్డీఓజిల్లాలో చేయూత పెన్షన్ల వివరాలిలా.. వృద్దులు 44,761 ఏఆర్టీ బాధితులు 1,170దివ్యాంగులు 13,375 ఫైలేరియా బాధితులు 170వితంతువులు 50,319 డయాలసిస్ వ్యాధిగ్రస్తులు 111ఒంటరి మహిళలు 6,218 గీత కార్మికులు 145చేనేత కార్మికులు 17 మంది బీడీ కార్మికులు 04 -
ఫలితాల్లో దమ్మపేట ఫస్ట్
● పదో తరగతిలో చివరి స్థానంలో సుజాతనగర్ ● మెరుగైన ఫలితాలు సాధించిన బీసీ వెల్ఫేర్ విద్యార్థులు ● 16 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించే అవకాశం ● ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. గత బుధవారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 27వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చుకుంటే జిల్లాలో 1.10 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఒక స్థానం కిందకు పడిపోయింది. ఐదేళ్లుగా రాష్ట్రస్థాయిలో జిల్లా ఎప్పడూ వెనుకంజలోనే ఉంటోంది. జిల్లా విద్యాధికారులు రూపొందించిన ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదనే ఆరోపణలున్నాయి. రాష్ట్రస్థాయిలో జిల్లా ఎప్పడూ 25వ స్థానం కంటే దిగువనే ఉంటోంది. గతేడాది జిల్లాలో నూతనంగా 421 మంది ఉపాధ్యాయులు కొత్తగా నియమితులయ్యారు. డీఎస్సీ–2008 నుంచి మరో 41 మంది వచ్చారు. వీరిలో అన్ని సబ్జెక్ట్ల ఉపాధ్యాయులున్నారు. గతంలో సబ్జెక్ట్ టీచర్ల కొరతతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినా చెప్పుకోదగిన విధంగా ఫలితాలు రావడంలేదు. జిల్లాలోని దమ్మపేట మండలానికి ఫలితాల్లో మొదటి స్థానం, సుజాతనగర్కు చివరి స్థానం దక్కింది. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిభ చాటిన బీసీ వెల్ఫేర్ విద్యార్థులు ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ విద్యార్థులు 95.93 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఆర్ఈఎస్, టీడబ్ల్యూఆర్ఎస్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ప్రారంభమైన రీ కౌంటింగ్, వెరిఫికేషన్ దరఖాస్తులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు శుక్రవారం నుంచి ప్రారంభంకాగా, ఈ నెల 15వ తేదీ వరకు గడువు విధించారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తులను ఆన్లైన్ చేశాక సంబంధిత కాపీని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు జరుగనుండగా, ఈ నెల 16వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు విద్యాధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో గురువారం ఆన్లైన్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక తరగతులపై సూచనలు చేశాం పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఎంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేశాం. విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల్లో లేదా ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించాలని సూచించాం. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని తెలిపాం. – వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాధికారిపాఠశాలలు ఉత్తీర్ణత శాతం ఎయిడెడ్ 89.62ఆశ్రమ 94.06బీసీ వెల్ఫేర్ 95.93ప్రభుత్వ 78.48కేజీబీవీ 89.79ప్రైవేటు 94.40రెసిడెన్షియల్ 91.80మినీ రెసిడెన్షియల్ 94.25ఎస్డబ్ల్యూఆర్ 93.88టీడబ్ల్యూఆర్ 94.06జెడ్పీ 86.46 -
వణుకు పుట్టిస్తున్న చినుకు..
పుట్పాత్ల ఆక్రమణ, డ్రెయినేజీ అస్తవ్యస్తం రాష్ట్ర విభజన అనంతరం ఐదు పంచాయతీలు ఏపీలో కలవడంతో భద్రాచలంలో స్థల సమస్య ఏర్పడింది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాసాలు పెరిగాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలాలతో పాటుగా డ్రెయినేజీలను ఆక్రమించి మరీ నిర్మాణాలను చేపట్టారు. దీంతో పాటుగా వ్యాపార సముదాయాలు సైతం ఫుట్పాత్ల మీదుగా వెలిశాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన డ్రెయినేజీ వ్యవస్థను సైతం అధికారులు పక్కదారి పట్టించారు. సిటీ మాస్టర్ ప్లాన్ సైతం లేకపోవడంతో ఇష్ణానురీతిగా నిర్మాణాలు సాగాయి. దీంతో పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భద్రాచలం: రానున్నది వర్షాకాలం.. భద్రాచలం ప్రజలను ఒక వైపు గోదావరి వరదలు భయపెడుతుంటే, మరోవైపు చిన్నపాటి చినుకులు సైతం వణికిస్తుంటాయి. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డుపైకి వచ్చిన వర్షపు నీరు వరదను తలిపిస్తోంది. దీంతో గోదావరినే రోడ్లపైకి వచ్చిందా అన్నట్లుంటుంది భద్రాచలంలో పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు హామిలిస్తున్నా.. అవి కార్యరూపం దాల్చటం లేదు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తుగా మేల్కొనాలని భద్రాచలం వాసులు వేడుకుంటున్నారు. అత్యాధునిక డ్రెయినేజీ సిస్టం అత్యవసరం భద్రాచలంలో కొద్ది పాటి వర్షం కురిసినా రోడ్ల మీద వరద పారుతోంది. చర్ల రోడ్డు, ఉదయ్భాస్కర్ రోడ్డు, మిథిలా స్టేడియంతో పాటు ప్రధాన రోడ్లన్నీ ఇలాగే దర్శనమిస్తున్నాయి. శివారు కాలనీలు, చెరువు సమీప ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుతోంది. రాత్రి సమయంలో వర్షం కురిస్తే ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కారణం ఇంతవరకు సిటీ మాస్టర్ ప్లాన్ లేకపోవడ, అధికారులు ఆ దిశగా కసరత్తు చేయకపోవడమే. భద్రాచలం జనాభా సుమారు లక్ష. రామయ్య దర్శనానికి వచ్చే భక్తులతో పాటు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పటిష్ట, అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థను రూపొందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చొరవ చూపాలి.. గోదావరి వరద సంభవించినప్పుడు స్లూయిజ్లు మూసివేడయంతో వర్షపు నీరు గోదావరిలో కలవడం లేదు. దీంతో ఆలయ సమీపంలో ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రంలోకే కాకుండా ఆలయ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ వరద చేరుతోంది. దీనిని తోడేందుకు భారీ మోటార్లను ఏటా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కాకుండా శాశ్వత పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిదులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.. భద్రాచలంలో వర్షం కురిస్తే ప్రధాన రోడ్లు, శివారు కాలనీలు జలమయమవుతున్నాయి. దీంతో కొన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి. స్లూయిజ్ల వద్ద వర్షపు నీరు కాలనీలను ముంచెత్తుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలి. –రావులపల్లి రాంప్రసాద్, బీఆర్ఎస్ నాయకుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారిస్తేనే ఫలితం.. భద్రాచలంలో డ్రెయినేజీ అస్తవ్యస్తం.. చినుకు పడితే రోడ్లపై పారుతున్న వరద అత్యాధునిక డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ -
సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం
ఖమ్మం స్పోర్ట్స్: ఏ రంగంలోనైనా అభివృద్ధి ఒక్కరితో సాధ్యం కాదని, సమష్టి కృషి కీలకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, టేబుల్ టెన్నిస్ హాల్ నిర్మాణానికి శుక్రవారం ఆయన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో శంకుస్థాపన చేశాక మాట్లాడారు. పటేల్ స్టేడియంలో శిక్షణ పొందిన ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని.. వారికి మరిన్ని సౌకర్యాలు సమకూర్చేలా కృషి చేస్తానని తెలిపారు. సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ 8.50 కోట్లు, టేబుల్ టెన్నిస్ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. కాగా, క్రికెట్ శిక్షణకు 20 ఎకరాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు. ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ సింథటిక్ ట్రాక్తో క్రీడాకారులకు ఉత్తమ శిక్షణ అందుతుందని తెలిపారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడగా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా శంకరయ్య, కె.క్రిస్టోఫర్బాబు, కోచ్లు, క్రీడాసంఘాల ప్రతినిధులు ఎం.డీ.గౌస్, ఎం.డీ.అక్బర్ అలీ, నున్నా రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, షఫీక్ అహ్మద్, కర్నాటి వీరభద్రం, చంద్రశేఖర్, ఆదర్శ్కుమార్, వీవీఎస్.మూర్తి, ఎం.డీ.మతిన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం కప్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మంత్రి, ఎంపీ పతకాలు అందజేయగా.. వేసవి శిబిరంలో బ్యాడ్మింటన్ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు అసోసియేషన్ తరఫున టీషర్ట్లు అందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాంరెడ్డి ఖమ్మం స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన -
హెచ్ఎంకు పురస్కారం
ములకలపల్లి: మండలంలోని తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం శంకర్కు యంగ్ ఇండియన్ సేవా పురస్కారం లభించింది. కొత్తగూడెంనకు చెందిన యంగ్ ఇండియన్ బ్లడ్డోనర్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం, హరితహారం, విద్యాభివృద్ధి, మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన అంశాల్లో సేవలందిన వ్యక్తులకు ఏటా సేవా పురస్కారాలను అందజేస్తున్నారు. అందులో భాగంగా చిన్నారుల విద్యాభివృద్ధి, దాతల సాయంతో పాఠశాలలో మౌలిన వసతుల కల్పన, 100% విద్యార్థుల నమోదు అంశాలతోపాటు, పాల్వంచకు చెందిన వేచన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించిన సామాజిక సేవకుగాను శంకర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో జలమండలి శాఖ (హెచ్ఎండబ్ల్యూఎస్), మేనేజింగ్ డైరెక్టర్ అశోక్రెడ్డి, కొల్లి ఫౌండేషన్ చైర్పర్సన్ కల్పనాచౌదరి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. అందరూ కలిసిమెలిసి జీవించాలి కొత్తగూడెంఅర్బన్: సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలీద్ ముబష్షీర్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం మదురబస్తీలోని జమాతే ఇస్లామి హింద్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వమానవ సౌభ్రాతృత్వం సమానత్వం కోసం కులమతాలకు అతీతంగా, ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమన్యాయం అందేలా కార్యకర్తలు న్యాయ ధ్వజ వాహకులుగా నిలవాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోహేబ్ మాట్లాడుతూ.. జమాతే ఇస్లామి హింద్ ఒక స్వచ్ఛంద ధార్మిక సేవాసంస్థ అని, 75 ఏళ్ల నుంచి కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా సేవ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జమైతే ఇస్లామిక్ హింద్ కార్యదర్శి నయీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్యజ్దానీ, షరీఫ్, జహంగీర్, అబ్దుల్ భాసిత్, షబ్బీర్ హుస్సేన్, ముజాహిద్, పర్వీన్ సుల్తానా, షేహనాజ్, ఏజాజ్, నష్రా తదితరులు పాల్గొన్నారు. సాఫ్ట్బాల్ సౌత్జోన్ జట్టులో జిల్లావాసులు ఇల్లెందురూరల్: సాఫ్ట్బాల్ ఆలిండియా యూనివర్సిటీస్థాయి పోటీల్లో పాల్గొనే సౌత్జోన్ జట్టుకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. మండలంలో మస్సివాగు గ్రామపంచాయతీకి చెందిన అజ్మీర చరణ్, దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన రేసు అవినాష్, గుండాల మండలం సజ్జలబోడు గ్రామానికి చెందిన జబ్బ అనిల్కుమార్ కాకతీయ యూనివర్సిటీలో బీపీఈడీ ఫైనలియర్ చదువుతున్నారు. 2024 అక్టోబర్ 20వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొని, సౌత్జోన్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఏపీలోని నెల్లూరులో నిర్వహిస్తున్న పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు కోచ్ రామాంజనేయులు తెలిపారు. క్షుద్ర పూజల కలకలం పినపాక: మండలంలోని ఉప్పాక గ్రామంలో శుక్రవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పుప్పాక గ్రామంలోని పొలంలో పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజ్కుమార్ పరిశీలించారు. క్షుద్ర పూజలు వంటి వదంతులు, మూఢ విశ్వాసాలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. నాటుసారా పట్టివేత భద్రాచలంటౌన్: భద్రాచలం ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను పట్టుకున్నారు. ఎకై ్సజ్ అధికారుల కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డులో శుక్రవారం ఎకై ్సజ్ అధికారులకు ఆటోలో తరలిస్తున్న 15 లీటర్ల నాటుసారా పట్టుబడింది. దానిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. -
పహల్గామ్ మృతులకు న్యాయమూర్తుల సంతాపం
కొత్తగూడెంటౌన్: పహల్గాంలో ఉగ్రవాద దాడిలో మృతి చెందినవారికి జిల్లా న్యాయమూర్తులు శుక్రవారం సంతాపం తెలిపారు. కొత్తగూడెం జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్లో జరిగిన సంతాప కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని అన్నారు. ఆ తర్వాత నూతన జడ్జిలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్.సరిత, కె. కిరణ్కుమార్, ఎం.రాజేందర్, ఏ.సుచరిత, కె.సాయిశ్రీ, బి.రవికుమార్, రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జే.గోపికృష్ణ, సభ్యులు కాసాని రమేష్, కె.చిన్నికృష్ణ, ఉప్పు అరుణ్, మాలోత్ ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
చేతులు కాలకముందే..
ఖమ్మంమయూరిసెంటర్: వివిధ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారానికి నగర, పురపాలికల్లో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు విస్మరించి, అనుమతికి మించి భారీస్థాయిలో ఫ్లైఓవర్ల వెంట, ఇతర రద్దీ ప్రాంతాలు, బైపాస్ల వెంట భవనాలపై ఏర్పాటు చేస్తుండడంతో భారీ ఈదురుగాలులు, వర్షాల సమయాన కూలిపడతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం కార్పొరేషన్తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో హోర్డింగ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికి.. వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రకటన కోసం ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అనుమతి తీసుకుని హోర్డింగ్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం భవన బేస్మెంట్ పిల్లర్లతో అనుసంధానంగా పటిష్టంగా పిల్లర్ నిర్మించి రాడ్లు బిగించాలి. అంతేకాక ఫ్లైఓవర్ల పక్కన కనీసం 10 మీటర్ల దూరంలోనే ఏర్పాటుచేయాలి. భవనాలపై హోర్డింగ్లు ఏర్పాటుచేశాక ఏటా పిల్లర్ల బలాన్ని పరిశీలించాలి. శిథిలావస్థకు చేరిన భవనాలు, పిల్లర్లపై హోర్డింగ్లు ఏర్పాటు చేయడంపై నిషేధం ఉంది. అంతేకాక హోర్డింగ్లకు ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు చిరిగితే గాలిలో వేలాడకుండా తాళ్లతో బిగించాలి. సగం మేర చినిగినా, ముక్కలైనా వెంటనే తొలగించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు. పోటాపోటీగా ఏర్పాటు ఉమ్మడి జిల్లా వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతోంది. కొత్తగా పలు సంస్థల బ్రాంచ్లు ఏర్పాటవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో వీటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీటి మధ్య పోటీ కారణంగా జనాన్ని ఆకట్టుకునేందుకు ఒకరికి మించి ఒకరు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ హోర్డింగ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూస్తున్న అధికారులు నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు. వీటికే అనుమతులు.. ఖమ్మంలో సుమారు 300 వరకు హోర్డింగ్లు ఉన్నట్లు అంచనా. అయితే, అధికారికంగా 240 హోర్డింగ్లకే అనుమతి ఉంది. సత్తుపల్లిలో 25 వరకు హోర్డింగ్లుంటే 14కు, మధిరలో 14 ఉండగా.. నాలుగింటికే అనుమతి ఉంది. అలాగే, వైరాలో 20 హోర్డింగ్లు ఉండగా పన్నులు విధించిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఏదులాపురంలో మూడు హోర్డింగ్లు ఉండగా దేనీకి అనుమతి లేనట్లు సమాచారం. కొత్తగూడెం మున్సిపాలిటీలో 25 హోర్డింగ్లు ఉండగా 16కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. పాల్వంచలో ప్రధాన రహదారుల వెంట 15 హోర్డింగ్లు కనిపిస్తుండగా అన్నింటికీ అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇల్లెందులో ఏడు హోర్డింగ్లకు గాను అన్నింటికీ అనుమతులు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఈ రెండు చోట్ల అనధికారికంగా పెద్దసంఖ్యలో హోర్డింగ్లు ఏర్పాటైనా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇక మణుగూరులో రెండు హోర్డింగ్లకు గాను దేనికీ అనుమతి లేకపోవడం గమనార్హం. ●అశ్వారావుపేటలో మూడు హోర్డింగ్లు ఏర్పాటు చేయగా.. ఒక హోర్డింగ్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించారు. మిగిలినవి పోలీస్ స్టేషన్ వద్ద, టెలిఫోన్ ఎక్సేంజి వద్ద ఉన్నాయి. ఇటీవల భారీ గాలిదుమారానికి టెలిఫోన్ ఎక్సేంజి వద్ద భవనంపై ఉన్న హోర్డింగ్ పడిపోయింది. అయితే, ఆ హోర్డింగ్ రాడ్లు భవనంపైనే ఆగడంతో ప్రమాదం తప్పింది. ముందస్తు చర్యలు తీసుకుంటే మేలు.. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఇష్టారాజ్యంగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు కొన్నిచోట్ల అనుమతికి మించి.. ఇంకొన్ని చోట్ల అనధికారికంగా ఏర్పాటు సంస్థల నిర్లక్ష్యంపై దృష్టి సారించని యంత్రాంగం ఖమ్మంలోని ప్రధాన రహదారి వైరా రోడ్డుకు ఇరువైపులా భవనాలపై భారీ హోర్డింగ్లు ఉన్నాయి. వీటిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివేవీ పాటించకపోవడంతో ఫ్లెక్సీలు గాలికి చిరిగి వేలాడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ఫ్లెక్సీలు ఎగిరొచ్చి విద్యుత్ తీగలపై పడడంతో సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇదికాక హోర్డింగ్లను పటిష్టంగా ఏర్పాటు చేయకపోవడంతో కూలిపడతాయేమోననే స్థానికుల్లో వ్యక్తమవుతోంది. -
రూట్ మార్చి..
డిజిటల్ మార్గాన లంచాల వసూళ్లు ● మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు.. ● ఏసీబీ దాడులతో పంథా మార్చిన అవినీతి అధికారులు ● 16 నెలల్లో 18 కేసులు, 26 మంది అరెస్ట్ కొత్తగూడెంటౌన్: లంచం అడగటం కాదు ఇవ్వటం కూడా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ, లంచం లేకుండా పనులు అవుతున్నాయా? అంటే కావట్లేదనేది కూడా బహిరంగ రహస్యమే. ఏసీబీ దాడులు లంచగొండులను భయపెడుతున్నా.. రూటు మార్చుకుని లంచం వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని ఫోన్పే, గూగుల్పే ద్వారా లంచం తీసుకుంటున్నారు. కాగా, జిల్లాలో 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు 18 కేసులు నమోదు కాగా 26 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12,12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఏసీబీ దాడులు ఎక్కువవడంతో ఏసీబీ డీఏస్పీ రమేశ్ను మార్చాలని ఒత్తిళ్లు కూడా రావడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తుల హవా.. ఇటీవల మణుగూరుటౌన్లో ఓ భూవివాదంలో సీఐ సోమ సతీశ్తో పాటు ప్రైవేట్ వ్యక్తి గోపి (ఒక చానల్ రిపోర్టర్, సాక్షి కాదు)లు లంచం తీసుకుంటూ దొరికారు. కేసు కాకుండా ఉండేందుకు అప్పటికే రూ.3 లక్షలు తీసుకుని, మరో లక్ష తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గత మార్చి 19న బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి గ్రావెల్ లారీ భద్రాచలం వచ్చింది. యజమానిని పిలిచి అనుమతులు లేవని కేసు నమోదు చేస్తామని సీఐ బెదిరించారు. మధ్యవర్తులు గన్మెన్ రామారావు, కార్తీక్లు యజమానికి చెప్పి గన్మెన్ సూచించిన ఫోన్ ఫోన్పే నంబర్కు రూ.20 వేలు పంపించారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ బర్పాటి రమేశ్, గన్మెన్ (కానిస్టేబుల్ ) రామారావుతో పాటు ప్రైవేట్ వ్యక్తి కార్తీక్ను పోలీసులు పట్టుకున్నారు. 2024, ఏప్రిల్ 18న దొంగతనం కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ అప్పటి భద్రాచలం ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా మధ్యవర్తుల్లాగా ప్రైవేట్ వ్యక్తులు వ్యవహరిస్తూ దొరికిపోతున్నారు. లంచం అడిగితే పట్టుకుంటాం లంచం అడిగితే ప్రజలు భయపడటం లేదు. ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. లంచం ముట్టుకుంటే మేము పట్టుకుంటాం. ఎవరు లంచం అడిగినా ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలి. ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతాం. మరింతగా అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఏర్పాటు చేశాం. –వై.రమేశ్, ఏసీబీ డీఎస్పీ, ఖమ్మం -
‘నీట్’కు పటిష్ట బందోబస్తు
● జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు.. 1,176 మంది అభ్యర్థులు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్కొత్తగూడెంటౌన్: జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రోహిత్రాజు అన్నారు. తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షా కేంద్రాలు కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాల, పాల్వంచలోని టీజీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ (గర్ల్స్), యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని వివరించారు. కొత్తగూడెం బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధా న కూడళ్లలో పరీక్షా కేంద్రాల మార్గాలను తెలిపే క్యూఆర్ కోడ్లు అంటించామని, తాగునీటి, అత్యవసర వైద్య సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇవీ నిబంధనలు అడ్మిట్ కార్డులో సూచించిన నియమ నిబంధనలు పాటించాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే అభ్యర్థులను కేంద్రాలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, షూస్, సాక్స్, బెల్డ్లు (చెవి దిద్దులు, క్లిప్లు, ఇతర ఆభరణాలు, తాయత్తులు, తాళ్లు) వంటివి లేకుండా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తమ వెంట తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల దూరం వరకు ఎవరూ ఉండొద్దు. కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లు మూసివేయాలి. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారు. -
70 లక్షల మొక్కలు నాటాలి
చుంచుపల్లి: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఈ సారి 70 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి మాట్లాడారు. ఈసారి రైతులకు మొక్కలు అందించాలని, ఇంటి ఆవరణ, రహదారుల వెంట, కెనాల్ బండ్ ప్లాంటేషన్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ 30 లక్షల మొక్కలు, టీజీఎఫ్డీసీ శాఖ 12 లక్షలు, అటవీశాఖ 10 లక్షలు, సింగరేణి 10 లక్షలు, ఉద్యానవన శాఖ 5.7 లక్షలు, వ్యవసాయ శాఖ 5 లక్షలు, ఇరిగేషన్ 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాలను నిర్దేశించారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు తాటి, ఈత చెట్లను నాటాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మునగ మొక్కలు, అటవీశాఖ వెదురు మొక్కలు, విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలల్లో ఔషధ మొక్కలు నాటాలన్నారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న కెనాల్ బండ్ ప్లాంటేషన్లో సుబాబుల్, వట్టివేర్లు మొక్కలు నాటాలన్నారు. అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్ మాట్లాడుతూ ఆసక్తి గల రైతులకు అటవీ శాఖ నర్సరీల్లో టేకు, ఎరచ్రందనం, వెదురు మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, అధికారులు చంద్రమౌళి, భాస్కర్ నాయక్, కిషోర్, అర్జునరావు, శ్రీనివాసరావు, ఇందిర, తిరుపతయ్య, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా పరిశీలన చేస్తున్నాం సూపర్బజార్(కొత్తగూడెం): ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జితేష్ హాజరై మాట్లాడారు క్షేత్రస్థాయిలో అధికారులు దరఖాస్తులను పరిశీలించి సంతకం చేయడం ద్వారానే లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. పేదలలో అతి పేదవారికి మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సౌరబ్శర్మ, కొత్తగూడెం ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ శంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
సమ్మెకు సన్నద్ధం!
● ఈ నెల 7 నుంచి సమ్మె చేపట్టనున్న ఆర్టీసీ కార్మికులు ● ఖమ్మం రీజియన్ పరిధిలో 2,012 మంది సిబ్బందిచుంచుపల్లి: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ గత నెల 7న హైదరాబాద్ లేబర్ కమిషన్ కార్యాలయంలో ప్రకటించింది. 2019లో ఆర్టీసీ కార్మికులు 54 రోజులపాటు సమ్మె చేపట్టారు. ఆ సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ విలీన ప్రక్రియ చేపట్టలేదు. కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని, పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి సమ్మెకు శంఖారావం పూరించాయి. ఖమ్మం రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ ఏడు డిపోల పరిధిలో 556 బస్సు సర్వీసులు ఉండగా, 2,012 మంది వరకు ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ బకాయిల చెల్లింపుల వంటి 21 డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టబోతున్నారు. ప్రధానమైన డిమాండ్లు ఇవే.. ● ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ● 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలి. కొత్త అలవెన్స్లు అమలు చేయాలి. ● 2021, 2025 వేతన సవరణలు అమలు జరపాలి. ఉద్యోగ భద్రత కల్పించి, సిబ్బందిపై పనిభారం తగ్గించాలి. ఎంటీడబ్ల్యూ యాక్టును అమలు చేయాలి. ● ఆర్టీసీ అభివృద్ధికి ఏటా బడ్జెట్లో 3 శాతం నిధులను కేటాయించాలి. సంస్థ అప్పులను టేకోవర్ చేయాలి. ● బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించొద్దు. వారిని వైద్య పరీక్షలకు పంపాలి. మహాలక్ష్మి పథకం అమలులో జరిగే తప్పిదాలకు సిబ్బందిని అక్రమంగా శిక్షించొద్దు. జీరో టికెట్ బదులు స్మార్ట్ కార్డులు ప్రవేశ పెట్టాలి. ● ఎలక్ట్రిక్ బస్సులను కేంద్రం ప్రభుత్వం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొని ఆర్టీసీకి ఇవ్వాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ● కారుణ్య నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టాలి. ప్రస్తుతం కన్సాలిడేటెడ్ పే కింద పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ● అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల డ్రైవర్లను, ఇతర సిబ్బందిని, అద్దె బస్సులను ఆర్టీసీలోకి తీసుకోవాలి. ● 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన పోలీసు కేసులను ఎత్తి వేయాలి. పీఎఫ్, సీసీఎస్ నుంచి యాజమాన్యం వాడుకున్న డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలి. ● అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కన్సల్టెన్సీల పేరు మీద పని చేస్తున్న అధికారులను, సూపర్ వైజర్లను తొలగించి వారి స్థానాలను ప్రమోషన్లు ద్వారా భర్తీ చేయాలి. ● గ్యారేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. వర్క్షాపులను మెరుగు పరచాలి. మహిళా కండక్టర్లతో పాటు మహిళ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. వారికి రాత్రి 8 గంటలలోపు విధులు ముగించేలా చూడాలి. ● ఆర్టీసీలో రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనాలి. స్క్రాప్ బస్సులను రద్దు చేయాలి. మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలి.ఖాళీలను భర్తీ చేయడంలేదు దశాబ్ద కాలంగా ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయడంలేదు. 8 గంటల డ్యూటీని 16 గంటల వరకు పెంచి కార్మికులను పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనివల్ల అనారోగ్యం బారిన పడుతున్నాం. ప్రధాన డిమాండ్ల సాధనకు సమ్మె చేపడుతున్నాం. –జి.రమేష్ బాబు,డ్రైవర్ సమస్యల పరిష్కారానికే.. కార్మికులకు రావాల్సిన అన్ని ర కాల బకాయిలు చెల్లించడంతో పాటు ప్రధానమైన సమస్యల ను పరిష్కరించాలని ఈ నెల 7 నుంచి సమ్మెబాట పడుతున్నాం. అనేక దఫాలుగా ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. –కందుల భాస్కరరావు, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు గావించారు. భద్రగిరిలో వైశాఖ మాసోత్సవాలు ప్రారంభం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసోత్సవాలు శుక్రవారం నుంచి వైభంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 2 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. రోజూ స్వామివారి మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకం, స్నపన తిరుమంజనం, సంధ్యా హారతి, పవళింపు సేవ, చుట్టుసేవతోపాటు తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు, తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఆయిల్పామ్ ధర తగ్గుముఖంతాజాగా టన్నుకు రూ.942 తగ్గుదల అశ్వారావుపేటరూరల్: ఆయిల్పామ్ టన్ను ధర తగ్గుముఖం పడుతోంది. తాజాగా టన్నుకు ఏకంగా రూ.942 తగ్గింది. గతేడాది డిసెంబర్లో టన్ను ఆయిల్పామ్ ధర రూ.20,506 ఉండగా, ఈ ఏడాది జనవరిలో టన్నుకు రూ.19 తగ్గింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్వల్పంగా పెరిగి టన్ను ధర రూ.21 వేలకు చేరింది. ఒక్కసారిగా రూ.942 తగ్గిపోవడంతో టన్ను ధర రూ.20,058గా ఖరారైంది. తాజాగా నిర్ణయించిన టన్ను ధర ఏప్రిల్ నెలకు వర్తిస్తుందని ఆయిల్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఆయిల్పామ్ టన్ను ధర క్రమంగా తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీల్లో టేక్ హోం రేషన్ వేసవి సెలవుల్లో 25 రోజులకు కలిపి పంపిణీ కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించడంతో టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ స్కూల్ కొనసాగుతున్న 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలున్న అంగన్వాడీ సెంటర్లకు పూర్తిగా సెలవులు ఇస్తున్నట్లు గురువారం తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాఽధికారులు ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే. సెలవులు కావడంతో మే 1 నుంచి 31 వరకు తల్లులు, పిల్లలు రాకుండా వారికి 25 రోజులకు కావాల్సిన రేషన్ను ఒక్కసారి అందజేయాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలింతలు, గర్భిణులు, 6 నెలల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు సరుకులను టేక్ హోం రేషన్ ద్వారా అందజేస్తామని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి స్వర్ణలతా లెనినా పేర్కొన్నారు. -
దోభీ ఘాట్లు ఏమాయె..?
ఇల్లెందు : రజకులకు వృత్తిపరమైన తోడ్పానందించేందుకు తలపెట్టిన మోడ్రన్ దోభీ ఘాట్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీల్లో రూ. 8 కోట్లతో దోభీ ఘాట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైన స్థలాలను కూడా ఎంపిక చేశారు. ఇల్లెందులో సింగరేణి సంస్థ 8 కుంటల భూమి కేటాయించడంతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఘాట్తోపాటు భవనంపై అంతస్తులో ఫంక్షన్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు. పట్టణంలోని 86 కుటుంబాల రజకులు దోభీ ఘాట్ను ఉపయోగించుకునేందుకు సంఘంగా ఏర్పడ్డారు. భవన నిర్మాణం స్లాబ్ లెవెల్ వరకు పూర్తయ్యాక, కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. ఇక కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు పట్టణాల్లో పనులే ప్రారంభమే కాలేదు. దీంతో రజక వృత్తిదారులు నిరాశ చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. భవనంలో ఒక షెడ్డు, 30 కిలోల కెపాసిటీ కలిగిన మూడు వాషింగ్ మిషన్లు, మూడు స్పిన్నర్లు, స్టీమ్ బాయిలర్, క్యాలెండర్ మిషన్, రెండు డయ్యర్లు, ఇసీ్త్ర చేసేందుకు మూడు ఐరన్ ఎలక్ట్రికల్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎనిమిది గంటల్లో టన్ను బరువు గల బట్టలను ఉతికే సామర్థ్యంతో డిజైన్ చేశారు. 500 చదరపు గజాల స్థలంలో భవనం, ఆధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా దోభీ ఘాట్ల నిర్మాణమే పూర్తికాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని రజక వృత్తిదారులు ఆరోపిస్తున్నారు. రూ.8 కోట్లతో నాలుగు మున్సిపాలిటీల్లో మంజూరు ఇల్లెందులో అసంపూర్తిగా భవన నిర్మాణం మిగిలిన మూడు చోట్లా ప్రారంభంకాని పనులు -
క్రమం తప్పకుండా డ్రైడే నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల మొదటి, మూడో శుక్రవారాల్లో క్రమం తప్పకుండా డ్రై డే నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఆయన వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లెందు, చుంచుపల్లి, అశ్వారావుపేట, మణుగూరులో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. 2025 – 26లో ఉపాధి హామీ లక్ష్యాలను అధిగమించాలన్నారు. వన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్వైవీ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీపీఓ చంద్రమౌళి, బీసీ, ఎస్సీ సంక్షేమాధికారులు ఇందిర, అనసూర్య, ఇంజనీరింగ్ అధికారులు రమేష్, తిరుమలేష్, నళిని పాల్గొన్నారు. బ్రోచర్లు ఆవిష్కరణ.. మైనార్టీ సంక్షేమ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీ మతపెద్దల సహకారంతో మసీదుల వద్ద బ్రోచర్ను ప్రదర్శించాలని, మైనార్టీ స్కూళ్ల ద్వారా అందిస్తున్న నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. బెటాలియన్ క్యాంప్ సందర్శన.. కొత్తగూడెంఅర్బన్: లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలోని 6వ బెటాలియన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఇటీవల శిక్షణ పొందిన ఎస్డీఆర్ఎఫ్ సభ్యులతో మాట్లాడారు. విపత్తు సమయంలో చేపట్టే చర్యలు, వారి వద్ద ఉన్న పరికరాలపై ఆరా తీశారు. ఓపెన్ జిమ్, మట్టి ఇటుకల యంత్రాలను పరిశీలించి, మట్టి ఇటుకలతో రోడ్డు తయారీకి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ అబ్దుల్ రషీద్ తదితరులు ఉన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి..పాల్వంచ: పాఠశాలల పునః ప్రారంభం నాటికి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన హాస్టల్ను తనిఖీ చేసి, సమస్యలపై ప్రధానోపాధ్యాయుడు భద్రును అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు రంగులు వేయించాలని, సెలవులు ముగిసే నాటికి నూత న హంగులతో కళకళలాడాలని ఆదేశించారు. -
తుమ్మల క్షేత్రంలో మామిడి.. విదేశాలకు ఎగుమతి
దమ్మపేట : మండలంలోని లింగాలపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు చెందిన ఐదెకరాల మామిడి తోటలో పండించిన పంట విదేశాలకు ఎగుమతి అవుతోందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల డీన్ హేమంత్ కుమార్ తెలిపారు. ఆ తోటలో సాగవుతున్న పలు రకాల మామిడిచెట్లను ఉద్యాన వన అధికారులతో కలిసి గురువారం ఆయన సందర్శించారు. మామిడికాయలకు లేత దశలోనే కట్టిన ఫ్రూట్ బ్యాగులను తొలగించి చూడగా.. అంతర్జాతీయ ఎగుమతుల ప్రమాణాలకు తగిన నాణ్యతతో ఉన్నాయని, ఎకరానికి ఐదు టన్నుల మేర దిగుబడి వస్తుందని చెప్పారు. కాగా ఒక ఎకరాలో పండిన రెండున్నర టన్నుల పండ్లను డెక్కన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ కంపెనీ వారు కొనుగోలు చేసి దుబాయ్, సౌదీ అరేబియాకు ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే పంట ధర టన్నుకు రూ.70 వేలు కాగా రాష్ట్రంలో విక్రయించే పండ్లు టన్నుకు రూ.35 వేల చొప్పున కొనుగోలు చేశారని వివరించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు సందీప్, నవీన, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్ పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణసూపర్బజార్(కొత్తగూడెం): భారీ ఈదురు గాలులు, వర్షాలతో జిల్లాలో పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ లైన్లపై పడ్డాయని, స్తంభాలు విరిగిపోయాని ఆ శాఖ ఎస్ఈ జి. మహేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తమ సిబ్బంది బుధవారం రాత్రి నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారని, యుద్ధప్రాతిపదికన పనురుద్ధరన పనులు చేశారని తెలిపారు. యానంబైల్, రేగళ్ల, అశ్వారావుపేట మండలం వినాయకపురం, గుండాల మండలం మామకన్ను, కొత్తగూడెం బస్టాండ్ సెంటర్, రుద్రంపూర్ ఫీడర్, మణుగూరులోని రామానుజవరం, కాచనపల్లి ఫీడర్, మోరంపల్లి బంజర సబ్స్టేషన్, ఉప్పుసాక ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లగా మరమ్మతుల అనంతరం పునరుద్ధరించామని వివరించారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం వైభవంగా సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు 108 సువర్ణ పుష్పాలతో అమ్మవారికి అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు.కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో భక్తులకు అన్నదానం నిమిత్తం చర్లకు చెందిన హయ్యలగిరి వెంకటప్రసాద్ రూ.10,116 విరాళం అందజేశారని ఈఓ తెలిపారు. ఎర్లీబర్డ్కు గడువు పొడిగింపుఖమ్మంమయూరిసెంటర్: ముందస్తుగానే వంద శాతం ఆస్తిపన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ ఇచ్చేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎర్లీబర్డ్ స్కీం గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయమై ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో పాటు ఇతర మున్సిపాలిటీల కమిషనర్లకు ఫోన్ ద్వారా ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలకు ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా, ఎర్లీబర్డ్ ద్వారా కేఎంసీకి ఏప్రిల్లో రూ.10.13 కోట్లు ఆదాయం సమకూరిందని వెల్లడించిన కమిషనర్ అభిషేక్ అగస్త్య.. ఇందుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను అభినందించారు. గురుకులాల ఆర్సీఓగా అరుణకుమారిభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఖమ్మం రీజియన్ గిరిజన సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి(ఆర్సీఓ)గా అరుణకుమారి నియమితులయ్యారు. గతంలో ఆర్సీఓగా పనిచేసిన నాగార్జునరావును మేడ్చల్కు బదిలీ చేయగా, ఆ స్థానంలో దమ్మపేట మండలం అంకంపాలెం గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్ అరుణకుమారిని నియమించారు. ఈ విషయాన్ని గురుకులాల పరిపాలాధికారి నరేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సింగరేణి సూపర్బజార్ ఎండీగా నికోలస్సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో పర్సనల్ జీఎంగా పనిచేసిన బి. నికోలస్ను సూపర్బజార్ ఎండీగా నియమిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. పర్సనల్ ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్న జి.వి.కిరణ్కుమార్కు పదోన్నతి కల్పించి కార్పొరేట్ పర్సనల్ జీఎంగా నియమించింది. వీరితో పాటు మరో పర్సనల్ ఏజీఎం మురళీధర్రావును ఈఈ సెల్ విభాగాధిపతిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. -
కాంగ్రెస్లో వర్గపోరు
అధికార కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు కొన్ని రోజులుగా ఏ చిన్న అవకాశం వచ్చినా భగ్గున మండుతోందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని కొందరు, పదవులు దక్కినా ప్రొటోకాల్ మర్యాదలు దక్కడం లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు కేబినెట్ మంత్రులు ● వేర్వేరుగా అనుచర వర్గాలు, అందరిలోనూ అసంతృప్తి ● పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో బయటపడుతున్న విభేదాలు ఎవరికి వారే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. సీనియర్ నాయకుడిగా తుమ్మల ఉండగా, కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా భట్టికి పేరుంది. డైనమిక్ లీడర్గా అనతి కాలంలోనే పొంగులేటి జిల్లాపై ముద్ర వేసుకున్నారు. దీంతో ఈ ముగ్గురికీ జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. ఏళ్ల తరబడి వీరినే నమ్ముకుని రాజకీయాలు చేసే కార్యకర్తలూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమకు ప్రాధాన్యత లభిస్తుందని ఎంతో కాలంగా వీరు ఎదురు చూస్తున్నారు. అయితే ఏడాది గడిచినా పార్టీ పరమైన పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కక పోవడంతో వీరిలో అసంతృప్తి రాజుకుంటోంది. పాలక మండలి పంచాయితీ ! పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమతల్లి) ఆలయ పాలక మండలిని నియమిస్తూ మార్చి 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి వర్గీయులకు ప్రాధాన్యత దక్కింది. దీనిపై మంత్రి పొంగులేటి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత అనూహ్యంగా మార్చి 19న మరో జీవో విడుదలైంది. ఇందులో మంత్రి పొంగులేటి వర్గీయులకు పెద్దపీట వేశారు. అయితే ఈ రెండు కమిటీల్లోనూ స్థానికులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని కేశవాపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల తర్వాత భారీ భద్రత నడుమ పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చింది. పాతవారికి అవకాశాలేవి ? పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఏప్రిల్ 23న జిల్లా పరిశీలకులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియమించింది. దీంతో జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జిల్లా పరిశీలకులుగా నియమితులైన డాక్టర్ శ్రావణ్కుమార్రెడ్డి, ప్రమోద్ కుమార్ ఏప్రిల్ 30 పాల్వంచలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే అన్ని పదవులు దక్కుతున్నాయని, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారిని పట్టించుకునే వారు లేరంటూ కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. సమస్యలుంటే మాట్లాడి పరిష్కరించుకుందామని డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య పదే పదే వారిస్తున్నా ఎవరూ వెనక్కు తగ్గలేదు. దీంతో ఈ సమావేశాన్ని అర్ధంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇలా వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు హస్తం పార్టీలో నెలకొన్న గ్రూపులు, వాటి మధ్య పోటీని ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాధాన్యత ఇవ్వరా.. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం గండుగులపల్లి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామం. అక్కడి ఎమ్మెల్యే జారే ఆదినారాయణదీ ఇదే గ్రామం. పొంగులేటి మనిషిగా జారేకు గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు, అభివృద్ధి పనులన్నీ మంత్రి తుమ్మల కేంద్రంగానే నడుస్తున్నాయని, స్థానిక ఎమ్మెల్యేకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ కూడా పాటించడం లేదనే అసంతృప్తి జారే వర్గీయుల్లో ఎప్పటి నుంచో గూడుకట్టుకుని ఉంది. అందుకు తగ్గట్టే ఇటీవల దమ్మపేట మండలం పూసుకుంట దగ్గర జరిగిన కార్యక్రమంలో బహిరంగంగా తన అసంతృప్తిని జారే ఆదినారాయణ వ్యక్తం చేశారు. ఆదివాసీ సంఘాలు సైతం ఈ విషయంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మంత్రి దగ్గర మంచి అనిపించుకునే ప్రయత్నంలో ఎమ్మెల్యే ప్రాధాన్యతను తగ్గించడం సరికాదని అంటున్నాయి. -
వేసవి క్రీడా శిబిరం ప్రారంభం
కొత్తగూడెంటౌన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో 30 వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ క్యాంప్ల్లో 1,200 మందికి పైగా విద్యార్థులకు 19 రకాల క్రీడల్లో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ క్యాంప్లు ఉపకరిస్తాయని, ప్రతీ క్రీడాకారుడు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలని అన్నారు. కాగా, ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో 16 క్యాంప్లు ఏర్పాటు చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తుండగా ఈ ఏడాది ఆ సంఖ్య 30కి పెరిగింది. ఆయా క్యాంప్ల్లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, కరాటే, హాకీ, రైఫిల్ షూటింగ్, సాఫ్ట్బాల్ తదితర క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 మంది కోచ్లతో నెల రోజుల పాటు ఉచిత శిక్షణ 19 రకాల క్రీడల్లో దాదాపు 1,200 మందికి.. సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ -
ఫలితాలు ఎందుకు తగ్గాయి?
ఖమ్మంమయూరిసెంటర్: ఇంటర్మీడియట్ ఫలితాలు ఇటీవల వెల్లడి కాగా.. పలు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై సంస్థ కార్యదర్శి దృష్టి సారించారు. గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తూ, నిరంతర పర్యవేక్షణలో బోధించినా విద్యార్థులు ఫెయిల్ కావడంతో ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే 80శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన గురుకులాల ప్రిన్సిపాళ్లకు ఎస్సీ సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ వీ.ఎస్.అలగు వర్షిణి తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలోని పలు గురుకులాలు కూడా ఉన్నాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 12, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఆరు గురుకులాల ప్రిన్సిపాళ్లకు నోటీసులు జారీ అయ్యాయి. చర్యలు ఎందుకు తీసుకోవద్దు.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 80 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైన ఎస్సీ గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇటీవల నోటీసులు అందాయి. వీరి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోకూడదో కారణం చెప్పాలని అందులో పేర్కొన్నారు. నోటీసులకు ప్రిన్సిపాళ్లు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 80శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలలు ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి 80 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి బాలికలు కళాశాలలో 79.75 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అన్నపురెడ్డిపల్లి(బాలుర)లో 78.95, వైరా(బాలికలు)లో 77.78, ములకలపల్లిలో 75.34, తిరుమలాయపాలెం(బాలుర)లో 67.92, ఎర్రుపాలెం(బాలికలు)లో 56.94, ముదిగొండ(బాలుర)లో 55.07, ఇల్లెందు(బాలికల)లో 54.35, భద్రాచలం(బాలికలు)లో 54.29, దమ్మపేట(బాలుర)లో 47.27, మణుగూరు(బాలుర)లో 33.33, సత్తుపల్లి(బాలుర)లో 30.56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ద్వితీయ సంవత్సరానికి వచ్చేసరికి భద్రాచలం బాలికల కళాశాలలో 79.41 శాతం, పాల్వంచ(బాలుర)లో 76.47, సత్తుపల్లి(బాలుర)లో 72.22, వైరా(బాలికలు)లో 67.11, ఇల్లెందు(బాలికలు)లో 66.67, మణుగూరు(బాలికలు) కళాశాలలో 47.06శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఎస్సీ గురుకులాల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు ఇంటర్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం జాబితాలో ఉమ్మడి జిల్లాలోని 14 కళాశాలలు అన్ని వసతులు.. నిపుణులైన అధ్యాపకులు పేద విద్యార్థులకు మెరుగైన బోధన అందించేలా ఉన్నత విద్యార్హతలు కలిగిన అధ్యాపకులను నియమించడంతో గురుకులాల్లో అన్ని వసతులు కల్పించినా ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాకపోవడంపై అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచివచ్చే అణగారిన, షెడ్యూల్డ్ కులాల పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను స్థాపించింది. సొసైటీ అధిక అర్హత కలిగిన ఉపాధ్యాయులుగా నియమించింది. విద్యార్థులు దాదాపు ఐదేళ్లుగా రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నారు. 90శాతం మంది పదో తరగతిలో ఉత్తీర్ణులైతే, ఇంటర్లో 100శాతం ఉత్తీర్ణత సాధించలేదు. ప్రిన్సిపాళ్లు చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థులందరినీ పాస్ స్థాయికి సులభంగా తీసుకురావొచ్చు. అయినా అలా ఫలితాలు ఎందుకు రాలేదు’అని నోటీసుల్లో ప్రశ్నించారు. -
ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసన
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్నపురెడ్డిపల్లిలోని ప్రధాన రోడ్డుపై గురువారం పేదలు రాస్తారోకో చేశారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. అనర్హులను జాబితా నుంచి తొలగించి అర్హులకే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేశారు. వెంకటేష్,, లావణ్య, మరియరాజు, గోపులు, సుజాత పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యటేకులపల్లి: అనారోగ్యంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన నారందాస్ వెంకటేశ్వర్లు(55) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఏడాది నుంచి పెరాలసిస్ వ్యాధితో బాధ పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది గురువారం ఇంటి సమీపంలోని మోట బావి వద్దకు వెళ్లి కర్రకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిపై కేసు నమోదుభద్రాచలంటౌన్: మహిళను కారుతో ఢీకొట్టిన వ్యక్తిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 14న కరీంనగర్కు చెందిన అమరగుండ లక్ష్మి బంధువులతో కలిసి భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దర్శనానికి వచ్చింది. దర్శనం అనంతరం ఉత్తర ద్వారం సమీపంలో రోడ్డు పక్కన పడుకోగా ఆమె చేతిపై నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి కారు పోనివ్వడంతో తీవ్ర గాయమైంది. వైద్య ఖర్చులు భరిస్తానని కారు యజమాని భరోసా ఇవ్వడంతో ఆమె కరీంనగర్ వెళ్లిపోయింది. ఆ తర్వాత కారు యజమాని ప్రశాంత్ బాధితురాలి గురించి పట్టించుకోకపోవడంతో ఆమె కుమారుడు హరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములపై.. అన్నదమ్ములపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని భూపతిరావు కాలనీకి చెందిన కుర్రి సాంబశివరావు, రాములు ఆస్తి విషయంలో గొడవపడి కొట్టుకున్నారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పరస్పరం ఫిర్యాదు చేసుకోగా ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వేధింపుల కేసు.. ఇల్లెందు: ఇల్లెందు పోలీసులు గురువారం వేధింపుల కేసు నమోదు చేశారు. మండలంలోని రైటర్ బస్తీకి చెందిన స్పందన రోజీకి హన్మకొండకు చెందిన తిక్క దీపక్తో 2012లో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్తతోపాటు అత్తామామలు అదనపు కట్నం కోసం స్పందనను వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు. సూపర్వైజర్ను హతమార్చిన మావోలు చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరో దారుణానికి ఒడిగట్టారు. బలరాంపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని జార్ఖండ్లో రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్ను గురువారం కాల్చి చంపారు. ముహువాడ పోలీస్ స్టేషన్ పరిధి ఓర్సాపత్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకోగా, సూపర్వైజర్ను కాల్చి చంపడమే కాక జేసీబీని దగ్ధం చేశారు. కొన్నాళ్ల క్రితం రోడ్డు పనులు నిలిపివేయాలంటూ మావోయిస్టులు హెచ్చరించగా, భద్రతా బలగాల నడుమ పనులు చేస్తున్నారు. దీంతో సూపర్వైజర్ను హతమార్చినట్లు తెలిసింది. ఐఎన్టీయూసీ నాయకుడిపై దాడి ఇల్లెందు : పట్టణంలోని నంబర్–14 బస్తీకి చెందిన ఐఎన్టీయూసీ నాయకుడు కొండూరి చిన్నపై వలిపిరెడ్డి సందీప్ అనే ఆటో డ్రైవర్ దాడిచేసి గాయపర్చాడు. ఈ మేరకు చిన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన తన ద్విచక్రవాహనంపై మిత్రుడి ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా.. రోడ్డుపై వాహనం ఆపావంటూ సందీప్ ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అతడి వద్దనున్న చాకును చిన్నపైకి విసరగా మెడ భాగంలో గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గంజాయి చాక్లెట్లు స్వాధీనం ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులకు అమ్ముతున్న 90 గంజాయి చాక్లెట్ల(517 గ్రాములు)ను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. సాయిశ్రీ గ్రానైట్ ఫ్యాక్టరీ సమీపాన తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము ప్రభాకర్, యూపీకి చెందిన చోటాకం అక్కడి కార్మికులకు గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చాక్లెట్లు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
వైద్యం వికటించి మహిళ మృతి
సత్తుపల్లి: శస్త్రచికిత్స జరిగిన గంటల్లోనే మహిళ మృతి చెందగా.. ఆస్పత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. గురువారం జరిగిన ఈ ఘటన వివరాలను మృతురాలి భర్త పి.మారేశ్వరరావు వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కోటపాడుకు చెందిన పి.జ్యోత్స్న(24) కడుపు నొప్పితో బాధపడుతుండగా బుధవారం రాత్రి సత్తుపల్లిలోని ఆల్ఫా స్కానింగ్ సెంటర్కు తీసుకొచ్చారు. అక్కడ పరీక్షించిన రేడియాలజిస్ట్ పరిస్థితి విషమంగా ఉందని, ఎదురుగా ఉన్న ఆస్పత్రికి వెళ్లాలని సూచించగా.. ఎస్వీసీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం పిండం గర్భసంచికి బదులు పేగులోకి వెళ్లిందని, అది పగిలి రక్తస్రావమైందని డాక్టర్ సరికొండ హర్షిత్ తెలిపారు. ఆపరేషన్ చేసేందుకు కుటుంబీకులు అంగీకరించగా మరో వైద్యుడితో కలిసి శస్త్రచికిత్స చేసిన హర్షిత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పాడు. కానీ గురువారం ఉదయం జ్యోత్స్న పరిస్థితి ఆందోళన కరంగా ఉందని కుటుంబీకులు ప్రశ్నించగా మత్తు ప్రభావం కావొచ్చని బదులిచ్చాడు. ఆ కాసేపటికి వైద్యుడు ఆమెను పరీక్షించి హార్ట్ ఫెయిల్ అయి చనిపోయిందని చెప్పడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహం చూపించకుండా.. ఉదయం 10 గంటలకు జ్యోత్స్య మృతి చెందగా, ఆమె కుటుంబీకులకు రాత్రి ఏడు గంటల వరకు మృతదేహాన్ని చూపించలేదు. అంతసేపు ఆస్పత్రి ఎదుట రోదిస్తూ ఆందోళనకు చేపట్టారు. ఆస్పత్రిలో వెంటిలేటర్, ఐసీయూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కాగా, జ్యోత్స్యకు రెండేళ్ల కుమార్తె ఉండగా, ఆమె మరిది పెళ్లి కోటపాడులో బుధవారం రాత్రి జరుగుతుండగానే ఆరోగ్యం విషమించడంతో సత్తుపల్లి తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె మృతి చెందగా కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె బంధువులతో డాక్టర్ల బృందం చర్చలు జరిపినట్లు తెలిసింది. చివరకు రాత్రి పరస్పరం అంగీకారం కుదిరినట్లు తెలుస్తుండగా, జ్యోత్స్న మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు. ఈమేరకు ఎస్సైలు రఘు, కవిత ఆధ్వర్యాన బందోబస్తు నిర్వహించారు.సత్తుపల్లిలో ఆస్పత్రి ఎదుట ఆందోళన -
పెట్రోల్ బంక్లో తనిఖీ
పాల్వంచరూరల్: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో ఉన్న పెట్రోల్ బంక్లో బుధవారం తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీచేశారు.దంతెలబోరుగ్రామానికి చెందిన నాగరాజు అనే యువకుడురూ.150తో ఎక్స్ట్రామైలేజ్ పెట్రోల్ను తన ద్విచక్రవాహనంలో కొట్టించుకుని కిలోమీటర్ దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. మెకానిక్ షెడ్కు తరలించి చూపగా, పెట్రోల్లో నీళ్లు కలిసినట్లు తేలింది. దీంతో బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయగా, తూనికలు, కొలతల శాఖ అధికారి మనోహర్ వచ్చి పెట్రోల్ బంక్లో తనిఖీ చేసి వెళ్లారు. -
మణుగూరులో 117 శాతం బొగ్గు ఉత్పత్తి
మణుగూరుటౌన్: ఏరియాలో ఏప్రిల్లో 9.26 లక్షల టన్నుల లక్ష్యానికి 10.88 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, 117 శాతం నమోదు చేసినట్లు మణుగూరు జీఎందుర్గంరాంచందర్తెలిపారు.బుధవారనిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్లో ఓబీ 15 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను13.33లక్షల క్యూబిక్ మీటర్లు వెలికితీశామన్నారు. మణుగూరు ఓసీ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. సమావేశంలో అధికారులు లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాస్, శ్రీనివాసచారి, అనురాధ, శేషగిరి, బాబుల్ రాజు, రమేశ్, సింగు శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అమ్మాయిలదే హవా..
‘పది’లో ప్రతిభ కనబర్చిన బాలికలు ● జిల్లాలో 91.49 శాతం ఉత్తీర్ణత ● రాష్ట్రంలో 27వ స్థానంలో ‘భద్రాద్రి’ ● ఈనెల 16 వరకు సప్లిమెంటరీ ఫీజు చెల్లించే అవకాశంకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలే అధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు. బుధవారం విడుదలైన ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 27వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే 1.10 శాతం ఉత్తీర్ణత పెరిగినా.. రాష్ట్ర స్థాయిలో ఒక స్థానం కిందకు పడిపోయింది. జిల్లాలో ఈ ఏడా ది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మొత్తం 12, 250 మంది పరీక్షలు రాయగా, 11,208 (91.49 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 5,971 మందికి 5,320, బాలికలు 6,279 మందికి 5,888 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 4.67 శాతం అధిక ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ ఏడాది జిల్లాలో 299 పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 78 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిల్లో ప్రభుత్వ పాఠశాలు 54, ప్రైవేట్ పాఠశాలలు 24 ఉన్నాయి. ఇక విద్యారులంతా ఫెయిలైన పాఠశాలలు ఏమీ లేవు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపడుతున్నా.. రాష్ట్రస్థాయిలో మెరుగైన ఫలితాలు రావడం లేదని, దీనిపై విద్యాశాఖాధికారులు సమీక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా వారంతా అందుబాటులో ఉంటారని, ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అంటున్నా రు. కాగా, ఉత్తీర్ణత కాలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దని, సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమై ఉత్తీర్ణత సాధించాలని విద్యాధికారులు సూచిస్తున్నారు. 15 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్.. పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు వస్తాయని అనుకుంటే తక్కువ వచ్చిన వారు, పరీక్షలు బాగా రాశామనుకుంటే ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈనెల 15 వరకు అవకాశం ఇచ్చారు. ఇక సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుం లేకుండా 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. ‘ఆశ్రమాల్లో’ పెరిగిన ఫలితాలుభద్రాచలం: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పదో తరగతి ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది కంటే కొంత ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఆశ్రమ పాఠశాలల్లో 93.77, హాస్టళ్లలో 84.34 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మొత్తం 2,173 మందికి 2,022 మంది ఉత్తీర్ణత సాధించగా 151 మంది ఫెయిలయ్యారు. గతేడాది 90.60 శాతం ఫలితాలు సాధించగా ఈ ఏడాది 93.05 శాతానికి పెరిగింది. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 31 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారని పీఓ రాహుల్ తెలిపా రు. ఇల్లెందు ఆశ్రమ పాఠశాలలో అతి తక్కువగా 65.22 శాతం ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు. -
కన్నీటితో హాజరై.. ఉత్తమ ఫలితాలు
పరీక్షల ప్రారంభం రోజే బాలికల తండ్రి మృతి ఇల్లెందురూరల్: తండ్రి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉండి.. కన్నీటిని దిగమింగుతూ పదో తరగతి పరీక్షలు రాసిన అక్కాచెల్లెళ్లు బుధవారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని కల్తిరామయ్య గుంపు గ్రామానికి చెందిన కనపటి హర్షిత, ప్రియ రొంపేడు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. పరీక్షలు ప్రారంభమైన రోజే తండ్రి వీరస్వామి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ వార్త కూతుర్లకు తెలియనీయకుండా జాగ్రత్త పడిన కుటుంబ సభ్యులు, ఆశ్రమ ఉపాధ్యాయులు.. పరీక్ష పూర్తి కాగానే ఇంటికి తీసుకెళ్లి తండ్రి భౌతికకాయాన్ని చూపించారు. ఆరోజు అంత్యక్రియలు పూర్తి కాగా, అందరూ ధైర్యం చెప్పి మిగితా పరీక్షలు కూడా రాయించారు. కాగా హర్షిత 355, ప్రియ 388 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. -
రసాభాసగా కాంగ్రెస్ సమావేశం
పాల్వంచ: కాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశంలో రసాభాస నెలకొంది. సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బుధవారం వజ్రా హోటల్లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల అంతర్గత సమావేశం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, టీపీసీసీ పరిశీలకులు శ్రావణ్ కుమార్ రెడ్డి, పి.ప్రమోద్, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. టీపీసీసీ పరిశీలకులు మాట్లాడాక ముఖ్యనేతలు మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, అధికారం రాగానే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కష్టపడ్డ నాయకులకు ఎక్కడా చోటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమ్మగుడి పాలక మండలిలో స్థానికులు, కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి చోటు ఇవ్వకుండా నాయకులే మోసం చేశారని గంధం నరసింహారావు అనే కార్యకర్త ఆరోపించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను బాయికాట్ చేస్తామని పేర్కొన్నారు. మరికొందరు సైతం మాట్లాడుతూ ఇతర పార్టీల వారికి కండువాలు కప్పడంతో, వారి పెత్తనం కింద పనిచేయాల్సి వస్తుందని గొడవకు దిగారు. దీంతో కొంత కాలంగా ఉన్న వర్గ విబేధాలు బహిర్గతమైనట్లయింది. కాగా సంయమనం పాటించాలని డీసీసీ అధ్యక్షుడు, పరిశీలకులు కోరారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పినా శ్రేణులు శాంతించకుండా అడ్డుకోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు నాగ సీతారాములు, ధర్మారావు, భూక్యా దళ్సింగ్, జేబీ శౌరి, దేవీ ప్రసన్న, యడవల్లి కృష్ణ, కొత్వాల శ్రీనివాసరావు, నూకల రంగారావు, కార్తీక్, వై.ముత్తయ్య, జలీల్ పాల్గొన్నారు. -
తాపీమేసీ్త్ర కుమార్తె స్కూల్ టాపర్
పాల్వంచరూరల్: తాపీమేసీ్త్ర కూతురు పదో తరగతిలో ప్రతిభ చాటింది. మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మాళోతు రవి తాపీమేసీ్త్రగా పనిచేస్తూ తన ముగ్గురు పిల్లలను చదివిస్తున్నాడు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఐటీఐ చేస్తుండగా, కుమార్తె ఉషారాణి స్వగ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదివింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో 600మార్కులకు 523 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థినిని హెచ్ఎం రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు. నేత్రపర్వంగా కల్యాణంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అకాల వర్షంతో పంట నష్టం మణుగూరు టౌన్/పాల్వంచరూరల్/ములకలపల్లి : అకాల వర్షంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. జిల్లాలోని పలుచోట్ల బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మణుగూరు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం, గుండాల, టేకులపల్లి, ఇల్లెందు, చండ్రుగొండ మండలాల్లో వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు ఉరుకులు, పరుగులతో వెళ్లి పట్టాలు కప్పుకుని ధాన్యం కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణుగూరులో వడగండ్ల వాన పడింది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు ఖమ్మంమయూరిసెంటర్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఫీజు చెల్లించే గడువును ప్రభుత్వం ఈనెల 3వ తేదీ వరకు పొడిగించింది. ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ కల్పిస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేదీతో గడువు ముగియగా, ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. మరోసారి మూడు రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టీ.కే.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రూ.50.13 కోట్ల ఫీజు వసూళ్లతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలో మూడో స్థానాన నిలిచింది. ప్రస్తుతం గడువు పొడిగించిన నేపథ్యాన కేఎంసీతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల నుండి మరింత ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 5 నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’అశ్వారావుపేటరూరల్: వానాకాలం సాగుకు సంబంధించి రైతులను సమాయత్తం చేసేందుకు ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
లక్ష్యం వైపు పయనం..
● ఈ ఏడాది రూ.145 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా జీసీసీ కార్యాచరణ ● గిరిజనుల నుంచి ఉత్పత్తుల సేకరణ ● సేల్స్మెన్లకు దిశానిర్దేశం చేసిన అధికారులు ఇల్లెందు: అటవీ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెంచినా వాటి ద్వారా ఆదాయం మాత్రం ఆశించినంత రావడం లేదు. నిత్యాసర సరుకుల విక్రయం, అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటిని విక్రయించి లాభాలు ఆర్జించటం లేదు. దీంతో జీసీసీ లక్ష్య సాధనలో విఫలమవుతోంది. కానీ, ఈ దఫా గ్రామస్థాయి నుంచి అధికారుల స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, సమష్టి కృషితో పనిచేసి సంస్థను బలోపేతం చేసేందుకు నిర్ణయించింది. అటవీ ఉత్పుత్తుల సేకరణతో పాటు మంచి ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించాలనుకుంటున్నారు. డివిజన్ లక్ష్యం ఇలా.. ఇటీవల భద్రాచలంలో జరిగిన జీసీసీ డివిజనల్ స్థాయి సమావేశంలో చర్చించిన అంశాలను కిందిస్థాయికి తీసుకెళ్లాలని సూచించగా బ్రాంచ్ స్థాయిలోనూ సమావేశాలు నిర్వహించారు. ఇల్లెందు బ్రాంచ్లో రూ.64.70 కోట్లు, భద్రాచలం రూ.21.88 కోట్లు, దమ్మపేట రూ.39.89 కోట్లు, పాల్వంచ రూ.17.60 కోట్లు, మణుగూరు రూ.18.85 కోట్ల వ్యాపారం చేయాలని, మొత్తంగా భద్రాచలం డివిజన్లో 2025–26లో రూ.145 కోట్ల వ్యాపారం చేయాలని నిర్ణయించారు. గిరిజనుల నుంచి సేకరించిన ఫల ఉత్పత్తుల విక్రయం, డీఆర్ డిపోల ద్వారా బియ్యంతో పాటు నిత్యావసరాలు విక్రయించడంతోపాటు అటవీ ఉత్పత్తులు కరక్కాయ, చిల్ల గింజలు, కుంకుడు కాయ, ఇప్పపువ్వు, ఇప్పబద్ధ, ముష్టిగింజలు, నరమామిడి చెక్క, జిగురు సేకరణపై దృష్టిసారించటమే లక్ష్యం. అటవీ ఉత్పత్తులే కీలకం.. జీసీసీ డీఆర్ డిపోల ద్వారా ముష్టిగింజలు కిలో ధర రూ.75 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. డివిజన్ పరిధిలో భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, దమ్మపేట బ్రాంచ్ల్లో 149 డీఆర్ డిపోలున్నాయి. ఇల్లెందు బ్రాంచ్ పరిధిలోని గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, బయ్యారం, మణుగూరు బ్రాంచ్ పరిధిలో పినపాక, పాల్వంచ, దమ్మపేట మండలాల్లో ఈ దఫా సుమారు 3 వేల క్వింటాళ్ల ముష్టిగింజలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంస్థ వ్యాపార లక్ష్యం.. డివిజన్లో వ్యాపార లక్ష్యం రూ.145 కోట్లు కాగా అటవీ ఉత్పత్తుల కొనుగోలుతో రూ.3.50 కోట్లు, వ్యవసాయేతర ఉత్పత్తుల ద్వారా రూ.30 కోట్ల వ్యాపారం, పెట్రోల్బంక్ల ద్వారా రూ.80 కోట్ల వ్యాపారం చేయనున్నారు. హాస్టళ్లు, ఆశ్రమ పాఠఽశాలలకు బియ్యం సరఫరాతో రూ.50 లక్షలు, కాస్మొటిక్స్ సరఫరాతో రూ.23.50 కోట్లు, గ్యాస్ సరఫరాతో రూ.2 కోట్లు, ఇతర వస్తువుల సేల్స్తో రూ.5.50 కోట్లు లక్ష్యంగా జీసీసీ ఎంచుకుంది. లక్ష్యం దిశగా కృషి సాగుతోంది.. ఈ దఫా డివిజన్ పరిధిలో లక్ష్యం దిశగా వ్యాపారాభివృద్ధి కోసం కృషి చేయాలని పట్టుదలతో ఉన్నాం. ఇప్పటికే ఒక దఫా సమావేశం నిర్వహించాం. మరోమారు సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఈ దఫా రూ.145 కోట్లు లక్ష్యంగా డివిజన్లో జీసీసీ కార్యాచరణ ఉంటుంది. –కె.సమ్మయ్య, డీఎం, భద్రాచలం, డివిజన్ -
వ్యక్తి మృతికి కారణమైన యువకుడికి జైలు
భద్రాచలంఅర్బన్: ఆగి ఉన్న బైక్ను ఢీకొట్టి ఓ వ్యక్తి మరణానికి కారకుడైన వ్యక్తికి 16 నెలల జైలుశిక్ష విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్ మంగళవారం తీర్పు చెప్పారు. 2014, అక్టోబర్ 31న దుమ్ముగూడెంనకు చెందిన పూర్ణచందర్రావు తన భార్య భవానితో కలిసి చిన్ననల్లబెల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తూ మధ్యలో ఆగాడు. ఈ క్రమంలో పర్ణశాల నుంచి లక్ష్మీనగరం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వరక మహేశ్ ఆగి ఉన్న పూర్ణచందర్రావు బైక్ను వేగంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన పూర్ణచందర్రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వరక మహేశ్పై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి శివనాయక్ 16 నెలలు జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు ఇల్లెందురూరల్: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజు ఈ నెల 26న మాణిక్యారం నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. అదే సమయంలో ఇల్లెందు నుంచి మాణిక్యారం వెళ్తున్న బొలేరో వాహనం బైక్ను ఢీకొట్టడంతో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. నాటి నుంచి ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రాజు తండ్రి రాంమ్మూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కొమరారం ఎస్ఐ నాగుల్మీరా మంగళవారం తెలిపారు. సెంట్రల్ లైటింగ్ను ఢీకొట్టిన లారీ లారీ కిందకు వెళ్లిన స్కూటీ.. తప్పిన ప్రాణాపాయం పాల్వంచ: బీసీఎం రహదారిపై ఓ బొగ్గు లారీ మంగళవారం రాత్రి సెంట్రల్ లైటింగ్ను ఢీకొట్టింది. స్థానికుల కథనం మేరకు.. కొత్తగూడెం వైపు నుంచి పాల్వంచకు బొగ్గు లారీ వస్తూ బీసీఎం రహదారిలో ఒడ్డుగూడెం క్రాస్ రోడ్డు వద్ద పక్కకు దూసుకు పోయి, సెంట్రల్ లైటింగ్ స్తంభం, హోర్డింగ్ను ఢీకొంది. సెంట్రల్ లైటింగ్ స్తంభం కూలింది. మరోవైపు స్కూటీపై వస్తున్న ఓ వ్యక్తి లారీ వస్తున్న విషయాన్ని గుర్తించి స్కూటీని వదిలీ పక్కకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. స్కూటీ లారీ టైర్ల కిందపడి నుజ్జునజ్జయింది. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖాధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు. -
ఆరు మట్టి టిప్పర్ల పట్టివేత ●
పాల్వంచరూరల్: అర్ధరాత్రి గుట్టుగా మట్టిని తరలిస్తున్న ఆరు టిప్పర్లను రెవెన్యూ అధికారులు సీజ్చేశారు. తహసీల్దార్ వివేక్ కథనం ప్రకారం.. మొర్రేడువాగు ఎగువభాగంలో ఉన్న గుడిపాడు సమీపం నుంచి సోమవారం అర్ధరాత్రి మట్టిని ఆరు టిప్పర్లలో పాల్వంచకు తరలిస్తున్నారు. సమాచారం అందడంతో ఆర్ఐలను ఘటనా స్థలానికి పంపగా అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న ఆరు టిప్పర్లను పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి తరలించి, వాహనాలకు జరిమానా విధించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. యువకుడి ఆత్మహత్య దమ్మపేట: పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలోని మందలపల్లిలో చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన కుప్పాల శ్రీను (24)కు గతేడాది వివాహం కాగా ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీంతో అతడి తండ్రి, భార్య ఈ నెల 27న మందలించగా.. శ్రీను పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి. .అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతున్న బాలిక మృతి దుమ్ముగూడెం: మండలంలోని జడ్.వీరభద్రారం గ్రామానికి చెందిన బాలిక పురుగులమందు తాగి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. బాలిక 5 రోజుల కిందట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న యువతి.. సుజాతనగర్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందిన ఘటనపై సుజాతనగర్ పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ రమాదేవి కథనం మేరకు.. మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్ల కిందట పదో తరగతి ఫెయిల్ అవ్వడంతో చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. పొలం పనికి రావడం లేదు.. ఇంట్లో పని కూడా చేయడం లేదంటూ ఈ నెల 14న ఆమెను తన తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సొసైటీ చైర్మన్, సీఈఓ నిర్బంధం
ఆ తర్వాత గన్నీ సంచులు తీసుకెళ్లిన రైతులు వైరారూరల్: రోజుల తరబడి ధాన్యం ఆరబోసి వేచిచూస్తున్న రైతులకు గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో సొసైటీ కార్యాలయంలో చైర్మన్, సీఈఓ సహా ఉద్యోగులను నిర్బంధించి నిరసన తెలిపారు. ఆతర్వాత కాసేపటికి వారిని వదిలేసి సంచులు తీసుకెల్లిన ఘటన వివరాలిలా ఉన్నాయి. వైరా మండలం గరికపాడు సొసైటీ కార్యాలయానికి పది వేల ఖాళీ గన్నీసంచులు రావడంతో పలువురు రైతులు తమకు ఇవ్వాలని కోరారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశాలు అందేవరకు ఎవరికీ ఇవ్వబోమని, ఇప్పటికే కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాకే ఇస్తామని సిబ్బంది బుదలిచ్చారు. దీంతో రైతులు ఆగ్రహానికి గురై కార్యాలయంలో చైర్మన్ అయిలూరి కృష్ణారెడ్డి, సీఈఓ రామకృష్ణ, సిబ్బంది ఉండగానే షట్టర్ వేశారు. ఆ కాసేపటికే షట్టర్ తీసి.. ఖాళీ బ్యాగ్లు తీసుకెళ్లారు. సొసైటీ పరిధిలోని గ్రామాల్లో 12,328 బస్తాలు ఐదు రోజులుగా రోడ్ల వెంట, కల్లాల్లో ఉన్నాయి. ఇవన్నీ మిల్లులకు తరలించాకే రైతులకు గన్నీ బ్యాగ్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. కానీ రైతులు మాత్రం రోజుల తరబడి ధాన్యం ఆరబోసి ఎదురుచూస్తున్నందున బ్యాగ్ల్లో నింపి భద్రపర్చుకుంటామని తీసుకెళ్లారు. ఈ విషయంలో సొసైటీలో ఎవరిపైనానా చర్యలు తీసుకుంటే తాము బాధ్యత వహిస్తామని రైతులు నచ్చచెప్పడం గమనార్హం. -
అర్హులకు అందేనా..?
● 2,22,587 దరఖాస్తులు.. 3,182 మంది అర్హులు ● మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ ● వార్డు మాజీ కౌన్సిలర్ల పెత్తనంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం కొత్తగూడెంఅర్బన్: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. కానీ, సర్వేలో జరుగుతున్న తప్పుల కారణంగా కొందరు అర్హులు ఇబ్బంది పడుతున్నారు. మండలాల్లో సర్వే పూర్తయి అర్హులను తేల్చినప్పటికీ.. మున్సిపాలిటీల్లో ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో గత జనవరిలో మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. కాగా, ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో వార్డు మాజీ కౌన్సిలర్లు సభ్యులుగా ఉండటాన్ని అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ నుంచి కమిటీ సభ్యులు ఉండడంతో ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. దీంతో వార్డు ఆఫీసర్ ఎవరి మాట వినాలో తెలియక అవస్థ పడుతున్నారు. వార్డు మాజీ కౌన్సిలర్లు వారికి దగ్గరి వ్యక్తులు, బంధువులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు చెబుతున్నారు. పలు నిబంధనలు క్రమబద్ధీకరణ పట్టాలు లేని వారికి అవరోధంగా పరిణమించాయి. వర్షం కాలం వస్తే పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను సైతం కమిటీ సభ్యులు, వార్డు ఆఫీసర్లు అర్హత లేనివాటిగా గుర్తించడం రాజకీయ పెత్తనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అనర్హులు ఎవరు? ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రకటించినప్పడు ఆందోళన వ్యక్తమైంది. అలా గొడవలు జరుగకుండా కమిటీ సభ్యులు, వార్డు మాజీ కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు రహస్యంగా ఎంపిక చేస్తున్నారు. మొదటి దశ ఎల్–1లో స్థలం ఉండి ఇళ్లు లేని వారు, ఎల్–2లో స్థలం, ఇళ్లు లేని వారు అర్హులు. ఎల్–3లో కారు, సొంత ఇల్లు, దారిద్య్ర రేఖ ఎగువ ఉన్న వారిని చేర్చి అనర్హులుగా ప్రకటించాలి. కానీ, ఇక్కడే సభ్యులు, ఆఫీసర్ల మధ్య వ్యత్యాసాలు వస్తున్నాయి. గతంలో ప్రకటించిన ప్రకారం నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తే.. వార్డుకు 5 నుంచి 10 మాత్రమే ఇళ్లు వస్తాయని, దశలవారీగా మంజూరు చేస్తామని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులు ఇలా.. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 2,22,587 వరకు దరఖాస్తులు వచ్చాయి. అధికారులు తొలుత 22 గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టు కింద తొలి దశలో 3,182 మందిని అర్హులుగా తేల్చి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అలాగే, మున్సిపాలిటీల్లో జరుగుతున్న సర్వేపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందని పలువురు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో కొనసాగుతోంది.. జిల్లాలోని మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయింది. 22 గ్రామ పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశాం. మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. – శంకర్, హౌసింగ్, పీడీ -
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ..
● ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు ● క్షతగాత్రుల్లో దక్షిణ కొరియా దేశస్తులు జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ సమీపంలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి కారులో దక్షిణ కొరియా దేశస్తులు ముగ్గురు, హైదరాబాద్కు చెందిన వ్యక్తి, డ్రైవర్తో (ఐదుగురు) బయలుదేరి భద్రాచలం వెళ్తున్నారు. ఆళ్లపల్లి మండలం రామాంజిగూడెంనకు చెందిన వానపాకుల సాంబశివరావు (24), భార్య సంధ్య, మరదలు శ్రీలత ఏపీ రాష్ట్రం కుక్కునూరు మండలం వెలేరుకు పెళ్లికి వెళ్లి తిరిగి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. సాంబశివరావు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వినోభానగర్ గ్రామం దాటిన తరువాత ఈ రెందు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వానపాకుల సాంబశివరావు తీవ్రంగా గాయపడగా.. సంధ్య, శ్రీలతకు గాయాలయ్యాయి. దక్షిణ కొరియా పర్యాటకులు సంకిమ్, థసిన్, సైకిమ్, హైదరాబాద్కు చెందిన సాల్మన్ రాజు, డ్రైవర్ దర్శికుమార్లకూ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాంబశివరావు మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం దక్షిణ కొరియా పర్యాటకులను ఖమ్మం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాదావత్ రవి పేర్కొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
చుంచుపల్లి: కొత్తగూడెం, ఇల్లెందు పట్టణ పరిసర ప్రాంతాల ఆర్టీసీ ప్రయాణికులకు సమస్యల పరిష్కారం కోసం బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం 99592 25959 ఫోన్ నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. అటవీ ఉత్పత్తులను డీఆర్ డిపోలో విక్రయించాలి గుండాల: అటవీ ఉత్పత్తులను డీఆర్ డిపోలో విక్రయించే సౌకర్యం కల్పించామని జీసీసీ మేనేజర్ నరసింహారావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని, గిరిజన సహకార సంస్థ ద్వారా కిలో ముష్టి గింజలు రూ.75, కుంకుళ్లు రూ.40, ఇప్పపూలు రూ.30, ఇప్పపలుకు రూ.29, కరక్కాయ రూ.15, కానుగకాయ రూ.10తో కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అకౌంటెంట్ బూసేయ్య, జీసీసీ సేల్స్మెన్లు పూనెం లక్ష్మయ్య, గలిగ చెన్నయ్య, అంబటి శ్రీనివాస్, మోల్కం పగడయ్య పాల్గొన్నారు. జెడ్పీకి గుండాల ఎంపీడీఓ డిప్యూటేషన్ గుండాల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున గుండాల ఎంపీడీఓ సత్యనారాయణను డిప్యూటేషన్పై జెడ్పీకి బదిలీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, ఉపాధి హామీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జాప్యంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావడం లేదనే ఆరోపణలు రాగా.. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో మంగళవారం ఎంపీడీఓ సత్యనారాయణను జిల్లా పరిషత్ కార్యాలయానికి డిప్యూటేషన్పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టేకులపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సామల శ్రీనివాసరావుకు గుండాల ఎంపీడీఓగా నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. కలప స్వాధీనం.. ట్రాక్టర్ సీజ్.. కేసు నమోదు కరకగూడెం: అక్రమంగా అటవీ ప్రాతంలో చెట్లు నరికి గుట్టుచప్పుడూ కాకుండా కలప తరలిస్తున్న వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్వి కథనం ప్రకారం.. రేగుళ్ల గ్రామానికి చెందిన కొండగొర్ల సమ్మయ్య మంగళవారం అనంతారం బీట్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి టేకు, బిల్లుడు, చెన్నంగి, కొడిశ వాసాలను తన ట్రాక్టర్లో ఇంటికి తరలిస్తున్న క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకొని రేంజ్ కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్ను సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు. కలప విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందన్నారు. తనిఖీల్లో ఎఫ్ఎస్ఓలు సూరయ్య, ఏడుకొండల్, బీట్ ఆఫీసర్ రోజా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఖమ్మంమయూరిసెంటర్: పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని నిరసిస్తూ వచ్చేనెల 20న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఖమ్మంలో అఖిలపక్ష కార్మిక సంఘాల బాధ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శులు శింగు నర్సింహారావు, జె.వెంకటేష్, కె.సూర్యం, ఐఎన్టీయూసీ నాయకులు పాల్వంచ కృష్ణ మాట్లాడారు. కార్మికుల కోసం అమల్లో ఉన్న ప్రతీ హక్కు వెనక దశాబ్దాల పోరాటం దాగి ఉందని తెలిపారు. వీటిని కాలరేసేలా ప్రయత్నిస్తున్న కేంద్రానికి గుణపాఠం చెప్పేందుకు సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు గాదె లక్ష్మీనారాయణ, నరాల నరేష్నాయుడు, విష్ణువర్దన్, ఏ.వెంకటరెడ్డి, ఐ.వెంకన్న, తోట రామాంజనేయులు, కళ్యాణం వెంకటేశ్వరరావు, జి.రామయ్య, నీలం రాజేష్, పటేల్ పాల్గొన్నారు. -
నిరుపేద ఇంట్లో నిప్పుల కుంపటి
● గ్యాస్ లీకేజీ.. పక్కనే కట్టెల పొయ్యితో మంటలు ● ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి ● ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు తల్లాడ: అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబ సభ్యుల్లో అంతులేని విషాదం నెలకొంది. ఇంట్లోని పిల్లలే కాక వేసవి సెలవులకు వచ్చిన సోదరి పిల్లలు సైతం అగ్నిప్రమాదంలో చిక్కుకోవడం.. ఇద్దరు మృతి చెందగా, ఇంకో నలుగురు చికిత్స పొందుతుండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. తల్లాడ మండలం మిట్టపల్లిలో జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. సిలిండర్ మారుస్తుండగా... మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్ ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్ సిలిండర్ అయిపోయింది. దీంతో మరో సిలిండర్ తీసుకొచ్చిన ఆయన రెగ్యులేటర్ బిగిస్తున్నాడు. ఈక్రమాన సిలిండర్ మూత తీయగానే గ్యాస్ లీకేజీ కావడం.. సమీపాన కట్టెల పొయ్యి వెలుగుతుండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు వంట గదిలో నుంచి వరండాలోకి వచ్చాయి. అక్కడ వినోద్ కవల కుమారులైన వరుణ్తేజ్, తరుణ్తేజ్(7), నాయనమ్మ సుశీల(65), వేసవి సెలవుల్లో మేనమామ అయిన వినోద్ ఇంటికి వచ్చిన సత్తుపల్లి మండలం నాచారానికి చెందిన ఆయన చెల్లెలు లావణ్య పిల్లలు ప్రిన్సీ, లింసీ ఉన్నారు. దీంతో వారందరినీ మంటలు చుట్టుముట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వినోద్ కూడా గాయపడగా.. ఆయన భార్య రేవతి సరుకుల కోసం సమీప షాప్నకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడింది. మంటలను గుర్తించిన స్థానికులు హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత తరుణ్ తేజ్, ప్రిన్సీని హైదరాబాద్ తరలించగా.. హైదరాబాద్లో చికిత్స పొందుతూ తరుణ్, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుశీల మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. క్షతగాత్రుల్లో వినోద్, వరుణ్, లింసీ ఖమ్మంలో, ప్రిన్సీ హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్తనాదాలు గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో గాయపడిన వారు ఆర్తనాదాలు చేశారు. ఒళ్లంతా కాలిపోయి చర్మం ఊడుతుండగా ఆస్పత్రికి తరలించే సమయాన చిన్నారులు బాధ తట్టుకోలేక తమను కాపాడాలని వేడుకోవడం స్థానికులను కలిచివేసింది. అయితే, గ్యాస్ సిలిండర్ అయిపోగానే కట్టెల పొయ్యి అంటించడం.. అది మండుతుండగానే కొత్త సిలిండర్ అమర్చే క్రమాన లీకేజీతో ప్రమాదం జరిగింది. ఒకవేళ కట్టెల పొయ్యి లేకపోతే ప్రమాదం జరగకపోయేదని స్థానికులు తెలిపారు. నిరుపేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబానికి చెందిన వినోద్ ఆటో డ్రైవర్గా జీవనం సాగించేవాడు. కొన్నాళ్లుగా సుతారి పనులకు వెళ్తున్నాడు. ఆయనకు ఇద్దరు కవల కుమారులు ఉండగా, వేసవి సెలవులు కావడంతో సోదరి లావణ్య పిల్లలైన ప్రిన్సీ, లింప్సీ కూడా వచ్చారు. ప్రస్తుతం వినోద్, ప్రిన్సీ, లింప్సీ, వరుణ్, వినోద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం.. వినోద్ నాయనమ్మ, కుమారుడు మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, వినోద్కు ఆయన కుమారుడు, నాయనమ్మ మృతి విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న వినోద్ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. -
విజిలెన్స్ !
పత్తి కొనుగోళ్లపైబూర్గంపాడు: సీసీఐ పత్తి కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపై గతంలోనే ప్రాథమిక విచారణ చేసి పది మందికి పైగా మార్కెట్ కార్యదర్శులు, డీఎంఓలను సస్పెండ్ చేయగా భద్రాచలం మార్కెట్ కార్యదర్శిపై కూడా వేటు పడింది. సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించి టీఆర్(టెంపరరీ రిజిస్ట్రేషన్)ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది. జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లు ఉండగా నాలుగు మార్కెట్ల ఆధ్వర్యంలో సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఆయా మార్కెట్లలోనూ టీఆర్ల జారీలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. బూర్గంపాడు, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు మార్కెట్ల అధికారులకు విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పాస్బుక్లు లేని రైతుల కోసం.. జిల్లాలో నాలుగు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చే రైతులు.. తాము ఏ సర్వే నంబర్ భూమి లో ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు చేశామనే వివరాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ముందుగానే క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. వారు ఇచ్చిన బుకింగ్ ఆన్లైన్ లిస్ట్ ఆధారంగా మార్కెటింగ్ శాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేస్తారు. అయితే పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు, పోడు సాగు చేసుకుంటున్న వారు పత్తి అమ్ముకునేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో అలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ ప్రక్రియ ప్రారంభించింది. పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు తమ భూమి వివరాలను ముందుగా వ్యవసాయ అధికారులకు తెలియజేసి పత్తి వేసినట్లు నమోదు చేసుకోవాలి. అయితే చిన్న, సన్నకారు రైతులకు ఈ ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో టీఆర్కు దూరంగా ఉండగా.. వ్యాపారులు, దళారులు మాత్రం దీన్ని తమ కు అనుకూలంగా మార్చుకున్నారు. కొందరు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులను ప్రసన్నం చేసుకుని తమ బంధువుల పేర్లతో టీఆర్లు పొందారు. వాటి ఆధారంగా గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతుల నుంచి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి సీసీఐలో ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. సీసీఐ కేంద్రాల్లో భారీగా అక్రమాలు ? టీఆర్ల జారీలో అవకతవకలపై చర్యలకు రంగం సిద్ధం ఇప్పటికే మార్కెట్ కార్యదర్శులకు నోటీసులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులురైతులను ఆరా తీసిన అధికారులుఇల్లెందురూరల్/అశ్వాపురం : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్మకాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అశ్వాపురం మండలం రామచంద్రాపురం, ఇల్లెందు మండలం కొమరారం గ్రామాల్లో మంగళవారం పర్యటించిన అధికారులు.. ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు.. సీసీఐ కేంద్రంలో ఎన్ని క్వింటాళ్లు అమ్మారు.. డబ్బులు ఎవరి ఖాతాల్లో జమయ్యాయి అంటూ రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. కొమరారంలో 148 టీఆర్ కూపన్ల ద్వారా పత్తి విక్రయించగా అన్నింటిపైనా ఆరా తీసి, వివరాలు నమోదు చేశారు. -
ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలి
చుంచుపల్లి: అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేస్తూ కొత్తగూడెం ఆర్టీసీ డిపోను అభివృద్ధి పథంలో నడిపించాలని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం డిపోలోని పలు సెక్షన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అందించాల్సిన సేవలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఉద్యోగులంతా సమష్టిగా పని చేస్తూ సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు నడపాలని సూచించారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు ఉద్యోగులను సత్కరించారు. ఆర్ఎం వెంట డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, సూపర్వైజర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.ఆర్ఎం సరిరామ్ -
కొండరెడ్ల అభివృద్ధే లక్ష్యం
దమ్మపేట : కొండరెడ్ల జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, వారి సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. మండల పరిధిలోని పూసుకుంట, కటుకూరు అటవీ మార్గంలో సుమారు రూ.5 కోట్లతో నిర్మించిన మూడు హై లెవల్ వంతెనలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల మంగళవారం ప్రారంభించారు. అనంతరం పూసుకుంటలో నిర్వహించిన సమావేశంలో కొండరెడ్లు ఉమ్మాల నారాయణమ్మ, యాట్ల కాంతారెడ్డికి భద్రాచలం ఐటీడీఏ ద్వారా మంజూరైన టెంట్హౌస్, సౌండ్ సిస్టంలను, మరో ఐదుగురికి తేనెటీగల పెంపకం సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండరెడ్ల వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు నరకకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఎస్ఈ మహేందర్కు సూచించారు. డ్రైవింగ్లో నైపుణ్యం గల కొండరెడ్ల యువతను గుర్తించి, లైసెన్స్లు ఇప్పించాలని, ప్రజా రవాణా కోసం రెండు వాహనాలు అందజేయాలని ఐటీడీఏ పీఓ రాహుల్ను ఆదేశించారు. పోడు భూముల్లో పచ్చదనం పెంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్కు సూచించారు. జిల్లా స్థాయి అధికారులు నెలలో ఒక్కసారైనా పూసుకుంట, కటుకూరు గ్రామాలను సందర్శించి, స్థానికుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఆయా గ్రామాల రైతులు పామాయిల్, మునగ పంటలు సాగు చేసేలా ఉద్యాన అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కొండరెడ్లకు పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై స్థానిక ఎమ్మెల్యేకు ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు గోదావరి జలాలు తీసుకొస్తామని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొండరెడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పాత రెడ్డిగూడెం, గోగులపూడి గ్రామాల్లో అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పూసుకుంట అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరుచేశామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, ట్రైనీ కలెక్టర్ శర్మ, డీపీఓ చంద్రమౌళి, ఆర్డీఓ మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, సీడీపీఓ హేమసత్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది నాటికి గోదావరి జలాలు తీసుకొస్తాం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలపై స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం -
ఆదివాసీలకు అందుబాటులో ఉంటాం..
చర్ల: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఆదివాసీలకు నిత్యం అందుబాటులో ఉంటామని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ పేర్కొన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామమైన ఎర్రంపాడులో సీఐ రాజువర్మతో కలిసి కమ్యూనిటీ కనెక్ట్లో భాగంగా ప్రతీ ఇంటిని సందర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని, దుస్తులు పంపిణీ చేశారు. ప్రతీ గ్రామానికి విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్, కార్తీక్ పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి ● బూర్గంపాడు, భద్రాచలంలో ఎమ్మెల్యేలతో కలిసి సదస్సులుబూర్గంపాడు/భద్రాచలంటౌన్ : భూముల సమస్యల శాశ్వత పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఈ చట్టంపై బూర్గంపాడు, భద్రాచలంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ద్వారా భూముల హక్కులు, రికార్డులు భద్రంగా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రికార్డుల్లో సవరణలు, మ్యుటేషన్, వారసత్వ హక్కులు, సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టంతో గిరిజన, గిరిజనేతరుల భూములకు కూడా భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు. భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారని, ఈ చట్టంతో షెడ్యూల్ (ఏ )ను ఏర్పాటు చేసి భూమి విలువ రూ.5 లక్షల లోపుంటే ఆర్డీఓ స్థాయిలో, అంతకు ఎక్కువుంటే కలెక్టర్ స్థాయిలో పరిష్కరించే అవకాశం ఉంటుందని వివరించారు. కలెక్టర్ స్థాయిలో కూడా పరిష్కారం కాకుంటే సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ శాఖను చిన్నాభిన్నం చేసిందని, రైతుల భూములకు భద్రత కల్పించేందుకు ప్రస్తుత ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మారుమూల ప్రాంత గిరిజన రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్లు ముజాహిద్, శ్రీనివాసరావు, బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. నిత్యాన్నదానానికి విరాళం భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏలూరు జిల్లాకు చెందిన నారాయణ–రుక్మిణీదేవి దంపతులు మంగళవారం రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది వారికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందించారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదతరులు పాల్గొన్నారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించాలి● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ కొత్తగూడెంటౌన్: చెక్ బౌన్స్ కేసుల్లో రాజీమార్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ అన్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో బ్యాంకు, ఆర్థిక సంస్థల అఽధికారులు, ప్రతివాదులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు లోక్ అదాలత్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొత్తగూడెం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. సీసీఎస్ అధికారులకు ఎస్పీ అభినందన కొత్తగూడెంటౌన్: రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ఈనెల 26న ప్రశంసాపత్రాలు అందుకున్న సీసీఎస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ రోహిత్రాజు మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రా – ఒడిశా ఆటవీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సమర్థంగా అడ్డుకోవడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బంది రవి, విజయ్, రామకృష్ణ భాస్కర్, వెంకటనారాయణ పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతకొత్తగూడెంఅర్బన్: ప్రయాణికుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి, నిరంతరం నిఘా పెంచుతున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఆర్సీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మట్టే సాయి తెలిపారు. భద్రతపై రైలు ప్రయాణికులకు, నిబంధనలపై ఆటో డ్రైవర్లకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైల్వే ట్రాక్లను దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వదిలేసిన లగేజీలను గుర్తిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని, భద్రాచలం రోడ్డులోని ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం
టూర్ షెడ్యూల్లో లేకుండా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీటీ రోడ్డు శంకుస్థాపనకు శిలాఫలకం ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పర్యటన సందర్భంగా ఆర్లపెంట క్రాస్రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద కాన్వాయ్ని ఆపి, కొబ్బరికాయ కొట్టి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాలని ఎమ్మెల్యేను మంత్రి తుమ్మల కోరారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. తన నియోజకవర్గ పరిధిలోని బీటీ రోడ్డు శంకుస్థాపనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, టూర్ షెడ్యూల్లో కూడా లేకుండా ఎలా ఏర్పాటు చేశారంటూ ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం మంజూరైన రోడ్డుకు ఇప్పుడు శంకుస్థాపన ఏంటని ప్రశ్నించారు. దీంతో తుమ్మల.. ఎమ్మెల్యేను సముదాయిస్తూ కొబ్బరికాయ కొట్టాలని కోరగా ‘మీరంటే గౌరవం ఉంది కానీ, అధికారులు ముందుగా చెప్పకుండా ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేయలేను’ అంటూ తెగేసి చెప్పారు. తన మనోభావం దెబ్బతిందని, వంతెనల ప్రారంభోత్సవానికి కూడా రానంటూ వెళ్లిపోతుండగా తుమ్మల ఎమ్మెల్యే చెయ్యి పట్టుకుని తన కారులో ఎక్కించుకున్నారు. జారే అనుచరుడు చిన్నశెట్టి యుగంధర్ మంత్రి కారు ఎక్కొద్దంటూ వారించడమే కాక కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో తుమ్మల వారిని సముదాయించి తర్వాత మాట్లాడుకుందాం అంటూ తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యేను తన కారులోనే ఎక్కించుకున్న తుమ్మల బీటీ రోడ్డు శిలాఫలకం వద్ద ఆపి, ప్రారంభోత్సవం చేయాలని కోరారు. దీంతో యుగంధర్ ఎమ్మెల్యేను వారించగా సముదాయించిన తుమ్మల మొదట అతడితోనే కొబ్బరికాయ కొట్టించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదినారాయణ కూడా టెంకాయ కొట్టి మంత్రితో పాటు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. -
కోడలు ఇంటి ఎదుట వృద్ధురాలి నిరసన
అశ్వారావుపేటరూరల్: కోడలు ఇంటి ముందు ఓ వృద్ధురాలైన అత్త బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండల పరిధిలోని నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మానుగొండ రాజాలు, సీతమ్మలకు ఏడెకరాల వ్యవసాయం భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం తన కుమారుడు పుల్లారావుకు ఐదెకరాలు ఇచ్చారు. మిగిలిన రెండెకరాలు వృద్ధ దంపతులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం కుమారుడు పుల్లారావు, రాజాలు మృతి చెందారు. ఆ తర్వాత సీతమ్మ తన కోడలుకు మరో ఎకరం కూడా ఇచ్చింది. కాగా ఆమెకు తెలియకుండా కోడలు రెండు ఎకరాలు కూడా పట్టా చేయించుకుంది. అనంతరం సక్రమంగా చూడకపోవడంతో అదే గ్రామంలో ఉన్న కుమార్తె తిరుపతమ్మ వద్ద ఉంటోంది. కుమార్తె ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో జీవనం ఇబ్బందిగా మారినట్లు వృద్ధురాలు అవేదన వ్యక్తం చేస్తోంది. తన పొలం తనకు అప్పగించాలని కోరుతూ పోలీస్లను ఆశ్రయించగా, న్యాయం జరగకపోవడంతో కోడలి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. కోడలు ఇంటి ముందు మూడు గంటలకుపైగా బైఠాయించగా పట్టించుకోకపోవడంతో కుమార్తె వచ్చి వృద్ధురాలిని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది. -
ధ్యానమందిరంపై ధ్యాసేది..?
● నిర్వహణ లేక చెరిగిపోతున్న కంచర్ల గోపన్న కీర్తనలు ● భద్రాచలంలో నిరుపయోగంగా భక్తరామదాసు మందిరం ● భజన మందిరంగా తీర్చిదిద్దాలని భక్తుల విన్నపం భద్రాచలం: భద్రగిరిలోని భక్తరామదాసు ధ్యానమందిరంపై అధికారులకు పట్టింపు లేకుండా పోతోంది. రామాలయ నిర్మాణ కర్త, ప్రముఖ వాగ్గేయకారుడు, భక్త రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్నకు సముచిత స్థానం కల్పించేందుకు, ఆయన కీర్తనలకు ప్రాచుర్యం కల్పించేందుకు నిర్మించిన ఆలయం శిథిలమవుతోంది. 53 ఏళ్ల విశిష్టత ఉన్న ధ్యాన మందిరం క్రమంగా ఆదరణ కోల్పోతోంది. సర్వేపల్లి రాధాకృష్ణన్తో శంకుస్థాపన.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కంచర్ల గోపన్న జ్ఞాపకార్థం రంగనాయకుల గుట్టపై ధ్యాఽన మందిరం నిర్మించారు. 1962 జనవరి 5న నాటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శంకుస్థాపన చేయగా, 1971, నవంబర్ 5న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. రెండు అంతస్తులతో మందిరం నిర్మించగా మొదటి అంతస్తులో రామదాసు రచించిన కీర్తనలను శిలాఫలాకలపై లిఖించి, వీటిని నాలుగు వైపులా గోడలపై ఏర్పాటు చేశారు. రామాయణ, భాగవత ఘట్టాల పెయింటింగ్ చిత్రాలను సైతం మందిరంలో ఏర్పాటు చేశారు. శిలాఫలకాలు శిథిలం.. నిర్వహణ సక్రమంగా లేక ధ్యాన మందిరం ప్రస్తుతం నిరుపయోగ స్థితికి చేరింది. గతంలో రంగనాయకుల గుట్టపైనే సత్రాలు, కాటేజీలు ఉండటంతో భక్తులు సందర్శించేవారు. అనంతర కాలంలో వసతి గదులు, ప్రైవేట్ లాడ్జీలు గుట్ట కింది భాగంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ కాలంలో భక్త రామదాసు వాగ్గేయకారోత్సవాలను ధ్యాన మందిరంపై జరిపేవారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలను ఆలయం పక్కనే ఉన్న చిత్రకూట మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్యానమందిరానికి భక్తుల ఆదరణ తగ్గిపోతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడి కీర్తనల శిలాఫలకాలు కూడా దెబ్బతింటున్నాయి. భక్తులను గుట్టపైకి రప్పించాలి.. ధ్యానమందిరం, రామదాసు కీర్తనల శిలాఫలాకలను పరిరక్షించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం భక్త జన మండలి సభ్యులు, అంజన్న స్వామి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. వీరికి తగిన సదుపాయాలు కల్పించి ధ్యానమందిరంతో పాటు భజన మందిరంగా అవకాశం కల్పిస్తే మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. భక్తులు రామాలయం నుంచి గుట్టపైకి వచ్చేలా ప్రచారం, రవాణా సౌకర్యం కల్పిస్తే భక్త రామదాసు పేరు, కీర్తనలు కలకాలం వినపడతాయి. -
జూద క్రీడలు ఆడితే చర్యలు
ఎస్పీ రోహిత్రాజు దమ్మపేట: కోడి పందేలు, పేకాట, బెట్టింగ్ వంటి జూద క్రీడలు ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. సోమవారం ఆయన దమ్మపేట పోలీసు స్టేషన్ను సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా కదలికలపై నిఘా పెట్టాలన్నారు. అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి, దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి పాల్గొన్నారు. చోరీ కేసులో ఏడాది జైలు శిక్షభద్రాచలంఅర్బన్: బైక్ చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సోమవారం భద్రాచలం ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి శివనాయక్ తీర్పు చెప్పారు. దుమ్ముగూడేనికి చెందిన మట్టా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బైక్ సెప్టెంబర్ 4, 2022లో భద్రాచలంలో చోరీకి గురైంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులు కారం కృష్ణమూర్తి, కేదాసి రాములుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీపీగా శ్రీనివాస్ వాదించగా, సీఐ నాగరాజు రెడ్డి, నరసింహా సహకరించారు. -
ఉపాధి పథకాలకే దరఖాస్తులు ఇవ్వండి
గిరిజన దర్బాదర్లో పీఓ రాహుల్ భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి పథకాలు, జీవనోపాధి తదితర సమస్యలపై మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని, ఉద్యోగాల కోసం ఎవరూ ఇవ్వొద్దని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించి, అర్హతల మేరకు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ అవుతాయని, వాటి కోసం దర్బార్లో దరఖాస్తులు ఇవ్వొద్దని కోరారు. గిరిజన యువత, మహిళలకు స్వయం ఉపాఽధి పథకాలు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆర్చరీ విజేతలకు అభినందన.. వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో ఇటీవల జరిగిన గిరిజన ఆర్చరీ క్రీడల్లో విజేతలతో పాటు కోచ్లు, ప్రోత్సహించిన అధ్యాపకులను పీఓ తన చాంబర్లో అభినందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, గిరిజన సంక్షేమ ఈఈ చంద్రశేఖర్, గురుకుల ఆర్సీఓ నాగార్జున రావు, ఏఓ సున్నం రాంబాబు, క్రీడాధికారి గోపాలరావు, వెంకటనారాయణ, నాగ శ్యామ్, వెంకటేశ్వర్లు, మారెప్ప పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయండి.. రాజీవ్ యువ వికాస పథక లబ్ధిదారులను నిష్పక్షపాతంగా ఎంపిక చేయాలని పీఓ రాహుల్ అన్నారు. ఆర్వైవీ దరఖాస్తులపై ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. గిరిజన నిరుద్యోగ యువత సమర్పించిన దరఖాస్తులను మండల్ లెవెల్ స్క్రీనింగ్ కమిటీతో పరిశీలించాలన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో మరమ్మతుల ప్రతిపాదనలను తక్షణమే అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో సాంఘిక, బీసీ సంక్షేమాధికారులు అనసూయ, ఇందిర, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులకు త్వరలోనే కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ అధికారుల(హెచ్డబ్ల్యూఓ) పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్లు ఇస్తామని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. ఐటీడీఏలో సోమవారం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను పీఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం జోన్కు 27 మంది అభ్యర్థులను పంపారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సభ్యుల సమక్షంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు తెరిచే లోపల పోస్టింగ్లు ఇస్తామని తెలిపారు. అధికారులు మణెమ్మ, అనసూయ, ఇందిర, రమణయ్య, అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. నవ కంపెనీలో కాంట్రాక్టర్ మృతిపాల్వంచ: పట్టణంలోని నవ కంపెనీలో నీళ్లలో పడి ఓ కాంట్రాక్టర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. టీచర్స్ కాలనీకి చెందిన ఉప్పల గిరీశం వెంకటేశ్వరరావు (60) నవ కంపెనీలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. సోమవారం పనుల పరిశీలనకు వెళ్లిన వెంకటేశ్వరరావు కూలింగ్ టవర్ వద్ద కాలు జారి పడిపోయాడు. దీంతో కొద్ది సేపటి తర్వాత గుర్తించిన ఉద్యోగులు అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ముగ్గురు పిల్లలు కాగా, వారు విదేశాల్లో ఉన్నారు. మృతుడి భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు. ‘ఎల్లో టీ షర్ట్’లపై నిరసనబూర్గంపాడు: ఐటీసీ పీఎస్పీడీలో పర్మనెంట్ కార్మికులకు ఎల్లో కలర్ టీ షర్ట్లు ఇవ్వడంపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సోమవారం కార్మిక సంఘాల నాయకులు ఐటీసీ అడ్మిన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గుర్తింపు కార్మిక సంఘం టీఎన్టీయూసీ నిర్ణయాలకు అనుగుణంగా, కార్మిక సంఘాలతో చర్చించకుండా.. ఐటీసీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికులందరూ ఎల్లో టీ షర్ట్లు తీసుకోకుండా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళళనలో కార్మిక సంఘాల నాయకులు గోనె రామారావు, సానికొమ్ము శంకర్రెడ్డి, మల్లికంటి వెంకటేశ్వర్లు, బిజ్జం అశోక్రెడ్డి, సింగంనేని ప్రసాద్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, అబ్దుల్ సలీమ్, సాబీర్ పాల్గొన్నారు. ముగిసిన అంతర్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ఏన్కూరు: మండలంలోని గంగుల నాచారంలో మూడు రోజులు జరుగుతున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో 25 జట్లు పాల్గొనగా, ఏన్కూరు మండలం గంగులనాచారం జట్టు విజేతగా నిలిచింది. ఆతర్వాత స్థానాల్లో సూరారం, గోలిమిల్లు, గంగులనాచారం(బీ), పుఠానీ తండా, చెరువుమాదారం జట్లు నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్తి వెంకటేశ్వర్లు, మల్కం గంగులు, పూసం సుధీర్, మల్లేష్, భద్రయ్య, భీమరాజు, గోపాలరావు, వినోద్కుమార్, సీతారాములు, వెంకటేశ్వర్లు, శివకృష్ణ, నాగార్జున, సాగర్, దినేష్, నరేష్ పాల్గొన్నారు. మెరుగైన వైద్యం అందించండి తిరుమలాయపాలెం: ప్రకృతి వైద్యం ప్రత్యేకతలను ప్రజలకు వివరిస్తూ మెరుగైన వైద్యం అందించాలని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి సూచించారు. తిరుమలాయపాలెంలోని ప్రకృతి వైద్యశాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఓపీ సేవలు, రికార్డులను పరిశీలించాక ఉద్యోగులకు సూచనలు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో బాలిక అదృశ్యం.. ఆచూకీ లభ్యంభద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలో ఏడేళ్ల బాలిక సోమవారం రాత్రి అదృశ్యమైంది. మణుగూరుకు చెందిన ఓ మహిళ భద్రాచలం ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతోంది. ఆమె ఏడేళ్ల కుమార్తె కూడా ఆస్పత్రిలో ఆమెతోపాటే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్న ఆ బాలిక బ్లెస్సీ అదృశ్యం కావడంతో తల్లితోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. ఎట్టకేలకు రాత్రి పొద్దుపోయాక ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం బాలిక పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తెలిసింది. -
ప్రయాణికులకు చేరువగా..
● క్యూఆర్ కోడ్తో ఆర్టీసీ సేవల వివరాలు ● కోడ్ ముద్రించిన కీచైన్లు, టేబుల్ క్యాలెండర్ల పంపిణీ భద్రాచలంఅర్బన్: ఆర్టీసీ సంస్థ ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటోంది. క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా సేవలందిస్తూ వినియోగదారులకు మరింత చేరవయ్యే ప్రయత్నం చేస్తోంది. క్యూఆర్ కోడ్ ముద్రించిన కీ చైన్, క్యాల్లెండర్లను కస్టమర్లకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆర్టీసీ అందిస్తున్న పదిరకాల యాప్లు తెరపై కనిపిస్తాయి. ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ వెబ్సైట్, గమ్యం, ఆన్లైన్ బుకింగ్ యాప్, ఆర్టీసీ ఇన్స్ట్రాగాం, ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్ చానల్ ఖాతాలు ఉంటాయి. మెయిల్ ఐడీ, పాస్వర్డ్ తదితర వివరాలు పొందుపరిస్తే వినియోగించుకోవడం సులభమవుతుంది. సాధారణంగా ఫ్లెక్సీల రూపంలో, ఇతర విధానాల్లో ప్రచారం చేస్తే అంతగా చేరుతుందో లేదోననే కారణంతో ఆర్టీసీ అధికారులు క్యూఆర్ కోడ్తో ప్రచారం చేస్తున్నారు. సేవలిలా.. క్యూఆర్ కోడ్ సాయంతో వివిధ రకాల సేవలు పొందొచ్చు. ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుంది? గమ్యానికి ఇంకా ఎంత సమయంలో చేరుకుంటుంది? వంటి వివరాలను తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో నడుస్తున్న సంస్థ బస్సుల వివరాలు, సమాచారం లభిస్తుంది. ఆన్లైన్లో టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. సలహాలు, సూచనలతోపాటు, ఫిర్యాదులు ఇచ్చేందేకు ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్ వేదికలను వినియోగించుకోవచ్చు. వివాహాది శుభకార్యాలతోపాటు విహార యాత్రలకు బస్సులను రాయితీ విధానంలో తక్కువ ధరకే బుకింగ్ చేసుకోవచ్చు.ప్రయాణికులు సహకరించాలి ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటోంది. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సంస్థకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట పొందేలా ఏర్పాట్లు చేశాం. ఇది మరింత చేరువయ్యేందుకు కీచైన్లు, టేబుల్ క్యాలెండర్లు రూపొందించాం. ప్రయాణికులకు పంపిణీ చేస్తున్నాం. ప్రజలు సంస్థ ఉన్నతికి సహకరించాలి. – తిరుపతి, డిపో మేనేజరు, భద్రాచలం -
ముక్కల గడ్డిని చుట్టేస్తోంది..!
కరకగూడెం: రైతుల వద్ద గడ్డి అందుబాటులో లేనప్పుడు పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. బేరల్ యంత్రంతో గడ్డి సమస్య కొంతమేర పరిష్కారం అవుతోంది. వరి కోసే సమయంలో ముక్కలైన గడ్డిని ఈ యంత్రం చుట్ట చుడుతూ వృథా కాకుండా చూస్తుంది. వృథా గడ్డిని కాల్చడం ద్వారా ఏర్పడే వాయు కాలుష్యం సైతం తగ్గుతుంది. ఈ యంత్రం ద్వారా గడ్డిని గుండ్రంగా లేదా చతురస్రాకారంలో బేల్స్ తయారు చేయొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. బేరల్ యంత్రం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని మోతె గ్రామ రైతు వలాద్రి రవీందర్రెడ్డి, రేగళ్లకు ఎందిన కొమరం పాపారావు చెప్పారు. ఈ యంత్రాల కొనుగోలుకు రైతులకు సబ్సిడీపై రుణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన తెల్లగొర్ల ప్రసన్న(20)పాల్వంచలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజుల క్రితం పరీక్షలు రాసేందుకు పాల్వంచలోని కళాశాలకు వెళ్లింది. కాగా, పరీక్షలు వాయిదా పడటంతో తన తండ్రికి చెప్పగా, పరీక్షలు రాసిన తర్వాత ఇంటికి రావాలని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంటికి దూరం ఉండి చదువుకోవడం ఇష్టం లేక మనస్తాపం చెంది సోమవారం ఉదయం పాల్వంచ నుంచి ఇంటికి వచ్చేసింది. అప్పటికే తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి వెంకట రమణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
టేకులపల్లి: కుటుంబంలో తలెత్తిన గొడవలు, వేధింపుల నేపథ్యంలో కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగిన ఘటనలో భార్య చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త కూడా సోమవారం మృతి చెందాడు. టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని బేతంపూడి పంచాయతీ వెంకటియా తండాకు చెందిన బోడ శ్రీను(26) ఆరు నెలల క్రితం రేగులతండాకు చెందిన దీపిక(19)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీను తన సోదరి వివాహానికి ఆర్థికసాయం కావాలని మామ వత్మల్, తోడల్లుళ్లు భర్మవత్ రవి, నాగేశ్వరరావులను అడిగాడు. వారు ఆర్థికసాయం చేయకపోగా దూషించారు. దీంతో మనస్తాపం చెంది ఈ నెల 24న శ్రీను, దీపికలు పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 25న దీపిక మృతి చెందింది. పరిస్థితి విషమించి సోమవారం శ్రీను కూడా మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. కొడుకు దాడిలో గాయపడిన తండ్రి.. గుండాల: మద్యానికి బానిసైన కుమారుడు దాడి చేయగా గాయపడిన తండ్రి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుండాల సీఐ రవీందర్ కథనం ప్రకారం.. మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన ఈసం పోతయ్య (52) కుమారుడు స్వామి నిత్యం మద్యం తాగుతూ ఇంట్లో గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21న తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కుమారుడు కర్రతో దాడి చేయగా, తండ్రి తలకు బలమైన గాయమైంది. అతన్ని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేకాటరాయుళ్ల అరెస్ట్పాల్వంచ: ఏడుగురు పేకాట రాయుళ్లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీ శ్మశాన వాటిక వద్ద పేకాట ఆడుతుండగా ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, మోటార్ సైకిల్, నాలుగు సెల్ఫోన్లు, రూ.3,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
దమ్మపేట : ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని మల్లారం రైతు వేదికలో భూ భారతి చట్టంపై సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణి కంటే మేలుగా అనేక సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ చట్టం రూపొందించారని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు భూమి యొక్క సర్వే మ్యాప్ను తయారు చేసి, పట్టాదారు పాసుపుస్తకంలో భూమి పటం ముద్రించనున్నట్లు చెప్పారు. మ్యుటేషన్ ప్రక్రియలో పూర్తిస్థాయి విచారణ చేశాకే పట్టా పేరు మారుతుందని స్పష్టం చేశారు. ఒకే సర్వే నంబర్పై పలుమార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు జరగకుండా, ఆ భూమికి భూదార్ కార్డులను జారీ చేసి, సమస్యల పరిష్కారంలో రెండంచెల అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఇంటి స్థలాలు, వ్యవసాయేతర భూములకు కూడా భూ రికార్డుల్లో హక్కులు కల్పిస్తామన్నారు. మోసపూరితంగా పట్టా మార్పిడి జరిగితే వాటిని రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలన అధికారి ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అధికారులు నిబద్ధతతో పనిచేసి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఇన్చార్జ్ తహసీల్దార్ కె.వాణి, ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, ఏఓ చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
మావోయిస్టులతో చర్చలు జరపాలి
సింగరేణి(కొత్తగూడెం): మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, కర్రిగుట్టను చుట్టుముట్టిన కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని కోరుతూ సోమవారం పలు రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్తగూడెంలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆదివాసీ ఉన్న చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో కొత్తచట్టాలను తీసుకొచ్చి ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో 89 రకాల ఖనిజ సంపద ఉందని, వాటిని స్వాధీన పరుచుకోవటం కోసం దాడులు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 280 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన కర్రి గుట్టను టార్గెట్ చేసుకుని 25 లక్షల సైన్యం జల్లెడ పడుతోందన్నారు. తక్షణమే వీరందరిని వెనక్కి పిలిచి శాంతి చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిద పార్టీల నాయకులు, ప్రజా సంఘా ల నాయకులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు -
స్పీడ్ బోట్లో షికారు ఎలా..?
పాల్వంచరూరల్ : కిన్నెరసాని జలాశయంలో స్పీడ్ బోట్లో షికారు చేసేందుకు ఎక్కువ మంది పర్యాటకులు అసక్తి చూపుతారు. కానీ నాలుగైదు రోజులుగా ఈ బోట్ పనిచేయకపోగా, మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. దీంతో పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు. తద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థ ఆదాయం కూడా తగ్గింది. మామూలు రోజుల్లో పర్యాటకుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా.. ఆదివారం, సెలవురోజుల్లో మాత్రం రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తుంటారు. ప్రస్తుతం విద్యాసంస్థలకు వేసవి సెలవులు రాగా, సందర్శకుల సంఖ్య కూడా పెరిగింది. ఈ సమయంలోనే స్పీడ్ బోట్ రిపేర్కు రావడంతో ఆదాయానికి గండి పడినట్టయింది. పెద్ద బోట్ ఒకటే నడవడంతో గత ఆదివారం రూ.6,270 ఆదాయం మాత్రమే లభించింది. అదే స్పీడ్ బోట్ కూడా నడిస్తే.... మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పెద్ద బోట్లో 20 మంది వరకు ఎక్కే అవకాశం ఉండగా ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేస్తారు. అదే స్పీడ్ బోట్ ఆరుగురికే పరిమితమైనా.. ఒక్కో ట్రిప్నకు రూ.350 చార్జీ వసూలు చేస్తారు. ఇది వేగంగా జలాశయాన్ని చుట్టిరావడం, ఒక కుటుంబానికి చెందిన వారుంటే దీన్నే ఎక్కువగా ఇష్టపడతారు. కాగా, ఈ బోట్ను హైదరాబాద్లోని టూరిజం డెవలప్మెంట్ ప్రధాన కార్యాలయానికి పంపితే తప్ప రిపేర్ చేసే అవకాశం లేదు. కిన్నెరసాని నుంచి కార్గో పాయింట్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలంటే రూ.1500కు పైగా ఖర్చవుతుంది. బోట్ ఇంజన్ తరచూ మరమ్మతులకు గురవుతండగా రవాణా ఖర్చులే అధికమవుతున్నాయి. పైగా సమయం కూడా ఎక్కువవుతోంది. దీంతో పర్యాటక శాఖ అధికారులు స్పందించి స్థానికంగానే మెకానిక్ను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. మరమ్మతులకు నోచుకోని వైనం -
కేంద్రాల్లో రైతుల నిరీక్షణ
పాల్వంచరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రాశులుపోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదు. దీంతో రైతులు నిరీక్షిస్తున్నారు. మండల పరిధిలోని రెడ్డిగూడెం కొనుగోలు కేంద్రంలో సుమారు వంద క్వింటాళ్లపైన ధాన్యం నిల్వలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం ధాన్యం కొనుగోలు చేసి తర్వాత నిలిపివేశారు. సోములగూడెం కొనుగోలు కేంద్రం వద్ద శనివారం ధాన్యం కాంటా పెట్టారు. రెండు రోజులుగా కొనుగోళ్లను నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంతెలబోరు, కారెగట్టు గ్రామాల్లో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. రోజూ అడపాదడపా వర్షం కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శి శ్రీనును వివరణ కోరగా.. మిల్లర్లు కిరికిరి పెడుతుండటం, లారీలు అనుకున్న సమయంలో రాకపోవడం వల్ల రెగ్యులర్గా కొనుగోళ్లు జరగడంలేదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని ఆవేదన -
భూ భారతి.. రైతులకు శ్రీరామ రక్ష
అశ్వారావుపేట: గత ప్రభుత్వ హయాంలో ధరణి ద్వారా రైతులకు వచ్చిన కష్టాలకు చెక్ పెట్టేందుకే భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రూ.37.5 కోట్లతో నిర్మించనున్న 100 పడకల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ఈ చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ధరణిలా ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని రూపొందించిన చట్టం కాదని చెప్పారు. ఇది రైతులకు శ్రీరామ రక్ష అని అన్నారు. తొలుత రాష్ట్రంలో నాలుగు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జూన్ 2 కల్లా ఆయా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని, ఆ అనుభవంతో మిగిలిన చోట్ల కూడా అమలు చేస్తామని వివరించారు. ఆగస్టు 15 నాటికి చట్టాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్యను బట్టి తహసీల్దార్ నుంచి సీసీఎల్ఏ వరకు వెళ్లేలా డిజైన్ చేశామని తెలిపారు. సీసీఎల్ఏ వద్ద న్యాయం జరగకుంటే ట్రబ్యునల్ను ఆశ్రయించవచ్చన్నారు. ధరణి చట్టంలో 9.26 లక్షల రైతుల సమస్యలకు పరిష్కారం చూపకపోగా.. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు కాగానే 5.45లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన, గిరిజనేతర రైతుల మధ్య సున్నిత సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలను భూ భారతి చట్టంతో పరిష్కరించుకోవచ్చన్నారు. అశ్వారావుపేటలో 911, 512 సర్వే నంబర్ల సమస్యను ఇదే వేదికపై గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ప్రస్తావించామని అన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. భూభారతి ద్వారా రైతులకు నమ్మకం, ధైర్యం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. పాస్బుక్ కావాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్లో రూ.300 చెల్లిస్తే పాస్బుక్ పొందవచ్చని తెలిపారు. సమావేశంలో ఎస్పీ రోహిత్రాజ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి పొంగులేటి హాజరైన ఈ కార్యక్రమానికి.. ప్రొటోకాల్ పాటించడంలో అధికారులు, రక్షణ బాధ్యతల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వినిపించాయి. ఏ పదవీ లేకున్నా పలువురు కాంగ్రెస్ నాయకులు పోటీపడి వేదికపైకి రావడం విస్మయానికి గురిచేసింది. చోటా మోటా నాయకులను అడ్డుకోని పోలీసులు సాధారణ ప్రజలను మాత్రం లోనికి అనుమతించకపోవడంతో వారు నిరాశగా వెనుదిరిగారు. ఈ విషయమై తహసీల్దార్ కృష్ణప్రసాద్ను అడగగా.. ‘మేం ఎవరినీ పిలవలేదు.. ప్రొటోకాల్ అంటూ లేకుండా ఎవరు పడితే వాళ్లు వచ్చేశారు’ అన్నారు. ఈ చట్టం నాలుగు గోడల మధ్య తెచ్చింది కాదు ఇప్పటికే 5.65 లక్షల దరఖాస్తుల పరిష్కారం గిరిజన ప్రాంత సమస్యలకు ప్రత్యేక కమిటీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇన్సులిన్ కొరతపై కలెక్టర్ ఆరా !డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్ను వివరణ కోరిన పాటిల్ ఇల్లెందు : మధుమేహ బాధితులకు అందించే ఇన్సులిన్ మందు కొరతపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆరా తీశారు. సోమవారం సాక్షిలో ‘ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత’ శీర్షికన కథనం ప్రచురితం కాగా, ఇందుకు గల కారణాలపై డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్ను వివరణ కోరినట్లు తెలిసింది. జిల్లాలో 5,12,321 మందికి ఎన్సీడీ పరీక్షలు నిర్వహించగా 44,306 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 20,160 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాయకల్ప ఆస్పత్రుల్లో సుమారు 1000 వాయిల్స్ ఉన్నా.. వాటి కాల పరిమితి జూన్తో ముగుస్తోంది. కనీసం మూడు నెలల గడువు ఉన్న మందులనే వాడాల్సి ఉండడంతో ఆ వాయిల్స్ను పక్కన పెట్టారు. రెండు నెలల గడువున్నా వాడొచ్చని డాక్టర్లు నిర్ధారిస్తే.. అవసరాన్ని బట్టి వాటిని ఆయా ఆస్పత్రులకు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇక ఆయా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న నిధులతో అవసరమైన మందులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉన్నా.. కలెక్టర్ అనుమతి పొందాల్సి ఉంది. ఏదేమైనా ఇన్సులిన్తో పాటు బీపీ బాధితులు వాడే ఒక రకం మాత్రలు సైతం అందుబాటులో లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలుకొత్తగూడెంఅర్బన్ : వేసవిలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నామని ఎస్ఈ జి.మహేందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గత నవంబర్లోనే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. విద్యుత్ లోడ్ పెరిగే అవకాశం ఉన్న గుండాల, మామకన్ను, ఆళ్లపల్లి, చర్ల మండలం సత్యనారాయణపురం 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పాల్వంచ, దమ్మపేట మండలం మల్కారం, అంకంపాలెం, లింగాలపల్లి, అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 288 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 52 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచామని పేర్కొన్నారు. తద్వారా ఓవర్ లోడ్ ఇబ్బంది లేకుండా చేయగలిగామని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, మణుగూరు, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, బొమ్మనపల్లి, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు మండలాల్లో ఓవర్ లోడ్ తగ్గించగలిగామని వివరించారు. -
నృత్యం.. కళారూపం
● వివిధ నృత్యరూపకాల్లో ఖమ్మం వాసుల ప్రతిభ ● పోటీల్లో రాణించడమే కాక ఇంకొందరికి శిక్షణ ● నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఖమ్మంగాంధీచౌక్: కళారూపాల్లో ఒకటైన నృత్యం.. సాంస్కృతిక వ్యక్తీకరణకే కాక విద్యాసాధనంగానూ ఉయోగపడుతోంది. అన్ని కళలతో నాట్యం ముడిపడి ఉండడంతో సమాహార కళగా పిలుస్తారు. ఈ కళా శాస్త్రాన్ని భరతముని అందించినట్లు చెబుతుండగా... సంగీతం మాదిరిగానే నృత్యం కూడా విశ్వవ్యాప్తమైంది. ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ నృత్యకారుడు జీన్ జార్జెస్ నోవెర్రే జయంతి సందర్భంగా ఏటా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్యదినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, పలు దేశాల్లో నృత్యానికి చట్టపరమైన సూచనలు లేకపోగా, ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపులూ చేయడం లేదు. దీంతో ప్రభుత్వ సంస్థల్లో నృత్య విద్యకు ప్రోత్సాహం కొరవడింది. నాగరికత ఆధారంగా నృత్యకళ నాగరికతల ఆధారంగా నృత్యకళ రూపుదిద్దుకోగా.. కాలానుగుణంగా అనేకమార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు రెండు వేల ఏళ్ల కిందటే నాట్య శాస్త్రం రూపుదిద్దుకుంది. మన దేశంలో వివిధ రకాల శాసీ్త్రయ నృత్యరీతులు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాల వారీగా భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం వంటివి గుర్తింపు పొందాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన కూచిపూడి, పేరిణి దేశవ్యాప్తంగానూ గుర్తింపు సాధించాయి. పేరిణి నృత్యం కాకతీయుల కాలంలో ప్రాచుర్యం పొందగా.. దీనికి తెలంగాణ నృత్యమని, యోధుల నృత్యమని పిలుస్తారు. యోధులు యుద్ధానికి వెళ్లే ముందు శివుడిని ఆరాధిస్తూ ఈ నృత్యం చేసే వారని ప్రతీతి. కళల గుమ్మం.. ఖమ్మం కళల గుమ్మంగా ఖమ్మంకు పేరు. ఈక్రమంలోనే వివిధ కళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండగా.. నాట్య కళకు మాత్రం ఆ పరిస్థితి కానరాదు. నాట్యం విద్యకు ముడిపడి ఉన్నప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ప్రాధాన్యత దక్కడం లేదు. అక్కడక్కడా పైవేట్ సంస్థలు మాత్రం ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. నృత్య పండిత ‘మోహను’డు కూచిపూడి నృత్యంలో ఖమ్మంకు చెందిన కే.జే.మోహన్రావు పేరుగడించారు. పదేళ్ల వయసులోనే కూచిపూడిలో ప్రావీణ్యం సాధించిన 53 ఏళ్లుగా ఎందరికో శిక్షన ఇచ్చారు. 1981 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చినాయన ఇతర రాష్ట్రాల్లోనూ తన కళ ద్వారా గుర్తింపు పొందారు. ఖమ్మం బాలభవన్లో అనాథ పిల్లలకు నేర్పించిన ఆయన హైదరాబాద్ లలితకళా తోరణంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 60 మంది అనాథ పిల్లలతో నృత్య ప్రదర్శన ఇప్పించారు. 1978లోనే నృత కళాభారతి సంస్థను ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నారు. పేరిణి.. వీరూనాయక్ తెలంగాణ నృత్య కళారూపంగా భావించే పేరిణి నృత్యాన్ని జిల్లాలో వీరూనాయక్ తెరపైకి తీసుకొచ్చాడు. కూసుమంచిమండలానికి చెందిన ఆయన పదిహేనేళ్ల కిత్రం పేరిణి నృత్యం నేర్చుకొని ఖమ్మంలో నృత్యాలయం ద్వారా పేరిణి శివతాండవంపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో పలువురు ప్రదర్శనల ద్వారా గుర్తింపు సాధించారు. ఇక వీరూనాయక్ స్వర్ణకంకణ, సర్వ కళా ప్రతిభ, నంది అవార్డులతో పాటు కళారాధన, స్వర్ణనంది అవార్డులు పొందారు. నాట్యమయూరి ‘మీనా’ ఖమ్మం నగరానికి చెందిన మీనాకు నాట్యంలో మంచి గుర్తింపు ఉంది. ఐదేళ్ల వయసు నుంచే అభ్యాసన ప్రారంభించిన ఆమె కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసి 12 ఏళ్లుగా వందలాది మంది చిన్నారులకు శిక్షణను ఇస్తున్నారు. ఆమె స్వతహాగా దేశంలోని పలు ప్రాంతాల్లోనూ కాక మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. మీనా నృత్య ప్రదర్శనలకునాట్యమయూరి, నాట్యకౌముది, తెలుగు తేజం, నాట్య గురురత్న, నాట్య శిరోమణి తదితర అవార్డులు గెలుచుకుంది. -
ప్రభుత్వాస్పత్రుల్లో ఇన్సులిన్ కొరత
ఇల్లెందు: షుగర్ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది. నెల రోజులుగా ప్రభుత్వాస్పత్రులకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో బాధితులపై ఆర్థికభారం పడుతోంది. ఇన్సులిన్ అవసరమైనవారికి రోజూ రెండు ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లెందు ఏరియా ఆస్పత్రిలోనే వెయ్యి మంది వరకు ఇన్సులిన్ పొందేవారు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా కనీసం 10 వేల మంది వరకు ఉంటారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారానికో ఇంజెక్షన్ల బాక్స్ అవసరమవుతుందని, ఒక్కో దాని ఖరీదు రూ. 250 వరకు ఉండగా, నెలకు రూ. 1000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. జిల్లాలో 29 పీహెచ్సీలు, 10 యూపీహెచ్సీలు, 376 సబ్ సెంటర్లు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు ప్రాంతాల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో మణుగూరు, అశ్వారావుపేటలో పాత స్టాక్ కొంత ఉండగా మిగతా అన్ని చోట్ల కొరత ఏర్పడింది. ప్రభుత్వ దవాఖానాకు వచ్చే 10 మందిలో 8 మంది రోగులు షుగర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. షుగర్ ఎక్కువ ఉందని రిపోర్టు రాగానే డాక్టర్ సంప్రదించటం, అక్కడి నుంచి మందులు ఇచ్చే గదికి పరుగులు తీయటం, అక్కడి ఫార్మాసిస్ట్ ఇన్సులిన్ లేదనటంతో భయంతో మెడికల్ షాపుల వద్దకు వెళ్లి కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులు, పీహెచ్సీలకు సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచి ఇన్సులిన్ ఇంజెక్షన్ల సరఫరా నిలిచిపోయింది. ఏరియా ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పంపించగా, మందు లేదని సమాచారం వస్తుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయితే బాధితులు మాత్రం ఫార్మసీ సిబ్బందితో ఇంజెక్షన్ కావాలని ఘర్షణకు దిగుతున్నారు. ఈ విషయమై ఇల్లెందు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్ను వివరణ కోరగా.. ఇన్సులిన్ ఇంజెక్షన్ల కొరత వాస్తవమేనని తెలిపారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి నిలిచిపోయిన సరఫరా విధిలేక ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్తున్న బాధితులు నెలకు ఒక్కొక్కరిపై రూ.1000 అదనపు భారం -
●ఉపకరణాలన్నీ ఒకేసారి వాడొద్దు
వేసవి.. అందునా అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యాన ఇళ్లలో అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒకేసారి వినియోగించకపోవడమే మేలని ఖమ్మానికి చెందిన ఎలక్ట్రీషియన్ కె.ద్రోణయ్య చెబుతున్నారు. ఆయన సూచనల మేరకు గృహవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ●ఏసీలు, గీజర్ వంటి అధిక లోడ్ తీసుకునే పరికరాలను ఒకేసారి వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అవసరాలకు అనుగుణంగా.. ఓల్టేజీ ఆధారంగా ఉపకరణాలను వినియోగించాలి. ఎండ తీవ్రత ఉన్న కాలంలో వైరింగ్ సరిచూసుకోవాలి. ఇంటి వైరింగ్కు తప్పనిసరిగా ఎర్తింగ్ ఉండేలా చూసుకుని.. ఎర్తింగ్ ప్రాంతంలో అప్పుడప్పుడు నీరు పోయాలి. -
●తేమ, నీడతో మిద్దె, పెరటి తోటల రక్షణ
ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యాన మిద్దె తోటలు, పెరటి తోటల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎంవీ.మధుసూదన్ సూచిస్తున్నారు. తోటల నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి. ●తెల్లవారుజాము, సూర్యాస్తమయ సమయాల్లో తోటలకు నీరు పెట్టాలి. మధ్యాహ్నం నీరు పెడితే ఎక్కువగా ఆవిరవుతుంది. తోటకు మల్చింగ్ చేస్తే ఎక్కువ సేపు తేమ ఉంటుంది. ఎండుగడ్డి కూడా మల్చింగ్గా వాడొచ్చు. పాత షీట్లు, పాత కిటికీ తెరలను మొక్కలపై కప్పినా ఫలితం ఉంటుంది. అధిక నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది, ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అంతేకాక వ్యాధుల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. తోటలో క్రమం తప్పకుండా కలుపు నివారించాలి. వేడిగాలుల సమయాన ఎరువులు వేయొద్దు. ఎండతో ఒత్తిడికి గురైన మొక్కలు కోలుకునే వరకు ఎరువు వేయకూడదు. -
●ఎండ, అల్ట్రా వైలెట్ కిరణాలతో చెడు ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 41–44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతకు తోడు అల్ట్రా వైలెట్ కిరణాలు, వడగాలులు శరీరంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. వివిధ వృత్తులు చేసేవారు, రైతులు, వ్యవసాయ కూలీలు తీసుకోవాల్సి న జాగ్రత్తలను వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.రవి కుమార్ వివరించారు. ●వీలైనంత వరకు వ్యవసాయ పనులను ఉదయం లేదా సాయంత్రం చేసుకోవాలి. తప్పనిసరై మధ్యాహ్నం చేయాల్సి వస్తే తలపై ఎండ పడకుండా టోపీ, గొడుగు ధరించాలి. నీరు చెమట రూపంలో బయటకు వెళ్లనున్నందున నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలి. రైతులు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లినప్పుడు నీడ పట్టున చెట్ల కింద సేద తీరేలా చూడాలి. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రక్తంగా నిర్వహించారు. స్వామి వారి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై దరఖాస్తులను అందజేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సకాలంలో దర్బార్కు హాజరు కావాలని పేర్కొన్నారు. -
‘ఏకలవ్య’ సిద్ధం!
నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ములకలపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్ భవన నిర్మాణం పూర్తయింది.8లో●మూగజీవాలు జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు వడదెబ్బ బారిన పడకుండా తగిన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఉత్పాదక శక్తిని రక్షించినట్లవుతుందని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటనారాయణ తెలిపారు. ఈమేరకు ఆయన ఇచ్చిన సూచనలిలా.. ●అధిక వేడి, గాలి ప్రసరణ సరిగా లేకపోవటం, షెడ్లలో కిక్కిరిసి ఉంచడం, నీటి సౌకర్యం సరిగ్గా లేక పశువులు, జీవాలు వడదెబ్బకు గురవుతాయి. తద్వారా నీరసమై జీర్ణక్రియ తగ్గి ఆకలి మందగించి ఉత్పత్తి పడిపోతుంది. అంతేకాక వ్యాధి నిరోధక శక్తి తగ్గి, చూడి పశువులకు గర్భస్రావమయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పిండి పదార్థాలు గంజి, జావ వంటివి పశువులకు ఆహారంగా ఇవ్వాలి. ఉదయం, సాయంత్రం పచ్చిగడ్డి, రాత్రికి ఎండుగడ్డి ఇవ్వాలి. పాడి పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వటం మంచిది. మేతకు ఉదయం, సాయంత్రమే తీసుకెళ్లాలి. వ్యాధులు దరిచేరకుండా గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాక్సిన్లు వేయించాలి. పశువులకు మంచి, చల్లని నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురైన పశువులను చల్లని గాలివచ్చే ప్రదేశంలోకి చేర్చి శరీర ఉష్ణోగ్రత తగ్గేలా పలుసార్లు నీటితో కడగాలి. తల, నుదుటిపై చల్లని గోనె సంచి కప్పాలి. ఆపై పశువైద్యులను సంప్రదించాలి. -
గ్రామాల్లోనే భూ రికార్డులు
సూపర్బజార్(కొత్తగూడెం): భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి వివరాలతో కూడిన రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెం క్లబ్లో ఆదివారం కొత్తగూడెం, చుంచుపల్లి మండలాలస్థాయిలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. వివాదాలకు అవకాశం లేకుండా రైతులకు సాగు భూములపై యాజమాన్య హక్కు కల్పించేలా నూతన చట్టం ఉందన్నారు. ధరణి చట్టంలో ఎవరైనా తమ రికార్డులను కనిపించకుండా చేసుకునే అవకాశం ఉండేదని, కానీ భూభారతిలో హక్కుల పూర్తి రికార్డు పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉంటుందని కలెక్టర్ వివరించారు. భూ హక్కుల రికార్డు సర్టిఫైడ్ కాపీ కావాలంటే భూభారతిలో ఉన్న ఫారంలో పది రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసే తహసీల్దార్ కాపీ జారీ చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, కొత్తగూడెం, చుంచుపల్లి తహసీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షుడు మండే వీరహనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
ముందు జాగ్రత్త్తే మందు
ఉమ్మడి జిల్లాలో నానాటికీ పెరుగుతున్న ఎండలు ● పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి అవసరం ● వాహనాలు, మొక్కల సంరక్షణా కీలకమే..●వాహనాల నిర్వహణలో అప్రమత్తత జీవన యానంలో వాహనాల వినియోగం కీలకంగా మారింది. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యాన వాహనదారులు జాగ్రత్తలు పాటించాల ని మెకానిక్లు సూచిస్తున్నారు. ఖమ్మంకు చెందిన మెకానిక్ ఎం.రామాచారి ఇచ్చిన సూచనలు ఇలా.. ●బైక్లు, కార్లే కాక ఎలక్ట్రికల్ వాహనాలను ఎండ సమయంలో వినియోగించినప్పుడు టైరు, ట్యూబ్లు చూసుకోవాలి. పెట్రోల్, డీజిల్ ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ చేయించొద్దు. నిర్ణీత వ్యవధిలో ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయొద్దు. ఇంజన్ ఎప్పుడూ చల్లగా ఉండేలా ప్రయాణం కొనసాగించాలి. రేడియేటర్ కూలింగ్ తనిఖీ చేసుకోవాలి. బ్యాటరీ వాహనాలు అటు ఫుల్, ఇటు జీరో చార్జింగ్ అయ్యే వరకు చూడొద్దు. పార్కింగ్ సమయాన నీడ ప్రాంతాలనే ఎంచుకోవాలి.●ఎండతో అనారోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎండతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వీటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం జిల్లా ఆస్పత్రి జనరల్ ఫిజీషియన్ నారగాని రాంప్రసాద్, పీడియాట్రీషియన్ పవన్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అధిక వేడితో చెమట కారణంగా ఒంట్లో నీటిశాతం తగ్గి, లవణాలు బయటకు వెళ్తాయి. ఫలితంగా డీహైడ్రేషన్కు గురై తలనొప్పి, స్పృహ కోల్పోవడం, మాట తడబడడం, వికారం, అలసట, కళ్లుతిరగడం, రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. ఎండ ప్రభావం ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులపై పడే అవకాశముంది. వీటి నివారణకు శరీరానికి కావాల్సినంత నీరు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కొబ్బరినీరు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం మంచిది. నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, ధూమపానానికి దూరంగా ఉండాలి. వడదెబ్బతో అస్వస్థతకు గురైన వారిని చల్లటి ప్రదేశానికి తీసుకెళ్లి తల నుంచి కాళ్ల వరకు తడిగుడ్డతో తుడవాలి. గాలి అడేలా చూస్తూ తేరుకున్నాక ఓఆర్ఎస్ తాగించి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. వీటన్నింటికి మించి ఉదయం 11 నుంచి సాయంత్రం 4లోపు తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దు. పిల్లలు ఎండలో ఆడకుండా పర్యవేక్షించాలి. తగిన నీరు తాగేలా చూడాలి. డయేరియాకు గురికాకుండా తేలికపాటి ఆహారమే ఇస్తూ నూనె పదార్థాలు, వేపుళ్లు, జంక్ఫుడ్కు దూరంగా ఉంచాలి. పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
పోలీసులకు ప్రశంసా పత్రాలు
కొత్తగూడెంటౌన్: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, గంజాయి రవాణాను అడ్డుకుంటున్న పోలీసులకు శనివారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ప్రశంసా పత్రాలు, రివార్డులు అందజేసి అభినందించారు. గతంలో సీసీఎస్ సీఐగా పని చేసిన బెల్లం సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్, సుమన్, సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయిరెడ్డి డీజీపీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 360 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.19,660 ఆదాయం లభించగా, 120మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.6,270 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రజతోత్సవాలకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
మణుగూరు రూరల్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. తొలుత పట్టణంలోని తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన గులాబీ జెండాను పార్టీ జిల్లా ఽఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎగురవేశారు. అనంతరం కార్లను, ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మార్గమధ్యలో మాజీ ఎమ్మెల్యే, నాయకులు నృత్యాలు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మండల వ్యాప్తంగా వాడవాడనా పార్టీ నాయకులు గులాబీ జెండాలను ఎగురవేసి సభకు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కుర్రి నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ కుంటా లక్ష్మణ్, నాయకులు పోశం నర్సింహరావు, నాగెల్లి వెంకటేశ్వర్లు, నూకారపు రమేష్, ఎడ్ల శ్రీనివాస్, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, ఎడవల్లి వెంకటయ్య, ముత్యంబాబు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం
ఇల్లెందురూరల్: మండలంలోని తిలక్నగర్ జీపీ కల్తీ రామయ్య గుంపు గ్రామంలో ఆజ్మీర కిశోర్ ఇంట్లో ఆదివారం విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధమైంది. కిషోర్తోపాటు కుటుంబ సభ్యులు తెల్లవారుజామున నిద్ర లేచి ఆరుబయిట పనులు చేసుకుంటుండగా ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు ప్రయత్నించారు. విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపిస్తుండటంతో కంగారుపడి ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా.. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ఆరు మందుపాతరల నిర్వీర్యం చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దాంతరి జిల్లాలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఆరు మందుపాతరలను ఆదివారం బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. దాంతరి జిల్లా ఎస్పీ సూరజ్సింగ్ కథనం ప్రకారం.. జిల్లాలోని బల్లారి సమీపంలో గల సాల్హీబాట్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న డీఆర్జీ బలగాలు మూడు రైస్ కుక్కర్ బాంబులు, రెండు పైపు బాంబులు, ఒక టిఫిన్బాంబును గుర్తించాయి. వాటిని అక్కడే నిర్వీర్యం చేశాయి. వీటితో పాటు ఒక వాకీటాకీ కూడా లభ్యమైందని ఎస్పీ వెల్లడించారు. -
ఆమె విజయం.. స్ఫూర్తిదాయకం..
● వ్యాధి భయపెట్టినా.. లక్ష్యాన్ని చేరిన యువతి.. ● గ్రూప్–1తో పాటు 5 ఉద్యోగాల విజేత జ్యోతి శిరీష ఖమ్మంవైద్యవిభాగం: యాభైసార్లు రక్తం ఎక్కించుకుని, ఒకవైపు తన వ్యాధిని నయం చేసుకుంటూనే మరోవైపు సర్కారు కొలువు కొట్టాలనే సంకల్పంతో పోరాడి.. తన లక్ష్యాన్ని చేరుకున్న జ్యోతి శిరీష ఆదర్శప్రాయురాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు కూరపాటి ప్రదీప్కుమార్ పేర్కొన్నారు. రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1లో ర్యాంకు సాధించి ఏకంగా 5 సర్కారు కొలువులను కొట్టిన యువతి.. ఖమ్మం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, బాల్యం నుంచే సికిల్సెల్ రక్తహీనతతో కూడిన వ్యాధితో బాధపడుతున్న ఆమె.. ఐదు ఉద్యోగాలు సాధించిన తీరు అద్భుతమన్నారు. ఆమె పూర్తి వైద్య ఖర్చులతో పాటు మందులను కూడా ఉచితంగా అందిస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఆదివారం ఆయన వైద్యశాలలో జ్యోతి శిరీషను సన్మానించారు. ఈ సందర్భంగా జ్యోతిశిరీష మాట్లాడుతూ.. అత్యంత ప్రమాదకరమైన సికిల్సెల్ వ్యాధితో తాను బాధపడుతూ అనేక సందర్భాల్లో తాను సమాజాన్ని చూస్తానో లేదో అని భయపడినప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే అకుంఠిత దీక్షతో తాను గ్రూప్–1లో ర్యాంకును సాధించానని తెలిపారు. తనది జిల్లాలోని మిట్టపల్లి గ్రామమని, తండ్రి సుతారీ మేస్త్రి, అమ్మ వ్యవసాయ కూలీ అని తెలిపారు. తాను సికిల్ సెల్ ఎనీమియా (తీవ్ర రక్తహీనత) బాధితురాలినని, ఆరో తరగతిలో తనకీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారని, తరచూ రక్తం తగ్గిపోయి కాళ్లు, చేతులు వాపు వచ్చేవని, దానికితోడు తలనొప్పి, ఎముకల మధ్య సూదులతో గుచ్చినట్టు బాధ ఉండేదని, అన్నీ భరించి, ఉద్యోగాలు సాధించానని, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. -
పాడి వృద్ధి.. పాలు సమృద్ధి..
● సహకార సంఘాల సభ్యులకు డీసీసీబీ ద్వారా రుణాలు ● పాడి యూనిట్లలో 70 శాతం మేర లోన్ ● ఆపై సొసైటీల ద్వారా పాల సేకరణకు ప్రణాళిక ఖమ్మంవ్యవసాయం: చిన్న, సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పాడి పథకానికి రూపకల్పన చేసింది. పాలు, పాల ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టును రూపొందించగా.. రైతుల సంక్షేమం, శ్రేయస్సు కోసం కొనసాగుతున్న సహకార సంఘాల్లో సభ్యులకు లబ్ధి జరగనుందని భావిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగ అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్రమాన అనుబంధంగా పాడి పరిశ్రమకూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రూ.3,460.70 కోట్ల లావాదేవీలతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో కొనసాగుతున్న ఖమ్మం డీసీసీబీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలే కాక మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని బయ్యారం, గార్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు విస్తరించి ఉంది. మొత్తంగా 100 సహకార సంఘాలతో 1.70 లక్షల మంది సభ్యులతో కూడిన ఈ బ్యాంకు 50 బ్రాంచ్లతో లావాదేవీలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది రూ.9.64 కోట్ల లాభాలతో ఉన్న నేపథ్యాన పాడి పరిశ్రమపై ఆసక్తి ఉన్న వారికి చేయూతనివ్వాలని కొత్త పథకాన్ని రూపొందించింది. తద్వారా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి అవసరం లేకుండా స్థానికంగా పాల ఉత్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు. 30 శాతం నిధులు చాలు.. పాడి యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చే రైతులకు డీసీసీబీ రుణాలు ఇవ్వనుంది. ఆసక్తి కలిగిన వారు 30 శాతం నిధులతో ముందుకొస్తే మిగతా 70 శాతం నిధులను బ్యాంకు వాటాగా సమకూరుస్తుంది. ఉదాహరణకు రూ.లక్ష విలువైన గేదెకు రైతు రూ.30 వేలు తన వాటాతో సిద్ధమైతే మిగతా రూ.70 వేలు రుణంగా అందుతుంది. గరిష్టంగా రెండు గేదెల వరకు అవకాశం కల్పిస్తారు. సొసైటీ సభ్యులకే అవకాశం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘా(పీఏసీఎస్)ల్లో సభ్యులైన వారికి మాత్రమే ఈ పథకంలో చోటు కల్పిస్తారు. వ్యవసాయ భూమి, సాగునీటి వనరులు ఉండి, పంటలు సాగు చేసే వారికి పాడి పరిశ్రమలో ప్రాధాన్యత ఇస్తే బహుముఖ లాభాలు ఉంటాయని భావిస్తున్నారు. తద్వారా సహకార సంఘాల ఉద్దేశం కూడా నెరవేరి చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశముంటుందని చెబుతున్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత డీసీసీబీ పరిధిలో నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పాడి పరిశ్రమ పథకాన్ని అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంతో పాటు ఇతర జలవనరులు ఉన్న ప్రాంతాల్లో సహకార సంఘాల సభ్యులకు రుణాలు ఇవ్వనుండగా.. ఉమ్మడి జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, కూసుమంచి, భద్రాచలం, పినపాక వ్యవసాయ డివిజన్లలో అవకాశం దక్కనుంది. స్థానిక వాతావరణాన్ని తట్టుకునే జాతుల గేదెలనే రైతులు ఎంపిక చేసుకునేలా పశుసంవర్థక శాఖ పర్యవేక్షణ ఉంటుంది. పీఏసీఎస్ల ద్వారా పాల సేకరణ రైతులు పాడి యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేసే పాలను సైతం పీఏసీఎస్ల ద్వారా సేకరిస్తారు. దళారులు లేకుండా వెన్న శాతం ఆధారంగా కొనుగోలు చేయనున్నారు. ఈ ప్రక్రియతో సహకార సంఘాలతో పాటు పాడి రైతులకు ప్రయోజనం కలగనుంది. పాల కొనుగోలుకు అవసరమైన శీతలీకరణ యంత్రాలు, పరికరాలను పీఏసీఎస్లు సమకూర్చుకుంటాయి. కలెక్టర్ అనుమతితో అమలు చిన్న రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పాడి పరిశ్రమ ప్రాజెక్టును రూపొందించాం. సౌకర్యాలు ఉన్న ప్రాంతాల రైతులకు ప్రాధాన్యత ఉంటుంది. సహకార లక్ష్యం నెరవేరేలా పథకాన్ని అమలుచేస్తాం. బ్యాంకు పాలకవర్గం నిర్ణయంతో పాటు కలెక్టర్ అనుమతితో జూన్ నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. –ఎన్.వెంకటఆదిత్య, సీఈఓ, డీసీసీబీ ఖమ్మం -
మేమిక ఉండలేం..
● బదిలీల కోసం ఎకై ్సజ్ ఉద్యోగుల ఎదురుచూపులు ● ఆరేళ్లుగా 180 మందికి స్థానచలనం లేదు.. ● దూర ప్రాంతాల ఉద్యోగుల్లో ఆవేదన ఖమ్మంక్రైం: ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకై ్సజ్ శాఖలో ఆరేళ్లుగా బదిలీలు జరగకపోవటంతో సిబ్బంది ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ నెలలో అయిపోతుంది, వచ్చే నెలలో అయిపోతుంది అంటూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప బదిలీల గురించి పట్టించుకోనే పరిస్థితి లేదు. సీఐ మొదలు కానిస్టేబుళ్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2, నేలకొండపల్లి, వైరా, మధిర, సత్తుపల్లి, సింగరేణి మొత్తం 7 ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం, అశ్వారావుపేట, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు కలిపి 6 స్టేషన్లు ఉన్నాయి. దీనికితోడు రెండు డీటీఎఫ్ (డిస్ట్రిక్ టాస్క్ఫోర్స్)లు, ఒక ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న 180 మంది సిబ్బంది ఆరేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు ఉండగా 37 మంది హెడ్కానిస్టేబుళ్లు 140 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఖమ్మం ఎకై ్సజ్స్టేషన్–2 ఒకప్పుడు బూర్గంపాడు ఎకై ్సజ్ స్టేషన్ కాగా ముంపు మండలాలు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో కలపటంతో ఆ స్టేషన్ను అక్కడి నుంచి ఖమ్మం తరలించి ఎకై ్సజ్స్టేషన్–2గా మార్చారు. అయితే దాదాపు పదేళ్లు కావొస్తున్నా ఈ స్టేషన్లో 8 మందికి పైగా సిబ్బంది అప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తుండటం గమనార్హం. ఏళ్ల తరబడి అవే స్టేషన్లలో పనిచేస్తుండటంతో సిబ్బందిపై సైతం పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనికితోడు ఎంతోకాలంగా ఏజెన్సీ ప్రాంతాలు, దూరప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఈ స్టేషన్లలో ఎంతకాలం పనిచేయాలనే ధోరణితో నిరాశ చెందుతున్నారు. త్వరలోనే పక్రియ..? గతంలో మాదిరిగా ఈసారి బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం లేదని దాదాపు బదిలీలు జరగటం ఖాయమని కొందరు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ చివరి వారం లేదా, మే మొదటివారంలో బదిలీలు జరిగే అవకాశం ఉందని ఎకై ్సజ్ రాష్ట్ర ఉన్నతాధికారి విదేశాల్లో ఉండటంతో ఆయన తిరిగి రాగానే వెంటనే రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ఉంటుందని చెబుతున్నారు, వచ్చేనెల వరకు బదిలీ పక్రియ జరిగితే తమ పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బంది ఉండదని ఆలస్యం అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిబ్బంది చెబుతున్నారు. -
లౌకిక తత్వంపై మాట్లాడితే సస్పెన్షనా?
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్ఎఫ్ఐ ఓ విశ్వవిద్యాలయం వంటిదని సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హిందూత్వ ఎజెండాతో ముందుకు సాగుతోందని, లౌకికతత్వంపై మాట్లాడితే రీసెర్చ్ స్కాలర్ రాందాస్పై రెండేళ్ల పాటు యూనివర్సిటీ నుంచి బహిష్కరించిందని ఆరోపించారు. ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో మూడు రోజుల పాటు సాగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా నితీష్ నారాయణ్ మాట్లాడుతూ.. ధనిక, ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా శ్రమజీవుల పక్షాన తమ సంఘం నిలబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ హెచ్సీయూ భూములను కాజేస్తోందన్నారు. ఎస్ఎఫ్ఐ దేశానికి ఎంతోమంది నిష్ణాతులను ఇచ్చిందని, జై భీమ్ చిత్ర ఇతివృత్తానికి సంబంధించిన జస్టిస్ చంద్రు ఎస్ఎఫ్ఐకి చెందిన వారే కావడం గర్వకారణమని అన్నారు. త్యాగధనులు పుట్టిన గడ్డ ఖమ్మంలో మహాసభలు జరగడం హర్షణీయమని అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడుతూ విద్యారంగాన్ని కాషాయీకరణ చేసే కుట్రలో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలో జ్యోతిష్యం, మూఢ విశ్వాసాలను చొప్పించి పాఠ్య పుస్తకాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కోయ చంద్రమోహన్, ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు. -
అల్లాడుతున్న మూగజీవాలు
పాల్వంచరూరల్/టేకులపల్లి: అధిక ఉష్ణోగ్రతలతో పశువులు, గేదెలు అల్లాడిపోతున్నాయి. ఎండ వేడిమికి బురద, బూడిద నీరు కూడా తాగి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఎక్కడ చెట్లు కనబడితే అక్కడ నీడలో సేదతీరుతున్నాయి. పాల్వంచ మండలం సూరారం, బిక్కుతండా, సోములగూడెం గ్రామాల మీదుగా కేటీపీఎస్ యాష్పాండ్లోని కలుషితమైన బూడిదనీరు వాగులో ప్రవహించి కిన్నెరసానిలో కలుస్తుంది. వేసవిలో మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెలు కలుషిత బూడిద నీటిని తాగి దప్పిక తీర్చుకుంటున్నాయి. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలుతండా పాఠశాల, టేకులపల్లి హైస్కూల్, తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీ వృక్షాలు ఉండగా, నిత్యం పశువులు చెట్ల కిందకు వచ్చి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందుతున్నాయి. -
నిత్యాన్నదాన సత్రం వరకు తివాచీ
భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం అధికారులు భక్తుల కోసం ఆలయం నుంచి సత్రం వరకు తివాచీ ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో భక్తులు అన్నదాన సత్రానికి నడిచిరావాలంటే తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. దీంతో ఆలయం నుంచి సత్రం వరకు రోడ్డు మీద తివాచీ (మ్యాట్)ని పరచగా.. భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. సెలవులకు ఊరెళ్తే సమాచారం ఇవ్వండి.. ఎస్పీ రోహిత్రాజు కొత్తగూడెంటౌన్: వేసవి సెలవులకు ఊరెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ లేని ఇంట్లో దొంగతనాలకు పాల్పడేందుకు దుండగులు యత్నిస్తారని, చోరీలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేశామని, ఊరికి వెళ్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్లో చిరునామా, ఫోన్ నంబర్ ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. వెదురు ఉత్పత్తులు అద్భుతం భద్రాచలం/చండ్రుగొండ/ములకలపల్లి: వెదురు ఉత్పత్తులతోపాటు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా భద్రాచలంలో ఏర్పాటు చేసిన మ్యూజియం అద్భుతంగా ఉన్నాయని గుల్లాకారి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుస్మిత కనేరి అన్నారు. ఆదివారం ఆమె భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు శివారులోని బ్యాంబో క్లస్టర్తోపాటు ములకలపల్లి మండలంలోని మాధారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్ యూనిట్ను సందర్శించి మాట్లాడారు. గిరిజన సంప్రదాయ హస్తకళల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వెదురు ఉత్పత్తుల తయారీలో గిరిజన సంస్కృతి ఉట్టిపడుతోందని, మార్కెటింగ్పై కలెక్టర్తో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వెంకయ్య, వీరస్వామి, హరికృష్ణ, అంజన్, ఈసం నాగభూషణం, మల్లం కృష్ణయ్య, బొర్రా సురేశ్, వి.గోవర్దన్ పాల్గొన్నారు. లాక్రోస్ జాతీయస్థాయి టోర్నమెంట్కు కార్తీకరెడ్డి తల్లాడ: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ నెల 28 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించనున్న లాక్రోస్ 3వ జూనియర్, సీనియర్ జాతీయస్థాయి టోర్నీలో పాల్గొనేందుకు తల్లాడకు చెందిన డి.కార్తీకరెడ్డి ఎంపికై ంది. తల్లాడకు చెందిన దగ్గుల రామకృష్ణారెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమార్తె కార్తీకరెడ్డి హైదరాబాద్లోని గురుకుల పాఠశాలలో 9 వతరగతి చదువుతోంది. క్రీడల్లో కూడా రాణిస్తూ జాతీయ పోటీలకు ఎంపికై ంది. తెలంగాణ జట్టు తరఫున కార్తీకరెడ్డి ఆదివారం బయలుదేరి ఆగ్రా వెళ్లింది. కాంటాల జ్యాపంపై రైతుల ఆగ్రహం నేలకొండపల్లి: మండలంలోని రాజారాంపేట ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇష్టారాజ్యంగా కాంటాలు వేస్తున్నారని రైతులు మండిపడ్డారు. కాంటాల్లో జాప్యం చేస్తున్నారని రైతులు ఆదివారం కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా కేంద్రంలో ధాన్యం ఆరబెట్టినప్పటికీ కాంటాలు వేయటం లేదని.. కొందరికి మాత్రం అప్పటికప్పుడే వచ్చిన ధాన్యానికి కూడా కాంటాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై రాజారాంపేట సొసైటీ సీఈఓను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
30 కిలోల గంజాయి పట్టివేత
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ లారీయార్డులో పార్కింగ్ చేసిన ఓ లారీలో 30 కిలోల గంజాయిని హైదరాబాద్ ఎకై ్సజ్ (ఎస్టీఎఫ్) అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఐటీసీ పేపర్బోర్డుకు జామాయిల్ కర్రను తీసుకొస్తున్న లారీడ్రైవర్ శివ ఒడిశా రాష్ట్రంలో అర్జున్ అనే వ్యక్తిని లారీలో ఎక్కించుకుని సారపాకకు తీసుకొచ్చాడు. ఆ లారీలో గంజాయి ఉందనే పక్కా సమాచారంతో హైదరాబాద్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు సిబ్బందితో సారపాకకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం లారీయార్డులో నిలిపి ఉంచిన లారీని తనిఖీ చేయగా అందులో 30 కిలోల గంజాయి దొరికింది. లారీడ్రైవర్ శివతో పాటుగా ఒడిశాకు చెందిన అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు.వారిద్దరూ పలుమార్లు లారీలోగంజాయి తీసుకొచ్చి భద్రాచలంలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి విలువ రూ.15 లక్షలు ఉంటుందని, గంజాయితో పాటు లారీని కూడా సీజ్ చేశామని,శివ, అర్జున్తో పాటు వచ్చిన ప్రహ్లాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై నాగరాజు తెలిపారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
సుజాతనగర్ : భూ భారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సుజాతనగర్ రైతు వేదికలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని, భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించేలా నూతన ఆర్ఓఆర్ తెచ్చిందని తెలిపారు. రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వివరించారు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. సమస్యల పరిష్కారం అనంతరం పూర్తి స్థాయి రికార్డులను ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. భూ భారతి చట్టం ప్రకారం ఏ సమస్యను ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి..అది పరిష్కారం కాకుంటే ఎవరికి అప్పీల్ చేయాలనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, తహసీల్దార్ శిరీష, పీఏసీఎస్ చైర్మన్ మండే హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేయాలి సూపర్బజార్(కొత్తగూడెం): సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలని, జాబితాలో పేరు లేని నిరుపేదలుంటే వారి పేర్లు కూడా జతచేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను త్వరగా పరిశీ లించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రేషన్కార్డు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పెపులైన్ల లీకేజీ, పంపుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. తాగునీటి సమస్య ఉంటే ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
మహిళా ఉత్పత్తులకు విశేష ఆదరణ
కొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్(కొత్తగూడెం) : హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో జిల్లా మహిళల ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. గతంలో కలెక్టర్ ఆలోచన మేరకు ‘రన్ ఫర్ హర్‘ కార్యక్రమంలోనూ జిల్లా మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. ఆ అనుభవంతో మరింతగా ప్రేరణ పొందిన మహిళలు.. ఇప్పుడు భారత్ సమ్మిట్లో ఉత్పత్తులను ప్రదర్శించారు. డీఆర్డీఏ నుంచి మహిళా సమాఖ్య సభ్యులు హాజరై పిండివంటల, వెదురు, సిమెంట్తో చేసిన గదలు తదితర ఉత్పత్తులను ప్రదర్శించగా మంచి స్పందన లభించిందని డీఆర్డీఏ డీపీఎం నాగజ్యోతి తెలిపారు. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్కొత్తగూడెంటౌన్: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జూన్ 9 నుంచి 14 వరకు జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని బ్యాంకు మేనేజర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్లు, ఆర్థిక సంస్థల ఆధికారులతో ఈనెల 29న సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకులు, చిన్న ఆర్థిక సంస్థలు, ప్రతివాదులు సంబంధిత కోర్టులకు వెళ్లి రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. నలుగురు ఎస్సైల బదిలీ కొత్తగూడెంటౌన్: జిల్లాలో నలుగురు ఎస్సైలకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుండాల ఎస్సై సీహెచ్ రాజమౌళిని వీఆర్ కింద జిల్లా కార్యాలయానికి, అశ్వాపురం ఎస్సై ఎండీ సైదా రహుఫ్ను గుండాలకు, భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై మధు ప్రసాద్ను ఆశ్వాపురానికి, అక్కడి ఎస్సై టి.తిరుపతిరావును భద్రాచలం ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. కొత్తగూడెంలో ఏసీబీ సోదాలుకొత్తగూడెంఅర్బన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీరు ఇన్ చీఫ్ హరిరామ్ సొంత ఇల్లు లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో ఉండగా, శనివారం ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా హరిరామ్ బంధువుల ఇళ్లలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొత్తగూడెంలో కూడా తనిఖీలు జరిపారు. కాగా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని డీఎస్పీ రమేష్ వెల్లడించారు. -
కారులన్నీ అటే...
నేడు వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ● అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీలో తగ్గిన జోష్ ● ఏడాదిన్నరగా స్తబ్ధుగా ఉన్న పార్టీ శ్రేణులు ● నైరాశ్యాన్ని తొలగించిన వేడుకలుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ ఆవిర్భావ రజతోత్సవాలు భారత రాష్ట్ర సమితికి కొత్త ఊపు తెచ్చాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు గత 15రోజులుగా శ్రమిస్తున్నారు. 2023 సాధారణ ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్న పార్టీ కేడర్ ఈ వేడుకలతో ఉత్సాహంగా పని చేస్తోంది. అప్పుడు గులాబీమయం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన రోజుల్లోనూ ఇక్కడ బీఆర్ఎస్కు సానుకూల ఫలితాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే పది అసెంబ్లీ స్థానాల్లో ప్రతీ సారి ఒక్కోచోట మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. జిల్లాలో 2014 ఎన్నికల్లో కొత్తగూడెం, 2023లో భద్రాచలం స్థానాల నుంచి కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ప్రతీసారి కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడంతో పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తూ వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఏ చిన్న పిలుపు ఇచ్చినా.. ఊరువాడా అంతా గులాబీ మయంగా మారిపోయేది. తగ్గిన జోరు.. తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జిల్లాలో ఐదు స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన మూడు చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో ఆ పార్టీ మద్దతుతో సీపీఐ విజయం సాధించాయి. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు సైతం ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లో అటు ఖమ్మం, ఇటు మహబూబాబాద్ స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. అంతకుముందే ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో పట్టణాల్లోనూ పార్టీ ఊపు తగ్గింది. దాదాపు ఏడాది కాలంగా పార్టీ తరఫున చెప్పుకోదగ్గ కార్యక్రమాలు కూడా జరగలేదు. అంతకుముందు పదేళ్ల పాటు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగగా.. మారిన పరిస్థితులతో బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయే నేతల సంఖ్య పెరిగింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికై నా పార్టీలో పూర్వపు జోష్ వస్తుందా రాదా అనే సందేహాలు నెలకొన్నాయి. సన్నాహక సమావేశాలతో.. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, దీనికి భారీగా జన సమీకరణ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఒక్కసారిగా పార్టీ నాయకులు తిరిగి జనాల్లోకి రావడం మొదలైంది. వార్డులు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి, నియోజకవర్గాల వారీగా నేతల ను సమన్వయం చేశారు. ఎమ్మెల్సీ కవిత జిల్లా పర్యటన సైతం వేర్వేరుగా ఉన్న నేతలను ఒక్క తాటిపైకి తెచ్చింది. ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు జన సమీకరణపై దృష్టి సారించారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. బైక్ ర్యాలీలతో తిరిగి గులాబీ జెండాలను రెపరెపలాడించారు. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ కావడంతో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఈ వేడుకల్లో వెల్లడవుతుందనే నమ్మకం కేడర్లో నెలకొంది. దీంతో గ్రామ, మండలస్థాయి నుంచి పార్టీ నేతలంతా వరంగల్ సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా రజ తోత్సవాలు బీఆర్ఎస్ కేడర్లో నెలకొన్న నిస్తేజాన్ని దూరం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సభను విజయవంతం చేయాలి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతంలో పాలు పంచుకోవాలి. జనం వెళ్లేలా బస్సులు, కార్లు ఏర్పాటు చేశాం. తెలంగాణ సాధన, రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్కే సాధ్యమైంది. ఇది రజతోత్సవ సభగానే కాక రాష్ట్ర సాధన తర్వాత ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశంగా ఉంటుంది. – పువ్వాడ అజయ్కుమార్, మాజీ మంత్రి ఖమ్మం సత్తా చాటుదాం.. కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతోంది. ఈ నేపథ్యాన ఎల్కతుర్తి సభకు గులాబీ శ్రేణులు, అభిమానులు, ఉద్యమకారులు, ప్రజలు భారీగా హాజరై కేసీఆర్కు మద్దతు ప్రకటించాలి. ఇక్కడి నుంచి అత్యధికంగా జనం వెళ్లడం ద్వారా జిల్లా సత్తా చాటాలి. – వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాడికి నిరసనగా శ్రీరామస్తోత్ర పారాయణం కశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో జరిగిన దాడికి నిరసనగా శనివారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బేడా మండపంలో శ్రీరామస్తోత్ర పారాయణం గావించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, అన్ని ప్రాంతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుతూ పూజలు చేశారు. వైభవంగా రుద్ర హోమం పాల్వంచరూరల్ : మండల పరిధిలోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో మాసశివరాత్రి సందర్భంగా శనివారం రుద్రహోమం జరిపించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన అర్చకులు.. మండపారాధన, గణపతి పూజ చేశారు. ఆ తర్వాత రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనిత్రయోదశిని పురస్కరించుకుని శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేశారు. -
‘సీతారామ’పై నజర్
పర్యావరణ అనుమతులపై దృష్టి సారించిన అధికారులు ● 15 నెలలుగా పెండింగ్లోనే ఈసీ ఫైల్ ● ఈసీ వస్తేనే పనులు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశాలు ● ఇటీవలే సీతారామకు టీఏసీ నుంచి గ్రీన్ సిగ్నల్సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగు భూములకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా సీతమ్మ సాగర్ పేరుతో గోదావరిపై బరాజ్ నిర్మిస్తోంది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల కోసం 2018లో కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసింది. ఆ వెంటనే వివిధ ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులను విభజించి నిర్మాణ పనులు ప్రారంభించింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకుండానే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మిస్తున్నారని, గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయంటూ భద్రాచలం ఏజెన్సీకి చెందిన కొందరు వ్యక్తులు 2022 డిసెంబరులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), చైన్నె బెంచ్ను ఆశ్రయించారు. దీంతో పర్యావరణంతోపాటు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలంటూ 2022 ఏప్రిల్ 26న ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆగ్రహం గ్రీన్ ట్రిబ్యునల్లో వివాదం కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టింది. దుమ్ముగూడెం, అశ్వాపురంల మధ్య గోదావరి నదిపై 1.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. జల విద్యుత్ కేంద్ర నిర్మాణం కోసం కుడివైపున గట్టు నుంచి 200 మీటర్లు వదిలిపెట్టి, మిగిలిన 1.3 కి.మీ పొడవుతో మొత్తం ఆరు బ్లాకులుగా విభజించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందులో ఒకటి నుంచి నాలుగు బ్లాకుల్లో పియర్లు, స్పిల్వేల నిర్మాణం పూర్తయింది. క్రస్ట్ గేట్లు బిగించడమే తరువాయి అనుకునే తరుణంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ మరోసారి ఎన్జీటీని బాధితులు ఆశ్రయించారు. బరాజ్ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యాలను ఫొటోలతో సహా సమర్పించారు. దీంతో ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడిపనులు అక్కడే ఆపాలంటూ 2023 మే 29న ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనకు ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఎన్జీటీ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్టరీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖకు చెందిన రీజినల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి నదీ జలాల నిర్వాహణ బోర్డులో ఎస్ఈ స్థాయి అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ 2023 జూన్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, జూలైలో నివేదిక అందించింది. అయితే నివేదిక లోపభూయిష్టంగా ఉందంటూ ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పని ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సూచన చేసింది. పదేపదే తమ ఆదేశాలు ధిక్కరిస్తూ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ గోదావరి రివర్బోర్డు మేనేజ్మెంట్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలను ఇటీవల ఆదేశించింది. దీనిపై 2023 సెప్టెంబరు 23న ఎన్జీటీలో వాదనలు జరిగాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన రావడంతో ఈ అంశం మరుగున పడింది. డీపీఆర్కు లైన్ క్లియర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ వ్యయం, అనుమతులపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా సీతారామకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, డీపీఆర్)కి కూడా ఎకనామిక్ ఫీజుబులిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు లేని విషయాన్ని గుర్తించింది. దీంతో ముందుగా ఈ రెండు అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. 2024 ఆగస్టులో ఈ ప్రయత్నాలు మొదలైతే 2025 ఏప్రిల్ 24న డీపీఆర్కు టీఏసీ అనుమతులు కూడా వచ్చాయి.ఈసీపై దృష్టి ఇప్పుడు కీలకమైన పర్యావరణ అనుమతు (ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్)లు సాధించడంపై దృష్టి సారించాల్సి ఉంది. అందులో భాగంగా నిర్వాసితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి, ఈసీ క్లియరెన్స్ వచ్చాక, అపెక్స్ కమిటీ నుంచి మిగిలిన అనుమతులు సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బరాజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. -
కదం తొక్కిన విద్యార్థులు
ఖమ్మంమయూరిసెంటర్ : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం వీధుల్లో విద్యార్థులు శుక్రవారం కదం తొక్కుతూ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని జెడ్పీసెంటర్ వద్ద ప్రముఖ విద్యావేత్త మువ్వా శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా వైరా రోడ్ మీదుగా భక్త రామదాసు కళాక్షేత్రానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఎస్ఎఫ్ఐ జెండాలు, భగత్ సింగ్, చేగువెరా ప్లకార్డులు, కోలాటం, డప్పు నృత్యాలతో సాగిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం సభ ప్రారంభానికి ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి జెండా ఆవిష్కరించగా.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం విద్యార్థుల భారీ ప్రదర్శన -
‘భూ భారతి’తో వివాదాలకు చెక్
● అర్హులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలు ● సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చండ్రుగొండ : భూ భారతి చట్టంతో భూ వివాదాలకు ఇక పుల్స్టాప్ పడనుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని అయన్నపాలెం గ్రామంలో ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రెవెన్యూశాఖలో పూర్తిస్థాయిలో యంత్రాంగం ఉంటేనే పనులు జరుగుతాయని, ఆ దిశగా వ్యవస్థను పునర్నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. భూ భారతి చట్టంతో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని, భూమికి నక్షాతో కూడిన పాస్బుక్లు వస్తాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం లభిస్తుందన్నారు. కుటుంబాల్లో సైతం ఏర్పడే భూ వివాదాలకు ఇక ఆస్కారం ఉండబోదన్నారు. భూ వివాదాల్లో గతంలో కోర్టును ఆశ్రయించేవారని ఇకపై ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమించి రికార్డులు సృష్టించుకుంటే విచారించి రద్దు చేసే అధికారం భూభారతి చట్టం ద్వార రెవెన్యూ అధికారులకు లభించిందన్నారు. అనంతరం పలువురు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం గ్రామంలో మునగతోటను కలెక్టర్ పరిశీలించారు. రైతు చాపలమడుగు నాగేందర్తో మాట్లాడి సేద్యం చేస్తున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకుని అభినందించారు. మునగ, ఆయిల్పామ్ సేద్యం వైపు రైతులు ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ మధు, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఏఓ వినయ్, సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు పాల్గొన్నారు. -
ఆర్థిక అవగాహన ఉండాలి
ఆర్బీఐ మేనేజర్ సాయితేజ రెడ్డి గుండాల : స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థిక అవగాహన పెంపొందించుకోవాలని ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ సాయితేజ రెడ్డి అన్నారు. యాస్పిరేషనల్ బ్లాక్ గుండాల మండలం కాచనపల్లిలో శుక్రవారం నిర్వహించిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక ప్రణాళిక, పొదుపు, వివిధ రకాల పెట్టుబడి సాధనాలు, బ్యాంక్ లావాదేవీలపై అవగాహన ఉండాలని, ఆన్లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, కాచనపల్లి ఎస్బీఐ మేనేజర్ వేణు, కోటేశ్వర రావు, నాగేశ్వర రావు, జగ్యా తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: ఈ నెల 20వ తేదీ నుంచి మొదలైన సార్వత్రిక పీఠం ఓపెన్ ఇంటర్, పదో తరగతి ఽథియరీ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని, శనివారం నుంచి ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్తగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టీకల్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. ‘మిషన్ భగీరథ’ను పరిశీలించిన సీఈఅశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ ఇన్టేక్ వెల్ను, మిట్టగూడెం రథంగుట్ట వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను శుక్రవారం మిషన్ భగీరథ సీఈ కే.శ్రీనివాస్ సందర్శించారు. ఇటీవల ఇన్టేక్ వెల్ వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గడంతో సమ్మక్క–సారక్క బ్యారేజీ నుంచి నీరు దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఈ సందర్శించి నీటిమట్టాన్ని పరిశీలించారు. మే నెల వరకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎస్ఈ శేఖర్రెడ్డి, ఈఈ నళిని, డీఈ మహేందర్ పాల్గొన్నారు. మలేరియా నివారణ ర్యాలీ కొత్తగూడెంఅర్బన్: మలేరియాను నివారించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ముర్రేడువాగు నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అనంతరం సర్వజన ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను సందర్శించి, సేవలపై ఆరా తీశారు. వైద్యాధికారులు సుకృత, బాలాజీనాయక్, మధువరన్, ఫయాజ్మొహియుద్దీన్, జేతు, హరికిషన్, రాంప్రసాద్ పాల్గొన్నారు. అర్హులనే ఎంపిక చేయాలిదమ్మపేట/అశ్వారావుపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులనే ఎంపిక చేయాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం దమ్మపేట మండలం అల్లిపల్లిలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హుల ధ్రువీకరణ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయంలో తనిఖీ బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అన్నారు. దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నారంవారిగూడెం కాలనీ పంచాయతీలో లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓలు రవీంద్రా రెడ్డి, రామారావు, స్పెషల్ ఆఫీసర్ జుంకీలాల్, ఎంపీఓ సోయం ప్రసాద్, ఇతర అధికారులు రంజిత్ కుమార్, అక్షిత, శ్రీనివాస్, శివరాంప్రసాద్, రామకృష్ణ, మురళి, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోలింగ్, గస్తీ పెంచాలి
● ఇల్లెందు పోలీసుల పనితీరు అభినందనీయం ● ఎస్పీ రోహిత్రాజు ఇల్లెందు: వేసవి కాలం దృష్ట్యా చోరీ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ పెంచాలని, బ్లూకోల్ట్స్ సిబ్బంది గస్తీ పెంచాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శుక్రవారం ఆయన ఇల్లెందు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులను, స్టేషన్ పరిసరాలను, కంప్యూటర్ గదిని, లాకప్లను పరిశీలించారు. నిఽఘా వ్యవస్థ పనితీరుపై ఆరా తీశారు. ఇటీవల ఓ చోరీ సంఘటనను ఛేదించి 29 తులాల బంగారం రికవరీ, ఓ పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసినందుకు పోలీసులను అభినందించారు. ఇల్లెందు పోలీస్ యంత్రాంగం పని తీరు జిల్లాలోనే టాప్ లెవల్లో ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కష్టాల్లో ఉండి పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులకు తక్షణ న్యాయం అందాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా తీవ్రతరం చేయాలని, పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని, విస్త్రృతంగా సభలు సమావేశాలు పెట్టి చైతన్యపర్చాలని సలహా ఇచ్చారు. బెట్టింగ్, గంజాయి సరఫరా మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. డీఎస్పీ చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు పి. శ్రీనివాసరెడ్డి, బి. సూర్య, సిబ్బంది ఉన్నారు. -
కార్పొరేషన్ సరే.. సమస్యల సంగతేంటీ..?
● మున్సిపల్ కార్పొరేషన్తో పెరిగిన కొత్తగూడెం హోదా ● త్వరలో జీఓ విడుదలయ్యే అవకాశం ● గూడెం, పాల్వంచ పట్టణాలను వేధిస్తున్న సమస్యలు ● అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవ అవసరం కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను స్వాగతిస్తున్న ప్రజలు అక్కడి సమస్యల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోక అవస్థ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెం నోటిఫైడ్ ఏరియా నుంచి క్రమంగా కార్పొరేషన్గా రూపాంతరం చెందింది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. రేపోమాపో జీవో విడుదల అయితే పూర్తిస్థాయిలో కార్పొరేషన్గా మారనుంది. 1971లో నోటిఫైడ్ ఏరియాగా పాలన ప్రారంభమైంది. 1995లో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అనంతరం 2000 సంవత్సరంలో 79,721 మంది జనాభా కలిగి ఉండగా, 33 వార్డులకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు కౌన్సిల్ ఎన్నికలు జరగ్గా, నాలుగుసార్లూ మహిళలే మున్సిపల్ చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం గెజిట్ విడుదల కాగా, జీఓ విడుదలయ్యాక పూర్తిగా కార్పొరేషన్గా మారనుంది. అనంతరం స్పెషల్ ఆఫీసర్ నియామకం, డివిజన్ల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. రెండు పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యలు కార్పొరేషన్లో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రజలను సమస్యలు వేధిస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన రోడ్లు చెక్కు చెదరకుండా ఉంటే, రెండు, మూడేళ్ల క్రితం నిర్మించిన రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. పెచ్చులు ఊడిపోతున్నాయి. అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కిన్నెరసాని ప్రధాన పైపులైన్ పగలడం, లీకవడంతో కొత్తగూడెం ప్రజలకు తరచూ తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. పట్టణంలో పార్కింగ్ జోన్ లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వాహనాలు నిలిపితే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. పట్టణంలో చెప్పుకోదగిన పార్కులు లేవు. ఉన్న పార్కులు సౌకర్యాలు లేకపోవడంతో వృథాగా మారుతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పార్కు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది. దీంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. రామవరంలోని ఏడు వార్డులకు దశాబ్దాలుగా క్రమబద్ధీకరణ పట్టాలు ఇవ్వడం లేదు. ఇక రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండు మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. పాల్వంచ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. తొలుత పన్నులు పెరుగుతాయి.. కొత్తగూడెం కార్పొరేషన్తో ఇక్కడి ప్రజల 20 ఏళ్ల కల నెరవేరింది. అదే తరుణంలో కార్పొరేషన్లో ఇంటి పన్నులు, పంపు బిల్లులతో పాటు భూమి ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పడున్న ఆస్తి విలువ రెట్టింపయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్లో అధికారులు, సిబ్బంది సంఖ్య పెరగనుండగా, ముఖ్యంగా ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉంటారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాలకు కలెక్టర్ నుంచి అప్రూవల్ తీసుకునేవారు. కానీ కార్పొరేషన్కు ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండనుండటంతో పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు. కార్పొరేషన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావడంతోపాటు స్థానికంగా వివిధ రకాల పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కార్పొరేషన్ కాగానే తొలుత ప్రజలే పెరిగిన ఇంటి పన్నులు, పంపు బిల్లులు చెల్లించాలి. ఆ తర్వాత కార్పొరేషన్కు అభివృద్ధి నిధులు వస్తాయో, రావోననే అభిప్రాయం కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. దీంతోపాటు జిల్లాలో 1/70 యాక్టు ఉండటంతో అభివృద్ధి పూర్తిస్థాయిలో జరిగేందుకు వీలు ఉండదని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా కార్పొరేషన్ ఏర్పాటుపై తొలుత సుజాతనగర్లోని ఏడు పంచాయతీల ప్రజలు నిరసన తెలిపారు. -
‘రాజీవ్ యువ వికాసం’తో జీవనోపాధి
ఐటీడీఏ పీఓ రాహుల్ బూర్గంపాడు/భద్రాచలంటౌన్: రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగ యువత జీవనోపాధులు మెరుగుపడతాయని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. శుక్రవారం ఆయన సారపాక గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను పరిశీలించారు. గ్రామపంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. అనంతరం భద్రాచలంలోని సుందరయ్య నగర్ డీఆర్సీసీ పక్కన ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత సుందరయ్య నగర్లో ఇందిరమ్మ కాలనీని సందర్శించారు. స్థలం ఉన్న లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలన్నారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఆదివాసీ మహనీయుల విగ్రహాల మరమ్మతులపై ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ హరీష్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నరసింహారావు, ఏఈ శివ, గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్, సిబ్బంది రాములు, ఠాగూర్, ప్రశాంతి, మురళి పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యటన
దమ్మపేట: సీతారామ ప్రాజెక్టు కాల్వ భూసేకరణకు నియమితులైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్తీక్ మండలంలోని నాగుపల్లి గ్రామంలో శుక్రవారం పర్యటించారు. సేకరించిన భూములను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించారు. స్పందించిన ఆయన.. ప్రతి నిర్వాసిత రైతుకు పరిహారం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మోతీలాల్, గపూర్పాషా, సాగర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు అడ్డుకట్ట అశ్వారావుపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వే చేస్తున్న అధికారులను శుక్రవారం కొందరు అడ్డుకున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామానికి 21 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. ఇందిరమ్మ కమిటీ ద్వారా వచ్చిన లబ్ధిదారుల వివరాలను సేకరించేందుకు వెళ్లిన డీటీ రామకృష్ణ, కార్యదర్శి స్వప్న, మున్సిపాలిటీ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ పేర్లలో అనర్హులు ఉన్నారని, అర్హులైన వారినే ఎంపిక చేయాలని వాగ్వాదానికి దిగారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని, సర్వేలో నిర్ధారించి అనర్హులు ఉంటే వారి పేర్లు తొలగిస్తామని అధికారులు చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. -
చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
పాల్వంచ: పట్టణంలోని నవభారత్ కాలనీలో ఉద్యోగుల క్వార్టర్లలో చోరీలు జరిగిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఒకరిని పట్టుకుని నగదు స్వాధీనం చేసుకోగా.. తాజాగా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సతీశ్కుమార్ వెల్లడించారు. గత జనవరి 25వ తేదీ అర్ధరాత్రి నవభారత్త్ కంపెనీ ఉద్యోగుల క్వార్టర్లలో తాళాలు వేసి ఉన్న వాటిల్లోకి చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పోలీసులు ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలతో మధ్యప్రదేశ్కు చెందిన అనిల్సంఘార్ను గతంలోనే అరెస్ట్ చేసి రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనిల్సంఘార్కు బెయిల్ ఇప్పించడం కోసం కొత్తగూడెం కోర్టుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా, తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని పింటు భవార్, శోభన్సింగ్ పోలంకిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల్లో వీరి హస్తం ఉన్నట్లు తేలిందని డీఎస్పీ చెప్పారు. వీరి నుంచి 240 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్ఫోన్, కీపాడ్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించామని ఆయన వివరించారు. సమావేశంలో సీఐ సతీశ్, ఎస్ఐలు సుమన్, ప్రవీణ్, రాఘవయ్య, జీవన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. 240 గ్రాముల బంగారం స్వాధీనం -
హక్కుల సాధనకు ఐక్యం కావాలి
భద్రాచలంటౌన్: హక్కుల సాధన కోసం గిరిజనులంతా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని అఖిల భారత ట్రైబల్ ఫోరం జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం అన్నారు. స్థానిక గిరిజన అభ్యదయ భవన్లో ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని చట్టాల్లో గిరిజనులకు ఉన్న హక్కుల అమలు కోసం అందరినీ ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన సమూహల మధ్య ఉన్న తేడాలు, విభేదాలను మిత్ర వైరుద్యంగానే భావించాలని, హిందుత్వవాదులు, కార్పొరేట్ కంపెనీ యజమానులతో కుమ్మకై ్క అడవిలోని ఖనిజాలతోపాటు ఇతర సంపదను దోచుకుపోతున్నారని ఆరోపించారు. ఎదురు తిరిగితే ‘కగార్’పేరుతో ఆడ, మగ తేడా లేకుండా ఊచకోతకు దిగుతున్నారని విమర్శించారు. అంతకుముందు పట్టణంలో గిరిజన నృత్యాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సదస్సులో ముర్ర వీరభద్రం, సుర్ణపాక నాగేశ్వరరావు, వేట్ల శాంతన్, కుమార్రెడ్డి, మురళీకృష్ణ, కృష్ణ, ఉదయ్, రజిత, భూద్ర, భూలక్ష్మి, పెంటన్న, చంద్రకళ, రాధ, సురేశ్ పాల్గొన్నారు. -
ఆఫ్టైప్ మొక్కల పరిశీలన
దమ్మపేట: మండలంలోని జగ్గారం గ్రామ పరిధిలోని రైతుల పామాయిల్ క్షేత్రాల్లో అంతగా దిగుబడి రాని ఆఫ్టైప్ మొక్కలను తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, ఐఐఓపీఆర్ విశ్రాంత శాస్త్రవేత్త బీఎన్.రావుతో కలిసి శుక్రవారం పరిశీలించారు. జన్యులోపం, విత్తనలోపం, పెంపకంలో లోపాలు తదితర కారణాల వల్ల ఆఫ్టైప్, నాణ్యత లేని మొక్కలు వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్త తెలిపారు. దిగుబడి లోపంపై పూర్తిస్థాయిలో పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. గాడ్రెజ్ కంపెనీ ద్వారా మొక్కలు తెచ్చి, సాగు చేసిన క్షేత్రాల్లో ఆఫ్టైప్ మొక్కలు రాలేదని, ఆయిల్ ఫెడ్ నర్సరీ మొక్కల్లోనే అధికంగా ఆఫ్టైప్ మొక్కలు వచ్చాయని, అవకతవకలకు పాల్పడిన అధికారులపై తగు చర్యలు తీసుకుని, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని చైర్మన్ను కోరారు. కార్యక్రమంలో జీఎం సుధాకర్రెడ్డి, డివిజనల్ నర్సరీ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కల్యాణ్, నాగబాబు, ప్రవీణ్రెడ్డి, రైతు సంఘం నాయకులు తుంబూరు ఉమామహేశ్వరరావు, కొక్కెరపాటి పుల్లయ్య, చెలికాని సూరిబాబు, కారం శ్రీరాములు, మడివి బాలరాజు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం జరిపారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఈఓ రజనీకుమారి, భక్తులు పాల్గొన్నారు. నేడు శనీశ్వరునికి తైలాభిషేకం పెద్దమ్మగుడి సముదాయంలోని శివాలయంలో శనిత్రయోదశి సందర్భంగా శనివారం శనీశ్వరుడికి తైలాభిషేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. న్యాయమూర్తిని కలిసిన పోలీసులుకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లును కోర్టు హాల్లో శుక్రవారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, ఇతర పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐలు ఎం.కరుణాకర్, వెంకటేశ్వర్లు, శివప్రసాద్ పాల్గొన్నారు.పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి మణుగూరుటౌన్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5 వేల లాభాల వాటా అందించామని, పెండింగ్లోని అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్ అన్నారు. శుక్రవారం ఓసీ–2లో ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన గేట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వేల కుటుంబాల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దానిని కాపాడుకునే బాధ్యత కార్మికులపైనే ఉందన్నారు. సమావేశంలో మల్లికార్జున్, షాబుద్దీన్, షేక్ అబ్దుల్ రవూఫ్, బానోత్ కృష్ణ, బుర్ర వెంకటేశ్వర్లు, జయరాజు, మిట్టపల్లి శ్రీను, జీవరత్నం, రామారావు, సంతోష్ చరణ్, పొదిల రామకృష్ణ, జంపాల శ్రీను, తాళ్లూరి రాము, యాకూబ్పాషా, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ములకలపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన మామిళ్లగూడెం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన పెద్దారపు రాజేశ్, పలగాని ఉదయ్కిరణ్ (16) ద్విచక్రవాహనంపై భద్రాచలం వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో మండలంలోని మామిళ్లగూడెం సమీపంలో బైక్ కుక్కను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఉదయ్కిరణ్ ఎగిరి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. రాజేశ్ స్వల్పగాయాలు కాగా.. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. పురుగులమందు తాగి లారీడ్రైవర్ ఆత్మహత్య టేకులపల్లి: పురుగులమందు తాగి లారీడ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండాకు చెందిన బాదావత్ బాలు (55) అలియాస్ కృష్ణ లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి గ్రామంలో ఉన్న తన మొక్కజొన్న చేనులో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొత్తగూడెం.. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బాదావత్ శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కలెక్టర్ను కలిసిన మణుగూరు సింగరేణి అధికారులు
మణుగూరుటౌన్/సూపర్బజార్(కొత్తగూడెం): గతేడాది ఆగస్టు 30వ తేదీన గొర్రెపేటవాగు వరద, సింగరేణి నుంచి వచ్చిన వరద, భారీ వర్షం కారణంగా మణుగూరు జలదిగ్భందంలో చిక్కుకుంది. కాగా, ‘ముంపుపై ముందస్తు చర్యలేవి’అనే శీర్షికన ‘సాక్షి’లో గతేడాది మే 30న కథనం వచ్చింది. మణుగూరు మునకతో పట్టణంలోని ప్రధాన కాల్వలు, మొట్లు వాగు పూడిక తీయకపోవడం, సింగరేణి నుంచి వచ్చిన వరదలే ప్రధాన కారణంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ జితేశ్ పాటిల్ సూచన మేరకు సింగరేణి అధికారులు రూ.82.25 లక్షలతో శుక్రవారం ఎంఓయూ చేసుకున్నారు. ఈ నిధులను కట్టువాగు, మొట్ల వాగు పూడికతీత, మున్సిపాలిటీ ముంపునకు గురికాకుండా వినియోగించనున్నారు. కార్యక్రమంలో సంజీవరావు, ధనసరి వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు. నేటి నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్కొత్తగూడెంఅర్బన్: సింగరేణి కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు పర్సనల్ విభాగం జీఎం కవితానాయుడు తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు 18 సంవత్సరాల లోపువారు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శనివారం నుంచి మే 20వ తేదీ వరకు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం, సీఈఆర్ క్లబ్లో శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఉషు, కరాటే, డ్రాయింగ్ విభాగాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ఉంటుందని, ఆసక్తి కలిగినవారు నేటి సాయంత్రం ప్రకాశం స్టేడియంలో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. -
ఆఫ్టైప్ ఆయిల్పామ్ మొక్కల పరిశీలన
అశ్వారావుపేటరూరల్/ములకలపల్లి: ఆఫ్టైప్ మొక్కలు ఉన్న ఆయిల్పామ్ తోటలను రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. అశ్వారావుపేట మండలం గంగారం, వాగొడ్డుగూడెం గ్రామాలు, ములకలపల్లి మండలం తిమ్మంపేట, పొగళ్లపల్లి గ్రామాల్లోని పామాయిల్ తోటల్లో ఉన్న ఆఫ్టైప్ మొక్కలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నర్సరీ నుంచి 2017–2022 మధ్య కాలంలో రైతులకు అందించిన ఆయిల్ పామ్ మొక్కల్లోనే ఆఫ్టైప్ మొక్కలు అత్యధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే క్షేత్ర సందర్శన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిటైర్డ్ ఐఐఓపీఆర్ అధికారి బీఎన్రావు మాట్లాడుతూ నర్సరీ దశలో చీడపీడలు సోకినా, పెంపకంలో నాణ్యతాలోపాలు ఉన్నా అనారోగ్యమైన మొక్కలు పెరిగే అవకాశం ఉంటుందని, వీటిని సకాలంలో గుర్తించి కల్లింగ్ చేయాల్సిందని వివరించారు. కానీ కల్లింగ్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని తెలుస్తోందని తెలిపారు. డిప్యూటీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, అధికారులు శంకర్, రాధా కృష్ణ, నాగబాబు, కల్యాణ్ పాల్గొన్నారు. -
అందరికీ న్యాయం దక్కాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కొత్తగూడెంటౌన్: అందరికీ న్యాయం జరిగేలా న్యాయవ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంతత్ అన్నారు. గురువారం కొత్తగూడెం జిల్లా కోర్టులోని లైబ్రరీ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొత్తగూడెం జిల్లా మొదటి అదనపు జడ్జి ఎస్. సరిత, కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా రాజేందర్ కొత్తగూడెంటౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా ఎం.రాజేందర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. -
అడవులను కాపాడుకుందాం
చండ్రుగొండ : అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి అన్నారు. మండలంలోని చండ్రుగొండ రేంజ్ పరిధిలో బెండాలపాడు అటవీప్రాంతంలో గురువారం ఆయన పర్యటించారు. మారుజాతి ప్లాంటేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడవులను నాశనం చేసుకుంటే భవిష్యత్ తరాలకు మనుగడ ఉండదని హెచ్చరించారు. ఆయన వెంట రేంజర్ ఎల్లయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.విజిలెన్స్ డీఎఫ్ఓ ముకుందర్రెడ్డి -
విద్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దాలి
చర్ల/దుమ్ముగూడెం: వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమయ్యే నాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను సుందరంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. గురువారం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఆశ్రమ పాఠశాలలను, వసతి గృహాలను ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పాఠశాలల్లో కల్పించాల్సిన వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, వార్డెన్లు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయంతో పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. డార్మెటరీ, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్, బాత్రూం ఇతర మౌలిక వసతులకు నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. 15 రోజుల్లోగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ డైనింగ్ హాల్ ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. వేసవి సెలవుల్లో పాఠశాలలు అపరిశుభ్రంగా ఉంచకుండా రోజూ శుభ్రం చేయించాలని చెప్పారు. హెచ్ఎం సావిత్రి, డీఈ హరీష్, ఏఈ రవి, టీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ -
సీతాపతి.. కరోడ్పతి!
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఈ ఏడాది రూ.2.69 కోట్లు.. ఈ ఏడాది రామయ్యకు నవమి ఆదాయం భారీగా పెరిగింది. అన్ని విభాగాల్లో కలిపి రూ.2,69,09,390 సమకూరింది. ఇందులో అధికంగా సెక్టార్ల టికెట్ల విక్రయం ద్వారానే రూ.1,32,83,000 వచ్చింది. చిన్న లడ్డూల అమ్మకం ద్వారా రూ.49,07,775, మహా లడ్డూల ద్వారా రూ.2,89,000 సమకూరింది. ఇక తలంబ్రాల అమ్మకంలో పోస్టల్ ద్వారా రూ.6,64,225, ఆర్టీసీ కార్గో ద్వారా 41,09,200, ఆలయ వెబ్సైట్ ద్వారా 5,06,750, ఆలయ ప్రచార శాఖ ద్వారా 13,87,050 ఆదాయం వచ్చింది. ఆన్లైన్లో పరోక్ష సేవల ద్వారా 5,02,200, రూ.5 వేల పరోక్ష సేవల ద్వారా రూ. 3 లక్షల 45 వేల ఆదాయం చేకూరింది. పోస్టల్ శాఖ ద్వారా చేపట్టిన అంతరాలయ అర్చనకు భారీ స్పందన లభించింది. 2702 బుకింగ్లతో రూ.8,78,150 నిధులు సమకూరాయి. గతేడాది కంటే రూ.80 లక్షలు అదనం శ్రీరామనవమికి 2024లో వచ్చిన ఆదాయం కంటే ఈ ఏడాది ఆదాయం పెరగం విశేషం. గతేడాది సుమారు రూ. కోటి 89 వేల 61 వేలు రాగా ఈ ఏడాది అదనంగా సుమారు రూ. 80 లక్షల ఆదాయం పెరిగింది. ఇందులో సెక్టార్ల టికెట్ల విక్రయం ద్వారా సుమారు రూ.10 లక్షల ఆదాయం పెరిగింది. గతేడాది ముత్యాల తలంబ్రాల విక్రయం ద్వారా కేవలం రూ. 30 లక్షలు రాగా, ఈ ఏడాది రూ.66 లక్షల 67 వేల 225 ఆదాయం సమకూరింది. పోస్టల్ శాఖ ద్వారా బుకింగ్ చేసిన అంతరాలయ అర్చన ఆదాయం కూడా పెరిగింది. గతేడాది కేవలం రూ.91 వేలు ఉండగా ఈ ఏడాది రూ.8,78,150కు పెరిగింది. ఇందులో సీఎం, వీవీఐపీ సెక్టార్ల కోసం ఉభయదాతల టికెట్లను తగ్గించారు. దీనివల్ల సుమారు రూ.16 లక్షల ఆదాయానికి గండి పడింది. దీంతోపాటు మరికొన్ని పొదుపు చర్యలను పాటించి ఉంటే ఆదాయం సుమారు రూ. 3 కోట్లకు చేరేది. న్యూస్రీల్గణనీయంగా పెరిగిన శ్రీరామనవమి ఆదాయం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి రూ.2.69 కోట్ల రాబడి ముత్యాల తలంబ్రాల విక్రయాలకు విశేష ఆదరణ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణ మహోత్సవ ఆదాయం లెక్క తేలింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 6,7వ తేదీల్లో శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక ఉత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. వేడుకల్లో టికెట్లు, తలంబ్రాలు, లడ్డూల అమ్మకాలు, పరోక్ష సేవల ద్వారా రామయ్యకు భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది కంటే గణనీయంగా పెరిగింది. ఆ లెక్కలను ఆలయ అధికారులు గురువారం వెల్లడించారు. –భద్రాచలంపెరిగిన ముత్యాల తలంబ్రాల అమ్మకాలు.. ప్రతీ ఏడాది ముత్యాల తలంబ్రాలకు భక్తుల నుంచి ఆదరణ లభిస్తోంది. దేవస్థానం కౌంటర్లు, ప్రచార శాఖలతోపాటు ఆర్టీసీ కార్గో, పోస్టల్ శాఖల ద్వారా తలంబ్రాలు విక్రయిస్తున్నారు. దీంతో దేవస్థానంతోపాటు ఆర్టీసీ, పోస్టల్ శాఖలకు కూడా ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఆర్టీసీ కార్గో ద్వారా 46,400 ఫ్యాకెట్లను అమ్మగా, ఈఏడాది లక్షా 64 వేల 368 ప్యాకెట్లను విక్రయించారు. సుమారు 80 వేల ప్యాకెట్ల అదనంగా అమ్మకం చేశారు. పోస్టల్ శాఖ ద్వారా గతేడాది 2,531 ప్యాకెట్లు విక్రయించగా, ఈ ఏడాది 26,569 ప్యాకెట్లను అమ్మారు. దేవస్థానం ప్రచార శాఖ ద్వారా గతేడాది 31,518 కాగా, ఈ ఏడాది 55,482 ప్యాకెట్లను విక్రయించారు. ముత్యాల తలంబ్రాలు, దేవస్థాన కేలండర్లు, డైరీలు, వివిధ పుస్తకాలను అన్ని శాఖల ద్వారా ఏడాదంతా భక్తులకు అందుబాటులో ఉంచితే మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది. -
రామయ్య కల్యాణం.. కమనీయం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పార్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, వేదపడింతులు, భక్తులు పాల్గొన్నారు. రేపు రుద్రహోమంమండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం రుద్రహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు వరకు హోమం జరుగుతుందని పేర్కొన్నారు. పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్రనామాలను నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్లలో సంప్రదించాలని కోరారు. వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: జిల్లా పరిధిలోని ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేసేందుకు వైద్యుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అశ్వారావుపేట, మణుగూరు ఆస్పత్రుల్లో జనరల్ సర్జన్ వైద్య నిపుణులు, ఇతర ఆస్పత్రులలో డెర్మటాలజిస్టులు, భద్రాచలం, బూర్గంపాడులలో ఎంబీబీఎస్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే నెల 5వ తేదీ లోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. పలువురు సీఐల బదిలీకొత్తగూడెంటౌన్: జిల్లాలోని పలువురు సీఐలను బదిలీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. కొత్తగూడెం డీసీఆర్బీలో విధులు నిర్వర్తిస్తున్న సీఐ మడిపెల్లి నాగరాజును భద్రాచలం టౌన్ ఎస్హెచ్ఓగా, కొత్తగూడెం సీసీఎస్ విభాగంలో పనిచేస్తున్న పింగిలి నాగరాజును అశ్వారావుపేట సర్కిల్కు బదిలీ చేశారు. తాటిపాముల కరుణాకర్ను అశ్వారావుపేట నుంచి బదిలీ చేస్తూ హైదరాబాద్ మల్టీజోన్–1 ఐజీపీకి రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భద్రాచలంలో.. భద్రాచలంఅర్బన్: ఈ నెల 10న భద్రాచలం సీఐ బర్పాటి రమేష్ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో దీంతో 15 రోజుల నుంచి అక్కడ సీఐ పోస్టు ఖాళీగా ఉండగా, ఆ స్థానంలో నాగరాజును నియమించారు. నేడు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..
● జిల్లాకు చేరిన మొదటి విడత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్ ● స్టిచ్చింగ్ పనులు చేపడుతున్న మహిళా సంఘాలు ● ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభంనాటికి అందించే అవకాశం కొత్తగూడెంఅర్బన్: 2025–2026 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాకు మొదటి విడత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం క్లాత్ చేరుకుంది. పాఠ్యపుస్తకాలను జిల్లా కేంద్రంలోని పాతకొత్తగూడెం స్కూల్లో భద్రపరిచారు. మిగతా విడతల్లో కూడా వచ్చే పుస్తకాలను గోదాంలో ఉంచి, మే చివరిలోగా మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు పంపించనున్నారు. పాఠశాలల పునఃప్రారంభంనాటికి విద్యార్థులకు కొత్త యూనిఫాం అందించనున్నారు. మొదటి విడతగా యూనిఫాం సంబంధించిన బాటమ్ క్లాత్ చేరుకోగా, మహిళా సంఘాల సభ్యులకు స్టిచ్చింగ్ నిమిత్తం అందజేశారు. వారు యూనిఫాం కుట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా విద్యార్థులకు రెండు జతల యూనిఫాం అందజేస్తున్నారు. గతేడాది ఒక్కో యూనిఫాంకు స్టిచ్చింగ్ చార్జీ రూ.50 చొప్పున అందజేయగా, ఈసారి రూ.75కు పెంచారు. రెండు జతలు కుట్టినందుకు రూ.150 అందించనున్నారు. పట్టణాల్లో మెప్మా, మండలాల్లో సెర్ప్ సిబ్బంది స్టిచ్చింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా యూనిఫాం చొక్కాల క్లాత్ రెండో దశలో రానుందని అధికారులు తెలిపారు. గోదాంకు చేరిన 1,10,200 పాఠ్యపుస్తకాలు జిల్లాకు రానున్న విద్యాసంవత్సరంలో 5,08,400 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంది. మొదటి విడతగా 1,10, 200 పుస్తకాలు చేరాయి. ఇంకా 3,98, 200 పుస్తకాలు రావాల్సి ఉంది. వచ్చిన పుస్తకాలను కొత్తగూడెం గోదాంలో భద్రపరిచారు. దీంతోపాటు మొదటి విడతలో యూనిఫాంలో ప్యాంట్కు సంబంధించిన క్లాత్ 2,50,060.45 మీటర్లు అందజేశారు.