breaking news
Bhadradri District Latest News
-
నిమజ్జనం.. జర భద్రం
భద్రాచలంఅర్బన్: జిల్లావ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విభిన్న రూపాల్లో కొలువుదీరిన ఆదిదేవుడిని భక్తులు పూజిస్తూ పరవశిస్తున్నారు. అయితే విగ్రహాలను నిమజ్జనం చేసే సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు, అధికారులు సూచిస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమైన ఐదోరోజు నుంచే నిమజ్జన కార్యక్రమాలు సాగుతుండగా.. ఈ నెల 6న వేలాది విగ్రహాలను భద్రాచలం గోదావరి తీరానికి తీసుకురానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైవర్ పాత్ర కీలకం.. నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు అనుభవజ్ఞులై ఉండాలి. పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు సలహాలు, సూచనలు ఇవ్వాలి. రోడ్లపై గతుకులు, గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద జాగ్రత్తగా నడపాలి. విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రతిమ వద్ద ఎక్కువ మంది జనం లేకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొనే పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పి బయటకు పంపాలి. నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపడం మంచిదికాదు. తెలిసిన వారితో లేదా కుటుంబ సభ్యులు తోడుగా ఉండేలా చూసుకోవాలి. శోభాయాత్రను చూసేందుకు ఎత్తుగా ఉన్న భవనాలు, రేకుల షెడ్లు, పాతభవనాలు ఎక్కినపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక నిమజ్జనం సందర్భంగా క్యూ పద్ధతి పాటించాలి. ఒక వాహనం తర్వాత ఇంకో వాహ నం వెళితే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. ఇక ప్రతిమలను చెరువు లు, కుంటలు, ప్రాజెక్టుల వద్ద నిమజ్జనం చేసే సమయాన జాగ్రత్తలు పాటించాలి. ఈత రాని వారు, పిల్లలు సహా ఎవరూ లోనికి వెళ్లకుండా సిబ్బందికి విగ్రహాలు అప్పగించాలి. నిమజ్జనానికి భారీ బందోబస్తు భద్రాచలం గోదావరిలో గణేశ్ నిమజ్జనం చేయనున్న ఘాట్ వద్ద భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ పర్యవేక్షణలో 250 మంది పోలీసులు అంతేకాక 15 మంది వైద్య బృందం (మూడు షిఫ్ట్లలో), ఒక 108 అంబులెన్సు, మరో లైఫ్ సపోర్ట్ ఎమర్జెన్సీ వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. రెండు షిఫ్ట్లలో 36 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 10 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది, అంతే కాకుండా 12 మంది గజ ఈతగాళ్లు, దేవస్థానం సిబ్బంది 24గంటల పాటు కూడా అందుబాటులో ఉండను న్నారు. నిమజ్జనానికి మూడు భారీ క్రేన్లతో పాటు జేసీబీలను అధికారులు అందుబాటులో ఉంచారు. సిబ్బందికి బాధ్యతలపై సూచనలిస్తున్న భద్రాచలం టౌన్ సీఐ నాగరాజువినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులు అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలి. ఏ నిబంధన అమలు చేస్తున్నా అది మీ భద్రత కోసమేనని గుర్తుంచుకోవాలి. నిమజ్జనంలో పాల్గొనే భక్తులు, కమిటీ సభ్యులు పోలీసులు సూచించిన రూట్ మ్యాప్ ద్వారానే రావాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100కి కాల్ చేయండి. తొందర పాటుతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. –బి.రోహిత్ రాజు, ఎస్పీ భద్రాచలం గోదావరిలో జరగనున్న నిమజ్జనోత్సవంలో ఈ సారి ప్రత్యేకంగా 250 మంది పనిచేస్తున్నాం. ఎక్కడా వినాయకులు ఎక్కువ సేపు ఆగకుండా మా సిబ్బంది ముందుకు సాగనంపుతారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. ఆరుగురు సీఐలతో పాటు 15 మంది ఎస్ఐలు, 231 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగిస్తున్నాం. –విక్రాంత్ కుమార్సింగ్, ఏఎస్పీ, భద్రాచలం -
భవిష్యత్కు బలమైన పునాది !
కొత్తగూడెంఅర్బన్: నాలుగేళ్లు పైబడిన చిన్నారుల భవిష్యత్కు బలమైన పునాది వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బోధించే ఎల్కేజీ, యూకేజీ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమరీ (పూర్వ ప్రాథమిక విద్య) తరగతులు అందుబాటులోనికి రానున్నాయి. రూ.వేల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపించలేని తల్లిదండ్రులకు ఇదో వరంలా మారనుంది. జిల్లాలోని 21 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారుల విద్యాబోధనకు గాను ప్రత్యేకంగా టీచర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 18 – 44 ఏళ్ల వయసు గల స్థానిక మహిళలే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోధకుల కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా, ఆయాలకు ఏడో తరగతిగా నిర్ణయించారు. వారి ఎంపిక కమిటీకి కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా, అదనపు కలెక్టర్(రెవెన్యూ)తో పాటు కలెక్టర్ నామినేట్ చేసిన మరొకరు సభ్యులుగా ఉంటారు. బోధకులకు నెలకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం పది నెలల పాటు చెల్లించనున్నారు. ఎంపికై న పాఠశాలలివే.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు తొలి విడతగా 21 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఆళ్లపల్లితో పాటు మండలంలోని పాతూరు ఎంపీపీఎస్, అశ్వారావుపేట మండలం కుడుములపాడు, ఐవీ ఎంప్లాయ్ కాలనీ, చండ్రుగొండ మండలం పోకలగూడెం, చర్ల మండలం పూసుగుప్ప, దమ్మపేట మండలం బాలరాజుగూడెం, దుమ్ముగూడెం మండలం గోవిందాపురం కాలనీ, గుండాల మండలం కొడవటంచ, జూలూరుపాడు మండలం కాకర్ల, లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల, మణుగూరు మండలం మామిడితోట గుంపు, పినపాక మండలం గోవిందాపురం, పాండురంగాపురం, ఉప్పాక, సింగిరెడ్డిపల్లి, టేకులపల్లి మండలం బేతంపూడి, తడికలపూడి స్టేషన్, రామచంద్రునిపేట, కొప్పురాయి, ఇల్లెందు మండలం రొంపేడు ఎంపీపీఎస్లు ఉన్నాయి. ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించే విద్యార్థులకు మాత్రమే ప్రీప్రైమరీ క్లాసులు వినే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రావడంతో పేద పిల్లలకు లబ్ధి చేకూరనుంది. చిన్నారులు ఆట, పాటలతో సరదాగా నేర్చుకునేలా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తరగతులతో పిల్లల విద్యా పునాది బలపడటమే కాక సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెరగనున్నాయి. – నాగలక్ష్మి, డీఈఓ నాలుగేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఇందులో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. బోధనకు ఎల్కేజీ, యూకేజీ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆలస్యమైతే సంబంధిత మెటీరియల్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని బోధన సాగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులకు ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు గంట సేపు నిద్రించేందుకు కూడా సమయం కేటాయించారు. ఎంపికై న పాఠశాలలకు రూ.1.70 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.1.50 లక్షలు ఫర్నిచర్, పెయింటింగ్, బోధన పరికరాలు, ఇతర వస్తువుల కోసం ఖర్చు చేయనున్నారు. మిగితా రూ.20 వేలతో విద్యార్థులకు బూట్లు, యూనిఫామ్ కొనుగోలు చేస్తారు. 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు అదనపు నిధులు మంజూరు చేస్తారు. -
మిషన్ భగీరథ వాల్వ్లో పడి వ్యక్తి మృతి
కరకగూడెం: మిషన్ భగీ రథ స్కోర్ వాల్వ్లో పడి ఓ వ్యక్తి మృతి సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన వంగూరి వెంకన్న (43) కొద్ది రోజులుగా తాటిగూడెం గ్రామంలో ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి వంట సామాన్ల కోసం దుకాణానికి వెళ్తున్న సమయంలో ప్రధాన రహదారి పక్కన తెరుచుకుని ఉన్న మిషన్ భగీరథ స్కోర్ వాల్వ్లో పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తోటి కూలీలు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా మిషన్ భగీరథ స్కోర్ వాల్వ్ను అసంపూర్తిగా, సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ, బైక్ ఢీ : విద్యార్థి మృతిపాల్వంచరూరల్: పాస్పోర్టు వెరిఫికేషన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో బీటెక్ విద్యార్థి మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన జర్పుల చరణ్(22) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. హైదరాబాద్లో పాస్పోర్టు వెరిఫికేషన్కు వెళ్లేందుకు మంగళవారం అర్ధరాత్రి పాల్వంచ వెంగళరావుకాలనీలోని బంధువు పవన్ బైక్ తీసుకుని వెళ్తున్నాడు. అదే సమయంలో ములకలపల్లి వైపు వెళ్తున్న లారీ పాల్వంచ దమ్మపేట సెంటర్లో టర్నింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ ఇండికేటర్ ఇవ్వకపోవడంతో బైక్ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలై చరణ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదుతో లారీ డ్రైవర్ ఉకే కళ్యాణ్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ సుమన్ తెలిపారు. -
ఆలస్యమే కలిసొచ్చింది!
చుంచుపల్లి: సకాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వేటు పడిన అభ్యర్థులకు మేలు చేసింది. ఇప్పుడు వారందరికీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు నిర్ణీత వ్యవధిలో తమ ఖర్చుల లెక్కలు సమర్పించలేదు. దీంతో వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మూడేళ్లపాటు అనర్హత వేటు వేసింది. అయితే నిషేధ కాలపరిమితి ముగిసింది. దీంతోవేటు పడిన వారందరిలో ఇప్పడు ఆశలు చిగురిస్తున్నాయి. మరోసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సకాలంలో జరగక.. 2019 జనవరిలో జిల్లాలోని 479 గ్రామ పంచాయతీలకు 4,232 వార్డులకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి 1తో ముగిసింది. ఆ వెంటనే లోక్సభకు ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనను అమల్లోకి తెచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం సైతం గతేడాది ఆగస్టు మొదటి వారంతో ముగియగా, పరిషత్లో కూడా స్పెషలాఫీసర్ల పాలనే కొనసాగిస్తోంది. అయితే సకాలంలో పంచాయతీలకు ఎన్నికలు జరిగితే జిల్లాలో అనర్హతకు గురైన అనేక మంది అభ్యర్థులు పోటీకి దూరమయ్యేవారు. 292 మందిపై అనర్హత వేటు నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం 2019లో జనవరిలో 479 గ్రామ పంచాయతీలకు, మేలో 219 ఎంపీటీసీలు, 21 జెడ్పీటీసీ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీపడిన అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా తమ ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలి. ఐదు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలో పోటీచేసే వార్డు సభ్యుడు రూ. 30,000 వరకు, సర్పంచ్ అభ్యర్థులు రూ.1,50,000 వరకు ఖర్చు చేయాలని, 5 వేలకు పైగా జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే వార్డు సభ్యులు రూ.50వేలు, సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం నిమిత్తం రూ.2,50,000 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించారు. నిబంధనల ప్రకారం గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను వెల్లడించాలి. ఇందులో కొందరు వార్డు సభ్యులు గెలిచినా నిర్లక్ష్యంతో అధికారులకు ఖర్చు ల వివరాలు సమర్పించలేదు. ఓడిపోయిన మరి కొందరు ఎన్నికల నిబంధనలను అతిక్రమించారు. ఆయా అభ్యర్థులకు ఈసీ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేదు. దీంతో ఎంపీడీఓలు సమర్పించిన నివేదికల ఆధారంగా ఎన్నికల సంఘం 2021 నవంబర్లో కొందరు అభ్యర్థులపై అనర్హత విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో గెలిచిన 96 మంది అభ్యర్థులతోపాటు ఓడిపోయిన మరో 196 మంది.. మొత్తం 292 మంది అనర్హతకు గురయ్యారు. వీరిలో ములకలపల్లి మండలంలోనే 96 మంది వరకు అభ్యర్థులు గెలుపొందిన ఉన్నారు. కొందరు ఉపసర్పంచ్లు కూడా ఉండటం గమనార్హం. వీరంతా 2024 ఏప్రిల్ వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో అనర్హత వేటు కాలపరిమితి ముగిసిపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలో నిర్వహిస్తామని ప్రకటించడంతో వారు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. -
మహిళపై కుక్క దాడి
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీకి చెందిన బాదావత్ పద్మ(49) బుధవారం ఉదయం వాకిలి ఊడుస్తుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో ముఖంపై త్రీవ గాయాలు కాగా, కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను ఏపీ రాష్ట్రం గుంటూరు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బాలిక అదృశ్యంపాల్వంచరూరల్: పదో తరగతి బాలిక అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలానికి చెందిన విద్యార్థిని(16) బుధవారం స్కూల్కు వెళ్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. పాఠశాలకు రాలేదని వాచ్మెన్ ద్వారా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ సురేశ్ అదృశ్యం కేసు నమోదు చేశారు. ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యకొత్తగూడెంటౌన్: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెంది ఓ వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు, బంధువుల కథనం ప్రకారం.. రామవరం పంజాబ్గడ్డ బస్తీకి చెందిన మైలారపు ప్రసాద్ కుమారుడు జైకుమార్ (23) మూడేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన అఖిల భార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తూ భార్యతో కలిసి అక్కడే జీవనం సాగిస్తున్నాడు. కాగా ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిన అఖిల తిరిగి భర్తకు వద్దకు రాలేదు. పలుమార్లు కోరినా కాపురానికి రావడంతో జైకుమార్ మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీపీటీఎఫ్ నాయకుడు నాగేశ్వరరావు మృతి ఖమ్మంసహకారనగర్/ఖమ్మంఅర్బన్: టీపీటీఎఫ్ నాయకుడు రాయప్రోలు నాగేశ్వరరావు (59) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో చికిత్స చేయిస్తుండగా కన్నుమూశారని సంఘం బాధ్యులు తెలిపారు. ప్రస్తుతం నాగేశ్వరరావు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిగా విధు లు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థి దశలోనే పీడీఎస్యూలో చేరిన ఆయన ఉపాధ్యాయుడిగా నియామకమయ్యాక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో ఖమ్మం అర్బన్ మండలం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కౌన్సిలర్గా వ్యవహరించారు. నాగేశ్వరరావు మృతిపై టీపీటీఎఫ్ నాయకులు వి.మనోహర్రాజు, నాగిరెడ్డి సంతాపం తెలిపారు. -
పది రోజుల్లో ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తనకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పలు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారని, వీటన్నింటిపై పది రోజుల్లో ప్రభుత్వ పరంగా దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. చండ్రుగొండ మండలం బెండాలపాడులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం అనంతరం దామరచర్లలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల సమస్యలు, పనులపై వినతిపత్రాలు ఇచ్చారు. పది రోజుల్లో వారితో మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పా. వినతిపత్రాలు, ప్రతిపాదనలపై జిల్లా అధికారులతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల వద్దే కీలక శాఖలు ఉన్నాయి. సారపాకలో సన్న బియ్యం భోజనం.. గతంలో రేషన్కార్డులపై పేదలకు దొడ్డుబియ్యం పంపిణీ చేసేవారు. ఆ బియ్యంతో అన్నం తినలేక చాలా మంది అమ్ముకునే వారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించాం. సారపాకలో సామాన్యుడి ఇంట్లో భోజనం చేయడానికి వెళ్లినప్పుడు రేషన్కార్డుపై వచ్చిన బియ్యంతోనే అన్నం వండమని చెప్పాం. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పా. కానీ ఆ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు జూబ్లీహిల్స్లోని మా ఇంట్లో, శీనన్న(పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ఇంట్లో అన్నం తిన్నట్టే అనిపించింది. సన్నబియ్యంతో అన్నం తింటున్నప్పుడు సామాన్యుడి కళ్లలో కనిపించే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా రాదు. ఆత్మగౌరవంతో బతికేలా తొలిదశ తెలంగాణ ఉద్యమం పాల్వంచలో ప్రారంభమై తెలంగాణకు దిశాదశ చూపించింది. ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించేది ఖమ్మం జిల్లానే. ఈ జిల్లా వాసులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఇక్కడ గూడేలు, తండాల వారికి తల్లితో సమానంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై గౌరవం ఉంది. అందుకే పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజం చేస్తోంది. పేదలు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు గడిచిన పదేళ్లుగా ఎదురుచూసి నిరాశ చెందారు. ఇప్పుడు నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో 4.50లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. అశ్వారావుపేటకు మాత్రం ఏకంగా 4,500 ఇళ్లు ఇచ్చాం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. 2–30 గంటల పాటు.. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు సీఎం రేవంత్రెడ్డి చండ్రుగొండకు రావాల్సి ఉంది. అయితే మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన కారణంగా మధ్యాహ్నం 3 : 40 గంటలకు చండ్రుగొండకు చేరుకున్నారు. తొలుత బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నాక పైలాన్ ఆవిష్కరించి ఇందిరమ్మ లబ్ధిదారులతో మాటామంతీ నిర్వహించారు. ఆ తర్వాత దామరచర్లలో బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ 29 నిమిషాల పాటు ప్రసంగించిన సీఎం.. సాయంత్రం 6 : 10 గంటలకు తిరుగు పయనమయ్యారు. మొత్తంగా రెండున్నర గంటల పాటు జిల్లాలో సీఎం పర్యటన కొనసాగింది.ఎమ్మెల్యేల నుంచి విజ్ఞాపనలు అందాయి.. -
యూరియా పంపిణీలో ఇంత నిర్లక్ష్యమా ?
జూలూరుపాడు: యూరియా సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమకు సరిపడా పంపిణీ చేయాలని కోరుతూ జూలూరుపాడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం ఆందోళన చేశారు. కార్యాలయం లోపలికి వచ్చి షెట్టర్ మూసి అధికారులు, సిబ్బందిని నిర్భందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో రైతుకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని, ఒక బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని కార్యాలయ షెట్టర్ను తీశారు. రైతులు సంయమనం పాటించాలని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు. సొసైటీ కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ రోజుకు 40 టన్నుల యూరియా అవసరమని ఇండెంట్ పెట్టామని, 10 టన్నులు మాత్రమే వస్తుండటంతో ప్రతీ రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇస్తున్నామని తెలిపారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భాస్కర్రామ్ రూ.2లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోగా, అధికారులు ఆయనకు ప్రసాదం, స్వామివారి జ్ఞాపిక అందజేశారు. అధికారుల ఆట విడుపు !టెన్నిస్ ఆడిన ఐటీడీఏ పీఓ, హౌసింగ్ ఎండీ పాల్వంచరూరల్ : నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే ఇద్దరు ఐఏఎస్ అధికారులు అటవిడుపుగా కాసేపు టెన్నిస్ ఆడారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి.గౌతమ్ చండ్రుగొండ మండలం బెండలపాడులో సీఎం రేవంత్రెడ్డి సభా కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో పాల్వంచ శ్రీనివాసకాలనీలోని మినీ స్టేడియం వద్ద ఆగారు. బుధవారం రాత్రి కొందరు టెన్నిస్ ఆడుతుండగా వారు కూడా సరదాగా కాసేపు లాన్ టెన్నిస్ ఆడారు. వారి వెంట టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిరెడ్డి యుగంధర్ ఉన్నారు. మళ్లీ ‘మొదటి’కొచ్చిన గోదావరిభద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వదర నీరు భారీగా వస్తుండగా బుధవారం రాత్రి 9.50 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 11 గంటలకు 43.30 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు తగ్గుతూ వచ్చిన నీటి ప్రవాహం సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగింది. మరోసారి గోదావరి ఉప్పొంగుతుండడంతో ఏజెన్సీ వాసుల్లో భయం పట్టుకుంది. కాగా, ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పటివరకు మూడు సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక, రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడం గమనార్హం. -
పేదల ఆత్మగౌరవమే లక్ష్యం
● ఎంత ఖర్చయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● మంత్రి పొంగులేటి వెల్లడివరుణుడు కరుణించాడు..ములకలపల్లి : సీఎం సభకు వరుణదేవుడు కరుణించాడు, మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురవగా సభా ప్రాంగణం బురదమయం కావడం, రహదారులన్నీ చిత్తడిగా మారడంతో అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం కూడా చిరుజల్లులు కురిసి, కారుమబ్బులు కమ్ముకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రెండు పర్యాయాలు కార్యక్రమం వాయిదా పడగా మరోసారి కూడా ఏం జరుగుతుందోనని భయపడ్డారు. అయితే సభ సమయానికి వాతావరణం అనుకూలించడంతో సభ విజయవంతమైంది. బెండాలపాడులో గృహప్రవేశ సమయంలో రేవంత్రెడ్డి లబ్ధిదారులతో మాట్లాడుతూ చిరుజల్లులు కురిసినా, వెంటనే నిలిచిపోయాయని, భవవంతుడి ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఫలించిన ‘ఖాకీ’ల శ్రమ సీఎం సభకు 1,200 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా సభ విజయవంతం కావడంతో ఖాకీల శ్రమ ఫలించినట్ట యింది. భారీగా బస్సులు వచ్చినా, నిర్ణీత ప్రదేశాలకు తరలించారు. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. అశ్వారావుపేట: రాష్ట్రంలో పేదల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చండ్రుగొండ మండలం దామరచర్లలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడిని చీడపురుగులా చూసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరమే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వచ్చే రెండున్నరేళ్లలో మరో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి 25వేల ఇళ్లు అదనంగా కేటాయిస్తామన్నారు. తాము పదవులు అడగలేదని, సీఎం రేవంత్రెడ్డి పిలిచి పదవులివ్వడంతో పాటు ఆడపడుచులకు ఇళ్లు ఇవ్వడమే కాక స్వయంగా జిల్లాకు వచ్చి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు చేశారని వివరించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నాడు దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే, నేడు రేవంత్రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెచ్చారని అన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బతికించి అధికారంలోకి తెచ్చిన టైగర్ రేవంత్ రెడ్డి అని కొనియాడారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేరిన రోజిది అన్నారు. భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు ఈ జిల్లాలోనే చేయడం హర్షణీయమని అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మలో మరిచిపోలేనిదని అన్నారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు కార్యక్రమం రెండుసార్లు వాయిదా పడినా.. మూడోసారి హాజరైన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొట్లాడాలన్నా.. పోరాడాలన్నా.. నిప్పుకణికల్లా ఆందోళన చేయాలన్నా తమకు సాటి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆయనతో కలిసి ఉన్నామని చెప్పారు. సీతారామ నీళ్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వచ్చేలా చూడాలని, కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. నాడు వైఎస్సార్ భద్రాచలంలో పోడు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని.. నాటి, నేటి సీఎంలకు సారూప్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్నాయక్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ మాలోతు రాందాస్నాయక్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ట్రెయినీ ఐఏఎస్ సౌరభ్శర్మ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్రాజు, దిశ కమిటీ సభ్యడు బొర్రా సురేష్ తదితరులు పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, ఖమ్మం: దామరచర్లలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న సభలో వక్తలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నామస్మరణ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించినప్పుడల్లా అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. సీఎం తన ప్రసంగంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా తమ ప్రసంగాల్లో వైఎస్సార్ పేరు ప్రస్తావించారు. ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడే సమయాన ప్రజలు ఈలలు, చప్పట్లతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. -
తాలిపేరుకు వరద ఉధృతి
చర్ల: తాలిపేరు ప్రాజెక్ట్లోకి వరద నీటి ప్రవాహం ఒక రోజు పెరుగుతుండగా, మరో రోజు తగ్గుతోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి ప్రాజెక్ట్లో భారీగా వరదనీరు వస్తుండటంతో 14 గేట్లను ఎత్తి ఉంచి 30,054 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు గోదావరిలో కూడా వరద ఉధృతి ఉండగా, బ్యాక్ వాటర్తో తేగడలోని హైలెవల్ వంతెన వద్ద వరద ఉగ్రరూపం దాల్చుతోంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ గేటు ఎత్తివేతపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1,700 క్యూసెక్కుల వరదనీరు వస్తోంది. దీంతో బుధవారం నీటిమట్టం 405.30 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ ఒక గేటు ఎత్తి ఉంచి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కారు ఢీకొని మహిళ మృతిమణుగూరు టౌన్: కారు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పినపాక మండలానికి చెందిన కోడిరెక్కల సావిత్రి (55) మణుగూరు నుంచి భద్రాచలం వైపు ఆటోలో వెళ్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం శివారులో ఎదురుగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో సావిత్రి రోడ్డుపై పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరిన ఆమెను 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. అటు సీత.. ఇటు రాధ! ఇందిరమ్మ ఇంటి స్థలంపై వివాదంబోనకల్: మండలంలోని రాపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి స్థల విషయమై వివాదం నెలకొనగా ఇరువర్గాలతో అధికారులు చర్చించారు. గతంలో కులవృత్తులతో జీవిస్తున్న పలువురికి ప్రభుత్వం స్థలాలు కేటాయించగా గ్రామంలో రాచకొండ సీతకు సైతం కేటాయించారు. కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్న ఆమె మరో గ్రామానికి వెళ్లింది. దీంతో ఆమె బంధువైన రాచకొండ రాధకు ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఆ స్థలంలో ముగ్గులు పోశారు. గ్రామంలో నాయకులు రెండు వర్గాలుగా ఉండడంతో నిర్మాణం జరపొద్దని ఓ వర్గం, ఆ స్థలాన్ని రాచకొండ రాధ కొనుగోలు చేసిందని ఇంకో వర్గం వారు వాదించారు. ఈ విషయం జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి వెళ్లగా ఆమె నెల క్రితం పరిశీలించి వివా దం లేని స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూ చించారు. దీంతో ఎస్ఐ పి.వెంకన్న, తహసీల్దార్ రమాదేవి బుధవారం ఇరు వర్గాలను పిలిచి విచా రణ చేపట్టారు. గతంలో కొన్నాళ్లు ఉన్న రాచకొండ సీతను ఈనెల 6న పిలిపించే వరకు ఇరు వర్గా లు సమన్వయంతో ఉండాలని సూచించారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదువైరా: వైరా పాత ఎకై ్సజ్ స్టేషన్ రోడ్డులో ఓ బాలికపై లైంగికదాడికి ప్రయత్నించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. కాలనీకి చెందిన ఓ బాలిక ఇంట్లో ఉండగా దుగ్గిరాల రత్తయ్య వెనుక నుంచి వెళ్లి లైంగికదాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయాన బాలిక తండ్రి ఇంట్లోనే నిద్రిస్తున్నా డు. బాలిక కేకలు వేయడంతో రత్తయ్య పారిపోయాడు. కాగా బుధవారం పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ పి.రామారావు తెలిపారు. -
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక
మణుగూరు రూరల్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాకు చెందిన కార్మిక సంఘ నాయకుడు ఊకంటి ప్రభాకర్ రావు అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కేటీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. మణుగూరు మాజీ జెడ్పీటీసీ పోశం నర్సింహరావు, నాయకులు పాల్గొన్నారు. -
సారూ.. ఇటు చూడరూ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డితో పాటు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చండ్రుగొండ నుంచి బెండాలపాడుకు రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. మధ్యలో సత్తుపల్లి – భద్రాచలం రోడ్డు రైల్వే లైన్ను క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్గం మూడేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చినా ఇప్పటి వరకు కేవలం గూడ్సు రైళ్లకే పరిమితమైంది. ప్రయాణికుల రైళ్లు నడిపేందుకు మాత్రం రైల్వేశాఖ ప్రయత్నించడం లేదు. కనీసం ఈ మార్గంలో బుధవారం ప్రయాణించే ప్రజాప్రతినిధులైనా ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మూడేళ్లుగా గూడ్సులే.. సత్తుపల్లి – భద్రాచలం రోడ్డు రైల్వేలైను నిర్మాణ వ్యయం రూ.928 కోట్లు కాగా ఇందులో రూ.619 కోట్లు సింగరేణి సంస్థ సమకూర్చింది. ట్రాక్ నిడివి 54 కిలోమీటర్లు ఉండగా ఈ మార్గంలో సర్వారం, చండ్రుగొండ, పార్థసారధిపురం (సత్తుపల్లి) స్టేషన్లు నిర్మించారు. ఈ లైన్ 2022 నవంబర్లో జాతికి అంకితమైంది. అంతకుముందే 2022 మే 28 నుంచే గూడ్సు రైళ్ల ద్వారా బొగ్గు రవాణాకు అనుమతి ఇచ్చారు. ఈ లైన్ ద్వారా నిత్యం 30 వేల టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. వార్షిక రవాణా సామర్థ్యం పది మిలియన్ టన్నులుగా ఉంది. ఈ లైనులో సరుకు రవాణా ద్వారా రైల్వేకు సాలీనా రూ.200 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. సేఫ్టీ సర్టిఫికెట్ వచ్చాకే.. నిర్మాణ వ్యయంలో సింహభాగం సింగరేణి నుంచి తీసుకోవడం, ఆ సంస్థ బొగ్గు రవాణా చేస్తూ లాభాలు ఆర్జించడం తప్పితే సింగరేణి కార్మికులు, స్థానిక గిరిజనుల రవాణా అవసరాలు తీర్చడంపై మాత్రం రైల్వేశాఖ దృష్టి సారించడం లేదు. నిబంధనల ప్రకారం ఏదైనా కొత్త లైన్లో కొన్నాళ్ల పాటు గూడ్స్ రైళ్లు నడిచిన తర్వాత ప్యాసింజర్ రైళ్లు నడిపే ప్రక్రియ మొదలవుతుంది. అందులో భాగంగా ఈ ట్రాక్పై ప్యాసింజర్ రైళ్లను కొంత కాలం పాటు ప్రయోగాత్మకంగా నడిపించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ప్యాసింజర్ రైళ్లు ఎన్ని బోగీలతో, ఎంత వేగంతో నడిపించవచ్చు, ఎక్కడ వేగాన్ని తగ్గించాలి, ఎక్కడ పెంచాలి తదితర అంశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ప్రయాణికుల రైళ్లకు ట్రాక్ అనుకూలంగా ఉందా లేదా అని అంచనా వేసి తగు మార్పులు చేస్తారు. ఆ తర్వాత సేఫ్టీ సర్టిఫికెట్ కోసం రైల్వే బోర్డుకు దరఖాస్తు చేస్తారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక ప్రయాణికుల రైళ్లు పట్టాలెక్కుతాయి. అయితే ఈ మార్గంలో గూడ్సు రైళ్లు దాదాపు మూడేళ్లుగా తిరుగుతున్నా ఇప్పటి వరకు ప్రయాణికుల రైళ్లు నడిపించేందుకు సేఫ్టీ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు జరగడం లేదు. ఫలితంగా కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు అలంకార ప్రాయంగా మారాయి. ప్రయాణికుల రైలు ఏర్పాటుపై మాత్రం నిర్లక్ష్యమే.. బొగ్గు గనులకు పుట్టిళ్లుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పేరుంది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్, ఆ పొరుగునే ఉన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్లో సుమారు 30 వేల మంది సింగరేణి కార్మికులు పని చేస్తున్నారు. సత్తుపల్లి, కొత్తగూడెం ప్రాంతాలను పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలతో అనుసంధానం చేసేలా సత్తుపల్లి నుంచి పెద్దపల్లి లేదా బెల్లంపల్లి వరకు పగటి వేళ పుష్పుల్ రైలు నడిపించాలని నాలుగు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. గతంలో మణుగూరు నుంచి కాజీపేట వరకు ఉదయం వేళ ప్యాసింజర్ రైలు ఉండేది. పెద్దపల్లి నుంచి విజయవాడ వరకు మరో బై వీక్లీ ప్యాసింజర్ రైలు అందుబాటులో ఉండేది. కరోనా సమయంలో ఈ రెండు రైళ్లు రద్దవగా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. కనీసం ఈ రైళ్లకు ప్రత్యామ్నాయంగానైనా సత్తుపల్లి – పెద్దపల్లి మధ్య రైలు నడిపించాలని, ఆ మేరకు ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తేవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
పంటలను పరిశీలించిన ట్రెయినీ కలెక్టర్
టేకులపల్లి : ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ టేకులపల్లి మండలంలో మంగళవారం పర్యటించారు. గోలియాతండాలో పత్తి పంటలను పరిశీలించి.. ఇప్పటివరకు పెట్టుబడి ఎంత పెట్టారు, ప్రస్తుతం పంట పరిస్థితి ఎలా ఉంది అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల వ్యవసాయ కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం, నూతన వ్యవసాయ పద్ధతులు, నేలల స్వభావం, పంటల విస్తీర్ణం, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించారు. రైతులకు వ్యవసాయ రుణాలు సక్రమంగా అందుతున్నాయా, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేస్తారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఏ గుగులోత్ లాల్చంద్, ఏఓ అన్నపూర్ణ, ఆత్మ చైర్మన్ బోడా మంగీలాల్, ఏఈఓలు శ్రావణి, విశాల, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఏపీలోని ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. వీరికి అర్చకులు స్వాగతం పకలగా ఆలయ ప్రదక్షిణ అనంతరం మూలమూర్తులను దర్శించుకున్నారు.సివిల్ సర్వీసెస్ టోర్నీకి దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంటౌన్: ఈనెల 9వ తేదీ నుంచి నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 9, 10వ తేదీల్లో హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియంలో వివిధ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 4వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 95054 23226 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిడీఎంహెచ్ఓ జయలక్ష్మి బూర్గంపాడు: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ జయలక్ష్మి ఆదేశించారు. మోరంపల్లిబంజర పీహెచ్సీలో మంగళవారం ఆమె రికార్డులు తనిఖీ చేశారు. ఫార్మసీ గది, ఇన్పేషెంట్ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వానాకాలంలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. 24 గంటలూ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీసాహితి, సిబ్బంది పాల్గొన్నారు. నెమ్మదిగా తగ్గుతున్న గోదావరిభద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతూ మంగళవారం రాత్రి 9.30 గంటలకు 40 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వదరనీటి ప్రవాహం తగ్గింది. సోమవారం రాత్రి నీటిమట్టం 42 అడుగులు ఉండగా 24 గంటల వ్యవధిలో ప్రవాహం రెండడుగుల మేర తగ్గింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద లేకపోవడంతో గోదావరి నీటి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. బీఈడీలో ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదలభద్రాచలం: భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాలలో 2025 – 2027 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికై న వారి జాబితా విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. డీడీ మణెమ్మ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరునాయక్ సమక్షంలో మెరిట్ జాబితాను మంగళవారం తన చాంబర్లో ప్రకటించారు. ఈ సందన్భంగా ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ పార్ట్– 2లో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించామని చెప్పారు. 100 సీట్లకు గాను 500 దరఖాస్తులు వచ్చాయని, నిబంధనల ప్రకారం భర్తీ చేశామని తెలిపారు. సీటు సాధించిన విద్యార్థులను త్వరలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. -
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
పాల్వంచ: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎన్నికలు స్థానిక ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన పోలింగ్లో 305 మందికి గాను 278 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. జెన్కో, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఏఈలు పోలింగ్లో పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీగా టి.మహేష్, ఫైనాన్స్ సెక్రటరీగా జి.శ్రీపాల్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 25 చోట్ల ఎన్నికలు నిర్వహించగా ఈనెల 19న పాల్వంచలోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులుగా బి.రవి, జి.తేజస్వి, ఆర్.రమేష్, కె.మనోజ్, ఐ.రాజు వ్యవహరించారు. ముగిసిన నామినేషన్ల పర్వం.. కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ(పాల్వంచ) ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. 3,008 మంది సభ్యులున్న ఈ సొసైటీకి 13 డైరెక్టర్ పోస్ట్లకు మొత్తం 46 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
పల్లె ఓటర్లు @ 6,69,048
● ఎట్టకేలకు లెక్క తేల్చిన అధికారులు ● జిల్లాలో తుది ఓటరు జాబితా ప్రచురణ ● గతం కంటే 45,101 మంది ఓటర్లు అధికంచుంచుపల్లి: జిల్లాలోని పల్లె ఓటర్ల లెక్క 6,69,048గా తేలింది. గ్రామపంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వార్డుల వారీగా తయారుచేసిన తుది ఓటరు జాబితాను పంచాయతీ అధికారులు మంగళవారం ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన అంకం మొదలైంది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల మరోసారి మార్పులు, చేర్పుల అనంతరం తుది ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ క్రమంలో గత నెల 28న మొదట ముసాయిదా జాబితాలు ప్రచురించాక మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. అలాగే అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించారు. మహిళలే అధికం.. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల పరిధి లోని 4,168 వార్డులకు సంబంధించిన జాబితాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. ఇటీవల పంచాయతీల వారీగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణతో పోల్చితే తాజా జాబితాలో 45,101 మంది ఓటర్లు పెరిగారు. మొత్తం ఓటర్లలో పురుషులు 3,25,045 మంది, మహిళలు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. పురుషుల కంటే 18,934 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తుది ఓటరు జాబితాలను అందుబాటులో ఉంచారు. ఎక్కువ శాతం గిరిజన జనాభా ఉన్న పంచాయతీల్లో ఎస్టీలకే సర్పంచ్, వార్డు స్థానాల్లో రిజర్వేషన్ కల్పించనున్నారు. పంచాయతీ ఓటర్ల తుది జాబితా సిద్ధం కావడంతో ఇక గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి. -
సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి చండ్రుగొండ/అశ్వారావుపేట : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సీఎం పర్యటన ఎట్టకేలకు బుధవారం ఖరారైంది. నేడు మధ్యాహ్నం 2.20 గంటలకు చండ్రుగొండ మండలంలోని బెండాలపాడుకు చేరుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కాగా, సీఎం పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూర్తిగా మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడులోనే ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని, ఇందిరమ్మ ప్రజాపాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. సీఎం పర్యటనను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వరుసగా వర్షాలు కురుస్తున్నా అధికారులు సభ ఏర్పాట్లను సమర్థంగా పూర్తి చేశారని అభినందించారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదోళ్లకు ఒక్క ఇల్లు కూడా రాలేదని, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ప్రజాధనం దోపిడి చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో తొలివిడతగా రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, అందులో 2.90 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపులోనూ పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, ఎక్కడైనా తప్పులు జరిగితే ఏసీబీ విచారణకు అప్పగించామని చెప్పారు. సభలో ముఖ్యమంత్రి రేంవత్రెడ్డితోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, కోరం కనకయ్య, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్బాబు, గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ తదితరులు పాల్గొన్నారు. అంతా బురదమయం..ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడినా.. సభా ప్రాంగణం వద్ద పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. టెంట్ల కింద వరదనీరు నిలిచిపోయి ఉంది. మరి సీఎం వచ్చే సమయానికై నా బురద నీటిని తొలగిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తూ సీఎం వస్తున్నా.. అధికారుల్లో నిర్లక్ష్యం వీడలేదన్నట్టుగానే అసంపూర్తి పనులు దర్శనమిస్తున్నాయి. చండ్రుగొండలో జాతీయ రహదారి వెంట పోగేసిన చెత్త కుప్పలు అలాగే వదిలేయడం గమనార్హం. కొత్తగూడెంఅర్బన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కార్యక్రమ విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో తాగునీరు, వైద్య సహాయం, భద్రత ఏర్పాట్లు చేయాలని, మధ్యాహ్నం 12 గంటలలోపే బస్సులు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రతీ బస్సుకు ఒక ఇన్చార్జ్ను నియమించాలన్నారు. -
● తప్పని యూరియా పాట్లు
‘వ్యవసాయ పనులు పక్కన పెట్టి యూరియా కోసం రోజూ వస్తున్నాం.. ఒక బస్తా ఇచ్చేందుకు మూడు రోజులుగా గోసపెడుతున్నారు’ అంటూ రైతులు యూరియా విక్రయాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నిజాంపేట విక్రయ కేంద్రానికి మూడు రోజులుగా యూరియా సరఫరా నిలిచిపోయింది. మంగళవారం కూడా విక్రయించడం లేదని తెలిసి.. చెప్పులు క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ అధికారులు వారికి నచ్చజెప్పి.. బుధవారం తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారమే టోకెన్లు పంపిణీ చేయగా వాటి కోసం తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ యూరియా విక్రయ కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అన్నదాతల అవసరాలను గుర్తించి సకాలంలో యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతున్నారని అన్నారు. –ఇల్లెందురూరల్ తెల్లవారకముందే చెప్పులతో క్యూలైన్ -
‘ఆది కర్మయోగి’ని గిరిజనుల చెంతకు చేర్చాలి
భద్రాచలం: సేవ, సంకల్ప, సమర్పణ అనే లక్ష్యంతో ప్రభుత్వం అందజేస్తున్న ఆది కర్మయోగి అభియాన్ పథకాన్ని గిరిజనుల చెంతకు చేర్చేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న మండల స్థాయి శిక్షణ కార్యక్రమానికి మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల గిరిజనుల ఆచారాలు, జీవన శైలి విభిన్నంగా ఉంటాయని, వారి సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, మేకల పెంపకం, మునగ సాగు, జీవిత బీమా, ఆది సురక్ష బీమా వంటి పథకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ నిబద్ధతగా విధులు నిర్వర్తించాలన్నారు. పీఓ రాహుల్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రతీ గిరిజన కుటుంబానికి చేరేలా కృషి చేయాలన్నారు. గిరిజనుల జీవనోపాఽధి పెంపునకు రూపొందించిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 9, 10 తేదీల్లో గ్రామాల్లో పర్యటించాలని, 19 మండలాల్లోని 130 గ్రామాలలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, ఏఓ సున్నం రాంబాబు, మాస్టర్ శిక్షకులు మధువన్, మాధవరావు, జస్వంత్ ప్రసాద్, సంతోష రూపా, సలీం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఉప్పొంగిన వాగులు
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిలు నీటమునిగాయి. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. పల్లెలు, బస్తీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పంటచేలు నీటమునిగాయి. చెట్లు నేలకూలాయి. చప్టాలు, రోడ్లు దెబ్బ తిన్నాయి. ప్రహారీలు కూలిపోయాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మండల కేంద్రం, ఇతర ప్రధాన గ్రామాలతో సంబంధాలు తెగిపోయియి. మూకమామిడి ప్రాజెక్ట్ అలుగు పోస్తోంది. పలుచోట్ల రహదారులపైకి వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చింతల చెరువు ఉప్పొంగి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రధాన రహదారిపై మోకాలి లోతు నీరు చేరింది. వర్షపునీరు చేరి కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డు చెరువును తలపించింది. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పలు చోట్ల జనావాసాల్లోకి వరద నీరు చేరింది. హేమచంద్రపురం పంచాయతీ ట్రాక్టర్ వరద నీటిలో మునిగింది. పోలీసు, రెవెన్యూ అధికారులు వాగులను సందర్శించి ప్రజలను అప్రమత్తం చేశారు. రోడ్లపై వరద ఉధృతి ఉన్నచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు రాకపోకలను నియంత్రించారు. –సాక్షి నెట్వర్క్ -
‘సాదాబైనామా’పైనే ఆశలు
● ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న సాగుదారులు ● జిల్లాలో 62,511 మంది రైతుల దరఖాస్తులు పాల్వంచరూరల్: క్రయవిక్రయాల ఒప్పందాలు తెల్లకాగితాల్లో రాసుకున్న రైతులు పట్టాల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇటీవల హైకోర్టు అనుమతులు ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాలపై దరఖాస్తులు స్వీకరించినా సమస్యను పరిష్కరించలేదు. భూములు సాగు చేసుకుంటున్నా ధరణి పోర్టల్ కారణంగా భూ యాజమాన్య హక్కు (పట్టా)లు రాలేదు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం తీసుకురానున్న ఆర్ఓఆర్ బిల్లుపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. పొజిషన్లో ఉన్నా.. భూముల క్రయవిక్రయాలు సాదా కాగితాలు, స్టాంప్ పేపర్లపైనా జరిగాయి. దశాబ్దాల నుంచి, తరతరాలుగా భూమిని సాగు చేసుకుంటున్నా, పొజిషన్లో ఉన్నా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదు. దీనికితోడు ఓ రైతు భూమి సర్వే నంబర్ మరో రైతు పట్టా పాసుపుస్తకంలో నమోదు కావడం, భూమిని విక్రయించినవారు చనిపోవడం, పూర్వీకులు విక్రయంచిన భూమినే వారి వారసులు మళ్లీ మరొకరికి విక్రయించడం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భూ యజమాన్య హక్కు(రిజిస్ట్రేషన్)లు నమోదు కాలేదు. దీంతో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదు. రైతుభరోసాతో ఇతర సంక్షేమ పథకాలు కూడా అందడంలేదు. ఈ క్రమంలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూభారతి (ఆర్ఓఆర్–2024) చట్టం ద్వారా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 2016 నుంచి 2020 వరకు స్వీకరణ 2014 జూన్ 2వ తేదీకి ముందు సాదాకాగితాలపై క్రయ విక్రయాలు జరుపుకున్న భూములను క్రమబద్ధీకరిస్తామని గత ప్రభుత్వం 2016లో దరఖాస్తులు స్వీకరించింది. 2020లో మరో విడుత దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. జిల్లాలో మంది 62,511 సాదాబైనామా పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఏజెన్సీలో 1/70 యాక్ట్ ఉన్నా గిరిజన రైతులకుపట్టాలు లేవు. కేవలం గిరిజనుల మధ్యే క్రయవిక్రయాలు జరిగినా పట్టాలు లేవు. వారుకూడా భూ హక్కు పత్రాల కోసం నిరీక్షిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు కోర్టు అనుమతులు ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. గైడ్లైన్స్ వచ్చిన వెంటనే సాదాబైనామాల దరఖాస్తుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. 2014 కంటే ముందు క్రయవిక్రయాలు జరిగిన భూములపై నెలకొన్న సమస్యలకే పరిష్కారం లభిస్తుంది. –వేణుగోపాల్రావు, జిల్లా అదనపు కలెక్టర్ నాకు సోములగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఐదెకరాల భూమి ఉంది. గతంలో ఆన్లైన్ పహాణీలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తామంటే సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్నా. నేటికీ పట్టాపాసుపుస్తకాలు ఇవ్వలేదు. దీంతో బ్యాంక్ రుణాలు రావడంలేదు. ప్రభుత్వ సబ్సిడీలు అందడంలేదు. –బండ్లపల్లి వెంకటనారాయణ, జగన్నాథపురం సాదాబైనామాల సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం. కోర్టు క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం హర్షణీయం. గిరిజనుల నుంచి గిరిజనులు భూములను కొనుగోలు చేసినా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంలేదు. సాదాబైనామా కింద 2014లో దరఖాస్తు చేసుకున్నా. ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. –కొర్ర రాములు, సోములగూడెం -
వాగులో మునిగి యువకుడి మృతి
చర్ల: మండలంలోని రాళ్లగూడేనికి చెందిన ఓ యువకుడు వాగులో మునిగి మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బండి భానుప్రకాశ్ (33) గోదావరి నది వైపు చేపల వేటకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలోని ఊటొర్రె దాటు తూవాగులో మునిగిపోయాడు. సమీపంలో పశువులు మేపుతున్నవారు గమనించి పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. చర్ల సీఐ ఏ.రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాంకుమార్, భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు వాగులో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య మార్తమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందరితో కలివిడిగా ఉండే భానుప్రకాశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. డెంగీతో బాలిక మృతిగుండాల: నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ బాలిక సోమవారం మృతి చెందింది. మండల కేంద్రానికి చెందిన ఇర్ప ప్రవలిక(15) హైదరాబాద్లో డిప్లొమా చదువుతోంది. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సఅందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు డెంగీ జ్వరంగా గుర్తించారు. సోమవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి మృతి చెందింది. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిటేకులపల్లి: చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతి చెందాడు. టేకులపల్లి పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని తొమ్మిదోమైలుతండాకు చెందిన గుగులోతు పీక్లా (46 ) గత నెల 19న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
జీసీసీని ప్రగతిపథంలో నడిపించాలి
పాల్వంచరూరల్: అందరి సహకారంతో జీసీసీని ప్రగతిపథంలో నడిపించాలని డివిజనల్ అధికారి సమ్మయ్య అన్నారు. సంస్థ పాల్వంచ బ్రాంచ్ మేనేజర్గా వి.లక్ష్మణ్ సోమవా రం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బీఎం లక్ష్మణ్కు అందరూ సహకరించాలని, ఐక్యంగా పనిచేసి సంస్థను అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో భద్రాచలం బీఎం జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేడు పెదవి, అంగిలి చీలిక ప్రత్యేక నిర్ధారణ శిబిరంకొత్తగూడెంఅర్బన్: పెదవి, అంగిలి చీలికతో బాధపడుతున్న బాలబాలికలకు హైదరాబాద్లోని హబ్సిగూడ ఉన్న ఏవీఆర్ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్ర చికిత్స అందించనున్నట్లు జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్కే.సైదులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్య నిర్ధారణకు మంగళవారం పాతకొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు ఎ.విజయ్కుమార్ శిబిరానికి హాజరవుతారని, బాధితులు సద్వి నియోగం చేసుకోవాలని వివరించారు. ఆర్థికంగా ఎదగాలికొత్తగూడెంఅర్బన్: మెప్మా గ్రూప్ సభ్యులు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసం రుణాలతో వ్యాపారాలు చేయాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ సూచించారు. సోమవారం ఆయన మెప్మా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తొలుత ఎస్ఎల్ఎఫ్, ఎస్ఎస్జీ గ్రూప్స్ నిర్వహణపై సమీక్షించారు. బ్యాంకు రుణాల మంజూరు, చెల్లింపులపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఎంసీ చంద్రశేఖర్బాబు, టీఎంసీ బి. వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లుశాంతకుమా ర్, మౌలాలీ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
వైరారూరల్: మండలంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై సోమవారం ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 15 మంది గాయపడ్డారు. వివరాలు ఇలా.. మణుగూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ సర్వీసు సుమారు 30 మంది ప్రయాణికులతో మణుగూరు నుంచి ఖమ్మం వస్తోంది. అదే సమయంలో లారీ వైరా వైపు నుంచి తల్లాడ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో రెండు వాహనాలు అతివేగంగా ఉండడంతో బస్సు డ్రైవర్ విజయ్ సహా బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యా యి. ఏసీపీ ఎం.ఏ.రెహమాన్, సీఐ ఎన్.సాగర్, ఎస్సై పి.రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులకు మూడు గంటల సమయం పట్టింది. పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తిభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దీంతో వారొచ్చి సదరు వ్యక్తిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. కాగా ఆస్పత్రిలో చిన్నారులను ఎత్తుకెళ్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు సోష ల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అది అవాస్తమని, అలాంటి వార్తలు నమ్మొద్దని సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. బంగారం చోరీఅశ్వాపురం: మండల కేంద్రంలోని చిన్న తండాలో ఓ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. తండాకు చెందిన తేజావత్ విజయ ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో వినాయకచవితి ఉత్సవాల వద్దకు వెళ్లింది. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డపలుగుతో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తాళాలు పగులగొట్టి 11 గ్రాముల బంగారం, రూ.20వేల నగదు చోరీచేశారు. సంఘటనా స్థలా న్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. సింగరేణి కార్మికుడికి పాముకాటుమణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని ఓసీ–2 డంపర్ షెడ్లో సోమవా రం మొదటి షిఫ్ట్లో విధులు నిర్వర్తిస్తున్న కమటం వెంకటేశ్వర్లుకు పాము కాటు వేసింది. దీంతో ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. కార్మికుడిని ఎస్ఓటూ జీఎం శ్రీనివాసచారి, ఏఐటీయూసీ నాయకులు మల్లెల రామనర్సయ్య, ఆదర్ల సురేందర్ తదితరులు పరామర్శించారు. కాగా అధికారులు ఇచ్చిన సమాచారంతో వచ్చిన స్నేక్ క్యాచర్ ముజాఫర్ పామును పట్టివేశాడు. 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు -
గోదావరిలో వినాయక నిమజ్జనం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం 167 గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణనాథుడికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు మేళతాళాలు, డప్పుచప్పులతో బాణసంచా కాల్చుతూ, ఊరేగింపుగా గోదావరి తీరంలో ఘాట్కు తరలించి నిమజ్జనం చేశారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు భక్తులను తీరం వరకు అనుమతించలేదు. స్నానఘట్టాల వద్ద స్నానాలు చేసేందుకు షవర్ ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంచీలు, బోట్లలో వినాయక ప్రతిమలను తీసుకెళ్లి గోదావరి మధ్యలో గణనాథులను వదులుతున్నారు. ఘాట్ వద్ద విద్యుత్ సౌకర్యంతోపాటు నిత్యం పోలీసుల నిఘా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా నిమజ్జనం సందర్భంగా కొందరు సిబ్బంది భక్తుల నుంచి నగదు వసూళ్లు చేస్తుండటంతో శనివారం అర్ధరాత్రి గొడవ జరిగింది. -
గోదావరి తగ్గుముఖం
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టి సోమవారం రాత్రి 42 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 24 గంటల్లో మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ఎగువ నుంచి వదర నీరు భారీగా రావడంతో గత రెండు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ దాగుడుమూతలాడిన గోదావరి నీటి ప్రవాహం ఇటు ఏజన్సీవాసులతో పాటు అధికారులను కంగారు పెట్టించింది. ఆదివారం ఉదయం వరకు నిలకడగా ఉన్న నీటి ప్రవాహం చిన్నగా పెరుగుతూ 9 గంటలకు 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అ తర్వాత నాలుగు గంటల పాటు నిలకడగా ఉండి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అలా సోమవారం రాత్రి 7.37 గంటలకు 42.90 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. దీంతో మూడు రోజులుగా భద్రాచలం – చర్ల మధ్యతో పాటు ఏజెన్సీలోని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. -
సీపీఎస్ రద్దు చేయాలని ధర్నా
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిల్ ర్యాలీసూపర్బజార్(కొత్తగూడెం): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు పాల్వంచ బస్టాండ్ సెంటర్ నుంచి ఐడీఓసీ వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంగెం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని, ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల, ప్రభుత్వ నిధులను షేర్మార్కెట్కు తరలిస్తూ నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సీపీఎస్ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఇక్కడి నుంచే సమరశంఖం !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమం వేదికగా అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖాన్ని జిల్లా నుంచే పూరించనుందా అంటే అవుననే సమాధానం హస్తం వర్గాల నుంచి వస్తోంది. చండ్రుగొండ సభ ఏర్పాట్లు సైతం అలాగే ఉంటున్నాయి. పార్లమెంట్కూ ఇక్కడి నుంచే.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరగగా.. అంతకుముందే 2024 మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఈ సభలో వెల్లడించారు. అదే రోజు సాయంత్రం మణుగూరులో ప్రజాదీవెన పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరై మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్కు పరిచయం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వెలువడకముందే కాంగ్రెస్ తరఫున తొలి ఎన్నికల ప్రచారం జిల్లాలో ప్రారంభించారు. ఆ తర్వాత కొత్తగూడెం సభకు కూడా సీఎం వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బలరాంనాయక్, రామసహాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు. ఈసారీ అంతేనా..? స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి పనులు చకచకా సాగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని అనధికారికంగా కాంగ్రెస్ ప్రారంభించబోతోందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల బహిరంగ సభ తరహాలోనే ఆత్మీయ సభ ఏర్పాట్లు జరుగుతుండడం ఈ విశ్లేషణలకు బలం చేకూరుస్తోంది. లక్ష మంది హాజరయ్యేలా అత్యంత భారీగా సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇందిరమ్మ లబ్ధిదారులతో పాటు భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా ఈ సభలో ప్రజల మధ్యకు వచ్చి సీఎం అభివాదం చేసేలా 48 అడుగుల పొడవుతో వాకింగ్ ర్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన ప్రతీ ఒక్కరికి సీఎం స్పష్టంగా కనిపించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ఉండే మూడు రంగులు ప్రస్ఫుటంగా కనిపించేలా సభా ప్రాంగణాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఓవైపు ఏర్పాట్లు ఘనంగా సాగుతుంటే మరోవైపు కారుమబ్బులు కాంగ్రెస్ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కొత్తగూడెంటౌన్: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 3న చండ్రుగొండ మండలంలో పర్యటించనున్న నేపథ్యాన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు కొత్తగూడెం డీఏస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. వీఎం బంజర్ నుంచి చండ్రుగొండ మీదుగా కొత్తగూడెం వచ్చే వాహనాలు కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు మీదుగా చేరుకోవాలని సూచించారు. అలాగే, కొత్తగూడెం నుంచి వీఎం బంజర వైపు వెళ్లే వారు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలని కోరారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ప్రజావాణికి స్వల్పంగా హాజరుసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్వల్ప సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యల పరిష్కారానికి వినతులు అందజేశారు. భారీ వర్షాలకు తోడు ప్రజావాణి కార్యక్రమాన్ని కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ స్థాయిలో తొలిసారిగా నిర్వహించే విషయంలో సరైన సమాచారం లేక తక్కువ సంఖ్యలో వచ్చారు. అనారోగ్యం కారణండా ఆర్డీఓ మధు సెలవులో ఉండగా, డీఏఓ శకుంతల ఫిర్యాదులు స్వీకరించారు.పెరిగిన పామాయిల్ గెలల ధరఅశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల టన్ను ధర మరోసారి పెరిగింది. సోమవారం హైదారాబాద్లోని ఆయిల్ఫెడ్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వరకు టన్ను ధర రూ.18,052 ఉండగా, తాజాగా రూ.1,055 పెంచి రూ.19,107గా నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా జీఓ విడుదల చేయడంతో పామాయిల్ సాగుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.పట్టాలు లేవంటూ పత్తి పంట ధ్వంసంపాల్వంచరూరల్ : ఇప్పుడుప్పుడే ఏపుగా ఎదుగుతున్న పత్తి పంటను వైల్డ్లైఫ్ అధికారులు ధ్వంసం చేయగా బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని ఉల్వనూరు బంజర, చిరుతానిపాడు, మందెరలకపాడు గ్రామాల్లో ఆదివాసీ రైతులు పూనెం రమేష్, ఎర్రబోయిన చిట్టిబాబు, కాలం ఎర్రయ్య, సురేష్ పత్తి సాగు చేస్తుండగా.. ఆ భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు లేవంటూ అటవీ అధికారులు మొక్కలను తొలగించారు. కాగా, తాము అధికారులను బతిమిలాడినా వినకుండా ధ్వంసం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకుడు నిమ్మల రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. పోడు సాగుదారులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు చాతకొండ రేంజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వేములపల్లి శ్రీనివాసరావు, సంజీవరావు, రామారావు, మడకం కృష్ణ, పద్దం దేవయ్య, పదం భీమా, తాటిలక్ష్మయ్య, మడకం ప్రసాద్ పాల్గొన్నారు.కిన్నెరసాని మూడు గేట్లు ఎత్తివేతపాల్వంచరూరల్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశ యానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 10,600 క్యూసెక్కుల వరద రావడంతో సోమవారం నీటిమట్టం 405.80 అడుగులకు పెరిగింది. దీంతో మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు. -
సహజవనంలో సాంకేతిక సొబగులు
● రోప్వే ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం ● అవకాశాలను పరిశీలించిన అధికారులుఇల్లెందురూరల్: సహజత్వం ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న అటవీ శాఖ నేచర్ పార్క్లో సౌకర్యాల పెంపుపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టి సారించారు. పార్క్లో రంగురంగుల పూలు, సుగంధ పరిమళాలతో అహ్లాదం, పచ్చదనం, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు కల్పించి ఎక్కువ మంది సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. పర్వతాలు, లోయల వంటి ప్రాంతాలున్న చోట ఏర్పాటు చేసే రోప్వేను నేచర్ పార్క్లో సాంకేతిక సొబగులతో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు డీవైఎస్ఓ పరంధామరెడ్డి, మైన్స్ ఏడీ దినేష్ స్థానిక అధికారులతో కలిసి సోమవారం పార్కును సందర్శించారు. వాచ్టవర్ను పరిశీలించారు. పార్క్ మధ్యలో ఉన్న గుట్టను ఆధారంగా చేసుకొని జిప్లైన్ రోలర్ కోర్టర్ను వంద మీటర్ల దూరం వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిప్లైన్ రోలర్ అనేది గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ ఒక కేబుల్పై అమర్చిన పుల్లీ ద్వారా ప్రయాణించే సస్పెన్షన్ రైడ్ అని చెప్పారు. సుమారు కిలోమీటరు పొడవుతో 15 నుంచి 50 అడుగుల ఎత్తులో చెట్ల మధ్య రోప్వే ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించామని చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు. వారి వెంట తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఎఫ్ఆర్ఓ చలపతిరావు ఉన్నారు. -
స్వయం ఉపాఽఽధి వైపు మొగ్గు చూపాలి
భధ్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి పథకాల వైపు మొగ్గు చూపాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు వాటి ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం గ్రామస్తులు సోలార్ ద్వారా కరెంట్ లైన్ ఇప్పించాలని, చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన కృష్ణవేణి ఫ్లోర్ మిల్కు రుణం మంజూరు చేయాలని, కరకగూడెం మండలానికి చెందిన అరుణ జీవనోపాధికి, మణుగూరు మండలానికి చెందిన బాబురావు చేనేత మగ్గాలు ఇప్పించాలని, బూర్గంపాడు మండలం శ్రీరాంపూర్ గ్రామస్తులు అంగన్వాడీ, జీపీఎస్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతులు అందించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చేతికొస్తున్న పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ నాయకులు కోరారు. దర్బార్లో ఏపీఓ డేవిడ్రాజ్, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, గిరిజన సంక్షేమ ఈఈ హరీష్, అధికారులు సైదులు, సున్నం రాంబాబు, భాస్కర్, ఉదయ్కుమార్, ఆర్.లక్ష్మీనారాయణ, ఆదినారాయణ పాల్గొన్నారు. కాగా, భద్రాచలం సబ్ కలెక్టరేట్లో తొలిసారి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వాటిని సత్వరమే పరిష్కరించి న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ వారికి హామీ ఇచ్చారు. సులభంగా అర్థమవుతుంది.. దమ్మపేట : విద్యా భోదనలో అభ్యసన సామగ్రి(టీఎల్ఎం)ని ఉపయోగిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని పార్కలగండి బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం టీఎల్ఎం మేళా ఏర్పాటుచేయగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై టీఎల్ఎం మెటీరియల్ను పరిశీలించి, వాటి పని తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీఎల్ఎం ద్వారా ఉపాధ్యాయుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని అన్నారు. ఈ నెల 9న భద్రాచలం ఐటీడీఏ పరిధిలో టీఎల్ఎం మేళా నిర్వహించి, ఉత్తమ ఉపకరణాలను ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓ చంద్రమోహన్, ఎంఈఓ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
చండ్రుగొండ : సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్ సోమవారం పరిశీలించారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యే ప్రదేశాన్ని, నిర్మాణం పూర్తయిన ఇళ్లను సందర్శించారు. పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని, చండ్రుగొండ – బెండాలపాడు రహదారిపై ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చండ్రుగొండలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ను, దామరచర్లలో సభాస్థలిని తనిఖీ చేశారు. కాగా, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా సాయంత్రం పరిశీలించారు. డాగ్స్క్వాడ్ బృందం కూడా హెలీప్యాడ్ను తనిఖీ చేసింది. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఅండ్ఎం డైరెక్టర్గా బాధ్యతల స్వీకరణ
సింగరేణి(కొత్తగూడెం)/ఇల్లెందు: సింగరేణి సంస్థ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్(ఈఅండ్ఎం) డైరెక్టర్గా మోకాళ్ల తిరుమలరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం హైదరాబాద్లో సీఎండీ ఎన్.బలరామ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలలో ఈ అండ్ఎం శాఖ కీలకమైనందున సోలార్, థర్మల్ ప్రాజెక్ట్ విస్తరణలో ముఖ్యపాత్ర పోషించాలని సూచించారు. కాగా, డైరెక్టర్ తిరుమలరావుకు ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లెందు మండలం కట్టుగూడెంకు చెందిన తిరుమలరావు సింగరేణిలో సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తిస్తూ డైరెక్టర్గా ఎంపికవడం ఆనందంగా ఉందన్నారు. 139 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారి ఆదివాసీ అధికారికి డైరెక్టర్ పదవి లభించిందని ఎమ్మెల్యే చెప్పారు. ఆయన వెంట కాంట్రాక్టర్ రాము తదితరులు ఉన్నారు. -
జిల్లాలో అధిక వర్షపాతం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో వర్షపాతం నమోదు సాధారణ స్థాయి నుంచి అధికానికి చేరింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా గణాంకాలు మారిపోయాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 1,834.6 మి.మీ. వర్షం కురవగా జిల్లా సరాసరి 79.8 మి.మీ.గా నమోదైంది. కొత్తగూడెంలో అత్యధికంగా 192.4 మి.మీ. వర్షం కురవడం విశేషం. ఇక కరకగూడెం మండలంలో 59.8 మి.మీ, పినపాకలో 36.4, చర్లలో 96.2, దుమ్ముగూడెంలో 20.2, అశ్వాపురంలో 46.2, మణుగూరులో 33.2, ఆళ్లపల్లిలో 17, గుండాలలో 22.2, ఇల్లెందులో 150.6, టేకులపల్లిలో 69.2, జూలూరుపాడులో 69.6, చండ్రుగొండలో 70, అన్నపురెడ్డిపల్లిలో 105.8, చుంచుపల్లిలో 176.6, సుజాతనగర్లో 82.2, లక్ష్మీదేవిపల్లిలో 133.6, పాల్వంచలో 119.6, బూర్గంపాడులో 18.6, ములకలపల్లిలో 88.2, దమ్మపేటలో 107.6, అశ్వారావుపేట మండలంలో 114.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. భద్రాచలంలో అత్యల్పంగా 4.8 మి.మీ.వర్షం పడింది. ఈ మండలాల్లో అధికం.. ఇప్పటి వరకు జిల్లాలో 14 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వాటిలో అశ్వాపురం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాలు ఉండగా, కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్మగూడెం, ఆళ్లపల్లి, గుండాల, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 23.2 శాతం అధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. -
కొత్త కార్డులకు బియ్యం..
● నేటి నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ ● జిల్లాలో 20,084 నూతన కార్డులు మంజూరు ● 236 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెంపు కొత్తగూడెంఅర్బన్: వర్షాకాలం నేపథ్యంలో వరదలు వస్తే రేషన్షాపుల నుంచి బియ్యం తీసుకోవడం కష్టతరంగా మారవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యం ముందస్తుగా ఒకేసారి అందజేసింది. మూడు నెలల తర్వాత మళ్లీ సోమవారం నుంచి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గోదాంల నుంచి కొన్ని రేషన్షాపులకు బియ్యం చేరగా, మరికొన్ని దుకాణాలకు రేపటి లోగా చేరే అవకాశం ఉంది. నేటి నుంచే పంపిణీ కూడా ప్రారంభించనున్నారు. గత జూలైలో కొత్త రేషన్కార్డులు జారీ చేశారు. అదే క్రమంలో అనర్హులవంటూ 3,390 కార్డులను రద్దు చేశారు. గత మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా 20,084 కొత్త కార్డులను జారీ చేయగా, 36,409 మంది లబ్ధిదారులు అదనంగా పెరిగారు. దీంతో సెప్టెంబర్లో 236 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెంచి పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. కొత్త కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాలు సైతం చేపడుతున్నట్లు వివరించారు. కాగా పలువురు అర్హులు రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు. కమీషన్ జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నందుకు రేషన్ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా కమీషను చెల్లిస్తాయి. ఐదు నెలలుగా కమీషన్ చెల్లింపులు నిలిచిపోవడంతో సోమవారం నుంచి నిరసన తెలపాలని, రేషన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి డీలర్ల అకౌంట్లలో కమీషన్ జమ చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ కూడా చెల్లించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బ్లాక్ మార్కెట్కు తరలిందే అధికం ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి జూన్లో పంపిణీ చేసింది. మూడు నెలలవి ఒకేసారి ఇవ్వడంతో దొడ్డు బియ్యం వచ్చాయంటూ డీలర్లు.. షాపులో ఒక బస్తా దొడ్డు బియ్యం చూపడంతో లబ్ధిదారులు తీసుకోకుండానే వెనుదిరిగారు. డీలర్లు బియ్యానికి బదులు లబ్ధిదారులకు నగదు అందజేసినట్లు తెలుస్తోంది. అనంతరం సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో కిలోకు రూ.5 నుంచి రూ.7 వరకు చెల్లించి లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం కేజీకి రూ.10 కంటే ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా దందా మారలేదనే ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం బ్లాక్ మార్కెట్ తరలకుండా జిల్లా సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో కొత్త రేషన్కార్డులు మంజూరు కావడంతో ఈ నెల 236 ఎంటీఎస్ కోటా అదనంగా పెరిగింది. మూడు నెలల తర్వాత తిరిగి సోమవారం నుంచి రేషన్షాపుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గతంలో ఉన్న లబ్ధిదారులు, ప్రస్తుతం కొత్తగా మంజూరైన కార్డు లబ్ధిదారులు తీసుకెళ్లాలి. –రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిరేషన్షాపులు 443 ఆహారభద్రత 2,72,112 అంత్యోదయ 21,148 అన్నపూర్ణ 03 మొత్తం 2,93,263 కొత్తగా మంజూరైనవి 20,084 ప్రతినెలా పంపిణీ 5,384.762 చేసే బియ్యం (మెట్రిక్ టన్నులు) -
వరదలతో వణుకు
బూర్గంపాడు: పరీవాహక ప్రాంత రైతులను గోదావరి వరదలు వెంటాడుతున్నాయి. పది రోజుల క్రితం వచ్చిన వరదలకు వేల ఎకరాల్లో నీట మునిగి పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, కూరగాయలు, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. గోదావరి వరద తగ్గటంతో రైతులు రెండోసారి పత్తి గింజలు వేసుకున్నారు. దూరప్రాంతాల నుంచి వరినారు తెచ్చుకుని నాట్లు వేసుకున్నారు. ఇంతలోనే మళ్లీ గోదావరి వరద పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి వరద 47.90 అడుగులకు పైగా పెరగటంతో లోతట్టు భూముల్లోకి వరదనీరు చేరింది. దీంతో రెండోసారి సాగు చేసిన పంటలు కూడా నీటమునుగుతున్నాయి. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఇంద్రావతి నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్ల నుంచి కూడా నీటిని గోదావరికి వదులుతున్నారు. కూనవరం వద్ద శబరి ఎగపోటుతో గోదావరి వరద కొంతమేర పెరుగుతోంది. దీంతో రైతులు మరింత చెందుతున్నారు. అయితే రెండు రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవటం ఒకింత ఊరటనిచ్చినట్లయింది. నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం గోదావరి వరదలతో భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఎక్కువ నష్టం జరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక(43అడుగులు) దాటితే ఆయా మండలాల్లోని గోదావరి ఒడ్డున వ్యవసాయ భూముల్లోకి వరదనీరు చేరుతుంది. ఒక్కో అడుగు వరద పెరుగుతుంటే వందల ఎకరాల్లో పంట నీటమునుగుతుంది. రెండో ప్రమాదక హెచ్చరిక(48 అడుగులు) దాటితే వరద ముంపు ఎక్కువగా ఉంటుంది. రెవెన్యూ డివిజన్లో కొన్ని ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక(53 అడుగులకు) వరద చేరితే కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. సుమారు 4 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల్లోకి వరద చేరుతుంది. దీంతో పంట నష్టం మరింత పెరుగుతుంది. బూర్గంపాడు మండలంలోని పెదవాగు, దోమలవాగు, పులితేరువాగు, వెదుర్లవాగు, కిన్నెరసాని ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో గోదావరి 50 అడుగులకు చేరితే రెండువేల ఎకరాల వరకు పంటలు నీటమునుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్నారు. వరదలకు పంటనష్టం జరిగితే వెంటనే సాగు చేసేందుకు వరినారు దొరికే పరిస్థితి లేదు. మెట్టపంటలు వేయాలంటే యాసంగి వరి సాగుకు ఇబ్బందికరమవుతుంది. ఇప్పటికే పంటల సాగు ఆలస్యమైందని భావిస్తున్న రైతులను గోదావరి వరదలు మరింత అవస్థ పెడుతున్నాయి. సెప్టెంబర్ వచ్చినా పంటలు సాగు ఆలస్యమవుతుండటం దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఖరీఫ్ వరి సాగు ఆలస్యమవుతుండటంతో రెండో పంట యాసంగి వరి సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద తీవ్రత పెరిగి పంటలు నీటమునిగితే వానాకాలం పంటల సాగు ఆపేసి రెండో పంట సాగుచేసుకునే ఆలోచనలో కొందరు రైతులు ఉన్నారు.గోదావరి పరీవాహక రైతుల్లో ఆందోళన పత్తి సాగు చేసి మూడు నెలలు కావస్తోంది. ఎరువులు వేద్దామంటే మళ్లీ గోదావరి కాసుకుని ఉంది. మందు వేశాక వరద వస్తే పంట పూర్తిగా దెబ్బతింటుంది. మందు వేయకపోతే అదును దాటిపోతోంది. –చెంచలపు రాములు, రైతు, నాగినేనిప్రోలుపది రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదకు ఏడెకరాల వరి పంట నీటమునిగింది. ఇందులో రెండెకరాల పూర్తిగా దెబ్బతింది. శనివారం వచ్చిన వరదకు మళ్లీ మునిగింది. మళ్లీ వరినాటు వేయాలంటే నారు లేదు. –యడమకంటి లింగారెడ్డి, రైతు, రెడ్డిపాలెం -
ఆయిల్ఫెడ్ రికార్డ్!
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ పామ్ తోటల సాగు విస్తరిస్తోంది. ఈ ఏడాది తోటల నుంచి గెలల దిగుబడి మొదలైన నేపథ్యంలో గతంలో నమోదైన రికార్డులను సైతం అధిగమిస్తోంది. రాష్ట్రంలోని 8 జిల్లాలతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు ముదురు, లేత పామాయిల్ తోటల నుంచి దిగుబడి పెరిగింది. అశ్వారావుపేట, దమ్మపేట మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలకు జూలైలో 38,341.100 మెట్రిక్ టన్నులు రాగా, ఆగస్టులో 9,291.135 మెట్రిక్ టన్నుల గెలలు వచ్చాయి. రెండు నెలల్లో మొత్తం 47,632.235 మెట్రిక్ టన్నుల గెలలు ఫ్యాక్టరీకి చేరాయి. గతేడాది ఇదే కాలంలో 35,810 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. గతంకంటే ఈ సారి దిగుబడి భారీగా పెరగడంతో కొత్త రికార్డు సృష్టించినట్లయింది. పెరగనున్న గెలల ధర? పామాయిల్ టన్ను గెలల ధర మరోసారి స్వల్పంగా పెరగనున్నట్లు తెలిసింది. గత నెలలో టన్ను రూ.18,052 ఉండగా, తాజాగా రూ.1000లోపు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల కంటే ముడి పామాయిల్ టన్ను ధరతోపాటు గెలల దిగుబడి పెరగడంతో ఆగస్టు నెలకు సంబంధించి టన్ను ధర పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెంపునకు సంబంధించిన జీఓ సోమవారం జారీ కానున్నట్లు తెలిసింది. గతేడాది కంటే అధికంగా ఆయిల్పామ్ గెలల దిగుబడి -
47.90 అడుగులకు గోదావరి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47.90 అడుగులుగా నమోదైంది. ఆదివారం ఉదయం 8:54 గంటలకు వరద 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 4 గంటల వరకూ గోదావరి నీటిమట్టం 47.50 అడుగుల వద్ద నిలకడగా కొనసాగింది. అనంతరం 5 గంటల నుంచి స్వల్పంగా పెరుగుతూ 8:54 గంటలకు 48 అడుగులకు చేరింది. దాదాపు ఐదుగంటలపాటు నిలకడగా కొనసాగి, మధ్యాహ్నం 1:05 గంటలకు స్వల్పంగా తగ్గి 47.90 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. రాత్రి 8 గంటల వరకు కూడా గోదావరి నీటిమట్టం 47.90 అడుగుల వద్ద నిలకడగానే ఉంది. సోమవారం తెల్లవారు జామునుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ఆగస్టు 20న ఒకే రోజు మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను దాటి గోదావరి వరద నీరు ప్రవహించింది. 21న 51.9 అడుగులకు చేరుకుని వరద తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగి తగ్గిన నీటిమట్టం -
తపాలా సేవల్లో మార్పులు..
● పాత సేవలను రద్దు చేస్తూ అధునాతన విధానాలు అమలు ● నేటి నుంచి రిజిస్టర్ పోస్టు సేవలు స్పీడ్ పోస్టులో విలీనం ● పోస్టుబాక్స్ల ఎత్తివేతపై ప్రచారం ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవల్లో పెను మార్పు లు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక సాంకేతిక విధానాలతో తపాలా శాఖ దూసుకుపోతోంది. అధునాత సాంకేతిక విధానాలను అవలంభిస్తూ ఈ– సేవలను విస్తరిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ అనేక మార్పులను తీసుకువస్తోంది. సేవలను వేగవంతంగా, ప్రైవేట్ సంస్థలకు పోటీగా నిర్వహించటం కోసం అధునాతన సాంకేతిక విధానాల అమలుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతేగాక పూర్వ కాలం నాటి ఉత్తరాల బట్వాడ, మనియార్డర్ వంటి సేవలే గాక ప్రజల సౌకర్యార్థం అనేక రకాల సేవలు, ప్రభుత్వ పథకాలను తపాలా శాఖ అందిస్తోంది. అందులో భాగంగా పాత విధానాలను కొద్దిగా రద్దు చేస్తూ మరికొన్నింటిలో మా ర్పులు తీసుకొస్తూ.. నూతన విధానాలను అమలు చేస్తోంది. మొబైళ్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకై క దిక్కు తపాలా శాఖ. అయితే పెరిగిన సాంకేతికతకు అనుగుణంగా తపాలాశాఖ అప్గ్రేడ్ అవుతోంది. తాజాగా రిజిస్టర్ పోస్టు సేవా విధానాన్ని మార్చింది. పోస్టు బాక్సుల ఎత్తివేత అంశం తెరపైకి వచ్చింది. ఇక స్పీడ్ పోస్టులే.. రిజిస్టర్ పోస్టు సేవలకు తపాలా శాఖ మంగళం పాడుతోంది. సెప్టెంబర్ 1 (సోమవారం) నుంచి ఈ సేవలను నిలిపి వేస్తున్నట్లు తపాలా శాఖ ఇప్పటికే ప్రకటించగా.. పోస్టల్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రిజిస్టర్ పోస్టు సేవలను పూర్తిగా స్పీడ్ పోస్టు సేవలో విలీనం చేశారు. దేశీయ పోస్టల్ సేవల క్రమబద్ధీకరణ, పనితీరును మెరుగుపర్చ టం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయటం వంటి ప్రక్రియలో భాగంగా స్పీడ్ పోస్టులో రిజిస్టర్ పోస్టును విలీనం చేస్తునట్లు సంస్థ ప్రకటించింది. స్పీడ్ పోస్ట్ అంటే వేగవంతమైన డెలివరీ. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందనే విషయాన్ని ఆన్లైన్లో గుర్తించవచ్చు. ఇది రిజిస్టర్ పోస్టు సేవల్లో లేదు. కాగా, రిజిస్టర్ పోస్టుల వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సప్, జీ–మెయిల్ వంటి డిజిటల్ సేవలు అందుబాటులోకి రావటంతో సమాచార మార్పిడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి. అంతేగాక కొరియర్ వ్యవస్థ పెరిగింది. ఈ ప్రభావం కూడా రిజిస్టర్ వ్యవస్థపై పడింది. గతంతో పోలిస్తే రిజిస్టర్ పోస్టు సేవల వ్యవస్థ ఏకంగా 25 శాతం పడిపోయిందని తపాలా ఉద్యోగులు చెబుతున్నారు. పోస్టు బాక్సులు కనిపించవా..? వందల ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్సుల ఎత్తివేతపై ప్రచారం సాగుతోంది. సోషల్ మీడియాల్లో ఈ అంశం చక్కర్లు కొడుతోంది. దశాబ్దాలుగా నిస్వార్థంగా, నిశ్శబ్దంగా, నిశ్చలంగా, విశ్వసనీయంగా సేవలందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదన్న బాధ పలువురిలో వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై తమకు సమాచారం లేదని, పోస్టు బాక్సుల ఎత్తివేత అవాస్తవమని అధికారులు కొట్టిపారేస్తున్నారు. రిజిస్టర్ పోస్టు సేవలను స్పీడ్ పోస్టులో విలీనం చేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు ఇచ్చారు. తపాలాశాఖ మార్గదర్శకాలను అనుసరించి సేవ లను అందిస్తాం. అధునాతన సాంకేతిక విధానాలతో సేవలను వేగవంతం చేయటం కోసం తపా లా సేవల్లో పలు మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. పోస్టు బాక్సుల ఎత్తివేత ఊహాగానమే. ఎలాంటి ఆదేశాలు లేవు. –వి.వీరభద్రస్వామి, పోస్టల్ సూపరింటెండెంట్, ఖమ్మం డివిజన్ -
● గతేడాది ఇదేరోజు ముంచెత్తిన మున్నేరు ● పరీవాహక బాధితులను ఇంకా వీడని భయం ● ఇప్పటికీ పలు చోట్ల ఖాళీగానే ఇళ్లు ● రిటైనింగ్ వాల్ పూర్తయితే గట్టెక్కుతామని నమ్మకం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎప్పటిలాగే వారంతా రేపటిపై ఆశలతో నిద్రించారు. కానీ తెల్లారేసరికి వారి కలలు ఛిద్రమయ్యాయి. కాయకష్టంతో నిలబెట్టుకున్న గూడు.. ఇతర సామగ్రిని గంగమ్మ తనలో కలిపేసుకోవడంతో కట్టుబట్టలతో మిగిలారు. గతేడాది ఆగస్టు 31న మున్నేరు పరీవాహకంలోని మహబూబాబాద్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ తరహా భారీ వర్షం కురవగా మున్నేటికి పోటెత్తిన వరద ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం కల్లా పరీవాహకంలోని సుమారు 60 కాలనీలు నీటమునిగాయి. మున్నేటికి రికార్డు స్థాయిలో వరద వచ్చి నేటి(సోమవారం)తో ఏడాది అవుతున్న సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. వరద తాండవం ఎగువన భారీ వర్షాలతో గతేడాది ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 1 తెల్లవారుజామున 3 గంటల వరకు 19 అడుగులుగా ఉన్న మున్నేరు వరద ఉదయం 11 గంటలకల్లా 36.9 అడుగులకు చేరింది. వరద 36.9 అడుగులు కాదు 41 అడుగులకు చేరిందని అధికారులు ఆ తర్వాత ప్రకటించారు. అనూహ్యంగా వరద రావడంతో ఖమ్మం నగరం, ఖమ్మంరూరల్ మండలంలోని 60 కాలనీల ప్రజలు కనీస సామగ్రి తీసుకునే వీల్లేకుండానే పునరావాస కేంద్రాలకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా రోజువారీ కూలీలే కాగా.. ఇళ్లలో బురద మేటలు వేసి కొన్ని చోట్ల పూర్తిగా, ఇంకొన్ని చోట్ల పాక్షికంగా నేలమట్టమయ్యాయి. పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న గ్యాస్స్టౌలు, బియ్యం, మంచాలు, దుప్పట్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు తదితర సామగ్రి, దాచుకున్న సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది. వర్షం మొదలైతే భయం మునుపెన్నడూ లేని రీతిలో గత ఏడాది మున్నేటికి వరద రాగా ప్రభావిత కాలనీల ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటుపడుతున్నారు. అయినా చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. ఉలిక్కిపడుతున్నారు. ప్రస్తుత వర్షాలతో మళ్లీ ఎక్కడ వరద వస్తుందోనన్న ఆందోళనతో వారిలో కంటి మీద కునుకు కరువవుతోంది. ప్రస్తుతం మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుండడం కొంత ఊరట కలిగిస్తోంది. కాగా ఒక్కో కుటుంబానికి రూ.16,500 చొప్పున 9,725 మందికి రూ.15.60 కోట్ల ఆర్థిక సాయం అందినా 2,170 కుటుంబాలకు ఎదురుచూపులే మిగిలాయి. ఖాళీగా దర్శనమిస్తూ.. మున్నేరు పరీవాహక ప్రాంతంలోని అనేక ఇళ్లకు ఇంకా టు – లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఏటి సమీపాన దెబ్బతిన్న ఇళ్లకు కొందరు మరమ్మతు చేయించకుండానే వదిలేశారు. ఇళ్లలో ఉంటున్న వారు కూడా ౖపైపె మరమ్మతులు చేయించుకుని.. ఏవైనా కార్యాలు ఉంటే రంగులు వేయించుకుంటున్నామని చెబుతున్నారు. -
కలుపుమందు కలిసిన నీళ్లు తాగి అస్వస్థత
టేకులపల్లి: కలుపు మందు కలిసిన నీటిని తాగడంతో 15 మంది అస్వస్థతకు గురైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తొమ్మిదోమైలుతండాకు చెందిన రైతు జాటోతు రాజు ఆదివారం తన చేనులో మిర్చి నారు వేసేందుకు 14 మంది కూలీలను పిలిపించాడు. పనిచేస్తున్న క్రమంలో కూలీలు తాగునీరు అడగటంతో రైతు అప్పటికే కలుపు మందు వాడిన బిందెలోనే తాగునీరు తీసుకుని వచ్చి తాను తాగడంతో పాటు కూలీలకు ఇచ్చాడు. ఆ నీటిని తాగిన కొంతసేపటికి తొలుత నూనావత్ అంజలి, జాటోతు జ్యోతి, ధరావత్ గాయత్రి, జాటోతు దేవి వాంతులు చేసుకుని కళ్లు తిరిగి కిందపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమవగా మిగతావారు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ నలుగురితో పాటు రైతు జాటోతు రాజు, కూలీలు జాటోత్ పార్వతి, ధరావతు సునీత, దరావత్ శంకర్, దారావత్ సంతు, ధారావత్ సింధు, ధారావతు సరోజ, జాటోతు సునీత, జాటోతు దళ్సింగ్, ఆంగోత్ పద్మ, జాటోతు బాలను స్థానికులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి మణుగూరుటౌన్: గణేశ్ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సాహంతో డీజే మోతలకు డాన్స్ చేస్తున్న మహిళ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి గుట్టమల్లారంలోని జయశంకర్నగర్లో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో రాసమళ్ల ప్రమీల (45) డీజేను అనుకరిస్తూ నృత్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడున్న వారు బాధితురాలిని స్థానిక 100 పడకల ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరు అరెస్ట్ఇల్లెందు: పట్టణంలోని ఇల్లెందు చెరువు కట్ట వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని ముత్తారపుకట్ట గ్రామానికి చెందిన పొడెగు సంపత్, మిట్టపల్లి దొనబండగుంపునకు చెందిన సూర్నపాక మహేశ్ గంజాయి సేవిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటమైసమ్మ ఆలయం వద్ద పొడుగు వరుణ్ తమకు గంజాయి తాగటం అలవాటు చేశాడని వారు తెలిపారు. అయితే, పొడుగు వరుణ్కు జేకేకాలనీకి చెందిన ప్రవీణ్పాసీ గంజాయి సరఫరా చేసినట్లు తెలిపాడని అరెస్టయినవారు విచారణలో తెలిపారు. యువకుడి అదృశ్యందుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు గ్రామానికి చెందిన సిద్ధి రవికుమార్ 5 రోజులుగా కనిపించడం లేదని, దీనిపై కేసునమోదు చేశామని ఆదివా రం సీఐవెంకటప్పయ్య తెలిపారు. సిద్ధి రవికుమార్ గత ఆగస్ట్ 26వ తేదీ సాయంత్రం తన మిత్రుడు దాస రి ప్రశాంత్ ఇంటికి వెళ్లి, అక్కడే భోజనం చేసి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదని, అతడికి అప్పుడప్పుడూ ఫిట్స్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. రవికుమార్ భార్య సిద్ధి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఆటో డ్రైవర్ అదృశ్యంపై కేసు నమోదుఖమ్మంఅర్బన్: నగరంలోని వైఎస్సార్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ అదృశ్యంపై ఆదివారం ఖమ్మంఅర్బన్( ఖానాపురం హవేలీ) పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ కాలనీలో నివసించే పొట్లపల్లి నారాయణ(45) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఆటోతో ఇంటి నుంచి బయలుదేరాడు. అనంతరం తన భార్యకు ఫోన్ చేసి తన మనసు బాగోలేదని చెప్పి కాల్ కట్ చేశాడు. తిరిగి ఆమె ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. బంధువులతో కలిసి గాలించగా నగర శివారు ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలోని సాగర్ ప్రధాన కాల్వ పక్కన ఆటో నిలిపి ఉంది. నారాయణ కనిపించకపోవడంతో భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. ఆటో బోల్తా డ్రైవర్ మృతితిరుమలాయపాలెం: మండలంలోని మాదిరిపురం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించపోయి ఆటో బోల్తా కొట్టడంతో ఆటోడ్రైవర్ మృతిచెందిన ఘటనపై ఆదివారం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపూరం గ్రామానికి చెందిన చిర్రా నరేశ్ (29) శనివారం రాత్రి సమయంలో సుబ్లేడు అత్తగారింటికి తన సొంత ఆటోలో వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఆటో రోడ్డు పక్కకు పల్టీకొట్టింది. నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రజిని కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అథ్లెటిక్స్లో జిల్లాకు 38 పతకాలు
కొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్, పాలమూరు యూనివర్సిటీ స్టేడియంలో శనివారం ముగిసిన రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు 38 పతకాలు వచ్చాయి. ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ వివరాలు వెల్లడించారు. జిల్లా నుంచి 30 మంది పలు కేటగిరిల్లో పాల్గొని 38 పతకాలు (బంగారు పతకాలు–11, రజత పతకాలు–17, కాంస్య పతకాలు–10) సాధించారన్నారు. పినపాకకు చెందిన తోలేం శ్రీతేజా 200 మీటర్ల పరుగుపందెం, హైజంప్లో రెండు బంగారు పతకాలు, భద్రాచలానికి చెందిన ఎం.శ్రీవిద్యదొర 80 మీటర్ల హార్డిల్స్లో బంగారు పతకం, కొత్తగూడెంనకు చెందిన జరుపుల దీక్షిత్ 60 మీటర్లు పరుగుపందెంలో బంగారు పతకం కై వసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులను జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి పరంధామరెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కె.సారంగపాణి, నాగపూరి రమేశ్, గొట్టపు రాధాకృష్ణ, జె.నాగేందర్, గిరిప్రసాద్, డి.మల్లికార్జున్, నాగరాజు, ప్రసాద్ అభినందించారు. -
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర
● దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు పాలన సాగిస్తున్నాయి ● ఓట్ల చోరీపై నేడు పాట్నాలో నిరసన ర్యాలీ ● సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఖమ్మంమయూరిసెంటర్ : ఏకీకృత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు ఖమ్మంలో మాస్లైన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామని, దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, మతోన్మాదం పేరుతో సాగిస్తున్న హింస, ఓట్ల చోరీపై చర్చించామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నాయని, లౌకికతత్వాన్ని, సర్వమత సహజీవన సమాజాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో లక్షలాది మంది బలహీన వర్గాల వారి ఓటు హక్కు రద్దు చేశారని అన్నారు. దీనికి నిరసనగా నేడు(సోమవారం) పాట్నాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు, మహిళలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి దిగుమతిపై సుంకం రద్దును డిసెంబర్ 31 వరకు అమెరికా పొడిగించిందని, ఇది రైతులకు ప్రమాదకరమని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. వర్షాలు కురిసి పంటలు సాగు చేసే సమయంలో రైతుల కు యూరియా అందకుండా పోతోందని, యూరి యా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో పంచాయతీలకు నిధులు మంజూరు కావడం లేదని, దీంతో గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి సుభాష్ దేవ్, కేంద్ర కమిటీ సభ్యులు దేవబ్రత శర్మ, కేజీ రామచందర్, కె.రమణ, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఉమాకాంత్, పూజారి కృష్ణ గోగోయ్, భిమల్ పాండే, వి.కృష్ణ, కె.సూర్యం, సి. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
కుక్కలతో భయాందోళనలో ప్రజలు
అశ్వాపురం: మండలంలోని తుమ్మలచెరువులోపదిరోజులు గా కుక్కలు అర్ధరాత్రి ఇళ్లల్లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి సమయాల్లో కుక్కలు మంచాల కింద చేరడం, పిల్లల పక్కన చేరు తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రంతా నిద్రాహారాలు మాని కంటి మీద కునుకు లేకుండా కర్రలు పట్టుకొని కుక్కలు ఇంట్లోకి రాకుండా కాపలా కాస్తున్నారు. అవి పిల్లలు, వృద్ధులను ఎక్కడ కరుస్తాయో నని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైలుకింద పడి వృద్ధురాలు మృతిఎర్రుపాలెం: స్థానిక రైల్వేస్టేషన్లో ఆదివారం ఓ వృద్ధురాలు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే హెడ్కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన మిద్దె మేరమ్మ (72) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం రైల్వేస్టేషన్కు చేరుకుని గూడ్సు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి కేసు నమోదు చేశారు. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సుఖమ్మంఅర్బన్: నగర పరిధి లోని గోపాలపురం వద్ద ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టగా మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి.. ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన పొలిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మి (45) దంపతులు ద్విచక్రవాహనంపై ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. గోపాలపురం వద్దకు రాగానే ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న భద్రాచలం డిపో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతిచెందింది. గాయపడిన వెంకటేశ్వర్లును 108ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిన్నెరసానిలో సండే సందడి
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా పోటెత్తారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 448 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.20,835, 120 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్కు రూ.9,820 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. సందర్శించిన ఖమ్మం జడ్జి.. కిన్నెరసాని రిజర్వాయర్ను ఖమ్మం జిల్లా న్యాయమూర్తి రాజగోపాల్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. డీర్పార్కులో దుప్పులను, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం రిజర్వాయర్లో బోటు షికారు చేశారు. ఒక గేటు ఎత్తివేత.. ఎగువన కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలయాశానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల వరద రావడంతో ఆదివారం నీటిమట్టం 405.10 అడుగులకు పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు. ఒకరోజు ఆదాయం రూ.30,655 -
దివ్యాంగుల్లో సామర్థ్యాలను గుర్తించాలి
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగులు ప్రత్యేక సామర్థ్యాలు గలవారని, వాటిని గుర్తించి భవిష్యత్లో వారు రాణించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సమగ్ర శిక్ష, ఆలింకో ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ దివ్యాంగుల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ఉచితంగా అందించే ఉపకరణాలు పొందాలని సూచించారు. జిల్లాలోని 17 మండలాల్లో దివ్యాంగులు విద్యనభ్యసించేలా భవిత కేంద్రాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ మాట్లాడుతూ దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడకుండా సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డీఈఓ బి.నాగలక్ష్మి, జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్, ఎస్కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్. సతీష్ కుమార్, అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ. నాగరాజశేఖర్, ఆలింకో డాక్టర్లు ప్రియా శర్మ, వికాస్, ప్రధానోపాధ్యాయులు మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. మేకల పెంపకాన్ని ప్రోత్సహించాలి.. సూపర్బజార్(కొత్తగూడెం): గ్రామీణ ప్రాంతాల్లో మేకల పెంపకం, షెడ్ల నిర్వహణ, పశుగ్రాస ఉత్పత్తి తదితర అంశాలపై రైతులకు, పశువుల కాపరులకు అవగాహన కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మేకల పెంపకం, మేకపాలు, ఉత్పత్తుల తయారీపై ఉత్తరప్రదేశ్లో శిక్షణ పొందిన ముగ్గురు పశు వైధ్యాధికారులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. శాసీ్త్రయ పద్ధతుల్లో మేకల పెంపకం, స్థానిక మేక జాతుల అభివృద్ధి, కృత్రిమ గర్భధారణ, మెరుగైన విత్తనపు పోతుల లభ్యత, పశుగ్రాస రకాలు, దాణా మిశ్రమ పధార్థాల లభ్యత, సమయానుకూల ఆరోగ్య పరిరక్షణ చర్యలు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామం నుంచి ఇద్దరు ఔత్సాహిక పశుపోషణ రైతులను ఎంపిక చేసి పై అంశాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రామవరం, సారపాక, చండ్రుగొండ పశువైద్య కేంద్రాల డాక్టర్లు జి. అనందరావు, సీహెచ్ బాలకృష్ణ, వి.సంతోష్ పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి. పాటిల్ -
అదే వరుస.. తీరని గోస
ఇల్లెందురూరల్/పినపాక/చండ్రుగొండ/మణుగూరుటౌన్ : ప్రస్తుతం అప్పుడప్పుడూ తెరపినిస్తూ కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలంగా ఉండగా.. పంటలకు ఎరువులు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న, పత్తి, వరి పంటలకు యూరియా వేసే తరుణం కావడం, డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో ఆ ఎరువు కోసం ప్రతీ చోట రైతులు బారులుదీరుతున్నారు. తెల్లవారకముందే విక్రయ కేంద్రాల వద్దకు చేరుకుని, క్యూలో నిల్చునే ఓపిక లేక చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను లైన్లో పెట్టి పక్కన కూర్చుంటున్నారు. జిల్లాలోని ఇల్లెందు, పినకపా, మణుగూరు, చండ్రుగొండ తదితర ప్రాంతాల్లో శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇల్లెందు మండలం కొమరారం కేంద్రానికి 450 బస్తాల యూరియా రాగా అంతకుమించిన సంఖ్యలో రైతులు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పినపాకలో గత మూడు రోజులుగా యూరియా ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చండ్రుగొండ మండలం గానుగపాడులో శనివారం తెల్లవారకముందే భారీగా చేరుకున్న రైతులు క్యూలో నిల్చున్నా.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మణుగూరు మండలానికి 60 – 70 టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 10 రోజులుగా దిగుమతి కాలేదు. శుక్రవారం 10 టన్నుల మేర వచ్చిందనే విషయం తెలుసుకున్న రైతులు శనివారం తెల్లవారుజామునే చెప్పులు క్యూలో పెట్టి నిరీక్షించారు. ఇప్పటికై నా తమ ఇక్కట్లు తొలగించి సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు. యూరియా కోసం రైతుల నిరీక్షణ -
కేటీఆర్ పర్యటన విజయవంతం చేయండి
సూపర్బజార్(కొత్తగూడెం)/అశ్వారావుపేటరూరల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తగూడెం, అశ్వారావుపేటలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కేటీఆర్ పర్యటనతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా రైతులకు సరిపడా యూరియా అందించలేకపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదని, విద్యుత్ కోతలు లేవని అన్నారు. కేసీఆర్ పాలనలో 30 జిల్లాలకు 30 మెడికల్ కళాశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ హయాంలో ఆయా స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందించడం లేదని విమర్శించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, సోయం లక్ష్మి, మందపాటి మోహన్రెడ్డి, యూఎస్ ప్రకాశ్రావు, సున్నం నాగమణి, వగ్గెల పూజ, సంకా ప్రసాద్, సంపూర్ణ, కాసాని చంద్రం, వెంకన్న, నారం రాజశేఖర్ పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా -
నిలకడగా గోదావరి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శుక్రవారం ఒక్కసారిగా పెరిగి రాత్రి 11 గంటలకు 44.70 అడుగులకు చేరుకుంది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు 46.10 అడుగులు ఉండగా.. ఉదయం 6 గంటలకు 46.50, 9 గంటలకు 46.90, 11 గంటలకు 47.10 అడుగులుగా నమోదైంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు 47.30, 3 నుంచి రాత్రి 7 గంటల వరకు 47.40 అడుగుల వద్ద నిలకడగా ప్రవహించింది. 8 గంటలకు స్వల్పంగా పెరిగి 47.50 అడుగులకు చేరుకుంది. ఆదివారం ఉదయం వరకు నిలకడగా ఉండి, మధ్యాహ్నం నుంచి నెమ్మదిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. ఎగువ ప్రాంతాల్లో భారీగానే నీరు ఉన్నప్పటికీ ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో డ్యామ్ల వద్ద గేట్లు మూసి ఉంచారు. రానున్న రెండు, మూడు రోజుల్లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తం చేసిన అధికారులు.. భద్రాచలం వద్ద శుక్రవారం రాత్రి 7:22 నిమిషాలకు గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటడంతో అధి కారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే నది ఒడ్డున ఉన్న స్లూయీస్ల వద్ద భారీ మోటార్లను సిద్ధం చేసి ఉంచారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంత ప్రజల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి వరద నీరు చేరే అవకాశం ఉంటే ముందస్తుగా సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. -
పోరుకు సన్నద్ధం
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సెప్టెంబర్లో ఎన్నికలకు సిద్ధమంటూ కేబినెట్ ఆమోదం తెలపగా.. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి శనివారం లేఖ అందించింది. దీంతో వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది. అటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి రిజర్వేషన్ల అంశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతేడాది లోక్సభ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలకూ పోలింగ్ జరుగుతుందని భావించినా.. రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఈసీకి లేఖ అందించడంతో మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై ఆశావాహుల్లో కొంత అయోమయం నెలకొంది. రెండు విడతల్లో ఎన్నికలు.. ఈసారి స్థానిక ఎన్నికల పోలింగ్ను రెండు విడతల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ, పరిషత్ ఎన్నికలను రెవెన్యూ డివిజన్ల వారీగా మూడు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. దీన్ని ప్రస్తుతం మార్పు చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. జిల్లాలో తొలివిడతలో అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల మండలాల్లో, మలి విడతలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్లు, బాక్సులు రెడీ.. ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సిబ్బంది, నోడల్ అధికారుల నియామకం పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న బ్యాలెట్ బాక్సులతో పాటు గతంలో కర్ణాటక నుంచి మరికొన్నింటిని తెప్పించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిమిత్తం జంబో బాక్సులు 1,811, మీడియం బాక్సులు 351 అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మరో 1,000 బాక్సులు అదనంగా తెిప్పించనున్నారు. జిల్లాలో ఎన్నికలు జరిగే 471 గ్రామ పంచాయతీల్లో 4,168 వార్డులు ఉన్నాయి. ఇక జెడ్పీటీసీ స్థానాలు 22, ఎంపీటీసీ స్థానాలు 233 ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించి స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచారు. పంచాయతీ ఎన్నికలకు10,223 మంది, పరిషత్ ఎన్నికలకు 8,711 మంది సిబ్బంది అవసరమని అధికారులు గుర్తించారు. పంచాయతీ ఎన్నికలకు 4,242, పరిషత్లకు 1,271 పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు.‘స్థానిక’ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా పోలింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. ఈసారి రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు చేశాం. జిల్లాలోని 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం. –బి.నాగలక్ష్మి, జెడ్పీ సీఈఓ -
వణికిస్తున్న జ్వరాలు..
భద్రాచలంఅర్బన్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. ఇటీవల వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, చికున్ గున్యా, డెంగీ తదితర వ్యాధులతో ప్రతీ ఇంట్లో ఇబ్బంది పడ్డారు. అయితే జిల్లాలో వైరల్ ఫీవర్లే ఎక్కువగా వ్యాప్తి చెందినా పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ బూచి చూపుతూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పరిసరాలు పరిశుభ్రంగా ఉంచకపోవడం, ఖాళీ స్థలాల యజమానులు వాటిలో పేరుకుపోయిన చెత్త, పిచ్చిమొక్కలు, నీటి నిల్వలు తొలగించకపోవడంతో దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో మలేరియా, డెంగీ కేసులు అధికం కాగా, ఎక్కువగా చిన్నారులే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో వైరల్ జ్వరాలు, చికున్ గున్యా, టైపాయిడ్, డెంగీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు నెలల్లో పలు మండలాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 70 డెంగీ, 54 మలేరియా, ఒక చికున్ గున్యా, 130 టైఫాయిడ్, 29,595 వైరల్ జ్వరాల కేసులు నమోదయ్యాయి. కాగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి వివరాలు నమోదు చేస్తుండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే వారి లెక్కలు తేలడం లేదు. ఆయా యాజమాన్యాలు జ్వర బాధితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యారోగ్య శాఖకు అందించకపోవడంతో జ్వరపీడితుల సంఖ్య స్పష్టంగా తెలియడం లేదు. పర్యవేక్షణ లోపం.. జ్వరంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగానే డెంగీ, ఇతర పరీక్షల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 40 నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతీరోజు ఒక్కో ఆస్పత్రికి 40 నుంచి 80 మందికి పైగా జ్వరంతో వస్తుండగా వారిలో ఆరు నుంచి 10 మందిని అడ్మిట్ చేసుకుంటున్నారు. అంతేకాక నిబంధనలకు విరుద్ధంగా థైరాయిడ్, డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర టెస్టులు చేసి ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తున్నారు. డెంగీ కోసం ప్రత్యేకంగా ఎన్ఎస్–1, ఎలీసా టెస్ట్ చేయాల్సి ఉండగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం కేవలం ఎన్ఎస్–1 టెస్ట్ చేసి డెంగీ సోకిందంటూ ఆస్పత్రిలో చేర్చుకుంటున్నారు. డెంగీ రాకున్నా వచ్చినట్లు చూపించి ప్లేట్లెట్స్ (రక్త కణాలు) తగ్గాయంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరిని నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఆస్పత్రిలో ఉంచి రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు.జిల్లాలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. జబ్బుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలి. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలి. పరిశుభ్రమైన వేడి ఆహారాన్నే తీసుకోవాలి. – డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్ఓ ప్రైవేట్ ఆస్పత్రుల్లో, ల్యాబ్ల్లో ఎన్ఎస్–1 టెస్ట్ మాత్రమే చేసి డెంగీ అని నిర్ధారించరాదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలీసా టెస్ట్ చేశాక అందులో పాజిటివ్ వస్తేనే డెంగీ ఉన్నట్టు. అంతే తప్ప ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా టెస్ట్లు చేసి అడ్మిట్ చేసుకోవద్దు. ఇలాంటివి మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ చైతన్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ, భద్రాచలం -
అధ్వానం ఆశ్రమ పాఠశాల
టేకులపల్లి/సింగరేణి(కొత్తగూడెం): టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల అధ్వానంగా మారిందని, హాస్టల్ వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ ఆరోపించారు. సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థి పోరుబాట యాత్ర శుక్రవారం టేకులపల్లి మండలానికి చేరుకోగా శనివారం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. హాస్టల్లో వెలుగుచూసిన సమస్యలను నాయకులు వెల్లడించారు. మరుగుదొడ్లు, వంట పాత్రలు, మంచినీటి ట్యాంకులు, విద్యార్థులు పడుకునే డార్మెంట్లు, డైనింగ్ హాల్, పాఠశాల ఆవరణం అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కట్టెలతో వంటచేసి, గ్యాస్ బండలు వాడినట్లు బిల్లులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలీలను ఏర్పాటు చేసుకొని వర్కర్ల నుంచి కూలీల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని, దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం యాత్ర కొత్తగూడెం చేరుకోగా పృథ్వీ మాట్లాడుతూ.. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరా రు. నాయకులు మునిగెల శివప్రశాంత్, బి.సాయి కుమార్, రామ్చరణ్, అబ్దుల్ గని, విష్ణువర్ధన్, జార్జ్, శ్రావణి, సంధ్య, తదితరులు పాల్గొన్నారు. -
చెరువులకు జలకళ..
పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్: గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద నీరు చేరుతుండగా అన్నీ జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులు ఉండగా 877 చెరువులు ఆలుగు పోస్తున్నాయి. మరో 1,487 చెరువుల్లో 75 నుంచి 100 శాతం మేర నీరు చేరింది. పాల్వంచ మండలం రేగులగూడెంలోని ఎర్రసాని చెరువు నిండగా, మందెరకలపాడు వద్దగల రాళ్లవాగు పికప్ డ్యామ్ అలుగుపోస్తోంది. కిన్నెరసాని వాగు, సోములగూడెం, సూరారం, నాగారం వద్ద నిర్మించిన చెక్డ్యామ్లోకి వరదనీరు చేరగా పొంగిపోర్లుతున్నా యి. అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో గల చిన్న కుంటలు, చెరువులతోపాటు ప్రాజెక్టుల్లో వరదనీరు చేరగా ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. జిల్లాలో అరకొరగా నిండిన చెరువుల కింద సాగుచేసిన రైతులు పంట పూర్తయ్యే వరకు సాగునీరు అందుతుందో లేదోననే కలత చెందుతున్న తరుణంలో ఇటీవలి వానలతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. దీంతో ఇక పంటలకు ఢోకా లేదని చెబుతున్నారు. -
లక్ష్యానికి చేరలేక..
మణుగూరుటౌన్: వార్షిక బొగ్గు ఉత్పత్తి సాధనలో భాగంగా నెలల వారీగా నిర్దేశిత లక్ష్యాలు సాధించే అంశంలో ఎప్పుడూ ముందుండే మణుగూరు.. మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతో వెనుకబడింది. వర్షాలతో ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఓబీ వెలికితీతకు, బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నా.. అడపాదడపా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఒక్కో సారి గనుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా ఓబీ వెలికితీతలో వెనుకంజ, బొగ్గు ఉత్పత్తిలో నెలవారీ లక్ష్యాలను సాధించలేకపోతోంది. ఈ ఏడాది ఆగస్టు వరకే అధికం గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మాసం కంటే ఈ ఏడాది ఇప్పటివరకు కురిసిన వర్షమే అధికం. ఫలి తంగా ఓబీ వెలికితీతలో వెనుకంజలో ఉన్నా మని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది మణుగూ రు ఏరియాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,165 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, గతేడాది ఆగస్టు వరకు కురిసిన వర్షాని కంటే 18శాతం ఎక్కువ ఈ ఏడాది నమోదైంది. గతేడాది ఆగస్టు వరకు 49.88 లక్షల టన్నులకు గాను 46.49 లక్షల టన్నులు 93 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఓబీ వెలికితీతలో 66 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 48.61 లక్షల క్యూబిక్ మీటర్లు వెలికితీసి 74 శాతం సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 44.18 లక్షల టన్నులకు గాను 45.32 బొగ్గు ఉత్పత్తి సాధించి 103 శాతం నమోదైంది. అయితే, నెలవారీగా లక్ష్యాలకు వర్షం ఆటంకం ఏర్పడినా ఇది స్టాక్ కోల్ వల్లే సాధ్యమైందని అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. నెలల వారీగా నిర్దేశించిన ఓబీ వెలికితీత లక్ష్యాల సాధనలో ఏప్రిల్లో 89 శాతం ఓబీ వెలికితీయగా, మే నెలలో 81 శాతం, జూన్లో 86.9 శాతం, జూలైలో 60 శాతం, ఆగస్టులో 76 శాతం మాత్రమే వెలికితీశారు. ఏరియా వెనుకంజ మణుగూరుఏరియాలో ఆగస్టులో 7.58 లక్షల టన్నుల బొగ్గుకు గాను 5.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి(77శాతం) నమోదైందని జీఎం దుర్గం రాంచందర్ తెలిపారు. ఆయన శనివారం వివరాలు వెల్లడిస్తూ.. తీవ్ర వర్షప్రభావంతో అనుకున్న లక్ష్యా న్ని సాధించలేకపోయామని చెప్పారు. ఆగస్టులో 614 మి.మీ.వర్షపాతంతో 12 లక్షల క్యూబిక్ మీట ర్ల ఓబీ వెలికితీతకు గాను 9.10 లక్షల క్యూబిక్ మీట ర్లు వెలికితీశామన్నారు. మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాల ద్వారా ఉత్పత్తివ్యయం తగ్గింపు, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై కార్మికుల్లో అవగాహన కల్పిస్తున్నామని, యంత్రాల వినియోగం పెంచి లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు. సమావేశంలో అధికారులు రమేశ్, శివప్రసాద్, రాంబాబు, శ్రీనివాస్, వీరభద్రం, రమేశ్, జ్యోతిర్మయి పాల్గొన్నారు. -
మొదలైన కేటీపీఎస్ సొసైటీ నామినేషన్లు
పాల్వంచ: కేటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. స్థానిక కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రాంగణంలోని కోఆపరేటివ్ సొసై టీ కార్యాలయం వద్ద పోటాపోటీగా పలువురు ఉద్యోగులు డైరెక్టర్ పోస్టులకు నామినేషన్లు వేశారు. మొత్తం 3,003 ఓట్లకు గాను కేటీపీఎస్లో 2,106, బీటీపీఎస్లో 501, వైటీపీఎస్ లో 396 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల అధికారి జి. గంగాధర్, జిల్లా కోఆపరేటివ్ అధికారి ఎ. శ్రీని వాస్ ఆధ్వర్యంలో మొత్తం 13 డైరెక్టర్ పోస్టు లకు తొలిరోజు 23మంది అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించారు. గత పాలకవర్గంలో ఉన్న డైరెక్టర్లు దానం నర్సింహారావు, మహేందర్, కేశులాల్నాయక్, ధర్మరాజుల నాగేశ్వరరావు సైతం మరోసారి నామినేషన్లు దాఖలు చేశారు. సోమ, మంగళవారాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 1535, టీఆర్వీకేఎస్కు చెందిన అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, బండి నాగరాజు, అల్లాడి పుల్లారావు, నారందాసు వెంకటేశ్వర్లు, రాసూరి శ్రీనివాస్, తోట అనిల్కుమార్ నామినేషన్లు వేశారు. రిటైర్డ్ పోలీసులకు సన్మానంకొత్తగూడెంటౌన్: పలు పోలీస్ స్టేషన్లలో విధు లు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు పోలీసులను ఎస్పీ రోహిత్రాజు శనివా రం తన చాంబర్లో సన్మానించారు. సన్మానం పొందినవారిలో రామవరం టూటౌన్, అశ్వాపురం, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐలు ఖాజా మక్బూద్అలీఖాన్, కొత్తా నాగేశ్వరరావు, మందపల్లి ప్రసాద్, జూలురుపాడు, ఇల్లెందు ఏఎస్ఐలు కుక్కమళ్ల కోటేశ్వరరావు, చిన్న ధన్పాల్, ము లకలపల్లి హెడ్ కానిస్టేబుల్ కన్నిడి వెంకటేశ్వ ర్లు ఉన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఏఓ మంజ్యానాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి, ఎంటీఓ సుధాకర్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మహిళా కళాశాలలో వర్క్షాప్సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో ‘మోటివేషనల్ ఇన్నోవేషన్ సపోర్ట్ ట్రైనింగ్ ఫర్ యంగ్ ఉమెన్ ఎన్పవర్మెంట్’అంశంపై ఒకరోజు రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొ ఫెసర్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కమతం శ్రీనివాస్, నేలకొండపల్లి ప్రభు త్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రమేశ్ హాజరై ప్రసంగించారు. వ్యాపారంలోని అడ్డంకులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ సీఎస్ వెంకటాచారి, కరస్పాండెంట్ జీకే కిరణ్కుమార్, కళాశాల ప్రిన్సి పాల్ శారద మాట్లాడారు. కార్యక్రమంలో కామర్స్ హెచ్ఓడీ రజని, అధ్యాపకులు మాణిక్యాంబ, కృష్ణవేణి, శైలజ పాల్గొన్నారు. పత్తిపంట ధ్వంసం పాల్వంచరూరల్: మండలంలోని మందెరకలపాడు పంచాయతీ ఒంటిగుడిశ గ్రామానికి చెందిన గిరిజన రైతులు లక్ష్మయ్య, పాండు, నారాయణ, సింగు చాంతకొండ రేంజ్ పరిధిలోని బంగారుచెలక పత్తి సాగుచేశారు. ఈ పంటను శనివారం వైల్డ్లైఫ్ సిబ్బంది ధ్వంసం చేశారని బాధిత రైతులు తెలిపారు. స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీటేకులపల్లి: ఆగి ఉన్న స్కూల్ బస్సును వెనుక నుంచి బొగ్గు లారీ ఢీకొట్టిన ఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. రామవరంలోని బిల్డింగ్ బ్లాక్స్ హైస్కూల్కు చెందిన బస్సు పాఠశాలకు వస్తున్న క్రమంలో శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్రోడ్ వద్ద విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో టేకులపల్లి నుంచి వేగంగా వచ్చిన బొగ్గు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సులోని ఓ చిన్నారికి స్వల్పంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. నలుగురు జీఎంల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో వివిధ విభాగాలకు చెందిన నలుగురు జీఎంలను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్ఓడీ మురళీధర్రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం రీజియన్ క్వాలిటీ మేనేజ్మెంట్ జీఎం దేబులాల్ బైద్యను నైనీ ఏరియా జీఎంగా, నైనీ ఏరియా జీఎం సంజయ్ మనోజ్ ముదార్ను రామగుండం రీజియన్ క్వాలిటీ మేనేజ్మెంట్ జీఎంగా, కార్పొరేట్ ఎస్టేట్స్ జీఎం రాధాకృష్ణను మందమర్రి ఏరియా జీఎంగా, మణుగురు ఏరియా పీకేఓసీ ఏజీఎం టి. లక్ష్మీపతిగౌడ్ను కార్పొరేట్ ఎస్టేట్స్ హెచ్ఓడీగా బదిలీచేశారు. -
ముంపు ప్రాంతాల నుంచి గర్భిణుల తరలింపు
భద్రాచలంఅర్బన్: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు 81 మంది గర్భిణులను తరలించారు. వారిలో 35 మంది గర్భిణులకు డెలి వరీ చేశారు. ప్రసవం అయిన వారు డిశ్చార్జ్ కాగా, కొందరు లేబర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు మండలం నుంచి వచ్చిన గర్భిణులు ప్రసవించిన తరువాత కూడా ఏరియా ఆస్పత్రిలోనే ఉండాలని, ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఉన్న క్రమంలో ఆ ప్రాంతవాసులను డిశ్చా ర్జ్ చేయొద్దని శనివారం అడిషనల్ డీఎంహెచ్ఓ సైదులు, భద్రాచలం డిప్యూటీ డీఎంహెచ్ఓ చైత న్య.. లేబర్ వార్డు సిబ్బందిని ఆదేశించారు. కాగా, తమను డిశ్చార్జ్ చేయాలని, వరద ఉన్నా నుడుచుకుంటూ వెళ్తామని చింతూరు ప్రాంత బాలింతలు చెబుతున్నారు. కాగా, ఎవరైనా ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతారేమననే అయోమయ స్థితిలో ప్రస్తుతం లేబర్ వార్డు సిబ్బంది ఉన్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన న్యాయమూర్తులు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో మూడో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వనం వినయ్కుమార్ శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే, వినయ్కుమార్ను జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు సన్మానించారు. ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామిశెట్టి రమేశ్, డీకొండ రవికుమార్తో పాటు లగడపాటి సురేశ్, నిమ్మల మల్లికార్జున్, ఈ.మీనాకుమారి, జి.ప్రమీల, హెచ్.సత్యనారాయణ పాల్గొన్నారు. అలా గే, భద్రాచలం అదనపు జ్యూడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ దుర్గాభవాని కూడా జిల్లా జడ్జి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు.నిరుద్యోగ యువతకు ‘నవ లిమిటెడ్’ చేయూతపాల్వంచ: నిరుద్యోగ యువతకు నవ లిమిటెడ్ సంస్థ చేయూతగా నిలుస్తోందని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కె.సంజీవరావు తెలిపారు. పాల్వంచలోని నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుక్రవారం ఆయన సర్టిఫికెట్లు అంజేసి మాట్లాడా రు. యువత ఉపాధి అవకాశాలు అందిపుచ్చు కునేలా వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించా లని సూచించారు. నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (సీఎస్ఆర్) ఎంజీఎం ప్రసాద్ మా ట్లాడు తూ.. ఇప్పటివరకు 1,711 మందికి పైగా శిక్షణ ఇవ్వగా, పలువురు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో జన రల్ మేనేజర్ ఎన్.సురేశ్చంద్ర, లైజన్ ఆఫీసర్ ఖాదరేంద్ర బాబు, మేనేజర్ సీహెచ్.శ్రీనివాసరావు, యూ ఎస్ఎన్.శర్మ, బిన్ను, సాయి, శ్రావణ్, శ్యాం, అలీ తదితరులు పాల్గొన్నారు.పచ్చదనం, పరిశుభ్రత ఆధారంగా రేటింగ్కొత్తగూడెంఅర్బన్: పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నట్లు డీఈఓ బి.నాగలక్ష్మి తెలిపారు. కొత్తగూడెంలో ఉపాధ్యాయులకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు. రేటింగ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అందుకోసం ప్రతి పాఠశాల నుంచి పూర్తి వివరాల తో తప్పనిసరిగా సెప్టెంబర్ 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లా కోఆర్డినేటర్ ఎస్కే సైదులు మాట్లాడుతూ.. 2021లో ఇదే కార్యక్రమం ద్వారా జిల్లా పాఠశాలలు జాతీయస్థాయికి ఎంపికయ్యా యని గుర్తు చేశారు. అదేస్ఫూర్తితో ఈసారి కూడా అవార్డులు పొందేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయా లని పేర్కొన్నారు. శిక్షణలో జిల్లా రిసోర్స్ పర్స న్లు స్వరూప్కుమార్, కోటేశ్వరరావు ఆన్లైన్ నమోదు, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు ఎస్కే సైదులు, ఎ.నాగరాజు శేఖర్, ఎన్.సతీశ్కుమార్, మండల రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.సీతారామ కెనాల్ నిర్మాణానికి భూసర్వేజూలూరుపాడు: మండలంలో సీతారామ ప్రా జెక్టు ప్రధాన కాల్వ నిర్మాణం కోసం శుక్రవారం భూసర్వే నిర్వహించారు. కెనాల్ నిర్మాణం 104 కి.మీ. మేర పూర్తి కాగా, మిగిలిన కాల్వ నిర్మా ణం కోసం భూసేకరణ పెండింగ్లో ఉంది. ఈ విషయంలో స్పష్టత లేక పాపకొల్లు, రాజారా వుపేట, భోజ్యాతండా రైతులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యాన కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆదేశాల మేరకు పాల్వంచ ఎస్డీసీ కార్తీక్ పర్యవేక్షణలో జూలూరుపాడు తహసీల్దార్ టి.శ్రీనివాస్ ఆధ్వర్యాన సర్వే చేపట్టారు. సుమారు 2.5కి.మీ. మేర కెనాల్ భూ సేకరణ కోసం సర్వేయర్ ప్రవీణ్ తదితరులు సర్వే నిర్వహించారు. సర్వే పూర్తయితే సీతారామ మెయిన్ కెనాల్ కింద భూములు కోల్పోయిన పాపకొల్లు, రాజారావుపేట, భోజ్యాతండా రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం అంద నుంది. ఆర్ఐ సీహెచ్.ఆదినారాయణ, సర్వేయర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ మొదటి హెచ్చరిక
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. గురువారం రాత్రి తగ్గుముఖం పట్టిన వరద శుక్రవారం తెల్ల వారుజామున ఒంటి గంటకు 36.40అడుగులుగా నమోదైంది. ఆతర్వాత ఉదయం 7గంటల వరకు తగ్గినా.. మళ్లీ పెరగడం మొదలైంది. ఉదయం 11గంటలకు 37అడుగులు, మధ్యాహ్నం ఒంటి గంటకు 38.20అడుగులు, సాయంత్రం 3గంటలకు 39.90, నాలుగు గంటలకు 40.80, 5 గంటలకు 41.50, 6 గంటలకు 42.20 అడుగులకు చేరడమే కాక రాత్రి 7–22 గంటలకు 43 అడుగులుగా నమోదు కావడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆతర్వాత కూడా గోదావరికి వరద చేరుతూ నీటిమట్టం పెరుగుతుండగా రాత్రి 11గంటలకు 44.70 అడుగులుగా నమోదైంది. అయితే, గురువారం వరద తగ్గుముఖం పట్టడంతో ఏజెన్సీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటుండగానే మళ్లీ పెరుగుతుండడంతో ఎప్పుడేం జరుగుతోందనని ఆందోళనకు గురవుతున్నారు. బయటకు రావొద్దు గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యాన వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతేనే తప్ప బయటకి రావొద్దని అధికారులు సూచించారు. సమస్య ఎదురైతే డయల్ 100కు లేదా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. అలాగే, కరకట్ట ప్రాంతంలో భక్తులు, స్థానికులు నదిలోకి వెళ్లకుండా మైక్ ద్వారా సిబ్బంది ప్రచారం చేస్తున్నారు.భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి -
ఇంకా సాధారణమే..
సూపర్బజార్(కొత్తగూడెం): వర్షాలు దంచి కొడుతున్నా జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ వర్షాకాలం వర్షాలు ఆశించినస్థాయిలో కురవలేదు. అయినప్పటికీ వాయుగుండాల కారణంగా వర్షాలు కురుస్తుండడంతో ఆమా త్రం అయినా వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. జూన్లో సాధారణ వర్షపాతం 169.1 మి.మీ.కు గాను 134.4 మి.మీ.గా నమోదవడంతో 20.5లోటు ఏర్పడింది. ఇక జూలైలో సాధారణ వర్షపాతం 312.7 మి.మీ.కు 378.9 మి.మీ కురిసి 21.2శాతం అధికవర్షపాతం నమో దైంది. అలాగే, ఈనెల ఇప్పటి వరకు 269 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 369.9 మి.మీ గా కురవడంతో 30.1 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా జిల్లాలోని 23 మండలాల్లో సరాసరి 15మి.మీ. వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఒకేరోజు 32.9 మి.మీ. దాదాపు జిల్లా అంతటా గురువారం వర్షం కురిసింది. దీంతో జిల్లా సగటు 32.9 మి.మీ.గా నమోదైంది. అధికంగా జూలూరుపాడులో 73.2 మి.మీ., దమ్మపేట మండలంలో 67.6మి.మీ, అన్నపురెడ్డిపల్లి మండలంలో 62.6మి.మీ., ములకలపల్లి మండలంలో 62.4 మి.మీ., చండ్రుగొండ మండలంలో 66.2 మి.మీ., లక్ష్మీదేవిపల్లి మండలంలో 38.8 మి.మీ., టేకులపల్లి మండలంలో 38.4 మి.మీ., కొత్తగూడెంలో 36.4 మి.మీ., సుజాతనగర్ మండలంలో 35.6 మి.మీ., అశ్వారావుపేట మండలంలో 34 మి.మీ., పాల్వంచ మండలంలో 33.6 మి. మీ., ఇల్లెందు మండలంలో 30.6 మి.మీ., గుండా ల మండలంలో 28.4 మి.మీ., చుంచుపల్లి మండ లంలో 24.8 మి.మీ.తో పాటు కరకగూడెం మండ లంలో 24.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇతర మండలాల్లో వర్షప్రభావం ఉంది. 11 మండలాల్లో అధికం.. జూన్ 1వ తేదీ నుంచి జిల్లాలోని 11 మండలాల్లో ఇప్పటివరకు అధికవర్షపాతం నమోదైంది. ఈ జాబితాలో మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట మండలాలు ఉన్నాయి. అలాగే, కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపు రం, ఆళ్లపల్లి, గుండాల, అన్నపురెడ్డిపల్లి, లక్ష్మీదేవిపల్లి, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో ఇప్పటికీ సాధారణ వర్షపాతమే నమోదైంది. వరి, మిర్చి మినహా.. ఈ వానాకాలంలో జిల్లాలో అన్ని పంటలు కలిపి 5,91,714ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే, సీజన్ ప్రారంభంలో వర్షాలు మందకొడిగా ఉండడంతో సాగు నెమ్మదిగా మొదలైంది. ఆ తర్వాత వర్షాల ఆధారంగా పంటల సాగు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే సాధారణ విస్తీర్ణం కంటే 8,859 ఎకరాల మేర ఎక్కువగా పంటలు సాగు చేయగా.. మొత్తం 6,00,673 ఎకరాల్లో సాగైనట్లు అధికారులు గుర్తించారు. వరి సాధారణం కంటే 13,906 ఎకరాల్లో ఇంకా నాట్లు వేయాల్సి ఉంది. అలాగే, మిర్చి సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 10,283 ఎకరాల్లో ఇంకా పంట మొదలుకాలేదు. మిగతావన్నీ అంచనాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యాయని అధికారులు చెబుతున్నారు. -
పెన్షన్ విద్రోహ దినం పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా ల్లో పెన్షన్ విద్రోహదినం జరుపుతున్నట్లు టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ రామారావు, సెక్రటరీ జనరల్ సంగం వెంకటపుల్లయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట పెన్షన్ విద్రోహదినం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పాల్వంచ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులతో మాహా బైక్ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో జేఏ సీ భాగస్వామ్య పక్షాలైన సంఘాలు,డ్రైవర్ల సంఘం, సీపీఎస్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గణపయ్యకు ఘన నైవేద్యం
మణుగూరు అశోక్నగర్ వాసవీనగర్లో ప్రతిష్ఠించిన గణనాథుడికి శుక్రవారం భక్తులు 108 రకాల పిండివంటలతో నైవేద్యాలు సమర్పించారు. ఉదయం మహిళలు సామూహిక కుంకుమ పూజ చేశారు. ఆతర్వాత ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు, లడ్డూలు తదితర 108 రకాల పిండివంటలతో నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. – మణుగూరు టౌన్ -
50 కేజీల గంజాయి స్వాధీనం
పినపాక: మండలంలో భారీ మొత్తంలో గంజా యి స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐదుగురుని అదుపులోకి తీసుకున్నా రు. సీఐవెంకటేశ్వర్లు శుక్ర వారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. ఒడి శా నుంచి హైదరాబాద్కు ఓ వ్యక్తి పల్సర్ బైక్పై ఎస్కార్ట్గా వస్తుండగా మరో నలుగురు వ్యక్తులు మూడు కార్లలో గంజాయి రవాణా చేస్తున్నారు. పినపాక ఎక్స్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా రూ.25లక్షల విలువైన 50 కేజీల గంజాయి లభించింది. నిందితులు పల్లెపు శ్రీకాంత్, దాసరి వెంకటేశ్వరరావు, మడకం రాజు, కొండూరి వినయ్, తంబళ్ల పుల్లారావును అదుపులోకి తీసుకుని, మూడు కార్లు, ఒక బైక్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తాదమ్మపేట: క్రూడ్ పామాయిల్ లోడ్తో వెళ్తున్నట్యాంకర్ బోల్తా పడిన ఘటన మండలంలోని కొమ్ముగూడెం శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడుకు 25 టన్నుల క్రూడ్ పామాయిల్ లోడుతో ఒక ట్యాంకర్ బయలుదేరింది. ఈ క్రమంలో ఆ లారీ కొమ్ముగూడెం శివారులో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీడ్రైవర్, క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ట్యాంకర్ నుంచి ఆయిల్ నష్టం కూడా జరగలేదు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. అండర్–15 విభాగంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా నుంచి బ్యాడ్మింటన్ క్రీడలో ఎందరో ఉన్నత స్థాయికి చేరారని, ఈ వారసత్వాన్ని యువత కొనసాగించాలని సూచించారు. బ్యాడ్మింటన్ శిక్షణకు అన్ని వసతులు ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఎస్పీ జి.వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కర్నాటి వీరభద్రం మాట్లాడుతూ జిల్లా నుంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను తీర్చిదిద్దడమే తమ ధ్యేయమన్నారు. డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి మాట్లాడగా కార్పొరేటర్ కమర్తపు మురళి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.చంద్రశేఖర్తో పాటు ిసిరిపురపు సుదర్శన్, పి.రవిమారుత్, పి.యుగంధర్, దుద్దుకూరి సత్యనారాయణ, జట్ల శ్రీను, కొంగర శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీ క్వార్టర్కు చేరిన టోర్నీ రాష్ట్రస్థాయి అండర్–15 బ్యాడ్మింటన్ పోటీలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. బాలబాలికల నాకౌట్ పోటీలు శుక్రవారం రాత్రి పూర్తయ్యాయి. శనివారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రలు విక్రయిస్తే చర్యలు
కొత్తగూడెంఅర్బన్: అర్హత కలిగిన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భస్రావ మాత్రలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ జయలక్ష్మి హెచ్చరించారు. కొత్తగూడెంలో శుక్రవారం నిర్వహించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో లింగ నిష్పత్తి తగ్గుతున్న నేపథ్యాన అక్రమ గర్భస్రావాల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. ఈమేరకు అనధికార అమ్మకాల కట్టడికి సహకరించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, అదనపు డీఎంహెచ్ఓ సైదులు, వైద్యులు మధువరన్, తేజశ్రీ, ఫయీజ్ మొహినుద్దీన్ పాల్గొన్నారు. -
‘పెదవాగు’ పునర్నిర్మాణానికి కృషి చేయండి
అశ్వారావుపేటరూరల్: జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ను అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపాన పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులు మాజీ మంత్రి జలగం ప్రసాద్తో కలిసి హైదరారాబాద్లో శుక్రవారం కలిశారు. గతేడాది జూలై 18వ తేదీన కురిసిన భారీ వర్షంతో ప్రాజెక్టు ప్రధాన ఆనకట్టకు గండ్లు పడ్డా యి. ఆ తర్వాత తాత్కాలికంగా రింగ్ బండ్ నిర్మించినా ప్రాజెక్టు పున:నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రెండు రాష్ట్రాలకు చెందిన ఆయకట్టు రైతులతోపాటు మాజీ మంత్రి జలగం ప్రసాద్ నేతృత్వాన హుస్సేన్నాయన్ను కలిసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పున:నిర్మించేలా కృషిచేయాలని కోరా రు. రైతులు పుట్టా సత్యం, చిమడబోయిన శ్రీను, గారపాటి పుల్లారావు, శెట్టిపల్లి కృష్ణారెడ్డి, సాయిల వీరబాబు, డేరంగుల దుర్గయ్య, కొండపాటి శ్రీరామచంద్రమూర్తి, కంగాల కల్లయ్య, చాపర్ల శ్రీనివాసరావు, పద్దం రమేశ్, కొర్రి రామా రావు, కుంజా విజయ్ పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ సభ్యుడికి వినతి -
క్రెడిట్ సొసైటీ ఎన్నికలకు నోటిఫికేషన్
● పాల్వంచలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● వచ్చేనెల 10న ఓటింగ్, అదేరోజు ఫలితాలు పాల్వంచ: కేటీపీఎస్, బీటీపీఎస్, వైటీపీఎస్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ (పాల్వంచ) ఎన్నికలకు నోటి ఫికేషన్ను ఎన్నికల అధికారి జి.గంగాధర్ శుక్ర వా రం విడుదల చేశారు. శనివారం, సోమ, మంగళవారాల్లో నామినేషన్లను పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఆ తర్వాత 3వ తేదీన నామినేషన్లు పరిశీలించి ఉపసంహరణల అనంతరం తుది జాబితా విడుదల చేయ డంతో పాటు బరిలో మిగిలిన అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. వచ్చేనెల 10వ తేదీన పాల్వంచలోని డీఏవీ హైస్కూల్, మణుగూరు బీటీపీఎస్లోని ఎస్పీఎఫ్ భవనం, నల్లగొండ జిల్లా దామరచర్ల వైటీపీఎస్లోని స్టోర్స్ ఆఫీస్లో బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్లను పాల్వంచ డీఏవీ స్కూల్కు చేర్చి అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 3,008 ఓట్లు గతంలో కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలోనే కోఆపరేటివ్ ఉద్యోగుల సొసైటీ కొనసాగేది. అయితే, పాత ప్లాంట్ను మూసివేయడమే కాక కొత్తగా బీటీపీఎస్, వైటీపీఎస్ ప్లాంట్ల నిర్మాణంతో పలువురు ఉద్యోగులు అక్కడకు బదిలీపై వెళ్లారు. దీంతో ఇక్కడి సొసైటీ సభ్యులు ఆయా కర్మాగారాల్లో విధులు నిర్వహిస్తుండగా వారూ ఓటింగ్లో పాల్గొనేలా మూడు చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సొసైటీలో మొత్తం 3,008 మంది సభ్యులు ఉండగా, కేటీపీఎస్లో 2,100, బీటీపీఎస్లో 504, వైటీపీఎస్లో 404 మంది ఓటు వేయనున్నారు. కాగా, మొత్తం 13 డైరెక్టర్ పోస్టులకు ఎన్నిక జరుగుతుండగా ఏడు జనరల్, రెండు బీసీ జనరల్కు, ఎస్సీ జనరల్, ఉమెన్, ఎస్టీ జనరల్, ఉమెన్కు ఒక్కో పోస్టు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 15 మంది బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. -
యూరియా కోసం అవస్థలు
ఇల్లెందురూరల్: మండలంలో యూరియా విక్రయం కోసం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మూడు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు విక్రయ కేంద్రం వద్ద వందల సంఖ్యలో రైతులు యూరియా కావాలంటూ బారులు తీరుతున్నారు. ఇప్పటివరకు ఆదార్కార్డు ఆధారంగా యూరియా విక్రయించిన అధికారులు రద్దీ అధికం కావడంతో పట్టాదారు పాస్పుస్తకం జిరాక్స్ చూపిస్తేనే పంపిణీ చేస్తామని శుక్రవారం నిజాంపేట విక్రయ కేంద్రం వద్ద షరతు పెట్టారు. ఈ విషయంలో రెండు రోజులుగా పట్టాదారు పాస్పుస్తకాలు లేని రైతులు విక్రయ కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రైతుల సంఖ్యకు అనుగుణంగా యూరి యా స్టాక్ లేకపోవడంతో ముందుగా రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి టోకెన్లను అందజేస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా ఇల్లెందు సీఐ సురేశ్ బందో బస్తు నిర్వహించారు. మధ్యాహ్నం తరువాత పోలీస్పహారాలో టోకెన్ నంబర్ల వారీగా పిలిచి యూరియా విక్రయాలు చేపట్టారు. తెల్లవారు జామునే విక్రయ కేంద్రం వద్దకు చేరుకున్న రైతులు ఒక్క బస్తా కోసం క్యూౖ లెన్లో నిలబడి ఆధారాలు అందజేసి టోకెన్ అందితే మధ్యాహ్నంతరువాత యూరియా తీసుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య దాడులుపాల్వంచ: స్థానిక కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం యూరియా పంపిణీ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. యూరియా బస్తాలను ఆటోల్లో పంపిస్తుండగా కోడిపుంజుల వాగు పూసలతండాకు చెందిన ఓ మహిళకు, హమాలీలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మహిళా రైతు తొలుత హమాలీపై చేయిచేసుకోగా, ఆటోడ్రైవర్ ఘర్షణకు దిగాడు. హమాలీ ముఠా సభ్యులు భారీసంఖ్యలో అక్కడికి చేరుకుని తిరిగి మహిళ, ఆటోడ్రైవర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆటోడ్రైవర్ అంబేడ్కర్సెంటర్వైపు పరుగులు తీయగా, వెంటపడి హమాలీలు దాడికి పాల్పడ్డారు. పోలీస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ విషయమై ఎస్ఐ సుమన్ను వివరణ కోరగా హమాలీలు ఫిర్యాదు చేశారని, బస్తాలు వేసి డబ్బులు ఇవ్వకుండానే ఆటో తీసుకెళ్తుండగా అడిగినందుకు దాడి చేశారని వెల్లడించారు. -
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృత అభిషేకం పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. తొలుత అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించిన అర్చకులు మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం చేయడంతో పాటు పంచ హారతులు సమర్పించారు. ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు. సాఫీగా యూరియా సరఫరా ములకలపల్లి: రైతులు ఇబ్బంది పడకుండా యూరియా సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) బాబూరావు సూచించారు. ములకలపల్లి పీఏసీఎస్ను శుక్రవారం తనిఖీ చేసిన ఆయన గోదాంలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు యూరియా అమ్మకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఆత్మ డీపీఓ సరిత, ఏఓ అరుణ్బాబు, ఏఈఓ సుజాత, సీఈఓ కుంచారపు శ్రీనివాసరావు, గోదాం ఇన్చార్జ్ బొమ్మకంటి కామేశ్ పాల్గొన్నారు. ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా మంగపతిరావుఖమ్మం సహకారనగర్: ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్గా కూరపాటి మంగపతిరావు నియమితులయ్యారు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను కోఆర్డినేటర్గా నియమిస్తూ ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కోఆర్డినేటర్గా ఉన్న మద్దినేని పాపారావు ఖమ్మం అర్బన్ మండలం పుట్టకోట హైస్కూల్ ఎస్ఏగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా, మంగపతిరావు శనివారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
అంతా.. మనీ అమ్మా!
దమ్మపేట మండలం చీపురుగూడెం బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాసిరకమైన భోజనం పెడుతున్నారని ఆరోపించిన వీడియోలు ఈనెల 3న సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తనిఖీ చేయగా కుళ్లిపోయిన టమాటాలతో కూర వండిన విషయం బయటపడింది. ఆ తర్వాత 13వ తేదీన అంకంపాలెం గిరిజన గురుకుల బాలికల కళాశాలలో తనిఖీ చేస్తే పలుకులుగా ఉన్న అన్నం, కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు. ఐటీడీఏ పరిధి విద్యాసంస్థల్లో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యానికి ఈ రెండు ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఆ అధికారి వల్లే అంతా...భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 50 ఆశ్రమ పాఠశాలలు, 20వసతి గృహాలు, 20 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. గడిచిన ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థల నిర్వహణ అధ్వానంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. విద్యావ్యవస్థ గాడి తప్పడానికి ఆ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అఽధికారి వ్యవహర శైలే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగత లాభమే లక్ష్యంగా సదరు అధికారి అధికారం చెలాయిస్తుండడం, ‘మనీ’ ముట్టచెబితే చాలు అక్రమాలను చూసీచూడనట్లు వదిలేసే ఆ అధికారి అక్రమాలకు అడ్డు చెప్పేవారే లేక విద్యావ్యవస్థలో ఒక్కో విభాగం నిర్వీర్యమవుతుందనే విమర్శలు వస్తున్నాయి.. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
● ధ్యాన్చంద్ జీవితం అందరికీ ఆదర్శం ● క్రీడాదినోత్సవంలో కలెక్టర్ పాటిల్ కొత్తగూడెంటౌన్: మేజర్ ధ్యాన్చంద్ జీవితం అందరికీ ఆదర్శనీయమని.. ఆయన స్ఫూర్తిగా విద్యా ర్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో శుక్రవారం జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాన్ని తెలుసుకుని క్రీడల్లో రాణించేలా ప్రోత్సాహం అందించాలని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులకు పతకాలు ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలకు కలెక్టర్ పాటిల్ పతకాలు అందజేశారు. అండర్–9 బాలికల విభాగంలో ఫాతిమా, పి.అతిదిప్రియ, రజిత, డి.భవంతి, అండర్–10లో కె.సహస్ర, ఎల్.నాగజేశ్విత, ఎస్కే సైమా, పుండరీకాక్ష, అండర్–11లో జి.మాన్విత, జె.ప్రశాంతి, ఎస్కే సైమా వరుసగా మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆయా కార్యక్రమా ల్లో జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం. పరంధామరెడ్డి, వివిధక్రీడా అసోసియేషన్ల బాధ్యులు యుగేంధర్రెడ్డి, నరేశ్, ఎర్రా కామేశ్, వై.వెంకటేశ్వ ర్లు, సావిత్రి, షమీవుద్దీన్, యాకూబ్, కిరణ్, కోచ్ లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కాగా, కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద శనివారం సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు తెలపండి.. సూపర్బజార్(కొత్తగూడెం): గ్రామ పంచాయతీ లు, వార్డుల వారీగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్తో కలిసి వివిధ పార్టీల ప్రతినిదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 471 జీపీల్లో మొత్తం 6,69,024 ఓటర్లకు గాను పురుషులు 3,25,033, మహిళలు 3,43,967 మంది, ఇతరులు 24 మంది ఉన్నారని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 సాయంత్రంలోగా లిఖిత పూర్వకంగా మండల కార్యాలయాల్లో అందించాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం సెప్టెంబర్ 2న తుది ఓటర్ల జాబితా వెలువరిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ చంద్రమౌళి, వివిధ పార్టీల నాయకులు లక్ష్మణ్, బాలప్రసాద్, రేగా కాంతా రావు, సలిగంటి శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, నరేందర్, నోముల బాలు, ఎ.రాంబాబు పాల్గొన్నారు. సెర్ప్ కోఆర్డినేటర్ల బదిలీ కౌన్సెలింగ్ డీఆర్డీఓ పరిధి 83 క్లస్టర్లలో ఉన్న 93 మంది సెర్ప్ కోఆర్డినేటర్లకు శుక్రవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. కలెక్టర్ పాటిల్, డీఆర్డీఓ విద్యాచందన నేతృత్వాన ఈ కౌన్సెలింగ్ జరిగింది. స్పౌజ్ కేటగిరీ, 70 శాతం పైబడిన వైకల్యం, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. అడిషనల్ డీఆర్డీఓ బి.నీలయ్య, సూపరింటెండెంట్ కె.వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధి, భక్తులకు సేవలు
ఈఓగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్రావుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈఓ దామోదర్రావు తెలిపారు. ఇదే సమయాన భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తానని వెల్ల డించారు. ఈఓగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించగా.. తొలుత ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన దామోదర్రావు మాట్లాడారు. భద్రాచలం ఆర్డీఓగా పని చేసిన అనుభవం ఉందని, ఇటీవల మాడ వీధుల విస్తరణలో భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఆలయంలో వైదిక కమిటీ, అర్చకులు, పండితులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని వెల్లడించారు. ఆలయ అభివృద్ధికి తగిన ప్రతిపాదనలను రూపొందించి అమలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కాగా, నిత్యాన్నదానానికి సంబంధించి బ్యాంకులో డిపాజిట్ రూ.70 లక్షలు చేసే పత్రంపై దామోదర్రావు తొలి సంతకం చేశారు. ఆలయ ఏఈఓ భవానీ రామకృష్ణ, ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులుతో పాటు ఉద్యోగులు, అర్చకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
బూర్గంపాడు: వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాప్తి చెందుతున్నందున ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. బూర్గంపాడు మండలం ఉప్పుసాకలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, ఒడ్డుగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డార్మెటరీ హాళ్లు, డైనింగ్ హాళ్లు, వంట గదులు, సామగ్రిని పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు మెనూ ప్రకారంపరిశుభ్రమైన పౌష్టికాహారం అందిస్తూ ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, వార్డెన్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటే మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పారు. కాగా, ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపు వివరాలు, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్ఓకు సూచించారు. ఒడ్డుగూడెం జీపీఎస్లో తనిఖీ సందర్భంగా ఉద్దీపకం వర్క్బుక్–2 ఆధారంగా బోధనపై పీఓ రాహుల్ ఆరా తీశారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
కష్టపడి చదివితేనే లక్ష్యసాధన
● తల్లిదండ్రుల త్యాగాలను వృథా కానివ్వొద్దు ● ‘ఎర్త్ సైన్స్’ ఓరియంటేషన్లో కలెక్టర్ పాటిల్ కొత్తగూడెంఅర్బన్: తల్లిదండ్రుల త్యాగాలను నిత్యం గుర్తుచేసుకుంటూ వారి కష్టం వృథా కాకుండా విద్యార్థులు చదవాలని.. తద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తొలి బ్యాచ్ ఇంజనీరింగ్, బీఎస్సీ విద్యార్థులకు శుక్రవారం ఓరియెంటేషన్ ఏర్పాటుచేశారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రామచంద్ర, జియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లికార్జునరెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్ల లను ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు పంపేందుకు ఆందోళన చెందుతారని తెలిపారు. కానీ ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా చదివేలా యూనివర్సిటీలో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా శ్రద్ధగా చదవాలని సూచించారు. తాను చదివే సమయాన సరైన సౌకర్యాలు లేక కి.మీ. నడిచే వెళ్లేవాళ్లమని.. అయినా మంచి ఉపాధ్యాయులు, ల్యాబ్ సౌకర్యాలు ఉండడంతో ఈ స్థాయికి చేరానని తెలిపారు. జిల్లాలో బొగ్గు గనులు, భారజల కర్మాగారం వంటివి ఉన్నందున ఇక్కడ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటుచేశారని, ఫలితంగా విద్యార్థులు ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తూ చదువు పూర్తిచేయొచ్చని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాము, ప్రొఫెసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తొలి బ్యాచ్లో సీటు రావడం అదృష్టంగా భావిస్తున్నా. యూనివర్సిటీతో పాటు తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా విద్యనభ్యసిస్తా. కలెక్టర్ ప్రసంగం మాలో ఎంతగానో స్ఫూర్తిని నింపింది. – విసెష్, హైదరాబాద్బొగ్గుగనుల ప్రాంతంలో పెరగడం వల్ల మైనింగ్ కోర్సుపై మక్కువ పెరిగింది. అందుకే మైనింగ్ విభాగంలో సీటు ఎంచుకున్నా. మైనింగ్ కోర్సు పూర్తి చేసి సింగరేణిలో ఉద్యోగం సాధించడమే లక్ష్యం. – శివమల్లిక, మంచిర్యాల -
అందుబాటులోకి అత్యాధునిక యంత్రం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధి మెయిన్ వర్క్షాపులో అత్యాధునిక సీఎన్సీ పాలిగన్ మిల్లింగ్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రాన్ని గురువారం సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ ఎం) సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంత్రం ద్వారా అత్యంత వేగం, కచ్చితత్వంతో కూడిన సేవలు అందుతాయని తెలిపారు. సమస్యల గుర్తింపు, పరిష్కారంతో పాటు బొగ్గు ఉత్పత్తి పెంచడంతో ఈ యంత్రం దోహదపడుతుందని చెప్పారు. అనంతరం ఈనెల 31న ఉద్యోగవిరమణ చేయనున్న డైరెక్టర్ సత్యనారాయణను ఉద్యోగులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీఎం(ఈ అండ్ ఎం) ఎన్.దామోదర్రావు, ఏజీఎం రాజీవ్కుమార్, గుర్తింపు సంఘం నాయకులు ఎస్.వీ.రమణమూర్తి, పీతాంబరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆర్ఎంపీ నిర్వాకం..
అశ్వారావుపేట: అశ్వారావుపేటకు చెందిన ఓ ఆర్ఎంపీ మిడిమిడి జ్ఞానం.. ఖమ్మంలోని డయాగ్నస్టిక్ సెంటర్, ఓ ఆస్పత్రితో కమీషన్ల కక్కుర్తి వెరసి ఓ ఇమామ్(ముస్లిం మత గురువు) ప్రాణాపాయ స్థితికి చేరాడు. అశ్వారావుపేట బీసీ కాలనీ మసీద్ ఇమామ్ షేక్ హసాన్ సాలెం హష్మీ వారం క్రితం గ్యాస్ సమస్యతో నొప్పిగా ఉందని స్థానిక ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. రెండు ఇంజక్షన్లు చేశాక సత్తుపల్లిలోని స్కానింగ్ సెంటర్కు పంపించి వైద్యం చేయించినా ఫలితం కానరాలేదు. తిరిగి అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రిలో పరీక్షించగా స్కానింగ్ కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే, ఖమ్మంలో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లనివ్వకుండా ఆర్ఎంపీకి పరిచయం ఉన్న ఓ డాక్టర్, డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు, వైద్యం చేయించేలోగా దాచుకున్న డబ్బంతా ఖర్చయింది. అయినా పరిస్థితి మెరుగపడకపోవడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరేసరికి ప్లేట్లెట్లు 10వేలకు పడిపోయాయని, శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం అవుతోందని తేల్చారు. చికిత్సకు రూ.లక్షల్లోనే ఖర్చవుతుందని చెప్పడంతో షేక్ హసాన్ దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట రింగ్ సెంటర్లో రోడ్డు పక్కన టిఫిన్ అమ్మే మాబు కుమారుడు ఈయన చికిత్స కోసం దాతలు చూయూతనివ్వాలని పలువురు కోరుతున్నారు. కాగా, దాతలు 96760 81119(షేక్ షరీఫ్ అహ్మద్) నంబర్కు ఫోన్ పే ద్వారా సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఇమామ్ -
భద్రాచలంలో నిమజ్జనానికి ఏర్పాట్లు
భద్రాచలంఅర్బన్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వినాయక ప్రతిమలను భద్రాచలం వద్ద గోదావరిలో నిమజ్జనానికి భక్తులు తీసుకొస్తారు. ఈమేరకు నిమజ్జన ఘాట్లో ఏర్పాట్లను గురువారం ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించి సూచనలు చేశారు. గోదావరిలో వరద పెరుగుతున్నందున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులను లోపలికి అనుమతించొద్దని సూచించారు. రెస్క్యూ టీంను అందుబాటులో ఉంచాలని తెలిపారు. తొలుత ఘాట్ను భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సైతం పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. ఇక గోదావరిలోకి భక్తులను అనుమతించబోమని వెల్లడించినందున గ్రామపంచాయతీ అధికారులు కరకట్ట మెట్ల వద్ద షవర్ ఏర్పాటుచేశారు. అలాగే, వాహనాలు దిగబడకుండా ఘాట్ వద్ద చదును చేయిస్తున్న అధికారులు బ్రిడ్జి వద్ద వీధి దీపాలకు మరమ్మతు చేయిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మధు, టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ సతీష్ కుమార్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వయోజనులకూ ఓనమాలు..
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 38,310 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరినీ అక్షరాస్యులుగా మార్చే క్రమాన తరగతుల ప్రారంభానికి ముందు అక్షర వికాసం(వాచకం), ఇతర బోధన సామగ్రి, సెల్ ఫోన్పై అవగాహన కల్పిస్తారు. అలాగే, ఉల్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా చూస్తారు. అభ్యాసకుల కోసం డీజీహెచ్ ఉన్న వారి ఇళ్లలో చానల్ ద్వారా ప్రసారాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగూడెంఅర్బన్: ప్రతీ ఒక్కరికి కనీస విద్యాజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యాన నవభారత్ సహకారంతో ఈ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కానుంది. శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే జిల్లాలో 3,810 మంది వలంటీర్లను ఎంపిక చేసి మండలాల వారీగా శిక్షణ పూర్తి చేశారు. ప్రతీ గ్రామపంచాయతీ నుంచి ఇద్దరు రిసోర్స్పర్సన్లు, ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వగా, స్వచ్ఛందంగా బోధన చేయడానికి ముందుకొచ్చే వారికి శిక్షణ ఇస్తారు. చదవడం.. రాయడం ప్రత్యక్షంగానే కాక, ఆన్లైన్లోనూ నిరక్షరాస్యులకు బోధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక అక్షరాస్యతను పెంపొందించడం, వృత్తి, జీవన నైపుణ్యాలు మెరుగుపర్చడమే కాక చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం వంటివి నేర్పిస్తారు. చిన్నతనం నుంచి విద్యావకాశాలు పొందని వారు, 15ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనుకూలమైన ప్రదేశాల్లో... స్వచ్ఛందంగా బోధన చేసే వారి వీలు ఆధారంగా మండలాల్లో ఎంచుకున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాలు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, స్థానిక సాంస్కృతిక కేంద్రాలు, లైబ్రరీలు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అయితే సీఎస్ఆర్ కింద సంబంధిత సంస్థల వారు బోధనాభ్యసన సామగ్రి, డిజిటల్ పరికరాలు, మౌలిక, సాంకేతిక సదుపాయాలు కల్పించి, అక్షరాస్యతా మేళాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా, అభ్యాసకులు, స్వచ్ఛంద బోధకులు ఉల్లాస్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా htts:/ ullas. education. gov. in/ nilp/ register వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా, స్వచ్ఛంద బోధకులకు విద్యాక్రెడిట్లును ప్రదానం చేయాలని వయోజన విద్యాశాఖ నుంచి విద్యాశాఖాధికారులకు ఆదేశాలు అందాయి. ఎనిమిదో తరగతి ఆపై చదివే వారు నిరక్షరాస్యులకు బోధన చేసే అవకాశమున్నందున ఆసక్తి ఉన్న వారు ముందుకొస్తే, వారి విద్య మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ‘ఉల్లాస్’తో నిరక్షరాస్యుల్లో వెలుగులు -
సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగలు
భద్రాచలం/భద్రాచలంటౌన్: కుల, మత తామతమ్యం లేకుండా జరుపుకునే పండుగలు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని కలెక్టర్జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలం బస్టాండ్ సమీపాన అశోక్నగర్ కాలనీలో భద్రాద్రి మహారాజ్ వినాయక భక్తమండలి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాధుడికి బుధవారం వారు పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలుత విగ్రహాన్ని ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ ఆవిష్కరించారు. అలాగే, ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో జరిగిన వేడుకల్లో పీఓ పాల్గొన్నారు. భద్రాద్రి మహారాజ్ కమిటీ సభ్యులు, భక్తులు, ఐటీడీఏ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.గణపతి ఉత్సవాల్లో కలెక్టర్, ఐటీడీఓ పీఓ -
పాఠశాలలోకి పాము
దమ్మపేట: మండలంలోని నెమలిపేట గ్రామ కాలువకు వరద ఉధృతి పెరగడంతో పక్కనే ఉన్న ఇళ్లు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు చేరుకుంది. కాలువ ప్రవాహంలో వచ్చిన ఓ పాము.. వరద నీటిలో పాఠశాల ప్రాంగణంలోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.ఐదుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ అశ్వారావుపేట రూరల్: అశ్వారావుపేటలో డంపింగ్ యార్డు వద్ద బుధవారం సాయంత్రం పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.2,910 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై టి.యయాతి రాజు తెలిపారు. షోరూమ్లో బైక్ దొంగతనం.. కూనవరం రోడ్డులో పట్టుకున్న పోలీసులు భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులో గల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ షోరూమ్లోని ఓ బైక్ను ఈ నెల 26 అర్ధరాత్రి ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈవిషయమై 27న ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో షోరూమ్ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన పోలీసులు బుధవారం సాయంత్రం ఆ బైక్ దొంగను పట్టణంలోని కూనవరం రోడ్డులో పట్టుకున్నారు. స్టేషన్కు తరలించి విచారించగా.. దుమ్ముగూడెంకు చెందిన కణితి వెంకటేశ్వర్లుగా తేలిందని పోలీసులు తెలిపి అతడిపై కేసు నమోదు చేశారు. చెట్లు నరికిన వ్యక్తికి జరిమానా.. ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం గ్రామపంచాయతీ పరిధిలో రహదారి పక్కన నాటిన అవెన్యూ ప్లాంటేషన్లోని మొక్కలను పోలారం గ్రామానికి చెందిన రైతు ఆంగోత్ రాంబాబు బుధవారం నరికాడు. ఈ చెట్ల ద్వారా మొక్కజొన్న చేనులో కోతుల బెడద ఎక్కువైనందున నరికినట్లు రైతు చెబుతున్నాడు. గురువారం పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి కిరణ్ అనుమతులు లేకుండా నరికిన ఐదు చెట్లకు గాను రూ.5వేలు జరిమానా విధించి రశీదు అందించారు. మొక్కలు నరికిన స్థానంలో పది మొక్కలు నాటాలని షరతు విధించినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ప్రసూతి మరణాలు అరికట్టేలా అవగాహన కొత్తగూడెంఅర్బన్: ప్రసూతి మరణాలు లేకుండా చూడాల్సిన అవసరముందని జిల్లా వైద్యా, ఆరోగ్యశాఖాధికారి జయలక్ష్మి తెలిపారు. గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రసూతి మరణాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రసూతి మరణాలను నివారించడానికి కౌన్సెలింగ్, ఆరోగ్య విద్య కీలకమని, ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడం, మెరుగుపర్చడం, రోగులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు నిరంతరం అవగాహన కల్పించడం వలన ప్రసూతి ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చవచ్చారు. ఈ సందర్భంగా చంద్రుగొండ, ఎంపీ బంజారా, కొమ్రారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వైద్యాధికారులు హాజరై ప్రతి కేసుపై సమగ్ర నివేదికలను సమర్పించారు. ఈ సమావేశంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వి.మధువరన్, డాక్టర్ పి.స్పందన, డాక్టర్ భూపాల్రెడ్డి, డిప్యూటీ డెమో ఎండీ ఫైజ్మోహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సింగరేణి(కొత్తగూడెం)/సత్తుపల్లి రూరల్: మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి వ్యాప్తంగా రోజుకు లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజూ 1.94లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉండగా, కేవలం 94వేల టన్నులకే పరిమితమవుతోంది. తద్వారా మూడు రోజుల్లో 3లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. అలాగే, సంస్థ వ్యాప్తంగా ఓవర్ బర్డెన్ తొలగింపు కూడా నిలిచిపోయింది. ఓసీల్లో క్వారీల్లో నిలిచిన వర్షపు నీటిని ప్లాన్టూన్ పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నారు. కాగా, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు పనులు నిలిచిపోగా, ఓసీల్లో చేరిన నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నామని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు.రోజుకు లక్ష టన్నుల ఉత్పత్తికి ఆటంకం -
‘స్థానిక’ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో సులువుగా విజయం సాధించొచ్చని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాగా, వచ్చే నెల 10, 11వ తేదీల్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన గురువారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి ఎనిమిది మంది చొప్పున ఎంపీలు ఉన్నా యూరియా కొరతను తీర్చలేకపోతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోందని దుయ్యబట్టారు. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన తెల్లం వెంకట్రావు ఆతర్వాత కాంగ్రెస్లో చేరగా, స్పీకర్ నోటీసులు ఇవ్వగానే పార్టీ మారలేదని చెప్పడం గర్హనీయమని తెలిపారు. బీసీలను రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు. కాగా, కేటీఆర్ జిల్లా పర్యటన పార్టీ శ్రేణులకు రీచార్జ్లా ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడగా, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ఎన్నికలను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా కొత్తగూడెం, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని వివరించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, కాపు సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా, కొత్తగూడెం బాబుక్యాంపు వద్ద ప్రతిష్ఠించిన గణనాధుడిని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, అనుదీప్, నవతన్, శ్రీకాంత్, కన్నీ, రమాకాంత్ పాల్గొన్నారు. అలాగే, కొత్తగూడెంలో సమావేశం ముగించుకుని ఖమ్మం వెళ్లే క్రమాన మార్గమధ్యలో రహదారిపై పెద్దసంఖ్యలో కోతులు కనిపించడంతో ఎంపీ రవిచంద్ర తదితరులు అరటి పండ్లు వేసి వాటి ఆకలి తీర్చారు. -
సీఎం పర్యటన మళ్లీ వాయిదా
చండ్రుగొండ: సీఎం రేవంత్రెడ్డి చండ్రుగొండ మండల పర్యటన మళ్లీ వాయిదా పడింది. తుపాను ప్రభావానికి తోడు ఈనెల 30నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో సీఎం పర్యటన వాయిదా పడినట్లు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం వెల్లడించారు. ఈనెల 21న చండ్రుగొండ మండలం బెండాలపాడులో సీఎం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభిస్తారని మొదట ప్రకటించారు. ఈ పర్యటన వాయిదా పడగానే సీఎం 30న దామరచర్లలో పర్యటిస్తారని తెలిపారు. హెలీప్యాడ్, సభాస్థలి పనులు జరుగుతుండగానే పర్యటన వాయిదా పడినట్లు వెల్లడించారు. అయితే, సెప్టెంబర్లో సీఎం పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.మరోవైపు చివరి దశకు చేరిన ఏర్పాట్లు -
యూరియా కోసం రైతుల ఆక్రందన
● రహదారిపై బైఠాయించిన అన్నదాతలు ● చర్చించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందు: యూరియా కోసం రైతుల కష్టాలు తీరడంలేదు. ఇల్లెందు మార్కెట్కు గురువారం ఉదయమే పెద్దసంఖ్యలో రైతులు చేరుకోగా, యూరియా లేదని సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన వారు ఆస్పత్రి ప్రధాన రహదారి వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళనకు చేపట్టారు. సమాచారం అందుకున్న సీఐ సురేష్ చేరుకుని సర్దిచెప్పినా ఆందోళన విరమించకపోవడంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య చేరుకుని మాట్లాడారు. అయినా రైతులు ససేమిరా అనటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమాన మార్కెట్కు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ అధికారులతో చర్చించి బఫర్ స్టాక్గా ఉన్న 20 టన్నుల ఎరువును ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేయించడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, రైతులతో సమన్వయం చేయలేకపోయిన సొసైటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీఏ లాల్చంద్, ఏఓ సతీష్, సీఈఓ హీరాలాల్, రాజు, మార్కెట్, సొసైటీల చైర్మన్లు బానోతు రాంబాబు, మెట్టల కృష్ణ, నాయకులు నబీ, కిరణ్, కృష్ణ, మోహన్రావు, రాజు, యాకుబ్షావలీ, బుర్ర వెంకన్న, మల్లెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మనం భద్రమేనా?!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వానాకాలంలో వర్షాలు, వరదల తీరుతెన్నుల్లో కొన్నేళ్లుగా తేడాలు కనిపిస్తున్నాయి. తుపాన్ ప్రభావంతో మబ్బులు ముసురుకుని గంటల తరబడి కురిసే వర్షాలకు బదులు ఆకాశం బద్దలైనట్టు కుండపోత వాన కురవడం ఎక్కువైంది. 30 చదరపు కి.మీ. ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్బరస్ట్గా పేర్కొంటారు. ఈ తరహా పరిస్థితి తలెత్తితే ఒక్కసారిగా వరద ఊరూవాడ, పొలం చెలక తేడా లేకుండా అంతా కమ్మేస్తుంది. కేవలం పది సెం.మీ. మీటర్ల వర్షానికే పరిస్థితులు ఇంత భయానకంగా మారతాయనుకుంటే.. గడిచిన నాలుగైదేళ్లుగా క్లౌడ్ బరస్ట్ కారణంగా 30 సెం.మీ.కు తక్కువ కాకుండా వర్షం కురుస్తోంది. ఏటా ఒక జిల్లా క్లౌడ్ బరస్ట్ కారణంగా చిగురాటకులా వణికిపోతున్న నేపథ్యాన జిల్లాలో ఈ పరిస్థితితో తట్టుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మనకు మరింతగా రాష్ట్రంలోనే అత్యధిక అడవులు ఉన్న జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెంకు గుర్తింపు ఉంది. జిల్లాలో ఎక్కువ ప్రాంతం కొండలు, గుట్టలతో నిండి ఉంటుంది. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉంది. దీంతో ఇక్కడ క్లౌడ్ బరస్ట్ తరహా వర్షాలు వస్తే పరిస్థితి క్షణాల్లోనే బీతావహంగా మారే ప్రమాదముంది. గతంలో 2005లో దమ్మపేట మండలంలో 40 సెం.మీ. వర్షపాతం నమోదవగా 2013లో వాజేడు మండలంలో 53 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిన్నామొన్నటి వరకు తెలంగాణలో ఇదే అత్యధిక వర్షపాతంగా రికార్డు ఉండేది. అయితే 2023లో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 64 సె.మీ. వర్షపాతం కురవగా కొత్త రికార్డు నమోదైంది. గత క్లౌడ్బరస్ట్ బాధిత జాబితాలో మణుగూరు, అశ్వారావుపేట మండలాలు చేరాయి. మోగిన ప్రమాద ఘంటికలు గతేడాది ఆగస్టు 31 రాత్రి మణుగూరులో 31 సెం.మీ. వర్షం కురవడంతో కట్టవాగు ఉప్పొంగింది. గంటల వ్యవధిలో పట్టణంలో సగం మేర ముంపునకు గురైంది. ఈ వరద తీవ్రత నుంచి తప్పించుకోలేక ఒక దివ్యాంగుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు జూలై 18న జిల్లా సరిహద్దు ఏపీలోని గుబ్బల మంగమ్మ గుట్టల మీద 27 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. దీంతో దిగువన అశ్వారావుపేట మండలంలో పెద్దవాగుకు వరద పోటెత్తింది. చూస్తుండగానే పరీవాహక ప్రాంతాలను ముంచెత్తగా పొలాల్లోని రైతులు, వివిధ పనులపై బయటకు వచ్చిన వారు వరదలో చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తు చీకటి పడే సమయానికి హెలీకాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ మొదలవడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణనష్టం తప్పినా వరద తీవ్రతకు పెద్ద వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఫలితంగా ప్రాజెక్టు దిగువన ఏపీలో ఉన్న వేలేరుపాడు మండలం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మీదుగా ముర్రేడు, గోధుమ వాగు వెళ్తున్నాయి. ఈ వాగు ఉధృతికి ఏటా గట్టుపై ఉన్న ఇళ్లు కూలిపోతున్నాయి. వాగుకు రక్షణగా గేబియన్ వాల్ నిర్మించాలని రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. గోధుమవాగు కారణంగా విద్యానగర్, బైపాస్ రోడ్డు ప్రాంతాలకు ముంపు పొంచి ఉంది. ఈ వాగు అంచు వెంట పెరిగిన చెట్లు, ముళ్ల కంపలు భారీ ప్రవాహానికి అడ్డుగా మారే అవకాశం ఉంది. వాగు వెంట జంగిల్ క్లియరెన్స్ చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. పాల్వంచలోని దమ్మపేట రోడ్డులో లోతట్టు ప్రాంతాల్లో డ్రెయినేజీలు మెరుగుపర్చాలి. అలాగే, వచ్చే సీజన్ నాటికై నా బుగ్గవాగుకు రక్షణ గోడ నిర్మిస్తే ఇల్లెందుకు వరద ముప్పు తప్పుతుంది. గతేడాది వరదల దృష్ట్యా మణుగూరులో కట్టవాగుకు పూడికతీత పనులు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం స్థానికులు చెబుతున్నారు. క్లౌడ్బరస్ట్ తరహా పరిస్థితులు ఎదురైనా వరద సాఫీగా సాగేలా పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవికాక పల్లెలు, పట్టణాల్లో వరద నీటి నిర్వహణ పద్ధతులకు మెరుగుపెట్టకపోతే జనం ఆందోళనగా గడపాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.జిల్లావాసులను వెంటాడుతున్న వరద భయం -
పెరిగి.. తగ్గిన గోదావరి
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి మళ్లీ క్రమంగా పెరిగినట్లే పెరిగి రాత్రికి తగ్గుముఖం పట్టింది. నాలుగు రోజుల క్రితం మూడో ప్రమాద హెచ్చరిక సమీపానికి వచ్చిన వరద ఆ వెంటనే తగ్గిపోయింది. దీంతో ఏజెన్సీ వాసులు ఊపిరి పీల్చుకోగా ఇప్పుడు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. భద్రాచలానికి ఎగువ ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీ వరద చేరుకుంది. అంతేకాక తాలిపేరు ప్రాజెక్టు గేట్లన్నీ తెరిచారు. ఛత్తీస్గఢ్లో వర్షాలతో దిగువన శబరికి నీరు చేరగా వరద పోటెత్తింది. దీంతో గోదావరి మరింత పెరుగుతుందనే అంచనాతో అధికారులు పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని ఎస్పీ రోహిత్రాజ్ సూచించారు. తప్పనిసరైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, గోదావరితో పాటు ఇతర జలవనరుల వద్ద వీడియోలు, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని తెలిపారు. పెరిగి.. మళ్లీ తగ్గి గురువారం తెల్లవారుజామున 4గంటలకు 29 అడుగులు ఉన్న గోదావరి అనంతరం వేగంగా పెరిగింది. ఉదయం 9గంటలకు 35.80అడుగులకు చేరగా 11గంటలకు 36.90 అడుగులుగా నమోదైంది. ఆతర్వాత నెమ్మదిగా పెరిగిన గోదావరి సాయంత్రం 5గంటలకు 38.60 చేరి, 6గంటలకు కూడా అదేస్థాయిలో ఉండగా.. రాత్రి 10 గంటలకు 37.50అడుగులకు పడిపోయింది. ఉదయమే స్నానఘాట్లు నీటమునగగా గజ ఈతగాళ్లు, లాంచీలను సిద్ధం చేశారు. ● దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో గోదావరి పరవళ్లతో పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం నీట మునిగింది. గుబ్బలమంగి వాగు ప్రాజెక్టు, తులసమ్మ, గంగోలు చెరువులు నిండుగా ప్రవహిస్తున్నాయి. సున్నంబట్టి–బైరాగులపాడు మధ్య రహదారిపైకి వరద చేరింది.ఎగువన వర్షాలతో భారీ వరద -
సుమనోహరం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.స్వామి వారి పూజలకు విరాళంశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో వివిధ పూజల నిమిత్తం హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్కు చెందిన నాయినేని కృష్ణారావు – కౌసల్య దంపతులు గురువారం రూ.3.52లక్షలు అందజేశారు. అనంతరం దాతలు స్వామిని దర్శించుకోగా, వారికి ఈఓ రమాదేవి రశీదు అందజేశారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాఽథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన పూజలు జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారుసింగరేణిలో 18 మంది వైద్యుల బదిలీసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా పలువురు వైద్యులను బదిలీ చేస్తూ కార్పొరేట్ ఈఈ సెల్ హెచ్ఓడీ ఏ.జే.మురళీధర్రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఆరుగురు డీవైసీఎంఓలు, ఏడుగురు మెడికల్ సూపరింటెండెంట్లు, ముగ్గురు డిప్యూటీలు, ఇద్దరు సీనియర్ మెడికల్ సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరంతా నూతన స్థానాల్లో వెంటనే రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండికొత్తగూడెంటౌన్: వచ్చేనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ సూచించారు. కొత్తగూడెం జిల్లా కోర్టు హాల్లో గురువారం కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశమైన ఆయన మాట్లాడారు. రాజీ పడదగిన పెండింగ్ కేసులు అత్యధికంగా పరిష్కారమయ్యేలా కక్షిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే కేసులు ఎక్కువగా పరిష్కారమవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, లైజన్ ఆఫీసర్ ఘని, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.22 నుంచి డీఈఐఈడీ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: వచ్చే నెల 22 నుంచి డిప్లొ మా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరగనున్నాయని డీఈఓ నాగలక్ష్మి తెలిపారు. పరీక్షలు నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. అలాగే, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సప్లిమెంటరీ పరీక్ష ల షెడ్యూల్ కూడా విడుదలైందని తెలిపారు. పూర్తి వివరాల కోసం పరీక్షల సహాయక కమిషనర్ ఎస్.మాధవరావు(89192 79238)ను సంప్రదించాలని డీఈఓ సూచించారు. -
అవగాహన కోసం ‘డెమో ఫామ్’
● మోరంపల్లి బంజరలో ఏర్పాటుకు సన్నాహాలు ● పరిశీలించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్బూర్గంపాడు: జిల్లా ప్రజల ఆదాయం పెంచడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అవగాహన కల్పించేందుకు మోడల్ డెమో ఫామ్ ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. మండలంలోని మోరంపల్లిబంజర సమీపాన సీతారామ కెనాల్ పక్కన ఇరిగేషన్శాఖ భూమిలో మోడల్ డెమో ఫామ్ నిర్మాణానికి గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ స్థలంలో కూరగాయల సాగు, మట్టి ఇటుకల తయారీ యూనిట్, వెదురు, వాక్కాయ కంచె ఏర్పాటుచేయడంతో పాటు మునగసాగు చేపట్టాలని సూచించారు. తద్వారా రైతులు, మహిళలకు నూతన వ్యవసాయ సాగు విధానాలపై అవగాహన కల్పించొచ్చని తెలిపారు. తహసీల్దార్ కేఆర్కేవీ.ప్రసాద్, ఎంపీఓ బాలయ్య, ఆర్ఐ నర్సింహారావు, ఏఈ సందీప్, ఏపీఓ విజయలక్ష్మి, ఏపీఎం నందిని, పంచాయతీ కార్యదర్శి భవాని, ఏఓ నాగార్జున పాల్గొన్నారు. నాణ్యమైన ఇటుకల తయారీ మణుగూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకం పనులను నాణ్యమైన ఇటుకలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ పాటిల్ తెలిపారు. మణుగూరు మండలం చిక్కుడుగుంట ప్రాంతంలోని బీటీపీఎస్ సమీపాన ఫ్లైయాష్తో ఇటుకల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30న నాణ్యమైన ఇటుకల తయారీపై శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. బీటీపీఎస్ సీఈ బి.బిచ్చన్న, తహసీల్దార్ అద్దంకి నరేష్, ఎంపీడీఓ టి.శ్రీనివాసరావు, ఎంపీఓ పి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. దివ్యాంగుల నిర్ధారణ క్యాంపులు కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగుల నిర్ధారణకు నిర్వహించే క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించి ఉపకరణాలు అందించేందుకు ఏర్పాటుచేసే శిబిరం బ్రోచర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాత కొత్తగూడెంలోని జెడ్పీహెచ్ఎస్(ఆనందఖని పాఠశాల)లో ఈనెల 30, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో జరిగే శిబిరాలకు దివ్యాంగ బాలలు, తల్లిదండ్రులు హాజరుకావాలని తెలిపారు. ఈ విషయమై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తూ, వివరాలకు జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్.కే.సైదులు(98487 86166)ను సంప్రదించేలా వివరించాలన్నారు. డీఈఓ బి.నాగలక్ష్మి, అధికారులు సైదులు, నాగరాజశేఖర్, సతీష్కుమార్ పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.శ్రీరామకోటి ప్రతుల నిమజ్జనంభద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తులు సమర్చించిన శ్రీరామ కోటి ప్రతులను ఈఓ ఎల్.రమాదేవి ఆధ్వర్యాన మంగళవారం పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు. అనంతరం గౌతమీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారే చీరె సమర్పించి, వైభవంగా నదీ హారతి ఇచ్చారు.రామాలయ ఈఓగా దామోదర్ రావుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా దామోదర్ రావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఈఓ రమాదేవిని పదోన్నతిపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఆర్అండ్బీ శాఖకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కాగా, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావుకు డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించి దేవాదాయ శాఖకు పంపించారు. తాజాగా ఆయనకు ఆలయ ఈఓ బాధ్యతలు అప్పగించడంతో రమాదేవి ఆర్అండ్బీ శాఖకు వెళ్లనున్నారు. దేవస్థాన మాఢ వీధుల విస్తరణకు భూ సేకరణ, నష్ట పరిహారం పంపిణీలో దామోదర్ రావు కీలకంగా వ్యవహరించారు.వైద్యులపై ఎమ్మెల్యే ఆగ్రహంకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి వైద్యులపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆస్పత్రి ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఆయన వరిసరాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి మండిపడ్డారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. చిన్న కేసులను కూడా ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, జిల్లా ఆస్పత్రికి వచ్చే వారిని ఇతర ఆస్పత్రులకు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. సేవా దృక్పథంతో పనిచేయాలని, మొక్కుబడి ఉద్యోగాలు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.మట్టి విగ్రహాలనే వాడుదాం..సూపర్బజార్(కొత్తగూడెం): మట్టి విగ్రహాలతో వినాయక చవితి జరుపుకుందామని ఎమ్మెల్యే కూనంనేని పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పలు సెంటర్లలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించొద్దని, కాలుష్య నివారణ కోసం మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ సుజాత, అధికారులు అహ్మ ద్, వీరభద్రాచారి, రంగప్రసాద్ పాల్గొన్నారు. -
ఒక్క రూపాయీ రాలే !
● బుట్టదాఖలైన ఎన్నికల హామీలు ● నియోజకవర్గంలో 169 పనులకు ప్రకటించిన నిధులు రూ.14.50 కోట్లు ● భద్రాచలంలో సెంట్రల్ లైటింగ్కు రెండుసార్లు శంకుస్థాపన ● ఇంకా ప్రతిపాదన దశలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు భద్రాచలం: భద్రాచలం నియోజకవర్గానికి ఎన్నికల వేళ ఇచ్చిన అభివృద్ధి పనుల హామీలు బుట్టదాఖలే అయ్యాయి. నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పనులపై చిత్తశుద్ధి చూపకపోవడంతో రూపాయి కూడా విడుదల కాలేదు. బీఆర్ఎస్ హయాంలో నిధుల ప్రకటనలో కీలకంగా వ్యవహరించిన నేతలే నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నా పనులు ముందుకు సాగడం లేదు. ఎప్పుడూ అదే నిర్లక్ష్యం.. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే భద్రాచలంలో అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పట్టణాభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ అనేక హామీలు గుప్పించింది. ఓట్లే లక్ష్యంగా అప్పటికప్పుడు రూ.కోట్ల విలువైన పనులు చేపడతామని ప్రకటించింది. భద్రాచలం నియోజకవర్గంలోని 169 పనులకు రూ.14.50 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ ఫండ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు అభివృద్ధి పనుల వేగవంతానికి తగు చర్యలు తీసుకోవాలంటూ భద్రాద్రి, ములుగు జిల్లాల కలెక్టర్లను నాటి ప్రభుత్వ స్పెషల్ ఛీప్ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వం మారినా నేతలు వారే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే నాడు బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అనంతరం కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి పేరిట కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలు వేరైనా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు వారే. అయినప్పటికీ ఎన్నికల హామీలు అమలు కావడం లేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్లు కావొస్తున్నా మాఢ వీధుల విస్తరణ, తూరుబాక వద్ద బ్రిడ్జి నిర్మాణానికి మినహా.. మరే అభివృద్ధి పనులకూ నిధులు విడుదల కాలేదు. ..అయినా అంధకారమే భద్రాచలంలోని చర్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్ పనులకు నాటి ప్రభుత్వం రూ.రెండు కోట్లు ప్రకటించగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 2023 సెప్టెంబర్ 9వ తేదీ ఉదయమే అప్పటి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పనులు ముందుకు సాగలేదు. ఈ ఏడాది జూలై 7న అవే పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి శంకుస్థాపన చేశారు. అయినా ఆ పనులు చేపట్టక అంధకారమే నెలకొంది. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఈ రెండు శిలాఫలకాలు దర్శనమిస్తున్నాయి. ఇంకా ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో పాటు పలు పనులు కూడా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. నియోజకవర్గంలో చేయాల్సిన పనులు.. భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ.2 కోట్లు, ప్రధాన రహదారిపై కూనవరం – చర్ల రోడ్డులో సెంట్రల్ లైటింగ్కు రూ.2 కోట్లు, కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మరో రూ.2 కోట్లు ప్రకటించారు. దుమ్ముగూడెం మండలంలో రూ.1.50 కోట్ల తో రోడ్లు, డ్రెయినేజీల నిర్మించాల్సి ఉంది. చర్ల మండలంలో రూ.50 లక్షలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి రూ.కోటి విడుదల చేయాలి. వెంకటాపురం మండలం పాత్రాపురం వద్ద బల్లకట్టు వాగుపై రోడ్ కం బ్రిడ్జికి రూ.కోటి, సెంట్రల్ లైటింగ్కు రూ.కోటి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రూ.50లక్షలు, రోడ్లు, ఇతర పనులకు మరో రూ.2.50కోట్లు ప్రకటించారు. వాజేడు మండలంలో రూ.1.50 కోట్లతో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాల్సి ఉంది. -
పర్యావరణ హితమే లక్ష్యం
ఖమ్మంగాంధీచౌక్: సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ‘సాక్షి’ మీడియా గ్రూప్, స్తంభాద్రి ఉత్సవ సమితి సంయుక్త ఆధ్వర్యాన మంగళవారం మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఖమ్మం పెవిలియన్ మైదానం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు విగ్రహాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్తంభాద్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ లాహోటి, కీసర జయపాల్రెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షుడు గెంటేల విద్యాసాగర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అల్లిక అంజయ్య మాట్లాడారు. అందరికీ ప్రీతిపాత్రమైన వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా జరుపుకునేలా మట్టి ప్రతిమలు ప్రతిష్ఠించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంతో నీరు కాలుష్యం కావడమే కాక జలరాశుల మనుగడ దెబ్బతింటుందన్నారు. ఏటా మండపాలు పెరుగుతున్నందున మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరుపుకునేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి బాధ్యులు మూలగుండ్ల శ్రీహరి, నూకల మోహన్ కృష్ణ, జమ్మి శ్రవణ్కుమార్, బోయినపల్లి కోటిరెడ్డితో పాటు ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి బొల్లం శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ జి.మోహన్కృష్ణ, సాక్షి టీవీ ప్రతినిధి పసునూరి మహేందర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ రాధారపు రాజుతో పాటు జి.జవహర్రెడ్డి, జె.ఉపేందర్, సతీష్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహనాలు కండీషన్లో లేకపోవడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నళ్లు పాటించక పోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నియంత్రణకు పోలీస్, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జైలుశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా చూడాలని, ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖకు సూచించారు. రహదారుల కూడళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో సీసీ కెమెరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్కర్ష్ అభియాన్పై అవగాహన కల్పించాలి.. మారుమూల అటవీ ప్రాంతాల గిరిజనులకు పీఎం ధర్తీ ఆబాజాన్ జాతీయ గౌరవ ఉత్కర్ష అభియాన్ పథకంపై అవగాహన కల్పించాలని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తదితరులతో కలిసి పథకం విజయవంతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై సమావేశం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలో మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న 19 మండలాల పరిధిలోని 134 గ్రామాల్లో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లాస్థాయి అధికారులకు హైదరాబాద్లో శిక్షణ నిర్వహించారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ బి.రవీందర్, గిరిజన సంక్షేమ ఈఈ చంద్రశేఖర్, ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ నాగేశ్వరరావు, విద్యుత్ ఎస్ఈ మహేందర్, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్టీఓ వెంకటరమణ, కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లెందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎన్హెచ్ డీఈ శైలజ, ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్ పాల్గొన్నారు.కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని కొత్తగూడెం, పాల్వంచలో రెండు వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రమంతా మట్టి గణపతి విగ్రహాలను కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పంపిణీ చేశారని తెలిపారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
30న సీఎం పర్యటన ఖరారు
ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడిచండ్రుగొండ : మండలంలోని బెండాలపాడులో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సీఎం ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ మేరకు హౌసింగ్ అధికారులతో కలిసి మంగళవారం ఆయన నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం చండ్రుగొండ, దామరచర్ల గ్రామాల్లో పర్యటించి హెలీప్యాడ్, సభాస్థలి పనులను తనిఖీ చేశారు. చండ్రుగొండలోని ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాలికలకు సరిపడా గదులు లేవని మ్యాట్రీన్ సునీత చెప్పగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్, నాయకులు భోజ్యానాయక్, కృష్ణారెడ్డి, నల్లమోతు రమణ, పర్సా వెంకట్, బొర్రా సురేష్, ఫజల్ , ఎండీ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
● వివాహితను మూడేళ్లుగా చిత్రహింసలు పెట్టినట్లు నిందితుల అంగీకారం ● వివరాలు వెల్లడించిన సీఐ నాగరాజురెడ్డి
హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ అశ్వారావుపేట రూరల్: మూడేళ్లుగా తన భార్యకు భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు ఆమె భర్త, అతడి సోదరి, తల్లి ఒప్పుకున్నారని, వారిని అరెస్ట్ చేశామని సీఐ పింగిళి నాగరాజురెడ్డి వెల్లడించారు. సంచలనం కలిగించిన వివాహిత మృతిని హత్యగా తేల్చిన పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వానాథపురం గ్రామానికి చెందిన పూల లక్ష్మీప్రసన్న (33), భర్తతో కలిసి మూడేళ్లుగా అశ్వారావుపేటలోని కోనేరుబజార్లో భర్త అక్క ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజుల క్రితం ఇంట్లో పనిచేస్తున్న క్రమంలో జారిపడిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఈ నెల 24వ తేదీన లక్ష్మీప్రసన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేయగా లక్ష్మీప్రసన్న భర్త పూల నరేశ్బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క దాసరి భూలక్ష్మి, బావ దాసరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. కాగా, తామే లక్ష్మీప్రసన్నకు మూడేళ్లుగా సరైన భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి, కొట్టి హత్య చేశామని నిందితులు విచారణలో వెల్లడించారని సీఐ తెలిపారు. నరేశ్బాబు, విజయలక్ష్మి, భూలక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, దాసరి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడని, అతడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. సమావేశంలో ఎస్ఐలు టి.యయాతిరాజు, రామ్మూర్తి, ట్రెయినీ ఎస్ఐ అఖిల, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఫోర్జరీ కేసు కొట్టివేతభద్రాచలంఅర్బన్: ఫోర్జరీ కేసును భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. పట్టణానికి చెందిన పిలక లక్ష్మీమదన్రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న క్రమంలో తన సంతకాన్ని కొత్త రామస్వామి ఫోర్జరీ చేసి తన ఉద్యోగం పోయేలా చేశాడని ఆరోపిస్తూ 2007లో క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. సరైన సాక్షాలు లేకపోవడంతో కొత్త రామస్వామిపై నమోదైన కేసును న్యాయమూర్తి మంగళవారం కొట్టేవేశారు. రామస్వామి తరఫున న్యాయవాది ముత్యాల కిశోర్ వాదించారు. -
డ్రోన్తో యూరియా పిచికారీ చేయాలి
టేకులపల్లి : ద్రవరూపంలో ఉండే నానో యూరియాను డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం మేలని, ఎకరాకు 500 ఎంఎల్ వాడడంతో ఖర్చు కూడా తగ్గుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు, ఆత్మ డీపీడీ బి.సరిత రైతులకు సూచించారు. నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై టేకులపల్లిలో మంగళవారం వారు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నానో యూరియాతో పంటల దిగుబడి పెరుగుతుందని, తక్కువ మోతాదులో వాడినా ఫలితం ఉంటుందని, పర్యావరణానికి మేలు చేస్తుందని, ఖర్చు తగ్గడంతో పాటు పంట నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. నానో యూరియా కణాలు చాలా చిన్నవిగా ఉండడంతో మొక్కల కణజాలంలోకి తేలికగా ప్రవేశించి, నత్రజనిని సమర్థవంతంగా అందిస్తాయని, మొక్కలకు అవసరమైన పోషకాలు సకాలంలో అందడంతో దిగుబడి పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏడీఏ గుగులోత్ లాల్చంద్, ఏఓ నీరుడు అన్నపూర్ణ, ఏఈఓ శ్రావణి పాల్గొన్నారు. రైతులకు డీఏఓ బాబూరావు సూచన -
టీజీఎఫ్డీసీ ఉద్యోగులపై బదిలీ వేటు ?
ములకలపల్లి: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) ఆధ్వర్యంలో పెంచుతున్న జామాయిల్ తోటల్లో కలప మాయం ఘటనలో ఆ శాఖ అధికారులపై బదిలీ వేటు పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మండలంలోని రంగాపురం శివారులో టీజీఎఫ్డీసీ ఆధ్వర్యంలో 2006 నుంచి యూకలిప్టస్ (జామాయిల్) తోటలు సాగు చేస్తున్నారు. గత నెలాఖరులో 2–ఏ, 2–బీ పరిధిలో 500పైగా చెట్లు మాయం కాగా, ఆలస్యంగా కళ్లు తెరచిన స్థానిక అధికారులు ములకలపల్లిలోని ఓ ప్రైవేట్ అడ్తీలో కొంత కలపను స్వాధీనం చేసుకున్నారు. చెట్లు నరికిన వ్యక్తిపై నామమాత్రపు జరిమానా విధించారు. ఈ ఉదంతంపై ఈనెల 8న ‘జామాయిల్ కలప మాయం’శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టి.. మూడు రోజుల అనంతరం నివేదిక సమర్పించారు. దీంతో పాల్వంచ డీఎం కవితను హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ములకలపల్లి రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సునీతను రంగారెడ్డి డివిజన్కు బదిలీ చేసినట్లు తెలిసింది. వీరిస్థానంలో కొత్తగూడెం డీఎం చంద్రమోహన్ను పాల్వంచ ఇన్చార్జ్ డీఎంగా, సత్తుపల్లి పీఎం నాగరాజును ములకలపల్లి పీఎంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. ఐతే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.చెట్ల చోరీపై కేసు నమోదు..జామాయిల్ చెట్ల చోరీపై మంగళవారం కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎస్.మధుప్రసాద్ వెల్లడించారు. ప్లాంటేషన్ మేనేజర్ సునీత పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా.. చెట్లు నరికిన వ్యక్తి, అడ్తీకి సంబంధించిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
హెచ్సీఏ టోర్నీలో భద్రాద్రి క్రికెటర్ ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన క్రికెటర్ నక్కా రిత్విక్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యాన ఘట్కేసర్లో నిర్వహించిన వన్డే లీగ్ టోర్నీలో ప్రతిభ చాటాడు. చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఆయన 134 బంతుల్లో 16ఫోర్లు, ఒక సిక్స్తో 116 పరుగు లు సాధించాడు. భద్రాచలంలోని క్రాంతి విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న రిత్విక్ను పాఠశాల చైర్మన్ సోమరౌతు శ్రీనివాస్ అభినందించారు. యూరియా అందించడంలో విఫలంజూలూరుపాడు: రైతులకు సరిపడా యూరి యా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రకుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన జూలూరుపాడులో మాట్లాడారు. యూరియా కొరత నివారించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఽఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. సహకార సంఘాల గోదాముల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులుదీరుతున్నారన్నారు. యూరి యా బస్తాల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తే ఒకటి, రెండు కట్టలు ఇస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి పట్టివేత?భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ చెక్పోస్ట్ వద్ద మంగళవారం రెండుకార్లలో ముగ్గురువ్యక్తులు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా కొత్తగూడెం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకకార్లో గంజాయి తరలిస్తుండగా మరో కారు వీరికి ఎస్కార్ట్గా వస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన గంజాయి, కార్లను కొత్తగూడెం తరలించిన సీసీఎస్ పోలీసులు.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించాల్సి ఉంది. 33 గ్యాస్ సిలిండర్లు చోరీబూర్గంపాడు: సారపాకలోని శ్రీసాయి గ్యాస్ ఏజెన్సీ గోదాంలోని 33 గ్యాస్ సిలిండర్లు చోరీకి గురయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ గణేశ్ ఫి ర్యాదు మేరకు ఎస్ఐ మేడ ప్రసాద్ కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు గ్యాస్ గోదాంలో చొరబడి 33 నిండు గ్యాస్ సిలిండర్లను అపహరించారు. సోమవారం గ్యాస్ గోదాం తెరిచిన తరువాత గ్యాస్ సిలిండర్లు చోరీకి గురైనట్లు గుర్తించిన మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ప్రసాద్ మంగళవారం కేసు నమోదు చేశారు. -
8 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు.. ప్రశాంత జీవితం గడిపేందుకు లొంగిపోతున్నారని ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయిన సందర్భంగా మంగళవారం తన చాంబర్లో ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా ఒక్కొక్కరికీ రూ.25 వేలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రం నుంచి 81 మంది మావోయిస్ట్ పార్టీలో పలు రాష్ట్రాల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలంపల్లికి చెందిన సౌత్ సబ్ జోనల్ సప్లయింగ్ ఏసీఎం స్థాయి వేటి సోందా, అదే జిల్లా గుంజిపర్తికి చెందిన పార్టీ మహిళా సభ్యురాలు ముచ్చాకి లక్మి, గంగలూరుకు చెందిన మిలీసియా సభ్యులు ఓయం లక్ష్మణ్, పోడియం కోసా, మడవి నందు, కరం సోముడు, మడవి ఉర్రా లొంగిపోయిన వారిలో ఉన్నారని చెప్పారు. ఏడాది వివిధ హోదాల్లోని సుమారు 314 మంది మావోయిస్టులు లొంగిపోయారని, జిల్లా నుంచి ప్రస్తుతం ఐదుగురు మావోయిస్టులు పనిచేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో 81, 141 బెటాలియన్ సభ్యులతో పాటు పోలీసులు పాల్గొన్నారు. -
తెల్లవాగు చెరువు తూము లీకేజీ
ములకలపల్లి: మండలంలోని పూసుగూడెం శివారు తెల్లవాగు చెరువు ఎడమ తూము ఎడమ షట్టర్ లీకేజీ అవుతోంది. దీంతో 450 ఎకరాల ఆయకట్టు కలిగిన చెరువులోని నీళ్లు వృథాగా పోతున్నాయి. చెరువు నిండా నీరు ఉన్న నేపథ్యాన లీకేజీతో రెండు రోజులుగా కాల్వ గుండా దిగువకు ప్రవహిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇరిగేషన్ అధికారులు మంగళవారం మరమ్మతులు చేపట్టారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ ఏఈ గఫూర్పాషాను వివరణ కోరగా చెరువు నిండా నీళ్లు ఉండడంతో సమస్యను గుర్తించడం కష్టంగా మారినా తాత్కాలిక మరమ్మతు చేసినట్లు తెలిపారు. కాగా, తూము లీకేజీ మరమ్మతులు సత్వరమే చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పనులను పరిశీలించి మాట్లాడారు. పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, నాయకులు మాలోతు రావూజా, పొడియం వెంకటేశ్వర్లు, తేజావత్ జగ్గు, పులి వెంకటేశ్వర్లు, దుబ్బా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేపట్టిన ఇరిగేషన్ అధికారులు -
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు
● లక్ష్మీప్రసన్న భర్త, బంధువులపై దాడి ● ఇల్లు, కారూ ధ్వంసం ● కూతురుతో దహనసంస్కారాలు చేయించిన కుల పెద్దలు అశ్వారావుపేట: రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం సోమవారం మధ్యాహ్నం అశ్వారావుపేటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు రింగ్ సెంటర్ నుంచి మృతురాలు నివాసమున్న ఆమె ఆడపడుచు ఇంటివరకు పోగైన సుమారు 200 మంది.. అంబులెన్స్ రాగానే మృతురాలి భర్త నరేష్, ఆయ న బావ దాసరి శ్రీనివాస్, రాజమండ్రికి చెందిన అంబులెన్స్ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో పోలీసులుఅప్రమత్తమై నరేష్నుఅంబులెన్స్తో సహా స్టేషన్కు తరలించగా.. మరికొందరు ఇంటి వద్ద ఉన్న మృతురాలి ఆడపడుచుపై దాడి చేశారు. నరేష్బావ శ్రీనివాస్ పోలీస్వాహనంలో తలదాచుకు న్నా వాహనం డోర్ పెకిలించి మరీ దాడికి పాల్పడ్డారు. పీఎస్ పక్కనే ధర్నా, దాడి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకు, అదే మండలంలోని ఖాన్ఖాన్ పేటకు చెందిన నరేష్బాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వారు అశ్వారావుపేటలోని నరేష్ సోదరి ఇంట్లో ఉంటుండగా లక్ష్మీప్రసన్న రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందింది. అయితే, భర్త, ఆయన కుటుంబసభ్యుల వేధింపులతో పాటు సరిగా భోజనం కూడా పెట్టకపోవడంతో తమ కూతురు చిక్కి శల్యమై మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈమేరకు మృతదేహాన్ని సోమవారం అశ్వారావుపేటకు తీసుకురాగా, లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు, బంధువులు పోలీస్ స్టేషన్ పక్క ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో సీఐ పింగళి నాగరాజు, ఎస్ఐ యయాతిరాజు, దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్రెడ్డి మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. విచారణతో పాటు పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్య కేసుగా మారుస్తామే తప్ప ఫిర్యాదుతో చేయలేమని వివరించారు. దీంతో మృతురాలి తరఫు పెద్దమనుషులు ధర్నాను విరమింపజేయగా లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని ఇంటికి తరలించేసరికి అక్కడ ఇంట్లో వారిపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు కుటుంబీకులంతా పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందగా, ఇల్లు, కారుపై రాళ్లు రువ్వారు. తలకొరివి పెట్టిన కుమార్తె ‘అంత్యక్రియలు చేసేందుకు భర్త భయపడుతున్నాడు.. వారి బంధువులను మీరు కొడుతున్నారు.. మృతదేహాన్ని మీరే తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారా’ అని సీఐ నాగరాజు ప్రశ్నించగా ‘మృతదేహాన్ని తీసుకెళ్లం.. అంత్యక్రియల్లోనూ పాల్గొనబోం’ అంటూ లక్ష్మీప్రసన్న బంధువులు స్పష్టం చేశారు. చివరకు మున్నూ రు కాపు సంఘం అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు, స్థానికులు కొల్లి రవికిరణ్, పమిడి లక్ష్మణరావు జోక్యం చేసుకుని మృతురాలి కూతురు ఇన్మితానాయుడుతో తలకొరివి పెట్టించి అంత్యక్రియలు పూర్తి చేశారు. నాపై అభాండాలు వేస్తున్నారు.. ‘నా భార్య చనిపోవడానికి నేనే కారణమని ఆరోపిస్తున్నారు. నా భార్య మాట్లాడితే నిజాలు చెప్పేది. గతంలో అసలు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు వచ్చేవారు కాదు. ఈరోజు వారే లేనిపోని అభాండాలు వేస్తూ తిండి పెట్టకుండా చంపారని చెబుతున్నారు. నన్ను నేను ఎలా నిరూపించుకోవాలి..’ అంటూ నరేష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అయితే, ఆమె బంధువులు మాత్రం లక్ష్మీప్రసన్నకు అన్నం పెట్టకుండా మాడ్చారని, చుటుపక్కల వాళ్లు పడేసిన ఎంగిలి ఆకుల్లో ఏరుకుని తినేదంటూ చుట్టుపక్కల వారు చెప్పారని అంటున్నారు. ఆస్తి కోసం చంపేసి, జబ్బు అంటగట్టారని ఆరోపించారు. రెండేళ్లుగా తాము ఇంటికి వస్తే తలుపు తీయకపోగా, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి తాము వస్తే కుక్కలను వదిలేవారని వాపోయారు. -
మనసుకు ధ్యానం..
● ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర విద్యావిధానం ● విద్యార్థుల వికాసానికి కొత్త బాటలు ● నిత్యం యోగా, ధ్యానం, కథల పఠనం మేధస్సుకు కథలు!కరకగూడెం: పాఠశాల అంటే కేవలం పుస్తకాలు, పాఠాలు, పరీక్షలు మాత్రమేకాదు. అది మన శరీ రం, మనసు, ఆలోచనలను పెంపొందించే ఒక అద్భుతమైన ప్రదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఐదు నిమిషాలు యోగా లేదా ధ్యానం, అరగంట సేపు కథలు, పత్రికల పఠనం చేయించాలని ఇటీవల సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఉపాధ్యాయు లు ఈ ఆదేశాలను అమలు చేస్తూ పాఠశాల జీవి తాన్ని మరింత ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా మా ర్చుతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి సోపానం.. ప్రతిరోజూ ఐదునిమిషాల పాటు యోగా లేదా ధ్యానం ద్వారా విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యోగా సనాలు విద్యార్థుల శరీర సమతుల్యత, బలాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శారీరక దృఢత్వాన్ని పెంచి భంగిమ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ధ్యానం, శ్వాస, వ్యాయామాలు విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించి మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. భావోద్వేగాల నియంత్రణ, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. నైతిక విలువలు, జ్ఞానం ప్రభుత్వం రూపొందించిన అకడమిక్ క్యాలెండర్లో విద్యార్థులు రోజూ అరగంట పాటు కథల పుస్తకాలు, పత్రికలు చదవాలని సూచించారు. కథల పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు నైతిక విలు వలు నేర్చుకుంటారు. ఇవి వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడమే కాక సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడానికి దోహదపడతాయి. పత్రికలు చదవడం వల్ల విద్యార్థులకు వర్తమాన విషయాలపై అవగాహన పెరిగి సాధారణ జ్ఞానాన్ని బలోపేతం చేస్తుంది. భాషా నైపుణ్యాలు, పదజాలం, సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి. విద్యార్థుల్లో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు, వినూత్న భావనలకు దారితీస్తాయి. కట్టుదిట్టమైన అనుసరణ.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థన సమయంలో లేదా తరగతి గదుల్లో యోగా, ధ్యానం సెషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే కథల పుస్తకాలు, పత్రికలను విద్యార్థులకు అందుబాటులో ఉంచి చదివేలా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. -
ఆదివాసీ బాలికపై అఘాయిత్యం కేసులో పురోగతి !
పాల్వంచరూరల్: ఏపీలోని చింతూరు మండలానికి చెందిన ఆదివాసీ బాలికకు కూల్డ్రింక్లో మత్తు కలిపి తాగించి, అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన ట్రాలీ ఆటో డ్రైవర్ను చాతకొండ వద్ద సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రే ఆర్టీఏ చెక్ పోస్టు, జగన్నాధపురం, పెద్దమ్మగుడిలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. అతడి ద్వారా మరో వ్యక్తి ఆచూకీ కూడా కనుగొన్నారని సమాచారం. కాగా, ఈ విషయమై డీఎస్పీ సతీష్కుమార్ను వివరణ కోరగా.. ఆదివాసీ బాలికకు సంబంధించి కేసును ఇక్కడ నమోదు చేసి ఏపీలోని చింతూరు పోలీసులకు బదలాయించినట్లు తెలిపారు. నిందితులను ఆదుపులోకి తీసుకున్న విషయమై అడగగా అది చింతూరు పోలీసులుకు సంబంధించిందని, ఇక్కడ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం రీజియన్ పరిధి మణుగూరు డిపోలో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ ఎస్.కే.ఎస్.సాహెబ్ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవలే మణుగూరు డిపోకు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు టిమ్ డ్యూటీ వేయగా.. అనారోగ్యం కారణంగా తాను చేయలేనందున, కండక్టర్తో కూడిన డ్యూటీ వేయాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయమై సోమవారం సాహెబ్ ఖమ్మంలో ఆర్ఎం సరిరామ్ను కలిసి తన సమస్యలు విన్నవిస్తూ ఆత్మహత్య చేసుకోవాలని వచ్చానని చెప్పడంతో అధికారులు నచ్చజెప్పారు. ఆపై బయటకు రాగానే ఆయన ఎలుకల నివారణకు వాడే మాత్రలు మింగడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్ఎం సరిరామ్, ఉద్యోగులు సకాలంలో చికిత్స చేయించడంతో సాహెబ్కు ప్రాణాపాయం తప్పినట్లయింది. చెరువులో మునిగి యువకుడు మృతిదమ్మపేట: కలువ పూల కోసం చెరువులో దిగిన యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని మందలపల్లి శివారు చింతలకుంట చెరువులోసోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథ నం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా టీ.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడేనికి చెందిన పచ్చి గోళ్ల ప్రవీణ్(29) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వినాయక చవితి పండుగకు హైదరాబాద్లో కలువ పూలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఇక్కడి నుంచి పూలు తీసుకెళ్లి విక్రయించాలని భావించాడు. ఈ క్రమంలో మొండితోక కృష్ణ అనే మిత్రుడితో కలిసి మండలంలోని ముష్టిబండలో ఉండే బంధువుల ఇంటికి ఆదివారం రాత్రి వచ్చాడు. సోమవారం ఉదయం వారిద్దరితో పాటు గ్రామానికి చెందిన చిలకా సత్తిబాబు కలిసి చింతలకుంట చెరువులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లిన ప్రవీణ్ కాళ్లకు పచ్చిరొట్ట చుట్టుకుపోగా నీటిలో పూర్తి గా మునిగి మృతిచెందాడు. కాగా, ప్రవీణ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ..ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి(50) మృతి చెందాడు. వెయిటింగ్ హాల్లో ఆయన మృతదేహాన్ని గుర్తించగా ఆర్కే ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మధిర ప్రభుత్వాస్పత్రికి మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 98481 14202, 99636 41484 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మెడికల్ కాలేజీకి భౌతికకాయం
కొత్తగూడెంఅర్బన్: వామపక్ష భావాలు కలిగిన సామాజిక కార్యకర్త నామా వెంకటేశ్వరరావు మణుగూరులో ఆదివారం మృతి చెందగా ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు సోమవారం కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతకుముందే మణుగూరులో ఆయన కళ్లను కూడా దానం చేశారు. అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధంటేకులపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రేకుల ఇల్లు దగ్ధమై, సామగ్రి పూర్తిగా కాలిపోయిన ఘటన మండలంలోని పెట్రాంచెలక గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం రఘుపతి – భద్రమ్మ దంపతులు, వారి కుమారుడు నవీన్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. ఇంటి ముందు రేకుల షెడ్డులో ఆదివారం రాత్రి నిద్రించారు. దోమలు అధికం కావడంతో వేరే గదిలోకి వెళ్లి పడుకున్నారు. ఆ తర్వాత రాత్రి సుమారు 2 గంటల సమయంలో రేకుల షెడ్డులో మంటలు చెలరేగగా రఘుపతి, కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పేసరికే పల్సర్ బైక్, మంచాలు, కూలర్, టార్పాలిన్ పట్టాలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారి సౌజన్య ఘటనా స్థలా నికి చేరుకుని పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేశారు. మొత్తంగా రూ.3లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని, ఏడాది క్రితం కూడా తమ పొలంలో నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇద్దరు ఆర్టిజన్ల కుటుంబాలకు పరిహారంభద్రాచలంఅర్బన్: విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ 2023 ఆగస్టు 25న ప్రమాదవశాత్తు మరణించిన పినపాక ఆర్జిటన్ కొత్తపల్లి రమేష్, దుమ్ముగూడెం ఆర్జిటన్ తాటి కోటేశ్వరరావు కుటుంబాలకు ఎన్పీడీసీఎల్ నుంచి పరిహారం మంజూరైంది. ఈ మేరకు రమేష్ కుటుంబానికి రూ.12,03,500, కోటేశ్వరరావు కుటుంబానికి రూ.14,46,050 పరిహారం చెక్కులను సోమవారం భద్రాచలం డివిజనల్ ఇంజనీర్ కె.జీవన్కుమార్ అందజేశారు. అలాగే, రమేష్ కుటుంబానికి భద్రాచలం డివిజన్ విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. విదు్య్త్ శాఖ ఉద్యోగులు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందానికి అభినందన
ఖమ్మంక్రైం: పాల్వంచ మీదుగా అక్రమంగా తరలిస్తున్న మారణాయుధాలు, ఎండు గంజా యిని ఇటీవల చాకచక్యంగా స్వాధీనం చేసుకు న్న ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు. హైదరాబాద్లో ఆబ్కారీ భవన్లో సోమవారం అభినందించిన ఆయన రూ. 50వేల క్యాష్ రివార్డ్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్ఫోర్స్మెంట్ బృందంలో అసిస్టెంట్ కమిషనర్ ఏ.గణేష్, ఎకై ్సజ్ అధికారులు, ఉద్యోగులు ఎస్.రమేష్, సీహెచ్.శ్రీహరిరావు, ఎంఏ.కరీం, జి.బాలు, కె.సుధీర్, టి.వెంకట్, హరీష్, వి.హన్మంతరావు, పి.విజయ్, వీరబాబు, ఉపేందర్ తదితరులు ఉన్నారు. ఇద్దరు మావోయిస్టుల అరెస్టుకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో కనిపించిన ఇద్దరు మావోయిస్టులను (దంపతులు) కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో సోమవారం ఎస్పీ రోహిత్రాజు వివరాలు వెల్లడించారు. మావోయిస్టులు ఓయం భూదు, పోడియం రామేలను అరెస్టు చేశామని తెలిపారు. ఓయం భూదు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీసు స్టేషన్ పరిధి తుమ్మినార్ గ్రామానికి చెందిన ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించామని చెప్పారు. 2009లో మావోయిస్టు పార్టీలో చేరి 2014లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడని తెలిపారు. 2020లో పోలీసులపై కాల్పులు జరిపి ఎస్ఐ, పీసీలను హతమార్చిన ఘటనలో నిందితుడని వివరించారు. భూదు భార్య పొడియం రామే అలియాస్ శిల్ప 2018లో మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా పని చేస్తోందని తెలిపారు. రామే పై దాదాపు 60 కేసులు ఉన్నాయని చెప్పారు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో నిర్బంధం పెరగడంతో వివిధ ప్రాంతాలకు పారిపోతున్నారని, ఈ క్రమంలో వీరిద్దరినీ కొత్తగూడెం బస్టాండ్లో అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కోళ్ల గూటిలోకి తాచుపాము కొత్తగూడెంఅర్బన్: తాచుపాము ఇంట్లోకి దూరడంతో స్థానికులు ఆందోళన చెందుతుండగా ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ దాన్ని బంధించారు. కొత్తగూడెం న్యూగొల్లగూడెంలోని ఓ ఇంట్లో కోళ్ల గూటిలోకి సోమవారం ఐదు అడుగులు తాచుపాము చేరింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంతోష్ వెళ్లి దాన్ని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. -
పోడు విస్తరణను అరికట్టాలి
పాల్వంచరూరల్ : జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కొత్తగా పోడుసాగు విస్తరణ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ బి.భీమానాయక్ అధికారులను ఆదేశించారు. డీఎఫ్ఓ కిష్టాగౌడ్తో కలిసి సోమవారం ఆయన పాల్వంచ వైల్డ్లైఫ్ డివిజన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ కార్యాలయంలో రూ.6లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేసిన మీటింగ్ హాల్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అటవీ ప్రాంతంలో బీట్ల వారీగా నిరంతరం పర్యవేక్షించాలని, కొత్తగా పోడు సాగు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పారు. కొత్తగా పోడు సాగైతే ఆ ప్రాంత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ తర్వాత పాల్వంచ అటవీ డివిజన్ పరిధిలోని టేకులచెరువు, అంజనాపురం బీట్లలోని ప్లాంటేషన్ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ కట్టా దామోదర్రెడ్డి, వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబు తదితరులు పాల్గొన్నారు. సీసీఎఫ్ భీమానాయక్ -
ఏసీబీకి చిక్కిన ఏడీఏ
సూపర్బజార్(కొత్తగూడెం): ఎరువుల దుకాణం యజమాని నుంచి రూ. 25వేలు లంచం తీసుకుంటూ కొత్తగూడెం వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారావు సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక గ్రామంలో ఎరువుల షాపు యజమాని నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయిస్తున్నాడంటూ ఏడీఏ నరసింహారావు షోకాజ్ నోటీసు ఇచ్చారు. తాను నిబంధనల ప్రకారమే అమ్ముతున్నానని, షోకాజ్ నోటీసును ఉపసంసరించుకోవాలని దుకాణం యజమాని ఏడీఏను కోరగా రూ.50వేలు లంచంగా డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ శాఖ అధికారుల సూచన మేరకు షాపు యజమాని ఏడీఏ వద్దకు వెళ్లి రూ.50 వేలు ఇవ్వలేనని, కొంత తగ్గించమని కోరగా.. చివరకు రూ.25వేలకు బేరం కుదిరింది. ఈ క్రమంలో సోమవారం చుంచుపల్లి మండలం విద్యానగర్లోని తన కార్యాలయంలో ఏడీఏ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారానికి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో గతంలో నిర్మించిన పశువుల ఆస్పత్రి శిథిలావస్థకు చేరిందని, పశు వైద్యానికి ఇబ్బందిగా ఉందని, నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు దరఖాస్తు చేయగా పశుసంవర్థక శాఖాధికారికి ఎండార్స్ చేశారు. ● బూర్గంపాడు మండలం చింతకుంటలో 37 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ప్రధాన రహదారి నుంచి గ్రామానికి సరైన రోడ్డు లేదని, తాగునీటి సమస్య ఉందని, చిన్నపిల్లలకు అంగన్వాడీ పాఠశాల లేదని, విద్యుత్ సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు చేసిన దరఖాస్తును తగిన చర్యల నిమిత్తం కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. ● స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ మోదుగు జోగారావు, బహుజన సంఘాల జిల్లా కన్వీనర్ వేల్పుల నరసింహారావు దరఖాస్తు చేశారు. ● రేషన్ డీలర్లకు ఐదు నెలల కమీషన్ అందించాలని, లేదంటే సెప్టెంబర్ 5 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊకే శేఖర్రావు వినతిపత్రం అందించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
కూరగాయల సాగుతో అదనపు ఆదాయం
కలెక్టర్ జితేష్ వి పాటిల్సుజాతనగర్: కూరగాయల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందొచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సుజాతనగర్, కొత్త అంజనాపురం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేస్తున్న కూరగాయల తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో కనీసం 10 గుంటల స్థలం కలిగిన ప్రతీ మహిళా రైతు కూరగాయల సాగుకు ముందుకు రావాలని అన్నారు. ఇందుకు అవసరమయ్యే జీఐ వైరు, వెదురుగడలు, పాలిథిన్ పేపర్, విత్తనాలు, ఫెన్సింగ్లకు తక్కువ ఖర్చుతో డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును రెండు రోజుల్లో ఇవ్వాలని, ఆ రిపోర్ట్ ఆధారంగా జిల్లాలో 1000 మంది మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిని సందర్శించి ల్యాబ్, మందుల గదిని పరిశీలించారు. మందులు సరిపడా ఉన్నాయా అని వైద్యాధికారి రమేష్ను అడిగి తెలుసుకున్నారు. ర్యాపిడ్ కిట్లు, వ్యాక్సిన్ల నిల్వలను తనిఖీ చేశారు. ఆ తర్వాత రాఘవాపురం రహదారి పక్కన ఏర్పాటు చేసిన కొర్రమేను చేపల పెంపకం యూనిట్ను పరిశీలించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. అక్కడే కూరగాయల సాగు, కౌజు పిట్టల పెంపకం చేపడితే అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ శౌరభ్శర్మ, ఫాం ఏపీఎం వెంకయ్య, తహసీల్దార్ వనం కృష్ణప్రసాద్, ఎంపీడీఓ బి.భారతి, ఏపీఎం రాంబాబు, ఏఓ జి.నర్మద, సీసీ శిరీష తదితరులు పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలి..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 21 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి అనుమతి వచ్చిందని, నాలుగేళ్లు నిండిన చిన్నారులను బడిలో చేర్పించేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. పిల్లలకు కావాల్సిన యూనిఫాం, పుస్తకాలు, క్రీడా పరికరాలతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీసం 20 మంది పిల్లలు ఉండేలా చూడాలని, సెప్టెంబర్ 1 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో డీఈఓ నాగలక్ష్మి, అదనపు కలెక్టర విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: గిరిజనాభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హతల మేరకు దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా అధి కారులు కృషిచేయాలని సూచించారు. స్వయం ఉపాధి, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించుకుని అర్థికాభివృద్ధి సాధించాలని గిరిజనులను కోరారు. సోలార్ ద్వారా బోరు బావులు తవ్వించాలని, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలని, పోడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యం తదితర సమస్యలపై దరఖాస్తులు అందించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏఓ రాంబాబు, డీడీ మణెమ్మ, గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ హరీష్, ఏడీఎంహెచ్ఓ సైదులు, ఎస్ఓ భాస్కరన్, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, ఏపీఓ వేణు, లింగానాయక్, రాజారావు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థులకు అభినందన.. వివిధ అంశాల్లో రాణిస్తున్న గిరిజన విద్యార్థులను పీఓ రాహుల్ తన చాంబర్లో అభినందించారు. హనుమకొండలో 34వ సౌత్ జోన్ మీట్ రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలానికి చెందిన బట్ట పృథ్విక, జావలిన్త్రోలో ఎస్.కె అమ్రిన్, కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చగా వారిని అభినందించారు. వారికి రెండు జతల ట్రాకింగ్ షూస్ అందించారు. అదేవిధంగా చిత్ర కళలో రాణిస్తున్న ఇర్పా స్వాతి పెయింటింగ్లను పరిశీలించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
13 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
కొత్తగూడెంటౌన్: సైబర్ మోసాలకు పాల్పడిన టేకులపల్లికి చెందిన 13 మంది యువకులు జైలు పాలయ్యారు. జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వీరిని టేకులపల్లి, సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా.. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్రాజు సోమవారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. టేకులపల్లిలో మీ సేవా కేంద్రం నిర్వహిస్తున్న బోడ శ్రీధర్కు టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పారు. దీంతో శ్రీధర్ మరో 12 మందితో కలిసి సైబర్ మోసాలకు పాల్పడ్డారు. టేకులపల్లి మండలానికి చెందిన పలువురితో నకిలీ పత్రాలు సృష్టించి 60 కరెంట్ అకౌంట్లు తెరిచి ఇతరుల బ్యాంకు ఖాతాలోకి నగదును పంపిస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. టేకులపల్లి మండలానికి చెందిన బోడ శ్రీధర్, బోడ రాజేష్, బోడ రాజన్న, బానోతు జగదీష్, తేజావత్ నరేష్, పోలేపొంగు పవన్ కళ్యాణ్, భూక్యా వీరన్న, జాటోతు నరేష్, బోడ జంపన్న, బోడ రాజారాం, భూక్య ప్రవీణ్కుమార్, మాలోతు ప్రవీణ్, ఉరిమల్ల భరత్కృష్ణ కలిసి సైబర్ మోసాలకు పాల్పడుతూ.. గత ఆరు నెలలుగా మొత్తం రూ.8.5 కోట్లు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని, అందుకు కారణమైన ఈ 13 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 12 సెల్ఫోన్లు, బ్యాంకు పాస్బుక్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం ఇల్లెందు కోర్టుకు తరలించామని తెలిపారు. సమావేశంలో టేకులపల్లి, సైబర్ క్రైం సీఐలు బి.సత్యనారాయణ, ఎస్ఐ ఎ. రాజేందర్ పాల్గొన్నారు. -
సమయమే సమస్య!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిన్నా మొన్నటి వరకు దక్షిణ భారతదేశ పారిశ్రామిక అవసరాలకు బొగ్గు సరఫరాలో సింగరేణి సంస్థకు తిరుగులేదు. కానీ ఇప్పుడు కోలిండియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఈ పోటీ నుంచి గట్టెక్కాలంటే ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం మినహా సింగరేణికి మరోదారి లేని పరిస్థితి కనిపిస్తోంది. చేజారిపోతున్న వినియోగదారులు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 80 శాతానికి పైగా బొగ్గు దక్షిణ భారత దేశంలో ఉన్న థర్మల్ విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తోంది. అయితే బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే బొగ్గు లభిస్తుండడం సంస్థకు సంకట పరిస్థితిని తెస్తోంది. ఇప్పటికే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంస్థ సింగరేణితో కోల్ లింకేజీపై పునరాలోచన చేస్తుండగా.. ఇప్పుడు అదే బాటలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏజీ జెన్కోలు నడుస్తున్నాయి. సింగరేణి సరఫరా చేస్తున్న బొగ్గు ధరతో పోల్చితే తక్కువ ధరకే అందిస్తామని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కోలిండియా ఆఫర్ ఇస్తోంది. రవాణా ఖర్చులన్నీ కలిపినా ఒక్కో టన్నుపై సగటున రూ.600 వరకు తక్కువ ధరకు కోలిండియా బొగ్గు అందుబాటులో ఉంటోంది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం మినహా సింగరేణికి మరో మార్గం లేదు. కార్మికుల గైర్హాజరు, ఉద్యోగుల పని గంటల్లో సమానత్వం, భారీ యంత్రాల వినియోగ సమయంలో సమర్థత వంటి విషయాల్లో సంస్థ వెనుకబడిపోతోంది. వారికి ఏడు గంటల పనే.. సింగరేణి సంస్థ పరిధిలో 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఇందులో బొగ్గు ఉత్పత్తిలో నేరుగా సంబంధం ఉండే కార్మికులు, ఇతర మైనింగ్ సిబ్బంది, అధికారులకు ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉంది. కానీ కంపెనీ లావాదేవీలు, కార్మికుల సంక్షేమం తదితర కార్యాలయ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఇప్పటికీ ఏడు గంటల పని విధానమే అమలవుతోంది. బ్రిటీషర్ల కాలంలో ప్రమాదకరమైన బొగ్గు ఉత్పత్తిలో ఉండే కార్మికులకు ఎక్కువ పని గంటలు ఉండగా, అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండే బ్రిటీష్ వారికి తక్కువ పని గంటలు ఉండేవి. అయితే ఇప్పటికీ ఇదే విధానం అమలు కావడం ఏంటని కార్మికుల నుంచి నిరసనలు వస్తున్నాయి. సంస్థలో అందరికీ ఒకే విధమైన పని గంటల విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఇప్పుడు భారీ యంత్రాలదే కీలక పాత్ర. ఓవర్ బర్డెన్ (మట్టి), బొగ్గు వెలికి తీయడం, భారీ యంత్రాల ద్వారా వెలుపలికి తీసుకురావడం.. ఇలా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే భారీ యంత్రాలు సంస్థ ఆధీనంలో 814 ఉన్నాయి. ఈ యంత్రాలను సగటున రోజుకు 18.20 గంటల పాటు నడిపించాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాలతో ప్రస్తుతం ఈ భారీ యంత్రాల వినియోగ సమయం సగటున 7.90 గంటలుగానే ఉంది. అంటే భారీ యంత్రాల గరిష్ట వినియోగ సమయంలో సగం కూడా ఉత్పత్తి కోసం వాడడం లేదు. దీంతో ఈ యంత్రాలపై పెట్టిన పెట్టుబడి, రుణాలకు వడ్డీ, యంత్రాలు నడిపే ఆపరేటర్ల వేతనాలు ఇలా అన్ని రకాలుగా వృథా అవుతోంది. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. యంత్రాలు సంఖ్య పని చేయాల్సిన వినియోగించే గంటలు గంటలు షావెళ్లు 66 19.70 12.70 డంపర్లు 417 18.70 9.40 డోజర్లు 109 16.10 4.80 డెరిల్స్ 48 19.70 6.50 ఇతర యంత్రాలు 174 18.20 7.90 మొత్తం 814 18.20 7.90 సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ కోల్ లింకేజీ (సాలీనా) ఎన్టీపీసీ 38 మి. టన్నులు కర్ణాటక 10 మి. టన్నులు ఏపీ 7 మి. టన్నులు -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 30న జిల్లాలో సీఎం పర్యటన ?దామరచర్లలో సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే జారే చండ్రుగొండ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలోని దామరచర్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సభాస్ధలిని, చండ్రుగొండలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించారు. సీఎం పర్యటన దాదాపు ఖరారైనట్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈనెల 21న బెండాలపాడులో సీఎం పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారని ముందు ప్రకటించగా ఆ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ కుంగ్ఫూ పోటీల్లో పతకాలుగుండాల/కొత్తగూడెంటౌన్ : హైదరాబాద్లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ కుంగ్ ఫు కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. గుండాలకు చెందిన మంకిడి చరణ్ తేజ్, గుగులోత్ గౌతమ్, సట్టు ఉదయ్కిరణ్ మూడు విభాగల్లో ప్రథమ స్థానం సాధించారు. అండర్–15 విభాగంలో జిల్లాకు చెందిన కె.లిఖిత్చరణ్ కటాస్లో బంగారు పతకం, అండర్–10లో బి. భానుకృష్ణ రజిత పతకం, అండర్–12 బాలికల విభాగంలో ఎ.ఆశ్రిత కటాస్లో బంగారు పతకం, అండర్–10 బాలికల విభాగం కటాస్లో ఎస్.షణ్ముఖశ్రీ కాంస్య పతకం సాధించారు. కాగా, విజేతలను అంతర్జాతీయ కరాటే మాజీ క్రీడాకారుడు పి.కాశీహుస్సేన్, కోచ్ నిహారిక, జిల్లా రెజ్లింగ్ అసోసియోషన్ గౌరవాధ్యక్షుడు నాగ సీతారాములు, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాబీర్పాషా, జిల్లా కుంగ్ఫు కరాటే మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.ఆదినారాయణ తదితరులు అభినందించారు. బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఈ విధులు నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. కాగా, విజయలక్ష్మి గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పని చేయగా, పదోన్నతి లభించింది. -
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
● విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మార్పులు ● సకల సౌకర్యాలతో సిద్ధమైన ఖమ్మం ఏటీసీ ● ఈనెల 28వరకు ప్రవేశాలకు కౌన్సెలింగ్ఖమ్మం సహకారనగర్: ఐటీఐ కోర్సులతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయనే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కల్పించేలా ప్రభుత్వం, అధికారులు, ఐటీఐ కళాశాల బాధ్యులు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలుండగా... గత ఏడాది వీటిని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా మార్పు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో రాష్ట్రంలోని మూడు కళాశాలలను మోడల్ ఏటీసీగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఈ జాబితాలో ఖమ్మంలోని టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఉంది. ఇక నూతనంగా ప్రభుత్వం తెలంగాణ గేట్ ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీ–గేట్) విధానా న్ని ప్రవేశపెట్టింది. టీ–గేట్తో ఐటీఐ (ఏటీసీ)లో ప్రాంగణ నియామకాలు పెంచి విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కృషి చేయనున్నారు. టీ–గేట్తో ఉపాధి.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–గేట్తో ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. తెలంగాణ గేట్ఫర్ అడాప్టింగ్ అండ్ ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ (టీ–గేట్) పథకం ద్వారా జిల్లాలోని పరిశ్రమల్లో విద్యార్థులకు ఉద్యోగ కల్పన చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రధాన పరి శ్రమ లేదా సంస్థ డైరెక్టర్, సీఎండీ స్థాయి అధికారి కమిటీ చైర్మన్గా, కార్మిక విభాగం అధికారి వైస్ చైర్మన్గా, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కన్వీ నర్గా ఉంటారు. ఈ కమిటీ జిల్లాలోని పరిశ్రమల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. ఐటీఐ విద్యార్థులతో భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తుంది. దీనిద్వారా పరి శ్రమల్లో ఖాళీలు భర్తీ కావడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగాలు దక్కుతాయి. అలాగే పరిశ్రమల్లో ఖాళీలు భర్తీ చేసినందుకు గాను ఆయా పరిశ్రమలు సీఎస్ఆర్ పథకం కింద ఐటీఐ కళాశాలలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాయి. అలాగే పరిశ్రమల్లో అవసరమైన అర్హతలు కలిగిన ఉద్యోగి ఐటీఐల్లో లేకపోతే.. అలాంటి విభాగాల్లో ప్రత్యేకంగా ఐటీఐ లో శిక్షణ అందించి ఆయా ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను ఐటీఐలు తీసుకుంటాయి. దీని ద్వారా ఐటీఐతో విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ టీ–గేట్ పనిచేస్తోంది. నగరంలోని ఏటీసీ కేంద్రంలో విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులకు సంబంధించిన సామగ్రి అంతా చేరడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొనసాగుతున్న ప్రవేశాలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏడు కోర్సులు ఉండగా... వీటిలో కోర్సు ఆధారంగా విద్యార్థుల ప్రవేశాలు ఉంటున్నాయి. అన్ని కోర్సులకు సంబంధించి 172 సీట్లకు గాను 166 భర్తీ అయ్యాయి. ఇక ఏటీసీ లో గతఏడాది 172సీట్లకు గాను అన్నీ భర్తీ అయ్యా యి. ఈ విద్యా సంవత్సరంలో 172 సీట్లకు 165 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయి. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ రెండో దశ ముగిసింది. కొత్తగా వాక్ ఇన్ అడ్మిషన్ పేరుతో ప్రవేశాలు కల్పించేందుకు నిర్ణయించారు. ఈమేరకు అర్హత కలిగిన అభ్యర్థులు 28వ తేదీ వరకు ప్రతిరోజు 11 గంటల్లోగా ఆన్లైన్లో నమోదు చేసుకొని కళాశాలల్లో దరఖాస్తు ఫారంతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్లు సమర్పిస్తే పరిశీలించి ఖాళీల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ప్రవేశాలకు ముమ్మర ప్రయత్నాలు ఇటీవల టీ–గేట్ బృందం ప్రవేశాల పెంపు, కావాల్సిన సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై సమీక్ష నిర్వహించింది. ఇందులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అందుకు అవసరమైన ప్రణాళికలు రూ పొందించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి ఆయా అంశాలను వివరించారు. ఇదిలా ఉండగా కలెక్టర్ అనుదీప్ ఇటీవల ఐటీఐని సందర్శించి పలు సూచనలు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్, కేఎంసీల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ఐటీఐల్లో ప్రవేశాల పెంపునకు అధికారులతో చర్చించారు.ఐటీఐ విద్యను అభ్యసించడం వల్ల విద్యార్థులకు చదువుతోపాటే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలు చూపించగా.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీ–గేట్ ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్య, ఉపాధితోపాటు కళాశాలలో అవసరమైన సదుపాయాలు సైతం సమకూరడంతో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి. – ఎ.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, టీ–గేట్ కన్వీనర్ -
ఉద్యమకారుల డిమాండ్లు అమలు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతిరామ్ అన్నారు. ఆదివారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్కార్డులు, ఆర్టీసీ బస్పాస్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. చాలామంది ఉద్యమకారులు అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతున్నారని, వారికి ఇప్పటికై నా సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో వందనపు సూర్యప్రకాష్, గెర్షోము, గఫార్, సారయ్య, కనకయ్య, నరేంద్రుల ఉపేందర్రావు, నర్సింహారావు, శేషంరాజు, గౌతం, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. గోదావరిలో కొట్టుకొచ్చిన గేదె సురక్షితం ● రక్షించిన ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక పోలీసులు భద్రాచలంఅర్బన్: భద్రాచలం నదిలో ఎగువ నుంచి కొట్టుకొస్తున్న ఓ గేదెను ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వివరాలిలా.. ఆదివారం గోదావరిలో ఓ గేదె కొట్టుకొస్తుండగా.. గమనించిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అధికారులు వెంటనే లాంచీ ద్వారా వెళ్లి తాళసాయంతో దాన్ని ఒడ్డుకు చేర్చారు. అనంతరం దానికి వైద్య పరీక్షలు చేయించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం లీడింగ్ ఫైర్ ఫైటర్ సాధిక్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యాదికారులు సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ బోర్డు నిర్వహణపై కార్మికుల ఆందోళనసింగరేణి(కొత్తగూడెం): మెడికల్ బోర్డు నిర్వహణపై కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే ఈ బోర్డును రద్దు చేసి మరో బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ఏబీకేఎంఎస్ జాతీయ నాయకుడు పి.మాదవనాయక్ పేర్కొన్నారు. ఆదివారం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని మిలీనియం డీ కాలనీ కార్మిక వాడల్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గత నెలాఖరులో నిర్వహించిన రిఫరల్ బోర్డులో 54 మంది హాజరు కాగా అందులో 5గురిని అన్ఫిట్ చేయడంతో సుమారు 9 నెలల పాటు వారు విధులకు వెళ్లలేదన్నారు. గుండె, కిడ్నీ, పెరాలసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ఎలాంటి ఆధారాలతో ఫిట్ చేశారో యాజమాన్యం స్పష్టత ఇవ్వాలన్నారు. సర్వీస్ నిబంధనలు లేకుండా అందరినీ ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ ఉపాధ్యక్షులు రాంసింగ్, జీవీ కృష్ణారెడ్డి, మొగిలిపాక రవి, కె.ప్రకాశ్, చంద్రశేఖర్, రేణుక, ఇనపనూరి నాగేశ్వరరరావు, శ్రవన్కుమార్, ధరావత్ నాగేశ్వరరావు, రాజేష్, వడ్డీకాసులు, గోపీకృష్ణ, సుధాకర్, ఎండీ కాలనీ వాసులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రోటవేటర్ కింద పడి బాలుడి దుర్మరణంకూసుమంచి: మండలంలోని లోక్యాతండా శివారు కొత్తతండాలో రోటవేటర్ కిందపడి ఓ బాలుడు దుర్మ రణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన వడిత్యారాంబాబు తనట్రాక్టర్ రోటవేటర్తో దుక్కి దున్నేందుకు వెళ్లాడు. అతడి ఆరేళ్ల కుమారుడు భువనేశ్వర్ను ట్రాక్టర్పై ఎక్కించుకుని దుక్కిదున్నుతుండగా బాలుడు ప్రమాదవశాత్తు రోటవేటర్ కింద పడి మృతిచెందాడు. కళ్లముందే కన్న కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి ఖమ్మంరూరల్: మండలంలోని తల్లంపాడు వద్ద గల ఓ వెంచర్లో గడ్డిమందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసు మంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన అంబాల భాస్కర్ (28) డిగ్రీ వరకు చదువుకున్నాడు. కొంతకాలం ఖమ్మంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేశాడు. ఆ ఉద్యోగం మానేసి ప్రస్తుతం వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఈ నెల 14న వెంచర్లో గడ్డిమందు తాగాడు. విషయం తెలు సుకున్న బంధువులు ఆయన్ను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివా రం మృతిచెందాడు. మృతుడి తండ్రి బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. -
కనకగిరి గుట్టలపై కలెక్టర్
చండ్రుగొండ : విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన తనయుడు రాఘవ్ వి పాటిల్తో కలిసి ఆదివారం కనకగిరి గుట్టలు ఎక్కారు. గుట్ట కింద నుంచి ఉదయమే కాలినడక వెళ్లి హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్నారు. అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ప్రవహించే వాగు, చెక్డ్యాం వద్ద తనయుడితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ ప్రాంతంలో ఉన్న చెట్లు, అహ్లాదపరిచే ప్రకృతిని కుమారుడికి వివరించారు. వారి వెంట దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్, నాయకులు భోజ్యానాయక్, నాగరాజు ఉన్నారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్ర కూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మం బ్యాంక్ కాలనీకి చెందిన పోట్ల వంశీకృష్ణ రూ.1,00,116 వితరణగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ లింగాల సాయిబాబు, వేద పండితులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో వచ్చేనెల 2న వ్యాపార దుకాణాల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ఈనెల 22న నిర్వహించిన వేలానికి పాటదారులు రాకపోవడంతో వాయిదా వేసిన విషయం విదితమే. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై ప్రజావాణిలో లిఖిత పూర్వకంగా వినతులు అందజేయాలని సూచించారు. కిన్నెరసానికి పోటెత్తిన పర్యాటకులుఒకరోజు ఆదాయం రూ.40,500పాల్వంచరూరల్ : మండలంలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 520 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.28,350 ఆదాయం లభించగా, 220 మంది బోటు షికారు చేయడంతో టూరిజం కార్పొరేషన్కు రూ.12,150 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. -
జోరుగా వన మహోత్సవం
చుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం జిల్లాలో 71.41 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం గతేడాది అక్టోబర్ నుంచి జిల్లాలో 481 హరిత, మరో 32 అటవీ శాఖ నర్సరీల్లో 20 రకాల మొక్కలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జూలైలో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈసారి కూడా జూలై రెండో వారం నుంచే గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో పలు శాఖలు ముందు వరుసలో నిలవగా, కొన్ని శాఖలు మాత్రమే లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డాయి. ఆగస్టు మొదటి వారం నుంచి వన మహోత్సవం జోరందుకోవడంతో పలు శాఖలు లక్ష్యాలను చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం సైతం తొందరగానే ముగియనుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 80.20 శాతం అంటే.. 57.27 లక్షల మొక్కలు నాటారు. ఇంకా 1,41,4031 మొక్కలు నాటాల్సి ఉంది. లక్ష్యానికి చేరువలో శాఖలు.. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట మున్సిపాలిటీలతో పాటు జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో జూలై నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు పంపిణీ చేసి నాటించే లక్ష్యాలను కేటాయించారు. ఈసారి వన మహోత్సవ లక్ష్యసాధనలో డీఆర్డీఏ, అటవీశాఖ, టీజీఎఫ్డీసీ, ముందువరసలో నిలిచాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 130.27 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. డీఆర్డీఏ శాఖకు 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, 106.86 శాతంతో ఇప్పటి వరకు 32.05 లక్షల మొక్కలు నాటారు. టీజీఎఫ్డీసీ ఆధ్వర్యంలో 12.90 లక్షల మొక్కలకు గాను 78.21 శాతంతో 10.08 లక్షల మొక్కలు నాటారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 37.72 శాతం, మణుగూరులో 22.95 శాతం మాత్రమే మొక్కలు నాటారు. ఇక సింగరేణి సంస్థ తమ పరిధిలోని ఏరియాల్లో 58.35 శాతంతో 1.92 లక్షల మొక్కలు నాటింది. వ్యవసాయ శాఖ సైతం 85.26 శాతంతో 4.26 లక్షల మొక్కలు నాటింది. పాఠశాల విద్యాశాఖ, సంక్షేమ, వైద్యారోగ్య, మార్కెటింగ్, సహకారశాఖ, విద్యుత్ శాఖలు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు నాటిన 57.27 లక్షల మొక్కలకు గానూ 20.44 లక్షల మొక్కలకు అధికారులు జియో టాగింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో ఒక్క డీఆర్డీఏకు చెందిన మొక్కలే అత్యధికంగా 14.32 లక్షల వరకు ఉన్నాయి. వన మహోత్సవంలో నాటుతున్న మొక్కలకు సంరక్షణ చర్యలను అటవీశాఖ చేపడుతోంది. వనమహోత్సవలో భాగంగా ఈ ఏడాది జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జిల్లాలో అన్ని శాఖలు ఉత్సాహంగా ఈసారి వన మహోత్సవంలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది నిర్దేశించిన 71.41 లక్షల మొక్కల టార్గెట్లో ఇప్పటివరకు 57.27 లక్షల మొక్కలు నాటారు. భద్రాద్రిని హరిత జిల్లాగా తీర్చిదిద్దడమే అటవీ శాఖ ప్రధాన లక్ష్యం. – కిష్టాగౌడ్, డీఎఫ్ఓ -
ఈవీ.. రయ్ రయ్!
ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల ద్వారా విద్యుత్శక్తితో నడుస్తాయి. వీటికి ఇంజన్లు ఉండవు. దీంతో వాయుకాలుష్యం చాలా తక్కువ. పర్యావరణ హితంగా ఉంటాయి. వీటిలో ఎటువంటి కాలుష్యాన్ని ఉత్పత్తి చేయని మోటార్ ఉంటుంది. ప్రస్తుత కాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడం ద్వారా వాతావరణ కాలుష్యం నివారించేందుకు వీలవుతుంది. ఇక వాహనాల నుంచి అతి తక్కువ శబ్దం రావడంతో పాటు ప్రయాణం చాలా మృదువుగా సాగుతుంది. ఈ వాహనాలను చార్జింగ్ చేసేందుకు స్టేషన్ల కొరత ఉంది. రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాల్లోనే చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక జిల్లాలో ఈ చార్జింగ్ స్టేషన్లు అసలే లేవు. దీంతో వాహనాలను కొనుగోలు చేసిన వారు ఇంటివద్దే చార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తోంది. మధ్య మధ్య చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో ఎక్కువ దూరం ఈ వాహనాలపై ప్రయాణించలేకపోతున్నారు. అయితే రానున్న కాలంలో పలు ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగితే చార్జింగ్ స్టేషన్లు కూడా అనివార్యంగా రానున్నాయి. స్టేషన్లు ఏర్పాటు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాహనాలకు చార్జింగ్ పెట్టాలంటే ఎక్కువ సమయం పడుతోందని యజమానులు చెబుతున్నారు. -
బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి
కొణిజర్ల: బాలికలను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్ది, వారి సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) అరుణకుమారి అన్నారు. మండలంలోని తనికెళ్ల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఆదివారం డిగ్రీ ప్రథమ సంవత్సర బాలికలకు స్వాగత వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణకుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్లో పట్టు సాధించాలని సూచించారు. బాలికల అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతోందని, గురుకులాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదవాలని, భవిష్యత్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాలికల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ కె. రజని అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, వివిధ విభాగాల కోఆర్డినేటర్లు కె.పి. ఐశ్వర్య, ఎ.దీప్తి, ఎన్సీసీ కోఆర్డినేటర్ కె.రజిత తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి -
‘ఉపాధి’ కౌజులు..!
కొత్తగూడెంఅర్బన్: మహిళ లను ఆర్థికంగా బలో పేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను వివిధ వ్యాపారాలు చేసేందుకు ప్రోత్సహిస్తూ రుణాలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ గ్రామపంచాయతీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసి దుర్గాంబిక ఎస్హెచ్జీ, అరుణోదయ గ్రామ సమాఖ్య ఆధ్వర్యాన ప్రణజ కౌజు పిట్టల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కౌజుపిట్టల పెంపకం సజావుగా సాగి ఆశించిన విధంగా అమ్మకాలు జరిగితే జిల్లాలోని ప్రతీ మండలంలో ఏర్పాటు చేసేలా అధికారులు నిర్ణయించారు. దీంతో అన్ని మండలాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకాలు ప్రారంభించే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి డిమాండ్.. హోటళ్లు, రెస్టారెంట్లలో కౌజుపిట్టల మాంసానికి మంచి డిమాండ్ ఉంది. దీంతో వీటి పెంపకం, అమ్మకాలు చేయడంతో మంచి లాభాలు గడించే అవకాశం ఉంటుందని డీఆర్డీఏ, మహిళా సంఘాల అధికారులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ ప్రయోజనాలు ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుండగా.. మహిళా సంఘాల ఆధ్వర్యాన పెంపకం జరుగుతున్న నేపథ్యాన హోటళ్లు, రెస్టారెంట్ల వారు కూడా నమ్మకంతో వాటిని కొనుగోలు చేసి ఆహారప్రియులకు అందించే అవకాశం ఉంటుంది. పెంపకం, ఖర్చు ఇలా... పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న శేషగిరినగర్లో గత రెండు రోజుల క్రితం రూ.8వేలతో 600 పిల్లలు కొనుగోలు చేసి పెంపకాన్ని మొదలుపెట్టారు. 25 నుంచి 30 రోజుల్లో ఇవి పెరగనుండగా.. వాటిని అమ్మి వేయొచ్చని, అదే 40 రోజులు అయితే గుడ్లు పెట్టే అవకాశాలుంటాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కాగా, పెంపకానికి కావాల్సిన షెడ్, అవి తినే ఆహారం, వాటి ఖర్చు మొత్తం కలిపి రూ.60 వేలకు పైన అయ్యిందని, ఇందులో రూ.30 వేల వరకు మహిళా సంఘం నుంచి రాగా, మరో రూ.30 వేలు నిర్వాహకులే భరించినట్లు చెబుతున్నారు. వీటిని ధర జత రూ.200 వరకు పలకనుంది. కౌజు పిట్ట మాంసంలో అధిక ప్రోటీన్లు, తేలికగా జీర్ణమవడం, రక్తహీనత, బలహీనత, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగవడం, కొవ్వు తక్కువ ఉండడంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల్లో వీటిని పెంచేందుకు అనువైన స్థలాలు ఉండగా.. గాలి, వెలుతురు ఉండే ప్రాంతాలు, డాబాపైన కూడా వీటిని పెంచవచ్చు. వీటికి 30 రోజుల పాటు గోధుమలు, బియ్యం, జొన్న, సజ్జ, మినుములతో కూడిన ఆహారాన్ని అందించి, ప్రతి రోజు అవి పెరిగే పరిసరాలను శుభ్రపరిస్తే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి. పిట్టలు చనిపోకుండా సరైన టీకాలు వేయించి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. -
2 కే రన్కు అనూహ్య స్పందన
కొత్తగూడెంటౌన్: మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కొత్తగూడెంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్కు అనూహ్య స్పందన లభించింది. స్థానిక పోస్టాఫీస్ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది. ఈ సందర్భంగా డీవైఎస్ఓ పరంధామరెడ్డి మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో క్రీడలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ధ్యాన్చంద్ ప్రతీ క్రీడాకారుడికి ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో జేబీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్, కోచ్లు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
గోపాల కృష్ణుడి లీలలు అంతా ఇంత కాదయా..
● ఫేక్ అటెండెన్స్లో అందరికీ సుపరిచితుడు ● తాజాగా నకిలీ మద్యం కేసులో ఏ1గా అరెస్టు, రిమాండ్టేకులపల్లి: మండలానికి చెందిన ఓ కార్యదర్శి విధుల పట్ల నిర్లక్ష్యంతో పాటు ఫేక్ అటెండెన్స్లో సుపరిచితుడు. తాజాగా అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కిష్టాపురం గ్రామానికి చెందిన ఒర్సు గోపాలకృష్ణ 2017లో టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శిగా విధుల్లో చేరాడు. రెండేళ్ల క్రితమే కోయగూడెం పంచాయతీకి బదిలీ అయి డిప్యూటేషన్పై తిరిగి తడికలపూడికి రావడంతో పాటు దాసుతండా పంచాయతీకి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈనెల 18న మండలంలో మంత్రి పొంగులేటి పర్యటనలో భాగంగా తడికలపూడి పంచాయతీలో బీటీ రోడ్డు శంకుస్థాపన రోజు కనిపించిన సదరు కార్యదర్శి మరుసటి రోజు నుంచి విధులకు హాజరు కాలేదు. 20న తన పిల్లలకు డెంగీ జ్వరం వచ్చిందని విధులకు రాలేనని అధికారులకు ఫోన్ ద్వారా తెలిపినట్లు సమాచారం. 22న తడికలపూడి, దాసుతండాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలకూ రాకపోవడంతో సమీప పంచాయతీ కార్యదర్శులతో ఎంకై ్వరీ చేయాల్సి వచ్చింది. కార్యదర్శి లీలలు.. ●జిల్లా వ్యాప్తంగా 42 మంది కార్యదర్శులు ఫేక్ అటెండెండెన్స్లో దొరికితే.. అందులో సదరు కార్యదర్శి గోపాలకృష్ణ ఏకంగా 21 రోజుల పాటు తన నైపుణ్యం ప్రదర్శించాడు. ●మండలంలో మిషన్ భగీరథతో పాటు రోడ్లు, కాల్వల నిర్మాణాలకు కాంట్రాక్టర్గా చేసినట్లు చర్చ జరుగుతోంది. ●విధుల పట్ల నిర్లక్ష్యం, అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తాడనే ఆరోపణలు కోకొల్లలు. నకిలీ మద్యం దందా.. కార్యదర్శిగా, కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చిన ఆదా యం సరిపోవడం లేదని అక్రమ సంపాదన కోసం నకిలీ మద్యం దందాలో సదరు కార్యదర్శి పోలీసులకు దొరికిపోవడం గమనార్హం. ఈనెల 21న మహబూబాబాద్జిల్లాలో అక్రమ నకిలీ మద్యం తయా రు చేస్తూ అరెస్టయిన కేసులో సదరు కార్యదర్శి ఏ1గా ఉండడంవిశేషం. ఇదిలా ఉండగా నకిలీ మద్యంకేసులో కార్యదర్శి అరెస్టు, రిమాండ్ ఘ టన పై మండల అధికారులు జిల్లా అధికారులకులేఖద్వారా విషయం తెలియజేసినట్లు సమాచారం. -
వరదకు వాన తోడైతేనే..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద నుంచి భద్రాచలం పట్టణానికి రక్షణ కోసం 20 ఏళ్ల క్రితం కరకట్ట నిర్మించారు. ఈ క్రమాన పట్టణంలోని మురుగు నీరు గోదావరిలో కలిసేలా ఆరు చోట్ల స్లూయీస్ గేట్లు బిగించారు. ఈ గేట్ల సగటు ఎత్తు 38 అడుగులుగా ఉంది. సాధారణ రోజుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా పట్టణంలోని మురుగు నీరు గోదావరిలో కలుస్తోంది. కానీ గోదావరి వరద నీటిమట్టం 38 అడుగులకు చేరగానే పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. మురుగు నీరు గోదావరిలో కలవడం మాటేమో కానీ.. వరద నీరే స్లూయీస్ల ద్వారా పట్టణంలోకి చేరుతోంది. దీంతో వరద నీటి మట్టం 35 అడుగులకు చేరగానే మురుగునీరు వెళ్లే స్లూయీస్ గేట్లు మూసేస్తారు. ఆపై మురుగు నీటిని మోటార్ల ద్వారా గోదావరిలోకి ఎత్తిపోస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇటు వరద, అటు పట్టణంలో వర్షం ఒకేసారి కురిస్తే నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాక మురుగు, వర్షపు నీరు కలిసిన వరద.. కరకట్ట నుంచి వెనక్కి తన్ని ఆలయ పరిసరాలను ముంచెత్తడం సర్వసాధారణంగా మారుతోంది. ఏ ఇబ్బందీ లేకుండా.. సాధారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరకముందే మురుగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి స్లూయీస్ గేట్లు మూసేస్తారు. దీంతో సీతారామచంద్రస్వామి కొలువైన భద్రగిరులు, పోకల దమ్మక్క నిత్యాన్నదానసత్రం, విస్తా కాంప్లెక్స్ పరిసరాలు నీటిలో చిక్కుకుపోతాయి. కానీ ఈసారి ఇంచుమించు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరినా ఎక్కడా వరద తాలుకూ ఆనవాళ్లు కనిపించలేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఆలయం చుట్టూ రాకపోకలు సాగించగా.. చిరువ్యాపారుల కార్యకలాపాలు సాఫీగా కొనసాగాయి. అయితే, గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద వచ్చినా పట్టణంలో భారీ వర్షం లేకపోవడంతో రోజువారీ డ్రెయినేజీ నీరు ఎత్తిపోతలతో సమస్య రాలేదు. కానీ గడిచిన వారంలో భద్రాచలంలో భారీ వర్షం కురిస్తే ఆలయ పరిసరాల్లో మురుగు ముంపు సమస్య ఎదురయ్యేది. కొత్త డ్రెయినేజీ వ్యవస్థతోనే.. ప్రతీసారి వరద వచ్చినప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదని భావించలేం. అందుకే మురుగు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భద్రాద్రి వాసులు, రాష్ట్ర వ్యాప్తంగా రామయ్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలంలో ఎంత వర్షం పడినా నీరు సాఫీగా పల్లపు ప్రాంతాలకు వెళ్లేలా కొత్త డ్రెయినేజీ వ్యవస్థను అందుబాటులోకి తేవాలంటున్నారు. అలాగే, ప్రస్తుతం స్నాన ఘట్టాలకు ఎగువన వంద మీటర్ల లోపే స్లూయీస్ల ద్వారా మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. భద్రాద్రి క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత, ఆలయ పవిత్రతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త డ్రెయినేజీ వ్యవస్థతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. మురుగునీటి శుద్ధితో స్నాన ఘట్టాల వద్ద మురుగునీరు పారకుండా ఉంటుంది.ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రాచలం దగ్గర గోదావరిలో వరద నీటి మట్టం 38.20 అడుగులకు చేరింది. ఆ తర్వాత గంటగంటకూ పెరుగుతూ 43 అడుగులకు చేరగానే మొదటి, 48 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక 21న సాయంత్రం 8 గంటలకు 51.90 అడుగుల మేర వరద చేరింది. ఆ సమయంలో 13.66 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వేగంగా దిగువకు ప్రవహిస్తూ వెళ్లింది. ఇంకో 60 వేల క్యూసెక్కుల వరద వస్తే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యేది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సి వచ్చేది. కానీ 21వ తేదీ రాత్రి 9గంటల నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాకపోగా.. రెండో హెచ్చరిక కూడా ఎత్తేశారు.భద్రాచలానికి ముంపు గోదావరితో కాదు -
● పాల్వంచ పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు ● నిందితులను పట్టుకోవాలని ఎస్పీ ఆదేశం
ఐసీడీఎస్ సంరక్షణలో బాలికకొత్తగూడెంటౌన్: ఏపీలోని చింతూరు మండలానికి చెందిన బాలిక(17).. రాత్రి 11 గంటల సమయంలో పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని డివైడర్పై బిక్కుబిక్కుమంటూ కూర్చోగా.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఆలయ వాచ్మెన్ బాలికకు ఆశ్రయం కల్పించాడు. శనివారం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా.. వారు బాలికను కొత్తగూడెంలోని శక్తి సదన్కు తరలించి సంరక్షించారు. ఈ మేరకు సీడీపీఓ లక్ష్మీప్రసన్న ఆదివారం పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. అనంతరం బాలికను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. చింతూరు మండలానికి చెందిన బాలిక ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం కుంటలో బస్సు లేకపోవడంతో ట్రాలీ ఆటో ఎక్కింది. అయితే ట్రాలీలో ఉన్న యువకులు మధ్యలో తనకు కూల్డ్రింక్లో మద్యం కలిపి తాగించారని, ఆ తర్వాత మెలకువ వచ్చేసరికి పెద్దమ్మగుడి వద్ద ఉన్నానని చెప్పినట్లు ఐసీడీఎస్ అధికారులు వెల్లడించారు. బాధితురాలి వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించామని సీడీపీఓ లక్ష్మీప్రసన్న, బాలల సంక్షేమాధికారి హరికుమారి తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్యుల రిపోర్టు వస్తే కానీ వెల్లడి కాదని చెప్పారు. కాగా, బాధితురాలిపై అమానవీయంగా వ్యవహరించిన ఘటనను ఎస్పీ రోహిత్రాజు తీవ్రంగా పరిగణించారు. నిందితులను పట్టుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
కారు చోరీ కేసులో అరెస్ట్..
మణుగూరుటౌన్: మండలంలోని ఆదర్శ్నగర్లో ఓ వ్యాపారి కారును పార్క్ చేయగా చోరీ చేసిన గుర్తుతెలియని వ్యక్తులను మణుగూరు పోలీసులు ఆదివా రం అరెస్ట్ చేశారు. సీఐ నాగబా బు కథనం ప్రకారం.. ఈ నెల 13న మహ్మద్ ఫిరోజ్ తన కారు ను ఆదర్శ్నగర్లో పార్క్ చేయగా.. గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ మేరకు స్టేషన్లో కేసు నమోదు కాగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణుగూరు సుందరయ్యనగర్కు చెందిన లారీ మెకానిక్ షేక్ కరంతుల్ల, చెరువు ముందు సింగారానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ నాజీర్లను అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కారు చోరీ చేసినట్లు తెలిపి రిమాండ్కు తరలించారు. రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్ గుండాల: మండలంలోని మామకన్ను కాచనపల్లి అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆళ్లపల్లి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎస్సై సోమేశ్వర్ కథనం ప్రకారం.. ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాచనపల్లి అటవీ ప్రాంతం నుంచి పోలారం గ్రామానికి చెందిన రెండు ట్రాక్టర్లు ఇసుక లోడ్తో వెళ్తున్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు. -
ఉద్యమాలకు సిద్ధం కావాలి
బూర్గంపాడు: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమా అంజిరెడ్డి డిమాండ్ చేశారు. సారపాకలో శనివారం జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, హెల్త్కార్డులు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. హామీలు అమలు కాకుంటే ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమకారుల పిల్లలకు ఉచితంగా ఉన్నత చదువులు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలని, తమపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని అన్నారు. సమావేశంలో మలిదశ ఉద్యమకారులు తోడేటి సత్యనారాయణ, పొడియం నరేందర్, బాగి వెంకట్రావు, సోమయ్య, పేరాల శ్రీనివాసరావు, నల్లమోతు సురేష్, దాసరి సాంబయ్య, గుర్రాల సుదర్శన్, కొండగట్టు ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
ఇల్లెందు: ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో గత ఐదు నెలలుగా పెండింగ్ ఉన్న అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. శనివారం కోర్టును ఆయన సందర్శించగా.. స్థానిక న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రికరెడ్డి మొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన శాలు వతో సత్కరించారు. అనంతరం న్యాయమూర్తి కోర్డులో రికార్డులను తనిఖీ చేశారు. కాగా, కోర్టులో శౌచాలయాలు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన వినతి పత్రం అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తీక్, సీనియర్ న్యాయవాదులు దంతాల ఆనంద్, పెద్దూరి నర్సయ్య, గోపీనాథ్, నారాయణ, బా లకృష్ణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, ఎస్.సత్యనారాయణ, బన్సీలాల్ తదితరులు ఉన్నారు.ఫ్యాక్టరీకి ‘గెలల’ తాకిడి.. దమ్మపేట: మండల పరిధిలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి శనివారం ట్రాక్టర్లు బారులుదీరాయి. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒక్కసారిగా ఫ్యాక్టరీకి చేరుకోగా.. ప్లాట్ఫాం అంతా గెలలతో నిండిపోయింది. ఈ క్రమంలో గెలలను ప్లాట్ఫాం కింద ఉన్న మరో డంపింగ్ కన్వేయర్ బెల్ట్ వద్ద దిగుమతి చేస్తున్నారు. ఫ్యాక్టరీకి గెలల తాకిడి పెరగడంతో దిగుమతికి గంటల సమయం పడుతుందని రైతులు చెబు న్నారు. దీనిపై ఫ్యాక్టరీ మేనేజర్ కల్యాణ్ను వివరణ కోరగా.. ఇటీవల కురిసిన వర్షాలతో గెలల కోత ఆపిన రైతులు.. వర్షం తగ్గడంతో గెలల కోత ప్రారంభించడంతో ఫ్యాక్టరీకి తాకిడి పెరిగిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా క్రమ పద్ధతిలో దిగుమతి చేస్తున్నట్లు తెలిపారు. నీటిని త్వరగా ఎత్తిపోయాలిమణుగూరు టౌన్: బొగ్గు ఉత్పత్తికి ఆటంకంగా ఉన్న వర్షపు నీటిని ఉపరితల గనుల నుంచి త్వరితగతిన ఎత్తిపోయాలని డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్) వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన తొలుత పగిడేరు జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ను సందర్శించారు. 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ాధ్యన్ని పెంపునకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులతో సమాలోచన చేశారు. అనంతరం పీకేఓసీ–4ను సందర్శించి మాట్లాడారు. సమష్టి కృషితో ఉత్పత్తి సాధనకు పనిగంటలు పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్, జీఎం(ఆర్అండ్డీ) కనకయ్య, జీఎం(ఎక్స్ప్లోరేషన్) శ్రీనివాస్, డీజీఎం(ఎక్స్ప్లోరేషన్) రాజ్కుమార్, డీజీఎం(ఆర్అండ్డీ) శ్రీనివాస్, అధికారులు శ్రీనివాసచారి, దయాకర్, బైరెడ్డి వెంకటేశ్వర్లు, సేఫ్టీ అధికారి భాస్కర్, శ్రీనివాస్, ఎస్టేట్స్ బాబుల్ రాజ్, ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పత్తి ఎగుమతుల్లో నకిలీ దందా ఖమ్మంవ్యవసాయం/ఖమ్మం క్రైం: పత్తి ఎగుమతుల్లో ఖమ్మం వ్యవసాయ మా ర్కెట్ పరిధిలోని ఓ వ్యాపారి చేసిన నకిలీ దందా బయటపడింది. దీంతో ఆయనపై మార్కెట్ బాధ్యులు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఇత ర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులు మా ర్కెట్ నుంచి పర్మిట్లు పొందాలి. ఆ పర్మిట్ల ఆధారంగా ఎగుమతి చేస్తూ నిర్ణీత రుసుము మార్కెట్కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 2023లో ఖమ్మంకు చెందిన మహాలక్ష్మి కాటన్ ట్రేడర్స్ యజమాని మన్నెం కృష్ణయ్యకు మా ర్కెట్ నుంచి రశీదు పుస్తకం జారీ చేశారు. ఇందులోని ఓచర్ల ద్వారా పత్తిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేశా డు. ఆంధ్రప్రదేశ్లోని ఓ కంపెనీకి కూడా 1,100 క్వింటాళ్ల పత్తిని ఎగుమతి చేయగా, వారు అనుమానం వచ్చి ఆరా తీయడంతో నకిలీ పర్మిట్గా తేలింది. ఇదికాక పలు ఓచర్లతో నకిలీ పర్మిట్ సృష్టించినట్లు తేలడంతో కృష్ణయ్యపై మార్కెట్ కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. ఈ పర్మిట్ల ఆధారంగా సదరు వ్యాపారి మార్కెట్కు రూ.1.50 లక్షల పన్ను చెల్లించాల్సి ఉన్నట్లు తేలగా.. మొత్తం ఎగుమతులను పరిశీలిస్తే ఇది పెరిగే అవకాశముందని సమాచారం. కాగా, చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యాన ఈ విషయం బయటపడడం గమనార్హం. -
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టరేట్లో శనివారం ఆయన పలు శాఖల సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్సవ కమిటీల వారు గణేష్ మండపాలను విధిగా రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. మండపాలకు ఏర్పాటుచేసే విద్యుత్ కోసం ఆ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా రక్షణ చర్యలపై విద్యుత్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విగ్రహాలు నిమజ్జనానికి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, గుర్తించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం చేసేలా చూడాలని, అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలకు ముందుగా రవాణాశాఖ అధికారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాలని అన్నారు. ప్రతీ గణేష్ మండపం వద్ద అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. వీలైనంత వరకు మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఎస్పీ రోహిత్రాజ్, భద్రాచలం సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీపీఓ చంద్రమౌళి, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, కొత్తగూడెం ఆర్డీఓ మధు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.కొత్తగూడెంఅర్బన్: గణపతి నవరాత్రి వేడుకలకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్రాజు పోలీస్ అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు నియమ నిబంధనల గురించి వివరించాలని, శోభాయాత్ర సమయంలో డీజేలు, టపాసుల నిషేధంపై అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, మల్లయ్యస్వామి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
బురదే మిగిలింది..
బూర్గంపాడు: నిన్నటి వరకు పచ్చగా కళకళలాడిన పంటచేలు.. నేడు బురదతో నిండి నిలువునా మాడిపోతున్నాయి. రెండు నెలలు శ్రమించి పెంచుకున్న పంటలను గోదావరి వరదలు ముంచెత్తడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదలకు భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది ఆగస్టు రెండో వారం వరకు ఓ మోస్తారు వర్షాలతో పడగా.. గోదావరి ప్రవాహం తక్కువగా ఉండడంతో పరీవాహక ప్రాంతాల రైతులు ముందుగానే పంటలు సాగు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరదలు రావడంతో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న మెట్టపంటలు.. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, కూరగాయల పంటలు వరదలకు దెబ్బతిన్నాయి. సుమారు 2వేల ఎకరాలలో పత్తి, 4 వేల ఎకరాలలో వరి నీటమునిగాయి. అయితే వరి పంటకు పెద్దగా నష్టం జరగకపోవచ్చని, మెట్ట పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతింటాయని రైతులు పేర్కొంటున్నారు. నీటమునిగిన పత్తి చేలల్లో వరద తగ్గిన తరువాత ఆకులపై బురద చేరి మొక్కల నిలువునా ఎండుతున్నాయి. ఎకరాకు రూ.25వేల ఖర్చు.. ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలకు ఎకరాకు రూ.25వేల వరకు ఖర్చు చేశామని, మరో రూ.15వేలు ఖర్చు చేస్తే పెట్టుబడులు పూర్తవుతాయని రైతులు అంటున్నారు. ఇప్పటికే పత్తిచేలు పూత, పిందెలతో పాటుగా కాయలతో ఏపుగా పెరుగుతున్నాయని, వరద పంటను పూర్తిగా తుడిచి పెట్టిందని వాపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే చేతికందుతున్న బెండ, దోస, బీర, సొర, గోరుచిక్కుడు వంటి కూరగాయల పంటలు వరదలో మునకేసి సుమారు 300 ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 3వేల ఎకరాలలో వరిపంట నీటమునగగా.. వరద 24 గంటల్లోనే తగ్గుముఖం పట్టడంతో పెద్దగా నష్టం ఉండదని చర్చసాగుతోంది. మరీ లోతట్టు ప్రాంతాల్లోని వరి పంట మాత్రం వరదకు నేలకొరిగి దెబ్బతింది. మిగతా ప్రాంతాల్లో నీట మునిగిన వరిపైరు వరద తగ్గిన తరువాత తేరుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.. గోదావరి వరదలకు నీటమునిగిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టం అంచనా వేయాల్సి ఉంది. శుక్రవారం మండల వ్యవసాయశాఖ అధికారులు నీటి ముంపు తొలగిన చేలను పరిశీలించారు. వరద పూర్తిస్థాయిలో తగ్గిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంటనష్టం అంచనా వేసి నివేదికలను సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మాదిరిగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.గోదావరి వరదకు నీటమునిగిన పంటలు గోదావరి వరదలకు నాలుగెకరా ల వరి మాగాణి, రెండెకరాల పత్తిచేను నీటమునిగింది. పత్తి చేను పూర్తిగా దెబ్బతింది. వరి మాగాణి ఒకట్రెండు రోజులు గడిస్తేగాని అక్కరకు వస్తుందో రాదో తెలుస్తుంది. వ్యవసాయశాఖ అధికారులు వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రిపోర్టులను ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం పరిహారమందించి రైతులను ఆదుకోవాలి. – పాపుకొల్లు సుధాకరరావు, రైతు, నాగినేనిప్రోలు గోదావరి వరద ముంపునకు గురైన పంటలను మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం. వరద ముంపు తగ్గాక పొలాల్లో నీటిని తీసివేసి ఆకులపై చేరిన ఒండ్రుమట్టిని స్ప్రేయర్లతో శుభ్రం చేసుకోవాలి. స్థానిక వ్యవసాయ అఽధికారుల సూచనలు పాటించాలి. – బి.తాతారావు, ఏడీఏ, మణుగూరు -
ఆర్థిక స్వావలంబన సాధించాలి
దుమ్ముగూడెం/అశ్వాపురం: మహిళలందరూ ఐకమత్యంతో స్వశక్తిగా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శనివారం దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని గిరిజన చిక్కి యూనిట్ను, అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలోని సమ్మక్క–సారక్క మహిళా కందిపప్పు ఉత్పత్తి కేంద్రాన్ని ఐటీసీ సంస్థ మేనేజర్ చెంగల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పల్లీపట్టి, కందిపప్పు తయారీ విధానాలను తెలుసుకుని సరసమైన ధరల కోసం అమ్మకాలు జరిగేలా ఆకర్షణీయమైన డిజైనింగ్, ప్యాకింగ్ చేయించేలా ఐటీసీ ఆధ్వర్యాన కృషి చేస్తామన్నారు. ఏడుగురు గిరిజన మహిళలు రూ.24 లక్షల సబ్సిడీతో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసుకున్న గిరిజన చిక్కి యూనిట్ను రూపొందించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల్లో ఐటీసీ సంస్థ మేనేజర్ చెంగల్రావు, ప్యాకింగ్ డిజైనింగ్ కోఆర్డినేటర్ బేగ్, రామ్కుమార్, యూనిట్ మహిళలు పాల్గొన్నారు. -
సాహసోపేత టూరిజంగా ‘రథంగుట్ట’
మణుగూరురూరల్ : మండలంలోని రథంగుట్ట ప్రాంతం సాహసోపేత టూరిజం స్పాట్గా ప్రత్యేకత చాటుకుంటుందని జిప్లైన్ అడ్వెంచర్ ప్రతినిధులు అన్నారు. శనివారం వారు రథంగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అన్ని ఆధునిక, సాంకేతిక పరికరాలు, భద్రతా ప్రమాణాలు అమలు చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా రథంగుట్ట ప్రాజెక్ట్ను ప్రత్యేక టూరిజం స్పాట్గా రూపకల్పన చేయొచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, హస్తకళ, చిన్న పరిశ్రమలకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పర్యాటకుల కోసం సమాచార, శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రథంగుట్ట పరిసరాలు ప్రకృతి అందాలతో ప్రత్యేక ఆకర్షణగా మారుతాయని, ప్రాంతీయ, రాష్ట్రీయ, దేశీయ పర్యాటకులకు పరిచయం చేయొచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మణుగూరు ఎఫ్ఆర్ఓ ఉపేందర్, ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. కిన్నెరసానిలో రోప్ వేకు కసరత్తు.. పాల్వంచరూరల్ : పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో అద్దాలమేడ నుంచి జలాశయం మధ్యలో ఉన్న చిన్న ద్వీపం వరకు రూ.25 లక్షల వ్యయంతో సుమారు అర కిలోమీటర్ మేర సింగిల్ రోప్ వే(జిప్ లైన్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పుణె నుంచి నెయిల్ అడ్వెంచర్ పంకజ్ కుమేరియా బృందం శనివారం కిన్నెరసానిలో పర్యటించింది. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. కేరళ, మయన్మార్, డార్జిలింగ్లో ఎత్తయిన కొండల మధ్య పొడవైన జిప్లైన్లు ఉన్నాయని, కిన్నెరసానిలోనూ జిప్లైన్ రోప్వే ఏర్పాటు చేస్తే పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిప్లైన్ ఏర్పాటుకు సంబంధించిన నివేదికను కలెక్టర్ జితేష్ వి పాటిల్కు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పరంధామరెడ్డి, ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డి, ఎంపీఓ చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మణుగూరు టౌన్: మున్సి పాలిటీ పరిధి రాజుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే మహిళ విద్యుదాఘాతంతో శనివా రం మృతిచెందింది. మధ్యా హ్న భోజన ప్రైవేట్ వర్కర్గా పనిచేసే భూక్య గౌరీ (56) రోజు మాదిరిగానే మోటార్ స్విచ్ వేస్తుండగా.. విద్యుత్ ప్రసరించి షాక్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో స్థానికులు ఆటోలో 100 పడకల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, గౌరి కుటుంబానికి న్యా యం చేయాలనే డిమాండ్తో సీఐటీయూ నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.జే.రమేశ్, యూని యన్ జిల్లా అధ్యక్షురాలు పద్మ తదితరులు ఎంఈఓ, ఎంపీడీఓలతో చర్చించగా.. మృతురాలి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాక హెచ్ఎం రూ.లక్ష పరిహారం ఇప్పించారు. నాయకులు బ్రహ్మచారి, గద్దల శ్రీను, ఉప్పుతల నర్సింహారావు, సత్రపల్లి సాంబశివరావు, కాంతారావు, శైలజ, సారిక, పద్మ, భేగం పాల్గొన్నారు. ఆటోలో నుంచి జారిపడి మహిళ.. పాల్వంచరూరల్: ప్రమాదవ శాత్తు ఆటోలో నుంచి జారి పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని జగన్నాథపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యనగండ్ల హరీష్ భార్య సునీత(29) శుక్రవారం పాల్వంచ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఈక్రమంలో జగన్నాథపురం గ్రామంలో మూలములుపు వద్ద ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడగా.. తీవ్రగాయాలు కావడంతో అదే ఆటోలో కొత్తగూడెంకు తరలించారు. పరీక్షించిన వైద్యులు వరంగల్కు రిఫర్ చేయగా.. మార్గం మధ్యలో మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ శనివారం మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేటి నుంచి భాద్రపద మాసోత్సవాలు.. భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి సెప్టెంబర్ 21వరకు భాద్రపద మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఆలయ తలుపులు మూసి 8వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి తెరుస్తామని, ఆ తర్వాత ప్రత్యేక పూజలు ఉంటాయని పేర్కొన్నారు. 15వ తేదీన శ్రీ వైష్టవ కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. మహిళలు స్వశక్తితో ఎదగాలిఐటీడీఏ పీఓ రాహుల్ చర్ల: మహిళలు శ్వశక్తితో ఎదగాలని, ఇందుకోసం చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని ఆర్.కొత్తగూడెం పంచాయితీ పరిధి సున్నగుంపులో మహిళలు అటవీ ఉత్పత్తులతో తయారు చేసే తినుబండారాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగేందుకు ముందుకొస్తున్న మహిళా సంఘాలకు అన్ని విధాలా సహకరిస్తామని, అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, ఐటీసీ మేనేజర్ చంగల్రావు, ప్యాకింగ్, డిజైనింగ్ కో ఆర్డినేటర్ బేగ్, మహిళా సభ్యులు సమ్మక్క, మునెమ్మ, శ్రీదేవి, రమాదేవి, శిరీష, ఈశ్వరి, స్వాతి పాల్గొన్నారు. జ్వరాలు వ్యాప్తి చెందకుండా చూడండి.. ఏజెన్సీలో జ్వరాలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని పీఓ రాహుల్ సూచించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రికార్డులన్నీ సక్రమంగా నమోదు చేయాలని, రక్త పరీక్ష శాంపిళ్లను ఎప్పటికప్పుడు టీ హబ్లకు పంపించాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలే గ్రామాలను గుర్తించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. -
నానో యూరియాతో మెరుగైన ఫలితాలు
ఇల్లెందురూరల్: నానో యూరియా వినియోగంతో రైతులకు మెరుగైన ఫలితాలు అందుతాయని ఏడీఏ లాల్చంద్ అన్నారు. మండలంలోని మాణిక్యారం, కొమరారం గ్రామపంచాయతీల్లో నానో యూరి యా వినియోగం, పిచికారీ పద్ధతిపై రైతులకు శని వారం క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. నానో వినియోగం వల్ల రైతుకు పెట్టుబడి భారం తగ్గడంతోపాటు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. గుళికల రూపంలో ఉండే యూరియా కంటే ద్రవరూపంలో ఉన్న నానో యూరియా వినియోగంపై ఎంతో మేలని, దీనిపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సతీష్, పలువురు రైతులు పాల్గొన్నారు. -
వాగు దాటి.. వైద్యం అందించి..
ములకలపల్లి: స్థానిక మంగపేట పీహెచ్సీ వైద్య బృందం వాగులు, వంకలు దాటి వలస గొత్తికోయలకు వైద్య సేవలు అందించారు. తిమ్మంపేట సబ్సెంటర్ పరిధిలోని మారుమూల వలస ఆదివాసీ గ్రామాలైన పాలవాగు, కొత్తగుండాలపాడు, పాత గుండాలపాడు, పాలవాగుల్లో స్థానిక వైద్యాధికారి కృష్ణదీపక్రెడ్డి ఆధ్వర్యాన శనివారం వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రెండు కి.మీ కాలిబాటన వెళ్లి 90 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 12 మంది జ్వరపీడితులను గుర్తించి మందులు అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని వైద్యాధికారి తెలిపారు. సబ్యూనిట్ ఆఫీసర్ జేతూరామ్, ఎంటీఎస్ చైతన్య, హెచ్ఎస్లు శ్రీకృష్ణ, నాగమణి, ఎంఎల్హెచ్పీ స్పందన తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి..
బూర్గంపాడు: గోదావరి వరదలకు పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం బూర్గంపాడు మండలంలోని రెడ్డిపాలెంలో గోదావరి వరదల కు దెబ్బతిన్న పంటచేలను సీపీఎంప్రతినిధి బృం దం పరిశీలించి పంటనష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పత్తి చేలు వరదకు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టంపై నివేదికలను ప్రభుత్వానికి పంపించాలని పంటనష్టపరి హారం అందేలా చేడాలన్నారు. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, బయ్యా రాము, గుంటక కృష్ణ, ఎస్కె.అబీదా, కనకం వెంకటేశ్వర్లు, కొమర్రాజు సత్యనారాయణ, కమటం మరి యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నాటు సారా స్వాధీనం
టేకులపల్లి: అక్రమంగా తయారు చేసి విక్రయిస్తున్న నాటు సారాను జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ బృందం స్వాధీనం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసింది. టాస్క్ఫోర్స్ ఎస్ఐ గౌతమ్ కథనం ప్రకారం.. జిల్లా ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ బృందం శనివారం మండలంలోని సుక్కాల బోడు, రేగుల తండ, టేకులపల్లి, బొమ్మనపల్లి, సూర్యతండా, చంద్రుతండా గ్రామాల్లో అనుమానిత స్థావరాలు, నివాసాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ధారావత్ నాగరాజు, గుగ్గిల రవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నాటు సారా తయారు చేయడం, విక్రయించడం నేరమని, ఎవరైనా విక్రయాలు జరిపితే ఎకై ్సజ్ కానీ పోలీసు శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ దాడుల్లో సిబ్బంది రామక్రిష్ణ గౌడ్, వెంకట నారాయణ, సుమంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంభద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో గల ఏఎంసీ మార్కెట్లో గుర్తు తెలి య ని మృతదేహం లభ్యమైంది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల రోడ్డులో గల కొత్త మార్కెట్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తుతెలి యని వ్యక్తి ఏఎంసీ మార్కెట్ పరిధిలో గల దుకాణాల వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యాన శనివారం మధ్యాహ్నం మా ర్కెట్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు శవాన్ని పరిశీలించి మృతుడి ఒంటిపై నల్లని నిక్కర్, గల్లతో కూడిన తెల్ల ని షర్ట్ ఉన్నట్లు తెలిపారు. మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశా రు. ఆచూకీ తెలిస్తే భద్రాచలం టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఏ మలుపు తిరుగునో?
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజకీయ భవితవ్యం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ మొదలైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా పేరున్న వెంకట్రావు 2014 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో ఎన్నికలు జరగగా అంతకు కొన్ని నెలల ముందే (ఆగస్టులో) తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఆ వెంటనే గులాబీ పార్టీ తరఫున భద్రాచలం నుంచి పోటీ చేశారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్, కొత్తగూడెంలో ఆ పార్టీ బలపర్చిన సీపీఐ అభ్యర్థి గెలవగా.. అప్పటివరకు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న భద్రాచలం మాత్రం బీఆర్ఎస్ ఖాతాలో పడింది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై తెల్లం వెంకట్రావు విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఆఖరి నిమిషంలో పార్టీ మారి ఫాయిదా దక్కించుకున్న రాజకీయ చాణక్యుడిగా పిలిపించుకున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసిన ఆరు నెలల్లోపే బీఆర్ఎస్ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ క్యాంప్లో చేరిపోయారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ముందుగా అసెంబ్లీ స్పీకర్ను, ఆ తర్వాత హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. అనేక మలుపుల తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో బీఆర్ఎస్ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు విచారణకు రావాల్సిందిగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేస్తున్నారు.ఇంకా స్పీకర్ పంపిన లేఖ అందలేదు. లేఖ వచ్చిన తర్వాత అందులో ఉన్న విషయం ఆధారంగా కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ పెద్దలతో సంప్రదించి స్పందిస్తా. అప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తా. – తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన ఆ ప్రచారాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెబుతూ వచ్చారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే కొనసాగుతారని అంతా అనుకుంటుండగా 2024 ఏప్రిల్ 7న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాల్సి వచ్చిందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు. -
‘మూణ్నెల్ల’ ముచ్చటేనా?
● గ్యాస్ సబ్సిడీ అందక ‘మహాలక్ష్మి’ వినియోగదారుల ఇక్కట్లు ● రూ.500కు సిలిండర్ ఏమైందంటున్న లబ్ధిదారులు ● మొదటి మూడు నెలల వరకే జమైన రాయితీ పాల్వంచరూరల్: మహాలక్ష్మి లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆరు గ్యారంటీల్లో భాగంగా ఈ పథకాన్ని గతేడాది ఫిబ్రవరి 27న ప్రారంభించారు. అంతకుముందే ప్రజాపాలన సభల్లో గ్యాస్ రాయితీ పథకానికి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా, అందులో 1,54,633 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. వీరిలో అత్యధికంగా బూర్గంపాడు మండలంలో 10,276 మంది, అశ్వారావుపేటలో 8,312, ఇల్లెందు మండలంలో 8,662, పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 8,164 మంది ఉండగా.. అత్యల్పంగా అళ్లపల్లి మండలంలో 1,344 మంది, గుండాలలో 2,205, కరకగూడెంలో 2,513, అన్నపురెడ్డిపల్లి మండలంలో 3,540 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది మొదటి మూడు నెలల వరకే సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో జమైందని, ఆ తర్వాత రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.892 ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ.21 రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.371 సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా.. గత ఐదారు నెలలుగా రాష్ట్ర సబ్సిడీ అందడం లేదని, ఎందుకు జమ చేయడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. -
●గోదావరి కలుషితం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం నాలుగు రాష్ట్రాలకు కూడలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు వివిధ పనుల నిమిత్తం తరచూ భద్రాచలం వస్తుంటారు. ఈ క్రమంలో పట్టణంలో ఏర్పడే చెత్తను గత కొన్నేళ్లుగా భద్రాచలం గోదావరి నదీ తీరాన ఉన్న అనధికారిక డంపింగ్ యార్డులోనే పడేస్తున్నారు. రెండు, మూడు రోజుల క్రితం భద్రాచలం గోదావరి నదికి వరద పోటు కారణంగా ఆ చెత్త అంతా కరకట్ట చుట్టూ ఒడ్డుకు చేరుకుంది. పట్టణంలో గల అన్ని కాలనీల్లోని నివాస గృహాల నుంచి వచ్చే చెత్తతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చే వేస్టేజీని ఇదే ప్రాంతంలో వేస్తుంటారు. ఇప్పుడు అదే చెత్త గోదావరి నదిలో కలిసి నీరు కలుషితం అవుతోంది. గోదావరి తీరం డంపింగ్ యార్డును తలపిస్తోంది. ఈ సమస్య ప్రతీ సంవత్సరం వచ్చే గోదావరి వరదల సమయంలో ఎదురవుతూనే ఉన్నా.. పరిష్కారానికి అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించి ఆ ప్రాంతంలో చెత్తను వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ఇటు స్థానికులు, అటు రామయ్య భక్తులు కోరుతున్నారు. -
ఆదర్శంగా.. అద్భుతంగా..
పరిశీలించిన మంత్రి తుమ్మల మాస్టర్ ప్లాన్ పరిశీలన సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో, అన్ని మౌలిక సదుపాయాలతో భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా అద్భుతంగా ప్లాన్ రూపొందించాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు అసౌకర్యం ఎదురుకాకుండా విశాలమైన తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు నిర్మించాలని సూచించారు. డిజైన్లను సీఎం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశీలించాక ఆమోదం తీసుకోవాలని తెలిపారు. కాగా, సీఎం నుంచి గ్రీన్సిగ్నల్ వచ్చాక ప్రారంభ వేడుక నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మూడేళ్లలో భవనాలు పూర్తి డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మాస్టర్ప్లాన్ను పరిశీలించడానికి ముందే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్తో మంత్రి తుమ్మల మాట్లాడారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లో తాత్కలికంగా తరగతులు నిర్వహించాలని, హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రానున్న మూడేళ్లలో యూనివర్సిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. కాగా, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిదని.. ఇది తెలంగాణకే కాక దేశానికే తలమానికంగా నిలిచేలా ఆకర్షణీయమైన డిజైన్లతో నిర్మించాలని సూచించారు. 300 ఎకరాల్లో ఏర్పాటయ్యే యూనివర్సిటీ అత్యున్నత ప్రమాణాలతో వేలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. యూనివర్సిటీ ద్వారా వేలాది మంది యువ శాస్త్రవేత్తల భవిష్యత్కు బాటలు వేసే అవకా శం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్కు సంబంఽధించిన 380 ఎకరాల స్థలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్లాన్ను రూపొందించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల భవనం, మెడికల్ కాలేజీలను కలుపుతూనే భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా డిజైన్ చేశారు. భద్రాచలం – కొత్తగూడెం ప్రధాన రహదారి నుంచి యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్లగానే తొలుత వచ్చే క్వార్టర్లు, ఉమెన్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ భవనాలను అలాగే కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే, ప్రస్తుతం శిథిలమైన ఆడిటోరియం, ఆ పరిసరాలను స్పోర్ట్స్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేసేలా ప్లాన్లో పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న కొత్త బాయ్స్ హాస్టల్ అలాగే కొనసాగనుంది. అయితే 1980వ దశకంలో నిర్మించిన పాత హాస్టల్ వద్దే యూని వర్సిటీ నూతన నిర్మాణాలు చేపడుతారు. ఇక్కడ నాలుగు అకడమిక్ బ్లాక్లు, సెంట్రల్ ఫెసిలిటీ సెంటర్, క్యాంటిన్, లైబ్రరీ భవన నిర్మాణాలను ప్లాన్లో పొందుపరిచారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు పక్కన బాయ్స్ హాస్టళ్లు, డైనింగ్ హాల్, అకడమిక్ భవనాలకు సమీపాన గర్ల్స్ హాస్టల్, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. గర్ల్స్ హాస్టల్ భవనాల పక్కన మెడికల్ కాలేజీ ప్రాంగణం ఉంది. ఇక బాయ్స్ హాస్టల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రస్తుతం పార్కింగ్ కోసం కేటాయించి.. భవిష్యత్లో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఉపయోగించనున్నారు. తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ -
అమ్మకు ఆపద ఎదురుకావొద్దని..
● ముంపు ప్రాంతాల్లో వైద్యసిబ్బంది అప్రమత్తత ● ఏరియా ఆస్పత్రులకు గర్భిణుల తరలింపు ● ప్రసవం సమయాన ఇక్కట్లు రాకుండా జాగ్రత్తలుకరకగూడెం: కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరికి వస్తున్న వరదతో ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. పలు చోట్ల వరదలు, వాగులు పొంగి పొర్లగా ఈ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యాన ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను ముందస్తు జాగ్రత్తగా ఏరియా ఆస్పత్రులకు తరలించారు. గ్రామగ్రామాన ఆరా భారీ వర్షాలు, వరదల నేపథ్యాన ఏజెన్సీలోని పలు గ్రామాలకు ఏటా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈనేపథ్యాన గర్భిణుల వివరాలను ఇప్పటికే నమోదు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు అందులో ప్రసవానికి సమీపాన ఉన్న వారిని గుర్తించారు. ఒకవేళ గ్రామాలను వరద ముంచెత్తినా, రాకపోకలు నిలిచిపోయినా ఇబ్బంది ఎదురుకాకుండా ముందస్తు జాగ్రత్తగా గర్భిణులను సమీపంలోని ఏరియా ఆస్పత్రులకు తరలించారు. జిల్లాలోని 23 మండలాల్లో 29 పీహెచ్సీల పరిధిలో 19 మంది గర్భిణులను భద్రాచలం, మణుగూరు ఏరియా ఆస్పత్రులతో పాటు చర్ల సీహెచ్సీకి తీసుకొచ్చారు. శాశ్వత పరిష్కారం లేదా? వైద్య, ఆరోగ్యశాఖలోని వైద్యులు, ఉద్యోగులు ఏజెన్సీ గ్రామాలపై దృష్టి సారిస్తున్నా చాలాచోట్లకు సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందిగా నిలుస్తోంది. మట్టి రోడ్లు, బురదమయమైన దారులు, వాగులపై వంతెనలు లేకపోవడం వల్ల వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ కారణంగానే గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు ఆస్పత్రులకు సకాలంలో చేరుకోలేక ప్రాణాపాయం ఎదుర్కొంటున్నారు. వలస ఆదివాసీ గ్రామాల నుంచి ఆపదలో ఉన్నవారు, గర్భిణులను డోలీల్లో మోసుకొచ్చే ఘటనలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో గర్భిణులను ముందు జాగ్రత్తగా చర్యగా ఆస్పత్రులకు తీసుకొస్తున్నా శాశ్వత పరిష్కారంపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇకనైనా ఆదివాసీ, మారుమూల గ్రామాలకు రవాణా సాఫీగా జరిగేలా రహదారులు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. వరదలతో ముప్పు ఎదురుకాకుండాప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. అత్యవసర పరిస్థితి ఉన్న గర్భిణులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాం. మిగతా గర్భిణులను సైతం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు నిత్యం పరిశీలిస్తున్నారు. వర్షాకాలం ముగిసే వరకు ప్రత్యేక వైద్య బృందాలు, అంబులెన్స్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు. – డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్ఓ -
కూనంనేని.. మరోసారి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి ఎన్నిక ● రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నేతలకు స్థానం సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రెండో సారి ఎన్నికయ్యారు. మేడ్చల్ జిల్లా గాజుల రామవరంలో పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా శుక్రవారం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈమేరకు కూనంనేని మరోమారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ఐదు దశాబ్ధాలుగా సీపీఐలో కీలపాత్ర పోషిస్తున్నారు. 2005 నుండి 2009 వరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి రాష్ట్ర మంత్రి వనమా వెంకటేశ్వరరావుపై విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వాత 2023లో ఎన్నికల్లో బరిలోకి దిగిన కూనంనేని గెలిచారు. రాష్ట్ర కార్యదర్శిగా గత మూడేళ్లలో రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, మేడ్చల్, మహబూబాబాద్ తదితర జిల్లాలో భూపోరాటాల ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూముల పంపిణీలో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో వామపక్షాల నుంచి ఏకై క ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కూనంనేని 2023లో జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘంగా విజయానికి కృషి చేశారు. రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మౌలానా ఖమ్మం మయూరిసెంటర్: సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా మహమ్మద్ మౌలానా రెండోసారి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా మౌలానా ఎన్నికపై పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికవడమే కాక రాష్ట్ర కార్యవర్గంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలు పలువురికి స్థానం దక్కింది. జిల్లా నుంచి ముగ్గురు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, పది మంది రాష్ట్ర సమితిలో చోటు దక్కించుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్పాషా, నాయకులు ముత్యాలు విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే, రాష్ట్ర సమితి సభ్యులుగా కె.సారయ్య, మున్నా లక్ష్మీకుమారి, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, వై.ఉదయ్భాస్కర్, ఎస్డీ.సలీం, రావులపల్లి రవికుమార్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్రకుమార్ ఎన్నిక కాగా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నుంచి మిర్యాల రంగయ్య రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
నిలకడగా గోదావరి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహం శుక్రవారం తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గురువారం సాయంత్రం వరకు పెరిగినా.. ఆతర్వాత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమాన శుక్రవారం ఉదయం 10గంటలకు వరద 47.50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అలాగే రాత్రి 9–30 గంటలకు 42.50 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా, గోదావరికి బుధవారం రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా, ఉపసంహరణ సైతం ఒకేరోజు జరగడం గమనార్హం. ఇక పలుచోట్ల రహదారులపైకి చేరిన గోదావరి వరద తొలగిపోవడంతో రాకపోకలు మొదలయ్యాయి. అయితే, మళ్లీ వరద పెరిగే అవకాశముందని సూచనతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ప్రమాద హెచ్చరికలన్నీ ఉపసంహరణ -
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
పినపాక: ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో నష్టాలు ఎదురవుతున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని.. ఇందులో మునగ సాగుతో లాభాలు ఉంటాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. మండలంలోని సీతారాంపురంలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్వాడీ కేంద్రం భవనానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ‘పనుల జాతర’లో భాగంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, మహిళా సంఘాల సభ్యులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తూ కోళ్ల ఫారాలు, చేపలు, గేదెల పెంపకం చేపట్టాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తూనే పౌష్టికాహారం అందిస్తున్నందున చిన్నారులను చేర్పించాలని సూచించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఏడీఏ తాతారావు, పినపాక, మణుగూరు తహసీల్దార్లు గోపాలకృష్ణ, అద్దంకి నరేష్, ఎంపీడీఓ సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ వినీత తదితరులు పాల్గొన్నారు. ఉజ్వల భవిష్యత్ కోసం నాణ్యమైన విద్య మణుగూరు రూరల్: విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మణుగూరులోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతిగృహాలను తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులు, భోజనశాల, సామగ్రిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు బోధించడమే కాక వారి ఆరోగ్యంపైనా ఉపాధ్యాయులు శ్రద్ధ కనబర్చాలన్నారు. వంట విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎంఈఓ స్వర్ణజ్యోతి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గిరిజన ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్
భద్రాచలం: ఆదివాసీ మహిళలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ను మరింత మెరుగుపర్చుకోవాలని, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలోశుక్రవారం ఆయన మహిళలు తయారుచేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఇప్పపూల లడ్డూలు, సబ్బులు షాంపూలను ఐటీసీ అధికారుల సమక్షాన పరిశీలించి మాట్లాడారు. మహిళలకు ఐటీసీ సహకరిస్తే చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని తెలిపారు. ఈమేరకు మార్కెటింగ్, స్టాళ్ల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం దమ్మక్క జాయింట్ లయబిలిటీ గిరిజన మహిళా గ్రూప్ సభ్యులు తయారు చేసిన మోవా సోప్, బ్యాంబో సోప్లను పీఓ ఆవిష్కరించారు. అనంతరం ఉద్దీపకం వర్క్ బుక్–2 ద్వారాబోధనపై అధికారులతో సమీక్షించిన పీఓ పలు సూచనలు చేశారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో డివిజన్ల వారీగా ఉద్దీపకం వర్క్ బుక్పై టీఎల్ఎం మేళా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన కిన్నెరసానిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు రిషివర్మ, వెంకన్నబాబును పీఓ అభినందించారు. ఈకార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఐటీసీ మేనేజర్ చంగల్రావు, జేడీఎం హరికృష్ణ, వివిధ విభాగాల ఉద్యోగులు రమేష్, బాలసుబ్రహ్మణ్యం, చందు, వెంకటేశ్వర్లు, అంజయ్య, వాసు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి
మణుగూరు టౌన్: ఏరియాలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తూ నాణ్యతతో కూడిన బొగ్గును ఉత్పత్తి చేసేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంస్థ లక్ష్యాలను ఏరియా ప్రగతిని వివరించారు. ప్రస్తుత కంపెనీ ముందున్న సవాళ్లను, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో పాటు సంస్థలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు లక్ష్మిపతిగౌడ్, శ్రీనివాసచారి, రమేశ్, శ్రీనివాస్, అనురాధ, బాబుల్ రాజు తదితరులు ఉన్నారు. -
సరిపడా వైద్యులు లేక..
● ఎంసీహెచ్లో గర్భిణుల, బాలింతల అవస్థలు ● టెక్నీషియన్లు లేక ఎక్స్రే, ఓటీలోనూ ఇబ్బందులు ● బయట నుంచి పెరుగుతున్న రిఫరల్ కేసులతో భారం ● వైద్యులు, టెక్నీషియన్ల సంఖ్య పెరిగితేనే ఫలితంకొత్తగూడెంఅర్బన్: బాలింతలు, శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా ఏర్పడిన ఎంసీహెచ్(మతా, శిశు ఆరోగ్య కేంద్రం)లో వైద్యులు, టెక్నీషియన్ల కొరతతో ఆశించిన స్థాయిలో పేద, మధ్య తరగతి ప్రజలకు సేవలు అందడం లేదు. కొత్తగూడెం పరిధి రామవరంలో ఎంసీహెచ్ ప్రారంభమైన రోజుల్లో జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వచ్చి ప్రసవాలు చేయించుకునే వారు. గత ఏడాది వరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం ఎంసీహెచ్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఉన్న కొందరు వైద్యులపై భారం పడుతోంది. ఇతర ఆస్పత్రులకు రిఫర్ ఎంసీహెచ్కు జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వస్తుంటారు. వైద్యులు సరిపడా లేక కొంచెం రిస్క్ ఉన్న కేసులను ఇతర జిల్లాలకు రిఫర్ చేస్తుండటంతో పలువురు 108లోనే ప్రసవిస్తున్నారు. ఇంకొందరు సదరు ఆస్పత్రికి చేరుకకునేలోగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ ఉన్నా వైద్యుల కొరత అనేది విమర్శలకు తావిస్తోంది. కాగా, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు గర్భధారణ సమయంలో పరీక్షలు, ఆరోగ్య సలహాలతో పాటుగా సాధారణ డెలివరీ చేయాలి. పుట్టిన శిశువుల ఆరోగ్య సంరక్షణ, పరీక్షలు, టీకాలు వేయాలి. తల్లి, శిశువులో పోషకాహార లోపాలు నివారించడానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం అందించాలి. డెలివరీ అనంతరం తల్లి, శిశువు ఆరోగ్యంపై పర్యవేక్షణ, తల్లిదండ్రులకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి. మాతా, శిశు మరణాల లేకుండా చూడటమే లక్ష్యంగా ఎంసీహెచ్ వైద్యులు, సిబ్బంది పనిచేయాలి. కానీ, సాయంత్రం నాలుగు గంటల తరువాత ఆస్పత్రికి వచ్చే పిల్లలకు కూడా సేవలందడం లేదని పలువురు చెబుతున్నారు. తగ్గుతున్న ప్రసవాలు ఎంసీహెచ్లో గైనకాలజీ వైద్యులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు మొత్తం 18 మంది ఉండాల్సి ఉంది. కానీ, అంతా కలిపి 8 మంది పని చేస్తుండగా, వీరిలో ముగ్గురు ప్రొఫెసర్లు ఉండగా ఐదుగురు మాత్రమే సేవలందిస్తున్నారు. పిల్లల వైద్యులు 13 మందికిగాను ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు పని చేస్తున్నారు. రేడియాలజిస్ట్లు 10 మందికిగాను ఇద్దరే ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో డెలివరీలు కేవలం పది మాత్రమే జరుగుతున్నాయి. గతంలో 50వరకు జరిగేవి. ఓపీకి గర్భిణులు 120మంది వస్తుండగా, పిల్లలు 150మంది వరకు వస్తున్నారు. ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది కూడా అరకొరగా ఉండడంతో గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో టెక్నీషియన్లు లేకపోవడంతో వెంటిలేటర్లను విని యోగించడం లేదు. వీటితో పాటుగా ఎక్స్రే టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు కూడా లేకపోవడంతో ఏదైనా సమస్య వచ్చినప్పడు ఆస్పత్రి లో పని చేస్తే వైద్యులు, సిబ్బంది అవస్థ పడుతున్నా రు. అత్యవసర సమయంలో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. ఇది ఇలానే కొనసాగితే ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజల్లో నమ్మకం పోయే పరిస్థితి ఉంటుందని, జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆస్పత్రికి వచ్చిన వారు వారి అభిప్రాయపడుతున్నారు. కొత్తగూడెం రామవరం ఎంసీహెచ్లో గైనకాలజీ, పిల్లల వైద్యులు తక్కువగా ఉన్నారు. సరిపడా వైద్యుల నియామకం కోసం ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా అర్హత కలిగిన వారు ఎవరూ రావడం లేదు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులపై అధికభారం పడుతున్న విషయం నిజమే. గత జూన్ లో కూడా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎవరూ రాలేదు. – రాధామోహన్, కొత్తగూడెం సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ -
చిరు వ్యాపారులను ఆర్థిక బలోపేతం చేయాలి
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధిలోని చిరు, వీధి వ్యాపారులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ బి.నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్ సభ్యులు, చిరు వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్య పరిచి ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వీధి వ్యాపారులను గుర్తించి వారిని గ్రూపులుగా ఏర్పాటు చేసి ఒకొక్క సభ్యుడికి రూ.10వేల రూపాయాలను అందించి వ్యాపారం నిర్వహించుకునేందుకు ప్రోత్సహిస్తామన్నారు. అదే విధంగా మున్సిపాలిటీను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడంలో సమిష్టిగా కృషి చే ద్దామని కోరారు. కోతులు, కుక్కల సమస్యను నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ పింగళి నాగరాజు రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తమ పరిశోధనకు రివార్డులు
కొత్తగూడెంటౌన్: కేసుల పరిశోధనలో ప్రతిభ కనబర్చిన పోలీసు ఉద్యోగులకు ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. క్లూస్ టీం, టాస్క్ఫోర్స్ బృందాలకు చెందిన సీఐలు అశోక్కుమార్, రమాకాంత్, ఎస్ఐలు ప్రవీణ్కుమార్, రామారావుతో పాటు సిబ్బంది కె.భీష్మారావు, శోభన్బాబు, కరీముద్దీన్, రాజు, జంషీద్, సాయికిరణ్, రవి, విజయ్, రామకృష్ణ, వెంకటనారాయణ, రాంకోటి, బాసిత్ రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. -
హెచ్ఎంలుగా అక్కాచెల్లెళ్లు!
ఖమ్మం సహకారనగర్: ప్రభు త్వ ఉపాధ్యాయుల(ఎస్ఏ)కు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి అక్కాచెల్లెళ్లకు ఒకేసారి పదోన్నతి రావడం విశేషం. అయితే, వీరిద్దరూ ఒకేసారి ఉపాధ్యాయులుగా విధుల్లో చేరడం, ఆపై ఎస్ఏలుగా పదోన్నతి పొందగా ఇప్పుడు ఒకేరోజు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందడంపై పలువురు అభినందించారు. అక్క చావా ఉషారాణి, చెల్లె చావా దుర్గాభవాని 1993 జూన్ 14న ఎస్జీటీలుగా ఖమ్మం అర్బన్ యూపీఎస్, ఖమ్మం జీహెచ్ఎస్ మోమినాన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆతర్వాత స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది ప్రస్తుతం కూసుమంచి మండలం నేలపట్ల, చింతకాని మండలం నేరడ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరు శుక్రవారం గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి పొందగా, దుర్గాభవాని ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో, నయాబజార్ పాఠశాలలో ఉషారాణిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీరిని ఉపాధ్యాయులు, ఉద్యోగులు అభినందించారు.ఒకేసారి ఇద్దరికి పదోన్నతి