Bhadradri District Latest News
-
మద్యం అమ్మకాల్లో కిక్కు!
2025–26లో రూ.2,297 కోట్లుగా నమోదువైరా: మద్యం అమ్మకాలు ఏటేటా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2025–26)లో లెక్కకు మిక్కిలిగా పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2024 – 2025లో రూ.167.11కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2025–26లో మాత్రం రూ.2,297 కోట్లుగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 204 వైన్ షాపులు, 52 బార్లు, మూడు క్లబ్లు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడంతో వైన్స్ దక్కించుకున్న వారు భారీగా సరుకు కొనుగోలు చేశారు. అంతేకాక గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల సమయాన మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా సాగడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్టస్థాయిలో పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం సంవత్సరంలో 27,576 కేసుల మద్యం, 1,63,1729 కేసుల బీర్ల అమ్మకాలుసాగాయి. -
హనుమాన్ జయంతికి
ఏర్పాట్లేవి?సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జై శ్రీరామ్ నినాదం వినిపించడంలో అగ్రస్థానం ఎప్పుడూ హనుమంతుడిదే. సిరియ తంబిగా రాముడి చేత ప్రశంసలు హనుమంతుడికి దక్కాయి. అందుకే ఆంజనేయుడి భక్తులు శ్రీరాముడి చెంతన హనుమాన్ దీక్షా విమరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే, ఎంతో భక్తితో వచ్చే దీక్షాపరులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయి. రెండుసార్లు జయంతి ఉత్సవాలు హనుమంతుడి భక్తుల్లో వేర్వేరు సంప్రదాయాలను, క్యాలెండర్లను పాటించేవారు ఉన్నారు. దీని ప్రకారం హనుమాన్ జయంతిని ఏటా రెండు వేర్వేరు తేదీల్లో జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 2, మే 12వ తేదీల్లో హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఏప్రిల్ 2న జరిగే వేడుకలను చిన్న జయంతిగా, మే 12న జరిగే వేడుకలను పెద్ద జయంతిగా గుర్తిస్తున్నారు. చిన్న జయంతి సందర్భంగా ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయం ఉన్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకి వెళితే, పెద్ద జయంతి సందర్భంగా సీతారాములు కొలుదీరిన భద్రాచల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శబరిమల తరహాలో.. ఏటా లక్షలాది మంది భక్తులు హనుమాన్ మాల ధరిస్తున్నారు. వీరిలో కొందరు చిన్న జయంతి రోజున మాల విరమణ చేస్తే, మరికొందరు అదే రోజున మాల ధరించి పెద్ద జయంతి రోజున విరమిస్తున్నారు. చిన్న జయంతికి కొండగట్టు క్షేత్రంలో దీక్ష తీసుకునే భక్తులు పెద్ద జయంతికి భద్రాచలంలో మాల విరమణ చేస్తున్నారు. ఫలితంగా గడిచిన దశాబ్దకాలంగా పెద్ద జయంతి రోజున వేలాదిగా హనుమాన్ మాలధారులు భద్రాచలం చేరుకుంటున్నారు. క్రమేణా అయ్యప్ప మాల ధరించిన వారికి శబరిమల ఎలాగో హనుమాన్ మాలధారులకు భద్రాచలం క్షేత్రం అలాగే అన్నట్టుగా భక్తుల్లో నమ్మకం, విశ్వాసం పెరుగుతోంది. మూడో వేడుకగా.. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వందల ఏళ్లుగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ ముందు రోజు తెప్పోత్సవం సైతం కనుల పండువగా జరుపుతున్నారు. ఈ రెండు వేడుకలు కనులారా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఇప్పుడు అదే స్థాయిలో హనుమాన్ జయంతి సందర్భంగా కూడా భద్రగిరికి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతిని భద్రాచలంలో జరిగే మూడో అతిపెద్ద వేడుకగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కావాలి కార్యాచరణ శ్రీరామనవమి, ముక్కోటి పండుగల తరహాలో హనుమాన్ జయంతి సందర్భంగా దేవస్థానం, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు ఉండటం లేదు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమాన్ మాలధారులకు ఇబ్బంది రాకుండా డార్మిటరీలు, తాగునీరు వంటి అదనపు సౌకర్యాలు, మాల విరమణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, భజన మందిరం వంటివి ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. పెద్ద జయంతికి ఇంకా నలభై రోజుల సమయం అందుబాటులో ఉన్నందున కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.నడి వేసవిలో రామభక్తితో భద్రాచలం వచ్చే దాసాంజనేయ మాలధారులకు కనీసం నీడ కరువైపోతోంది. గొంతెండితే గుక్కెడు నీళ్లు దొరకడం లేదు. కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చే దీక్షాపరులకు మండే ఎండల ధాటికి ఆలయం నుంచి గోదావరినదీ తీరానికి వెళ్లి వచ్చే సరికి కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. చలు వ పందిళ్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం, ప్రత్యేక క్యూలైన్లు వంటి ఏర్పాటు చేస్తే దీక్షా పరులకు ఇబ్బందులు తొలగిపోతాయి.భద్రగిరికి పోటెత్తుతున్న హనుమాన్ మాలధారులు -
ముగిసిన తునికాకు టెండర్లు
● మొదలైన మోడెం కొట్టే పనులు ● వేసవిలో గిరిజన కూలీలకు ఉపాధి పాల్వంచరూరల్: తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ ముగింది. ఆకు చిగురించడంకోసం నిర్వహించే మోడెం(ప్రూనింగ్) కొట్టే పనులను చేపట్టారు. జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, వైల్డ్లైఫ్, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డివిజన్ల పరిధిలోని 31 యూనిట్లలో 25,900 స్టాండర్డ్ బ్యాగులు లక్ష్యంగా నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఐదుసార్లు టెండర్లు నిర్వహించగా కొత్తగూడెం డివిజన్లోని కనకగిరి యూనిట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇక్కడ తునికాకు సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. కనకగిరి మినహా 30 యూనిట్లలో తునికాకు సేకరణను కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. పది రోజులపాటు మోడెం పనులు టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఆయా డివిజన్లలో అగ్రిమెంట్ చేసుకుని తునికి చెట్ల కొమ్మ (మోడెం) కొట్టే పనులను చేపట్టారు. వారం పది రోజులపాటు అటవీ ప్రాంతాల్లో మోడెం కొట్టే పనులు నిర్వహించనున్నారు. మోడెం కొట్టాక నెల రోజులకు ఆకు చిగిరించి కోతకు సిద్ధమవుతుంది. ఈ నెల చివరి వారం నుంచి తునికాకు సేకరణ జరగనుంది. గిరిజనులకు ఆదాయ మార్గం వేసవి కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాల్లోని వేలాది మంది కూలీలకు ఉపాధిని కల్పించే తునికాకు సేకరణకు అటవీశాఖ ఈ ఏడాది ముందస్తుగానే పనులను వేగవంతం చేస్తోంది. గతేడాది టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహిచండంతోపాటు ఆకు సేకరణ సమయంలోనే అకాల వర్షాలు కురవడంతో నిర్దేశించిన ఆకు లక్ష్యం ఎరవేరలేదు. దీంతో గుత్తేదారులకు, ఆటవీశాఖకు, కూలీలకు నష్టం వాటిల్లింది. యూనిట్కు 200మందికి పైగా.. ఏప్రిల్, మే నెలల్లో తునికాకు సేకరణకు జిల్లాలో పదివేల మందికి పైన కూలీలు ఉపాధి కోసం శ్రమిస్తారు. ఒక్కో యూనిట్లో 200 నుంచి 300 మంది వరకు తునికాకు సేకరణ జరుపుతున్నట్లు అటవీశాఖాధికారులు గుర్తించారు. సేకరించాక 50 ఆకులను ఒక్క కట్టగా కడతారు. ఇలా కట్టిన ఆకుల కట్టలను కల్లాలకు తీసుకెళ్లి కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. కాంట్రాక్టర్ కట్టకు రూ.1.40 చొప్పున చెల్లిస్తారు. నాణ్యమైన తునికాకు కోసం ఆకు ఫ్రూనింగ్ పనులు (కొమ్మ కొట్టడం) కొనసాగుతున్నాయి. -
‘మీ సేవ’ మరింత భారం
● యూజర్ చార్జీలు రెట్టింపు చేసిన ప్రభుత్వం ● 3 నుంచి 5 వ తేదీ వరకు సేవల్లో అంతరాయం సూపర్బజార్(కొత్తగూడెం)/సుజాతనగర్: మీ సేవ కేంద్రాల్లో యూజర్ చార్జీలు పెరిగాయి. ఈ నెల ఒకటి నుంచి నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతోంది. మీ సేవ దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు రెండు రకాలు ఉండగా, రెండింటిలోనూ చార్జీలు పెంచారు. కేటగిరీ–ఏ దరఖాస్తులకు గతంలో యూజర్ చార్జీ రూ.35 ఉండగా, ప్రస్తుతం రూ.62కు పెంచారు. కేటగిరీ–బీ దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 ఉండగా, ఇక నుంచి రూ.80 వసూలు చేస్తారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం కూడా మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.53గా నిర్ణయించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18, రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. ప్రభుత్వం యూజర్ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడంపై వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సేవలకు తాత్కాలిక అంతరాయం జిల్లాలో సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుందని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు సర్వర్ నిర్వహణ పనులు కొనసాగుతాయని తెలిపారు. సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం చేపట్టే ఈ–నిర్వహణ ప్రక్రియతో అన్ని ఆన్లౌన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తామని వివరించారు. ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని సూచించారు. ఈ–నిర్వహణ పూర్తయ్యాక వేగవంతమైన సేవలు అందుతాయన్నారు. ఇక మీ సేవ కేంద్రాల్లో సర్వీసు చార్జీలను పెంచినట్లు తెలిపారు. అదనంగా కరెంటు బిల్లులు, ఈ–పాస్ సేవలు, బయోమెట్రిక్ సేవలు, డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన సేవలకు కూడా సవరించిన చార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. -
వైభవంగా చండీహోమం
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలోని యాగశాలలో బుధవారం చండీ హోమం పూజలు నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ చండీహోమం జరిపారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న 15 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేష వస్త్ర ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. భద్రగిరికి ఏటేటా పెరుగుతున్న భక్తులుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దర్శనానికి భద్రగిరికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాచలం దారి పడుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 26.75 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు. 2024–25 సంవత్సరంలో 23.51 లక్షల మంది దర్శించుకున్నారు. కాగా 2026 మేలో స్వామి వారిని 2.54 లక్షల మంది దర్శించుకోగా, గతేడాది మేలో 1.97 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారు. 4న అథ్లెటిక్స్ ఎంపికలుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు రామవరం సాధన మైదానంలో జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలకు పోటీలు నిర్వహిస్తామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కే మహీధర్ బుధవారం తెలిపారు. ఈ పొటీల్లో ప్రతిభ చూపినవారిని ఈనెల 11న హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామని వివరించారు. 20 ఏళ్ల లోపు బాలబాలికలకు పోటీలు ఉటాయని, వివరాలకు 99486 01361 నంబరులో సంప్రదించాలని సూచించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కమిటీ ఎంపికకొత్తగూడెంఅర్బన్/సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంలో బుధవారం జిల్లా రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. రాబోయే మూడేళ్ల కాలానికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జుగల్ కిషోర్ ఖండేల్వాల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శిగా ఏలిపిద్ది శ్రీనివాస్రెడ్డి, కోశాధికారిగా పల్ల పోతు శ్రీనివాసుతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్లను కలిసి కార్యవర్గ వివరాలను వెల్లడించారు. కాగా, జిల్లా రైస్ మిల్ పరిశ్రమ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా తెలిపింది. పెరిగిన ఆయిల్పామ్ ధరఅశ్వారావుపేటరూరల్: ఆయిల్పామ్ గెలల ధర కొద్ది నెలలుగా పెరుగుతోంది. తాజాగా రేటు భారీగా పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెలలో టన్ను గెలల ధర రూ.21,546 ఉండగా, ప్రస్తుతం రూ.1,459 పెరిగింది. దీంతో టన్నుకు రూ. 23,005 చొప్పున రైతులకు చెల్లించనున్నారు. డీఈఓ ఆకస్మిక తనిఖీపాల్వంచ: పాల్వంచలోని వికలాంగుల కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధిపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. హెచ్ఎం రామకృష్ణ పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యతలేని భోజనం
దమ్మపేట: దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకులంలో విద్యార్థుల భోజనంలో నాణ్యత లేకపోవడంతో బాధ్యులపై కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతారా అని ప్రశ్నించారు. బుధవారం మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, పలు రెసిడెన్షియల్ పాఠశాలలు, తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన నాణ్యత, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా ఆరా తీశారు. ముందుగా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేసి, దరఖాస్తుల పరిష్కారంపై తహసీల్దార్ రామనరేష్, అఽధికారులను నేరుగా ప్రశ్నించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. మీ సేవలో చెల్లించాల్సిన దరఖాస్తుల రుసుం వివరాలను కార్యాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. భూసమస్యలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ప్రజలు జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వ్యయ ప్రయాసలు పడకుండా వాటిని స్థానికంగానే పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. మండల స్థాయిలోని పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దమ్మపేట గిరిజన గురుకులంలో మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం చికెన్, బగారా రైస్కు బదులుగా మిల్మేకర్ కూర, రైస్ వండటంపై బాధ్యులను ప్రశ్నించారు. కలెక్టర్ భోజనం తిని, ఆహార నాణ్యతను పరిశీలించారు. రుచి, నాణ్యతాలోపంతో పాటు పోషక విలువల లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం మందలపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించారు. ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, తహసీల్దార్ రామనరేష్, ఎంఈఓ జగపతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.దమ్మపేట గిరిజన గురుకుల అధికారులపై కలెక్టర్ అంకిత్ ఆగ్రహం -
చిన్నారులకు తొలిముద్ద
భద్రాచలంఅర్బన్: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ‘తొలిముద్ద’పేరుతో అల్పాహారం అందించనున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం హైదరాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆచరణలోకి తేవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతం అయిన భద్రాచలం పరిసర ప్రాంతంలో చిన్నారులు పోషకాహార లోపంతో ఉండటం, ఎత్తుకి తగ్గ బరువు లేక ఏరియా ఆస్పత్రిలోని ఎన్ఆర్సీ సెంటర్లో చికిత్స పొందుతున్న విషయాలు విదితమే. ఇలాంటి లోపాలను అధిగమించేందుకు ఈ పథకం ఉపయోగపడనుందని పలువురు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు.. పిల్లలకు పోషకాహారం అందితేనే వారి శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. సమతుల పోష కాహారం అందకపోవడంతో పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చాలా మంది చిన్నారుల తల్లిదండ్రు లు కూలీ, వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఉద యం పూట చిన్నారులు ఇంట్లో తినీతినకుండానే కేంద్రాలకు వెళ్లడంతో అక్కడ నీరసించిపోతున్నా రు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరికి భోజనం పెడతారు. అప్పటివరకు నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బక్కచిక్కిపోవడంతో పాటు వివిధ రుగ్మతలు వెంటాడుతున్నాయి. పౌష్టికాహా రం అందించడంతో వారిలో ఎదుగుదలతో పాటు కేంద్రానికి వచ్చే చిన్నారుల సంఖ్య సైతం పెరగనుంది. చాలా మంది చిన్నారులు 10 గంటలు దాటితే కానీ కేంద్రాలకు రావడం లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలు నడుస్తుండగా. చాలా కేంద్రాల్లో చిన్నారుల గైర్హాజరు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆరేళ్ల లోపు చిన్నారులకు ఉదయం పూట అల్పాహారం అందించనున్నారు. ఈ మేరకు రెడీ టూ కుక్ ఉప్మా, కిచిడీ సరఫరా బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్కు అప్పగించారు. కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు పిల్లలకు ఏకరూప దుస్తులు అందిస్తుండగా, కొత్తగా అల్పాహారం పథకం అమలుతో కేంద్రాలకు వచ్చే పిల్లల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2061 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో మూడేళ్లు పైబడి 31,711 మంది చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం ఏడు నెలల నుంచి మూడేళ్ల వరకు చిన్నారులకు బాలామృతం, నెలకు 16 కోడిగుడ్లు ఇస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రతిరోజూ ఉడికించిన గుడ్డు, ఒక పూట భోజనం పెడుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, సాంబార్తో వడ్డిస్తున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలకు ఈ కార్యక్రమం అమలవుతోంది. అయితే, మధ్యాహ్నం తర్వాత చిన్నారులకు భోజనంతో పెడుతుండటంతో వారు నీరసించిపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చిన్నారులకు కిచిడీ, ఉప్మా తదితర అల్పాహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. పథకం అమలుకు మార్గదర్శకాలు రాగానే అన్ని కేంద్రాల్లో అమలయ్యేలా చర్యలు చేపడతాం. పథకం అమలుతో పోషకాహార లోపం ఉన్న పిల్లల సంఖ్యను మరింత తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకా రెడీ టూ కుక్ అల్పాహారం ప్యాకెట్లు కేంద్రాలకు సరఫరా కావాల్సి ఉంది. –జ్యోతి, దుమ్ముగూడెం సీడీపీఓ -
లక్ష్యం చేరని మార్కెటింగ్ శాఖ
● 2025–26లో ఆదాయ లక్ష్యం రూ.22.65 కోట్లు ● జిల్లాలోని ఆరు మార్కెట్లు సాధించింది రూ.17.67 కోట్లు ఇల్లెందు: ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్దేశిత ఆదాయ లక్ష్యం చేరుకోలేకపోయాయి. ఇల్లెందు మార్కెట్ పురోగతిలో ఉన్నా అది కూడా లక్ష్యం సాధించలేదు. అధికారుల చిత్తశుద్ధి లోపించటం, మార్కెట్ కమిటీల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవటంతో మార్కెటింగ్ శాఖ ఆదాయం కోల్పోయింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యం రూ.22.65 కోట్లు కాగా, రూ.17.67 కోట్లు మాత్రమే వసూలైంది. ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కూడా ఈ దఫా లక్ష్యం సాధించలేక చతికిల పడింది. ఏడాది లక్ష్యం రూ. 5.16 కోట్లు కాగా, లక్ష్య సాధనకు మార్కెట్ అధికారులు కుస్తీ పట్టారు. వ్యాపారుల నుంచి ఫీజు రాబట్టే ప్రయత్నం చేశారు. అయినా లక్ష్యం చేరుకోలేకపోయారు. మార్కెట్ లక్ష్యం సాధించింది (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) బూర్గంపాడు 6.25 4.62 దమ్మపేట 3.67 2.88 ఇల్లెందు 5.16 4.03 భద్రాచలం 1.95 1.46 కొత్తగూడెం 3.47 2.30 చర్ల 2.12 2.11 మొత్తం 22.65 17.67 -
కార్మికులకు ఉరి తాళ్లు
లేబర్ కోడ్లు.. సూపర్బజార్(కొత్తగూడెం): ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయా లని నిర్ణయించడం కార్మిక వ్యతిరేకమని, కార్పొరేట్ల సంపద పెంపు కోసం 145 కోట్ల ప్రజలకు, 70 కోట్ల కార్మికుల గొంతుకు ఉరితాడు బిగించడానికి సిద్ధమవడమేనని కార్మిక సంఘాల నాయకులు ఎస్ఏ జలీల్, జె.సీతారామయ్య, కంచర్ల జమలయ్య, దొడ్డా రవికుమార్, షేక్ యాకుబ్షావలి అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యావత్ కార్మిక వర్గం లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె నిర్వ హించి వ్యతిరేకత చాటినప్పటికీ మోదీ ప్రభుత్వం.. అంబానీ, అదానీలాంటి కార్పొరేట్లు, పెట్టుబడి దారులకు సంపదను కట్టబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు లేబర్ కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ బ్లాక్ డే జరపాలని పిలుపునిచ్చాయని, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తున్నట్లు తెలిపారు. ఈ కోడ్లతో యూనియన్ పెట్టుకునే హక్కు, కనీస వేతనాలు, సమ్మె హక్కు ఉండవని, కార్మికులకు రక్షణ లేకుండా పోతుందని, 8 గంటల పనివిధానం పోయి 14 గంటలు రానుందన్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయమని ప్రకటించాయని, రాష్ట్రంలో కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు త్యాగరాజన్, కాయల నాగభూషణం, పీతాంబరం, గౌని నాగేశ్వరరావు, ఎన్.సంజీవ్, మల్లికార్జున్రావు, భూక్య రమేశ్, కె.సత్య, తులసీరామ్, మధుసూదన్రెడ్డి, సతీశ్, వెంకన్న, ఎం.రాజు, ఎం.వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శిరీష, పద్మ, వాణి, క్రాంతి, మాధవి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసనలో కార్మిక సంఘాల నేతలు -
జాతీయస్థాయిలో రాణించాలి
పాల్వంచరూరల్: జెన్కో క్రీడాకారులు ప్రతిభ చూపి జాతీయస్ధాయిలో రాణించాలని కేటీపీఎస్ 5,6 దశల చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్రావు అన్నారు. విద్యుత్ కళాభారతి మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇంటర్ ప్రాజెక్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. భూపాలపల్లి జట్టు ప్రథమ, కేటీపీఎస్ 5,6 దశల జట్టు ద్వితీయ, కేటీపీఎస్ 7వ దశ జట్టు తృతీయ స్థానాల్లో నిలవగా, బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ జెన్కో యాజమాన్యం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, స్పోర్ట్స్ సెక్రటరీ వీరస్వామి, కోశాధికారి రాజు, వెంకటేశ్వర్లు, జమీల్, అరుణ్, బాబీ, లింగమూర్తి పాల్గొన్నారు. -
లారీకింద పడి మహిళ దుర్మరణ ం
దమ్మపేట: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతిచెందింది. మండలంలోని ముష్టిబండ శివారులో బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం, రేపూడి గ్రామానికి చెందిన నీలగిరి ఝాన్సీ (41),రవికుమార్ దంపతులు. ఝాన్సీ పుట్టిల్లు అయిన దమ్మపేటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ముష్టిబండ శివారుకు చేరుకోగా సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట వైపునకు అతివేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బైక్పై నుంచి ఝూన్సీ రోడ్డుకు కుడి పక్కకు లారీటైర్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. రవికుమార్కు స్వల్పగాయాలయ్యాయి. భార్య మృతదేహం చూసిన అతడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు. -
పోడు సాగుదారులను ఇబ్బంది పెట్టొద్దు..
చుంచుపల్లి: పోడు సాగుదారులను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని, వారికి ఉపాధి లేకుండా చేసే చర్యలకు స్వస్తిచెప్పి సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా డిమాండ్ చేశా రు. బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్కు వినతిపత్రం అందించి, సమస్యలను వివరించారు. బందెగిరినగర్తోపాటు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కొనే యత్నాలు చేయొద్దని, సర్వే పూర్తయిన ప్రతి ఎకరాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పోడు చేయడాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని, తరతరాలుగా పోడుపైనే ఆధారపడినవారికి హక్కు పత్రాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బండి నర్సింహ, తాటి ఎల్లయ్య, సున్నం పాపారావు, ఆదిలక్ష్మి, వెంకటేశ్వర్లు, కుంజా వెంకటేశ్, పడిగె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికీ సీపీఐ.. సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజా పోరాటాల స్ఫూర్తిని ఇంటింటికీ తీసుకెళ్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా అన్నారు. పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం జిల్లాలోని అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి గడపకు వెళ్లి కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగా లను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. 15వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి గ్రామంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కా రం కోసం కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దుర్గరాశి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జి.వీరస్వామి, భూక్యా దస్రు, ఎస్కే ఫహీమ్, కుమారి హన్మంతరావు, ధీటి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లాలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలు, ఏటీసీ కళాశాలల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, అనుమతుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సంబంధిత భూముల విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా సమగ్ర పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇల్లందు, అశ్వారావుపేటల తహసీల్దార్లు రవికుమార్, రామకృష్ణ , ఈ–సెక్షన్ సూపరింటెండెంట్ స్వర్ణలత పాల్గొన్నారు. నేడు జిల్లావ్యాప్తంగా గ్రామసభలు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో సూచించారు. గ్రామ సభలను విజయవంతం చేయాలని కోరారు. సభలకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, నీడ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేసి ప్రజలకు వివరించాలని సూచించారు. సభలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, గురువారం నుంచి జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని వివరించారు. -
అంత్యక్రియలకు అడ్డుపడిన అటవీశాఖ
ఇల్లెందురూరల్: మహిళ అంత్యక్రియలను అటవీశాఖ అధికారులు అడ్డుకున్న ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మండలంలోని ఇందిరానగర్ వడ్డెరకాలనీ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించే భూమిని ఐదేళ్ల కిందట ఆ భూమిని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇందిరానగర్కు మంజూరైన వైకుంఠధామం కోసం ఆ భూమిలోనే కొంత స్థలం అటవీశాఖ అధికారులు కేటాయించారు. కానీ, వైకుంఠధామాన్ని వేరే ప్రాంతంలో నిర్మించడంతో ఆ భూమిని అర్బన్ పార్క్ నిర్మాణానికి కేటా యించారు. దీంతో అటవీశాఖ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టగా.. భవిష్యత్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు తమకు ద్వారం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. అందుకు నాటి అధికారులు అంగీకరించడంతో ఫెన్సింగ్ ఏర్పాటుకు స్థానికులు అభ్యంతరం తెలుపలేదు. మంగళవారం వడ్డెరకాలనీకి చెందిన మంజల వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె భౌతికకాయాన్ని ఖననం చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. అటవీశాఖ అధికారులు అడ్డుగా నిలిచి ఫెన్సింగ్ దాటి లోపలికి రావొద్దని స్పష్టం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పరి స్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మహిళ మృతదేహాన్ని బాలాజీనగర్ వైకుంఠధామంలో ఖననం చేశారు. -
15 రోజుల్లో వివాహం..
●రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఇల్లెందురూరల్/మహబూబాబాద్రూరల్: మరో పదిహేను రోజుల్లో పెళ్లి కుమారుడిగా ముస్తాబు కావాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివార్లలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు.. ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధి నెహ్రూనగర్తండాకు చెందిన బానోత్ శ్రీను – వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్(23) హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన బైక్పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చేరుకుని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ సూరయ్య తెలిపారు. 15 రోజుల్లో రెండో మరణం నెహ్రూనగర్కు చెందిన మహేందర్ కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. ఆయన తాత భోజ్యా పదిహేను రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పుడు మహేందర్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువతిని మహేందర్ ప్రేమించగా, ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకకరించారు. దీంతో 15 రోజుల్లో వివాహ ముహూర్తం నిర్ణయించగా, ఆయన మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరయర్యారు. -
గిరిజన మహిళలకు జీవనోపాధి
భద్రాచలం: గిరిజన, ఎస్హెచ్జీ గ్రూపుల మహిళలు నిర్వహించే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బుధవారం పట్టణంలోని భద్రగిరి మార్టులో నిత్యావసర సరుకులను పరిశీలించేందుకు వచ్చిన సెర్ప్ సీనియర్ మేనేజర్ భవానీ శంకర్కు మార్ట్లోని ఆర్గానిక్ సరుకుల గురించి వివరించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పుకున్న మహిళలు మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతుండటంతో మార్ట్ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, వేణు, హరికృష్ణ, సమ్మయ్య, ఆదినారాయణ, జయరాజ్, భార్గవి, నర్సయ్య, వెంకన్న పాల్గొన్నారు.భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ -
రూ.35.61 లక్షలకు మోరంపల్లిబంజర సంత వేలం
బూర్గంపాడు: మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో ప్రతి శుక్రవారం నిర్వహించే పశువుల సంత, వారపు సంత వేలంపాటను బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ జమలారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ బొర్రా సుభద్ర అధ్యక్షతన జీపీ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటను భద్రాచలానికి చెందిన భూక్యా రంజిత్నాయక్ రూ.35.61 లక్షలకు దక్కించుకున్నా రు. గతేడాది రూ.33.50 లక్షలకు సంత వేలం పాట ఖరారు కాగా ఈ ఏడాది రూ.35.61 లక్షలకు ఖరారైంది. ఉప సర్పంచ్ పొక్కుల రవి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ పనుల్లో భద్రతా పరికరాలు తప్పనిసరి●ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆదేశాలు సూపర్బజార్(కొత్తగూడెం): క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు నిర్వహించే ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జి.మహేందర్ బుధవా రం ఆదేశాలు జారీచేశారు. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయొద్దన్నారు. కొన్ని చోట్ల భద్రతా పరికరాలు ఉపయోగించకుండా పనిచేయడం వల్ల ప్రమాదా లు చోటుచేసుకుని, విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు బాధాకరమని పేర్కొ న్నారు. ఇకపై నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్సీ యాప్ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్, గిర్దావర్ మధ్య వాగ్వాదం?ములకలపల్లి: ములకలపల్లి ఇన్చార్జ్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, గిర్దావర్–2 భద్రు మధ్య ఓ భూమి పత్రాల విషయంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అన్నారం రెవెన్యూ పరిధిలోని ఓ భూమి పత్రాల విషయంలో నెలకొన్న సందిగ్ధతపై ఇరువురూ వాదనకు దిగిగగా తహసీల్దార్ వాహన డ్రైవర్, ఆమె సోదరు జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో భద్రు తీవ్రంగా స్పందించాడని, తమ కార్యకలాపాల్లో బయటి వ్యక్తి ఎలా చేసుకుంటాడని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై తహసీల్దార్ భాగ్యలక్ష్మిని వివరణ కోరగా.. గిర్వావర్–2 భద్రు సైతం గతంలో ఓ ప్రైవేట్ వ్యక్తితో కార్యకలాపాలు నిర్వహించారని ఆరోపించారు. తమను భద్రు అకారణంగా దూషించాడని, తన సోదరుడు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలుగుండాల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఆళ్లపల్లి మండలం ఇప్పనపల్లి గ్రామానికి చెందిన గొగ్గెల రాంబాబు, గొగ్గెల నందకిషోర్, ఈసం రమేశ్లు ఆళ్లపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. రామానుజగూడెం గ్రామానికి చెందిన రవి, పగిడిద్దరాజు ఆళ్లపల్లి నుంచి తమ స్వగ్రామానికి వెళ్తున్నారు. చింతోనిగుంపు పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటలో ఐదుగురు కిందపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా ఆళ్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రవి, పగిడిద్దరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. అశ్వారావుపేటలో.. అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన వెంకటపతి, మంగరాజుతోపాటు మరికొందరు కలిసి కొద్ది రోజులుగా అశ్వారావుపేట మండలం తిరుమలకుంటలో తాపీ పనులు చేస్తున్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం నుంచి తిరుమలకుంట గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలోని వినాయకపురం శివారులోని శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం సమీపంలో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటపతి, మంగరాజును స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఏలూరు ఆస్పత్రికి తరలించారు. పినపాకలో.. పినపాక: కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఐలాపురం నుంచి ఉప్పాక వైపు ద్విచక్ర వాహనం వెళ్తుండగా మణుగూరు నుంచి జానంపేట వైపు కారు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఉప్పాక గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొండేరు తరుణ్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు 108లో పినపాక ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
●విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన? ఇల్లెందు: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఒక ప్రాణం గాలిలో కలిసిపోయింది. విద్యుదాఘాతంతో బొజ్జాయిగూడెం పంచాయతీ మర్రిగూడెంనకు చెందిన కుంజా ఉదయ్ (34) మృతిచెందాడు. వివ రాలిలా ఉన్నాయి. బుధవారం పట్టణంలో ట్రాన్స్ఫార్మర్లు మార్చే పనులను కాంట్రాక్టర్ రాము చేపట్టారు. అందులో భాగంగా కూరగాయల మార్కెట్ ఎదురుగా ఆర్ఆర్ చికెన్ సెంటర్ వద్ద హైటెన్షన్ లైన్, లోకల్ లైన్లపై ఎల్సీ తీసుకున్నామని కూలీ, మర్రిగూడెంనకు చెందిన ఉదయ్ను స్తంభం పైకి ఎక్కించారు. ఉదయ్ విద్యుత్ లైన్ను ముట్టుకోగానే షాక్కు గురై పైనుంచి కింద పడ్డాడు. దీంతో విద్యుత్ సిబ్బంది, మిగతా కూలీలు భయంతో పరుగులు తీశారు. చుట్టుపక్కల వారు గమనించి క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఒకే స్తంభంపై రెండు లైన్లు ఉన్నా విద్యుత్ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. బైక్ ఢీకొని ఒకరు.. దమ్మపేట: రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని గున్నేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా తరిగొప్పుల గ్రామానికి చెందిన చిలువేరు రమేశ్(32) హైదరాబాద్లోని సింధు పార్సిల్ సర్వీస్ సంస్థలో లారీడ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం హెదరాబాద్ నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెంనకు బయలుదేరాడు. రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో గున్నేపల్లి శివారుకు చేరుకోగా లారీ టైర్ పంక్చరైంది. దీంతో పంక్చర్ షాపు కోసం కాలి నడకన రోడ్డుపై ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన బూరుగు వంశీ, నారం నాగరాజు సత్తుపల్లి నుంచి మొద్దులగూడెం వైపునకు బైక్పై వస్తూ రమేశ్ను ఢీకొట్టారు. రమేశ్ తలకు తీవ్ర గాయం కాగా.. బైక్పై వెళ్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పార్సిల్ ఏజెంట్ మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. గాయపడిన వ్యక్తి ...చండ్రుగొండ: మండల కేంద్రంలోని కేసీఆర్కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి వరంగల్లోని ఎంజీఎంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బుధవారం రాత్రి హెడ్కానిస్టేబుల్ రవి తెలిపారు. కేసీఆర్కాలనీకి చెందిన కణితి సిసింద్రి (27) మార్చి 26న బెండాలపాడులోని అత్తగారింటికి వెళ్లి వస్తానని ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చండ్రుగొండలోని చనగచెరువు సమీపంలో రోడ్డు పక్కన పంట చేలల్లో పడి పోయాడు. ఉదయం వాకింగ్ చేసే వ్యక్తులు గమనించి, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం అనంతరం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేసే వరకు పోరాడుతామని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూదాన్ భూముల నుంచి పేదలను తొలగించిన ప్రభుత్వం, ఇప్పటికీ పునరావాసం కల్పించకపోవడం గర్హనీయమన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం ధర్నాచౌక్ నుంచి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత నాయకులతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. మొత్తం 729 కుటుంబాలు ఇళ్లు కోల్పోగా పలువురికి వెలుగుమట్లలో, ఇంకొందరికి స్వగ్రామాల్లో ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాగా, కేటాయింపుల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో పునఃపరిశీలన చేస్తున్నామని, జాబితాలో అర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు బండారు రమేశ్, షేక్ మీరాసాహెబ్, ఎస్.నవీన్రెడ్డి, షేక్ నాగుల్మీరా, బోడపట్ల సుదర్శన్, బేగం, బాగం అజిత, ఏవీ రెడ్డి, కూచిపూడి నరేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు -
రబీ ధాన్యం మిల్లింగ్ చేయలేం..
సూపర్బజార్(కొత్తగూడెం): రాబోయే రబీ సీజన్ ధాన్యంలో నూక శాతం ఎక్కువగా రానున్నందున మిల్లింగ్కు తీసుకోలేమని రైస్ మిల్లర్ల అసోసియేషన్ నాయకులు తెలిపారు. మంగళవారం కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్కు వినతిపత్రాలు అందజేశాక వారు మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన బియ్యం 50 శాతం మేర మిల్లుల్లోనే ఉండడంతో రబీ ధాన్యం దిగుమతికి ఖాళీ కూడా లేదని తెలిపారు. ఖరీఫ్ సీజన్ బియ్యానికి అలాట్మెంట్ ఇవ్వాలని కోరారు. అలాగే, పదేళ్లుగా రైస్ మిల్లర్లకు బకాయి ఉన్న రవాణా, గోదాం తదితర చార్జీలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జుగల్ కిషోర్ఖండేల్వాల్, కొండూరు రాజేంద్రప్రసాద్, కోశాధికారి బచ్చు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యానవనానికి ఊతం..
ఏన్కూరు: సంప్రదాయ పంటలు సాగు చేసి వాటికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు ఉద్యానవన పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో ఆయిల్పామ్ సాగు ఒకసారి సాగు చేస్తే 30 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి కబరుస్తున్నారు. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చే ఆయిల్పామ్ సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏటేటా పెరుగుతోంది. అత్యధికంగా ఇక్కడే... రాష్ట్రంలో ప్రస్తుతం 2.50 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా 1.20 ఎకరాలతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలి చింది. ఖమ్మం జిల్లాలో 40వేల ఎకరాలు, భధ్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో 80వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. ఈ సాగువలన కోతుల బెడద కూడా లేకపోవడంతో సాగుపై ఆదరణ పెరుగుతోంది. సంప్రదాయ పంటలను మార్కెట్లో విక్రయించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుండగా.. అయిల్పామ్ సాగు చేసిన రైతులకు దళారీలు లేకుండా నేరుగా కంపెనీ వారే కొనుగోలు చేయడంతో గిట్టుబాటు ధర పొందుతున్నారు. ఆయిల్ ప్రతి ఇంట్లో నిత్యావరస వస్తువు కాగా ప్రతీ మనిషి ఏడాదికి 19.5 కేజీలు వాడుతున్నారు. దీంతో ఆయిల్పామ్ సాగు చేసినప్పటికీ అది సరిపోకపోవడంతో మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి 71 లక్ష మెట్రిక్ టన్నుల ఆయిల్ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వం ఆయిల్పామ్ రైతులను ప్రోత్సహిస్తుండగా.. ఆ సాగు కష్టాలు తీర్చే కల్పతరువు అయింది. ఆయిల్పామ్ సాగు 2022 లో ఉమ్మడి జిల్లాలో 50వేల ఎకరాల్లో ఉండగా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పెట్టుబడులు ఇలా ఆయిల్పామ్ సాగు ఎకరానికి మొక్కలు, ఎరువులు కలిపి రూ,25వేల వరకు పెట్టుబడులు అవుతాయి. సాగు చేసినప్పటి నుంచి 4వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు దిగుబడి వస్తూ ఏటేటా పెరుగుతూ ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి ఎకరానికి 12 టన్నుల వరకు దిగుబడులు వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్పామ్ టన్ను రూ. 21,450 పలుకుతుంది. దీంతో ఆయిల్పామ్ సాగు కు డిమాండ్ పెరగడంతో కౌలు ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ కింద సుమారు ఎకరానికి రూ.51వేల వర కు ఇస్తుంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్, పంట చేతి కోచ్చే వరకూ నాలుగేళ్ల వరకు రైతుకు అండగా ఉంటుంది. రైతులకు ఆయిల్పామ్ మొక్క ఒకటి రూ. 193 ఉంటుంది, రైతు మాత్రం మొక్కకు రూ.20 చొప్పున చెల్లిస్తే ఎకరానికి 57 మొక్కలు అందిస్తారు. తద్వారా రైతుకు రూ.11వేల వరకు ఆదా అవుతుంది. ఇక డ్రిప్ ఇరిగేషన్కు రూ.23,200 ఇస్తుంది. రైతులు ఆయిల్పామ్ సాగు చేసిన నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ 4,200 చొప్పున అకౌంట్లో పడుతుంది. దీంతో రైతులకు సలహాలు సూచనలు ఇచ్చి వారిని ప్రొత్సహిస్తుంది. ఆయిల్పామ్ సాగులో ఉమ్మడి జిల్లా ప్రథమం ఉమ్మడి జిల్లాలో ఆయిల్పామ్ సాగు నానాటికి పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఆయిల్పామ్ సాగు చేయగా 2026 నాటికి 1.20 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులకు సబ్సిడీ ఇచ్చి గిట్టుబాటు ధర రావడంతో పాటు కోతుల బెడద కూడా లేకపోవడంతో చాలామంది రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. – ఎం.వి మధుసూదన్, ఉద్యానవన శాఖాధికారి, ఖమ్మం -
మున్సిపల్లో ఏసీబీ తనిఖీలు
● పన్ను వసూళ్ల రికార్డులు పరిశీలన ● రాత్రి వరకు కొనసాగిన సోదాలు సత్తుపల్లి: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయాన ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ నేతృత్వాన ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 15 మంది సిబ్బంది కూడిన బృందం కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే తలుపులు మూసివేసి వారు సిబ్బంది సెల్ఫోన్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఖమ్మంలో సమావేశానికి వెళ్తూ మధ్యలో ఉన్న మున్సిపల్ కమిషనర్ కొండ్ర నర్సింహను వెనక్కి పిలిపించారు. ఆపై ఉద్యోగులను తప్ప మిగతా వారెవరూ లోనకు రాకుండా కార్యాలయం గేట్లు కూడా మూసివేయించారు. సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీల సమచారం బయటకు పొక్కడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, అధి కారులు కార్యాలయంతో పాటు కమిషనర్ నర్సింహ, మేనేజర్ శ్రీనివాసరావు గృహాల్లో తనిఖీ చేయగా రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. పన్నులపై ఫిర్యాదులు రావడంతో.. మున్సిపాలిటీ పరిధిలో ఇంటి, నీటి పన్నుల వసూళ్లకు సంబంధించి రికార్డుల నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీ చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈమేరకు రెవెన్యూ, శానిట రీ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఉద్యోగులను విడివిడిగా విచారించడమే కాక రికార్డులను పరిశీలించామని వెల్లడించారు. పరిశీలన పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. -
ట్రాక్టర్ ఇంజన్కు నిప్పు పెట్టిన దుండగులు
జూలూరుపాడు: మండలంలోని సాయిరాంతండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇంజన్కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. పంచాయ తీ ట్రాక్టర్ను రోజులాగే సోమవారం రాత్రి సమయంలో ఖాళీ స్థలంలో నిలిపారు. అర్ధరాత్రి సమయాన నిప్పు పెట్టగా మంటలు రావడంతో స్థానికులు సర్పంచ్కు ఫోన్ చేశారు. సర్పంచ్ బానోతు సుమలత, తదితరులు చేరుకునే సరికి బ్యాటరీ, వైరింగ్, టైర్లు కాలిపోయాయి. రెండేళ్లుగా మూలనపడిన ట్రాక్టర్కు ఇటీవల రూ.90 వేలు సొంత నగదుతో మరమ్మతు చేయించామని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో సమీప గ్రామాల సర్పంచ్లు తాటి సువార్త, గడిగ సింధు, కొర్సా రమేశ్, బానోత్ కృష్ణ, లకావత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వాంకుడోత్ వెంకన్న, బోడా భీమారావు, బానోత్ రాంజీ, కిషన్ పాల్గొన్నారు. -
పెనుప్రమాదంగా సామ్రాజ్యవాద పోకడలు
సూపర్బజార్(కొత్తగూడెం): అమెరికా సామ్రాజ్య వాద పోకడలు యుద్ధానికి దారితీసి ప్రపంచశాంతికి పెనుప్రమాదంగా మారాయని.. యుద్ధంతో ప్రాణనష్టమే కాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నానికి కారణమవుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండ లం లోతువాగులో మంగళవారం జరిగిన జిల్లా కౌ న్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం కారణంగా భారత్లోనూ ధరలు పెరగడమే కాక ఇతర సమస్యలు తలెత్తుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కాగా, అడవుల్లో సహజ వనరులను దోచు కునేందుకే కేంద్రం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను తుదముట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాక సింగరేణి కార్మికుల హక్కులను కాలరాయడం మానుకోవా లని డిమాండ్ చేశారు. సేవ్సింగరేణి పేరుతో సోమవారం చేపట్టిన సింగరేణి ప్రధాన కార్యాల యం ముట్టడి విజయవంతం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తాచాటామని తెలిపారు. కార్మికులు, రైతు లు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టుల సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన గళా న్ని అసెంబ్లీలో వినిపిస్తున్నారని సాబీర్పాషా వెల్లడించారు. సీపీఐ నాయకుడు జి.వీరస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, మిరియాల రంగయ్య, కొత్తగూడెం మేయ ర్ మూడ్ గణేశ్తో పాటు నాయకులు కె.సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, సలీం, సలిగంటి శ్రీనివాస్, చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, మువ్వా వెంకటేశ్వరరావు, కంచర్ల జమలయ్య, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచందర్రావు, అడుసుమిల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా -
నేడు పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో బుధవారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63034 08458 నెంబర్ను సంప్రదించాలని ఈఓ వివరించారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సన్మానం సూపర్బజార్(కొత్తగూడెం): పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ చేస్తున్న ఇద్దరు ఎస్ఐలు, ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ను మంగళవారం ఎస్పీ రోహిత్రాజ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏళ్లుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన ఎస్ఐలు మీర్జా కమల్షా బేగ్, వంక రామరాఘవయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పరిశిక మల్లికార్జున్రావు సేవలు మరువలేనివని కొనియాడారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యానాయక్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్బాబు, ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన అధికారులు నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రాన్ని పురావస్తు శాఖ అధికారులు మంగళవారం సందర్శించారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్నాయక్ క్షేత్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై చర్చించారు. పురావస్తు శాఖ ఏఈ శంకర్, నేలకొండపల్లి సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, గ్రీన్వే ఎన్విరాన్మెంటల్ సొసైటీ అధ్యక్షుడు దుడ్డెల రవి తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జైపాల్ఖమ్మంసహకారనగర్: టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకోగా ఉమ్మడి జిల్లా నుంచి జడ్ఎస్.జైపాల్కు స్థానం దక్కింది. ఆయన మంగళ వారం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు స్వీ కరించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు జైపాల్ను టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. ఆ తర్వాత టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును జైపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం తల్లాడ: మండలంలోని కుర్నవల్లి గ్రామంలో నాలుగు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వేంకటాచలపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలస్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను తల్లాడ తహసీల్దార్ కరుణాకర్రెడ్డి, అంతర్జాతీయ చెస్ చాంపియన్ శీలం రఘురామిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: కుటుంబ కలహాల నేపథ్యాన మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (37).. సోమవారం తన కుమారుడు కౌశిక్కు గడ్డిమందు తాగించి తాను కూడా తాగిన విషయం విదితమే. ఇద్దరినీ మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా కౌశిక్ పరిస్థితి కొంత కుదుటపడింది. ఆపై నాగేశ్వరరావును మెరుగైన చికిత్సనిమిత్తం మణుగూ రు నుంచి భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. సింగరేణి ఐరన్ స్క్రాప్ స్వాధీనం మణుగూరుటౌన్: సింగరేణి మణుగూరు ఏరియాలోని ఐరన్ స్క్రాప్ ను ఎత్తుకెళ్తున్న మహిళలను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. ఏరి యా సింగరేణి సెక్యూరి టీ అధికారి కె.శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సుమారు 200 కేజీల ఐరన్ స్క్రాప్ను సోమవారం రాత్రి చోరీ చేసిన మహిళలు ఆటోలో తరలిస్తున్న క్రమాన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారని తెలిపారు. దీంతో నిందితులను పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. పేకాట స్థావరంపై దాడిఅశ్వారావుపేటరూరల్: మండలంలోని దుబ్బతోగు శివారులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్ఐ టి.యయాతిరాజు ఆధ్వర్యాన మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.10,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్య తరఫు బంధువుల దాడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాల్వంచరూరల్: ఓ వ్యక్తిపై భార్య తరఫు బంధువులు దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాల్వంచ మండలం మొండికట్ట గ్రామానికి చెందిన గండికోట ప్రసాద్ (25) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉండగా ఇటీవల పిల్లలను భర్త వద్దే వదిలేసిన ఆమె హైదరాబాద్లోని ఉప్పల్లో ఉంటోంది. అయితే, పిల్లలు తల్లి కోసం బాధపడుతుండడంతో ప్రసాద్ ఆమె వద్దకు వెళ్లాడు. ఈక్రమాన భార్యాభర్తల మధ్య గొడవ జరగగా భార్య తరఫు బంధువులు ఆయనపై దాడి చేయడంతో బలమైన గాయాలయ్యాయి. ఈమేరకు కొత్తగూడెంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు మృతదేహంతో మంగళవారం రాత్రి కిన్నెరసాని పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. -
పంట మార్పిడితో రైతులకు లాభాలు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రతీ సీజన్లో ఒకే పంట కాకుండా మార్పిడి ద్వారా రైతులకు లాభాలు ఉంటాయని కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ తెలిపారు. కొత్తగూడెం కేవీకే ఆధ్వర్యాన మంగళవారం రైతులకు పంట మార్పిడిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ పంట మార్పిడితో నీరు, ఎరువుల వాడకం తగ్గుతుందని తెలిపారు. వానాకాలంలో వరి సాగు చేసే రైతులు యాసంగిలో పెసర, మినుము, బొబ్బెర, ఉలవలు, వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, ఆవాలు వేసుకోవాలని సూచించారు. తద్వారా భూసారాన్ని పరిరక్షించినట్లవుతుందని తెలిపారు. అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా సురక్షితమైన దిగుబడులు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రాజేశ్వరి, ఉద్యాన అధికారి మీనాక్షి, శాస్త్రవేత్తలు శివ, శాస్త్రవేత్త రవీందర్ పాల్గొన్నారు. రూ.1.15కోట్లు పలికిన ఆశీలు మూడోసారి ముడిపడిన వేలం భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఆశీలు (వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లు) అప్పగించేందుకు వేలం ఖరారైంది. గత ఏడాది వేలంలో రూ.1.25 కోట్లు పలకగా, ఈ ఏడాదికి గాను గతనెల 18న మొదటిసారి నిర్వహించిన వేలంలో రూ.82లక్షలే నమోదైంది. దీంతో వాయిదా వేసిన అధికారులు మార్చి 30న నిర్వహిస్తే రూ.88 లక్షలకు మించి పాడకపోవడంతో మళ్లీ వాయిదా వేశారు. ఈమేరకు మూడోసారి మంగళవారం వేలం నిర్వహించగా ఇద్దరు పోటీ పడడంతో రూ.1.15కోట్లకు సోడే రామారావు దక్కించుకున్నాడు. కాగా, మొదటి రెండు సార్లు కాంట్రాక్టర్లు కుమ్మకై ్క ధర పెంచొద్దని నిర్ణయించుకున్నట్లు తెలియగా, మూడోసారి కూడా ఫలితం లేకపోతే గ్రామపంచాయతీ ఆధ్వర్యాన ఆశీలు నిర్వహించాలనే భావనకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి కాంట్రాక్టర్లు పోటీ పడినట్లు తెలిసింది. అయినా గత ఏడాదితో పోలిస్తే రూ.10లక్షలు తగ్గడం గమనార్హం. ‘మన్ కీ బాత్’లో ప్రధాని ప్రశంసలు వ్యవసాయ కళాశాల విద్యార్థికి సన్మానం అశ్వారావుపేటరూరల్: ప్రధాన మంత్రి మోదీ మన్కీ బాత్లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థిని ప్రశంసించడం కళాశాలకు గర్వకారణమని అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్ అన్నారు. మై భారత్ పోర్టల్ ద్వారా వికసిత్ కృషి, వ్యవసాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతు సంక్షేమం అంశంపై కళాశాల విద్యార్థి కె.రఘువీర్రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వగా, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు భాగస్వాములయ్యారు. ఈ విషయాన్ని ఇటీవల ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన మోదీ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా రఘువీర్తోపాటు భారత్ యంగ్ లీడర్ డైలాగ్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిన ఎస్.సాత్విక, వికసిత్ భారత్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న మహర్షి వేద వ్యాస్ తదితరులను మంగళవారం సన్మానించాక హేమంత్కుమార్ మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డాక్టర్ పి.ఝాన్సీరాణి, ప్రొఫెసర్లు డాక్టర్ నాగాంజలి, రాంప్రసాద్, జంబమ్మ, శిరీష, దీపక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు రూ.200కోట్ల రాబడిచివరి మూడు రోజులు రాత్రి 8 గంటల వరకు కార్యాలయాలు ఖమ్మంమయూరిసెంటర్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరమంతా కలిపి 45 వేల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేశారు. వీటితో పాటు మ్యారేజీలు, మార్టిగేజ్లు, స్టాంపుల విక్రయాలు కలిపి రూ.200 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఆర్థిక సంవత్సరం చివరి మూడు రోజులు రాత్రి 8గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు విధులు నిర్వహించారు. అయితే, అధికారులు ఆశించిన విధంగా ముగింపు రోజైన మంగళవారం రిజిస్ట్రేషన్లు జరగలేదని తెలుస్తోంది. ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 13,864 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగినా రూ.104.30 కోట్ల ఆదాయమే వచ్చింది. 2024–25లో 14,258 డాక్యుమెంట్లకు గాను రూ.107.63 కోట్లు ఆదాయం నమోదైంది. దీంతో గత ఏడాది కంటే ఈసారి రూ.3.08 కోట్ల ఆదాయం తగ్గింది. -
ఈసారీ లోటే..
● బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ ● గత ఏడాది కంటే మింత తక్కువగా నమోదు రుద్రంపూర్: సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయింది. సంస్థ వ్యాప్తంగా 12 ఏరియాల్లో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా.. మంగళవారంతో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 58 మిలియన్ టన్నులకే పరిమితమైంది. దీంతో 14 మిలియన్ టన్నుల లోటు నమోదైంది. గత ఏడాది 72 మి.టన్నుల లక్ష్యంలో 69 మి.టన్నుల ఉత్పత్తి సాధిస్తే, ఈసారి అంత కంటే 11 మి.టన్నుల వెనుకంజలో ఉండడం గమనార్హం. అగ్రస్థానాన సత్తుపల్లి ఏటా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఇందులో నుంచి 18 ఓపెన్కాస్ట్ గనులు, 20 భూగర్భ గనులకు రోజు, నెల వారీ లక్ష్యాలను కేటాయిస్తారు. అయితే, ఈసారి సంస్థ పరిధిలోని 12 ఏరియాలకు గాను రెండు ఏరియాల్లోనే 100 శాతం ఉత్పత్తి సాధ్యమైంది. సత్తుపల్లిలో 103 శాతం, బెల్లంపల్లి ఏరియా 101 శాతం ఉత్పత్తి సాధించి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇక మిగిలిన కొత్తగూడెం ఏరియా 92, ఇల్లెందు 50, మణుగూరు 92, మందమర్రి 71, శ్రీరాంపూర్ 68 శాతానికి పరిమితమయ్యాయి. అలాగే, రామగుండం–1 ఏరియాలో 82, రామగుండం–2 ఏరియా 89 శాతం, రామగుండం–3లో 71 శాతం, ఆండ్రియాల ఏరియాలో 11 శాతం, భూపాలపల్లి ఏరియా 61 శాతమే ఉత్పత్తి నమోదు చేయగలిగాయి. లక్ష్యాన్ని సవరించినా.. సింగరేణి సంస్థ 2025–26కు తొలుత 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ భారీ వర్షాలకు తోడు మొదటి మూడు నెలల్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి నమోదు కాకపోవడంతో లక్ష్యాన్ని 72 మిలియన్ టన్నులకు కుదించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో 60 మిలియన్ టన్నులకు తగ్గించారు. అయితే, ఇది కూడా చేరలేక 58 మిలియన్ టన్నులకే పరిమితం కావడం గమనార్హం. సవాలక్ష కారణాలు సంస్థ నిర్దేశించుకున్న మేర బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోవడానికి కారణాలు ఏమిటనే చర్చ జరుగుతోంది. ప్రతీనెల లక్ష్యం, దాన్ని చేరుకునేలా కార్యాచరణపై ప్రతీ మంగళవారం, శనివారం అన్ని ఏరియాల్లో అధికారులు సమీక్షిస్తారు. ఈ సందర్భంగా ఆ నెల వెనుకబడడానికి కారణాలపై చర్చిస్తూనే మరుసటి నైలెనా మెరుగుపడాలని ఆదేశిస్తారు. అయినా ఫలితం లేకపోగా ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి లక్ష్యానికి దూరంగానే ఉండడం గమనా ర్హం. అంతేకాక గతంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో కార్మికులంతా విధులకు హాజరుకావాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తే ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించేవారు. కానీ ఈసారి అలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. లక్ష్యం మేర ఉత్పత్తి చేస్తే లాభాలు కూడా అధికంగా ఇవ్వాల్సి వస్తుందనే భావనతోనే అధికారులు పట్టనట్టుగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. -
రామయ్యకు వసంతోత్సవం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరాయి. శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం వసంతోత్సవాన్ని కన్నుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి బేడా మండపంలోని నిత్యకల్యాణ వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర ప్రత్యేక పూజలు చేశాక, పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. ఆపై మూలమూర్తులు, లక్ష్మీ అమ్మవారు, ఆండాళ్ అమ్మవారు, భద్రుని గుడి, ఆంజనేయస్వామి వార్లకు చివరగా ఉత్సవ మూర్తులపై వసంతాన్ని చల్లారు. అంతేకాక నూతన వధువరులైన సీతారామయ్యను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. అలాగే, సూర్యప్రభ వాహనంపై స్వామి వార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. కాగా, శ్రీరామనవమి తిరుకల్యాణ ఉత్సవాల్లో చివరిరోజైన బుధవారం చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన స్వామి వారి నిత్యకళ్యాణాలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి.నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు -
ప్లాన్ లేదా.. మరిచారా?!
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క దానికీ ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ప్లాన్ తయారీకి ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యాన మాస్టర్ ప్లాన్పై దృష్టి సారించాల్సిన అవసరముంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅప్పుడు విడివిడి.. ఇప్పుడు కలిసి తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే 2014లో కొత్తగూడెం మాస్టర్ ప్లాన్, పాల్వంచకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2005లో ఆమోదం పొందింది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ భవన నిర్మాణ అనుమతులు, రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే గతేడాది ఈ రెండు మున్సిపాలిటీలకు తోడు సుజాతనగర్లోని ఏడు గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ 60డివిజన్లతో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)ను ఏర్పాటుచేశారు. దీంతో పెరిగిన హోదాకు తగినట్లు, ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈమేరకు కొత్తగూడెం, పాల్వంచలో డ్రోన్ సర్వే చేపట్టగా.. సుజాతనగర్లో నిర్వహించాల్సి ఉంది. కార్పొరేషన్ చుట్టూ విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్, 1/70 చట్టాలను పరిగణనలోకి తీసుకోవడమే కాక చుట్టుపక్కల అర్బన్ ప్రాంతంగా మారిన లక్ష్మీదేవిపల్లి, శ్రీనగర్ కాలనీ, చుంచుపల్లి మండల పరిధిలోని సబ్ అర్బన్ ఏరియాను కూడా పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్లో ఇబ్బందులు ఏర్పడవు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. రెండు పట్టణాల్లో పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు, చిన్న బజార్, పెద్దబజార్, పాల్వంచలోని శాస్త్రి రోడ్డు వంటి వాణిజ్య కేంద్రాలు పార్కింగ్ సమస్య కారణంగా గత వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యాన పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపడం అత్యవసరం. ఇక రెండు జాతీయ రహదారుల కారణంగా నగరానికి బైపాస్ రోడ్డు వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆటోనగర్తో పాటు ఈ రహదారిని కేంద్రంగా చేసుకుని కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటును పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటిపోరుతో వెనక్కి.. వందేళ్లకు పైగా అర్బన్ ప్రాంతంగా చరిత్ర కలిగిన ఇల్లెందు పట్టణానికి మాస్టర్ ప్లాన్ కరువైంది. ఇక్కడి 24 వార్డుల్లో 50 వేలకు పైగా జనాభా ఉంది. సింగరేణి గనులు తగ్గిపోవడంతో ఒకప్పుడు కళకళలాడిన పట్టణం క్రమంగా ప్రాభవం కోల్పోయింది. అయితే జీఓ 76 తర్వాత పట్టణానికి కొత్త కళ వచ్చింది. సింగరేణిపై ఆధారపడకుండా రూరల్ ఎకానమీ ఆధారంగా ఇల్లెందు పుంజుకుంటోంది. దీనికి తగినట్లుగా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. గత పాలకమండలి 2023లో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆలోచన చేసినా.. చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వివాదంతో అది మరుగున పడింది. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గమైనా ఈ దిశగా అడుగులు వేయాలని ఇల్లెందు వాసులు కోరుతున్నారు. జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు కొత్త మాస్టర్ ప్లాన్ కోరుతున్న కేఎంసీ -
తొలిసారిగా
మేజర్ గ్రామపంచాయతీ అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. దీంతో తొలి పాలకవర్గం కొలువుదీరగానే.. మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అశ్వారావుపేట ప్రధానంగా ఉద్యాన పంటలు, పామాయిల్ తోటలు, పామాయిల్ పరిశ్రమలు ఆధారంగా ఎదిగిన పట్టణం. ఆకట్టుకునే పచ్చదనం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికంగా, పర్యాటకంగా పట్టణం అభివృద్ధి చెందేలా, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక 2005లో మున్సిపాలిటీగా మణుగూరు అప్గ్రేడ్ అయ్యింది. అయితే, రకారకాల కారణాలతో 19ఏళ్లుగా అధికారుల పాలనే సాగుతోంది. ఫలితంగా డ్రెయినేజీలు, మార్కెట్, పార్కులు వంటి కనీస సదుపాయాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉన్నందున ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావావాల్సిన అవసరముంది. -
ధాన్యం కొనుగోళ్లకు 168 కేంద్రాలు
● చివరి గింజ వరకూ కొనుగోళ్లకు సిద్ధం ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అంకిత్ సూపర్బజార్(కొత్తగూడెం): యాసంగిలో రైతులు సాగు చేసిన ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో సన్న రకం 1,35,365 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకం 51,944 మెట్రిక్ టన్నులు ఉండగా.. కొనుగోళ్లకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరానికి అనుగుణంగా అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.2,389, ‘బీ’ గ్రేడ్కు రూ.2,369 ధర నిర్ణయించగా, సన్న రకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ అందుతుందని తెలిపారు. ఈమేరకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సమకూర్చాలని ఆదేశించారు. అలాగే, రద్దీ నియంత్రణ కోసం రైతులకు టోకెన్లు జారీ చేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపారు. చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేసేలా ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. ఇదేసమయాన సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టుల వద్ద నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీఓ మధు, సివిల్ సప్లయీస్ డీఎం త్రినాధ్బాబు, డీఎస్ఓ ప్రేమ్కుమార్, డీఏఓ బాబురావు, తూనికలు, కొలతల అధికారి మనోహర్, డీఎంఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామసభల నిర్వహణపై... 99రోజుల ప్రణాళికలో భాగంగా బుధవారం నుంచి గ్రామసభల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామపంచాయతీల వారీగా సభలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలు, అందుతున్న నిధులపై వివరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నుంచి కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ విద్యచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, డీపీఓ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.జూలూరుపాడు: విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే కాక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, కళాశాల, పడమటనర్సాపురంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ విద్యార్థులతో మాట్లాడిన ఆయన మెనూ అమలుపై ఆరా తీశాక విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. అలాగే, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్ధాల నాణ్యతను తనిఖీ చేయగా మెనూ పాటించడంలేదని తేలడంతో అసహనం వ్యక్తం చేశారు. తాజా కూరగాయలతో ఆహారం అందించాలని ఆదేశించారు. అలాగే, ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించాలని తెలిపారు. అనంతరం పడమటనర్సాపురం ఏజీహెచ్ఎస్లో తనిఖీ సందర్భంగా స్టోర్ రూమ్లో కూరగాయలు దుర్వాసన రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ మిషన్ పని చేయకపోవడంపైనా ఆరా తీశారు. తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంఈఓ బానోత్ జుంకీలాల్, ఎంపీఓ టి.తులసిరామ్, ఆర్ఐ సీహెచ్.ఆదినారాయణ, కేజీబీవీ ఎస్ఓ పద్మ, ఏజీహెచ్ఎస్ హెచ్ఎం సుభద్రమ్మతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లోనూ ఒంటి పూట
● నేటి నుంచి నిర్వహణకు ఆదేశాలు ● చిన్నారులకు వేసవిలో ఉపశమనం భద్రాచలంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను సైతం ఒకటే పూట నిర్వ హించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పలు కేంద్రాల్లో ఫ్యాన్లు కూడా లేకపోగా.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన బుధవారం నుంచి ఒకే పూట నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 12–30 గంటల వరకే నిర్వహించనున్నారు. ఇక మే 1 నుంచి 31వ తేదీ వరకు కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఆ సమయాన కేంద్రాల్లో పిల్లలకు భోజనం వడ్డించే బదులు వారి ఇళ్లకే సరుకులు అందిస్తారు. మే నెలలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు కూడా సెలవులు ప్రకటించినప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 60 వేల మందికి పైగా చిన్నారులు భద్రాద్రి జిల్లాలో చాలా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. దీంతో అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో వసతులు సరిగ్గా లేకపోవడంతో ఎండ కారణంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 2,061 అంగన్వాడీ కేంద్రాలకు గాను 8,829 మంది గర్భిణులు, 3,652 మంది బాలింతలకు పౌష్టికాహారం, ఇతర సేవలు అందుతున్నాయి. అలాగే, మూడేళ్ల లోపు 34,944 మంది, 3–6 ఏళ్ల లోపు చిన్నారులు 31,711 మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. ఎండ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పంపించడం లేదని ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఏప్రిల్ నెలంతా ఒక పూట నిర్వహణకు నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాలను ఒకే పూట నిర్వహించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీవరకు కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12–30 వరకే నిర్వహిస్తాం. ఈ విషయమై తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాం. –స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
కొత్తగూడెం రైల్వే డివిజన్!
● రానున్న కాలంలో కేంద్రస్థానంగా భద్రాచలం రోడ్ స్టేషన్ ● సికింద్రాబాద్ నుంచి విడదీసి కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే మేలు ● కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతిపత్రం.. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దక్షిణ మధ్య రైల్వేను విభజించి గుంతకల్, గుంటూరు, విజయవాడ జోన్లతో విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జోన్ల విభజనతోపాటే సికింద్రాబాద్ డివిజన్ను కూడా విభజించి భద్రాచలం రోడ్ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే పలువురు డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 6,424కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. దీని పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. 1556 కి.మీ ట్రాక్తో అతి పెద్దగా ఉన్న సికింద్రాబాద్ డివిజన్ను విభజించి కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దకాలంగా ఉన్నా రైల్వేబోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. 1932లో కొత్తగూడెం స్టేషన్.. బొగ్గు రవాణాకు డోర్నకల్ జంక్షన్ను పాయింట్గా తీసుకుని 1927లో ఇల్లెందు (సింగరేణి కాలరీస్)కు రైల్వేలైన్ నిర్మించారు. ఆ తర్వాత 1932లో కొత్తగూడెం (భద్రాచలంరోడ్)కు రైల్వే కనెక్టివిటీ వచ్చింది. 1987లో మణుగూరుకు కూడా రైల్వే లైన్ వచ్చింది. అయితే 2005లో ఇల్లెందుకు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో అధికారులు ఆ స్టేషన్ను కూడా ఎత్తివేశారు. అయితే, కొత్తగూడెం స్టేషన్ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 2032 నాటికి స్టేషన్కు వందేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ఇటీవల కలిసి విన్నవించారు. రాబోయే రోజుల్లో భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ విజయవాడ తరహాలో కీలక జంక్షన్గా మారనుంది. ప్రస్తుతం మంజూరైన మణుగూరు –రామగుండం, భద్రాచలంరోడ్ – కొవ్వూరు, భద్రాచలం–మల్కన్గిరి, కొత్తగూడెం– కిరండోల్ లైన్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి తోడు డోర్నకల్–విజయవాడ కు ప్రత్యామ్నయంగా కొత్తగూడెం – కొండపల్లి (పెనుబల్లి –కొండపల్లి) మార్గానికి ఇప్పటికే సర్వే జరిగింది. వీటిలో ఏఒక్కటి అందుబాటులోకి వచ్చి నా, దానికి కేంద్ర స్థానం కొత్తగూడెమే అవుతుంది. 740.కి.మీ కొత్త రైల్వే లైను అందుబాటులోకి వస్తుంది. దీనికి ప్రస్తుతం ఉన్న డోర్నకల్–భద్రాచలంరోడ్–మణుగూరు (106 కి.మీ) రైల్వేలైన్ను కూడా కలిపితే మొత్తం ట్రాక్ 846 కి.మీ అవుతుంది. దీంతో రైల్వే ఉద్యోగులు/కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది. పరిపాలన పరంగా సికింద్రాబాద్ 280 కి.మీ దూరంలో ఉండగా, భద్రాచలంరోడ్ కేంద్రంగా కొత్త డివిజన్ డిమాండ్కు హేతుబద్ధత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే రైల్వే లైన్లు అన్నీ రిజర్వ్ ఫారెస్ట్ గుండా సాగేవే. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తే పాలనాపరమైన సౌలభ్యం కలగనుంది. -
జెన్కో క్రీడా పోటీలు ప్రారంభం
పాల్వంచ: కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో టీజీ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ ఫుట్బాల్, కల్చరల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ 5,6,7 దశలు, బీటీపీఎస్, పులిచింతల, సింగూర్, విద్యుత్ సౌధ, కేటీపీపీ కర్మాగారాల క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. పోటీలను సీఈలు ఎం.ప్రభాకర్ రావు, జె.సూర్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. ఎస్ఈ మోక్షవీర్, డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు, స్పోర్ట్స్ సెక్రటరీలు వీరస్వామి, మహేష్, జమీల్, అరుణ్, బాబి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ బడ్జెట్ రూ.140.71 కోట్లు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.140.71 కోట్ల ఆదాయం, రూ.159.60కోట్ల వ్యయంతో అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టగా, పాలకవర్గం ఆమోదించింది. జీతా లు, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, కరెంట్ బిల్లులు, రుణ వాయిదాల చెల్లింపులు, పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధులు, పార్కులు, అభివృద్ధి పనులు, ప్రజా మరుగుదొడ్లు, జంతు వధశాలలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు కేటాయింపులను కూడా బడ్జెట్లో పొందుపరిచారు. అయితే బడ్జెట్లో ఆదా యం రూ.140.71కోట్లుగా, ఖర్చు రూ.159.60 కోట్లు చూపి, మిగులు ఆదాయం రూ.68 లక్షలుగా పేర్కొనడం గమనార్హం. బడ్జెట్ ప్రజామోదితంగా ఉండాలి. మురికివాడల్లోని ప్రజల జీవనం ప్రమాణస్థాయిని పెంచేలా ఉండాలి. కార్పొరేషన్ వ్యాప్తంగా కమర్షి యల్, నాన్ కమర్షియల్ నుంచి వచ్చే ఆదాయ పద్దులు వివరించాలి. కానీ ఈ బడ్జెట్ అంకెల గారడీ, ఊహాజనిత బడ్జెట్గా ఉంది. – మునిగడప పద్మ, సీపీఐ కార్పొరేటర్ కార్పొరేషన్ బడ్జెట్ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం.నగర వాసులకు ఒరిగేదేమీ లేదు. బడ్జెట్లో పేర్కొన నిధులు ఎలా సమకూరుతాయో స్పష్టత లేకపోవడం పెద్ద లోపం. రూపకల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. – సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్కొత్తగూడెం కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో అధికారుల అవగాహన రాహిత్యం బయటపడింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వర కు నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వచ్చే ఆదా యం, ఖర్చులు,వేతనాలు, కార్యాలయం, వాహనా ల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించా ల్సిన నిధులు,రావాల్సిన పన్నులపై చర్చలు జరపా ల్సి ఉంది. కానీ గ్రేడ్–2 మున్సిపాలిటీకి కమిషనర్గా వ్యవహరించిన అధికారి, ఇతర అధికారులు ఫ్లెక్సీలు,పారిశుద్ధ్య అంశాలను చర్చించడంతో పలు వురు అధికారులు, పాలకవర్గ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం జరిగి న సర్వసభ్య సమావేశం ఎజెండాలోని 19 అంశాల పై చర్చ జరపాల్సిన వారు, అది పక్కన పెట్టి బడ్జెట్ లెక్కలు గుర్తుకు వచ్చి వాటిపై మాట్లాడారని కొందరు కార్పొరేటర్లు తెలిపారు. అయితే ఏ సమస్యపై మాట్లాడినా మేయర్, కమిషనర్ దాటవేసే ధోరణితోనే వ్యవహరించాని పేర్కొన్నారు. కాగా సమావేశం రాత్రి వరకు కొనసాగింది. -
ఆయిల్పామ్ సాగు మరింత విస్తరణ
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయిల్పామ్ సాగును మరింత విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. సోమవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలు, ఆయిల్పామ్ తోటల్లో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు అధ్యయన యాత్రలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేటలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆయిల్పాం ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులకు అవగాహన కోసం ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే కల్లూరిగూడెం ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని, అశ్వారావుపేటలో కూడా అదనపు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆయిల్ఫెడ్ ఓఎస్డీ అడపా కిరణ్కుమార్, ఓపీడీ మేనేజర్ ప్రవీణ్ రెడ్డి, స్థానిక మేనేజర్లు శబావత్ శంకర్, నాగబాబు పాల్గొన్నారు. ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
పీడీ యాక్ట్ కేసు నమోదు
బూర్గంపాడు: గంజాయి అక్రమ రవాణా, విక్రయాల్లో ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న సారపాకకు చెందిన షేక్ మున్వర్పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇతనిపై బూర్గంపాడు పోలీస్స్టేషన్లో రెండు, లక్ష్మీదేవిపల్లి, ఏడూళ్ల బయ్యారం, దుండిగల్ పోలీస్స్టేషన్లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రోహిత్రాజు పర్యవేక్షణలో ఆధారాలను పరిశీలించిన పీడీ యాక్ట్ను నమోదు చేశారు. సోమవారం నిందితుడు మున్వర్కు పీడీ యాక్ట్కు సంబంధించిన నిర్బంధ ఉత్తర్వులను పాల్వంచ సీఐ సతీష్ అందజేశారు. ఏడాది కాలంపాటు చర్లపల్లి జైలు నిర్బంధించాలని ఉత్వరుల్లో పేర్కొన్నారు. -
ప్రభుత్వాలు సింగరేణిని దోచుకుంటున్నాయి..
● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ ● సింగరేణి ప్రధాన కార్యాలయం ముట్టడి, నాయకుల అరెస్ట్రుద్రంపూర్: సింగరేణి సిరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే.నారాయణ విమర్శించారు. సింగరేణి పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కోల్బెల్ట్ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్మికులు, యూనియన్ కార్యకర్తలు కొత్తగూడెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హెడ్డాఫీస్ చేరుకుని ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పొర్లు దండాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు గంటల పాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొనగా, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, ఏఐటీయూసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి వన్టౌన్కు తరలించారు. అంతకుముందు ఆందోళనను ఉద్దేశించి నారాయణ, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యలన్నీ పరిష్కరించాలని, లేకపోతే సమ్మె సైరన్ మోగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్, నాయకులు సాబిర్పాషా, మిర్యాల రంగయ్య, కే.సారయ్య, వీరభద్రయ్య, వైవీ రావు, ముస్కే సమ్మయ్య, వంగా వెంకట్, జి. వీరస్వామి, రమణమూర్తి పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి
భద్రాచలం: గిరిజనుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన గిరిజనదర్బార్లో ఆయన వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశా రు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎల్టీఆర్ భూ సమస్య పరిష్కరించాలని పెనుబల్లి మండలం వీఎంబంజరకు చెందిన లక్ష్మి, చర్ల మండలానికి చెందిన ఇసుక సొసైటీ మహిళలు సొసైటీ సమస్యలు పరిష్కరించాలని, ఏకలవ్య పాఠశాల నిర్మాణంలో తమ భూమి పోయినందున ఉపాధి కల్పించాలని రేలకాయలపల్లి గ్రామానికి చెందిన రమ్య ఫిర్యాదులు అందజేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపూర్ గ్రామానికి చెందిన బాబూరావు సోలార్ విద్యుత్ కనెక్షన్ కోసం, గుండాల మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన వెంకన్న ఆశ్రమ పాఠశాలలో వాచ్మెన్ పోస్టు కోసం, పాల్వంచకు చెందిన రాంబాబు ట్రైకార్ రుణం కోసం, మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన వరలక్ష్మి కిరాణా షాప్ పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, అశోక్, అరుణకుమారి, మధుకర్, సైదులు, రాంబాబు, లక్ష్మీనారాయణ, ఉదయ్కుమార్, నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
మృతుడి కుటుంబానికి రూ.57 లక్షల పరిహారం
●ఓబీ కంపెనీ యాజమాన్యంతో కార్మిక సంఘాల ఒప్పందం మణుగూరు రూరల్: ఓసీలో డంపర్ టైర్ పేలి మృతి చెందిన కార్మికుడు సర్ఫరాజ్ కుటుంబానికి రూ.57లక్షల నష్టపరిహారం చెల్లించేలా ఓబీ కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సోమవా రం ఒప్పందం కుదిరింది. సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసీ–2లో ఓబీ వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్(దుర్గా) ఓబీ కంపెనీలో ఆది వారం ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఒప్పందం ప్రకారం రూ.43లక్షలను నెలరోజుల్లో నేరుగా మృతిడి కుటుంబానికి చెల్లించనుండగా, రూ. 14లక్షల వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టపరంగా అందజేయనున్నారు. సింగరేణి అఽధికారుల మధ్యవర్తిత్వంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీన, ఇఫ్టూనాయకులు ఓబీ కార్మికుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. మృ తదేహాన్ని బిహార్కు తరలించి, అంత్యక్రియల ఖర్చులు కూడా యాజమాన్యమే చెల్లించనుంది. వీపీఆర్ కాంట్రాక్ట్ కొనసాగినంతకాలం మృతుడి కుటుంబానికి జీతంకూడా చెల్లించేలా ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవి ష్యత్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవా లని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు ఎం.రమేష్, ఎస్.రమేష్, కె.శ్రీనివాస్, రామేశ్వర్, వంశీ, కిరణ్, కార్మిక సంఘాలనాయకులు వై.రాంగోపాల్, కె.కృష్ణంరాజు, నాసర్పాషా, మేకల ఈశ్వర్రావు, శనిగరపుకుమారస్వామి, సురేందర్, సిల్వేరు గట్టయ్య, అబ్దుల్ రవూఫ్, మంగీలాల్, జంపన సీతారామరాజు, మధుబాబు, హరి, రవి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం సిండికేట్లో విభే దాలు
ఇల్లెందు: మద్యం వ్యాపారుల మధ్య విభేదాలు పొడసూపి పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. ఇల్లెందులో వ్యాపారి గణేష్తోపాటు పంబాల సబిత, గోవిందరావు, బి. శ్రీనివాసరావు, చల్లా రామారావు, అర్వపల్లి లక్ష్మీనారాయణ, లగ్గల పురుషోత్తం, పెరుమాళ్ల సరిత, కందుల బేబీ ప్రసన్న, దారా ఉమామహేశ్వరరావు, రామగిరి షణ్ముఖరాజు, ఏపూరి స్రవంతి భాగస్వాములుగా కొన్ని మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. రూ. 70 లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు భాగస్వాములు చెబుతున్నారు. అయితే గణేష్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం లెక్కలు తమకు చూపడం లేదని పేర్కొంటూ ఆదివారం భాగస్వాములు మద్యం షాపులకు తాళాలు వేశారు. తమకు న్యాయం చేయాలని సోమవారం ఇల్లెందు సీఐ తాటిపాములు సురేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. దుకాణాలు మూసివేయడంతో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. కాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ టి. సురేష్, ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్ వేర్వేరుగా తెలిపారు. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ -
● ప్రతీవారం నిర్వహిస్తుండటంతో బాధితుల హర్షాతిరేకాలు ● కలెక్టర్ హెచ్చరికలతో హాజరవుతున్న జిల్లాస్థాయి అధికారులు
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్చికి ముందు సుమారు ఆరునెలల వరకు కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించలేదు. దీంతో బాధితులు తీవ్ర నిరాశ చెందారు. గత నెల చివరిలో నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ అధికారులతో మొదట ప్రజావాణి నిర్వహణపైనే ఆరా తీశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మార్చి 2న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించా రు. కొందరు జిల్లాస్థాయి అధికారులు హాజరుకాకుండా వారి స్థానంలో ఇతర అధికారులను పంపించడంతో గట్టిగా హెచ్చరించారు. శాఖాపరమైన అత్యవసర పనులను ఉంటే ముందుగానే అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రజా వాణి కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారుల హాజ రు పెరిగింది. ప్రజలు సమస్యలపై దరఖాస్తు చేసుకునే సందర్భంలో అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులను పిలిచి వారికి ఆ దరఖాస్తును అందజేసి పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఒక వేళ లేకపోతే కారణాలను నివేదికల రూపంలో అందజేయాలని ఆదేశిస్తున్నారు. దీంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చే బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కారానికి ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు ● కొత్తగూడెం మేదరబస్తీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ వాహబ్ అశ్వారావుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 911/33లో 5 గుంటల రిజిస్టర్ భూమి తన పేరున ఉన్నా ఆర్ఎస్ఆర్ సమస్య కారణంగా పట్టాదారు పాస్పుస్తకం అందలేదని విన్నవించారు. పట్టాదారు పాస్పుస్తకం మంజూరు చేయాలని కోరగా, కలెక్టర్ భూ భారతి విభాగానికి ఎండార్స్ చేశారు. ● ఇందిరా జలప్రభ పథకంలో బోరు మంజూరైనా మోటార్ మీటర్కు సర్వీస్ నంబర్ ఇవ్వలేదని టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఆంగోతు సంతులాల్ ఫిర్యాదు చేశారు. అర్జీని పరిశీలించిన కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ● తన భర్త మృతితో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, పీజీ చదువుకున్న తన కుమార్తెకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఆళ్లపల్లి మండలం చెలగట్టు గ్రామానికి చెందిన కొమరం సారమ్మ విన్నవించగా, దరఖాస్తును సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ● ఎనిమిదేళ్లుగా తమ ఇంటికి కిన్నెరసాని తాగునీటి సరఫరా నిలిచిపోయినా నీటి బిల్లులు విధిస్తున్నారని కొత్తగూడెం మేదరబస్తీ 53వ డివిజన్కు చెందిన శ్రీనివాస్ వివరించారు. నీటి బిల్లులను రద్దు చేసి కొత్త కనెక్షన్ మంజూరు చేయాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును పరిశీలించి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు ఎండార్స్ చేశారు. ● రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు పినపాక, ఏడూళ్ల బయ్యారం, జానంపేట, టి.కొత్తగూడెం పరిసర ప్రాంతాల ముస్లింలు ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ఈద్గాకు స్థలం కేటాయించాలని కోరుతూ అందజేసిన దరఖాస్తును పరిశీలించి పినపాక తహసీల్దార్కు ఎండార్స్ చేశారు. -
శ్రీనివాసగిరిపై పుష్పాభిషేకం
పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాసగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించి పదహారు రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ శర్మ, అర్చకుడు ఆరుట్ల ఫణిరాజాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పుష్పాభిషేకం జరిపించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సేవా ట్రస్ట్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు, కో చైర్మన్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, అధ్యక్షుడు బిక్కసాని సుధాకర్రావు, ఆరుట్ల లక్ష్మణాచా ర్యులు, మధుసూదన్రావు, ఊకే భద్రయ్య, తాటికొండ శ్రీలత, నరసింహాకుమార్, లక్ష్మీరెడ్డి, కందుకూరి రామకృష్ణ, బండి నారాయణ, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు. దరఖాస్తు గడువు పెంపుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా షెడ్యూల్డ్ కులా సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక–2025–26 పథకాల నమోదుకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 8వ తేది వరకు పొడిగించినట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా విభాగానికి సంబంధించి ఈవీ ద్విచక్ర వాహనాలు, త్రిచక్రాల గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, పశుసంవర్థక రంగంలో పాడి పశువులు, సోలార్ పంప్సెట్ వంటి పథకాలకు అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 98499 05990 నంబరులో సంప్రదించాలని సూచించారు. స్కాలర్ షిప్ గడువు కూడా.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీపోస్ మెట్రిక్ స్కాలర్షిప్, రెన్యూవల్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎ.శ్రీలత సోమవారం ఒకప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2024–25 స్కాలర్షిప్ల మంజూరుకు ఇంకా ఆధార్ సీడింగ్కాని బ్యాంకు అకౌంట్ కలిగిన విద్యార్థులు పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాలని వివరించారు. పురాతన నాణేలు లభ్యంఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ పంచాయ తీ బీజీ కొత్తూరు గ్రామంలో పొలా న్ని చదును చేస్తుండగా పురాతన నాణేలు లభ్యమైన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ రైతు తన పొలంలో జేసీబీతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో జేసీబీ తగిలి భూమిలో ఉన్న కుండపగిలి పోయి నాణేలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రాక్టర్ల డ్రైవర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని తీసుకెళ్లి భద్రపరుచుకున్నారు. అనంతరం వారి మధ్య తగాదా జరగడంతో నాణేల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్థానికులు ఏఐ పరిజ్ఞానం ద్వారా అవి 12వ, 13వ శతాబ్దాలనాటి రాగి నాణేలుగా గుర్తించినట్టు సమాచారం. బీజీ కొత్తూరు గ్రామానికి కాకతీ యులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది. సమీపంలో కాకతీయులు నిర్మించిన తుమ్మలచెరువు, చెరువు సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై పురావస్తుశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటనపై సీఐ అశోక్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విష యం తమ దృష్టికి వచ్చిందని, వారిని పిలిపించి పరిశీలించగా అవి రాగి నాణేలా లాగా ఉన్నాయని తెలిపారు. -
పొగాకు బ్యారన్ దగ్ధం
అశ్వారావుపేటరూరల్: అగ్ని ప్రమాదంలో ఓ పొగాకు బ్యారన్ దగ్ధమైన ఘటన సోమవారం మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..నల్లబాడు గ్రామానికి చెందిన రైతు సింహాద్రి వీర్రాజు ఈ నెల 24న వర్జీనియా పొగాకును క్యూరింగ్ చేసేందుకు బ్యారన్లో ఎక్కించగా, ఈ క్రమంలోనే మంటల వ్యాపించి సుమారు రూ.6లక్షల విలువైన పొగాకు కాలి బూడిదైంది. స్థానికుల సమాచారంతో అశ్వారావుపేట అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో వచ్చి మంటలను అదుపు చేశారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిదమ్మపేట: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న వ్యక్తి ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన పసుమర్తి వీర వెంకటేశ్వరరావు (57), అతడి భార్యకు వ్యవసాయ పనుల విషయంలో ఈ నెల 3న గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సుభద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి ..దమ్మపేట: కారు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముష్టిబండ గ్రామానికి చెందిన గద్దల నాగబాబు (39) వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ శివారుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లికి వెళుతున్న కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలై నాగబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్యనాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం●తండ్రీ కొడుకుల పరిస్థితి విషమం మణుగూరు టౌన్: భార్యతో కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త గడ్డిమందు తాగి, కుమారుడికి తాగించిన సంఘటన మణుగూరులోని రామానుజవరంలో సోమవారం జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... జూలూరుపాడుకు చెందిన నగేష్ భార్య, కుమారుడు కౌశిక్తో కలిసి రామానుజవరంలో వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు జరగ్గా, భార్య అక్కడికి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. భార్యతో గొడవ అనంతరం క్షణికావేశంతో నగేష్ గడ్డిమందు తాగాడు. కుమారుడికి కూడా తాగించాడు. దీంతో ఇద్దరు అపస్మారక స్థితికి వెళ్లగా, స్థానికులు మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తీసుకెళ్లారు. గంజాయి రవాణాదారుల అరెస్ట్అశ్వాపురం: గొల్లగూడెంలో ఆదివారం రాత్రి నలు గురు గంజాయి రవాణాదారులను అరెస్ట్ చేసినట్టు సీఐ అశోక్రెడ్డి సోమవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన కారు ను ఆపి సోదా చేశారు. దీంతో రూ.57,500 విలువైన 1.150 కేజీల గంజాయి లభించింది. విచారణ చేపట్టగా హైదరాబాద్కు చెందిన ముస్తాపూర్ రాహుల్, ప్రశాంత్, బిత్తిరి విజయ్కుమార్, యోగేంద్రజాదవ్లు ఒడిశాలోని మల్కన్గిరి నుంచి గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. దీంతో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, కారు సీజ్ చేశామని సీఐ తెలిపారు. ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్ నర్సంపేట రూరల్: ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. నర్సంపేట పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొన్నాల శివశంకర్, ఆయన భార్య రేణుక, పర్ని అశోక్ వాహనాల చోరీకి పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా వారి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు లభ్యమయ్యాయని తెలిపారు. ఈమేరకు నిందితులను రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
మృతుడి ఆచూకీ లభ్యం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వేదాంతపురం సమీపాన గంగారంచెరువులో శనివారం మృతుడి ఆచూకీ లభ్యమైంది. ఈ ఘటన వివరాలను ఆదివారం స్థానిక ఎస్ఐ టి.యయాతీ రాజు ఇలా తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ ఎడ్లబంజర్ ప్రాంతానికి చెందిన బూరుగు నాగేశ్వరరావు(65) గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేట మండలం వేదాంతపురం చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచరించగా.. శనివారం గంగారం గ్రామ శివారులోని సాగునీటి చెరువులో శవమై కనిపించాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి ఆరా తీయగా బూరుగు నాగేశ్వరరావుగా గుర్తించినట్లు తెలిపారు. మృతుడి భార్య కొద్ది నెలల క్రితమే మృతి చెందగా, ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని సోమవారం కుటుంబీకులకు అప్పగిస్తామని ఎస్ఐ తెలిపారు. అగ్నికి ఆహుతైన పశువుల పాకలు.. దుమ్ముగూడెం: మండలంలోని సుబ్బారావుపేట గ్రామానికి చెందిన వెంకయ్య, చిన్నయ్య, చిన్నారావులకు చెందిన మూడు పశువుల పాకలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదవశాత్తు అగ్గిరవ్వలు అంటుకోవడంతో మొదటగా వెంకయ్య పశువుల పాకకు మంటలు వ్యాపించి వరుసగా ఉన్నా మూడు పాకలకు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రూ.65వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. -
బస్సు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు మృతి
డ్రైవర్పై కేసు నమోదు బూర్గంపాడు: సారపాక బస్టాండ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామచంద్రాపురం గ్రామానికి చెందిన అమృతపు మల్ల మ్మ (60) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ అకస్మాత్తుగా వాహనాన్ని కదిలించడంతో ఆమె బస్సు కింద పడగా.. మల్లమ్మ కుడి కాలిపై నుంచి బస్సు టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను భద్రాచలం ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం తరలించినప్పటికీ పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్పై బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. రైస్ మిల్లులో మహిళ మృతివరిపొట్టు పడడంతో ఊపిరి ఆడక ఘటన నేలకొండపల్లి: నిబంధనలు విస్మరించిన ఓ రైస్ మిల్లు యాజమాన్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అయితే, ఘటన జరిగాక కూడా యాజమాన్యం స్పందించలేదని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని రాజేశ్వరపురం వద్ద ఉన్న అరుణాచల రైస్ మిల్లులో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన పప్పుల కళ్యాణి (34) రోజువారీ కూలీ పనులకు వస్తోంది. ఆదివారం కూడా ఆమె వరి పొట్టు తీస్తుండగా పొట్టు ఒక్కసారిగా మీద పడడంతో కూరుకుపోయింది. సహచర కూలీలు ఆమెను బయటకు తీసి సీఆర్పీ చేసి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదంలో యాజమాన్యం స్పందించకపోవడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణి మృతదేహంతో నేలకొండపల్లి సెంటర్లో రాస్తారోకోకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడమే కాక మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలకు సీపీఎం మండల కార్యదర్శి కే.వీ.రెడ్డి, సీపీఐ నాయకుడు కర్నాటి భానుప్రసాద్ తదితరులు సంఘీభావం తెలపగా ఖమ్మం – కోదాడ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు చేరుకుని దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
●ప్రమాదపుటంచున ప్రయాణం..
పాల్వంచలోని గోవర్థనగిరి కాలనీ మూలమలుపు వద్ద సీసీ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు దిగువ భాగం లోతుగా ఉండడంతో అటుగా వస్తున్న వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈనేపథ్యాన ఆదివారం ఓ ట్రాలీ ఆటో అదే రోడ్డులో అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ క్రమంలో అందులోని డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. సరైన డ్రెయినేజీ లేకపోవడం, కాల్వ దిగువగా ఉండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సరైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. – పాల్వంచ -
‘డబుల్’ ఇళ్లను ఆక్రమించిన పేదలు
పాల్వంచ: పాల్వంచలోని నవభారత్ గాంధీనగర్ ఏరియాలో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను ఆదివారం సీపీఎం సమక్షంలో పేదలుఆక్రమించా రు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ దారా ప్రసాద్, ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ఆక్రమణలు చట్ట విరుద్ధమని అధికారులు చెప్పి ఖాళీ చేయాలన్నారు. దీంతో సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూ ఇళ్లు నిర్మించి నెలలు గడుస్తున్నా.. ఇంకా అర్హులైన పేదలకు ఇవ్వకపోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసి పేదలకు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులసీరాం, కె.సత్య, సత్యవాణి, క్రాంతి, సులోచన, మాధవి, వింజ రాములు, గౌసియా తదితరులు పాల్గొన్నారు. మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడుకు సమీపంలోని కిన్నెరసాని నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకుని ట్రాక్టర్లను పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. తదుపరి చర్యల కోసం తహసీల్దార్కు తెలియజేశామన్నారు. -
మణుగూరు ఓసీ–2లో ప్రమాదం..
● డంపర్ టైరు పేలి ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలు ● పరిశీలించిన జీఎం, యూనియన్ నేతలుమణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–2లో ఓబీ వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్ (దుర్గా) కంపెనీలో సానియో డంపర్ టైర్ పేలిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను తోటి కార్మికులు, యూనియన్ల ప్రతినిధులు ఇలా తెలిపారు. ఓసీ–2లో హాల్ రోడ్ వద్ద సాయబ్ లాల్ యాదవ్ ఆపరేట్ చేస్తున్న 196 నంబర్ గల 60 టన్ శానియో డంపర్ ఫ్రంట్ వీల్ జామ్ అయి బ్రేక్డౌన్ అయింది. దాన్ని బిహార్కు చెందిన టైర్ ఫిట్టర్ సర్ఫరాజ్(40), మంతూ కుమార్(మెకానిక్), జగదీష్ కాశ్వా (టైర్ హెల్పర్), తాజ్ అన్సార్ (టైర్ సెక్షన్)లు సాయంత్రం 4.10 నిమిషాల సమయంలో మారుస్తుండగా టైరు ఒక్కసారిగా పేలి సమీపంలో ఉన్న సర్ఫరాజ్కు వేగంగా వచ్చి తగలడంతో తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మిగిలిన వారికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సింగరేణి ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా.. సర్ఫరాజ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రగాయాలైన సాహెబ్ లాల్ యాదవ్ను మెరుగైన వైద్యసేవల నిమిత్తం కొత్తగూడెం తరలించారు. ఛిద్రమైన పక్కటెముకలు.. సంఘటనా స్థలంలో టైరుకు అతి దగ్గరగా ఉన్న సర్ఫరాజ్కు టైరు రింగు చాతిభాగంలో తగలడంతో 10 పక్కటెముకలు విరిగాయి. ఈక్రమంలోనే రక్తం ఊపిరితిత్తుల్లోకి చేరడంతో మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. ఈనేపథ్యాన బాధితులను ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ వై.రాంగోపాల్, రామనర్సయ్య, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వత్సవాయి కృష్ణంరాజు, సిలివేరు గట్టయ్య, సీఐటీయూ బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం, ఇఫ్టూ నేత నాజర్పాషా, టీబీజీకేఎస్ నేత నాగెల్లి వెంకట్, ఏరియా జీఎం దుర్గం రాంచందర్, పీఓ శ్రీ రమేశ్, ఇంజనీర్ శ్రీనివాస్, సెక్యూరిటీ అధికారి శ్రీని వాస్లు మృతుడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలో సందర్శించి చికిత్స పొందుతున్న బాధితులతో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అత్యవసర వైద్య సేవలు అందించాలని జీఎం వైద్య బృందాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా యూని యన్ నాయకులు మాట్లాడుతూ.. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో ఎస్ఓపీ అమలు చేయాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
దాచుకుందాం.!
దోచుకుందాం.. ● ఇసుక, ఇటుక మాఫియా సరికొత్త ప్రతిపాదన ● ట్రాక్టర్పై ఒక్కసారిగా రేటు పెంచిన వైనం ● ఇందిరమ్మ లబ్ధిదారులపై పెరుగుతున్న భారంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రం చుట్టూ పాగా వేసిన ఇసుక, ఇటుక మాఫియాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు చివరకు దోచుకుందాం.. దాచుకుందాం... అన్నట్టుగా మారింది. ఇరువర్గాలు నష్టపోకుండా సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టే సరికొత్త ప్లాన్ను తెర మీదకు తెచ్చాయి. బయటకు ఎలా పొక్కింది? లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి సమీపంలో ఇటుక, ఇసుక అక్రమ వ్యాపారం విషయంలో చోటుచేసుకున్న ఆధిపత్య పోరు, చెలరేగిన ఘర్షణ, కుదిరిన రాజీపై గత బుధవారం ‘సాక్షి’లో వచ్చిన ‘రణరంగం’ కథనం ఇసుక–ఇటుక మాఫియాకు చెందిన కీలక వ్యక్తుల్లో కలవరం కలిగించింది. అర్ధరాత్రి వేళ జరిగిన వివాదానికి సంబంధించిన విషయాలు బయటకు ఎలా పొక్కాయి? ఎవరు చెప్పారనే అంశంపై ఆరా తీయడం మొదలెట్టారు. మీ పంచాయతీలకు మా నుంచి డబ్బులు రావాలంటే గొడవకు సంబంధించిన విషయాలు ఎవరు బయటకు చెబుతున్నారో, తమకు చెప్పాలంటూ గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఏది జరిగినా మన మధ్యనే ఉండాలని, అప్పుడే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని గ్రామస్తులకు నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈ విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకు ఇసుక, ఇటుక బట్టీల నుంచి అనధికారిక లోకల్ ట్యాక్స్లను మరింతగా అందిస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లపై భారం సామాన్యుల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీంతో స్థానిక వాగుల్లో దొరికే ఇసుకతోపాటు ఇక్కడ తయారయ్యే ఇటుకలకు డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో లెక్కాపత్రం, నియమ నిబంధనలు పాటించకుండా ఇటుక, ఇసుక సరఫరా చేస్తున్న వ్యక్తులుఒక్కసారిగాధరలు పెంచేయడంతో సామా న్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం మరింత భారంగా మారింది. సరికొత్త జీఎస్టీ ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) పేరుతో ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. ఇలా వచ్చిన నిధులను పాలన, అభివృద్ధి పనులు, సంక్షేమం, దేశ రక్షణ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, నిబంధనలతో పని లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం, అడవిని నరికి ఆ కర్రలతో ఇటుకలు తయారు చేయడమనేది చట్ట విరుద్ధమైన పనులు. వీటికి తోడు ఇప్పుడు అనధికారిక లోకల్ ట్యాక్సెస్ కూడా వారే నిర్ణయించుకోవడం మరో వింత. ఈ అనధికారిక దందాకు చెక్ పెట్టాల్సిన మైనింగ్, ఫారెస్ట్, పోలీస్ శాఖ అధికారులు ఇసుక, ఇటుక దందాపై చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్ల నే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ అభివృద్ధి కమిటీల పేరు చెప్పి కొందరు రాజకీయ నేతలు రంగంలోకి దిగి తెర లేపిన సరికొత్త దందాతో పల్లెల్లో ప్రశాంత వాతావరణం పాడైపోతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ లబ్ధిదారులపై అదనపు భారం పడుతోంది. కొత్తగా కుదిరిన ఒప్పందం ట్రాక్టర్ ఇసుకపై రూ.2,000 చెల్లిస్తామని ఇసుక మాఫియా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇటుక బట్టీలకు సరఫరా అయ్యే మట్టి విషయంలో ట్రాక్టర్కు రూ.2,500 చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అనధికారిక లోకల్ ట్యాక్స్ల ద్వారా వచ్చిన సొమ్ములో సగం మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని ‘మేనేజ్మెంట్’ కోసం వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక్క అనిశెట్టిపల్లి గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే ఇక్కడ నుంచి ప్రతీ రోజు లక్ష రూపాయల వరకు అదనంగా వసూలు చేయాలనే ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. ఇక్కడ వ్యవహారం సాఫీగా సాగితే రాబోయే కొద్ది రోజుల్లో పరిసర గ్రామాల్లోనూ దందాను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
అంగన్వాడీల్లో ‘ఒంటిపూట’ ఎప్పుడో..?
సూపర్బజార్(కొత్తగూడెం): అంగన్వాడీ కేంద్రాల్లో ఇంకా ఒంటిపూట బడులు అమలు చేయకపోవడంతో వేసవి తాపానికి చిన్నారులు అల్లాడుతున్నారు. విద్యాసంస్థల్లో ఒంటిపూట బడులను అమలు చేస్తున్నా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులను అమలు చేయడం లేదు. అసలే అరకొర సౌకర్యాలతో నడుస్తున్న అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు ఎండలతో కూడా ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తుండటంతో మధ్యాహ్న సమయాన చిన్నారులు వేడి భరించలేక పోతున్నారు. దీంతో చాలా కేంద్రాల్లో హాజరుశాతం తగ్గిపోతోంది. అద్దె భవనాల్లో నిర్వహించే అంగన్వాడీ కేంద్రాల్లో పరి స్థితి మరింత దయనీయంగా మారింది. ఉదయం పదిగంటల నుంచే ఎండ తీవ్రత ఉండటంతో చిన్నారులు ఉక్కపోత భరించలేకపోతున్నారు. ఇటీవల కలెక్టరేట్ ఎదుట కొన్ని యూనియన్లు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పరిష్కరించాలని ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించినా అంగన్వాడీ సెంటర్లలో మాత్రం పాటించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. తక్షణమే ఒంటి పూట బడులు ప్రా రంభించడంతోపాటు మే నెలలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తరచూ అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చల్లటి తాగునీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండ వేడికి అల్లాడుతున్న చిన్నారులు ఒంటిపూట బడులకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఉన్నతాధికారులకు సమస్యను నివేదించాం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులకు అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటాం. – స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూఓ -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయప్రాంగ ణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ పాలకవర్గం, వేదపండితులు, అర్చకులు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరి ష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ఉద యం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలను లిఖితపూర్వకంగా అందజేయాలని సూచించారు. నేడు గిరిజన దర్బార్భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు. గోదావరిపై వారధి!అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట అశ్వాపురం–దుమ్ముగూడెం మండలాలకు వారధిలా పనిచేస్తోంది. గోదావరి నీటిమట్టం తగ్గడంతో ఆనకట్టపైనుంచి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకులూ సందర్శిస్తున్నారు. ఆనకట్ట వేసవిలో వారధిలా, శీతాకాలంలో జలపాతంలా, వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ.. కాలానికో అందంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యా మ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 265 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్లైఫ్ శాఖకు రూ. 15,635 ఆదాయం లభించింది. 210 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.12,860 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముగిసిన ఇంటర్ మూల్యాంకనం ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వాల్యూయేషన్) ఆదివారంతో ముగిసింది. ఖమ్మంలోని నయా బజార్ జూనియర్ కళాశాలలో క్యాంప్ ఏర్పాటుచేయగా క్యాంప్ ఆఫీసర్గా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు వ్యవహరించా రు. రాష్ట్రంలోని వివిధజిల్లాలకు చెందిన 3,14,501 జవాబుపత్రాలు పంపించారు. ఈ నెల 4వ తేదీన మొదలైన ముల్యాంకనంలో 1,220మంది అధ్యాపకులు పాల్గొనగా ఆదివా రం ముగిసిందని డీఐఈఓ రవిబాబు తెలిపా రు. అయితే, ఏప్రిల్ 2వ తేదీ వరకు రీకౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. -
ఒకేసారి మూడు నెలల రేషన్
● రేషన్ దుకాణాలకు సన్నబియ్యం తరలింపు ● జిల్లాలో 17,282 టన్నుల బియ్యం పంపిణీకి సిద్ధంపాల్వంచరూరల్: వేసవికాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం మూడు (ఏప్రిల్, మే, జూన్) నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 443 రేషన్ దుకాణాలు ఉండగా, ప్రతి నెలా ఆయా రేషన్షాపులకు 5,500 టన్నుల సన్న బియ్యాన్ని పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచి రేషన్కార్డుదారులకు ఒకేసారి మూడునెలల రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అధికా రులు సివిల్ సప్లాయీస్ గోదాములనుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. రేషన్ దుకాణాలు బియ్యం బస్తాల నిల్వలతో నిండిపోతున్నాయి. కొన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ లకు తోడు మార్చిలో మిగిలిన బియ్యం నిల్వలు, మూడు నెలల రేషన్తో భారీగా నిల్వలు పేరుకుపోయినట్లు డీలర్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల బియ్యం పంపిణీ చేయనుండగా, ఈసారి 18 కేజీల సన్నబియ్యం అందించనున్నారు. మూడు నెలల రేషన్ బియ్యాన్ని జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నాం. 17,282 టన్నుల బియ్యాన్ని నిర్దేశిత రేషన్షాపులకు అందిస్తున్నాం. ప్రతినెలా మాదిరిగా పంపిణీ జరుగుతుంది. గడువు పొడిగింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. –త్రినాథ్బాబు, జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం -
సీతారాములకు మహ దాశీర్వచనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివా రం సీతారాముల జంటకు పండితులు మహ దా శీర్వచనం అందజేశారు. స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం అనంతరం నూతన వధూవరులైన సీతారామచంద్రుల వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వడమే ఈ సదస్యం పరమార్ధం. సీతారాముల కల్యాణంలో పాల్గొని తిలకించిన భక్తులకు సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ క్రతువు నిర్వహిస్తున్నట్లు వేద పండితులు వివరించారు. కల్యాణం జరిగిన మూడోరోజున స్వామి వారికి మహ దాశీర్వచనం అందజేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయమని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి తెప్పోత్సవం, దొంగల దోపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పూజల్లో వేద పండితులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైభవంగా నదీ హారతిభద్రాచలం టౌన్: భద్రాచలం గోదావరి తీరంలో ఆదివారం సాయంత్రం నదీ హారతి కార్యక్రమం కనువిందుగా సాగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు, దీపోత్సవం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నదికి హారతులు సమర్పించారు. ప్రతీ ఆదివారం నిర్వహిస్తున్న ఈ హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోందని పురోహితుడు రామవజ్జల రవికుమార్ తెలిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నేడు రామయ్యకు తెప్పోత్సవం, దొంగల దోపు -
పోరాటాలతోనే హక్కుల సాధన
ఖమ్మంగాంధీచౌక్: సమస్యల పరిష్కారం, హ క్కుల సాధన పోరాటాలతోనే సాధ్యమని ఎన్ఎఫ్పీఈ(నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్) రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్కుమార్ అన్నారు. ఎన్ఎఫ్పీఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా ద్వైవా ర్షిక మహాసభ ఆదివా రం ఖమ్మంలోని తపాలా ప్రధాన కార్యాలయంలో జరిగింది. యూనియన్ ప్రతినిధులు ఏలూరి శ్రీని వాసరావు, వై.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రావణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా పనిభారం మోపుతోందని విమర్శించారు. ఈనేపథ్యాన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. యూనియన్ నాయకులు మహేందర్, మధుసూదన్రావు, లెనిన్ శ్రీనివాస్, ఎస్వీ.రావు, రామశాస్త్రి, నాగేశ్వరరావు, జయరాజు, ఖాజామోహినుద్దీన్, మౌ లాలి, రాజ్యలక్ష్మి, సుబేదాబేగం, ఖమ్మం డివిజ న్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టుమెన్ల సంఘం అధ్యక్షుడిగా వై.సత్యనారాయణ, కార్యదర్శిగా పెరుగు నాగేశ్వరరావు, క్లాస్–3 యూనియన్ అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా బందెల నాగరాజు, కోశాధికారిగా రవీందర్ను ఎన్నుకున్నారు. తపాలా ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్కుమార్ -
చూసి వెళ్లండి
ఆగండి.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రెండు రాష్ట్రాలనే కాక ఖమ్మం – భద్రాద్రి జిల్లాలను కలిపే కీలకమైన ఖమ్మం–తల్లాడ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. 33 కి.మీ. మేర ఉన్న ఈ మార్గంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రహదారి గుంతలమయంగా మారినా అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతుండడం.. మరోపక్క ట్రాఫిక్ విపరీతంగా పెరగడం ఇందుకు కారణమవుతోంది. ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని అధికార యంత్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. ఇక్కడే ప్రమాదాలు.. ఖమ్మం–తల్లాడ రహదారిలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు దివ్యాంగులుగా మిగులుతున్నారు. ప్రధానంగా తనికెళ్ల, కొణిజర్ల ప్రధాన రహదారి, వైరా రింగ్ సెంటర్, వైరా బ్రిడ్జి, తల్లాడ సెంటర్లలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాలను హాట్ స్పాట్లును గుర్తించి హెచ్చరికల బోర్డులు, ఇతర చర్యలు చేపడతామని చెప్పినా ప్రమాదాలు తగ్గడం లేదు. దూరప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులకు రహదారిపై అవగాహన లేక అతివేగంగా వెళ్తూ గుంతలను తప్పించే క్రమాన ఇతర వాహనాలను ఢీకొడుతున్నారు. గతంలో జిల్లాలో హామ్ (హైబ్రిడ్ యాన్యుయిటీ మోడల్) రోడ్లు నిర్మిస్తామని చెప్పినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులకే నిర్ణయించి.. హామ్ నిధులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వినియోగించనున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే మొదలైతేనే.. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఆలస్యమైంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే భారీ వాహనాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన వాహనాలన్నీ ఆ మార్గంలోనే వచ్చివెళ్తాయి. దీంతో ఖమ్మం – తల్లాడ రహదారిపై ట్రాఫిక్ తగ్గనుంది. ఈ రహదారి మే నెలలో హైవే అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.హైదరాబాద్ తదితర నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఈ రహదారి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఆయా ప్రాంతాలకు నిత్యం ఆర్టీసీ బస్సులే కాక లారీలు, కార్లు తిరుగుతుంటాయి. సరుకు రవాణాకు ఇది ప్రధాన మార్గం కావడంతో రాత్రీపగలు తేడా లేకుండా రద్దీ ఉంటుంది. అయితే, ఇది సింగిల్ రోడ్డు కావడంతో కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోంది. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా చేసే లారీల డ్రైవర్లు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు.ప్రమాదకరంగా ఖమ్మం–తల్లాడ రహదారి ఖమ్మం నుంచి వెంకటాయపాలెం వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉన్నా ఆ తర్వాత సింగిల్ రోడ్డు ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో రోడ్లు మరింతగా దెబ్బతిని గుంతల్లో నీరు నిలుస్తుండగా.. ఈ విషయాన్ని గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ప్రధానంగా కొణిజర్ల సమీపాన అధ్వానంగా మారిన రోడ్డుపై గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు పెద్దవై, ప్రమాదాలు జరిగి విమర్శలు వచ్చినప్పుడే కంకర, ఇసుక, తారుతో తాత్కాలికంగా పూడుస్తుండడంతో కొద్దిరోజులకే సమస్య పునరావృతమవుతోంది. దీనికి తోడు తాత్కాలిక మరమ్మతులు చేయడంతో రోడ్డు ఓచోట ఎత్తుగా.. మరోచోట దిగుడుగా మారి వాహనదారులు అదుపు తప్పుతున్నారు. -
గ్రంథాలయ సేవలు మెరుగు పరుస్తాం
మణుగూరు రూరల్ : గ్రంథాలయ సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ముత్యాలమ్మనగర్ గ్రామపంచా యతీ శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రంథాలయంలో వైఫై ఏర్పాటు చేసిన దూపకుంట్ల అనిల్ను అభినందించారు. అనంతరం పలువురికి గ్రంథాల య మెంబర్షిప్, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం జంపేశ్వరి, ఉపసర్పంచ్ శ్రీను నాయక్, గ్రంథాలయ సిబ్బంది గీత పాల్గొన్నారు. అడవిని సంరక్షించాలిచుంచుపల్లి/పాల్వంచరూరల్: అటవీ సంరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని కాంపా సీసీఎఫ్ క్షితిజ సూచించారు. శనివారం ఆమె చాతకొండ, హేమచంద్రాపురం, లోతు వాగు ప్లాంటేషన్లను, వనవిహార్ కాంప్లెక్స్లోని మీటింగ్ హాల్, కిన్నెరసాని డీర్ పార్కు, మందెరకలపాడు బీట్, సఫారీ రూట్లను పరిశీలించారు. అనంతరం ట్రెక్కింగ్ చేశారు. ప్లాంటేషన్లలో మొక్కల పెరుగుదల, సంరక్షణ చర్యలు, నీటి వనరుల వినియోగం, మట్టి సంరక్షణ చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎఫ్ఓ కృష్ణగౌడ్, ఎఫ్డీఓ కోటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
●గిరిజన ఉత్పత్తులు భేష్
●భద్రగిరి మార్ట్ ప్రారంభోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భద్రాచలం: స్వచ్ఛమైన, నాణ్యమైన గిరి జన ఉత్పత్తులను అందించేందుకు, గిరిజ నులు ఉపాధి పొందేందుకు ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ భేష్ అని గవర్నర్ శివ ప్రతాప్శుక్లా దంపతులు అన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భద్రగిరి గిరిజ న మార్ట్ను గవర్నర్ శుక్లా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. మార్ట్లోని అటవీ ఉత్పత్తులను పరిశీలించారు. గవర్నర్ గిరిజన ఆయి ల్ ఉత్పత్తులను కొనుగోలు చేయగా, ఆయన సతీ మణి నగదును పీఓకు అందజేశారు. గిరిజన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పీఓ చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
వీఐపీల జపం.. మితిమీరిన ఆంక్షలు
● ఎప్పటిలాగే సామాన్యులకు తప్పని వసతి కష్టాలు ● కలెక్టర్గా అంకిత్కు తొలి నవమి, సీఎం, గవర్నర్ టూర్లు సక్సెస్ ● ఉత్సవాల విజయవంతంతో ఊపిరి పీల్చుకున్న అధికారులుభద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం విజయవంతంగా ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటనలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముగియటంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, వీఐపీల సేవల్లో మునిగి తేలారని, సామాన్య భక్తుల ఇక్కట్లను పట్టించుకోలేదనే అపవాదును మాత్రం మిగుల్చుకున్నారు. మితిమీరిన ఆంక్షలతో సామాన్యులు, స్థానికులతోపాటు ప్రముఖులను కూడా ఇబ్బందులకు గురిచేశారు. సీఎం పర్యటనపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నవమి వేడుకల్లో పాల్గొనడంతోపాటు అభివృద్ధి పనులు కూడా ప్రారంభించడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్గా అంకిత్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి టాస్క్గా సీఎం పర్యటన నిలిచింది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన అధికారులను సమన్వయం చేసుకుంటూ సీఎం టూర్ సక్సెస్లో కీలక పాత్ర పోషించారు. వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కూడా భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఇతర అధికారులతో పలుమార్లు సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. చివరి నాలుగు రోజులు మిగతా అధికారులతో కలిసి రోజూ స్టేడియాన్ని పరిశీలించి సెక్టార్ వివరాలను, పనులను నిరంతరం పర్యవేక్షించారు. సమన్వయంతో సమష్టి విజయం.. ఉత్సవాల విజయవంతానికి ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాజేడు, భద్రాచలం పర్యటన సందర్భంగా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎదుర్కోలు ఉత్సవం రోజునే వచ్చి ఏర్పాట్లను పరిశీలించి సలహాలు, సూచనలను చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. అధికారులు వీఐపీల పర్యటనపైనే దృష్టి సారించటంతో సామాన్య భక్తుల ఇక్కట్లు షరామామూలుగానే నిలిచాయి. ఎదుర్కోలు, నవమి వేడుకలకు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు గదులు, డార్మెటరీలు తగినట్లు లభించలేదు. దీంతో గోదావరి ఘాట్ మెట్లు, కరకట్టలు, పార్క్లే పాన్పులుగా మారాయి. వేలాదిగా వచ్చిన భక్తులు ఎండ వేడిమికి విలవిల్లాడారు. స్టేడియంలోని గ్యాలరీలలో ఎడమ పక్కన కొద్ది మేర శాశ్వత షెడ్, తాత్కాలిక పందిళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం సైతం బతిమిలాడుకోవడం కనిపించింది. గ్యాస్ కొరత ఉండటంతో గతేడాది కంటే పులిహోర, అన్నదాన సేవలు తగ్గాయి. సేవా సంస్థలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో అధికారులు విఫలయ్యారనే విమర్శలు వచ్చాయి. అధికారులు వీఐపీల పర్యటనపైనే దృష్టి సారించటంతో సామాన్య భక్తుల ఇక్కట్లు షరామామూలుగానే నిలిచాయి. ఎదుర్కోలు, నవమి వేడుకలకు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు గదులు, డార్మెటరీలు తగినట్లు లభించలేదు. దీంతో గోదావరి ఘాట్ మెట్లు, కరకట్టలు, పార్క్లే పాన్పులుగా మారాయి. వేలాదిగా వచ్చిన భక్తులు ఎండ వేడిమికి విలవిల్లాడారు. స్టేడియంలోని గ్యాలరీలలో ఎడమ పక్కన కొద్ది మేర శాశ్వత షెడ్, తాత్కాలిక పందిళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం సైతం బతిమిలాడుకోవడం కనిపించింది. గ్యాస్ కొరత ఉండటంతో గతేడాది కంటే పులిహోర, అన్నదాన సేవలు తగ్గాయి. సేవా సంస్థలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో అధికారులు విఫలయ్యారనే విమర్శలు వచ్చాయి. ఉత్సవాలు విజయవంతమైనా అధికారుల మితిమీరిన ఆంక్షలతో విమర్శలు వచ్చాయి. ఎప్పటిలాగే జ్యుడీషియరీ ప్రముఖులను గుర్తించటంతో అధికారులు విఫలమయ్యారు. గతేడాది సైతం సీఎం సెక్టార్లో న్యాయశాఖ వీఐపీలు నొచ్చుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది కూడా ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రైనీ కలెక్టర్ అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. రామదాసు వారసుడు, దేవస్థానం ఈవోలను అడ్డుకోవడం మచ్చలుగా మిగిలాయి. ఇలాంటివి పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు తప్ప ఇతర శాఖల అధికారులకు మాత్రమే ఎదురవుతున్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమాచార శాఖ ఈ ఏడాది సైతం ముందస్తు ప్రణాళిక లేకుండా పాస్లు జారీ చేయడంతో గందరగోళంగా మారింది. -
సింహాసనం అధిష్టించగా..
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల దివ్యక్షేత్రంలో శనివారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. పంచారాత్ర ఆగమ శాస్త్రాలను అనుసరిస్తూ వేడుక నిర్వహించగా, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రభుత్వం తరఫున శ్రీరాముడికి పట్టువస్త్రాలను సమర్పించారు. రాజాధిరాజుగా కొలువుదీరిన స్వామివారిని వీక్షించి భక్తులు తరించారు. భద్రాచలం: సీత, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడిని ప్రధాన ఆలయం నుంచి మాడ వీధులు గుండా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన, పుణ్యావాచనం చేశాక, పండితులు రుత్విక్కులైన వశిష్టు డు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడిని తమపై ఆవాహన చేసుకున్నారు. రుత్వికరణం తర్వాత పండితులు మండపత్ర పూజలు ప్రారంభించారు. పట్టాభిషేకం వేదిక దిగువ భాగంలో ఏర్పాటు చేసిన మూడు కలశాల్లో సమస్త దేవతలు, సమస్త నదీ, సముద్ర జలాలతో పాటు రామపరివారాన్ని, అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ఆపై త్రిదండి దేవనామ రామానుజాచార్యులు శ్రీరాముడి పాలన విశిష్టతను వివరించారు. రాజలాంఛనాలతో పట్టాభిషేక అలంకరణ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ముందుగా రాజదండాన్ని శ్రీరాముడి కుడిచేతిలో ఉంచారు. అనంతరం రాజముద్రికను తొడిగారు. ఆ తర్వాత రామదాసు చేయించిన పచ్చల పతకాన్ని శ్రీరాముడికి, చింతాకు పతకాన్ని సీతాదేవికి, రామమాడను లక్ష్మణుడికి అలంకరించారు. శ్రీరాముడికి ఇరువైపులా చామరాలను ఉంచారు. ఆపై స్వర్ణఛత్రాన్ని స్థిరం చేశారు. చివరగా రాజఖడ్గాన్ని రామయ్య ఎడమ చేతిలో ధరింప చేశారు. ఆ తర్వాత రుత్విక్కులు పట్టాభిషేకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండపత్రయంలోని మూడు కలశాల్లోని సమస్త దేవతలు, సమస్త జలాలు, రామపరివారంతో కూడిన మంత్రించిన జలాన్ని శ్రీరాముడిపై ప్రోక్షణ చేశారు. మంగళహారతితో పట్టాభిషేక తంతు ముగిసింది. పట్టాభిషేకం అనంతరం సీతమ్మవారు ఆంజనేయుడి మెడలో ముత్యాల దండ ధరింపచేస్తూ ఆంజనేయ స్వామి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. వేడుకగా పట్టాభిషిక్తుడైన రాముడిని పల్లకీలో ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సారపాకలోని ఐటీసీ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా ప్రధాన ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. అనంతరం పట్టాభిషేకం జరిగే మిథిలా స్టేడియానికి చేరుకుని సతీ సమేతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
లోక్ అదాలత్తో కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ సూపర్బజార్(కొత్తగూడెం): కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు లోక్అదా లత్ అద్భుతమైన వేదికని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శని వారం జాతీయ లోక్ అదా లత్ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఇరుపక్షాలు రాజీ మార్గంలో, స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయని వివరించారు. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎస్బీఐసౌజన్యంతో కక్షిదారులకు పులిహోర, తాగు నీటి సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్.సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, జడ్జిలు కిరణ్కుమార్, సుచరిత, బత్తుల రవికుమార్, వినయ్కుమార్, సాయిశ్రీ, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. 7,866 కేసుల పరిష్కారంజిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 7,866 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెం కోర్టులో 5,054, ఇల్లెందులో 797, భద్రాచలంలో 1,729, మణుగూరులో 286 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు. 31న క్రీడా పాఠశాలలకు ఎంపికలుసూపర్బజార్(కొత్తగూడెం): తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి ఎం పరంధామరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 నుంచి 26వ తేదీ వరకు మండలస్థాయి ఎంపికలు ఆయా మండలాల ఎంఈఓల సమక్షంలో జరిగాయని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలో 10 మంది బాలురు, 10 మంది బాలికలు.. మొత్తం 20 మందిని ఎంపిక చేసి ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామని వివరించారు. వివరాలకు 95054 23226 నంబరులో సంప్రదించాలని సూచించారు. సస్పెండ్ చేస్తావా.. కోర్టుకు వెళ్తా ! నేలకొండపల్లి: బాధ్యత కలిగి న ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరు కావడమే కాక జిల్లా అధికారితో వాగ్వాదానికి దిగిన ఘటన ఇది. నేలకొండపల్లి వ్యవసాయ మార్కె ట్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న పంతులు శనివారం మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఏం.ఏ.అలీం సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయానికి వెళ్లగా ఈ విషయాన్ని గుర్తించారు. మద్యం తాగి రావడం ఏమిటని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వాగ్వాదానికి దిగాడు. అంతేకాక ‘ఏం చేస్తారు? సస్పెండ్ చేస్తారా, చేసుకోండి... కోర్టుకు వెళ్తా’ అంటూ గొడవ పడ్డాడు. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు మార్కెట్ చైర్మన్కు ఫోన్లో వివరించిన డీఎంఓ.. 108 వాహనం పిలిపించి వైద్యపరీక్షల కోసం ఆయనను ఖమ్మం ఆస్పత్రికి పంపించారు. ఇటీవల పంతులు కార్యాలయ సిబ్బందిని కూడా దూషించినట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. ఈ విషయమై డీఎంఓ అలీంను వివరణ కోరగా.... మద్యం మత్తులో విధులకు హాజరైన కార్యదర్శిపై వైద్యుల నుంచి నివేదిక వచ్చాక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలి
భద్రాచలంటౌన్: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహచ్ఓ తుకారాంరాథోడ్ పేర్కొన్నారు. పట్టణంలోని జాబిల్లి, రాధ ఆస్పత్రులను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నా రు. ఆస్పత్రి రిసెప్షన్ వద్ద సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న చికిత్స, వైద్యుల పేర్లు, అర్హతలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఆయన వెంట ఇమ్యునైజేషన్ అధికారి ప్రతాప్, మలేరియా నిర్మూలన అధికారి రాందాస్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. తేనెటీగల పెంపకంతో ఉపాధిభద్రాచలంటౌన్: తేనెటీగల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుని గిరిజన యువత ఆర్థికంగా బలపడాలని ఐటీడీ ఏ పీఓ బి.రాహుల్ సూ చించారు. శనివారం స్థానిక వైటీసీలో ఐదు రోజులపాటు నిర్వహించిన హనీబీ శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అటవీ ప్రాంతాల్లో లభించే తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలతో తేనె ఉత్పత్తి, మార్కెటింగ్లో రాణించాలని కోరారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు, హనీబీ బాక్సులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో మెరుగైన విద్యుత్ సరఫరావిద్యుత్ ఎస్ఈ మహేందర్ సూపర్బజార్(కొత్తగూడెం): వేసవి కాలంలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అందించడంపై దృష్టి సారించామని విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కల మహేందర్ శనివారం తెలిపారు. గతేడాది నుంచే వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని, ఎలాంటి అవాంతరం ఎదురైనా అధిగమిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లోడ్ పెరిగే 225 ప్రాంతాల్లో నూతన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఉపకేంద్రాల సామర్థ్యం పెంచేలా రెండు సబ్స్టేషన్లు, 32 పవర్ ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఇంటర్ లింకింగ్ వ్యవస్థను తీసుకొచ్చామని, అత్యవసర పరిస్థితులు ఎదురైనా, ఏదైనా ఉపకేంద్రంలో సమస్య తలెత్తినా పరిష్కరించేవరకు మరో కేంద్రం నుంచి సరఫరాను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ ప్రస్తుతం 13 కిలోమీటర్లకు పైగా పనులు పూర్తి చేశామని వివరించారు. వినియోగదారుల సేవలకు ఆధునిక సాంకేతికతను జోడించామని, కార్యాలయాలకు రాకుండా ‘వాట్సప్, చాట్–బాట్, విద్యుత్ ప్రజావాణి, 1912 టోల్ఫ్రీ నంబర్లను ఫోన్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. -
శ్రీవారికి చక్రస్నానం, మహాపూర్ణాహుతి
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా యాగశాలలో ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజ పతాకాన్ని అవనతం చేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో చక్రస్నానం ఆచరించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, శ్రీరామచంద్రమూర్తి, పుష్కరిణి నిర్మాణ దాత గుదే వెంకటేశ్వరరావు దంపతులు, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, ముఖ్య అర్చకులు మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ పాల్గొన్నారు. -
అటు ఆధ్యాత్మికం.. ఇటు చోరీలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో రెండురోజులుగా శ్రీరామనవమి, పట్టాభిషేకం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగగా.. మరోవైపు దుండగులు తమ చేతివాటం ప్రదర్శించారు. శుక్రవారం శ్రీరామనవమి రోజున సుమారు 50 సెల్ఫోన్లు చోరీకి గురయ్యాయి. ముందురోజు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవంలో ఓ మహిళ మెడలో రూ. 2.50 లక్షల విలువైన బంగారుగొలుసు చోరీకి గురైంది. శనివారం మరో రెండు సెల్ఫోన్లు చోరీకి గురయ్యా యి. ఈ రెండు రోజుల వేడుకల్లో గతంలో కంటే తక్కువ మంది భక్తులు వచ్చినప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం పోలీసుల వైఫల్యమేనని ప్రజ లు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ నిలిపివేత.. శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పట్టాభిషేకం మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన సారపాక ఐటీసీ నుంచి భద్రాచలం వచ్చే సమయంలో ఐదు నిమిషాలు, మిథిలా స్టేడియం నుంచి భద్రగిరి మార్ట్ను ప్రారంభించేందుకు వెళ్లే సమయంలో మరో ఐదు నిమిషాలు, భద్రగిరి మార్ట్ నుంచి సారపాక ఐటీసీ గెస్ట్హౌస్కు వెళ్తున్న సమయంలో మరో ఐదు నిమిషాల వరకు ట్రాఫిక్ను పోలీసులు నిలిపివేశారు. కాగా, భద్రాచలంలో శుక్రవారం, శనివారం జరిగిన వేడుకల్లో బందోబస్తు నిర్వహించిన కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్వాహనాలను అనుమతించి, ప్రజలవాహనాలను అడ్డుకున్నారని, మీడియా ప్రతి నిధుల ద్విచక్రవాహనాలు సైతం ఆపి,వాగ్వాదానికి దిగారని విమర్శలు వస్తున్నాయి. భద్రాచలంలో ఏ వేడుక జరిగినా ఇలాగే జరుగుతోందని, వచ్చే ఏడా ది అయినా ఈ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేయా లని స్థానికులు కోరుతున్నారు. -
అడుగడుగునా ఆంక్షలు
● ప్రముఖులకు తప్పని అడ్డంకులు ● ఖమ్మం జడ్జి, రామదాసు వారసుడికి సైతం అనుమతి నిరాకరణ భద్రాచలం/భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో శుక్రవారం జరిగిన శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఎస్పీ రోహిత్రాజు 2000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 36 గంటల ముందు నుంచే భద్రాచలంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రామాలయానికి వెళ్లే దారిలో ముఖద్వారం వద్ద పోలీసులు సీఎం కాన్వాయిలో వచ్చే వాహనాలను మాత్రమే అనుమతించడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే, సీఎం రేవంత్రెడ్డి కల్యాణంలో పాల్గొనడానికి సారపాక నుంచి భద్రాచలం వస్తున్నారని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్ను 30 నిమిషాల పాటు నిలిపివేశారు. కల్యాణం ముగిశాక సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు భద్రాచలం నుంచి సారపాకకు వెళ్తున్న క్రమంలో మళ్లీ ట్రాఫిక్ను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. తర్వాత కరకట్ట వైపుగా బ్రిడ్జి సెంటర్ నుంచి సారపాక వెళ్తన్న వాహనాలను మళ్లించే క్రమంలో ప్రతి 15 నిమిషాలకు వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రముఖులకూ తప్పలేదు.. సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యాన పోలీసుల పటిష్ట బందోబస్తు ఉన్నప్పటికీ.. పలు చోట్ల శ్రుతిమించడంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. వీఐపీలు, వీవీఐపీలకు సైతం ఈ బెడద తప్పకపోవడం గమనార్హం. స్వయాన భద్రాచలం ఆలయ ఈఓ దామోదర్రావుకే ఈ అనుభవం ఎదురైంది. ఈఓ ఆలయానికి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి అడ్డుకోగా.. ఆలయ సిబ్బంది సర్దిచెప్పినప్పటికీ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మిథిలా స్టేడియంలో కల్యాణానికి వస్తున్న ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ అడ్డుకున్నారు. పాస్ చూపించినా వినిపించుకోకపోవడంతో ఆమె భద్రాచలం జడ్జిని కలిసి.. ఆ తర్వాత సెక్టార్లోకి వెళ్లారు. ఇక భక్త రామదాసు వారసుడిగా దేవస్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే కంచర్ల శ్రీనివాసరావు దంపతులను సైతం అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పాస్, అనుమతి పత్రాలను చూపించినా అధికారులు ససేమిరా అన్నారు. గంట అనంతరం పలువురు వచ్చి చెప్పడంతో ఆయనను అనుమతించారు. పోలీసు సిబ్బంది, చోటామోటా రాజకీయ నాయకులను మాత్రం అడ్డగోలుగా సెక్టార్లలోకి అనుమతించటం విశేషం. అడ్డదిడ్డంగా బారికేడ్లు ఈ ఏడాది భద్రాచలంలోని పలు వీధుల్లో పోలీసులు అడ్డదిడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయటం విమర్శలకు దారితీసింది. స్థానికులు, ఇతరులు తమ ద్విచక్ర వాహనాలను సుదూరంగా ఉంచి కాలినడకన చేరాల్సి వచ్చింది. ఇక రామాలయ పరిసర ప్రాంతాల కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రెండు రోజుల నుంచి వారి వాహనాలను అడ్డుకుంటుండడంతో బారికేడ్లను దాటుకొని రావడం ప్రహసనంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
హామీల అమలు డిమాండ్తో రాష్ట్రవ్యాప్త పర్యటన
భద్రాచలం: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపడుతున్నట్లు రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. యాత్రను శుక్రవారం భద్రాచలంలో ప్రారంభించడంతో పాటు భక్తులతో కలిసి రైతుల మహాగర్జన పోస్టర్లు ఆవిష్కరించారు. రైతుల రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయకపోగా, కౌలు రైతులకు న్యాయం జరగలేదని తెలిపారు. అలాగే, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లించలేదని, కార్పొరేషన్లు ప్రకటించినా పాలక మండళ్లు ఏర్పాటు చేయకపోగా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఓసీలను మోసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28న రాష్ట్రస్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా తమ పర్యటన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, నాయకులు సాంబశివరావు, అయిత నాగరాజు, రాజయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
పర్ణశాల రామయ్య సేవలో అడ్వకేట్ జనరల్
దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం పంచవటీ కుటీరం సందర్శించారు. సీఐ వెంకటప్పయ్య, సర్పంచ్ వాగే ఖాదర్బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నేడు క్రీడా పాఠశాల ఎంపికలుపాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఐదో తరగతి ప్రవేశానికి విద్యార్థుల తుది ఎంపిక శనివారం నిర్వహించనున్నట్లు ఐటీడీఏ క్రీడల అధికారి గోపాల్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఉమ్మడి జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు హాజరుకావాలని పేర్కొన్నారు. బాలికలకు కాచనపల్లిలోని గిరిజన బాలికల క్రీడాపాఠశాల్లో ఈనెల 30నఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ముగిసిన శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో తొమ్మిది రోజులుగా సాగుతున్న శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఉగాది రోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకం, లక్ష కుసుమార్చన పూజలు, శ్రీలలితా సహస్రనామ హవనం, నీరాజన మంత్ర పుష్పం, బలిహరణ నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. హైకోర్టు జడ్జి జె.శ్రీనివాసరావు, శేషగిరిరావు, ఏపీ హైకోర్టు జడ్జి కిరణ్మయి, నాంపల్లి కోర్టు జడ్జి శ్రీదేవి, సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. -
సింగరేణి బకాయిలు చెల్లించాలి
● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ● మణుగూరుకు చేరిన ‘సేవ్ సింగరేణి’ పోరుజాతా మణుగూరు టౌన్/మణుగూరు రూరల్: ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన రూ.51 కోట్ల బకాయిలు విడుదల చేయడంతోపాటు మెడికల్ అన్ఫిట్ అయిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఏఐటీయూసీ ఆధ్వర్యాన సేవ్ సింగరేణి పేరిట చేపట్టిన పోరుజాతా(బస్సు యాత్ర) శుక్రవారం మణుగూరుకు చేరింది. యాత్ర మణుగూరు ఏరియాలోని గనులు, జీఎం కార్యాలయ ప్రాంతాల్లో కొనసాగింది. అనంతరం భారీ బైక్ ర్యాలీ నడుమ మణుగూరు అంబేద్కర్ సెంటర్ వరకు చేరాక అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ర్యాలీగా పీవీ కాలనీలోని ఏఐటీయూసీ కార్యాలయానికి చేరుకున్నారు. పలు చోట్ల జరిగిన సమావేశాల్లో సీతారామయ్య మాట్లాడుతూ యాజమాన్యం స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లను కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. మణుగూరు పీకేఓసీ డీప్ సైట్ బ్లాకుతో పాటు అన్ని బొగ్గు బావులను సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రంగయ్య, వై.రాంగోపాల్, మేకల ఈశ్వర్రావు, ఎం.వీ.రాంనర్సయ్య, ఆవుల నాగరాజు, సురేందర్, శ్రీనివాసరావు, కుమారస్వామి, గంఽగాధర్రావు, రాజశేఖర్, సరెడ్డి పుల్లారెడ్డి, దుర్గ్యాల సుధాకర్, గడ్డం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. -
పీఓకు మళ్లీ ‘నవమి’ భంగపాటు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పీఓకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గిరిజన ప్రాంతాల్లోని ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్ట్ను ప్రారంభించాలని ఏర్పాట్లు చేసినా అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా కార్యక్రమం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, అక్కడి సిబ్బంది సర్దుకుని వెళ్లిపోయారు. చూస్తుండగానే మార్టు షట్టర్లు మూతపడటంతో అక్కడికి వచ్చిన గిరిజనులు, స్థానికులు విస్తుపోయారు. గతేడాది కూడా... గతేడాది శ్రీరామ నవమి సందర్భంగా గిరిజన మ్యూజియం ప్రారంభించేందుకు పీఓ అన్నీ సిద్ధం చేశారు. తీరా సమయానికి అది వాయిదా పడింది. సరిగ్గా ఏడాది తర్వాత, భద్రగిరి మార్ట్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కాగా, శనివారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా భద్రగిరి మార్ట్ను ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు.వాయిదా పడ్డ భద్రగిరి మార్ట్ ప్రారంభోత్సవం -
భద్రశైల రాజమందిరా..
జీలకర్ర, బెల్లం సంప్రదాయబద్ధంగా ఉదయం 8 గంటల సమయంలో గర్భగుడిలో మూల మూర్తులకు లఘు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం పూజలు గావించి.. అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్య ధారణ జరగగా, ఆ తర్వాత తలంబ్రాలు పోసి, హారతి ఇవ్వడంతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములను గరుడ, గజ వాహనాలపై పుర వీధుల్లో ఊరేగించారు. సీతారాముల కల్యాణం చూసేందుకు రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మిథిలా స్టేడియం నిండిపోయింది. కల్యాణ వేడుకల్లో దేవేరులు వచ్చినప్పుడు, ఆభరణాలు ధరింప చేసినప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు భక్తితో తన్మయత్వం చెందారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పుచ్చకాయలు అందజేశారు. పానకం, మజ్జిగ కేంద్రాల్లో కోలాహలం నెలకొంది. సీఎం రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అంతకుముందే దేవస్థానం చేరుకునే రోడ్లకు అడ్డంగా బారికేడ్లు కట్టడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో పాటు ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య హాజరయ్యారు. డీజీపీ శివధర్రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీరామనవమి కల్యాణంలో అధికారులు అడ్డగోలుగా పాస్లు జారీ చేయటంతో గందరగోళం నెలకొంది. వీఐపీ, వీవీఐపీ పాస్లను తొలిసారిగా ఈ ఏడాది ఆన్లైన్లో జారీ చేశారు. దీంతో ఒకే పాస్ నంబర్తో ఆన్లైన్ రశీదులను పలువురు ఐడీతో తయారు చేసుకుని సెక్టార్లోకి ముందే వచ్చేశారు. దీంతో అనంతరం వచ్చిన అసలు పాస్ దారులను పోలీసు అధికారులు అడ్డుకుని పక్కన నిలబెట్టారు. ఫలితంగా వీఐపీ పాసులున్న అనేక మంది తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. డ్యూటీ పాస్, జర్నలిస్టు పాస్లను అదే తరహాలో జారీ చేయడంతో ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇక్కట్లు తప్పలేదు. సమాచార శాఖ జారీ చేసిన పాస్లను పోలీసులు అడ్డుకోవడంతో వారితో పలువురు వాగ్వాదానికి దిగారు. ముత్యాల తలంబ్రాలు ఉదయం 9:58 : కల్యాణ మండపానికి దేవేరుల ఆగమనం ఉదయం 10:25 : విశ్వక్సేన పూజ ఉదయం 10:43 : పుణ్యావాచనం ఉదయం 10:55 : శ్రీయోద్వాహం ఉదయం 11:18 : యోక్త్రా బంధనం, యజ్ఞోపవీత ధారణ ఉదయం 11:25 : శ్రీరాముడి కాళ్లు కడిగిన జనక మహారాజు ఉదయం 11:30 : అలంకరణ ఉదయం 11:32 : మధుపర్క నివేదన ఉదయం 11:37 : మహా సంకల్పం ఉదయం 11: 50 : కన్యాదానం ఉదయం 11:51 : పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 12:00 : అభిజిత్ లగ్నంలో వధూవరులపై జీలకర్ర బెల్లం మధ్యాహ్నం 12:11: మాంగళ్య ధారణ మధ్యాహ్నం 12:24 : తలంబ్రాలు మధ్యాహ్నం 12:40 : హారతివైభవోపేతంగా సీతారాముల కల్యాణం సీఎం హోదాలో తొలిసారిగా 2025 కల్యాణానికి రేవంత్రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో ప్యాంట్, షర్ట్లో ఆయన నేరుగా ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో పూజలు నిర్వహించాలంటే పంచె తప్పనిసరి. దీంతో ఆయన ఆలయ ప్రాంగణంలో పంచె ధరించారు. ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా ఐటీసీ, గెస్ట్హౌస్ నుంచే పంచె, షర్ట్ ధరించి భద్రాచలానికి బయల్దేరారు. అదే వస్త్రధారణలో ఆలయ దర్శనం, భూమిపూజ, కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు అందజేశారు. -
● భూమిపూజ
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, పునర్జీవం పనులతోపాటు వచ్చే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.351 కోట్లతో చేపట్టబోయే వేర్వేరు పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఆలయంలో ఈశాన్య మూలలో ఏర్పాటు చేసిన బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులతో కలిసి గ్రూప్ ఫొటోకు ఫోజు ఇచ్చే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఫ్రేమ్లో కనిపించకుండా వెనకబడిపోయారు. దీంతో సీఎం కల్పించుకుని ‘ తెల్లం ముందుకురా అంటూ’ పిలిచారు. కాగా, ప్రభుత్వ ం కేటాయించిన రూ. 351 కోట్ల నిధుల్లో.. రూ.75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ.180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, రూ.96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. -
పటిష్ట భద్రత..
సూపర్బజార్(కొత్తగూడెం)/భద్రాచలంఅర్బన్: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భద్రాచలం పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. రెండు వేల మంది పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. కాగా, డీజీపీ శివధర్రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రాగా ఎస్పీ రోహిత్రాజు స్వాగతం పలి కారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల నుంచి డీజీపీ గౌరవవందనం స్వీకరించారు. -
అలసత్వం వీడిన అధికారులు
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అసంపూర్తిగానే రామయ్య పెళ్లి పనులు’ కథనం జిల్లా యంత్రాంగంలో చలనం తెచ్చింది. నామమాత్రంగా సాగుతున్న పనులపై భక్తుల ఆగ్రహాన్ని, క్షేత్రస్థాయి పరిస్థితులను కథనంలో పేర్కొనగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు గురువారం రాత్రి వేళ కూడా పనులు చేపట్టారు. చర్ల రోడ్డులో డివైడర్లకు రంగులు వేయడం, లైటింగ్ ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. -
వృద్ధుడిపై కోతుల దాడి
చండ్రుగొండ: మండల కేంద్రంలో ఓ వృద్ధుడిపై కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన గురువారం చోటుచేసుకుంది. రావికంపాడు రోడ్డు వైపు నివాసం ఉండే దడిగల సత్యం ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉండగా రక్షణ కోసం ప్లాస్టిక్ జాలి ఏర్పాటు చేశారు. ఆ జాలీలో పిల్ల కోతి చిక్కుకుంది. దానిని తరిమేందుకు సత్యం యత్నించగా కోతుల గుంపు అతడిపై దాడిచేసి గాయపరిచాయి. క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్సీకి తరలించారు. భూ వివాదంలో ఓ వ్యక్తిపై దాడి గుండాల: భూ వివిదాం కోర్డులో ఉండగానే పనులు ఎందుకు చేపడుతున్నావని అడిగినందుకు ఓ వ్యక్తిపై తండ్రీ కొడుకులు కలిసి దాడి చేసి గాయపర్చిన ఘటన మండలంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు పఠాన్పాషా కథనం ప్రకారం.. ఆళ్లపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న స్థలం వివాదం కోర్టులో నడుస్తోందని, కానీ, అందులో తండ్రీకొడుకులు పనిచేస్తుండగా ప్రశ్నించానని తెలిపారు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న తన భార్యపై కూడా దాడి చేశారని తెలిపారు. తనను తీవ్రంగా గాయపర్చడంతో ఆళ్లపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కొత్తగూడెం రిఫర్ చేశారని, దాడిచేసినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశానని పఠాన్పాషా వెల్లడించాడు. -
సింగరేణి రక్షణ, కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం
రుద్రంపూర్: సింగరేణి సంస్థను కాపాడుకోవడంతో పాటు కార్మికుల, ఉద్యోగుల భద్రత, హక్కుల సాధనే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తామని గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం (జీఎల్బీకేఎస్) గౌరవ అధ్యక్షుడు సాధినేని వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన జీఎల్బీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి పరీవాహకంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నా నూతన గనుల ఏర్పాటులో పాలకుల నిర్లక్ష్యం సింగరేణికి నష్టం కలిగిస్తోందని తెలిపారు. ఇదే సమయాన కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చే లా ఏఐటీయూసీ చొరవ చూపాలని సూచించారు. సమావేశంలో జనరల్ సెక్రటరి జె.సీతారామయ్య, నాయకులు ఎ.వెంకన్న, ఎండీ రాసుద్దీన్, బ్రహ్మానందం, రామకృష్ణ, కాపు కృష్ణ, తోట రాయమల్లు, సంతు, సంజీవరావు, నాజర్పాషా, నరేశ్, ఎన్.సంజీవ్, గౌని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్పీకి చెక్కు అందజేతమణుగూరురూరల్: మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో నూతనంగా పోలీస్ స్టేషన్ భవ నం నిర్మిస్తున్నారు. అందులో కౌన్సెలింగ్, ఫిర్యాదు పరిష్కార హాల్ నిర్మాణానికి సింగరేణి సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.50లక్షలు మంజూరు చేయగా.. తొలి విడతలో మంజూరైన రూ.25 లక్షల చెక్కును మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ గురువారం ఎస్పీరోహిత్రాజుకు అందజేశా రు. ఎస్పీ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ మంజూ రు చేసిన సీఎస్ఆర్ నిధులతో మణుగూరు నూతన పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ హాల్ నిర్మాణం చేపడతామని, తద్వారా ఒకే వేదికపై ఫిర్యాదుల నమో దు, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నిధులు మంజూరు చేసిన సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. అనంతరం జీఎం మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పన తమ బాధ్యత గా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏరియాడీజీఎం (పర్సనల్) ఎస్.రమేశ్, డీజీఎం (సివిల్) బి.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీతమ్మ అందాలు.. రామయ్య గోత్రాలు
భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో కీలక ఘట్టమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం కమనీయంగా జరిగింది. శ్రీరామనవమికి ముందు రోజు వారి వంశాల విశిష్టతలను, గొప్పతనాన్ని వివరించే ఈ వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. గరుత్మంతుని వాహనంపై స్వామివారిని మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం రెండు సముమూహాలుగా ఏర్పడిన అర్చకులు స్వామివారు, అమ్మవారి వంశాల గొప్పదనాన్ని పోటీపడి వివరించారు. సీతమ్మ వారివైపు స్థానాచార్యులు స్థలశాయి బృందం, రామయ్య వారివైపు పండితులు ఎస్టీజీ కృష్ణమాచార్యుల బృందం చేరి వేడుక నిర్వహించారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించేలా భక్తులందరికీ పన్నీరు చల్లారు. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాద్రి ఆలయంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ఊరేగింపుగా స్వామివారిని ఆలయానికి తీసుకెళ్లారు. కాగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతురావు, ఆలయ ఈఓ దామోదర్రావు, స్థానాచార్యులు వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, రామకోటి స్వరూప్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులను అలరించిన ఎదుర్కోలు ఉత్సవం -
‘పెదవాగు’ను సందర్శించిన పీఓఈ బృందం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టును పీఓ ఈ (ప్యానెల్ ఆఫ్ ఎక్స్ పర్ట్స్) బృందం గురువారం సందర్శించింది. భారీవర్షాలు, వరదల తో రెండేళ్లక్రితం పెదవాగు ప్రా జెక్టుకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టు సేఫ్టీ, పున:నిర్మాణానికి జలవనరుల శాఖ నిపుణులతో నివేదిక ఇవ్వాల్సిందిగా సీఫార్సు చేశారు. స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ ఐదుగురితో కూడిన పీఓఈ బృందాన్ని నియమించగా, వారిలో డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ అశోక్కుమార్ గంజు, జీయాలజీ ఎక్స్పర్ట్ ఎం.రాజు, రిటైర్డ్ ఎస్ఈ ఎన్.సంజీవ్, హైడ్రాలజీ ఎక్స్పర్ట్ భవానిరాంశర్మ, సీవిల్ ఎక్స్పర్ట్ బి.లక్ష్మణ్రావు ప్రాజెక్టును పరిశీలించారు. పునర్నిర్మాణం, డిజైన్, గేట్ల పెంపుతోపాటు నూతన డిజైన్తో నివేదిక సిద్ధం చేయనున్నట్లు స్థానిక డీఈఈ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఏపీలోని ఏలూరు జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో పాటు, సీఈ శ్రీనివాసరెడ్డి, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ ముదల్కర్ విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో కిరణ్ తన సమీప అభ్యర్థి లక్కినేని సత్యనారాయణపై 30 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనరల్ సెక్రటరీగా జి.మహేశ్, ఉపాధ్యక్షులుగా కె.సంజీవరావు, పర్వీన్, జాయింట్ సెక్రటరీగా నాగరాజు, ట్రెజరర్గా సంధ్యారాణి, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీగా బానోత్ దేవదాస్, ఉమ, లైబ్రరీ సెక్రటరీగా దొడ్డా ప్రసాద్ గెలుపొందారు. -
సేల్స్ డిపోలు లక్ష్యాలను అధిగమించాలి
పాల్వంచరూరల్: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధి సేల్స్ డిపోల్లో లక్ష్యాలను అధిగమించే లా ఉద్యోగులు కృషి చేయాలని జీసీసీ డీఎం సమ్మయ్య సూచించా రు. పాల్వంచలోని గిరిజన సహకార సంస్థ బ్రాంచ్ కార్యాలయంలో గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయనపాల్గొన్నారు. బ్రాంచ్ పరిధి ఉప్పు సాక, యానంబైల్, మైలా రం, పూసుగూడెం, తిమ్మంపేట, ఇరవెండి సేల్స్ డిపోల మరమ్మతులు చేయాలని సేల్స్మెన్లు కోరగా ఐటీడీఏ పీఓకు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. అలా గే, అటవీ ఫలసాయం సేకరిస్తున్న ఆదివాసీ, గిరిజనులను ఫారెస్ట్ అధికారు లు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఆ తర్వాత పాల్వంచ బ్రాంచ్ వద్ద ఖాళీస్థలంలో పెట్రోల్బంక్ ఏర్పా టు, గిరిజనులను అడ్డుకునే అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ్, ఉద్యోగులు జార్జ్పాల్, శివ, రాము, డైరెక్టర్లు వెంకటమ్మ, లక్ష్మి, వి.నాగేశ్వరరావు, రమేశ్ పాల్గొన్నారు. సైబర్ మోసంపై యూపీ పోలీసుల విచారణ ఇల్లెందు: ఇల్లెందులో సైబర్మోసం వెలుగుచూసింది. స్థానికుడైన పూర్ణాచారిని సంప్రదించిన సైబర్మోసగాళ్లు బ్యాంకుల్లో అకౌంట్లు తీయించారు. అకౌంట్లలో జమఅయ్యే డబ్బు డ్రా చేసి ఇస్తే కమీషన్ ఇస్తామని వారు నమ్మించారు. ఆపై ఏటీఎం కార్డులు తీసుకుని ఆయనఖాతాల్లో జమఅవుతున్న నగదు డ్రా చేసుకుంటున్నారు. ఈ క్రమాన పూర్ణాచారి అకౌంట్లో వివిధ ప్రాంతాల నుంచి నగదు జమకావడంతో పోలీసులకు బ్యాంకు అధికారులు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఉత్తరప్రదేశ్లోనూ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు గురువారం ఇల్లెందుకు చేరుకుని పూర్ణాచారి నుంచి నగదు రికవరీ చేశారు. -
ఆయిల్ఫేడ్
● ఆయిల్ఫెడ్లో సిండికేట్ల దందా..? ● ఓ రిటైర్డ్ ఉద్యోగి సంస్థ కోసం విజయ బ్రాండ్కు వెన్నుపోటు..? ● మార్కెటింగ్లోకి మరో అవినీతి అధికారి? ● అంతా ఆ రైతు నాయకుడి చొరవేనని ప్రచారం.. అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్ఫెడ్లో తెరవెనుక ఒప్పందాలు కొనసాగుతూనే ఉన్నాయి. జీఎం సుధాకర్రెడ్డి ఉద్యోగం కొనసాగింపు వివాదంతో మొదలైన తంతు మార్కెటింగ్ భవితవ్యం వరకు వెళ్లింది. ఆయిల్ఫెడ్ అంటే రైతులకు నాణ్యమైన ఆయిల్పాం మొక్కలు, ఎరువులు సరఫరా చేసి ఉత్పత్తయిన గెలలను కొనుగోలు చేసి గానుగాడి ముడిచమురు, గింజలు, పీచు, తదతర వ్యర్థాలపై రైతులకు 75 శాతం వాటా చెల్లించే ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో మిగిలిన 25 శాతం ఉద్యోగుల వాటాకు కేటాయించారు. అయితే ఫ్యాక్టరీల్లో గానుగాడిన ముడిచమురును ఎప్పటికప్పుడు అమ్మేసుకుంటారు. విజయ బ్రాండ్ వారు ఆయిల్ఫెడ్ అమ్మే పామాయిల్ ప్యాకెట్లకు కావాల్సిన ముడిచమురును మళ్లీ అంతర్జాతీయ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఇక మార్కెటింగ్ శాఖలో వేళ్లూనుకుపోయిన ఓ అధికారి విరమణ పొందాడు. కానీ, తనకు నాలుగు దశాబ్దాలు జీతభత్యాలిచ్చిన సంస్థకే శఠగోపం పెట్టాలని చూశాడు?. ఇందుకు ఇంకా కొలువులో ఉన్న గత సహచరుడు.. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ రైతు సంఘం నాయకుడు కొమ్ము కాస్తున్నారు. విజయ బ్రాండ్ మార్కెట్కు కింగ్.. తెలంగాణ ఆయిల్ఫెడ్ ద్వారా మార్కెట్ చేస్తున్న విజయ బ్రాండ్ వంట నూనెలకు మార్కెట్లో భారీ క్రేజ్ ఉంటుంది. వందలాది బ్రాండ్లతో ప్రైవేట్ కంపెనీలు అమ్ముకునే నూనెల కంటే మార్కెట్ ధర సరాసరి రూ.5 ఎక్కువైనా.. వినియోగదారుల నుంచి డిస్టిబ్యూటర్ల వరకు విజయ బ్రాండ్ నూనెకే ప్రాధాన్యమిస్తారు. ఇందులో ఉద్యోగుల గొప్పతనమేమీ లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్తీ లేని స్వచ్ఛమైన నూనెనే తయారు చేయడం ద్వారా విజయ బ్రాండ్కు దశాబ్దాల నుంచి మంచి పేరు వచ్చింది. మరి మార్కెటింగ్ ఎలా..? కొత్తగా ఏర్పాటైన కంపెనీ చమురును పోటీ మార్కెట్లో అమ్మాలంటే బోలెడంత పబ్లిసిటీ అవసరం. ఆఫర్లు ఇవ్వాలి. ఇవన్నీ లేకుండా తనకున్న అపారమైన అనుభవంతో సహ ఉద్యోగి, వాటాదారులతో కలిసి విజయ బ్రాండ్ నెట్వర్క్ను వినియోగించుకుని.. విజయ బ్రాండ్కు కృత్రిమ కొరత సృష్టించే విధంగా పథకం పన్నినట్లు సమాచారం. అంతే కాకుండా విజయబ్రాండ్ నూనెలు కొరత వచ్చినపుడు తమ ‘అమోఘ’మైన నూనెలు కొనాలని ఇప్పటికే కొందరు డిస్ట్రిబ్యూటర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా మార్కెట్ స్కీంలను కాస్త భారంగా చూపించి వారి సొంత బ్రాండ్ను అమ్మేసుకుందామని భారీ స్కెచ్వేసినట్లు తెలుస్తోంది. షేర్లింగంపల్లి ప్లాంట్లో ప్యాకింగ్ను పర్యవేక్షించే వారిని మేనేజ్ చేయడం ద్వారా మార్కెటింట్ శాఖను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాదుకు బదిలీ అయిన ఓ అధికారికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో సదరు రిటైర్డ్ ఉద్యోగి, విరమణ పొందాల్సిన మరో ఉద్యోగి, ఓ రాజకీయ రైతు ప్రముఖులు కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. అప్పారావుపేట ఫ్యాక్టరీలో రెండు ప్రమా దాల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారా..? గాయాల పాలయ్యారా అనే విషయం బయటకు రానీయకుండా తొక్కిపట్టిన ఘనత ఉండటంతోపాటు అవి నీతి సిండికేట్కు వినయంగా ఉన్నారనే నమ్మకంతో మార్కెటింగ్ను సదరు ఉద్యోగికి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాలకులే దీనిపై దృష్టి సారించి ఆయిల్ఫెడ్ మాజీ ఉద్యోగులందరి పూర్వ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై విచారణ చేపట్టి.. తెలంగాణలో స్థాపిస్తున్న పామాయిల్ అనుబంధ కంపెనీలు, ఫ్యాక్టరీల్లో మాజీ ఉద్యోగుల పాత్ర, వాటాలను విచారించి ఆయిల్ఫెడ్ను,విజయ బ్రాండ్ను కాపాడాలని కోరుతున్నారు. సంవత్సరం అమ్మకం విలువ (మెట్రిక్ టన్నుల్లో) రూ.కోట్లలో 2022–23 27,328 రూ.418 2023–24 31,274 రూ.382 2024–25 30,211 రూ.415 ఇలా ఏటా పెరుగుతున్న సేల్స్ చూసి అప్పటి దాకా పర్యవేక్షించిన ఓ మాజీ అధికారికి అదే వ్యాపారం చేయాలనే ఆలోచన రావడం, ఆచరణలో పెట్టడం చకాచకా జరిగినట్లు సమాచారం. -
రామన్నగూడెం ఆదివాసీలు దీక్షల విరమణ
సూపర్బజార్(కొత్తగూడెం): భూసమస్యపై అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆది వాసీలు 9 రోజు లుగా నిర్వహిస్తున్న ఆత్మగౌర వ నిరవధిక నిరాహార దీక్షలకు బుధవారం విరమించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తన చాంబర్లో ఆదివాసీ ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు ఫలించాయి. పట్టాదారులుగా ఉన్నవారికి సర్వే నిర్వహించి న్యా యం చేస్తామని, ముత్తాతల కాలం నుంచి సాగులో ఉన్న వారికి పారదర్శకతతో విచారణ జరిపి నిబంధనలకు అనుగుణంగా సాగుకు అవకాశం కల్పిస్తామని, అటవీ భూములకు సంబంధించి చట్టపరంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, అధికారుల హామీ తో దీక్ష విరమించామని, న్యాయం జరగకపోతే తిరిగి ఉద్యమం చేపడతామని సర్పంచ్ మడకం నాగేశ్వరరావు తెలిపారు. చర్చలలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్, పాల్వంచ డీఎస్పీ సతీష్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత
ఇల్లెందు: సర్కార్ దవా ఖానకు వచ్చే పేద రోగు లను మందుల కొరత పీడిస్తోంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇన్సులిన్ ఇంజక్షన్తో పాటు గ్యాస్ సమస్యతో బాధపడే రోగులకు ఇచ్చే పాన్టాబ్ ఇంజక్షన్లు లేకరోగులు బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. బుధవారం ఇల్లెందు ఏరియా వైద్యశాలను డీసీహెచ్ఎస్ రవిబాబు తనిఖీ చేయగా ఈవిషయాన్ని గుర్తించారు. అన్నివార్డులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉందని, వేసవి దృష్ట్యా హీట్ ఫీవర్స్, టైఫాయిడ్ జ్వరాలు అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రోగుల కోసం ప్రత్యేక షెడ్ను నిర్మించడం కోసం నిధులు ఉన్నా కాంట్రాక్టర్లు ముందుకు రావటంలేదని, అంబులెన్సులు లేకపోవటంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు డీసీహెచ్ఎస్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. డీసీహెచ్ఎస్ వెంట సూపరింటెండెంట్ హర్షవర్దన్, వైద్యులు శేఖర్, బన్సీ, నర్సింగ్ సూపరింటెండెంట్ ఫర్జానా ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలో కాన్పుపొందిన ఫార్మాసిస్ట్ రజినిని అభినందించారు. గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్ట్ సూపర్బజార్(కొత్తగూడెం): ప్రశాంతినగర్ సమ్మక్క–సారక్క గద్దెల సమీపంలో గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం టూటౌన్ పోలీసులు దాడినిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. టూటౌన్ సీఐ ప్రతాప్ ఆదేశాల మేరకు ఎస్ఐ మనీషా, హెడ్కానిస్టేబుల్ వెంకటేశ్వ ర్లు, కానిస్టేబుళ్లు రాజా, ప్రశాంత్, వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని, పరారయ్యేందుకు యత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 95 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను షేక్ జానీపాషా, బోడ విష్ణువర్దన్గా గుర్తించి, కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. -
ఇద్దరిపై కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: దాడికి పాల్పడిన ఇద్దరిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కావడిగుండ్లలో అక్రమంగా గొదాములు నిర్మించి, అనుమతి లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్నట్లు దళారిపై కొద్ది రోజుల క్రితం ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గుబ్బల సత్యనారాయణ కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. బుధవారం అశ్వారావుపేట ఆర్ఐ, వీఆర్ఓలు విచారణ చేస్తున్న క్రమంలో స్థానిక సర్పంచ్ బాడిస లక్ష్మణ్రావు, ఎంపీటీపీ మాజీ సభ్యుడు వాసం బుచ్చిరాజు కలిసి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యయాతిరాజు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేతబూర్గంపాడు: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం వైపు నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న వాహనాన్ని సారపాక వద్ద పోలీసులు పట్టుకుని, అందులోని 9 పశువులను పాల్వంచ అన్నపూర్ణ గోసంరక్షణ సమితికి అప్పగించారు. ఐదు ఎద్దుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు గోసంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయశర్మ తెలిపారు. పశువుల అక్రమ రవాణా బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
టమాట, నీళ్లు, ఉప్పు, కారం..
● ఇదేనా మధ్యాహ్న భోజనంలో కూర? ● అపరిశుభ్రత, ఆహార నాణ్యతాలోపంతో హెచ్ఎంలపై కలెక్టర్ ఆగ్రహం ● కె.రేగుబల్లి ఆశ్రమ, దుమ్ముగూడెం జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ దుమ్ముగూడెం: కె.రేగుబల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల, దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంలపై కలెక్టర్ అంకిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మండలంలోని లక్ష్మీనగరంలో ఉన్న కే.రేగుబల్లి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల, దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుమ్ముగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆహార నాణ్యతా లోపంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనంపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. వడ్డిస్తున్న కూరలో టమాట, నీళ్లు, ఉప్పు, కారం తప్పించి ఇతర పదార్థాలు లేకపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడాన్ని గమనించి హెచ్ఎం కోటేశ్వరమ్మ, సిబ్బందిని మందలించారు. నిర్లక్ష్యం వీడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేగుబల్లి ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రత, అమలుకు నోచుకోని మెనూ.. అంతకుముందు కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించి, పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల డైనింగ్ హాల్, కిచెన్లో తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉండటంతో హెచ్ఎం సావిత్రి, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్రూమ్లో కేవలం క్యాబేజీ, ఆలుగడ్డ మాత్రమే ఉండటంతో ‘‘ప్రతి రోజూ ఇవే వండుతున్నారా? క్యారెట్, బీట్రూట్ వంటి పోషకాహార కూరగాయలు ఎందుకు లేవు?’’అని ప్రశ్నించారు. మెనూ ప్రకారం బుధవారం బిర్యానీ వండాల్సి ఉండగా, అది అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఆ తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తనిఖీ చేశారు. తగినంత నీటి సరఫరా లేదని సిబ్బంది విన్నవిచంగా, సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకుంటున్న కలుషిత ఆహార ఘటనల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత, నీటి శుద్ధి అంశాలలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. తహసీల్దార్ అశోక్కుమార్, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, ఎంఈఓ సున్నం సమ్మయ్య, ఎంపీడీఓ వివేక్రామ్, సీఐ వెంకటప్పయ్య పాల్గొన్నారు. -
నేడు ఎదుర్కోలు ఉత్సవం
భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ ఘడియలు సమీపించాయి. కల్యాణ మహోత్సవంలో కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం సాయంత్రం నిర్వహించనున్నారు. హిందూ ఆచారం ప్రకారం ప్రతి ఇంటా కల్యాణంలో ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. ఆదర్శ జంటకు ప్రతీకలైన శ్రీ సీతారాముల పెళ్లి సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియం సీతమ్మవారికి మిథిలా నగరం కాగా, మరో పక్కనున్న వైకుంఠ ద్వారం రామయ్యకు చెందిన అయోధ్యగా అభివర్ణిస్తారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరును చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాచల దేవస్థానంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. కాగా శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణం, శనివారం పట్టాభిషేక మహోత్సవం జరపనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ మహా విష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవా కాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన జరిపి, కర్మణ, పుణ్యావాచన, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన జరిపారు. యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకొని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకములను తర్పానందంగా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేని వారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ఆలయ ఈఓ దామోదర్రావు దంపతులు, ఏఈఓలు శ్రవణ్కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి పాల్గొన్నారు. భద్రాచలంటౌన్ : శ్రీరామనవమి మహోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ అంకిత్ బుధవారం సమీక్షించారు. మిథిలా స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీ లించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిర్వహించనున్న భూమిపూజ, కల్యాణ వేడుకల ఏర్పాట్లపై ఆలయ ఈఓ దామోదరరావు, అర్చకులతో చర్చించారు. వీవీఐపీ సెక్టార్లలో బారికేడింగ్, భద్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరభ్ శర్మ పాల్గొన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి వరంగల్కు చెందిన భక్తులు బుధవారం ముత్యాలను విరాళంగా సమర్పించారు. వరంగల్కు చెందిన నలివెల శివయ్య, నలివెల కోటేశ్వరరావు, నలివెల ఆయిలయ్య, నలివెల రాజ్ కుమార్ బుధవారం దేవస్థానం ఈఓకు ముత్యాలను అందజేశారు. ఏటా ఆనవాయితీగా ముత్యాలను సమర్పిస్తున్నట్లు భక్తులు తెలిపారు. శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల నేపథ్యంలో భద్రాచలంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఏఎస్పీ విక్రంత్ కుమార్సింగ్తో కలిసి ఆయన మాట్లాడారు. సుమా రు 2 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇతర శాఖలతో సమన్వయం పాటించాలని సూచించారు. పార్కింగ్, లడ్డూ కౌంటర్లు, సెక్టార్ల వివరాల కోసం ప్రత్యేక క్యూ ఆర్ కోడ్, ఆన్లైన్లింక్ను అందుబాటులోకి తెచ్చి నట్లు వెల్లడించారు. సెక్టార్ల ఇన్చార్జ్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
పెద్దమ్మతల్లికి లక్ష కుసుమార్చన
పాల్వంచరూరల్: శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ) అమ్మవారికి అర్చకులు మల్లెపూలతో లక్ష కుసుమార్చన పూజలు చేశారు. బుధవారం రుద్రాభిషేకం, సూక్త పారాయణం , చండీసప్తసతీ పారాయణం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలను నిర్వహించారు.28న లోక్ అదాలత్సూపర్బజార్(కొత్తగూడెం): ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ అద్భుత అవకాశమని పేర్కొన్నారు. నేడు ‘బార్’ ఎన్నికలుసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రధాన అధికారిగా పలివెల గణేష్బాబు, సహాయ ఎన్నికల అధికారులుగా అరకల కరుణాకర్, పీ వేణువాసరావులు వ్యవహరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 331 మంది ఉన్నారు. అధ్యక్ష పదవికి ఇద్దరు, ప్రధాన కార్యదర్శికి ముగ్గురితో పాటు మరికొన్ని పదవులకు పోటీ నెలకొంది. మహిళా ప్రతినిధిగా మల్లెల ఉషారాణి ఏకగ్రీవమయ్యారు. జాతీయస్థాయిలో మహిళా కానిస్టేబుల్ ప్రతిభసూపర్బజార్(కొత్తగూడెం): పంజాబ్లో జరిగిన జాతీయ స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా ఏఆర్ విభాగం మహిళా కానిస్టేబుల్ డి.సుష్మ ప్రతిభ కనబరిచింది. తొలుత సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో ఆమె 100, 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించింది. ఆపై జాతీయ స్థాయికి ఎంపిక కాగా అక్కడ ఐదో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సుష్మను ఎస్పీ రోహిత్రాజు బుధవారం కొత్తగూడెంలో అభినందించారు. ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్ఐ లాల్బాబు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుకొత్తగూడెంఅర్బన్: శ్రీసీతారాముల కల్యాణం నేపథ్యంలో భద్రాచలం రోడ్డు రైల్వేస్టేషన్కు వచ్చి వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఆర్.గోపాలకృష్ణన్ సూచించారు. బుధవారం ఆయన కొత్తగూడెం రైల్వే స్టేషన్లో తనిఖీ చేశారు. అమృత్ పథకంలో భాగంగా జరుగుతున్న పనుల తీరును పరిశీలించారు. భక్తులకు తాగునీరు, వెయిటింగ్ హాల్ సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా తిరుపతి, షిర్డీకి రైళ్ల ఏర్పాటు, మణుగూరు నుంచి డోర్నకల్ ప్యాసింజర్, బెల్గావి ఎక్స్్ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ, రైల్వేస్టేషన్లో వసతుల కల్పనపై డీఆర్యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్రెడ్డి, గాంఽధీపథం జిల్లా కన్వీనర్ చింతలచెర్వు గెర్షోము తదితరులు డీఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. రైల్వే ఏఆర్ఎం సిపాలి, ఏరియా ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, ఏరియా ఇన్స్పెక్టర్ పాషా, స్టేషన్ మేనేజర్ విశ్వనాథ్, కృష్ణ, సాయి పాల్గొన్నారు. -
కొత్తగా రెండు..
● అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజనకు అడుగులు ● రెండు జిల్లాల్లో ఒక్కొక్కటి పెరిగే అవకాశం ● ఇదే సమయాన నియోజకవర్గమంతా ఒకే జిల్లాలోకి.. ● తద్వారా మారనున్న రాజకీయ ముఖచిత్రంఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పది నియోజకవర్గాలు ఉండగా, పునర్విభజనతో మరో రెండు ఏర్పడనున్నాయి. జనాభా ఆధారంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. సగటున 1,93,358 జనాభాకు ఒక నియోజకవర్గం ఏర్పాటు కానుంది. 2011 లెక్కల ఆధారంగా ఖమ్మం జిల్లాలో 14,01,639 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10,69,261 మంది జనాభా ఉన్నారు. తద్వారా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశముంది. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఖమ్మం కార్పొరేషన్తో పాటు రఘునాథపాలెం మండలం ఉన్నాయి. ఇందులో రఘునాథపాలెం, ఖమ్మం కార్పొరేషన్లోని కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఒక నియోజకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది.సాక్షి ప్రతినిధి, ఖమ్మం : కేంద్రప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. ఈమేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా రెండు నియోజకవర్గాలు ఏర్పడతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కేంద్రం ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తే సీట్ల పెంపు ప్రక్రియ మొదలుకానుంది. తద్వారా 2029 ఎన్నికలు కొత్త నియోజకవర్గాల ప్రకారమే జరగనున్నాయి. 2008లో మార్పులు, చేర్పులు గతంలో నియోజకవర్గాల పునర్విభజన 2008లో చేపట్టారు. అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. అయితే, రాష్ట్ర విభజనతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను ఏపీలో కలవగా.. చండ్రుగొండ మండలం నుంచి కొంత మేర విడదీసి అన్నపురెడ్డిపల్లి మండలం ఏర్పాటుచేశారు. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దు కాగా ఆ స్థానాన పినపాక వచ్చింది. అలాగే, జనరల్ నియోజకవర్గంగా ఉన్న సుజాతనగర్ రద్దయి ఎస్టీ రిజర్వ్ స్థానంగా వైరా ఏర్పడింది. అంతేకాక సత్తుపల్లి నియోజకవర్గం జనరల్ నుంచి రిజర్వ్గా, రిజర్వ్డ్ ఉన్న పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఆ సమయాన కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు మాత్రమే జనరల్ కేటగిరీలోకి మిగలగా, మిగతావన్నీ రిజర్వ్ అయ్యాయి. ఒకే జిల్లాలోకి నియోజకవర్గం ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాలు రెండు నుంచి మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. త్వరలో జరిగే పునర్విభజనతో ఒక అసెంబ్లీ నియోజకవర్గమంతా ఒకే జిల్లా పరిధిలోకి రానుంది. వైరా అసెంబ్లీ నియోజకవర్గంలో జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, వైరా, కారేపల్లి, కొణిజర్ల, ఏన్కూరు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఇక భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం ములుగు జిల్లాలో.. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాలు భద్రాద్రి కొత్తగూడెంలో కొనసాగుతున్నాయి. అంతేకాక ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలం ఖమ్మం జిల్లాలో.. ఇల్లెందు, టేకులపల్లి మండలాలు భద్రాద్రి జిల్లాలో, బయ్యారం, గార్ల మండలాలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈసారి చేపట్టే పునర్విభజనతో నియోజకవర్గమంతా ఒకే జిల్లా పరిధిలోకి వస్తే రూపురేఖలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జిల్లా జనాభా ప్రస్తుత కొత్తగా స్థానాలు ఏర్పడేవి ఖమ్మం 14,01,639 05 01భద్రాద్రి కొత్తగూడెం 10,69,261 05 01 -
రైలు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
మణుగూరురూరల్: మండలానికి చెందిన ఓ యువకుడు రైలులో నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మణుగూరుకు చెందిన యశ్వంత్ ఒక కేసు విషయమై మహబూబాబాద్ జిల్లా మానుకోట కోర్టుకు వెళ్లి వాయిదా తర్వాత మణుగూరుకు తిరిగి వస్తున్నా డు. తీవ్ర మనస్తాపానికి గురైన యశ్వంత్ రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యశ్వంత్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా యశ్వంత్ ఆత్మహత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో టీపీటీఎఫ్ నాయకులు సూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20శాతం నిధులు కేటాయించాలని (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుటారి రాజు డిమాండ్ చేశారు. అలాగే, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుగులోత్ హరిలాల్నాయక్, జోగా రాంబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. అధికార పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విద్యా కమిషన్ నివేదికకు అనుగుణంగా విద్యారంగానికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని కోరారు. అలాగే, పీఆర్సీ ఫిట్మెంట్, రిటైర్డ్ టీచర్లకు ప్రయోజనాల చెల్లింపు, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాక కాంట్రాక్ట్ ఉపాధ్యా య వ్యవస్థను రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమ పాఠశా లల్లో ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సదు పాయాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎం.రామాచారి, కె.మాధవరెడ్డి, బి.ప్రసాద్రావు, పి.గంగరాజు, వి.సరియా, పి.కృష్ణయ్య, జి.భాగ్య రావు, ఎస్.కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిఅశ్వారావుపేటరూరల్: పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ యయా తీ రాజు కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన దారా శ్రీనివాసరావు (54) కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నా డు. ఈ నెల 16వ తేదీన జీవితంపై విరక్తి చెందిన ఇంట్లో ఉన్న కలుపుమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు హైదారాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం? కారేపల్లి: కారేపల్లిలో నకిలీ మద్యం అమ్ముతున్నారనే సమాచారం కలకలం రేపింది. బెల్టు దుకాణాల్లో మద్యం సీసాల మూతలు తెరిచి, ఆపై కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ప్రచారంతో సోమ, మంగళవారం ఎకై ్సజ్ సీఐ స్రవంతి, ఎస్ఐ వసంతలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది తనిఖీలు చేపట్టారు. లావుడ్యాతండా, భాగ్యనగర్ తండాల్లోని బెల్ట్ షాపుల్లో మూతలు తెరిచి ఉన్న 114 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కారేపల్లిలోని ఒకే వైన్స్ నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అయిందనే అనుమానంతో విచారణ చేపడుతున్నారు. ఈ విషయమై సీఐ స్రవంతిని వివరణ కోరగా.. బెల్టు షాపుల్లో మద్యం సీసాలమూతలు వదులుగా ఉండడంతో స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ట్రెంచ్ పనులను అడ్డుకున్న గిరిజనులు సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో పోడు వివాదంమళ్లీ రాజు కుంది. కాకర్లపల్లి బీట్లోని 157, 158 ఫారెస్ట్ కంపార్ట్మెంట్లలో 25ఎకరాల అటవీభూమికి పట్టాలు ఇవ్వాలని సత్తుపల్లి ఒకటో వార్డుకు చెందిన నాయకపోడు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. 2022లో అప్పటి ప్రభుత్వం 75 ఎకరాలకు పట్టాలు ఇచ్చినా, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అటవీశాఖ అధికారులు 25 ఎకరాల్లో జామాయిల్ ప్లాంటేషన్ వేయాలని ట్రెంచ్ కొట్టిస్తున్నారు. అక్కడ మంగళవారం కూడా ఎఫ్ఆర్ఓ స్నేహలత ఆధ్వర్యాన పనులు చేపడుతుండగా గుడిపాడు కాలనీకి చెందిన పూచి వరలక్ష్మి, రాజిని దుర్గ ఆధ్వర్యాన నాయకపోడు మహిళలు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. సీఐ టి. శ్రీహరి సిబ్బందితో చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్తో మాట్లాడే వరకు సంయమనం పాటించాలని సూచించడంతో ఆందోళన విరమించారు. -
క్రీడాకారులు జాతీయస్థాయికి ఎదగాలి
నేలకొండపల్లి: గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో జాతీ య స్థాయికి ఎదగాలని కబడ్డీ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్రెడ్డి ఆకాంక్షించారు. నేలకొండపల్లి యూత్ క్లబ్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలస్థాయి కబడ్డీ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభను వెలికితీసేలా ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. నేలకొండపల్లి లో మినీ స్టేడియం ఏర్పాటు అంశా న్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. నిర్వాహకులు కోడిరెక్క వినోద్తో పాటు మార్కెట్ చైర్మన్ వెన్న పూసల సీతారాములు, కాంగ్రెస్ నాయకులు కోడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, వెంకన్న, పసుపులేటి ఉపేందర్, బొందయ్య, మైశా శంకర్, రాయపూడి రోహిత్, జెర్రిపోతుల సత్యనారాయణ, దోస పాటి శేఖర్, ధీరావత్ రాధాకృష్ణమూర్తి, కడియాల నరేశ్, నల్లాని మల్లికార్జున్రావు పాల్గొన్నారు. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురంలో శ్రీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఆరో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిత్య పూజలతో స్వామికి పుష్పయాగం నిర్వహించారు. అలాగే, శేష వాహనంపై గిరి ప్రదక్షిణ చేయించగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, సూపరింటెండెంట్ సోమయ్య, ఉప ప్రధాన అర్చకులు మురళీమోహన్శర్మ, రాజీవ్శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ ఉద్యోగికి గాయాలు
కొణిజర్ల: విధుల నిమిత్తం ద్విచక్రవాహనంపై కార్యాలయానికి వెళ్తున్న ‘సాక్షి’దినపత్రిక ఉద్యోగి ప్రతా పురం శ్రీనివాస్ను లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మంగళవారం సాయంత్రం బైక్పై వస్తూ కార్యాలయంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఖమ్మం వైపు నుంచి వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉద్యోగులు, స్థానికులు ఆయనకు తనికెళ్లలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, లారీ పశ్చిమబెంగాల్ నుంచి వైజాగ్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కొణిజర్ల పోలీసులు చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
ఘనంగా ధ్వజపట లేఖనం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం ధ్వజపట లేఖనం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడాధివాసం, ధ్వజపట లేఖనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మతో ధ్వజపట లేఖనంను అర్చకులు జీయర్ మఠంలో పూర్తి చేశారు. ఆపై త్రిదండి అహోబిల రామానుజ జీయర్స్వామి భక్తులకు ప్రవచనం అందజేశారు. ఇక బుధవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, చతుఃస్థానార్చనం జరపడమే కాక సంతాన ప్రాప్తి కోసం వచ్చే మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందజేస్తారు.నేడు రామాలయంలో ‘ధ్వజారోహణం’ -
రణరంగం..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇసుక, ఇటుక మాఫియా మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో జిల్లా కేంద్రంలో శివారు ప్రాంతం సోమవారం రాత్రి దద్దరిల్లింది. చాటుమాటు వ్యవహారం కావడంతో రాత్రి వేళ తరచూ తలలు పగిలేలా కొట్టుకుంటున్నా.. తెల్లవారేసరికల్లా గప్చుప్ అవుతున్నారు. అక్రమ దందా కొత్తగూడెం శివారులోని లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడు వాగు నుంచి ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రయితే చాలు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో వాగులోకి దిగి లోడ్ల మీద లోడ్ల ఇసుకను జిల్లా కేంద్రానికి తరలిస్తున్నాయి. పైగా వేసవి మొదలవడంతో నిర్మాణ రంగంతో పాటే దందా కూడా పెరిగింది. అయితే, ఇటీవల పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లా కేంద్రం చుట్టు పక్కల పంచాయతీల్లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఫలితంగా ముర్రేడు వాగు ప్రవహిస్తున్న గ్రామాలకు చెందిన పరిరక్షణ కమిటీలు సోమవారం ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నాయి. తమ పంచాయతీ పరిధిలో ఇసుక తరలిస్తున్నందున గ్రామ అభివృద్ధికి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. వారి సంగతేంటి ? ఇన్నాళ్లు స్వేచ్ఛగా అక్రమ ఇసుక తోలకాలు జరగగా, అకస్మాత్తుగా వచ్చిన మార్పు వెనుక ఇటుక బట్టీల నిర్వాహకులు ఉన్నారనే సందేహం ఇసుక ట్రాక్టర్లు నడిపే వారికి వచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగి ఇటుక బట్టీల దగ్గర భారీ కలప లోడును పట్టుకున్నారు. ఇది కూడా అక్రమమే అయినందున వీరి నుంచి ఎలాంటి టోల్ వసూలు చేస్తున్నారంటూ పరిరక్షణ కమిటీలతో వాదనకు దిగారు. ఈ అంశం ఇటుక మాఫియాకు కంటగింపుగా మారడంతో సోమవారం రాత్రి అనిశెట్టిపల్లి దగ్గర ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. కర్రలు, రాళ్లతో పరస్పరం ఇష్టారీతిగా కొట్టుకున్నట్టు సమాచారం. లోడెత్తేశారు ! ఇసుక, ఇటుక వర్గాల మధ్య ఘర్షణ శ్రుతి మించడంతో స్థానికులు పోలీసులకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఆపై గొడవ కాస్తా పంచాయితీగా మారి కేంద్రం అనిశెట్టిపల్లి నుంచి ఇల్లెందు క్రాస్రోడ్కు మారినట్లు సమాచారం. ఇదే సమయాన ఇటుక బట్టీల వద్ద అక్రమ కలప వ్యవహారం బయటకు పొక్కితే తనకు ఇబ్బంది అవుతుందని భావించిన ఓ అటవీ ఉద్యోగి రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఓ వైపు ఇరువర్గాల పంచాయితీ జరుగుతుండగానే.. కలపలోడ్ను రహస్య ప్రాంతానికి తరలించినట్టు సమాచారం. ఆపై ఇరువర్గాల పనుల్లోనూ లోపాలు ఉన్నందున కేసులు పెట్టుకుంటే రెండు వైపులా నష్టం జరుగుతుందని పెద్దలు నచ్చజెప్పడంతో రాత్రి తలలు పగిలేలా కొట్టుకున్న వారు తెల్లారేకల్లా కలిసిపోయినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్, శివారు ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోధుమ, ముర్రేడు వాగులతో పాటు కిన్నెరసాని నుంచి నిత్యం వందలాది ట్రిప్పుల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అలాగే, ఇటుక బట్టీల్లో భారీగా కలప వినియోగం ఇదే స్థాయిలో ఉంటుంది. ఫలితంగా అటవీ సంపదకు నష్టం జరుగుతోంది. ఈ దందాను మైనింగ్, అటవీ శాఖ ఉద్యోగులు చూసీ చూడనట్టుగా వదిలేస్తుండడంతో అక్రమార్కులు చాటుమాటుగా కాకుండా బహిరంగంగానే చేయడం మొదలుపెట్టేశారు. మరోవైపు ఈ దందా నుంచి వచ్చే ఆదాయం కోసం గ్రామాల్లోనూ వర్గాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెచ్చిపోతున్న ఇసుక, ఇటుక మాఫియా -
ఏడు రోజులు.. 15.25 మి.టన్నులు
రుద్రంపూర్: ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఏడు రోజులే మిగిలింది. ఈ సమయాన సింగరేణి నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 24వ తేదీ మంగళవారం వరకు 70.03 మి.టన్నుల లక్ష్యంలో 56.75 మిలియన్ టన్నుల(81శాతం) బొగ్గు ఉత్పత్తి నమోదైంది. మిగిలిన 15.25 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలరా అనేది అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కాగా, లక్ష్యసాధనకు గాను సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో రోజుకు 2.81 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటే 1.90 లక్షల టన్నులే నమోదవుతోంది. డైరెక్టర్(పా) లేకపోవడంతో... ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 15 మి.టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడడం ఖాయమని చెబుతున్నారు. ఈ సమయాన ప్రతీ గని, ఏరియాలో పరిశీలిస్తూ వార్షిక లక్ష్య సాధనకు ప్రయత్నించడమే కాక సంస్థ ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దాల్సిన బాధ్యత డైరెక్టర్(పా)కు అప్పగించారు. కానీ సదరు అధికారి కొద్దినెలలుగా ప్రధాన కార్యాలయానికి రాకపోగా ఇతర రాష్ట్రాల్లో పనులు చక్కబెట్టేందుకు వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. చాన్నాళ్ల తర్వాత డైరెక్టర్(పా)గా ఐఏఎస్ అధికారిని నియమించడంతో పరిస్థితులు బాగుంటాయని భావించిన కార్మికులకు నిరాశే మిగులుతోంది. ఇదికాక ఏడాదికి పైగా సింగరేణిలో కారుణ్య నియామకాలకు సంబంధించి మెడికల్ బోర్డ్ నిర్వహించకపోవడంతో 1,500 మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. అలాగే, మెడికల్ బోర్డ్లో అన్ఫిట్ అయిన సుమారు 300 మంది ఉద్యోగాల కోసం వేచి ఉన్నారు. వీరేకాక సుమారు 700 మంది ఇతర ప్రాంతాల బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించాల్సిన అధికారి కొంతకాలంగా కార్యాలయానికి రాకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనపై అనుమానాలు -
శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయండి
భద్రాచలంలో పరిశీలించిన కలెక్టర్ అంకిత్భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 27వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న సీఎం రేవంత్రెడ్డి.. ఆతర్వాత ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నందున ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలిసి మంగళవారం భద్రాచలంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ఉత్సవాలకు మరో రెండు రోజులు ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. మిథిలా స్టేడియంలో గ్యాలరీలు, వేదికలు, భక్తుల సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పార్కింగ్, వైద్య సదుపాయంపై సూచనలు చేశారు. ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చకచకా పనులు శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్రెడ్డి భద్రాచలంలో రామాలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నందున ప్రధాన ఆలయంలో అభివృద్ధి, ప్రాకార మండపాల పనులకు శిలాఫలకం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రసాదాల కౌంటర్కు పక్కన ఈశాన్య భాగంలో స్థలాన్ని మంగళవారం ఈఓ దామోదర్రావు పరిశీలించారు. అక్కడితో పాటు ప్రధాన రహదారి పక్కన భూ నిర్వాసితులకు ఇచ్చే ఆర్అండ్బీ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. -
సరైన చికిత్సతో క్షయ నివారణ
చుంచుపల్లి/పాల్వంచ: క్షయ సోకిన వారు ఆందోళన చెందకుండా సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి నయమవుతుందని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ తెలిపారు. ప్రపంచ క్షయవాధి నివారణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల టీబీ క్యాంపెయిన్ను కొత్తగూడెంలోని రైటర్ బస్తీలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించాక డీఎంహెచ్ఓ మాట్లాడుతూ క్షయ వ్యాధి సోకిన వారు మందులు వాడుతూనే పౌష్టికాహారం తీసుకుంటే నిర్మూలించవచ్చని తెలిపారు. మందులు వాడుతున్నంత కాలం ప్రభుత్వం నెలకు రూ.వేయి చొప్పున ఇవ్వనుందని చెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ మాట్లాడుతూ క్షయపై అవగాహన పెంచుకుని వ్యాధిని అంతం చేయటంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ పుల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ లలిత, కార్పొరేటర్ శ్రీలక్ష్మి, రిషిత, డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న, ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య దినోత్సవాలు తప్పనిసరిగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్ సూచించారు. ఆరోగ్య దినోత్సవాలు, శ్రీరామ నవమి సందర్భంగా శిబిరాల ఏర్పాటుపై పాల్వంచలోని కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన సూచనలు చేశారు. అలాగే, వేసవి దృష్ట్యా వడదెబ్బ కేసులపై దృష్టి సారించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎం.శ్రీధర్, పీఓలు పుల్లారెడ్డి, స్పందన, ప్రతాప్, బి.రామదాస్, దినేష్ పాల్గొన్నారు. సబ్స్టేషన్ పనుల్లో వేగం పెంచండి బోనకల్: సబ్ స్టేషన్ల నిర్మాణం, కొత్త లైన్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ వంగూరి మోహన్రావు ఆదేశించారు. బోనకల్ మండలం చిరునోముల, బ్రాహ్మణపల్లిలో ఉపకేంద్రాల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్షించారు. విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరిచేలా నిర్మిస్తున్న సబ్స్టేషన్లు త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూడడంతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ టి.సురేందర్, ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఈలు భద్రు, వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, ఏడీఈలు ఏ.కిరణ్ కుమార్, వైవీ.ఆనంద్కుమార్, ఏఈ టి.మనోహర్ పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే పాయం
నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం వినతి మణుగూరు రూరల్: పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్లో సీఎంకు వినతిపత్రం అందజేశాక ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య, గ్రామాలు, పట్టణాల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఆదర్శ కేంద్రాలుగా నిలవాలి కలెక్టర్ అంకిత్ ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన ఎర్రగుంటని పీహెచ్సీని తనిఖీ చేశారు. పలువురు సిబ్బంది యూనిఫాం(ఆఫ్రాన్) ధరించకపోవడంపై అసహనం వ్యకం చేసిన కలెక్టర్ కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలాగే, పలువురు డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నందున విచారణ చేపట్టాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. అనంతరం కేబీజీవీని పరిశీ లించిన కలెక్టర్.. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, భోజనంపై మెనూలో అమలుపై ఆరా తీయడమే కాక భోజనం రుచి చూశారు. ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంపీఓ షబ్నా, వైద్యాధికారి ప్రియాంక, హెచ్ఎం శారద, అధికారులు పాల్గొన్నారు. -
విప్లవవీరుల ఆశయాలు సాధించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సూపర్బజార్(కొత్తగూడెం): సమసమాజ స్థాపనకు అమరులైన విప్లవ వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల ని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. స్థానిక శేషగిరి భవన్లో సర్దా ర్ భగత్సింగ్,రాజ్గురు,సుఖ్దేవ్ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వారిచిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మా ట్లాడుతూ.. బ్రిటీష్ నిరంకుశ పాలకులను ఎదిరించి పోరాడి, అతి చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వారి ధైర్యసాహసాలను యువతకు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అమరవీరు ల ఆశయ సాధనకు నిరంతరం పోరాడడమే వారికిచ్చే నిజమైన నివాళి అన్నారు. నేటి పాలకులు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా విప్లవవీరుల స్ఫూర్తితో పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నా యకులు నరాటిప్రసాద్, కంచర్ల జమలయ్య, దేవరకొండ శంకర్, వంగా వెంకట్, నగేష్, శ్రీని వాస్, మల్లికార్జున్, మణి, మాతంగి లింగయ్య, లక్ష్మీనారాయణ,రాములు,రాజుపాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి లక్ష బిల్వార్చన
పాల్వంచరూరల్: శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు లక్ష బిల్వ పత్రాలతో అర్చన చేశారు. అనంతరం శ్రీచక్రార్చన, సూర్యనమస్కారాలు, శ్రీ సూక్తి పారాయణం, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం గావించాక చివరన లక్ష కుసుమార్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు సీహెచ్.పాపారావు, పెండ్లి రాంరెడ్డి, చందుపట్ల రమ్య పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలిచుంచుపల్లి: ఈనెల 27న జరిగే శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు అవసరమైన సేవలందించాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ సిబ్బందికి సూచించారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు, వైద్య సిబ్బంది నియామకం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన సూచనలు చేశారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ రవిబాబు, జీజీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ సత్య చైతన్య, డాక్టర్లు సాయికళ్యాణ్, చైతన్య రాకేష్, ప్రతాప్, పుల్లారెడ్డి, మధువరన్, హరీష్, మలేరియా ప్రోగ్రాం అధికారి స్పందన, రాందాస్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో ఆర్థికాభివృద్ధి చెందాలి ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలం: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజనులు ఆర్థికా భివృద్ధి సాధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంఽధిత అధికారులకు అందజేశారు. అనంత రం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులపట్ల ఉద్యోగులు మర్యాదపూర్వకంగా వ్యహరించాలని, వారి సమస్యలు తెలుసుకుని అర్హతల మేరకు పరిష్కరించాలని సూచించారు. నిరుద్యోగ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి పథకాలు ఎన్నో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవా లని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ అశోక్, ఈఈ మధుకర్, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఏఓ సున్నం రాంబాబు, ఆయా శాఖల అధికారులు ఉదయ్కుమార్, గన్యా,లక్ష్మీనారాయణ, హరిత, హేమంత్, నాగేశ్వరరావు,ఆదినారాయణ పాల్గొన్నారు. -
తాలిపేరు ప్రాజెక్టు సందర్శన
చర్ల: మండలంలోని పెదమిడిసిలేరు సమీపంలో గల తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టును రాష్ట్ర స్థాయి రక్షణ బృందం సోమవారం సందర్శించింది. ఈసందర్భంగా ప్రాజెక్టు గేట్లు, రబ్బర్ షీల్స్, బేరింగ్లు తదితర ముఖ్యమైన పరికరాల పరిస్థితి, డీవాటరింగ్ తదితర విభాగాలను పరిశీలించిన సభ్యులు.. అధిక వర్షాలు కురిసిన సమయంలో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరితే ఎలాంటి చర్యలు చేపడుతున్నారనే అంశాన్ని ప్రాజెక్టు అధికారులను అడిగితెలుసుకున్నారు.ఈబృందంలోప్రాజెక్టుల సేఫ్టీటీమ్ చైర్మన్ గంజు అశోక్కుమార్, రిటైర్డ్ టీం సభ్యులు సంజీవ్ (మెకానికల్), లక్ష్మణరావు(డిజైన్స్), భవానీ రాంశంకర్, నీటిపారుదల శాఖ ఎస్ఈ ఏవీవీఎల్ నర్సింహారావు, ఈఈ ఎస్ఏ జానీ, తిరుపతి, ఏఈలు సంపత్, ఎం. సుమ, రవితేజ ఉన్నారు. -
భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు
భద్రాచలం: భద్రాచలంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ అంకిత్ అన్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కమిషనర్ హన్మంతరావుతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దష్టి సారించిందని, ఈనెల 27న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని తెలిపారు. 25వ తేదీ నాటికి శిలాఫలకం ఏర్పాట్లు, సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతూ.. నవమి, పట్టాభిషేకం, భూమి పూజ కార్యక్రమాల విజయవంతానికి అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ముందస్తు ఏర్పాట్లు చేయాలి సీతారాముల కల్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మిథిలా స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెక్టార్లలో విధులు నిర్వర్తించే అధికారులు 26వ తేదీ ఉదయం 9 గంటల వరకు సబ్ కలెక్టరేట్లో రిపోర్ట్ చేయాలన్నారు. శ్రీరామనవమికి సీఎం, పట్టాభిషేకానికి గవర్నర్ హాజరు కానున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలన్నారు. అనంతరం గిరి మార్ట్ను సందర్శించి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసిన గిరిజన రైతులు, మహిళలు, స్వయం సహాయక గ్రూపుల వారు వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇదో గొప్ప అవకాశమని, నాణ్యమైన వస్తువులతో వినియోగదారుల మన్ననలు పొందాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఎస్పీ రోహిత్రాజ్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, సీపీఓ సంజీవరావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈఈ రవీందర్, జీపీ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి సూపర్బజార్(కొత్తగూడెం): రైతులు ఆధునిక పద్ధతులతో సాగు చేస్తూ అధిక దిగుబడి సాధించాలని కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, వడగళ్ల వానలు వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు శాసీ్త్రయ, ఆధునిక పద్ధతులను అనుసరించాలని సూచించారు. ఆధునిక విధానాల ద్వారా ఖర్చు తగ్గిస్తూ దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు. కేవీకే అందిస్తున్న శిక్షణలు, శాస్త్రవేత్తల సలహాలు, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, డీఏఓ బాబూరావు, ఉద్యాన, మత్స్య శాఖల అధికారులు కిషోర్, ఇంతియాజ్ ఖాన్, త్రీ ఇంకై ్లన్ సర్పంచ్ ఈసం ప్రవళ్లిక, కేవీకే కోఆర్డినేటర్ భరత్, ఆత్మ చైర్మన్లు వీరభద్ర రావు, బుచ్చిబాబు, బోడా మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం తనిఖీ కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని సింగరేణి, సెయింట్మేరీస్, బాబూక్యాంప్లోని పీఎంశ్రీ హైస్కూళ్లలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలకు కలెక్టర్ అంకిత్ సోమవారం తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు పాటించాలని, మాల్ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దని నిర్వాహకులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలిసూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, ఆర్డీఓ మధు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని సూచించారు. కలెక్టర్ అంకిత్ వెల్లడి -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
సూపర్బజార్(కొత్తగూడెం): తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీకార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారంకలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మా ట్లాడుతూ ఇప్పటికీ మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎప్పుడూ ఐసీడీఎస్కు నిధులుపెంచలేదని, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించా రు.అంగన్వాడీలకు రూ.18వేలు వేతనంఇస్తామని ఎన్నికలమేనిఫెస్టోలో పెట్టి న కాంగ్రెస్.. ఇంతవరకూ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వీరి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రంఅందజేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లాకార్యదర్శి జి.పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి కె.సత్య, ఈసం వెంకటమ్మ, పాయం రాధాకుమారి, వీరభద్ర,రాజ్యలక్ష్మి, శైలజ,సూరమ్మ,భానుశ్రీ,హేమలత,సావిత్రిపాల్గొన్నారు. రామన్నగూడెం ఆదివాసీల బిక్షాటనఎనిమిదో రోజుకు చేరిన దీక్షలు సూపర్బజార్(కొత్తగూడెం): భూసమస్య పరిష్కారం కోసం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్ ధర్నాచౌక్లో చేపట్టిన ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆహార కొరతతో పిల్లలు, వృద్ధుల కోసం నవభారత్ సెంటర్లో వారు బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ మహిళలు మడకం స్వరూప, మాడి లక్ష్మి, కొర్స కావేరి, మడకం సత్యవతి పాల్గొన్నారు. -
ఆకలి తీరేనా ?
నవమి భక్తులలక్ష మందికి పైగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు భద్రాచలం చేరుకుంటారు. ఇందులో ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి 50వేల మంది వరకు ఉంటే, ఇతరప్రాంతాల నుంచి మరో 50 వేల మంది వస్తారు. ఎక్కువ మంది ఈనెల 26వ తేదీ రాత్రికే భద్రాచలం చేరుకుని, కల్యాణం ముగిసిన తర్వాత 27వ తేదీ సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. అంటే 24 గంటల పాటు కనీసం 50 వేల మంది భక్తులకు భద్రాచలంలో ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే టిఫిన్లు బంద్ ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం ఈనెల 1న మొదలైనప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇరవై రోజులు గడిచినా ఆంక్షల్లో ఎలాంటి సడలింపు లేదు. దీంతో రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి బడా హోటళ్ల వరకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ వినియోగం అధికమయ్యే వంటలు చేయడాన్ని ఇప్పటికే హోటళ్ల నిర్వాహకులు నిలిపేశారు. పూరి, వడ, బోండా వంటివి పూర్తిగా తగ్గిపోయాయి. కొందరు బిర్యానీలు కూడా ఆపేశారు. చైనీస్ ఫాస్ట్ పుడ్ సెంటర్లు కూడా మూతపడుతున్నాయి. లేదా పీక్ అవర్స్లో తెరిచి, ఆ తర్వాత మూసేస్తున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఫుడ్ సెక్టార్లో ఉన్న వారంతా పూర్తి సామర్థ్యం మేరకు ఆహార పదార్థాలు అందించలేకపోతున్నారు. ఈ తరుణంలో ఒకేసారి సుమారు లక్ష మందికి కనీస అవసరాలైన భోజనం, టిఫిన్లు సమకూర్చడం ఇప్పుడు సవాల్గా మారింది. రద్దీ పెరిగే అవకాశం ఆహార పదార్థాలు ఎక్కువగా లభించే అన్నదాన కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద అధికంగా రద్దీ నెలకొనే అవకాశం ఉంది. నవమి రోజున ఉండే తీవ్రమైన ఎండనేపథ్యంలో ఒకేచోట రద్దీ నెలకొనడం కూడా అంత మంచిది కాదు. నవమి సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు తొలగాలంటే కనీసం భద్రాచలంలోని హోటళ్లకై నా వాణిజ్య సిలిండర్లు సరఫరాచేయాలి. వీలుంటే కొత్తగూడెం, పాల్వంచలోని హోటళ్లను కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కమర్షియల్ సిలిండర్లు లేకపోవడంతో ఇప్పటికే మా హోటల్లో పూరీలు, వడలు చేయడం ఆపేశాం. నవమికి పరిస్థితి ఇలాగే ఉంటే భక్తులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం స్పందించి సిలిండర్లు సరఫరా చేయాలి. –జోగారావు, చందమామ రెస్టారెంట్ యజమాని, భద్రాచలం భద్రాచలంలో 400 వరకు కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. నవమి సందర్భంగా కనీసం మూడు రోజు ల పాటు రోజుకు 400 సిలిండర్ల చొప్పున పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాం. అనుమతి రాగానే పంపిణీ చేస్తాం. – ప్రేమ్కుమార్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి నవమికి ముందురోజు చేరుకునే భక్తులు స్థానిక హోటళ్లు, సత్రాలపైనే ఎక్కువగా ఆధారపడతా రు. భద్రాచలంతో పాటు ప్రధానదారిలో ఉన్న కొత్తగూ డెం,పాల్వంచల్లోని హోటళ్లను కూడా విని యోగించుకుంటారు. కానీ, ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా రోడ్డు పక్కన ఉండే హోటళ్ల నుంచి రెస్టారెంట్ల వరకు ఆహారం లభించడం కష్టమనే పరిస్థితి నెలకొంది. మరోవైపు నవమి సందర్భంగా కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు ప్రధాన కూడళ్ల వద్ద స్వచ్ఛంద సంస్థలు, కుల, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఆన్నదానం, ఆహార పొట్లాలు పంపిణీ చేస్తుంటారు. ప్రస్తుత సిలిండర్ల సమస్యతో ఈ సేవల్లోనూ కోత పడే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం సెగ శ్రీరామ నవమి పండుగను కూడా తాకుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేయడంతో ఇప్పటికే హోటళ్లలో ఆహార పదార్థాల తయారీ తగ్గింది. ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నవమికి భద్రాచలం వచ్చే భక్తుల ఆహార అవసరాలు తీర్చడం ఎలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంకొనసాగుతున్న గ్యాస్ కష్టాలు ! -
7.4 కిలోల గంజాయి పట్టివేత
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణంలో ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ చావా శ్రీహరిరావు బృందం సోమవారం వాహనాల తనిఖీ చేపట్టగా, నంబర్ లేని ఓ ద్విచక్ర వాహనదారుల వద్ద 7.4 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. నిందితులు బొడ్డు చందు, కూరాకుల రోహిత్ను అరెస్ట్చేసి, వారి నుంచి గంజాయితో పాటు బైక్, రెండు సెల్ఫోన్లను సీజ్చేశారు. వీటి విలువ సుమారు రూ.4.90లక్షలు ఉంటుందని, ఒడిశాలోని కలిమెల నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాలకు గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. ఈదాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది సుధీర్, వెంకట్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టుచండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో ఈనెల 11న మృతిచెందిన తాపీమేసీ్త్ర ఎస్కే జాఫర్ కేసు మిస్టరీ వీడింది. భార్య ఖతిజా, ఆమె ప్రియుడు షేక్ మీరాసాహెబ్ కలిసి హతమార్చిన ట్లు పోలీసులు నిర్ధారించా రు. ఈ మేరకు సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, ఎస్ఐ శివరామ కృష్ణ వివరాలు వెల్లడించారు. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతీజాకు తిప్పనపల్లికి చెందిన జాఫర్తో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పదేళ్ల పాటు కాపురం సజా వుగా సాగింది. ఆ తర్వాత జీవనోపాధి నిమిత్తం చింతలపూడి వెళ్లారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాసాహెబ్తో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అనుమానం వచ్చిన జాఫర్ భార్యాపిల్లలతో తిరిగి తిప్పనపల్లికి వచ్చినా.. వారి మధ్య ఫోన్ సంభాషణ, వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఖతిజా మీరాసాహెబ్తో కలిసి భర్తను హతమార్చగా, సహజ మరణంగా భావించిన కుటుంబసభ్యులు ఈనెల 12న మృతదేహాన్ని ఖననంచేశారు. ఆరోజు రాత్రి మృతుడి కూతరు కుటుంబీకులకు అసలు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు శవ పరీక్ష చేశారు. కేసు విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. -
రామయ్యకు సార్వభౌమ సేవ
● బ్రహ్మోత్సవాలలో మండల లేఖ కలశ పూజలు ● నేడు ధ్వజపట లేఖనంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వసంత పక్ష ప్రయుక్త బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్వామి వారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో కొలువుదీర్చి స్నపన తిరుమంజనం గావించారు. పండితులు, అర్చకులు వేదపఠనం చేశారు. అలాగే మండల లేఖ, కుండ, కలశ పూజ లను యాగశాలలో నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని సార్వభౌమ సింహాసనంపై ఆశీనులు చేసి తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి వారి ఆలయం వద్ద వరకు తిరువీధి సేవ గావించారు. నేడు జీయర్మఠంలో ధ్వజపట లేఖనం ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడాధి వాసం, ధ్వజపట లేఖనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ప్రధాన సంకేతమైన గరుత్మంతుడి బొమ్మను వస్త్రంపై లిఖించే ప్రక్రియను జీయర్ మఠంలో చేపడతారు. 25న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజా రోహణం, దేవతాహ్వానం, బలిసమర్పణ, హనుమద్వాహన సేవలు నిర్వహిస్తారు. 26న యాగశాల పూజ, చుతుఃస్థానార్చన, గజ, గరుడ వాహన సేవలు, ఎదుర్కోలు ఉత్సవం జరుగుతాయి. -
ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలి
అశ్వారావుపేటరూరల్: స్థానికంగా ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలను దృష్టిలో పెట్టుకొని అశ్వారావుపేటలో ఆయిల్ రిఫైనరీ యూనిట్తోపాటు అదనపు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్పాం గ్రోవర్స్ సొసైటీ బాధ్యులు కోరారు. ఆదివారం మండలంలోని నారంవారిగూడెం వద్ద గల ఆయిల్ఫెడ్ డివిజ నల్ కార్యాలయం ఎదుట సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. స్థానికంగా రెండు ఫ్యాక్టరీలతో పాటు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీతో పాటు భవిష్యత్లో మరిన్ని ఫ్యాక్టరీలు నిర్మించాల్సి ఉందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మించడం ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన, ఆయిల్ఫెడ్కు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. పామాయిల్ గెలల ఉత్పత్తికి తగినట్లుగా అశ్వారావుపేటలో 60 టన్నుల సామర్థ్యంతో మరో ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. రైతులు తుంబూరు ఉమామహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, కారం శ్రీరాములు, చెలికాని సూరిబాబు, తలశిల ప్రసాద్, నున్న కృష్ణ, మోరంపూడి శ్రీనివాస్, గడ్డం సత్యనారాయణ, మడివి దుర్గారావు, చెన్నారావు, యండ్రాతి అప్పారావు పాల్గొన్నారు. -
ఇంటి వద్దకే
రాములోరి తలంబ్రాలు..ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో ఈనెల 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు కల్యాణ తలంబ్రాలను చేర్చేలా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ లాజిస్టిక్ సేవల ద్వారా ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు చేరుస్తారు. గతంలో మంచి ఆదరణ రావడంతో ఈసారి మరిన్ని తలంబ్రాల ప్యాకెట్లు పంపిణీ చేసేలా యా జమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందస్తుగానే తలంబ్రాల బుకింగ్ను ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా ప్రారంభించింది. 8 వేల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యం.. ఖమ్మం ఆర్టీసీ రీజియన్లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో 8 వేల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యంగా ఆర్టీసీ కార్గో అధికారులు చర్యలు చేపట్టారు. గతేడాది 8,500 ప్యాకెట్లను రీజియన్లో బుక్ చేయగా.. రూ.12.83లక్షలు ఆదాయం సంస్థకు లభించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో బుకింగ్ల కోసం ఆర్టీసీ కార్గో సేవలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం తలంబ్రాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి బుకింగ్లను ప్రారంభించారు. భక్తుల నుంచి ఆదరణ.. శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగానే భక్తులు కోరుకున్న చోటే ప్యాకెట్లను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. 2022 ఏడాది నుంచి ఆర్టీసీ ఈ సేవలను ప్రారంభించగా.. రెండేళ్ల క్రితం వరకు ఒక్కో ప్యాకెట్ ధర రూ. 116లుగా ఉంది. అయితే గత రెండేళ్ల నుంచి ఆ ధరను రూ.151కి పెంచింది. అయినా తలంబ్రాల ప్రాధాన్యత దృష్ట్యా భక్తుల నుంచి ఆదరణ తగ్గకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్గో అధికారులు భావిస్తున్నారు. నేరుగా లేదా ఆన్లైన్లో.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడుడిపోల్లో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్ల నుంచి స్వామివారి తలంబ్రాలను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ఆర్టీసీ అధికారులు కల్పించారు. అంతేకాక www. tgsrtc. gov. in వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. తలంబ్రాలను బుక్ చేసుకున్న వారికి స్వామి వారి కల్యాణ అనంతరం ఇంటి వద్దకే తలంబ్రాలు చేరవేస్తామని తెలిపారు. కార్గోలో పంపిణీకి ఏర్పాట్లురాముల వారి ముత్యాల తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ తలంబ్రాలను శుభకార్యాలకు అక్షింతలుగా వాడితే సాక్షాత్తు రాముల వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అంతే కాకుండా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు ఈ తలంబ్రాలు చల్లే ఆనవాయితీ ఉంది. అలాగే తలంబ్రాలను ఇళ్లలో పెట్టుకుని చిన్న వారిని ఆశీర్వదిస్తూ వారి కోరికలను ఫలించాలని కోరుకుంటుంటారు. ఇలా అన్నిరకాలుగా ప్రాధాన్యత ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వీటి కోసం ఆసక్తి కనబరుస్తున్నారు. సెంటర్ సెల్ నంబర్ ఖమ్మం 91542 98583 మధిర, సత్తుపల్లి 91542 98585 కొత్తగూడెం, ఇల్లెందు 91542 98582 భద్రాచలం, మణుగూరు 91542 98586 -
ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
దుమ్ముగూడెం: మండలంలోనితూరుబాక గ్రామశివారులో ఆటోబోల్తాపడిన ఘటనలో పాల్వంచకు చెందిన తురక వెంకటనరసింహారావు(50) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నా యి. వెంకటనరసింహారావు భార్యతో కలిసి నడికుడి ఆల యం దగ్గర జరిగిన ఓ శుభా కార్యానికి ఆటోలో వెళ్లి తిరిగి పాల్వంచకు వస్తున్నాడు. ఈ క్రమంలో తూరుబాక గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలైన ఆయనను 108లో భద్రాచలం తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటన స్థలాన్ని ఎస్ఐ పోటు గణేష్ సందర్శించి కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడిని పరిశీలించిన ఎమ్మెల్యే.. తూరుబాక గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తురక వెంకటనరసింహారావు పరిస్థితిని ఘటన స్థలంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పరిశీలించారు. బండిరేవు నుంచి భద్రాచలం వెళ్తున్న ఎమ్మెల్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో వెంటనే కారు దిగిన ఎమ్మెల్యే క్షతగాత్రుడిని నాడిని పరీక్షించాక 108లో తరలిస్తున్నగా మృతి చెందాడు.విద్యుత్ వైర్లు యమపాశమై.. మణుగూరుటౌన్: అడవిలో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ వైర్లు ఓ వ్యక్తి పాలిట శాపమైంది. ఆ వైర్లు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పగిడేరులో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలను స్థానికులు ఇలా తెలిపారు. పగిడేరు గ్రామానికి చెందిన కుంజా సుమన్(40) మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్తున్నాడు. ఈక్రమంలో ఖమ్మం తోగుబుగ్గ–పగిడేరులో ఇతర వ్యక్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ ఉచ్చు పెట్టిన వారు పెద్దిపల్లి గ్రామస్తులుగా బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రావణ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్తో నాలుగు పూరిళ్లు దగ్ధం● కొత్తవారిగూడెం రెండు ఇళ్లు దగ్ధం అశ్వారావుపేటరూరల్: మండల పరిధిలోని కొత్త నారంవారిగూడేనికి చెందిన అన్నదమ్ములైన కిన్నెర శ్రీను, అర్జున్లకు చెందిన పూరిళ్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ముందుగా అర్జున్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటల చెలరేగగా.. ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతో పాటు గృహోపకరణలన్నీ దగ్ధమయ్యాయి. అలాగే పక్కనే ఉన్న శ్రీను ఇంట్లో తన కుమార్తె పెళ్లి కోసం బీరువాలో ఉంచిన రూ.2.50లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు వస్తువులన్నీ కాలిపోయాయి. మొత్తంగా సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని సంఘటన స్థలానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ సైదులు, తహసీ ల్దార్ సీహెచ్వీ రామకృష్ణలకు బాధితులు తెలిపారు. ● రామచంద్రాపురంలో మరో రెండు ఇళ్లు.. దుమ్ముగూడెం: మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కల్లూరి వెంకటమ్మకు చెందిన ఇంటిలో ఆదివారం షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. ఆతర్వాత పక్కనే ఉన్నా బుచ్చమ్మ ఇంటికి వ్యాపించడంతో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఇంట్లోని వస్తువులతో పాటు నగదు, పట్టా పుస్తకాలు, తదితరాలు కాలిపోయి సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. ఈక్రమాన స్థానిక సర్పంచ్ తుర్రం నవీన్ సందర్శించి అండగా ఉంటామన్నారు. పోక్సో కేసు నమోదు అశ్వారావుపేటరూరల్: ప్రేమ పేరుతో ఓ మైనర్ను వేధించిన యువకుడిపై ఆదివారం రాత్రి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్ఐ యయాతీరాజు కథనం ప్రకారం.. అశ్వారావుపేట పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఓ కళాశాలలో ఇంటర్ చదువుతుంది. ఈక్రమంలో అశ్వారావుపేటకు చెందిన 23 ఏళ్ల ఆరేపల్లి వెంకన్న కొద్దిరోజులుగా ప్రేమపేరుతో వెంటపడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాలిక తండ్రికి చెప్పడంతో తండ్రి ఫిర్యాదు మేరకు వెంకన్నపై పోక్సో కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
స్వర్ణ నంది ఉగాది పురస్కారం
బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడుకు చెందిన సామాజిక కార్యకర్త గొనెల నానికి రాష్ట్రస్థాయి స్వర్ణ నంది ఉగాది పురస్కారం దక్కింది. మొగిలి అండ్ ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో నానికి పురస్కారం లభించింది. 27 సార్లు రక్తదానం చేయడం, గోదావరి వరదల సమయాన బాధితులను రక్షించడం, కరోనా కష్టకాలంలో అన్నదానం, అనాఽథశవాలకు అంత్యక్రియలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలకు పురస్కారం లభించింది. ఈ పురస్కారం అందజేసిన వారిలో నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ పాలకుర్తి కృష్ణ, మొగిలి గుణాకర్, నాగసాయి పాల్గొన్నారు. అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన కోలాటం శిక్షకుడు, కవి, గాయకుడు, ఐటీసీ ఉద్యోగి తోకల రమేష్కు స్వర్ణ నంది ఉగాది పురస్కారం అందజేశారు. తన రచనలతో పాటు, ఐటీసీ ఉద్యోగిగా సామాజిక సేవలు అందిస్తున్నందుకు గాను అవార్డుకు ఎంపిక కాగా దర్శకుడు, రచయిత, నటుడు కాంతేశ్వరరావు, సినీ రచయిత కోమాకుల సీతారాములు, ఉత్తమ కవిరత్న తోటమళ్ల సురేష్బాబులు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. -
వైభవంగా గోదావరి హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్ద ఆదివారం నదీ హారతి భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ చవితి నేపథ్యంలో నిర్వహించిన పూజలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హారతికి ముందు గణపతి పూజ, దీపోత్సవం చేపట్టి, పూజా ద్రవ్యాలతో గోదావరికి అష్టోత్తర శతనామార్చన చేశారు. ప్రతి ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని నదీమాత ఆశీస్సులు పొందుతున్నారని అర్చకుడు రామావజ్జుల రవికుమార్ తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు నదీ హారతి ప్రారంభానికి ముందు హైదరాబాద్కు చెందిన అనిల్ అకాడమీ ఆర్ట్స్, నిత్య భారతి కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను విశేషంగా అలరించాయి. అనంతరం శాంతి మంత్ర పఠనంతో కార్యక్రమం ముగిసింది. సిరిపురపు అశోక్ కుమార్ శర్మ దంపతులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ వారు పూజా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ వరలక్ష్మి– వెంకటేశ్వర్లు, పురోహితులు సురేష్ శర్మ, అశోక్ కుమార్ శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, ఫణి కుమార్ శర్మ, కృష్ణ శర్మ, తేజ శర్మ తదితరులతోపాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
● నిర్మాణ పనుల నాణ్యతలో రాజీ పడొద్దు ● అగ్నిప్రమాద బాధిత రైతులకు న్యాయం చేస్తాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మధిర/బోనకల్: దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యకోసం పెట్టే ప్రతీ రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా అబివర్ణించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్ను ఆదేశించారు. భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. బీమా ప్రకారం సొమ్ము చెల్లించాలి.. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, బీమా ప్రకారం సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. మధిర మండలం ఆత్కూరులో అగ్నిప్రమాదానికి గురైన శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడుతూ.. శీతల గిడ్డంగిలో రికార్డు ప్రకారం ఉన్న మిర్చికి సంబంధించిన రైతులకు బీమా ద్వారా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. మధిర మార్కెట్లో కూడా మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల భవనాల పరిశీలన.. మధిర మండలం సిరిపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలు, ఐటీఐ భవనాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత పాటించాలని ఆదేశించారు. -
గురుకులాలకు పక్కా భవనాలు..
గిరిజన గురుకుల సంస్థ కార్యదర్శి సీతామహాలక్ష్మి పాల్వంచరూరల్: కిన్నెరసాని, కృష్ణసాగర్, సుదిమళ్ల గురుకులాల్లో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని గిరిజన గురుకుల సంస్థ కార్యదర్శి సీతామహాలక్ష్మి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్ సైట్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించారు. రూ.25 లక్షలతో మరమ్మతులు నిర్వహిస్తున్న భోజనశాల పనులను, శిథిలావస్థకు చేరిన తరగతి గదులను పరిశీలించారు. మరమ్మతు పనులను జూన్ 10లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో గిరిజన గురుకుల పాఠశాలల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. అద్దెభవనాల్లో కొనసాగుతున్న పాల్వంచలోని డిగ్రీ కళాశాల, దమ్మపేటలోని పాఠశాలకు సొంత భవనాల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నటరాజ్, అరుణకుమారి, వెంకట్, మధుకర్, రాజు, శ్రీకాంత్, ప్రిన్సిపాల్ రమేష్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్ పాల్గొన్నారు. -
రామయ్యకు గోటి తలంబ్రాల సమర్పణ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణానికి ఆదివారం గోటి తలంబ్రాలను సమర్పించారు. ఏటా ఏపీ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండకు చెందిన అప్పారావు బృందం ప్రత్యేకంగా నారు పోసి పంట పండించి ఒడ్లను భక్తిశ్రద్ధలతో ఒలిచి రామయ్యకు సమర్పిస్తారు. రెండు దశాబ్దాలుగా ఆయన నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం సాగుతోంది. ఆదివారం భద్రాచలం చేరుకున్న కోరుకొండ భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి ఈఓ దామోదర్రావు, ఏఈవో శ్రవణ్కుమార్లకు గోటి తలంబ్రాలను అందజేశారు. హైదరాబాద్కు చెందిన మల్లి విష్ణువందన బియ్యపు గింజలపై రామకోటిని రచించారు. ఆమె పోస్టు ద్వారా పంపించగా, ఆదివారం దేవస్థానానికి అందాయి. ఆమె పదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండల పరిఽధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు మల్లెపూలతో కుసుమార్చన పూజ, విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేడు ప్రజావాణి సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను అందజేయాలని సూచించారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటక సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించారు. డీర్ పార్కులోని దుప్పులు, డ్యామ్, జలాశయం తదితరాలను వీక్షించారు. అనంతరం రిజర్వాయర్లో బోటు షికారు చేశారు. పర్యాటకుల ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.28,375, టూరిజం శాఖకు రూ.16,430 ఆదాయం సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. నేడు విద్యుత్ ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు విద్యుత్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సర్కిల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా 1,683 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. -
ఆరు కిలోమీటర్లు నడిచి.. వాచ్ టవర్ చేరుకుని
పాల్వంచరూరల్: కిన్నెరసాని అటవీ ప్రాంతంలో సఫారీ వాహనం తిరిగే రూట్ను పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు నడిచివెళ్లారు. ఈ మేరకు ఆదివారం డీఎఫ్ఓ కృష్ణాగౌడ్ వివరాలు వెల్లడించారు. పర్యాటకుల కోసం త్వరలో అభయారణ్యంలో సఫారీ వాహనం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వరల్డ్ ఫారెస్ట్ డేని పురస్కరించుకుని డీఎఫ్ఓ జి.కృష్ణాగౌడ్, జిల్లాలోని ఎఫ్డీఓలు కట్టా దామోదర్రెడ్డి, బి.బాబు, సుజాత, కోటేశ్వరరావు, రేంజర్లు, ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు సుమారు 100 మంది వరకు ఆరు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లారు. అద్దాలమేడ, కాటేజీల మీదుగా మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గుట్టపైన నిర్మించిన వాచ్ టవర్కు చేరుకుని పరిశీలించారు. అక్కడ నుంచి తిరిగి మరో మూడు కిలోమీటర్లు నడిచి డీర్పార్కు వద్ద చేరుకున్నారు. అటవీశాఖ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపటినట్లు డీఎఫ్ఓ తెలిపారు. -
ఇసుక ట్రాకర్లు సీజ్
అశ్వాపురం: మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో గోదావరి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు శనివారం పట్టుకున్నా రు. వాహనాలను స్టేషన్ కు తరలించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్రెడ్డి తెలిపారు. రెండు ఇసుక లారీలు స్వాధీనంపాల్వంచ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. శనివారం చర్ల నుంచి ఖమ్మానికి రెండు లారీల్లో ఇసుక తరలిస్తుండగా పాల్వంచ బీసీఎం రోడ్లో ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. అనంతరం లారీలను స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బండరాయి రోడ్డుపై పడటంతో మరో కారు ఢీకొని డ్రైవర్కు గాయాలు డివైడర్ను ఢీకొన్న గ్రానైట్ లారీపాల్వంచరూరల్: గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొనడంతో లారీలో ఉన్న బండరాయి రోడ్డుపై పడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అదే సమయంలో వస్తున్న కారు రాయిని ఢీకొనగా, డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం తెల్ల వారుజామున జగన్నాథపురంలో జరిగింది. ఒడిశా నుంచి భారీ గ్రానైట్ బండరాయితో వస్తున్న లారీ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామం వద్ద డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఉన్న బండరాయి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. అదే సమయంలో పాల్వంచవైపు వస్తున్న కారు బండరాయిని ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతిన్నది. కారుడ్రైవర్, ముసలిమడుగుకు చెందిన పొడియం సుభాష్ చంద్రబోస్కు స్వల్పగాయాలైనట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. భారీ క్రేన్ తెప్పించి బండరాయిని రోడ్డు మీద నుంచి పక్కకు తొలగించినట్లు పేర్కొన్నారు. జాతరలో చోరీఅశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం వద్దగల శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి జాతరలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. గాడ్రాల గ్రామానికి చెందిన కుండా ఝాన్సీలక్ష్మి సరోజిని బాయి, భర్త వెంకన్నబాబుతో కలిసి జాతరకు వెళ్లగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆమె చేతులో ఉన్న పర్సును అపహరించారు. దీంతో పర్సులో ఉన్న రూ.1,50,000 విలువైన 20 గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు, రూ.10వేల విలువైన సెల్ఫోన్, రూ.500 నగదు చోరీకి గురైనట్లు బాధితురాలు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భద్రగిరిలో భక్తుల సందడి
భద్రాచలం: భద్రగిరి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. ఉగాది, రంజాన్తో పాటు వా రాంతపు సెలవులు వరుసగా రావడంతో భక్తులంతా భద్రాచలం బాట పట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానా లను ఆచరించారు. అనంతరం ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆర్జిత సేవల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జోరుగా టికెట్ల విక్రయాలు శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వెబ్సైట్లో ఉంచిన టికెట్ల విక్రయాలు వేగంగా జరుగుతున్నాయి. శనివా రం నాటికి 3ఏ సెక్టార్లోని రూ.7,500 విలువైప ఉభయదాతల టికెట్లు 400కు గాను 293 అమ్ముడుపోగా 107 మాత్ర మే మిగిలి ఉన్నాయి. రూ.2,500 విలువైన సెక్టార్ 3బీ టికెట్లు 550కి 419, రూ.2వేల విలువైన సెక్టార్ 3సీ 190కి 30 మాత్రమే ఉన్నాయి. ఇక రూ.1000 విలువైన సెక్టార్ 3డీలో 85 పూర్తిగా అమ్ముడు పోగా, 3ఈలో 315కు 19, 3 ఎఫ్లో 390కి 321 టికెట్లు ఉన్నాయి. సెక్టార్ 4ఏలో రూ. 300 విలువైన టికెట్లు 368కి మొత్తం, సెక్టార్ 4బీ లో రూ.300వి 385కు 385, సెక్టార్ 4సీలో 295కు 144 టికెట్లు ఉన్నాయి. వీటితో పాటు రూ.150 విలువైన టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఆన్లైన్లో వేగంగా నవమి టికెట్ల విక్రయం -
మక్కల కొనుగోళ్లకు గ్రీన్సిగ్నల్
● పీఏసీఎస్లు, డీసీఎంఎస్ ద్వారా కేంద్రాలు ● ఉమ్మడి జిల్లాలో 41కేంద్రాల ఏర్పాటుఖమ్మంవ్యవసాయం: యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల కష్టాలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట సాగు చేసిన ప్రాంతాల్లో మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించినా ప్రైవేటు మార్కెట్లో వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించడం లేదు. దీంతో క్వింటాకు రూ.800 మేర రైతులు నష్టపోతుండడంతో ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈనేపథ్యాన ప్రభుత్వం మక్కల కొనుగోళ్లకు ముందుకొచ్చింది. ఎప్పటిలాగే మార్క్ఫెడ్కు కొనుగోలు బాధ్యతలు అప్పగించగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సూచనలతో కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పంట సాగైన ప్రాంతాల్లో.. మార్క్ఫెడ్ ఆధ్వర్యాన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు, జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ల ద్వారా మక్కల కొనుగోళ్లు చేపడతారు. పంట అత్యధికంగా సాగైన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ ఏడాది యాసంగి పంటగా ఖమ్మం జిల్లాలో 1.67లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 72వేల ఎకరాల్లో మక్కలు సాగయ్యాయి. ఖమ్మంజిల్లాలోనిచింతకాని, కొణిజర్ల, బోనకల్, రఘునాథపాలెం, ముదిగొండ, ఏన్కూరు తదితర మండలాలు, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి తదితర మండలాల్లో మక్కల సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. పంట ఎక్కువగా సాగైన మండలాల్లో రెండు నుంచి మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. మొత్తంగా ఖమ్మంలో జిల్లాలో 30, భద్రాద్రి జిల్లాలో 11 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. తొలి కేంద్రాన్ని ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం ప్రారంభించగా, ఏప్రిల్ మొదటి వారంకల్లా అన్ని కేంద్రాలను దశల వారీగా ప్రారంభించనున్నారు. -
పని చేస్తున్న ఆస్పత్రిలోనే ప్రసవం
●ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకం పెంచేలా ఫార్మసిస్ట్ నిర్ణయం ఇల్లెందు: ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేలా ఇల్లెందు ఏరియా ఆస్పత్రి ఫార్మసిస్ట్ రజిని తీసుకున్న నిర్ణయం అందరి మన్ననలు పొందింది. ఆస్పత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న రజిని గర్భిణి కాగా, శనివారం ఆమెకు పురిటినొప్పులు రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు కాకుండా ఏరియా ఆస్పత్రికే వచ్చింది. గైనకాలజిస్టులు సింధు, దేవీ నాగప్రియాంకతో పాటు ఇతర విభాగాల వైద్యులు శ్రీనివాస్, మాధురి, బావుసింగ్, సిబ్బంది ఆమెకు శస్త్రచికిత్స చేయగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండగా, పనిచేస్తున్న ఆస్పత్రిపై నమ్మకం పెంచేలా రజిని తీసుకున్న నిర్ణయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ హర్షవర్ధన్, డీసీహెచ్ఎస్ రవిబాబు అభినందించారు. -
పెద్దమ్మతల్లికి లక్ష కుసుమార్చన
పాల్వంచరూరల్: మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి లక్ష మల్లెపూలతో అర్చన, లలితా సహస్రనామం, చండీ సప్తసతీ పారాయణం, హో మం తదితర పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు పెండ్లి రాంరెడ్డి, పాపారావు, శ్రీనివాసరావు, సందుపట్ల రమ్య, దుగ్గిరాల సుధాకర్, అడుసుమల్లి సాయిబాబా, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. కాళీమాత ఆలయంలో విరూపాక్ష స్వామి పూజలుమణుగూరు టౌన్: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాళీమాత ఆలయాన్ని హంపి విరూపాక్ష భారతీ స్వామి శనివారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు.. బీటీపీఎస్ రైలు మార్గం నిర్మాణంలో ఆలయంలో కొంతభాగం పోతుందని స్వామి వారి కి వివరించగా, ప్రభుత్వం ఆలయానికి స్థలం కేటాయించిన తర్వాత పునఃనిర్మాణానికి పూర్తి గా సహకరిస్తామని స్వామిజీ ప్రకటించారు. అనంతరం భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పండితులు శ్రీకాంత్, దుర్గాప్రసాద్, సంతోష్, భార్గవ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. బీటీపీఎస్లో విద్యుత్ సరఫరాకు అంతరాయంరెండో యూనిట్లో సాంకేతిక లోపం.. మణుగూరురూరల్: మండల పరిధిలోని బీటీపీఎస్ రెండో యూనిట్లో శనివారం సాంకేతిక లోపం తలెత్తి 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. బాయిలర్లోని పైప్ లీకవడంతో సమస్య ఏర్పడిందని, ఉత్పత్తితో పాటు సరఫరాకూ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరమ్మతులు మొదలు పెట్టామని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఈ బిచ్చన్న తెలిపారు. సౌర విద్యుత్ ప్లాంట్ పరిశీలనమణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని 33 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ను జీఎం(ఈఅండ్ఎం, సోలార్ ఎనర్జీ)బి.సీతారామ్ శనివారం పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, కెపాసిటీ యుటిలైజేషన్ ఫ్యాక్టర్ వంటి సాంకేతిక అంశాలను పరిశీలించారు. ప్లాంట్లో అమర్చిన సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం, ఇన్వర్టర్ పని తీరు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్బోర్డు వ్యవస్థల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కాగా, సీతారామ్ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనుండగా, ఏరియా జీఎం రామచందర్, ఽఅధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాసాచారి, రాంబాబు, శ్రీనివాస్, ఎస్ రమేష్, శివప్రసాద్, వీరభద్రుడు, రమేష్, సురేష్ పాల్గొన్నారు. ఉచిత హామీలతో మోసం చేస్తున్నారు..అశ్వారావుపేటరూరల్: పాలకులు ఉచిత హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. శనివారం అశ్వారావుపేటలోని ఓ కల్యాణ మండపంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి దాకా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మిన మవోయిస్టులు ప్రస్తుతం పోలీసుల వద్ద లొంగిపోతున్నారని, వారి భవిష్యత్ ఏమి టో కొద్ది కాలం వేచి చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప ఏమి లేదని, హామీలను విస్మరించి కొత్త పేర్లతో పథకాలను తెచ్చి మభ్యపెడుతున్నారని అన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోగినపల్లి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా జాటోతు కృష్ణ, కోశాధికారిగా బుర్రా వెంకన్న, ఉపాధ్యక్షులుగా దాసరి సాయి, సహాయ కార్యదర్శిగా నాయిని రాజు, 17 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
అటవీ సంరక్షణకు కృషి చేయండి
● జిల్లాను దేశంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దాలి ● ఫారెస్ట్ సిబ్బందికి ఎస్పీ రోహిత్రాజ్ పిలుపు పాల్వంచరూరల్: దేశంలోనే జిల్లా అటవీ ప్రాంతా న్ని ఉత్తమంగా తీర్చిదిద్దాలని, ఈ మేరకు అధికా రులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ రోహిత్రాజ్ పిలుపునిచ్చారు. అటవీ సంరక్షణతోనే సమాజాన్ని కాపాడగలమని చెప్పారు. ప్రపంచ అటవీ దినోత్స వం సందర్భంగా వైల్డ్లైఫ్ ఆధ్వర్యంలో కిన్నెరసానిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న కాలా నికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించే విషయంలో ఎక్కువ మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారికి అవగాహన కల్పించా లని చెప్పారు. అటవీ – పోలీస్ శాఖలు ఎప్పు డూ సమన్వయంతోనే పని చేస్తున్నాయని తెలి పారు. మహిళా ఉద్యోగులను ఎవరైనా వేధిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంత సమీప గ్రామాల్లో నివసించే వారికి ఆర్థిక వనరులను సృష్టించి అందించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎఫ్ఓ జి.కృష్ణాగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధిక అటవీ ప్రాంతం, అటవీ సిబ్బంది జిల్లాలో ఉన్నారని, అడవుల్లో ఉండే జంతువులు, వృక్ష సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. సమాజంలో అందరికంటే ఎక్కువ భాద్యత అటవీ శాఖపైనే ఉందన్నారు. జిల్లాలో సారవంతమైన అడవి ఉందని, తద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.20కోట్ల ఆదా యం అందిస్తున్నామని, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తే రూ.1000కోట్ల ఆదాయం అందించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ లు బి.బాబు, కట్టా దామోదర్రెడ్డి, సుజాత, కోటేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
‘భరోసా’ @ రూ.337.17 కోట్లు
● జిల్లాలోని 963 గ్రామాల పరిధిలో 1,91,092 మందికి సాయం ● నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో యాసంగి పంటలు కోత దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లోపే వానాకాలం సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా సాయానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం నుంచి విడతల వారీగా రైతు భరోసా విడుదల చేయాలని నిర్ణయించింది. 1,91,092 మంది రైతులు అర్హులు.. జిల్లాలో యాసంగిలో 23 మండలాల్లోని 963 గ్రామాలకు చెందిన 1,91,092 మంది రైతు భరోసా ఆర్థిక సాయానికి అర్హులని అధికారిక గణాంకాలు తేల్చాయి. ఈ మేరకు జిల్లాకు రూ.337,17,46, 387 విడుదల కావాల్సి ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2 వేల మందికి పైగా రైతులు కొత్తగా నమోదయ్యారు. ఇంకా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. -
అభివృద్ధి పనుల్లో వేగం !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఈ మేరకు హైదరాబాద్లో ‘భద్రాచలం పునర్ నిర్మాణం, పునరుజ్జీవం’ పేరుతో ఇక్కడ చేపట్టాల్సిన పనులపై మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీని వాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో శుక్రవారం, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ నివారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ప్రధాన ఆలయం, గోదావరి తీరం, పట్టణంలో చేపట్టాల్సిన పనులపై ఇందులో చర్చ జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడ చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.. నాలుగు కాదు.. మూడు గతంలో భద్రాచలం ఆలయం, పట్టణ అభివృద్ధి కోసం రూ.350 కోట్లు కేటాయించాలని నిర్ణయించా రు. అందులో తొలివిడతలో రూ.100 కోట్లతో పను లు చేపట్టాలని భావించారు. ఈ మేరకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత నాలుగు దశల్లో వేర్వేరు విధాల పనుల కోసం మిగిలిన నిధులు ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ గత 12 ఏళ్లుగా భద్రాచలంలో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోవడం, నానాటికీ భక్తుల తాకిడి పెరగడంతో ముందుగా వేసిన అంచనాల్లో మార్పులు చేశారు. దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రాకు దీటుగా తెలంగాణ జిల్లాల నుంచి కూడా పెరిగిన భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని మూడు దశ ల్లోనే పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. పెరిగిన అంచనా వ్యయం పుష్కరాల పనులను మినహాయించి భద్రాచలంలో ప్రధాన ఆలయం వద్ద వేర్వేరు పనుల కోసం ముందుగా నిర్ణయించిన రూ.350 కోట్ల అంచనా వ్యయాన్ని రూ. 560 కోట్లకు పెంచినట్టు సమాచారం. ఇందులో తొలి విడత పనుల కోసం తక్షణమే రూ.200 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలు స్తోంది. గర్భగుడిని కదిలించకుండా ఈ నిధులతో లోపలి భాగంలో వివిధ పనులు, ఆలయ ప్రాకారం, మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ పనులకు సుమారు రూ.120కోట్ల వరకు వ్యయం కానుండగా మిగిలిన నిధులతో క్యూ లైన్ల నిర్వహణ, సామూహిక వసతి, బస, రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర పనులు ఉంటాయి. ఈనెల 27న శ్రీరామనవమి రోజున పనులు ప్రారంభించి 2027 జూలైలో పుష్కరాల నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి.. రెండు, మూడు దశల్లో ప్రస్తుతం ఉన్న కల్యాణ మండపం (మిథిలా స్టేడియం) పునరుద్ధరణతో పాటు పట్టణంలో శాశ్వత ప్రాతిపదికన భక్తులు/పర్యాటకులకు ఆధ్యాత్మక, పర్యాటక పరంగా సౌకర్యాలు కల్పించేలా పనుల చేపట్టేందుకు వీలుగా అంచనాలు రూపొందిస్తున్నారు. ఇందుకోసం దేశంలో పేరెన్నిక గల కన్సల్టెన్సీకి పనులు అప్పగించాలని నిర్ణయించారు. పుష్కరాల నాటికి ప్రధాన ఆలయం వద్ద చేపట్టే తొలి విడత పనులు పూర్తయితే, ఆ తర్వాత రెండు, మూడో విడత పనులు చేపట్టి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మేడారం, భద్రాచలంలో చూపించిన మార్పులు తమకు లాభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. -
మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
భద్రాచలంఅర్బన్: గోదావరిలో గల్లంతైన మరో ఇద్దరి మృతదేహా లు శనివారం లభ్యమయ్యాయి. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వచ్చి శుక్రవారం గోదా వరి నదిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతుకాగా, ముగ్గురు విద్యార్థులు అభిరామ్, శ్రీకర్, నవదీప్ల మృతదేహాలు లభ్యమైన విషయం విదితమే. గజ ఈతగాళ్లు శనివారం కూడా గాలింపు చేపట్టగా గల్లంతైన తేజజ్ఞ, సతీష్ల మృతదేహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిధిలో లభ్యమయ్యాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో కుక్కునూరు మండల పరిధిలోని గోదావరి ఒడ్డునే వీరికి భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించా రు. కాగా శుక్రవారం లభ్యమైన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను రోడ్డు మార్గంలో తరలించే అవకాశం లేకపోవడం, సుమారు 2కిలోమీటర్లు మేర గోదావరి ఇసుకలో ప్రయాణించాల్సి ఉండటంతో అధికా రులు ఎడ్లబండిపై తరలించారు. శని వారం లభ్యమైన రెండు మృతదేహాలు దాదాపు 24 గంటలపాటు నీటిలో ఉండటంతో అవి పాడైపోయిన స్థితికి చేరగా, గోదావరి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. వెయ్యి బాతుల మృత్యువాతదమ్మపేట: ఆగి ఉన్న బొలెరో ట్రక్కును లారీ ఢీకొని బాతులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని ముష్టిబండ శివారులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీప తాడువాయి గ్రామం నుంచి ఏపీలోని ఏలూరు జిల్లా తిరువూరుకు 3వేల బాతులతో బొలెరో ట్రక్కు వాహనం బయలుదేరింది. ఈ క్రమంలో వాహనాన్ని మండలంలోని ముష్టిబండ శివారు దాబా హోటల్ సమీపంలో నిలిపారు. అదే సమయంలో మందలపల్లి నుంచి సత్తుపల్లి వైపు మొక్కజొన్నల లోడుతో వెళ్తున్న లారీ బొలెరోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల్లో ఉన్నవారికి స్పల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా, బొలెరోల ఉన్న వేయికి పైగా బాతులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
పంటలకు రక్ష
సౌర కంచె..ఇల్లెందు: కోతులు, అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థ పడుతున్నారు. 24 గంటలపాటు కాపలా కాయాల్సి వస్తోంది. అదే అటవీ సమీపంలోని చేలల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఇల్లెందు ఏరియాలో సుమారు 50 వేల ఎకరాల వరకు మొక్కజొన్న సాగులో ఉంది. ఇల్లెందు, బయ్యారం, టేకులపల్లి, కారేపల్లి, గుండాల, ఆళ్లపల్లిలో పోడు భూముల్లో కూడా మొక్కజొన్న సాగు చేపట్టారు. కోతులు, అడవి పందుల బెడదతో పంటలు చేతికి రాకపోవడంతో రైతులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. చేను చుట్టూ సౌర కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎకరం విస్తీర్ణానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ. 10 వేల వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. చుట్టూ ఫెన్సింగ్ కోసం కర్రలు, వైరు, సోలార్ ప్లేట్, బ్యాటరీ, రీచార్జ్ అయ్యే బాక్స్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ తీగల ద్వారా ప్రసారం అవుతుండటంతో కోతులు, పశువులు, అడవి పందులు తగిలితే షాక్ కొడుతుంది. కానీ ప్రాణ నష్టం ఉండదు. దీంతో పంట చేలకు కోతులు, పశువులు, పందుల బెడద తప్పింది. ఒక్కో సోలార్ ప్లాంట్ నుంచి సామర్థ్యం ఆధారంగా 50 ఎకరాల వరకు కంచె ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇల్లెందు మండలంలో బొజ్జాయిగూడెం, వేపలగడ్డ, తండా, జగదాంబా గుంపు, మొట్ల గూడెం, తొడిదెలగూడెం, పంతులునాయక్ తండా, టేకులగూడెం, మొండితోగు గ్రామాల్లో రైతులు వందల ఎకరాలకు సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ఫెన్సింగ్తో పంటలను సులభంగా రక్షించుకోగలుగుతున్నామని రైతులు మోతీలాల్ సాహూ, శ్యాంలాల్ సాహూ, బి శ్రీనివాసరావు, బీఆర్ రమేష్, గుగులోతు నందు తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుతో పంటలకు రక్షణ కలుగుతోంది. కోతులు, పందులు, పశువులు చేలోకి రాకుండా కాపాడుకుంటున్నాం. నేను టమాట తోట రక్షణగా సౌర కంచె వేశాను. కోతల బెడద తప్పడంతో దిగుబడి, ఆదాయం పెరగింది. – శ్రీనివాసరావు, తొడిదెలగూడెం గ్రామం -
● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిఇల్లెందు రూరల్: మండలంలోని మసివాగు తండా వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఇల్లెందు మీదుగా మసివాగుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పాఖాల నుంచి ఇల్లెందు వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుగులోతు స్వప్న(58), బానోతు లక్ష్మి(55) అనే ఇద్దరు మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108లో క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాణోత్ రాజేశ్వరి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన నలుగురికీ ఇల్లెందులో చికిత్స అందిస్తున్నారు. అంతా ఒక కుటుంబం వారే.. కారేపల్లి మండలం చీమలపాడు సమీపంలోని బోటి తండాకు చెందిన స్వప్న తండ్రి బానోతు నంద్యా ఇటీవల చనిపోయాడు. దీంతో స్వప్న కుటుంబసభ్యులను నిద్రకోసం ఆమె చెల్లెలు స్రవంతి తన స్వగ్రామమైన మసివాగుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో స్వప్న కుటుంబసభ్యులు మొత్తం ఏడుగురు ఆటోలో శనివారం రాత్రి బోటితండా నుంచి బయల్దేరారు. ఇల్లెందు దాటే వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. మరికొన్ని క్షణాల్లో మసివాగు చేరకుంటారనగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ఆటోను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఆటోను సైడ్ నుంచి ఢీ కొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న బాణోతు స్వప్న, లక్ష్మికి తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే ప్రాణాలొదిలారు. మిగిలిన వారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలతో రక్తసిక్తమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఆ దారిలో వెళ్లేవారు 108కు సమాచారం ఇచ్చారు. ఈలోగా స్థానికులు చేరుకుని గాయపడ్డవారికి సాయం చేశారు. మద్యం మత్తుతోనే కారు నడుపుతున్న వ్యక్తి అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనగా ఒక్కసారిగా కారు ఆటోపైకి దూసుకొచ్చిందని, అప్పటికీ ఆటో డ్రైవర్ ప్రేమ్ చాకచక్యంగా పక్కకు వెళ్లినా, ప్యాసింజర్ సీటు భాగం వద్ద కారు బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. ఇంత జరిగినా కారు నడిపే వ్యక్తి కనీసం కిందకు దిగకుండా మత్తులో అందులోనే కూర్చున్నాడని చెబుతున్నారు. చివరకు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను మత్తులో నుంచి బయటకు రాలేదు. రోదనలతో మార్మోగిన ఆస్పత్రి రాత్రి 9:30 గంటలకు ప్రమాదం జరగగా పది గంటల సమయంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలుసుకున్న బోటి తండాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం విషాదభరితంగా మారింది. ప్రమాదంలో గాయపడిన వారిలో బాణోతు ప్రేమ్, బాణోత్ శ్రీను, వనజ, మనోజ్ ఉన్నారు. ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతిబూర్గంపాడు: మండల పరిధిలోని పోలవరం గ్రామ సమీపంలో శనివారం యాష్ ట్యాంకర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న మోటార్ సైకిల్ను ఎదురుగా వస్తున్న యాష్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిలిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కారేపల్లి మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కొండా దేవా(25)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ మేడా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదంలో ముంచినది..
● గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి ● ఏపీ – తెలంగాణ సరిహద్దులో ఘటన భద్రాచలంఅర్బన్: పట్టణంలోని కూనవరం రోడ్డులో గల గోదావరి తీరం వెంబడి ఏపీ, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం వద్ద గోదావరిలో మునిగి భద్రాచలానికి చెందిన ఇద్దరు, ఏపీకి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతి చెందిన వారిలో నలుగురు విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతుండగా, ఒకరు భద్రాచలంలో వేదాన్ని చదువుతున్నాడు. శ్రీశైలం వెళ్తున్నట్లు చెప్పి.. విజయవాడ కళాశాల హాస్టల్ నుంచి బస్సు ద్వారా శ్రీశైలం వెళ్తున్నామని ఇళ్లల్లో చెప్పి ఓ కారుని అద్దెకు తీసుకుని, గురువారం ఉదయం భద్రాచలం బయలుదేరారు. భద్రాచలంలో వీరి స్నేహితుడు శ్రీకర్ గుప్తా సహకారంతో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని, ప్రైవేట్ రూమ్ తీసుకుని సేదతీరారు. శుక్రవారం సినిమా చూడాలనుకుని టికెట్లు బుక్ చేయగా.. అవి శనివారానికి బుక్ కావడంతో గోదావరి వద్ద ఫోటోలు దిగాలని శ్రీకర్గుప్తాను పిలిచారు. అతడు తన స్నేహితుడైన పొడిచేటి అభిరామ్ను వెంట తీసుకుని వచ్చాడు. ఒకరి తర్వాత ఇంకొకరు ఏడుగురు కలిసి కూనవరం రోడ్డులో కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న గోదావరి వద్దకు వెళ్లి.. దుస్తులు, మొబైల్లను అక్కడ పెట్టి నదిలోకి వెళ్లారు. ముందుగా గోక తేజజ్ఞ దిగి మునిగిపోతుండగా.. కాపాడేందుకు దిగిన శ్రీకర్ గుప్తా, నవదీప్, అభిరామ్, సతీశ్ ఒక్కసారిగా గల్లంతయ్యారు. తర్వాత హర్షా నీటిలోకి దిగి ప్రయత్నిస్తున్న క్రమంలో వెళ్లొద్దని దీపక్ వారించి, ముందుగా శ్రీకర్ గుప్తా నాన్న రామకృష్ణకు పోలీసులకు సమాచారం అందించారు. ఎటపాక, భద్రాచలానికి పలు శాఖల అధికారులు చేరుకుని గల్లంతైన వారి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. తొలుత శ్రీకర్ మృతదేహం, తర్వాత నవదీప్, అభిరామ్ మృతదేహాలు దొరి కాయి. ఆపై తేజజ్ఞ, సతీశ్ ఆచూకీ లభించకపోవడంతో గాలింపు ఆపేశారు. మృతదేహాలకు భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకర్ మృతదేహం వద్ద ఆయన తండ్రి రామకృష్ణ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ‘మీ మామయ్య వచ్చాడు లే నాన్నా..ఎప్పుడూ మామయ్య వద్దకు వెళ్తానని చెప్తావు కదా.. అంటూ విలపించడం కలచివేసింది. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం జరిపారు. కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. హుండీ ఆదాయం రూ. 42.84 లక్షలు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. ఎండోమెంట్ శాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకుడు పి.బేల్సింగ్, ఈఓ ఎన్.రజనీకుమారి పర్యవేక్షణలో లెక్కించారు. 2025 అక్టోబర్ 9వ తేదీ నుంచి 2026 మార్చి 19వ తేదీ వరకు 162 రోజుల కానుకలను లెక్కించగా రూ.42,84,648 ఆదాయం లభించింది. 35 ఇంగ్లాండ్ పౌండ్స్, 10 యూరోలు, 50 కెనడా డాలర్లు, బ్యాంక్ ఆఫ్ ఽతాంజనియా 10,000 షిలాంగులు, 18 విదేశీ నాణేలు, మిశ్రమ వెండి, బంగారం కూడా కానుకలుగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గం నాగేశ్వరరావు, రాంరెడ్డి, పాపా రావు, శ్రీనివాసరావు, సుధాకర్, సాయిబాబా, శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. భద్రగిరి మార్ట్ పనులు వేగవంతం చేయాలిభద్రాచలంటౌన్: ఈ నెలలో ప్రారంభంకానున్న భద్రగిరి మార్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆదివారంలోపు సేకరించిన పప్పు దినుసులు, తృణధాన్యాలు, ఇతర ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేసి ర్యాకుల్లో అమర్చాలని సూచించారు. అధికారులు డేవిడ్రాజ్, వేణు, ఉదయ్, హరికృష్ణ, ప్రభాకర్రావు పాల్గొన్నారు. -
హోటళ్లలో అధికారుల తనిఖీలు
24 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం భద్రాచలంటౌన్: పట్టణంలోని హోటళ్లలో పౌరసరఫరాలశాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. తనిఖీల్లో గృహ వినియోగానికి సంబంధించిన 24 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, స్థానిక గ్యాస్ ఏజెన్సీకి అప్పగించినట్లు పౌరసరఫరాలశాఖ డీటీ జి.రాజులు తెలిపారు. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాల్లో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని, నిబంధనలు ఉల్లంఘించి గృహ అవసరాల సిలిండర్లను ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముకుందాపురంలో పట్టపగలే చోరీ ఇల్లెందురూరల్: మండలంలోని ముకుందాపురంలో శుక్రవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన రైతు రాయల శ్రీను ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం శ్రీను, అతని కుటుంబ సభ్యులు ఇంటికి వస్తున్న సమయంలో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వేగంగా పరిగెత్తడం గమనించారు. అతని వెంట పరుగెత్తిన శ్రీను కొద్ది దూరంలో గడ్డివాములో దాక్కున్న వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చాడు. అతని వద్ద నుంచి రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నాడు. అతడిని ఇంట్లో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోయిన నగదులో కొంతే దొరకడంతో మిగతా సొమ్ము ఇప్పించాలని రాయల శ్రీను పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. -
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గుండాల: ఆళ్లపల్లి మండలం పాలగుంపునకు చెందిన గొగ్గెల సమ్మయ్య (53) కుటుంబ కలహాలతోపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకన్నాడు. ఎస్ఐ సోమేశ్వర్ వివరాలు సేకరించి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ‘హామీల అమలులో విఫలమైన ప్రభుత్వం’చుంచుపల్లి: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలనే డిమాండ్తో శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందడం లేదని, కాంగ్రెస్ నాయకులు చేతివాటం చూపిస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదని విమర్శించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నాయకులు ఏనుగు వెంకట్రెడ్డి, జంపా సీతారామరాజు, పోడియం బాలరాజు, పొన్నం భిక్షపతి, చెరుకు భాగ్యలక్ష్మి, పి.రవీంద్ర, బిజ్జుం శ్రీనివాస్రెడ్డి, వెంకన్న, జె.కృష్ణ రాపాక రమేష్, పోలోజు క్రాంతి, జబ్బురి రమేష్, మెట్ట వెంకటేశ్వర్లు, పల్లపు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, ఈసాల వెంకటేశ్వర్లు, పి.భిక్షపతి, సుధాకర్రెడ్డి, బి.శ్రీధర్ పాల్గొన్నారు. -
గాలిదుమారం బీభత్సం
అశ్వారావుపేటరూరల్: గాలి దుమారం బీభత్సం కారణంగా విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లింది. మండలం మండలంలోని వినాయకపురంలో గురువారం రాత్రి వీచిన గాలిదుమారానికి అశ్వారావుపేట నుంచి వినాయకపురం, నారాయణపురం, గంగారం సబ్ స్టేషన్లకు వచ్చే 33 కేవీ విద్యుత్ స్తంభాలపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో వైర్లు తెగిపోగా 45 గిరిజన గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఈమేరకు ట్రాన్స్కో ఈఈ నందయ్య, ఏడీఈ బి.వెంకటరత్నం, సెక్షన్ ఏఈ కె.విజయకృష్ణ, కె.వెంకటేశ్వర్లు సిబ్బందితో చేరుకుని సెల్ఫోన్లు, టార్చిలైట్ల సాయంతో మరమ్మతులు చేపట్టి రాత్రి 2 గంటలకు సరఫరా పునరుద్ధరించారు. పనులకు ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ నరాల శ్రీనివాసరావు, సర్పంచ్లు కొవ్వాసి రాజు, అలీ, స్థానికులు సహకరించారని ఏడీఈ తెలిపారు. పాల్వంచ మండలంలో.. పాల్వంచ/పాల్వంచరూరల్/గుండాల: పాల్వంచలో శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. మండలంలోని కిన్నెరసాని, కోడిపుంజుల వాగు, పునుకుల, పుల్లాయిగూడెం, సూరారం, పాండురంగాపురం గ్రామాల్లోనూ వడగండ్ల వాన కురవగా మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నట్లు తెలిసింది. అలాగే, ఈదురుగాలులకు కేటీపీఎస్ యాష్ పాండ్లోని బూడిద గాలిలోకి లేచి సూరారం, పనుకుల, కొత్తసూరారంను కమ్మేసింది. ఇక ఆళ్లపల్లి మండలం రాఘవాపురానికి చెందిన కొర్సా రామ్మక్క చేనుకు వెళ్లి వస్తుండగా గాలిదుమారం రావడంతో ఓ చెట్టు కింద ఆగింది. ఒక్కసారిగా ఆ చెట్టుకొమ్మ ఆమె తలపై పడడంతో తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ లైన్పై వృక్షాలు పడడంతో అర్ధరాత్రి మరమ్మతులు -
నిరాశే మిగిల్చారు..!
●ఈ సేవలకు వెలకట్టగలమా..!శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి రూ. 45 కోట్లు భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని రాబోయే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో డాక్టర్ మన్మోహన్సింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ను గతేడాది ప్రారంభించారు. గతంలో 320 ఎకరాల్లో విస్తరించిన ఇంజనీరింగ్ కాలేజీనే యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేశారు. వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రస్తుత బడ్జెట్లో రూ.45 కోట్లు కేటాయించారు. దీంతో అరకొర సౌకర్యాల మధ్య వర్సిటీ కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఉస్మానియాకు రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ.400 కోట్ల మేర కేటాయించిన ప్రభుత్వం మన్మోహన్సింగ్ వర్సిటీపై శీతకన్ను వేసింది. ఎకో టూరిజంలో అన్యాయం ఎకో టూరిజానికి (పర్యావరణ–పర్యాటకం) రూ.875 కోట్లు కేటాయించారు. కవ్వాల్ అభయారణ్యం (కుమురంభీం), మన్ననూర్ టైగర్ రిజర్వ్ (నాగర్ కర్నూల్)లకే పెద్ద పీట వేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు విస్తరించిన జిల్లాకు ప్రాధాన్యం దక్కలేదు. జిల్లాలో భద్రాచలం పట్టణం పాపికొండలు, మారేడుమిల్లిలకు గేట్వేగా ఉంది. కిన్నెరసాని అభయారణ్యం (పాల్వంచ), కనకగిరి గుట్టలు (చండ్రుగొండ), రథం గుట్టలు (మణుగూరు) వంటి ప్రాంతాలు ఎకో టూరిజానికి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. అయితే వీటికి బడ్జెట్ కేటాయింపుల్లో సముచిత స్థానం దక్కలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ఎయిర్పోర్టుల విషయంలో వరంగల్, ఆదిలాబాద్లను బడ్జెట్లో పేర్కొనగా, కొత్తగూడెం ఊసే లేకుండా పోయింది. భద్రాచలం టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి ఒక్కపైసా నిధులు రాలేదు. ఊరట నిచ్చిన కేటాయింపులు రాబోయే గోదావరి పుష్కరాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.500 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి తెలంగాణలో ప్రధాన ఘాట్గా భద్రాచలాన్నే పేర్కొనాలి. ఈ నేపథ్యంలో పుష్కరాల నిధుల్లో ఎక్కువ మొత్తం జిల్లాకే దక్కే అవకాశముంది. నగరాభివృద్ది పద్దులో భాగంగా కొత్తగా కార్పొరేషన్లుగా అప్గ్రేడైన నల్లగొండ, మహబూబ్నగర్, మంచిర్యాల, కొత్తగూడెంలకు రూ.754 కోట్లు కేటాయించారు. ఈ పద్దు నుంచి రమారమి రూ.200కోట్లు జిల్లాకేంద్రం అభివృద్ధికి వచ్చే అవకాశముంది. దీంతోపా టు రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక సర్క్యూట్ పేరుతో తొమ్మిది ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఇందులో నూ భద్రాచలానికి స్థానం దక్కే అవకాశముంది. ఇక ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమం కింద వందశాతం సబ్సిడీతో పోడు భూముల్లో బోర్లు వేయనున్నారు. ఇందులో జిల్లాకు సింహభాగం నిధులు దక్కనున్నాయి. రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు అరకొరగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2026–27లో జిల్లాకు తీవ్ర నిరాశే ఎదురైంది. రాష్ట్రం మొత్తానికి వర్తించే సంక్షేమ, అభివృద్ధి పథకాలను మినహాయిస్తే జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీ లేవు. మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ ఊసే ఎత్తకపోగా సీతమ్మసాగర్కు పైసా విదల్చలేదు. అత్యధికంగా అటవీ విస్తీర్ణం, పర్యావరణ పర్యాటక అవకాశాలు ఉన్నా ఎకో టూరిజంలో ప్రాధాన్యం దక్కలేదు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు ఊరట కలిగించింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంరాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారంటీలను విస్మరించారు. రైతు కూలీలకు రూ.12వేలు, రూ. 2500, రైతుభరోసా రూ.15వేల వంటి పథకాలకు కేటాయింపులు లేవు. బీసీలకు న్యాయం జరగలేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించలేదు. విద్యా, వైద్యానికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. మొత్తంగా ప్రభుత్వం పేదలను విస్మరించినట్లు తేటతెల్లమవుతోంది. –మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శిబడ్జెట్లో మైనారిటీల కు అరకొరగా నిధులు కేటాయించారు. ఎన్ని కల ముందు మైనారిటీ డిక్లరేషన్లో మైనారిటీలకు ఉప ప్రణాళికతోపాటు మైనారిటీల సంక్షేమ బడ్జెట్ రూ.4వేలకోట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగుల రుణాలకు రూ.1000కోట్లు కేటాయిస్తామని, ఇమామ్, మౌజన్ వేతనం రూ.10వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపులో ఇవేమీ పట్టించుకోలేదు. –ఎండీ యాకూబ్ పాషా, మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
నేడు ఈదుల్ ఫితర్
● నెలవంక దర్శనంతో ముగిసిన రంజాన్ ఉపవాసాలు ● ప్రత్యేక ప్రార్థనలకు ఈద్గా, మసీదుల్లో ఏర్పాట్లు పూర్తికొత్తగూడెంటౌన్ /కరకగూడెం/చండ్రుగొండ: ముస్లింలకు ఇష్టమైన రంజాన్ పండుగను శనివారం జరుపుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో ముస్లింలు నెల రోజులుగా పాటిస్తున్న రోజా ఉపవాసాలు విరమించారు. జిల్లా వ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. మసీద్, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్ చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని రైటర్బస్తీ సమీపంలో ఉన్న బోడగుట్ట ఈద్గాలో, రామవరంలోని 2 ఇంక్లైన్ ఈద్గా, రుద్రంపూర్లోని ఈద్గాలతోపాటు కొత్తగూడెం త్రీటౌన్ సమీపంలోని మసీదులో, రామవరం, రుద్రంపూర్, కూలీలైన్, గౌతంపూర్, విద్యానగర్కాలనీ, పాత కొత్తగూడెం మసీదులతోపాటు పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లోని మసీదులను వేడుకలకు సిద్ధం చేశారు. నూతన వస్త్రాలు ధరించి ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహించుకోనున్నారు. కొత్తగూడెంలోని రామవరం జామియా మసీదు నుంచి ఉదయం 8 గంటలకు 2 ఇంక్లైన్లోని ఈద్గాకు, బోడగుట్ట వద్ద ఉన్న ఈద్గాకు సామూహికంగా చేరుకోనున్నారు. ఈద్గా వద్ద ఉదయం 9 గంటల నుంచి మత పెద్దలు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేయించనున్నారు. ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలుసూపర్బజార్(కొత్తగూడెం): ముస్లింలకు ఎస్పీ రోహిత్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో రంజా న్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. -
బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం శ్రీకారం చుట్టారు. అర్చకుల వేదమంత్రాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ సాగిన ఈ వేడుకతో భద్రగిరిలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. ఉదయం మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి తీర్థబిందెలతో నదీ జలాన్ని తీసుకొచ్చి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. ముందుగా కల్యాణ తంతులో పాల్గొనే రుత్విక్లకు, అర్చకులకు దేవస్థానం ఏఈవో శ్రావణ్కుమార్ దీక్షా వస్త్రాలు అందజేశారు. అనంతరం మూలమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు, నిత్యకల్యాణ మూర్తులకు, ఆచార్య, బ్రహ్మ, రుత్విక్లకు దీక్షా కంకణధారణ చేశారు. స్వామి వారికి ఉత్సవాంగ స్నపనం.. అంకురార్పణను పురస్కరించుకుని బేడా మండపంలో స్వామివారికి ఉత్సవాంగ స్నపనం(అభిషేకం) నిర్వహించారు. తొమ్మిది రకాల పండ్ల రసాలు, పంచామృతం, ఇతర నదీ, సముద్ర జలాలతో పాటు పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకం గావించాక ప్రత్యేక హారతి సమర్పించారు. సాయంత్రం మత్స్యంగ్రహణం నిర్వహించారు. ఆ తర్వాత వాస్తుహోమం జరిపి యాగశాల ప్రవేశం చేశారు. యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ, అఖండదీపారాధన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈ పూజల్లో స్థానాచార్యులు స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. -
రామాలయ అర్చకులకు ఉగాది పురస్కారాలు
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమా చార్యులు, రుగ్వేద పండితులు కేవీకేఎస్ కామేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైదరాబాద్లో ఉగాది పురస్కారాలు అందజేసింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హన్మంతరావు చేతుల మీదుగా వారు అవార్డులు అందుకున్నారు. భద్రగిరి మార్ట్ పనులు పూర్తి చేయాలిభద్రాచలంటౌన్: భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్న ‘భద్రగిరి మార్ట్’ అభివృద్ధి పనులను ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మార్ట్ పనులను పరిశీలించి మాట్లాడారు. శ్రీరామనవమి నాటికి మార్ట్ను ప్రారంభించాల్సి ఉన్నందున పెయింటింగ్, ర్యాక్ ఫిట్టింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిత్యావసర సరుకులు అమర్చాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్ఓ ప్రభాకర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. కిన్నెరసానిలో ఉగాది సందడిఒకరోజు ఆదాయం రూ.20,520 పాల్వంచరూరల్: ఉగాది పర్వదినం సందర్భంగా కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి గురువారం జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్ పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 288 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్లైఫ్ శాఖకు రూ.15,920, 100 మంది బోటింగ్ చేయడం ద్వారా టూరిజం శాఖకు రూ.4,600 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1,020 మె.టన్నుల యూరియా చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్కు సీఐఎల్ కంపెనీకి చెందిన 1,020.80 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 20.20.0.13 కాంప్లెక్స్ ఎరువులు గురువారం చేరాయి. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేయడంతో పాటు కొంత మేర బఫర్ స్టాక్గా నిల్వ చేసినట్లు డీఏఓ పుల్లయ్య తెలిపారు. ‘సీ్త్ర జీవిత చిత్రణ’కు డాక్టరేట్ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంకు చెందిన పెద్దపల్లి తేజస్వికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ‘తెలంగాణ కథా రచయిత్రులు–సీ్త్ర జీవిత చిత్రణ(1991–2015)’ అంశంపై డాక్టర్ నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో ఆమె పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, తేజస్వి రాసిన కథలు, పరిశోధనాత్మక వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం కాగా, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లోనూ ఆమె పత్రాలు సమర్పించారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అశ్వాపురం/గుండాల : జిల్లాలో గురువారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులు బీభత్సం స్పష్టించాయి. ఈదురుగాలులకు మొండికుంట నుంచి అశ్వాపురం వరకు మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై పలు చోట్ల చెట్లు రహదారిపై నేలకూలాయి. మొండికుంట–భద్రాచలం రహదారిపై నెల్లిపాక వద్ద రహదారిపై చెట్టు నేలకొరిగింది. రహదారులపై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. చెట్లు తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉదయం నుంచి మబ్బులు పట్టడంతో ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రైతులు కల్లాల్లోని పంటను కాపాడుకునేందుకు పట్టాల కోసం పరుగులు తీశారు. మధ్యాహ్నం ఓ మోస్తరు వర్షం కురిసింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. మొక్కజొన్న చేలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పండుగ పూటా.. తప్పని దీక్ష !
సూపర్బజార్(కొత్తగూడెం): భూ సమస్య పరిష్కారం కోసం అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆదివాసీలు కలెక్టరేట్ ధర్నాచౌక్లో చేపట్టిన ఆత్మగౌరవ నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాటికి నాలుగో రోజుకు చేరింది. కాగా, అందరూ ఉత్సాహంగా ఉగాది పండుగ జరుపుకుంటే తాము మాత్రం పిల్లా పాపలతో ఇలా ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయమని రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావు అన్నారు. తమ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన హామీని ఇప్పటికై నా అమలు చేయాలని ఆయన కోరారు. -
కాలేజీలో గ్యాంగ్వార్!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి ఉమ్మడి రాష్ట్రంలోనే ఘనమైన చరిత్ర ఉంది. కొత్తగూడెంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు, దానికి అనుబంధంగా ఇక్కడ విస్తరించిన, రాబోయే పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే లక్ష్యంతో 1957లో ఇక్కడ కమ్యూనిటీ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించారు. తొలుత మైనింగ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో కోర్సులు ప్రారంభమైనా క్రమేపీ ఇతర కోర్సులూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కాలేజీలో సివిల్, ఈఈఈ, ఈసీసీ, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఉండగా, మూడేళ్ల కోర్సుకు సంబంధించి అన్ని విభాగాల నుంచి 1,024 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కాలేజీకి పక్కనే 1962లో ప్రభుత్వం ఐటీఐని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎనిమిది ట్రేడ్లలో కలిపి 700 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ రెండు కాలేజీల క్యాంపస్లతో రుద్రంపూర్ – రామవరం ప్రాంతాలు కళకళలాడేవి. ఈ కాలేజీల్లో చదువుకున్న వేలాది మంది నేడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. తరచూ గొడవలు.. యువ రక్తం ఉప్పొంగే వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఒకే చోట ఉండడంతో సహజంగానే గ్రూపులు ఏర్పడడం, తమ గ్రూప్ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయడమనేది అన్ని కాలేజీల్లో లాగే ఇక్కడా ఉండేది. అయితే ఇటీవల ఈ గ్రూపు గొడవలు ముదిరి గ్యాంగ్ వార్ దశకు చేరుకుంటున్నాయి. తమ గ్యాంగ్ పైచేయి సాధించేందుకు బయటి వ్యక్తుల సాయం తీసుకునేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో యువకుల ఆవేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బయటి శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా ఈ కాలేజీ విద్యార్థులకు సమీపంలో ఉన్న రుద్రంపూర్, గౌతంపూర్, 4 ఇంక్లైన్, 3 ఇంక్లైన్, రామవరం ప్రాంతాల్లో ఉండే ‘అన్న’లతో టచ్లోకి వెళ్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పికెట్ అవసరం కాలేజీ ప్రతిష్ట, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఈ గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీలో మొదలైన గొడవ నివురుగప్పిన నిప్పులా మారింది. బయటి వ్యక్తులు తమ ఇమేజ్ పెంచుకునేందుకు కాలేజీ విద్యార్థులను తరచుగా రెచ్చగొడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో వార్షిక పరీక్షలు ముగిసే లోగా ‘లెక్కలు తేల్చుకుందాం’ అనే ధోరణి ఇక్కడ పెరుగుతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కొత్తగూడేనికి వన్నె తెచ్చిన కాలేజీల ప్రతిష్టకు మచ్చ రాకుండా, ఇక్కడి విద్యార్థుల భవిష్యత్కు ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కాలేజీలో పరిస్థితిని పరిశీలించి గస్తీ పెంచడం, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే పికెట్ ఏర్పాటు చేయాలని రామవరం – రుద్రంపూర్ వాసులు కోరుతున్నారు.క్యాంపస్లోకి బయటి వ్యక్తుల రాక ఇటీవల పాలిటెక్నిక్ కాలేజీలో క్రీడా పోటీలు జరిగాయి. వందలాదిగా విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరిచే క్రమంలో బయటి వ్యక్తులు కూడా కాలేజీ లోపలికి వచ్చారు. ఈ క్రమంలో ఉత్కంఠగా సాగుతున్న పోరులో గెలిచిన – ఓడిన టీమ్ల మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే క్యాంపస్లోకి బయటి వారి జోక్యం మితిమీరగా, క్రీడల సందర్భంగా రేగిన చిచ్చు రగులుతూ వచ్చింది. చివరకు ఈనెల 11న కొందరు బయటి వ్యక్తులు కాలేజీ తరగతి గదుల్లో దూరి మరీ ఓ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. ఆధునిక వసతులు, విశామైన తరగతి గదులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న కాలేజీలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అధ్యాపకులు అప్రమత్తమయ్యారు. కాలేజీ లోపలకు ఇతరులకు స్వాగతం పలికిన కొందరు విద్యార్థులను గుర్తించి మందలించారు. మరికొందరి తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పారు. దీంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది. -
ఇస్రో పిలుస్తోంది..
● అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ● తొమ్మిదో తరగతి వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 31 తుది గడువుకొత్తగూడెంఅర్బన్: ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచేందుకు భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) యువికా–26 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం శిక్షణ ఇస్తూ, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇస్రో అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ‘యంగ్ సైంటిస్ట్’ పేరిట యువ విజ్ఞాన కార్యక్రమ్(యువికా) పేరిట నిర్వహించే శిక్షణకు ఈనెల 31లోగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో విద్యార్థులను ఎంపిక చేసేందుకు 8వ తరగతి మార్కులకు 50 శాతం, అదే తరగతిలో సామాన్య, సాంఘిక మార్కులకు 10 శాతం, ఆన్లైన్ క్విజ్ ప్రతిభకు 10, విజ్ఞాన సదస్సు ద్వారా 10, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు 5, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. 2024లో ఓ విద్యార్థినికి అవకాశం.. యువికా – 2024లో కొత్తగూడెం ఎస్ఆర్డీజీ పాఠశాల విద్యార్థిని బి.రిత్వికకు అవకాశం లభించింది. హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రంలో రిత్విక శిక్షణ పొందింది. ప్రస్తుతం ఇంటర్ చదువుతుండగా, భవిష్యత్లో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే కష్టపడుతున్నానని తెలిపింది. ఇక యువికా – 2026లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసి, 14 రోజుల శిక్షణకు అర్హత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆకాంక్షిస్తున్నారు. జిల్లాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష పరిశోధన రంగాలపై అవగాహన కల్పించడంతో యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది. అర్హత గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బి.సంపత్కుమార్, జిల్లా సైన్స్ అధికారిప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎంపికై న విద్యార్థులకు మే నెలలో 14 రోజులు శాస్త్ర, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రయోగాత్మక ప్రదర్శన, చాట్, సందర్శన, నిపుణులతో ప్రయోగాలు, ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలను వివరించనున్నారు. అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి, లేదంటే గైడ్ ఉపాధ్యాయుడి ప్రయాణ ఖర్చులను ఇస్రో భరించనుంది. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా కావాలనే ఆశయం ఉన్నా.. సరైన అవకాశాలు లేక చాలా మంది విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. వారి కలలకు మరింతగా బలం చేకూర్చేలా ఇస్త్రో అవకాశం కల్పించడం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల తల్లిదండ్రులు సైతం స్వాగతిస్తున్నారు. -
సరికొత్తగా స్వాగతం
నూతన తెలుగు సంవత్సరాదికి జిల్లా వాసులు ఘనంగా స్వాగతం పలికారు. పరాభవ నామ ఉగాదిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో గురువారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులుదీరారు. స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా, సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఇళ్లలోనూ పూజలు చేసి, పిండివంటలు, షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు ఆరగించారు. పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – నెట్వర్క్ -
102తో మెరుగైన సేవలు
దుమ్ముగూడెం : ఏజెన్సీ ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో 102 వాహనాలు గర్భిణులకు మెరుగైన సేవలందిస్తున్నాయి. గర్భిణులను ఆస్పత్రికి చేర్చడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు వీటిని వినియోగిస్తున్నారు. గతంలో ఆటోలు, మ్యాజిక్ల ద్వారా గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లేవారు. 102 వాహనాలు ఏర్పాటు చేశాక ఆశ వర్కర్లు గర్భిణులను ప్రతి నెలా సమీపంలోని పీహెచ్సీలకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. మండలంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 102 వాహనాలు గర్భిణులకు చేయూతనందిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 21 అమ్మఒడి(102) వాహనాలు నిరుపేద గర్భిణులకు సేవలందిస్తున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని 102 వాహనం రోజుకు 15 మంది గర్భిణులు, బాలింతల చొప్పున నెలకు 450 నుంచి 500 మందిని ఆస్పత్రికి చేర్చుతోంది. మండలంలోని పర్ణశాల, దుమ్ముగూడెం, నర్సాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో సేవలందిస్తోంది. -
వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీదేవీ వసంత నవరాత్రి మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఈ వేడుకలు నిర్వహించనుండగా వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలశ స్థాపన పూజ చేశారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్య ప్రాసన, రుత్విక్కరణ, దీక్షావస్త్ర ధారణ, అఖండ దీపారాధన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష కుసుమార్చన తదితర పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఈఓ రజనీకుమారి, రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, ఎస్కె.సాబీర్పాషా, ముత్యాల విశ్వనాధం, ధర్మకర్తలు చీకటి కార్తీక్, బి.గిరిప్రసాద్, పెండ్లి రాంరెడ్డి, చందుపట్ల రమ్య, చెవుగాని పాపారావు, సీహెచ్.శేఖర్బాబు, దుగ్గిరాల సుధాకర్, అడుసుమల్లి సాయిబాబు, శనిగారపు శ్రీనివాసరావు, మూర్తి రవికుమార్, ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
జూలూరుపాడు: పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గురువారం జూలూరుపాడు పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 18న జూలూరుపాడు పోలీస్స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను తనిఖీ చేయగా 52 ప్యాకెట్లలో 105.54 కిలోల గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ 52.77 లక్షలు ఉంటుందని అంచనా. రెండు కార్లలోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి నుంచి ఖమ్మం, హైదరాబాద్ మీదుగా షిరిడీకి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం ఎర్రగాళ్లపల్లి గ్రామానికి చెందిన శివాకర్ ప్రమోద్ కుమార్, దేవరకొండ ఖిల్లా బజారుకు చెందిన బైరిశెట్టి భార్గవ్, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం బీఏ రెడ్డి నగర్కు చెందిన అంధేకర్ శ్రీనివాస్లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు అభి, లక్ష్మణ్, షారుక్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకునేందుకు కృషి చేసిన సీఐలు రమాకాంత్, శ్రీలక్ష్మి, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, రవిలను డీఎస్పీ అభినందించారు. 105 కిలోలు పట్టివేత, ముగ్గురి అరెస్ట్ -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
చుంచుపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంది రమ్మ ఇళ్లు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, భూ సమస్యలకు పరిష్కారం వంటిహామీలు అమలు చేయడం లేదని ఆరోపించా రు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై ఈ నెల 20న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు భూక్యా రవి, బలగం శ్రీధర్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వరంగల్ జిల్లా ఇంటికన్నె – నెక్కొండ స్టేషన్ల మధ్య బుధ వారం ఈ ఘటన జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన జెట్టి పెంటయ్య(48) హైదరాబాద్లో కేర్ టేకర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి కొత్తగూడేనికి రైలులో బయలుదేరిన ఆయన మార్గమధ్యలో ప్రమాదవశాత్తు జారిపడడంతో మృతిచెందాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు మోహన్రా వుకు మృతదేహాన్ని అప్పగించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. ముగ్గురికి జరిమానాటేకులపల్లి: ముగ్గురు ముద్దాయిలకు రూ.30వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సి పల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కీర్తి చంద్రికరెడ్డి బుధవారం తీర్పు వెల్లడించారు. పాతతండాకు చెందిన భూక్య రవీందర్, భూక్య అరుణ్, భూక్య బాబులు తనపై దాడిచేశారని అదే తండాకు చెందిన ఇస్లావత్ నారాయణ 2021లో టేకులపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. కోర్టులో విచారణ జరగగా, న్యాయమూర్తి పైవిధంగా తీర్పు ఇచ్చారు.వృత్తి విద్యా కోర్సులపై దృష్టి సారించాలిపాల్వంచ: వృత్తి విద్యా కోర్సులపై యువత దృష్టి సారించాలని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కె.శ్రీరామ్ అన్నారు. బుధవారం నవ ఒకేషనల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, సోలార్ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందించి మాట్లాడారు. ‘ఉపాధి’ నిర్మాణాలు పూర్తి చేయాలిచండ్రుగొండ: ఉపాధి పథకం నిధులతో చేపట్టిన నిర్మాణాల పనులు పూర్తి చేయాలని డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. బుధవారం ఆమె మండలంలోని చండ్రుగొండ, రావికంపాడు, గుర్రాయిగూడెం గ్రామాల్లో పాఠశాల ప్రహరీ, వీఓ బిల్డింగ్, సీసీరోడ్డు, బస్టాండ్ ప్రాంగణంలో చేపట్టిన పనులను, డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఎంపీఓ ఖాన్, ఉపాధి ఏపీఓ శ్రీను పాల్గొన్నారు.కేవీకేలో రైతు సదస్సుసూపర్బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు బుధవారం కృషి విజ్ఞాన కేంద్రంలో రైతు సదస్సు కిసాన్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ యాకాద్రి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ రైతులు భూ సార పరీక్ష చేయించుకుని అనుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. త్రీ ఇంక్లైన్ సర్పంచ్ ప్రవళ్లిక, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ భరత్, శరత్చంద్ర, శివ, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, సీనియర్ ప్రొఫెసర్ నాగాంజలి పాల్గొన్నారు. ‘కొబ్బరి’ ఆఫీస్ ఏర్పాటు చేయాలిఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ లోనే అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొబ్బరి తోటలు ఉన్నందున కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్లో బుధవారం ఆయన రైతుల ఆదాయం స్థిరీకరణ, మార్కెట్ భరోసా, మౌలిక వసతు ల అభివృద్ధి తదితర అంశాలతో పాటు బొగ్గు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై కేంద్రాన్ని ప్రశ్నించారు. కొబ్బరి తోటల విస్తీర్ణం దృష్ట్యా అశ్వారావుపేట లేదా దమ్మపేటలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేశారు. తద్వారా రైతులకు సాంకేతిక సాయం, నాణ్య మైన సాగు, మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అంతేకాక మొక్కజొన్నలకు కనీస మద్దతు ధర దక్కక రైతులు నష్టపోతున్నందున దృష్టి సారించాలని కోరారు. చర్యలు తీసుకోవాలిపాల్వంచ: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు తలారి జ్యోతి కోరింది. బుధవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.35 లక్షలు తీసుకున్నాడని ఆరోపించింది. డబ్బులు ఇస్తానంటే విజయవాడ వెళ్లగా, అక్కడి నుంచి కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లి బంధించాడని పేర్కొంది. తన వద్ద ఉన్న ఆధారాలు లాక్కుని తిరిగి 20 రోజుల తర్వా త పాల్వంచకు పంపించాడని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించింది. ఈ విషయమై ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు రా లేదని తెలిపారు. గతంలో ఆమెనే మిస్సింగ్ కావడంతో కేసు నమోదు చేశామని, బూర్గంపాడులో తండ్రే ఆమైపె కేసు పెట్టినట్లు సమాచారం ఉందని వివరించారు. -
ట్రాక్టర్, బొలెరో వాహనం ఢీ
●13 మంది కూలీలకు గాయాలు అశ్వారావుపేటరూరల్: బొలెరో వాహనం, ట్రాక్టర్ ఢీకొని 13 మంది కూలీలు గాయపడ్డ ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్త మామిళ్లవారిగూడెం, బోర్యాలగుట్ట, కోర్సగూడెం, ఊసిర్లగూడెం గ్రామాలకు చెందిన 17 మంది కూలీలు ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం కామయ్యపాలేనికి వర్జీనియా పొగాకు గ్రేడింగ్ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని బొలెరో వాహనంలో తిరిగి స్వగ్రామాలకు వస్తున్నారు. అదే సమయంలో గుమ్మడవల్లి వైపు నుంచి తాటి దుంగల లోడ్తో ట్రాక్టర్ వస్తోంది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం వద్దనున్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో కె.సుజాత, కె.రాంబాబు, దుర్గమ్మ, నాగలక్ష్మి, పెద్ద వెంకటేష్లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పెద్ద వెంకటేష్, కె.రాంబాబు వ్యాన్ కేబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఎం.పావని, ఎం.సుకన్య, సీహెచ్ కోటేష్, సీహెచ్.జగదాంబ, పి.భవాని, సీహెచ్ పుల్లయ్య, కె.రమణ, ఎం.శివలు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలు కాగా, బొలెరో వాహనం ధ్వంసమైంది. ఎస్ఐ యయాతీ రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బొలెరో, లారీ ఢీకొని ముగ్గురికి.. పినపాక/మణుగూరుటౌన్: బొలెరో వాహనం, లారీ ఢీకొని ముగ్గురు మిర్చి కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, కూలీల కథనం ప్రకారం.. మణుగూరు మండలం సింగారం గ్రామానికి చెందిన కూలీలు మిర్చి ఏరేందుకు బొలెరో వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో దుగినేపల్లి సమీపంలో రాజపేట నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కూలీలు ధరావత్ లక్ష్మి, మునిషా య మ్మ, జి. లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మణుగూరు, భద్రాచలం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. కాగా బాధితులను సర్పంచులు పూనెం రమేష్, జగిడి ప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, సీపీఐ నాయకుడు జంగం మోహన్రావు, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్, శివసైదులు పరామర్శించారు. -
టిప్పర్ దగ్ధం
టేకులపల్లి: ప్రమాదవశాత్తు టిప్పర్ దగ్ధమైన ఘటన మంగళవారం రాత్రి జరి గింది. బాధితుడి కథనం ప్రకారం.. మండలానికి చెందిన కత్తుల వెంకన్న తన టిప్పర్లో కేటీపీఎస్ నుంచి యాష్ తీసుకెళ్లి నామాలపాడు ఇటుక బట్టీల వద్ద అన్లోడ్ చేసి తిరిగి అర్ధరాత్రి టేకులపల్లికి బయలుదేరాడు. తొమ్మిదోమైలుతండా దాటాక రాత్రి 2 గంటల సమయంలో ఇంజిన్లో పొగలు వస్తుండటంతో టిప్పర్ని రోడ్డు పక్కకు నిలిపాడు. క్లీనర్ అశోక్తోపాటు కిందకు దిగి చూడగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. పొగ గమనించి వాహనం దిగడంతో యజ మాని, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, అటుగా వెళ్తున్న భూక్య మధు అనే వ్యక్తి సమాచారంతో ఇల్లెందు ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఇంజిన్ పూర్తిగా దగ్ధమైంది. యాష్ రవాణా చేసిన డబ్బులు రూ.20వేలు కూడా కాలిపోయాయని, మొత్తం రూ.14లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వెంకన్న వాపోయాడు. వారపు సంత టెండర్ వాయిదాకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన దినసరి మార్కెట్, వారపు సంత బహిరంగ టెండర్ ప్రక్రియ వాయిదా పడింది. టెండర్ బాక్స్కు సీల్ వేసి లేకపోవడం, సమాచారం ఇవ్వకుండా టెండర్ల ప్రక్రియ నిర్వహించడంతో కాంట్రాక్టర్లు, కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగడంతో అధికారులు వాయిదా వేశారు. కబేళాను రూ.1.10 లక్షలకు ఎస్కె.ఖదీర్పాషా దక్కించుకున్నారు. వారపు సంత, దినసరి మార్కెట్కు మళ్లీ టెండర్ను నిర్వహిస్తామని కమిషనర్ సుజాత ప్రకటించారు. మేయర్ గణేష్ పాల్గొన్నారు. -
రమణీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. త్వరలో సఫారీ టూర్పాల్వంచరూరల్ : కిన్నెరసాని అభయారణ్యంలో పర్యాటకులు సహజసిద్ధ అటవీ ప్రాంతంలో సంచరించే జంతువులను చూసేందుకు వీలుగా వచ్చేనెల 15 – 20 తేదీల్లో సఫారీ టూర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు డీఎఫ్ఓ జి.కృష్ణాగౌడ్ తెలిపారు. బుధవారం ఆయన కిన్నెరసానిలోని డీర్ పార్క్ను, చైన్లింక్, ఔషధ మొక్కల ప్లాంటేషన్ పనులను వైల్డ్లైఫ్ ఎఫ్డీఓ బాబుతో కలిసి సందర్శించారు. అనంతరం జలాశయంలో బోటు ద్వారా ట్రెక్కింగ్ పాయింట్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి వాచ్టవర్ ఎక్కి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కిన్నెరసాని నుంచి జలాశయంలో అటవీ శాఖ బోటు ఎక్కి మందరెకలపాడులోని వాచ్ టవర్ వెళ్లిన వీక్షకులు అక్కడ నుంచి సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లి తిరిగి అక్కడికే చేరుకునేలా, లేదంటే డీర్ పార్క్ వద్దే సఫారీ వాహనంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లి.. తిరిగి అక్కడే దిగేలా.. మొత్తంగా మూడు వాహనాలు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ఒక్కో వాహనంలో తొమ్మిది మంది ప్రయాణించవచ్చన్నారు. దీని ప్యాకేజీ వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు నేడు శ్రీకారం
● మత్స్యంగ్రహణం, వాస్తు హోమంతో అంకురార్పణ ● ఆలయంలో నూతన తెలుగు సంవత్సరాది వేడుకలు ● చలువ పందిళ్లతో నవమి శోభ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం ఉత్సవమూర్తులకు ఉత్సవాంగ స్నపనం, మత్స్యంగ్రహణం, వాస్తుహోమం తదితర పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. కల్యాణ రుత్విక్లు, బ్రహ్మ, అర్చకులకు దీక్షా వస్త్రాలు అందజేస్తారు. సాయంత్రం కల్ప వృక్ష వాహనంపై స్వామివారికి తిరువీధి సేవ నిర్వహిస్తారు. అలాగే పరాభవ నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సరాది వేడుకలు ప్రారంభించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. చివరగా ఉగాది పచ్చడిని స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకు పంపిణీ చేస్తారు. ఐదు నుంచి తొమ్మిది రోజులకు... భద్రగిరి దివ్యక్షేత్రంలో తొలుత ఐదు రోజుల పాటు పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. కాలక్రమేణ అది ఏడు రోజులకు(సప్తాహ్నిక), ప్రస్తుతం నవాహ్నిక (తొమ్మిది రోజులు) తిరుకల్యాణోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగినా, తిరుకల్యాణోత్సవాలు ఈనెల 25న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగియనున్నాయి. 26న సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, 27న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. చలువ పందిళ్లతో పెళ్లికళ.. వేసవి కాలంలో సీతారాముల కల్యాణం అంటే చలువ పందిళ్లే గుర్తొస్తాయి. ప్రస్తుత ట్రెండ్కు తగినట్టుగా షామియానాలు, ఇతరత్రా సౌకర్యాలు వచ్చినప్పటికీ స్టేడియంపైన, ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో వెదురుతో కూడిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం భద్రాచలంలో ప్రత్యేకత. వీటితో భక్తులకు వేసవిలో ఉపశమనం కలిగించేలా చల్లటి వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. -
ప్రాధాన్యతా రంగాలకు రుణాలివ్వండి
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాలు పెంచేలా బ్యాంకర్లు దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడీఓసీలో బుధవారం నిర్వహించిన డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట రుణాల పంపిణీ తక్కువగా ఉన్న బ్యాంకు అధికారులను కారణమేంటని ఆరా తీశారు. రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో రెన్యువల్ చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ 3.24 కోట్ల లక్ష్యానికి రూ 12.37 కోట్లు మంజూరు చేసి 381.79 శాతం సాధన నమోదు కావడం అభినందనీయమన్నారు. ఇతర విభాగాలలో రూ.152.35 కోట్ల లక్ష్యానికి రూ 62.82 కోట్లు మాత్రమే మంజూరు చేశారని అన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ, ఎన్పీఏల తగ్గింపు, పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, ముద్ర, విశ్వకర్మ తదితర రుణాలపై చర్చించారు. అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టాలి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, అక్రమ రవాణా, సాగు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రోహిత్రాజ్తో కలిసి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలకు ఆధునిక యంత్రాల ఏర్పాటుపై సమగ్ర నివేదికలు సమర్పించాలని సూచించారు. గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి సాగును గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలల్లో ప్రతీ బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు కేసుల వివరాలను తమకు అందించాలని కోరారు. అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లా అయినందున మాదకద్రవ్యాల రవాణా అధికంగా ఉండే అవకాశం ఉందని, గత నెలలో సుమారు 6వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆయా సమావేశాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, ఎల్బీఎం రామిరెడ్డి, మత్స్య శాఖాధికారి ఇంతియాజ్ ఖాన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్, ఆర్టీఓ వెంకటరమణ, డీఐ అశ్విని పాల్గొన్నారు. విద్యార్థుల పఠనా సామర్థ్యంపై దృష్టి పెట్టాలి టేకులపల్లి: విద్యార్థుల పఠనా సామర్థ్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ అంకిత్ ఉపాధ్యాయులకు సూచించారు. టేకులపల్లి, కోయగూడెం పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, వారికి అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పాఠశాల భవనాల స్లాబ్ పెచ్చులు ఊడిపోవడం, ఆవరణలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టేకులపల్లిలో పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. కోయగూడెం బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పరిశీలించారు. కొందరు విద్యార్థులు చదువులో వెనుకబడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీఓ శ్రీరామ్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ బైరు మల్లేశ్వరి, వైద్యాధికారి వెంకటేశ్ తదితరులు ఉన్నారు. -
మ్యూజియం.. గిరిజన సంస్కృతికి నిదర్శనం
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బూర్గంపాడు/భద్రాచలంటౌన్/ దుమ్ముగూడెం : భద్రాచలంలో నిర్మించిన మ్యూజియం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా ఉందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఆయన జిల్లాకు రాగా, సారపాక ఐటీసీ గెస్ట్హౌస్ వద్ద పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని, పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంత విశిష్టతను తెలుసుకున్నాక గోదావరిలో బోటు షికారు చేశారు. అనంతరం భద్రాచలంలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనుల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కళాఖండాలు, పాతకాలపు ఇళ్ల నమూనాలు అద్భుతంగా ఉన్నాయని, మ్యూజియంలోని ప్రతి అంశంపై పర్యాటకులకు మరింత అవగాహన కల్పించేలా వీడియో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమానికి ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అంతకుముందు ఐటీడీఏ అధికారులు ఘన స్వాగతం పలికి, ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, ఎస్సీ డెవలప్మెంట్ అధికారి శ్రీలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్, ఐటీడీఏ ఈఈ మధుకర్, బూర్గంపాడు తహసీల్దార్ కేఆర్కేవీ ప్రసాద్, ఏటీడీఓ చంద్రమోహన్, ఏఎస్డబ్ల్యూఓ హనుమంతరావు, అధికారులు అక్షయ్ సమ్మయ్య, ఉదయ్కుమార్, ప్రభాకర్, వేణు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.


