breaking news
Bhadradri District News
-
గజలక్ష్మిగా జగన్మాత
నేడు ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారుభద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం లక్ష్మీతాయారు అమ్మవారిని.. చెదరని అధికారం, తరగని సంపదను ప్రసాదించే గజలక్ష్మి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించగా మహిళలు భారీగా హాజరయ్యారు. కాగా, చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అయోధ్య కాండ పారాయణం చేశారు. నేటి ధనలక్ష్మి అలంకార విశిష్టత.. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం..’ అంటూ శ్రీ సూక్తం అమ్మవారిని ధనలక్ష్మిగా కీర్తిస్తుంది. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. విద్య, బలం, కీర్తి మొదలైనదంతా ధనమేనని, విద్యాధనం, హిరణ్య ధనం, శక్తి ధనాలను ప్రసాదిస్తుంది కాబట్టే ఈ అమ్మకు ధనలక్ష్మిగా పేరని, ముగ్గరమ్మల శక్తిని భక్తులకు పంచుతుందని పండితులు చెబుతున్నారు. నేత్రపర్వంగా రామయ్య కల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ఎవరికీ పట్టని ఆదివాసీల వ్యథ
సూపర్బజార్(కొత్తగూడెం): అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో 150 మంది ఆదివాసీ రైతులకు సంబంధించిన 573.20 ఎకరాల భూమి విషయంలో అటవీ, ఎఫ్డీసీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం కొనసాగుతోంది. ఉమ్మడి ఏపీగా ఉన్న కాలం నుంచే రైతులు అనేక పోరాటాలు చేసినా భూములు మాత్రం దక్కలేదు. ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చిందని, ఈ భూమి తమదేనంటూ హైకోర్టు సైతం 2011లో తీర్పు చెప్పిందని, అయినా భూమి మాత్రం తమకు దక్కలేదని ఆదివాసీలు అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గత జూన్ 9న ఆదివాసీలంతా కలిసి మూడురోజుల పాటు రామన్నగూడం నుంచి కలెక్టరేట్కు పాదయాత్రగా వచ్చి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వారి వద్దకు వచ్చి సమస్యను కలెక్టర్కు వివరించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అయితే మూడు నెలలు గడిచినా పరిష్కారం కాకపోవడంతో తిరిగి కలెక్టరేట్ పక్కన అధ్వాన స్థితిలో ఉన్న ధర్నాచౌక్ వద్ద శుభ్రం చేసుకుని పిల్లాపాపలతో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఆందోళన గురువారం నాలుగో రోజుకు చేరుకుంది. అక్కడే వంటావార్పు చేసుకుంటూ, విద్యుత్ సౌకర్యం లేకున్నా టార్చిలైట్ల వెలుతురులో కాలం గడుపుతున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని ధర్నాచౌక్లో ఇబ్బందులు పడుతూ నిరాహారదీక్ష చేస్తున్నా ఆదివాసీల ఆందోళన నాలుగు రోజులుగా బయటి ప్రపంచానికి తెలియలేదు. గురువారం జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఆరేం ప్రశాంత్, పాల్వంచ మాజీ ఎంపీపీ మడవి సరస్వతి, ఆదివాసీ నాయకులు సోయం సత్యనారాయణ, సోయం లక్ష్మయ్య, పూనెం నాగేశ్వరరావు వారికి మద్దతు తెలపగా ఈ విషయం వెలుగుచూసింది. కాగా, తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
మద్యం టెండర్లకు రెడీ..
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ● అక్టోబర్ 18 వరకు గడువు, 23న డ్రా ● ఫీజు గతేడాది కంటే రూ.లక్ష పెంపుకొత్తగూడెంఅర్బన్: నూతన మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, అదే నెల 23న డ్రా తీస్తారు. టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి మద్యం దుకాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న దుకాణాలకు నవంబర్ 30తో గడువు ముగియనుంది. ప్రస్తుతం దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు దరఖాస్తుదారులు అమ్మవారి ఆలయాలు, మండపాల వద్ద పూజలు జరిపించి టెండర్లు వేసే అవకాశం ఉందని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. అయితే గతేడాది కంటే ఈ సంవత్సరం టెండర్ ఫీజు రూ. లక్ష పెంచడంతో దరఖాస్తుదారులకు అదనపు భారం కానుంది. జిల్లాలో 88 వైన్స్.. జిల్లాలో ప్రస్తుతం 88 వైన్స్ ఉన్నాయి. 2023లో జరిగిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో రూ.2 లక్షల ఫీజుతో మొత్తం 5,057 దరఖాస్తులను స్వీకరించిన ఎకై ్సజ్ అధికారులు డ్రా పద్ధతిలో 88 మందికి లైస్సెన్స్లు జారీ చేశారు. ప్రస్తుతం దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలకు పెంచినా పాతవారు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.. జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా కొత్తగూడెంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేటల్లో ఆయా స్టేషన్ల పరిధిలోని వారు ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు అందించేలా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫీజు గతేడాది కంటే రూ.లక్ష పెంచడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా.. దరఖాస్తుదారుల సంఖ్య గతం కంటే తగ్గొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా 2027 నవంబర్ 30 వరకు కాలపరిమితి ఉంటుంది. కొత్త మద్యం దుకాణాల కోసం టెండర్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశాం. స్టేషన్ల వారీగా దరఖాస్తులు స్వీకరిస్తాం. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాం. శుక్రవారం నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. –జానయ్య, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జిల్లాలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్, జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో గురువారం లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో ఏ–4 మద్యం దుకాణాలు 88 ఉండగా, 44 షాపులను ఏజెన్సీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 44 షాపుల్లో ఎస్సీలకు ఏడు, గౌడ కులస్తులకు ఆరు, జనరల్ వారికి 31 కేటాయించారు. -
నిధుల్లేక నీరసం..
బూర్గంపాడు: గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర కాలంగా నిధులు రాక పల్లెలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలం కావడంతో వీధులన్నీ బురదమయంగా మారాయి. రాత్రి వేళ కనీసం వీధిలైట్లు కూడా వేయలేని పరిస్థితుల్లో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ప్రస్తుతం బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా రాత్రి అయిందంటే చీకట్లో వెళ్లలేక ఆడపడుచులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకాలం సొంత డబ్బుతో గ్రామాల్లో పనులు చేయించిన పంచాయతీ కార్యదర్శులు అప్పుల్లో కూరుకుపోయారు. ట్రాక్టర్ల డీజిల్, రిపేర్లు, తాగునీటి సరఫరాలో లైన్ల మరమ్మతులకు కూడా నిధుల కొరత వేధిస్తోంది. వీధుల్లో బురద పేరుకుపోగా బ్లీచింగ్ కొనేందుకు సైతం డబ్బు లేక కార్యదర్శులు ఏ పనీ చేయలేకపోతున్నారు. పేరుకుపోతున్న చెత్త.. 2024 జనవరిలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 18 నెలలుగా నిధులు నిలిచిపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై భారం పడుతోంది. పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు అప్పులు చేసి అత్యవసర పనులు చేయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సైతం చేపట్టలేక ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతోంది. ఇక ఇంటి పన్నులు, వార సంతల నిర్వహణ, దుకాణాల అద్దె, ఇతరత్రా వస్తున్న ఆదాయాన్ని పంచాయతీల జనరల్ ఫండ్ ఖాతాలో జమచేయాలి. అయితే జనరల్ ఫండ్ నిధులను ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టడంతో కార్యదర్శులు కనీసం ఆ డబ్బు కూడా వాడుకునే అవకాశం లేదు. ఫ్రీజింగ్ తొలగించి ఆ నిధులు వాడుకునే అవకాశం కల్పించాలని, తద్వారా కనీస అసవరాలైనా తీర్చొచ్చని కార్యదర్శులు అంటున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికే చిన్న పంచాయతీల కార్యదర్శులు రూ.2 లక్షలకు పైగా, పెద్ద పంచాయతీల వారు రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పు చేసి వివిధ పనులు చేయించారు. అయితే ప్రస్తుతం తమకు అప్పు ఇచ్చేవారు కూడా లేరని గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలకు 18 నెలలుగా నిధులు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో నలిగిపోతున్నాం. గ్రామాల్లో ఏ పని చేయాలన్నా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది కార్యదర్శులు సాధ్యమైనంత మేర అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం అప్పులు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. జనరల్ ఫండ్ను వినియోగించుకోవాలంటే ట్రెజరీలో ఫ్రీజింగ్ నడుస్తోంది. – కిరణ్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడుఅప్పుల్లో పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగ వేళ గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. ఆ సమయంలో వీధిలైట్లు వెలగకపోవడంతో పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. ఇక వర్షాలు పడుతుండగా వీధుల్లో బ్లీచింగ్ చల్లాలి. కానీ బ్లీచింగ్, వీధి లైట్ల కొనుగోలుకు డబ్బులు లేక కార్యదర్శులు సతమతం అవుతున్నారు. స్థానికంగా సోషల్ మీడియా గ్రూప్ల్లో వెలగని వీధిలైట్ల ఫొటోలు పెడుతున్న కొందరు పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తున్నారు. బతుకమ్మ నిమజ్జనాల కోసం వాగులు, నదులు, చెరువుల వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో ఘాట్లు ఏర్పాటు చేయాలి. ఈ పనులన్నింటికీ నిధుల కొరత వేధిస్తుండగా కార్యదర్శులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ క్రమంలో వారు కూడా పండుగ ఎలా జరుపుకోవాలంటూ పంచాయతీ కార్యదర్శులనే నిలదీస్తున్నారు. -
బాధ్యతగా స్వచ్ఛత పాటించాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్చుంచుపల్లి: ప్రతీ పౌరుడు బాధ్యతగా స్వచ్ఛత పాటించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్తోపాటు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ ఇంటి నుంచి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతేనని పేర్కొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ సుజాత, మైనింగ్ ఏడీ దినేష్, గ్రౌండ్ వాటర్ ఏడీ రమేష్, మెప్మా పీడీ రాజేష్, ఉద్యోగులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
పాల్వంచరూరల్: అటవీ సంపదను కొందరికి కట్టబెట్టాలంటే మావోయిస్టులను చంపేస్తే అడ్డు ఉండదనే భావనతో పాలక వర్గాలు చేపడుతున్న ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్రం శాంతిచర్చలు జరపాలని, అప్పుడే శాంతి నెలకొంటుందని బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ విమలక్క అన్నారు. పాల్వంచ మండలం ఉల్వనూరులో గురువారం నిర్వహించిన బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విమలక్క గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని గిరిజనుల నివాసాలు, గిరిజన అశ్రమ బాలికల పాఠశాల మైదానంలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతిని విధ్వంసం చేయడమంటే ప్రజలపై యుద్ధం చేయడమేనని తెలిపారు. అలా కాకుండా ప్రకృతి రక్షణే ప్రజల రక్షణగా భావించాలని సూచించారు. బహుజనులు పంచ భూతాలను కాపాడుతుంటే బహుళజాతి కంపెనీలు వాటిని కబళిస్తున్నాయని ఆరోపించారు. వనరుల విధ్వంసం, వివక్షత, ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బహుజన బతుకమ్మ ఇక్కడికి కదిలి వచ్చిందని తెలిపారు. బహుళ పంటలతో విలసిల్లాల్సిన తెలంగాణ ఏకపంటల పద్ధతితో వలసలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈమేరకు ప్రకృతికి మూలమైన ఆడబిడ్డలు, దేశ మూలవాసులు ఆదివాసీలతో పాటు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్కౌంటర్లు లేని, ఆదివాసీ బిడ్డలు ఉపిరి పీల్చుకునే, పిల్లల భవిష్యత్ మంచిగా ఉండే తెలంగాణను అంతా కోరుకుంటున్నారని విమలక్క వ్లెడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరుణ, వాసం రుద్ర, మంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురికి గ్రూప్ –1 కొలువులు
దమ్మపేట/టేకులపల్లి/భద్రాచలంటౌన్ : గ్రూప్ –1లో జిల్లాకు చెందిన ముగ్గురు కొలువులు సాధించారు. దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు తాటి ప్రమోద్ సాయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మల్టీ జోన్ పరిధిలో ఉద్యోగం పొందనున్నారు. ఆయన తల్లి సుదర్శనమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, తండ్రి చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమోద్సాయి పాఠశాల విద్య అనంతరం ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుని, సివిల్స్, గ్రూప్ –1 ఉద్యోగాలకు సన్నద్ధం కాగా గత మే నెలలో ప్రకటించిన రాత పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 317వ ర్యాంకు సాధించారు. టేకులపల్లి మండలం కొత్తతండా(పి) గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మీప్రసన్న గ్రూప్–1లో సత్తా చాటి గ్రేడ్ – 2 మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సాధించారు. నాగార్జునసాగర్కు చెందిన లక్ష్మీప్రసన్నకు తొమ్మిది నెలల క్రితం కొత్తతండాకు చెందిన బానోత్ జనార్దన్తో వివాహమైంది. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, ఇంటర్, ఎంబీబీఎస్ హైదరాబాద్లో చదివారు. ఆ తర్వాత యూపీఎస్సీ లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాయగా మూడు సార్లు మెయిన్లో క్వాలిఫై అయినా ఇంటర్వ్యూలో ఉద్యోగం కోల్పోయారు. ప్రస్తుతం విజయం సాధించారు. కాగా, జనార్దన్ జీహెచ్ఎంసీలో టీపీబీఓగా పని చేస్తున్నారు. భద్రాచలం వైఎస్సార్ నగర్కు చెందిన ఎడారి రేవంత్ గ్రూప్–1లో మొదటి ప్రయత్నంలోనే డీపీఓగా ఉద్యోగం సాధించారు. స్థానిక సెయింట్ పాల్ స్కూల్లో పదో తరగతిలో ఉత్తమ ర్యాంక్, వరంగల్ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. తన తండ్రి కలైన ఐఏఎస్ సాధించాలనేది జీవిత లక్ష్యమని రేంవత్ చెప్పాడు. -
శ్రీ గాయత్రీదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచరూరల్: మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు.రామయ్యను దర్శించుకున్న సీఆర్పీఎఫ్ ఐజీభద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర సీఆర్పీఎఫ్ ఐజీ విపుల్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. రామయ్య సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఉపాలయాలను సందర్శించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, ఆలయ ఏఈఓ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.సీపీఐ జాతీయ సమితిలో ఇద్దరికి చోటుసూపర్జార్(కొత్తగూడెం): చంఢీఘర్లో ఐదు రోజులుగా జరుగుతున్న సీపీఐ జాతీయ మహాసభలు గురువారం ముగిశాయి. చివరి రోజున ఎన్నుకున్న కమిటీలో.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కూనంనేని 2005 నుంచి 2009 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2009, 2023లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సాబీర్పాషా విద్యార్థి దశ నుంచే చురుకై న పాత్ర పోషించి, యువజన, కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏడేళ్ల పాటు ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, 2001లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2002లో సీపీఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శిగా ఎంపికయ్యారు. భద్రాద్రి జిల్లా ఆవిర్భావం నుంచి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు.ఓయూ నుంచి డాక్టరేట్కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడేనికి చెందిన భూక్యా ప్రకాశ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం.వి.కృష్ణారావు పర్యవేక్షణలో ‘జియోపాలిమర్ కాంక్రీట్’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తి చేశారు. ఖమ్మంలో బీ.టెక్, హైదరాబాద్లో ఎం.టెక్ చదివి ప్రస్తు తం జీహెచ్ఎంసీ సర్కిల్–29, టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎన్ఏసీ సైట్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. తన డాక్టరేట్ను తల్లిదండ్రులు కిషన్, చంద్రిలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. -
గోదావరి ఘాట్ వద్ద భక్తుడిపై దాడి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని గోదావరి ఘాట్ వద్ద స్నానం చేస్తున్న ఓ భక్తుడిపై అక్కడే ఓ దుకాణం నడుపుకుంటున్న యువకుడు రాయితో దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం స్వామివారికి దర్శనానికి వచ్చిన మిర్యాలగూడకు చెందిన చెరుకు ఆంజనేయులు గోదావరిలో స్నానం ఆచరిస్తున్నాడు. ఆ సమయంలో ఘాట్ వద్ద దుకాణం నడుపుకుంటున్న సుధాకర్ అనే వ్యక్తి మరో భక్తుడిపై చేయి చేసుకునేందుకు వెళ్తున్నాడు. అడ్డుకోబోయిన ఆంజనేయులును దుర్భాషలాడుతూ రాయితో దాడి చేశాడు. అక్కడే ఉన్న కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. పైగా పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగాడు. కాగా బాధితుడు ఆంజనేయులు స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు. -
ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు
● ప్రభుత్వ సీసీఏ రూల్స్ వీరికీ వర్తిస్తాయి ● రామాలయ వైదిక సిబ్బందికి జీఓ జారీ భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వెలుపల జరిగే ప్రైవేట్ వైదిక కార్యక్రమాలకు ఆలయ అర్చకులు, పండితులు హాజరు కావడానికి అనుమతి లేదని రామాలయ ఈఓ కొల్లు దామోదర్ రావు గురువారం ప్రకటనలో తెలిపారు. దేశ, విదేశాల్లో ఆలయ వైదిక సిబ్బంది తరుచుగా లోక కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, ప్రవచనాలు, వేదసంహిత కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కావటం క్రమశిక్షణను ధిక్కరించినట్లుగా భావిస్తున్నందున, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సీసీఏ రూల్స్ ప్రకారం వైదిక సిబ్బంది వ్యవహరించాలని సూచించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి లేకుండా దేశ విదేశాల్లో ఎటువంటి వైదిక కార్యక్రమాలను నిర్వహించొద్దని, పాల్గొనద్దని తెలిపారు. ఈ ఉత్తర్వులను ధిక్కరిస్తే క్రమశిక్షణా చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఈఓ మరో ప్రకటనలో తెలిపారు. 29న సాయంత్రం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద జరుపుతున్నట్లు వెల్లడించారు. -
ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు!
దసరాకు వచ్చే ప్రయాణికుల జేబులకు చిల్లు ● టికెట్ ధర మూడింతలు పెంచిన ట్రావెల్స్ నిర్వాహకులు ● చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న అధికారులుభద్రాచలంఅర్బన్: దసరా సెలవుల్లో ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు దండుకుంటున్నారు. టికెట్ ధరలు రెండు, మూడింతలు పెంచేశారు. ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా.. ప్రయాణికుల వరకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. సర్వీసుల సంఖ్య ప్రకటించి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అవకాశం ప్రైవేటు ఆపరేటర్లకు కాసుల పంటగా మారుతోంది. సాధారణ రోజుల్లో.. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దీంతో రాజధాని తదితర ప్రాంతాల్లో ఉన్నవారు సొంతూళ్లకు వస్తున్నారు. ఆర్టీసీలో భద్రాచలం–హైదరాబాద్ టికెట్కు సాధారణ రోజుల్లో నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ రూ.470, నాన్ ఏసీ సూపర్ లగ్జరీ టికెట్ ధర రూ. 650, డీలక్స్ రూ. 570గా, ఏసీ రాజధాని రూ.800, లహరీ బస్సులో సిట్టింగ్రూ.820, స్లీపర్కు రూ.1018 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్లో.. ప్రైవేటు ట్రావెల్స్లో భద్రాచలం–హైదరాబాద్ టికెట్ నాన్ ఏసీ బస్సులో సిట్టింగ్కు రూ. 450 తీసుకుంటారు. స్లీపర్ రూ. 650, ఏసీ సర్వీసులకు రూ.819 పైగా వసూలు చేస్తున్నారు. పండుగ సందర్భంగా టికెట్ ధర అమాంతం పెంచారు. నాన్ ఏసీ బస్సులకు స్లీపర్ రూ.1400, సిట్టింగ్ అయితే రూ. 1000, ఏసీ బస్సుల్లో స్లీపర్ రూ. 1400కు పైగా వసూలు చేస్తున్నారు. పండుగ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఇదే చార్జీ వసూలు చేస్తారు. పట్టించుకోని రవాణాశాఖ ఇటీవల కాలంలో ట్రావెల్స్ బస్సులను రవాణాశాఖాధికారులు తనిఖీలు చేయడంలేదు. భద్రాచలం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న ఏ ఒక్క ప్రైవేట్ బస్సునూ గోదావరి బ్రిడ్జి పాయింట్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసిన సందర్భం లేదు. దీంతో పరిమితికి ప్రయాణికులను ఎక్కించడంతోపాటు గంజాయి వంటి నిషేధిత ఉత్పత్తులను కూడా తరలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తాం. బస్సుల్లో ప్రయాణికులు లగేజీ మాత్రమే తీసుకెళ్లాలి. బస్సులకు సంబంధించిన పర్మిట్, ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్, రవాణాపై దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన బస్సుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తాం. –వెంకట పుల్లయ్య, ఎంవీఐ, భద్రాచలం -
బీఎస్ఎన్ఎల్ అదనపు టవర్లతో మెరుగైన సేవలు
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో అవసరమైన చోట్ల బీఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటచేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం సభ్యులు సమావేశమయ్యారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఎస్ఎన్ఎల్ ద్వారా మెరుగైన సేవలందేలా 189టవర్ల అవసరముందని టీఏసీ కమిటీ, అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యాన ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, అమరవాడి సత్యనారాయణరెడ్డి, బానోత్ రంజిత్ నాయక్, మచ్చా రామారావు, పల్లెల రామ లక్ష్మ య్యగౌడ్, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ప్రచార లోపం.. ఉత్సవాలు వెలవెల
● పెద్దమ్మతల్లి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ ● శరన్నవరాత్రుల వేడుకల నిర్వహణపై నిర్లక్ష్యం ● సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు దాతల అసంతృప్తి పాల్వంచరూరల్: ఉమ్మడి జిల్లాలో మహిమాన్విత క్షేత్రంగా పేరొందిన శ్రీకనకదుర్గ ఆలయంలో ఈసారి శ్రీదేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు వెలవెలబోతున్నాయి. ప్రచారంలోపం, అరకొర వసతులతో పెద్దమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న వేడుకలకు భక్తుల రద్దీ తగ్గింది. అధికారులు ప్రచారంపై దృష్టిపెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రారంభోత్సవానికి హాజరుకాని ఎమ్మెల్యే మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైఉన్న శ్రీకనకదుర్గ ఆలయంలో ఏటా దసరాకు ముందు శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ సారి ఈ నెల 22 నుంచి వేడుకలు ప్రారంభంకాగా, వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ఆహ్వానించినా హాజరుకాకపోవడంతో ఆలయ కమిటీ చైర్మన్ ద్వారానే కలశ పూజలు చేయించి ఉత్సవాలు ప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వేద పండితులను పిలిపించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తక్కుమ మంది మాత్రమే రావడంతో నామమాత్రంగానే పూజలు జరుపుతున్నారు. ఏర్పాట్లు కరువు ఉత్సవాల సందర్భంగా భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు అరకొరగానే ఉన్నాయి. దీంతో నవరాత్రులకు భక్తుల సంఖ్య తగ్గిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల నుంచి నిత్యం భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించకుంటారు. ఆదివారం అధిక సంఖ్యలో తరలివస్తారు. భద్రాచలం–కొత్తగూడెం జాతీయ రహదారిని ఆనుకునే ఆలయం ఉండటంతో, ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శించుకుని వెళ్తారు. ఇంతగా ప్రసిద్ధి పొందిన ఆలయంలో ఈ సారి దసరా వేడుకలకు ఎండోమెంట్శాఖ సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 18 మందికి రుత్వికులకు 12 మందే.. ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఏటా ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి అర్చకులు, రుత్వికులు వచ్చి 9 రోజులు పూజలు చేస్తుంటారు. గతేడాది 18 మంది రుత్వికులు వస్తే ఈసారి 12 మంది మాత్రమే వచ్చారు. పట్టణాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠ చేయడంతో అర్చకులు అటువైపే మొగ్గు చూపారని, ఆలయ ఉత్సవాలకు ఆసక్తి చూపలేదని సమాచారం. విస్తృత ప్రచారం చేసి ఉంటే.. ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారు. ఈసారి దాతలకు, వీఐపీలకు ఉత్సవాల ఆహ్వాన పత్రికలు కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. దీంతో అనేక మంది దాతలు ఈఓకు ఫోన్చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రచారం విస్తృతస్థాయిలో జరిగి ఉంటే ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చేవారు. -
కలెక్టరేట్లో బతుకమ్మ సంబురాలు
సూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ హాజరై మాట్లాడారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, తహసీల్దార్లు గన్యా, భగవాన్రెడ్డి, స్వర్ణలత, స్వాతిబిందు పాల్గొన్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో.. కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం అధికారులు ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి బహమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు జీవీ కిరణ్ కుమార్, కే.విజయలక్ష్మి వెంకటేశ్వర్లు, టి.సంధ్యారాణి,పి.సుమలత, కేసా నారాయణ రావు, బి.శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, నాయకులు ఎం.శ్యామ్ కిరణ్, ఎస్.పితాంబర రావు, ఆర్.కేశవ రావు, కే.జానకి సాయిబాబు, జి.నాగబిందు పాల్గొన్నారు. -
పత్తి పంట ధ్వంసం
టేకులపల్లి/గుండాల: ఆళ్లపల్లి మండలం రాయిపాడు గ్రామానికి చెందిన రైతులు ఊకే నాగేశ్వర్రావు –చంద్రకళ దంపతులు టేకులపల్లి మండలం మురళీపాడు బీట్లో ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తున్నారు. నెలరోజుల్లో పంట చేతికి వచ్చే దశకు చేరింది.బుధవారం అర్ధరాత్రి అటవీశాఖ అధికారులు పత్తి పంటను ధ్వంసం చేశారు. గురువా రం ధ్వంసమైన పంటను చూసి రైతు కుటుంబం బోరున విలపించింది. ఎమ్మెల్యేను అడ్డుకున్న రైతులుఆళ్లపల్లి మండలంలో పర్యటిస్తున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును రైతులు అడ్డుకున్నారు. న్యాయం చేయాలని బైఠాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పంట ధ్వంసం విషయమై వివరణ కోసం ఫారెస్టు రేంజర్కు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.న్యాయం చేయాలని ఎమ్మెల్యేకు వేడుకోలు -
యూరియా లారీ అడ్డగింత
బూర్గంపాడు: యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యంపై రైతులు కన్నెర్రజేశారు. గురువారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు సొసైటీ గోదాంలో ఐదు టన్నుల యూరియా దిగుమతి, మిగతా యూరియా ను మణుగూరు తరలిస్తుండగా లారీని రైతులు అడ్డుకున్నారు. నాగినేనిప్రోలు రెవెన్యూ పరిధిలో నాలుగువేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములుంటే ఇప్పటివరకు ఎన్ని యూరి యా బస్తాలు ఇచ్చారని, దిగుమతి చేసిన 120 బస్తాల యూరియాను ఎంతమందికి ఇస్తారని ప్రశ్నించారు. సొసైటీ సిబ్బంది కూడా యూరియా పంపిణీలో వివక్ష చూపుతున్నారని, పరపతి ఉన్న రైతులకే ఇస్తున్నారని ఆరోపించారు. ఏ రైతుకు ఎంత యూరియా ఇచ్చారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. రెండునెలలుగా తిరుగుతున్నా యూరియా మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలపాటు లారీని అడ్డుకోగా, సొసైటీ సీఈఓ, వ్యవసాయ అధికారులు పలుమార్లు రైతులతో మాట్లాడారు. మణుగూరుకు వచ్చిన యూరియాను ఇక్కడ దిగుమతి చేయటం అసాధ్యమని, ఒకట్రెండు రోజుల్లో 20 టన్నుల యూరియాను నాగినేనిప్రోలులో దిగుమతి చేయిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. దీంతో లారీని అధికారులు మణుగూరు పంపించారు. -
వరిలో బెరుకులు
ఆందోళనలో రైతులు అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సేద్యం చేసిన వరిపంటలో అధికంగా బెరుకులు కన్పిస్తున్నాయి. రాజాపురం, నామవరం గ్రామాల్లో 200 ఎకరాల్లో ఈ పరిస్థితి నెలకొంది. బీపీటీ 2782 సాంబ రకం పంటలో బెరుకులు సమస్య నెలకొంది. ఈ క్రమంలో బాధిత రైతులు గురువారం రాజాపురంలో సీడ్ డీలర్ షాపు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి అనూష పంట పొలాలను పరిశీలించారు. సమస్యను జిల్లా అధికారులకు నివేదిస్తామని తెలిపారు. మిరపనారులో కలుపు మందు పిచికారీఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిచికారీ చేయడంతో సలీం అనే రైతుకు చెందిన రెండు ఎకరాల మిరప నారు ఛిద్రమైంది. తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో మిరప సాగు చేసేందుకు రైతు మిరపనారు పోసుకున్నాడు. ఇప్పటికే రెండెకరాల్లో మొక్కలు నాటగా, మరో రెండెకరాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, ఈ ఘటన జరిగింది. రైతు వ్యవసాయశాఖ, పోలీ సులకు ఫిర్యాదు చేయగా, వ్యవసాయశాఖ అధికారులు మిరపనారును పరిశీలించారు. జామాయిల్ తోటలో..అశ్వాపురం: మండల పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన జమలపుడి వెంకటేశ్వర్లు ఎకరం జామాయిల్ తోటకు బుధవారం కొందరు వ్యక్తులు గడ్డిమందు కొట్టడంతో మొక్కలు ఎండిపోయాయి. మూడు నెలల క్రితం మొక్కలు నాటామని, గడ్డిమందు కొట్టడంతో ఎండిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్ల నుంచి భూ తగాదా జరుగుతోందని, ప్రత్యర్థులే గడ్డిమందు కొట్టారని బాధిత రైతు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు. ప్రతీ ఏటా పొలంలో వేసిన పంటను నాశనం చేస్తున్నారని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తునే ఉన్నానని వాపోయాడు. అట్రాసిటీ కేసులో డీఎస్పీ విచారణసూజాతనగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గురువారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ విచారణ నిర్వహించారు. మండలంలోని నాయకులగూడెం గ్రామానికి చెందిన చల్ల నర్సయ్య, పుల్లమ్మ, చల్ల అచ్చయ్య తమను కులం పేరుతో దూషించారని అదే గ్రామంలోని లెనిన్నగర్కు చెందిన దళితమహిళలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో డీఎస్పీ వచ్చి విచారణ చేపట్టారు. బాధిత మహిళలతోపాటు దూషించిన వారిని విచారించారు. డీఎస్పీ వెంట చుంచుపల్లి సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, సుజాతనగర్ ఎసై రమాదేవి ఉన్నారు. -
‘ఎకో’ ఏమాయె..?
భద్రాచలం: ప్రకృతి అందాలు.. పచ్చని అడవులకు నెలవై ఉన్న భద్రాద్రి జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంది. అడవుల విస్తీర్ణంలో రాష్ట్రంలోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ ఎకో టూరిజం ప్రాజెక్టులో జిల్లాకు చోటు దక్కలేదు. ఎకో టూరిజంతో జిల్లా, గిరిజనుల అభివృద్ధికి అవకాశం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, మంత్రులు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అబ్బురపరిచే అటవీ అందాలు.. రాష్ట్ర విభజనకు ముందు అటవీ విస్తీర్ణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2021 ప్రభుత్వ లెక్కల ప్రకారం 21,214 చదరపు కిలోమీటర్ల మేర అడవులతో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతం, సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కిన్నెరసాని, మూసి, పాములేరు వంటి చిన్నచిన్న ఉపనదులు, దుమ్ముగూడెం, మూకమామిడి తదితర సాగునీటి ప్రాజెక్టులతో పాటు అభయారణ్యం ఉన్నాయి. అన్నింటికీ మించి దేశవ్యాప్తంగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉంది. ఇలా అటవీ, ప్రకృతి, నదీ తీర అందాలతో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ ఎకో టూరిజంలో చోటు దక్కకపోవడం శోచనీయమని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు పట్టింపేది..? జిల్లాలోని అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు గిరిజన ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రాష్ట్ర అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్టులో ఉన్నారు. మొత్తంగా ఐదుగురు గిరిజన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ జిల్లాకు, గిరిజన యువతకు, ఏజెన్సీ ప్రాంతానికి వన్నె తెచ్చే ఎకో టూరిజంలో ఒక్క ప్రాజెక్టును సైతం మంజూరు చేయించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని అటవీ, ప్రకృతి అందాలు, టూరిజం అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా వాసులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కేబినెట్లో కీలక శాఖల్లో ఉన్నారని, వారికి అనుచరులుగా పేరొందిన ఆయా ఎమ్మెల్యేలు ఎకో ప్రాజెక్ట్ల అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లలేకపోయారని విమర్శిస్తున్నారు. కలెక్టర్గా జితేష్ వి పాటిల్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎకో టూరిజం అవశ్యకతను గుర్తించారు. ఏరు ఉత్సవం పేరిట భద్రాచలం గోదావరి ఒడ్డున, జీడిగుప్పతో పాటు పలు ప్రాంతాల్లో ఆదివాసీ హట్స్ ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఏడాది పాటు తగిన ఆదరణ, ప్రచారం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కిన్నెరసానిలో సైతం ఎకో టూరిజం అభివృద్ధికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీతారామ, దుమ్ముగూడెం ఆనకట్ట తదితర ప్రాంతాల్లో తీగల వంతెన, కాటేజీలు నిర్మించాలని, ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు చొరవ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. పర్యావరణ పర్యాటకంలో జిల్లాకు దక్కని చోటు -
గెలల తరుగులో వివక్ష ?
● ఒక్కో రైతుకు ఒక్కోలా నిర్ణయం ● ఆయిల్ఫెడ్ అధికారుల తీరుపై విమర్శలుఅశ్వారావుపేట: అధిక వర్షాలకు ఆయిల్పామ్ గెలల దిగుబడి పెరగడంతో ఆయిల్ఫెడ్ అధికారులు తరుగు తీయడంలోనూ వివక్ష చూపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ వద్ద మల్లారెడ్డి రమణమూర్తి అనే రైతు తనకు ఎక్కువ తరుగు తీశారని ఆరోపిస్తూ గత సోమవారం ఫ్యాక్టరీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పలువురు రైతులు, ఆయిల్ఫెడ్ అధికారులు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఆయిల్ఫెడ్లో గెలలను స్క్రీనింగ్ చేసే పటిష్టమైన వ్యవస్థ లేకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది. మలేషియా వంటి దేశాల్లో ఆయిల్పామ్ ఉత్పత్తి అధికంగా ఉన్నా.. వేలాది టన్నుల గెలలు వచ్చినా.. స్క్రీనింగ్ పటిష్టంగా ఉంటుందని, కానీ ఇక్కడ క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడం, ఫ్యాక్టరీలో స్క్రీనింగ్ సమయం, విశాలమైన ప్లాట్ఫాం లేకపోవడంతో ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం లభిస్తోందని చెబుతున్నారు. ఫ్యాక్టరీకి గెలలను తెచ్చే వారికి ఉండే పలుకుబడిని బట్టి అధికారులు వివక్ష చూపుతూ తరుగు తీస్తున్నారని కొందరు రైతులు వాపోతున్నారు. అసలు తరుగును నిర్ణయించేందుకు నిర్ధిష్ట ఫార్ములా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. నరికేటప్పుడు జాగ్రత్త పడితే.. సన్న, చిన్నకారు రైతులు మాత్రమే క్షేత్రాలకు వెళ్లి గెలల కటింగ్ను దగ్గరుండి చేయిస్తుంటారు. పదెకరాలకు మించి సాగు చేసే రైతులు, పదుల ఎకరాల్లో కౌలుకు తీసుకునే రైతులు అన్ని క్షేత్రాల్లో ఒకే సారి గెలలను ముఠా ద్వారా నరికిస్తుంటారు. యజమాని అందుబాటులో లేని చోట్ల గెలల నరికివేతలో వ్యత్యాసాలు వస్తుంటాయి. ముఠాకు టన్నుల చొప్పున నగదు చెల్లిస్తున్నందున అధిక బరువు వచ్చేలా వ్యవహరించడం ఓ కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. తరుగు తీసే విషయమై అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల మేనేజర్లు నాగబాబు, కళ్యాణ్ను వివరణ కోరగా.. రైతుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదని, డ్రైవర్లు, రైతులకు గెలలను చూపించిన తర్వాతే తిరస్కరిస్తున్నామని తెలిపారు. పనికిరాని గెలలను అనుమతిస్తే అంతిమంగా రైతులతోపాటు ఫెడరేషన్ మనుగడకు ముప్పు ఉంటుందని చెప్పారు.ఆయిల్పామ్ గెలల్లో తరుగుకు నిర్ధిష్టమైన నిబంధనలేమీ ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ కాబట్టి కంటి చూపుతో ఓ అంచనా ప్రకారం గెలల తేడాను బట్టి తరుగు విధిస్తుంటారు. ఓ ట్రాక్టర్కు 5టన్నుల గెలలు వస్తే అత్యధికంగా 50 కిలోలు తరుగు రాస్తారు. చాలా తక్కువ సందర్భాల్లో 70 కిలోలు రాస్తుంటారు. పైకి 1శాతం అయినా రైతుకు జరిగే నష్టం రూ.వెయ్యి. అందుకే రైతుల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా కాకుండా సరాసరి తరుగు అందరికీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
శరవేగంగా రిటైనింగ్ వాల్
● పనుల ప్రగతిపై మంత్రులు పొంగులేటి, తుమ్మల పర్యవేక్షణ ● వరంగల్ ఎన్ఐటీ నిపుణులతో నాణ్యతా పరీక్షలు ● భూసేకరణ ప్రక్రియ వేగవంతం ● ఇరువైపులా సర్వీస్ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థసాక్షిప్రతినిధి, ఖమ్మం : మున్నేరుకు వరద వస్తే పరీవాహకంలోని ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో మున్నేరు ప్రభావంతో అనేక కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.525.36 కోట్ల వ్యయంతో మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తుండగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత రెండేళ్లుగా క్లౌడ్ బరస్ట్తో వస్తున్న వరదలతో మున్నేటి పరీవాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ప్రతి ఏటా నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే వారు ఊపిరి పీల్చుకుంటారు. తీరని నష్టం.. గత రెండేళ్లుగా మున్నేరుకు వచ్చిన వరదలతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. రోజువారీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక రోడ్లు, విద్యుత్ స్తంభాలు, సబ్ స్టేషన్లు, పాఠశాల భవనాలు, పైపు లైన్లు, ఆరోగ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. గతేడాది సెప్టెంబర్లో సంభవించిన క్లౌడ్ బరస్ట్తో మున్నేరుకు వచ్చిన ఆకస్మిక వరదతో ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు రూ. 757 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. మున్నేరుకు రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.525 కోట్లతో.. నగరం మధ్య నుంచి మున్నేరు వాగు ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతం, నగరం నుంచి వచ్చే వరద గరిష్ట స్థాయిని దృష్టిలో ఉంచుకుని మున్నేరు వాగుకు రెండు వైపులా సిమెంట్ కాంక్రీట్తో రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ.525.36 కోట్లు మంజూరు చేయగా నిర్మాణ పనులను ప్రారంభించారు. మున్నేరు వాగుకు రెండు వైపులా ఖమ్మం రూరల్ మండలంలో 8.5 కిలోమీటర్లు, ఖమ్మం అర్బన్ మండలంలో 8.5 కిలోమీటర్లు.. మొత్తం 17 కిలోమీటర్లు పొడవునా 10 నుంచి 15 మీటర్ల ఎత్తుతో రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతోంది. ఇక సర్వీసు రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థ సదుపాయంతో ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండగా వరంగల్ ఎన్ఐటీ నిపుణులతో తనిఖీ చేయిస్తోంది.రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం అర్బన్ మండలంలో మల్లెమడుగు, దానవాయిగూడెం, బుర్హాన్ పురం, ఖమ్మం, రూరల్ మండలం పోలేపల్లి, గోళ్లపాడు, గుదిమల్ల, గుర్రాలపాడు, ఏదులాపురం గ్రామాలకు చెందిన మొత్తం 245.12 ఎకరాల భూసేకరణలో 106.21 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. 138.31 ఎకరాల పట్టా భూమిలో ఇప్పటివరకు 69.12 ఎకరాల సేకరణ పూర్తయింది. భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నిర్వాసితులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలో 139.27 ఎకరాల్లో లేఔట్ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇందులో 1,666 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నారు. అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీగా ఇది అభివృద్ధి చెందనుంది. -
‘పేట’కే అదనంగా ఇళ్లు ఇచ్చాం
అశ్వారావుపేటరూరల్: రాష్ట్రంలో అశ్వారావుపేట నియోజకవర్గానికే అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఇది స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పనితీరుకు నిదర్శమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం అశ్వారావుపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్గా ఎన్నికై న సుంకవల్లి వీరభద్రరావు, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారం అనుభవించి రాష్ట్రంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఈ ఇళ్లు పేదలకు భరోసా, భద్రతతోపాటు ఆత్మ గౌరవానికి ప్రతీకలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీ ప్రకారం ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇస్తే అశ్వారావుపేటకు అదనంగా మరో 1000 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. రాష్ట్రంలో 11 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగా, మరో 7 లక్షల కార్డుల్లో కుటుంబీకుల పేర్ల నమోదుకు అవకాశం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, పేదల సొంతింటి కల సాకారం చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అశ్వారావుపేట నియోజకవర్గం ప్రత్యేకమని, హైదారాబాద్లో చాక్లెట్ కంపెనీకి అశ్వారావుపేటలో సాగు చేస్తున్న కోకో పంటను వినియోగిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని చాక్లెట్ తయారీదారులే తనకు చెప్పారని, ఇది జిల్లాకే గర్వకారణమని అన్నారు. చేపల పెంపకానికి 500 యూనిట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆసక్తి ఉన్న వారు అధికారులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఆర్డీఓ మధు, జిల్లా వ్యవసాయాఽధికారి బాబురావు, ఆత్మ కమిటీ డీపీడీ సరిత, మున్సిపల్ కమిషనర్ బి. నాగరాజు, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువజన నాయకుడి మృతి
చండ్రుగొండ: మండల కేంద్రానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు మొహమ్మద్ సాజిద్ అలియాస్ సజ్జు (28) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాజిద్కు కొన్నేళ్ల క్రితం కొత్తగూడేనికి చెందిన యువతతితో వివాహమైంది. ఏడు నెలల కిందట దంపతులకు కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం బాలుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. చూసేందుకు సాజిద్ తన ద్విచక్రవాహనంపై కొత్తగూడెం పయనమయ్యాడు. రుద్రంపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన జాజిద్ను కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని, ఆరాతీశారు. సాజిద్ మరణం బాధాకరమని, ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి మృతి కొత్తగూడెంటౌన్: కేబుల్ కనెక్షన్కు చెందిన యాంటీనాను అమర్చుతూ బిల్డింగ్ పైనుంచి జారిపడి బత్తిని సాగర్ (35) మృతి చెందిన ఘటన కొత్తగూడెం పట్టణంలోని రైటర్బస్తీ గొల్లగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూజాతనగర్కు చెందిన సరోజిని, వీరయ్య దంపతుల పెద్దకుమారుడు బత్తిని సాగర్ (41) కేబుల్ టీవీ, డిష్ టీవీ కనెక్షన్లు ఇస్తుంటాడు. ఓ ఇంట్లో కనెక్షన్ ఇస్తున్న సమయంలో సెకండ్ ఫ్లోర్ నుంచి కాలు జారి కింద పడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సాగర్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య శిరీష, ఐదేళ్ల చిన్నారి లాస్య ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. బాత్రూమ్లో జారిపడి వ్యక్తి మృతి కొత్తగూడెంటౌన్: బాత్రూమ్కు వెళ్లి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన పంజాబ్గడ్డలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పంజాబ్గడ్డకు చెందిన భైరిమల్ల మధుసూదన్ (41) పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. స్నానం చేయడానికి బాత్రూమ్కు వెళ్లి జారి కిందపడ్డాడు. గొంతుకు తీవ్రగాయం కావడంతో ఆయన్ను కొత్తగూడెం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కూమారుడు ఉన్నారు. -
కొంత ఊరట..
ఖమ్మంగాంధీచౌక్: వస్తు సేవా పన్ను (జీఎస్టీ)ల్లో వచ్చిన మార్పులు పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కలిగించేదిగా ఉందని పలువురు చెబుతున్నారు. వివిధరకాల వస్తువులపై శ్లాబ్లను జీఎస్టీ కౌన్సిల్ 2.0 పేరిట మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2017లో పరోక్ష పన్ను విధానాలను తొలగించి జీఎస్టీని రూపొందించి అమలు చేసింది. వివిధరకాల వస్తువులకు జీఎస్టీ శ్లాబ్లను విధించింది. ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను తొలగించారు. ఆ స్థానంలో 5, 18, 40 శా తం శ్లాబ్లు అమలు చేయనున్నారు. దీంతో నిత్యా వసరాలపై పన్నులభారం తగ్గనుండగా, విలాసవంతమైన వస్తువుల ధరలు పెరగనున్నాయి. ధర తగ్గిన కిరాణా సరుకులు గతంలో 12 శాతం, 18 శాతం 28 శాతం వరకు శ్లాబ్ రేట్లతో ఉన్న పలు రకాల సరుకులు 5 శాతానికి తగ్గాయి. వెన్న, నెయ్యి, పాలు వంటివి 12.5 శాతం నుంచి 5 శాతానికి, బిస్కెట్లు, కేక్లు వంటివి 18 శాతం నుంచి 5 శాతానికి, ఆహార పదార్థాలతో పాటు జ్యూస్, మిల్క్ డ్రింక్స్ వంటివి 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయి. 375 రకాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. టీవీల(సైజును బట్టి)పై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతం కన్నా తక్కువకు, సిమెంట్, ఇతర బిల్డింగ్ మెటీరియల్కు జీఎస్టీని తగ్గించారు. బీమాకు మినహాయింపు జీవిత, ఆరోగ్య బీమాలకు జీఎస్టీ కౌన్సిల్ పూర్తిగా పన్నుల మినహాయింపు కలిగించడంతో పాలసీ ప్రీమియం ధరలు తగ్గుతాయి. ఇప్పటి వరకు 18 శాతం జీఎస్టీ అమలులో ఉంది. సింగిల్ ప్రీమియం, బీమా రక్షణ చార్జీలపై కూడా జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఔషధాలపై జీఎస్టీ తగ్గించారు. గుండె జబ్బులు, కేన్సర్, జన్యు పరమైన వ్యాధులకు సంబంధించిన మందులపై జీఎస్టీని పూర్తిగా మినహా యించగా, 12 శాతం పరిధిలో ఉన్న పలు రకాల ఔషధాల శ్లాబ్ రేట్ను 5 శాతానికి తగ్గించారు. విలాసవంతమైన పలు రకాల వస్తువులపై జీఎస్టీ శ్లాబ్ను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్మసాలా, నికోటిన్ ఉత్పత్తులు 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. కార్బొనేటెడ్, ఎనర్జీ, కెఫిన్ ఆధారిత డ్రింక్స్పై జీఎస్టీ 40 శాతానికి పెంచారు. లాటరీ టికెట్లు, కేసినో సేవలు, ఆన్లైన్ గేమింగ్పై పన్ను రేట్లను 40 శాతానికి పెంచారు. కార్లలో 1500 సీఈసీ కన్నా అధిక సామర్థ్యం ఉన్న వాటికి ఇకపై 40 శాతం జీఎస్టీ అమలవుతుంది. మోటారు సైకిల్ వాహన ధరలు కొంత మేర తగ్గనున్నా యి. కాగా, జీఎస్టీ తగ్గింపుతో సామగ్రి, వాహనాలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు తగ్గాయంటూ వివిధ కంపెనీల షోరూంల వద్ద ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దసరా సమీపిస్తుండడంతో కొనుగోళ్లు పెరగనుండగా.. జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్ ఊపందుకుంటుందనే భావన వ్యక్తమవుతోంది. నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింపు జీఎస్టీలో శ్లాబ్ల మార్పు మంచి పరిణామం. చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారాలకు ప్రయోజనం. వ్యాపార వృద్ధి జరుగుతుంది. 12 శాతం, 28 శాతం శ్లాబ్లను తొలగించి 5 శాతం శ్లాబ్లను విధించటం ద్వారా ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. చిరు వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. –చిన్ని కృష్ణారావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఖమ్మం -
సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ
చింతకాని: పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలుచేపట్టాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు విజయ్ చంద్ర పేర్కొన్నారు. చింతకానిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించిన వరి పొలాలను బుధవారం పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వరిలో ఆకు ఎండు తెగులు ఆశిస్తున్నందున కొంతమేర నివారణకు ప్లాంటమైసిన్ లేదా పోషమైసిన్ 0.2 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే వరిపంట పూతదశలో ఉన్నప్పుడు కాపర్ శిలీంద్రనాశినులను పిచికారీ చేయొద్దని తెలిపారు. వరిపంటకు ఆఖరి దశగా పొటాష్ ఎరువును ఎకరానికి 15–20 కేజీలు వేయాలని, పొలంలో పాత నీరు తీసి కొత్త నీరు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారి సోములపల్లి మానస, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సంతానలక్ష్మీ నమో నమః
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా రెండో రోజైన బుధవారం శ్రీ లక్ష్మీతాయారమ్మవారు సంతానలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సంతాన అవరోధాలు తొలగించడంతో పాటు సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేయగా, మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన గావించారు. మహిళా భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అయోధ్య కాండ పారాయణం చేశారు. నేడు గజలక్ష్మీ అలంకరణలో.. ‘లక్ష్మీః దివ్యైః గజేంద్రై మణిగణఖచితైః స్నాపితా హేమకుంభై’ అని కీర్తించారు పూర్వాచార్యులు. ఈ అమ్మను ఆరాధిస్తే అధికారము, మహా సంపద కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. గజలక్ష్మిని ఆరాధించే దేవేంద్రుడు త్రైలోకాధిపత్యాన్ని సాధించాడని, ఆ అమ్మను పూజిస్తే చెదరని అఽధికారం, తరగని సంపద కలుగుతాయని పండితులు అంటున్నారు. శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బేడా మండపంలో బుధవారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
చేప పిల్లల ధరలు ఖరారు
● ముగ్గురు కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లల పంపిణీకి నిర్ణయం ● పెద్ద చేప పిల్ల రూ.1.70, చిన్న చేప పిల్ల 68 పైసలుగా నిర్ణయం ఖమ్మంవ్యవసాయం: చేప పిల్లల ధరలను నిర్ణయించారు. జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖాలు చేశారు. నిబంధనల మేరకు ఆయా కాంట్రాక్టర్ల చేప పిల్లల అక్వాఫామ్ లు, హేచరీస్లను జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, పశుసంవర్థక, పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ ఎంఏ రాజు, చీఫ్ ప్రమోటర్ మామిడి వెంకటేశ్వర్లుతో కూడిన బృందం పరిశీలించింది. ఈ పరిశీలన ద్వారా ముగ్గురు కాంట్రాక్టర్లు నిర్వహించే హేచరీస్లను ఎంపిక చేశారు. జస్వంత్ ఆక్వాఫామ్, మచిలీపట్నం, నరేంద్ర హేచరీస్ ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా, సత్యకృష్ణ ఆరేటి కంపెనీ, కాళ్ల బీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాలను చేప పిల్లల పంపిణీకి ఎంపిక చేశారు. ఈ మూడు కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను పథకం డిప్యూటీ చైర్మన్, జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఓపెన్ చేశారు. ధరలు ఇలా.. ఉచిత చేప పిల్లల పథకం కింద పంపిణీ చేసే చేప పిల్లలకు కాంట్రాక్టర్లు కోడ్ చేసిన వాటిలో తక్కువ ధరలను కమిటీ నిర్ణయించింది. 80–100 మి.మీ ఓక్కో చేప పిల్లకు రూ.1.70, 35 – 40 మి.మీ ఒక్కో చేప పిల్లకు 68 పైసల చొప్పున ఖరారైంది. ఈ ఏడాది జిల్లాలో 882 జలాశయాల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా 80–100 మి.మీల చేప పిల్లలు 2.11 కోట్లు కాగా, 35–40 మి.మీల చేప పిల్లలు 1.38 కోట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పిల్లలకు సుమారు రూ.4 కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద కట్ల, రోహు, బంగారుతీగ రకాల చేప పిల్లలను ఎంపిక చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో పంపిణీ రాష్ట్రంలో కెల్లా ఖమ్మం జిల్లాలో చేప పిల్లల టెండర్ల ప్రక్రియ, ఫైనాన్సియల్ బిడ్ వంటి ప్రక్రియలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియల నివేదికలను జిల్లా యంత్రాంగం రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్కు పంపించారు. ఇప్పటికే జలాశయాల్లో సమృద్ధిగా నీరుంది. చేప పిల్లల విడుదలకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి, జలాశయాల్లో విడుదలకు అనుమతులు ఇస్తే జిల్లాలో ఈ పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టే అవకాశం ఉందని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. -
బెటాలియన్ను సందర్శించిన అదనపు డీజీపీ
చుంచుపల్లి: చాతకొండ 6వ బెటాలియన్ను టీజీఎస్పీ బీఎన్ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్, కలెక్టర్ జితీష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్లో చేపట్టిన డైనింగ్ హాల్, జిమ్ రూమ్, పార్కింగ్ షెడ్, బుద్ధ విగ్రహం, ఓపెన్ జిమ్, క్రీడా మైదానం, ఎస్డీఆర్ఎఫ్ ఆఫీస్ రూమ్, అకమిడేషన్ హాళ్లను ప్రారంభించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో వసతుల కల్పనపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, అదనపు కమాండెంట్ బి.వెంకటేశ్వర రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు జి.వి కిరణ్కుమార్, సింగరేణి వెల్ఫేర్ జీఎం బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితుల అరెస్ట్
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం గణేశ్టెంపుల్ ఏరియాలో ఈ నెల 22వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. గణేశ్టెంపుల్ ఏరియాలో గుబ్బల రాంమోహన్రావు (62) ఇంట్లో రాత్రి టిఫిన్ చేస్తున్న సమయంలో రామవరానికి చెందిన మహ్మద్ షాహీర్ బండరాయిలను పగలగొట్టే సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు. రాంమోహన్రావుపై దాడి చేయగా.. ఆయన భయంతో బయటకు పరుగెత్తడంతో షాహీర్ కూడా బయటకు వెళ్లి తలపై సుత్తితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రెయినేజీలో సుత్తి పడేసి.. అక్కడే వేచి ఉన్న వాసంపల్లి వంశీ ద్విచక్రవాహనంపై రామవరానికి వెళ్లాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు మహ్మద్ షాహీర్, వాసంపెల్లి వంశీ పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఓ వివాహితతో అక్రమ సంబంధం కారణంగా షాహీర్.. రాంమోహన్రావును చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సదరు వివాహితపై కూడా కేసు నమోదు చేస్తామని, వీరందరిని గురువారం రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు. కాగా, ఇద్దరు నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో సీఐలు శివప్రసాద్, కరుణాకర్, ప్రతాప్, ఎస్ఐ విజయ, పోలీసులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు
సూపర్బజార్(కొత్తగూడెం): బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ పూజ చేశారు. మహిళా ఉద్యోగులతో కలిసి వివిధ రకాల తామర పుష్పాలు, రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు. సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ అడారు. విదేశీ విద్యా పథకానికి దరఖాస్తుల ఆహ్వానంఖమ్మంమయూరిసెంటర్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు జి.జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. ఆసక్తి గల విద్యార్థులు నవంబర్ 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదని, ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీఎంఏటీ, పీటీఈలలో ఏదో ఒక పరీక్షలో అర్హత సాధించి ఉండాలని, తప్పనిసరిగా పాస్ పోర్ట్ కలిగి ఉండాలని, గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొంది ఉండాలని వివరించారు. అన్నం శ్రీనివాసరావుకు అవార్డుఖమ్మం అర్బన్ : హైదరాబాద్లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన అచీవ్మెంట్ అవార్డు–2025 కార్యక్రమంలో జిల్లాకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నం శ్రీని వాసరావుకు పురస్కారం దక్కింది. ఈ మేరకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పోతుగంటి వెంకటేశ్వర్లు, గంధం పట్టాభి రామారావు, షేక్ నాగుల్మీరా, కేశవపట్నం శ్రీనివాస్, కడవెండి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
పినపాక: వివిధ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యంగా ఉండాలని, నిరంతరం అధికారులు పర్యవేక్షించాలని ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. వంట చెరకు, మరుగుదొడ్లు, విద్యార్థుల గదులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎస్కే సైదులు, డీఈ నాగేశ్వరచారి, ఏఈ సత్యశ్రీనివాస్, ఎంఈఓ నాగయ్య పాల్గొన్నారు. కోర్టుకు హాజరుకాని ఇద్దరు అరెస్ట్ సుజాతనగర్: కోర్టు వాయిదాలకు హాజరుకాని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఘటన స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఎం.రమాదేవి కథనం మేరకు.. మండలంలోని సీతంపేటబంజర గ్రామానికి చెందిన బాదావత్ మాన్య, కోమటిపల్లి గ్రామానికి చెందిన భూక్యా సురేశ్పై గతంలో కేసు నమోదైంది. అయితే వీరిద్దరూ వాయిదాల నిమిత్తం కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో కొత్తగూడెం సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జారీ చేసిన నాన్బెయిలబుల్ వారెంట్పై ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి సబ్ జైలుకు తరలించామని తెలిపారు. ‘గంజాయి’ నిందితుల ఆస్తుల జప్తు పినపాక: నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుల ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈ–బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2024 జూన్ 29న ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులపై ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించగా, వారి పేర్లపై ఉన్న ఒక ట్రాక్టర్, ఒక కారు, ఒక ఆటో, నాలుగు మోటార్ సైకిళ్లు, మూడు గృహాలను ఫ్రీజ్ చేయించామన్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.23.52లక్షలుఅనిపేర్కొన్నా రు. గంజాయి అక్రమరవాణా ద్వారాసంపాదించి న డబ్బుతో నిందితులు, వారి బంధువుల పేర్లపై కొనుగోలు చేసిన ఆస్తులను కూడా జప్తు చేశామని సీఐ వివరించారు. కాగా, సీఐ వెంకటేశ్వరరావు, సిబ్బందిని ఎస్పీ రోహిత్రాజు అభినందించారు. నాటుసారా స్వాధీనం బూర్గంపాడు: మండలంలో బుధవారం ఎక్సైజ్శాఖ అధికారులు, సిబ్బంది జరిపిన దాడుల్లో 7 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పినపాక పట్టీనగర్, అంజనాపురం, మోరంపల్లిబంజర, నాగినేనిప్రోలు, సారపాకల్లో నిర్వహించిన దాడుల్లో నాటుసారా విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని వారిపై కేసు నమోదు చేశామని ఎకై ్సజ్ ఎస్ఐ గౌతమ్ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ సిబ్బంది రామకృష్ణ, సుమన్, హబీబ్పాషా, గురవయ్య, రమేశ్, శ్రావణి పాల్గొన్నారు. ఫ్యామిలీడే ఘనంగా నిర్వహించాలిఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలో ఫ్యామిలీడే, బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సేవా సమితి అధ్యక్షురాలు ఈసం రమ కోరారు. బుధవారం ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 29న ఫ్యామిలీ డే వేడుకలు, సద్దుల బదుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సుధాకర్, అజయ్, సులక్షణ తదితరులు పాల్గొన్నారు. -
భద్రాద్రిలో రాతి నిర్మాణాలు చేపట్టాలి
దేవస్థాన వైదిక బృందం సూచనభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చేపట్టే మాస్టర్ ప్లాన్లో భాంగంగా రాతి కట్టడాలతో నిర్మించాలని బుధవారం ఆర్కిటెక్ సూర్యనారాయణ మూర్తికి దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు సూచించారు. దేవస్థానం క్యాంప్ కార్యాలయంలో వైదిక సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ప్రధాన ఆలయంలో మార్పులు చేయకుండా ప్రాకార మండపం, యాగశాలలను పున్నర్మించాలని తెలిపారు. అలాగే ఆలయం చుట్టూ ప్రధాన రహదారులను విస్తరించి నలువైపులా స్వామివారి రథం తిరిగేలా మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. గతంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలతో పాటు దేవస్థాన వైదిక సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో ఈఓ దామోదర్రావు, ఏఈఓలు శ్రావణ్కుమార్, భవాని రామకృష్ణ, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు (రామం), ఉప ప్రధానార్చకులు అమరవాది గోపాల కృష్ణమాచార్యులు, కోటి రామస్వరూప్, వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు, రామాయణ పారాయణదారు ఎస్టీజీ కృష్ణమాచార్యులు, అసిస్టెంట్ ఇంజనీర్ అజయ్, సీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులు రక్తపరీక్షలు చేయించుకోవాలి
చుంచుపల్లి: గర్భిణులు హిమోగ్లోబిన్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని డీఎంహెచ్ఓ జయలక్ష్మి సూచించారు. తమ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పీహెచ్సీ స్థాయిలోనే ప్రసవాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, గర్భిణుల ఏఎన్సీ నమోదు 100 శాతం సాధించాలని అన్నారు. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య సేవల మెరుగుదల కోసం నిబద్ధతతో పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. కాగా, సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ తొలుత పలు సూచనలు చేశారు. డాక్టర్లు మధువరణ్, స్పందన, తేజస్వి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సారథి’ సతాయిస్తోంది..
సత్తుపల్లిటౌన్: రవాణా శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తోంది. టీజీట్రాన్స్పోర్ట్ స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సారథి యాప్ సతాయిస్తోంది. కొత్త లైసెన్సు కోసం లెర్సింగ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెస్సు, లైసెన్సు రెన్యూవల్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. గతంలో స్లాట్ బుక్ చేస్తే ఒకే ఓటీపీ వచ్చేది. ఇప్పుడు ఐదు నుంచి ఏడు ఓటీపీలు వస్తుండటంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. రెండు నిమిషాల్లో అయిపోయే ఈ ప్రక్రియ కోసం గంటల తరబడి కార్యాలయంలో పడిగాపులు పడాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఈ విషయమై రవాణాశాఖ అధికారి జేఎన్ శ్రీనివాసరావును వివరణ కోరగా యాప్ నూతనంగా ప్రవేశపెట్టారని, సమస్యనుఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
ఆర్గానిక్ మల్చింగ్పై అవగాహన
అశ్వారావుపేట: వ్యవసాయ వ్యర్థాలతో ఆర్గానిక్ మల్చింగ్ విధానంపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం కళాశాలలోని గ్రీన్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఆవరణలోని ఆయిల్పాం తోటలో వ్యర్థాలు, తెగిన మట్టలను ఫ్రెడర్, మల్చింగ్ యంత్రాల్లో పొడిగా మలిచి నేల కనిపించకుండా పరిచారు. ప్లాస్టిక్ మల్చింగ్కు ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్ మల్చింగ్ చేయడంతో కలిగే ప్రయోజనాలు, సంపద ఎలా సృష్టించాలో విద్యార్థులకు హేమంత్కుమార్ వివరించారు. గ్రీన్ క్లబ్ నిర్వాహకులు డాక్టర్ నీలిమ తెలంగాణలో ఆయిల్పాం విస్తీర్ణం, సాగు, మట్టలతో మల్చింగ్తోపాటు నేలకు పోషకాలు అందుతాయని తెలిపారు. వ్యర్థాలను ఉపయోగించి విలువైన పదార్థాల తయారీకి ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల బోధనా సిబ్బంది రాంప్రసాద్, రవికుమార్, శ్రీనివాస్, దీపికరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టుకు తాటిగూడెం బాలిక
కరకగూడెం: అండర్ –15 రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ జట్టుకు మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన రామటెంకి దేవీప్రియ ఎంపికై ంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. క్రికెట్లో ప్రతిభ కనబరిచి అండర్ –15 మహిళా క్రికెట్ ప్రాబబుల్ జట్టులో సభ్యురాలిగా ఎంపికై ంది. ఆమె తండ్రి హనుమంతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. దేవీప్రియకు క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన హనుమంతరావు శిక్షణ ఇప్పించారు. కాగా, ఈనెల 20న హైదరాబాద్లో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో 600 మంది క్రీడాకారిణుల మధ్య ప్రతిభ చాటిన దేవీప్రియ రాష్ట్ర ప్రాబబుల్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా హెడ్ కోచ్ సురేందర్ రెడ్డి, కోచ్లు వెంకట్ యాదవ్, బుచ్చిబాబు, రంజీ కోచ్ ఇర్ఫాన్ తదితరులు బాలికను అభినందించారు. అండర్ – 15 ప్రాబబుల్ టీమ్కు ఎంపిక -
గాయపడిన వ్యక్తి మృతి
చండ్రుగొండ: మండలంలోని గానుగపాడు గ్రామానికి చెందిన వ్యక్తి మొగలిపువ్వు నాగరాజు (44) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగరాజుతో పాటు అతడి స్నేహితుడు ఎల్లయ్య సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై సుజాతనగర్ నుంచి గానుగపాడుకు వస్తున్నారు. మార్గమధ్యలో అన్నరంతండా వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగరాజు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అటవీశాఖ అనుమతిస్తే..
● గుండాల నుంచి రంగాపురానికి సులువైన ప్రయాణం ● ఐదేళ్ల క్రితం రోడ్డు పనులకు మంజూరైన నిధులు.. ● అనుమతులు రాక నిలిచిపోయిన పనులు ● ఏళ్లుగా ఎదరుచూస్తున్న పలుగ్రామాల ప్రజలు గుండాల: జిల్లాలోని గుండాల –రంగాపురం మధ్య రోడ్డు పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని విధంగా ఉంది. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా అటవీశాఖ అనుమతి లేక పనులు జరగడం లేదు. కొంతమేర మాత్రమే రోడ్డు వేసి గ్రామాల మధ్య పనులను నిలిపివేశారు. దీంతో వర్షాకాలంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే అటు మణుగూరుతో పాటు మేడారం జాతర సమయంలో ఎంతో ఉపయోగపడనుంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు కోతకు గురవుతుందని, గుంతలు ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.24 కోట్లు మంజూరు గుండాల – రంగాపురం మధ్య 28 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించేందుకు ఐదేళ్ల క్రితం నక్సల్స్ ప్రభావిత ప్రాంత అభివృద్ధి కింద రూ.24 కోట్లు మంజూరు చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ గుండాల నుంచి సాయనపల్లి వరకు బీటీ రోడ్డు వేయగా అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. మధ్యలో ఉన్న వాగులపై బ్రిడ్జి పనులు సైతం పూర్తి చేశారు. అటవీశాఖ అనుమతుల కోసం పాలకులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మణుగూరు నుంచి గుండాలకు బస్సు సౌకర్యం ఉన్నా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో సాయనపల్లి, దామరతోగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేడారం జాతరకు కీలకం మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు గుండాల మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. ఇల్లెదు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ తదితర ప్రాంతాల నుంచి గుండాల మీదుగా వాహనాలు వెళ్తుంటాయి. ఖమ్మం, ఇల్లెందు నుంచి ఆర్టీసీ బస్సులు సైతం నడిపిస్తున్నారు. ప్రస్తుతం గుండాల – పస్రా మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. అయితే, గుండాల – రంగాపురం మధ్య రోడ్డు పనులు పూర్తయితే తాడ్వాయి మీదుగా మేడారం చేరేందుకు రద్దీలేని ప్రయాణం అవుతుంది. మేడారం జాతర సమయంలో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. వర్షాకాలంలో తప్పని తిప్పలు సాయనపల్లి – రంగాపురం మధ్య రోడ్డంతా అధ్వానంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా రూ.లక్షలు వెచ్చి ంచి మరమ్మతులు చేపడుతున్నా ఫలితం ఉండడం లేదు. భారీ వర్షాలకు రోడ్డంతా కోతకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. డబుల్ రోడ్డు కాకపోయినా సింగిల్ రోడ్డు నిర్మాణమైనా చేపట్టాలని వేడుకుంటున్నారు. సాయనపల్లి, మల్లెలగుంపు, వెంకటాపురం, దామరతోగు, తక్కెళ్లగూడెం, గణాపురం గ్రామాల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. పనుల నిమిత్తం నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలన్నా ఈ రోడ్డే ఆధారం. పలుమార్లు వినతిపత్రాలు అందించినా ఉపయోగం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుండాల – రంగాపురం మధ్య రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తోంది. అటవీశాఖ నుంచి అనుమాలు రావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు అనుమతుల కోసం విన్నవించాం. అనుమతులు రాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తాం. నిధులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. –మోతీలాల్, ఏఈ ఆర్అండ్బీ పనుల నిమిత్తం మణుగూరు వెళ్తుంటాం. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రైవేట్ వాహనాలు తిరగవు. వైద్యం పొందాలన్నా మణుగూరు లేదా గుండాల రావాల్సిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తీసురావాలి. –వాగబోయిన కృష్ణ, రంగాపురం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా ఫారెస్టు అనుమతులు రావడం లేదు.నిధులు వచ్చినా ఉపయో గం లేదు. ఈ రోడ్డు పనులు పూర్తయితే మేడారం వెళ్లేందుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. –తోలెం సాంబయ్య, రంగాపురం -
వైఎస్సార్ నగర్లో దొంగల హల్చల్
ఖమ్మం అర్బన్: ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ నగర్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముసుగులు ధరించి వచ్చిన ఎనిమిది మంది ముఠా కాలనీలోని ఆరు ఇళ్లలో చోరీకి పాల్ప డ్డారు. స్థానికులు వసంతబాయి, రుక్మిణి లేకపోవడంతో వారి ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్టు సమాచారం. దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో కూడా రికార్డు అయ్యాయి. అంతేకాక ఒక బెల్ట్ షాప్లో జొరబడి నగదు చోరీ చేయడంతో పాటు మద్యం తాగినట్లు సమాచారం. ఈక్రమాన ఒక మహిళ అడ్డుకునే ప్రయత్నం చేస్తే సెల్ఫోన్ లాక్కు ని, మరో ఇద్దరిపై దాడి చేసినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో మంగళవారం ఉదయం ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్, సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. అయితే, చోరీల వెనుక స్థానిక యువకులే ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మాదిరి గత నెలలోనూ మధురనగర్ ప్రాంతంలో ముసుగులు ధరించిన వ్యక్తులు చోరీ చేశారు. ఈమేరకు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎనిమిది మంది ముఠా.. ఆరు ఇళ్లలో చోరీ -
మృత్యువులోనూ వీడని స్నేహం
నేలకొండపల్లి: ఎక్కడకు వెళ్లినా కలిసిమెలిసి తిరిగే ఇద్దరు స్నేహితులకు మృత్యువు కూడా విడదీయలేకపోయింది. చీకటి, వర్షం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుండగా.. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రగాయాలతో మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం కోరట్లగూడెంకు చెందిన డిగ్రీ విద్యార్థి బచ్చలకూరి మనోజ్కుమార్(18), మెకానిక్ సన్నీ ప్రసాద్(17) ఇద్దరు స్నేహితులు. వీరు మంగళవారం రాత్రి బైక్పై నేలకొండపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఇటుక బట్టీల సమీపాన ఎదురుగా మరో బైక్ వస్తుండడంతో ఎదురెదురుగా ఢీకొన్నా యి. దీంతో మనోజ్, ప్రసాద్కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ససరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, జోరు వాన, చీకటిగా ఉండడంతో ఎదురుగా బైక్పై వస్తున్న వారికి కనిపించక ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, మృతులిద్దరూ ఒకే గ్రామస్తులు, స్నేహితులు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి -
ఆవు కళ్ల ముందే లేగదూడ మృతి
భద్రాచలంఅర్బన్: తల్లి ప్రేమ మనుషులకే కాదు మూగజీవాలకూ ఉంటుందని నిరూపితమైన ఘట న భద్రాచలంలో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలోని యూబీ రోడ్డులోని జంక్షన్లో నిద్రిస్తున్న లేగదూడ పైనుంచి ప్రమాదవశాత్తు ఓ కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే ఉన్న తల్లి ఆవు గమనించి లేగదూడ చుట్టూ తిరుగుతూ లేపేందుకు తీవ్రంగా యత్నించింది. ఆగ్రహంతో స్థానికులెవరినీ అక్కడికి రానివ్వలేదు. ఎంతసేపు అరిచినా లేగదూడ లేవకపోవడంతో అక్కడే నిలబడి దీనంగా చూస్తుఉండిపోయింది. అనంతరం జంతు ప్రేమికుడు ఉదయ్కుమార్.. స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, లేగదూడను ఉదయ్కుమార్ తన ఫోన్తో వీడియో తీస్తుండగానే ఈ ఘటన జరగడం గమనార్హనం. పశువైద్యులు లేగదూడకు పోస్టుమార్టం నిర్వహించగా, గోదావరి సమీపంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. దూడ పైనుంచి కారు వెళ్లడంతో ప్రమాదం -
గ్రామాలు అభివృద్ధి సాధించేలా..
దుమ్ముగూడెం: మారుమూల ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి ఆది కర్మయోగి అభియాన్ పథకం ప్రవేశపెట్టామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. మంగళవారం మండలంలోని సింగవరం, నడికుడి గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆది సేవ కేంద్రం ప్రారంభించి అధికారులు, గ్రామస్తులతో కలిసి మౌలిక వసతుల కల్పనపై ఢిల్లీ నుంచి వచ్చిన పర్యవేక్షకులు ప్రదీప్కుమార్సింగ్తో కలిసి పీఓ చర్చించారు. 2030 వచ్చేసరికి పథకంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని, అందుకు ప్రతి గ్రామంలో వలంటీర్, సహయోగులను నియమించారని, వారు ప్రతి శనివారం సమస్యలపై చర్చించి, ప్రతిపాదనలు తయారు చేస్తారన్నారు. చివరి శనివారం అధికారుల సమక్షంలో ప్రతిపాదనలు అందజేస్తారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టారని, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రవేశపెట్టామని వెల్లడించారు. అనంతరం సింగవరం, నడికుడి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు వివ రించారు. ప్రదీప్కుమార్సింగ్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఢిల్లీకి పంపించి నిధులు తెప్పించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్, స్పెషల్ ఆఫీసర్ అశోక్కుమార్, ఎంపీఓ రామకృష్ణ, డీఎంటీలు రాంబాబు, మధువన్, జగదీశ్, డీఎంహెచ్ఓ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ చైతన్య, సీడీపీఓ జ్యోతి, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.తొలుత, పీఓ, పర్యవేక్షకులు రాహుల్, ప్రదీప్కుమార్సింగ్కు మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆటపాటలతో స్వాగతం పలికారు. అమ్మవారికి పీఓ రాహుల్ పూజలు భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం శాంతినగర్ కాలనీలోని శ్రీ లలిత పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఐటీడీఏ పీఓ రాహుల్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రెండో రోజైన మంగళవారం శ్రీగాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘ఆది కర్మయోగి అభియాన్’ ప్రారంభం -
నకిలీ పాస్పుస్తకాల కలకలం
వివాదాస్పద భూములతో పాటు వివిధ కారణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను గుర్తించి ఈ ముఠా సంప్రదించడం మొదలుపెట్టింది. వీరికి పాసు పుస్తకాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.లక్షల చొప్పున మొత్తం రూ.కోట్లలో వసూలు చేశారు. భూముల ధర రూ.లక్షల్లో ఉండడంతో రైతులు కూడా ముఠా అడిగినంత డబ్బు ముట్టజెప్పారు. కూసుమంచి మండలంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముఠా సభ్యులు ఎవరికి వారు తమకు పరిచయం ఉన్న రైతుల నుంచి డబ్బు లాగేశారు. డబ్బు తీసుకుని ముఖం చాటేయడంతో రైతుల నుంచి ఒత్తిడి ఎదురైంది. దీంతో నకిలీ పుస్తకాల తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రింటింగ్ ప్రెస్లో పుస్తకాలు తయారుచేసి, కలర్ ప్రింటర్ సాయంతో రైతుల ఫొటోలు, పేర్లు ముద్రించడమే కాక ప్రభుత్వ హాలోగ్రామ్ వేసి రైతులకు అప్పగించారు.కూసుమంచి: సమస్యల్లో ఉన్న భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు ఇప్పిస్తామంటూ రూ.లక్షల మేర వసూలు చేసి నకిలీ పుస్తకాలు అంటగట్టిన ముఠా వ్యవహారం బట్టబయలైంది. ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ముఠాకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి 10 నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి చేతిలో రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల రైతులు మోసపోగా.. బాధితుల లెక్క తేలాల్సి ఉంది. ఆన్లైన్లో లేకపోవడంతో... కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన కళ్లెం అంజిరెడ్డిని అదే గ్రామానికి చెందిన, ముఠాలో ఒకరైన కొత్తా జీవన్రెడ్డి సంప్రదించాడు. మూడెకరాల భూమికి తనకు తెలిసిన వారి ద్వారా పట్టాదారు పాస్పుస్తకం ఇప్పిస్తానంటూ రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజిరెడ్డి విడతల వారీగా రూ.5లక్షలు చెల్లించినా పాసుపుస్తకం ఇవ్వకపోగా మిగిలిన డబ్బు కావాలని ఒత్తిడి చేస్తుండడంతో అనుమానించాడు. ఆపై వాట్సప్లో ఓ పాస్పుస్తకం పంపించాడు. ఆ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో పరిశీలిస్తే లేకపోవడంతో అనుమానం బలపడగా అంజిరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో తీవ్రంగా పరిగణించిన ఆయన సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యాన సీఐ సంజీవ్, ఎస్సై నాగరాజు రంగంలోకి దిగారు. ఈక్రమాన రెండు కార్లలో బుధవారం ఉదయం జీవన్రెడ్డితో పాటు మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారానికి చెందిన కొండూరి కార్తీక్(ప్రస్తుతం ఖమ్మంలో నివాసం), భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన పారిపత్తి సాయికుశల్, లక్ష్మీదేవిపల్లికి చెందిన జక్కపల్లి వరప్రసాద్, ఖమ్మం బొక్కలగడ్డకు చెందిన నందమూరి లక్ష్మణ్రావు(ప్రస్తుతం సారపాకలో నివాసం) వెళ్తుండగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతోనకిలీ పాస్పుస్తకాలు తయారు చేస్తున్నట్లు ఒప్పుకోగా 10 పాస్ పుస్తకాలను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన లక్ష్మణ్ తన ప్రింటింగ్ ప్రెస్లోనే పాస్పుస్తకాలు తయారుచేసినట్లు అంగీకరించారని కూసుమంచి ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ ముఠా చేతిలో ఎందరు రైతులు మోసపోయారో తేల్చేందుకు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
హింసించి చంపుతున్నారు..
అశ్వారావుపేట: స్థానిక పోలీస్స్టేషన్ సెంటర్లో మంగళవారం ఉదయం ఓ కుక్క మరణాన్ని చూసిన వారికి ‘కుక్క చావు’అంటే ఇలా ఉంటుందా? అని అనిపించకమానదు. బైండింగ్ వైర్తో ఉచ్చు వేసి, ఆహార పదార్థం అమర్చి, కుక్క నోటితో పట్టుకోగానే ఉచ్చును బిగించారు. తర్వాత బిగుసుకుపోయిన కుక్కను వ్యాన్లోకి విసిరే క్రమంలో పలుమార్లు వ్యాన్డోర్కు తగిలి కింద పడి విలవిల్లాడుతూ చనిపోయిన ఆ జీవులను చూసి పలువురు అయ్యో పాపం అనుకున్నారు తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. సాధారణంగా అడవిలో వణ్యమృగాలను వేటాడేందుకు వేట కుక్కలుంటాయి. మేకల కాపరులు, వేటగాళ్లు ఈ వేటకుక్కలను పెంచుతుంటారు. కానీ, అశ్వారావుపేటలో కుక్కలను వేటాడే వేటగాళ్లొచ్చి పడ్డారని ప్రజలు అనుకుంటున్నారు.ఎందుకిదంత..?ఒక్కో కుక్కను పట్టుకున్నందుకు ప్రాంతాన్ని బట్టి అవసరాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. గతంలో ఒక్కో కుక్కకు రూ.500 చెల్లించి పట్టించారు. ఒక పంచాయతీలో పట్టకున్న కుక్కలను దూరంగా మరో పంచాయతీ సరిహద్దులో వదిలేస్తారు. మళ్లీ ఇదే పట్టుబడి ముఠాకు చెందిన మరో బృందం పక్కనున్న పంచాయతీలో ఇవే కుక్కలను పట్టుకుంటుంటారు. ఈ క్రమంలో వారం క్రితం ఇతర ప్రాంతం నుంచి అశ్వారావుపేటకు తెచ్చి కొన్ని కుక్కలను, కోతులను విడిచిపెడుతుంటే స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో రాజమండ్రికి చెందిన కొందరు వేటగాళ్లు కుక్కలను వేటాడుతున్నారు. కానీ, జనావాసాల్లో కుక్కలను నియంత్రించాలంటే ముందుగా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి తప్ప ఎలాంటి హింసకు గురిచేయొద్దని పలువురు చెబుతున్నారు. మున్సిపాలిటీ / పంచాయతీ ఖర్చుతో స్థానిక ప్రభుత్వ పశుసంవర్థక శాఖ వైద్యాధికారితో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ అనంతరం చెవికి ట్యాగ్ తగిలించి ఎక్కడ పట్టుకున్నారో అదే స్థానంలో కుక్కను విడిచిపెట్టాలి. అంతేకానీ హింసించడం.. కిడ్నాప్ చేయడం.. అక్రమ రవాణా చేయడం తగదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. కుక్కలతో స్థానికులకు ఇబ్బందులున్న మాట వాస్తవమే కానీ.. వాటినీ సాటి ప్రాణుల్లా చూస్తూ స్థానిక ప్రజానికాన్ని నిబంధనల ప్రకారం కాపాడాల్సిన అవసరం మున్సిపాలిటీ అధికారులపై ఉంది. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు దృష్టికి తీసుకువెళ్లగా.. కుక్కలను పట్టమని చెప్పాం తప్ప హింసించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. కుక్కలను పట్టే ప్రక్రియను తాత్కాలికంగా ఉపసంహరిస్తామని, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. -
సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
చర్ల: మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సీఆర్పీఎఫ్ 81వ బెటాలియన్కు సంబంధించి సీఆర్పీఎఫ్ ఐజీ విపుల్కుమార్ మంగళవారం స్థల పరిశీలన చేశారు. చర్లలోని సర్వే నంబర్ 117లో బెటాలియన్ ఏర్పాటుకు గతంలో పదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా.. తహసీల్దార్ ఎం.శ్రీనివాస్ నుంచి స్థల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. బెటాలియన్ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని, త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షించి నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్తో చర్చించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ సత్యనారాయణపురం కమాండెంట్ ముకేష్కుమార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు, నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్పాత్లే పూల కొట్లు!
ప్రతి నెలా పండగే.. జనవరిలో వచ్చే సంక్రాంతి మొదలు డిసెంబర్ 31 అర్ధరాత్రి నిర్వహించే న్యూఇయర్ వేడుకల వరకు ప్రతీ నెల కనీసం ఒక్క పండగైనా వస్తుంది. ఈ సందర్భంగా ఆయా దేవతలను ఆరాధించేందుకు ప్రతిమలు, పూజా సామగ్రి, బొమ్మలు, దీపాలు, పూలు తదితర వస్తువులు అవసరం. ఇవన్నీ సాధారణ మార్కెట్లో నిత్యం లభించేవి కావు. అప్పటికప్పుడు చిరు వ్యాపారులు ఈ వస్తువులను సేకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటారు. అయితే ఈ క్రయవిక్రయాలు జరిపేందుకు వీలుగా అనువైన స్థలం చూపించడం, అక్కడ కనీస వసతులు కల్పించడంపై జిల్లాలోని స్థానిక సంస్థలు దృష్టి పెట్టడం లేదు. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట వంటి పట్టణాలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో మరీ దారుణం.. పండగలు, ఇతర ఉత్సవాల సమయంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో బస్టాండ్ – రైల్వేస్టేషన్ మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా చిరువ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. బతుకమ్మ పండగ వస్తే పూలు, దీపావళికి బొమ్మలు, వినాయకచవితి రోజున గరిక, వెలగపండ్లు, శివరాత్రి సమయంలో కందమూలాలు, నూతన సంవత్సరం సందర్భంగా కేక్లు ఇక్కడే విక్రయిస్తుంటారు. 500 మీటర్ల నిడివి గల ఈ రోడ్డు ‘ఎస్’ ఆకారంలో ఒంపుతో ఉంటుంది. పైగా అండర్ బ్రిడ్జి కూడా ఉంది. ఇలాంటి ఒంపులు తిరిగిన రోడ్ల వద్ద వాహనాలు ఆపకూడదు. కానీ చిరువ్యాపారులు ఫుట్పాత్లనే అడ్డాలుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తుండగా కొనుగోలుదారులు అక్కడే వాహనాలు ఆపుతున్నారు. ఫలితంగా ప్రతీ పండగ సమయంలో ఇక్కడ ఇక్కట్లు తప్పడం లేదు. ఇతర పట్టణాల్లోనూ ఇవే ఇబ్బందులు.. కొత్తగూడెం కార్పొరేషన్ తరహాలో అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు పురపాలికలు, భద్రాచలం వంటి టెంపుల్ టౌన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రెయినేజీలపై నిర్మించిన ఫుట్పాత్లే పూజా సామగ్రి క్రయవిక్రయ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు ఇక్కడ అమ్మకాలు సాగించేందుకు పల్లెల నుంచి చిరువ్యాపారులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. అర్ధరాత్రి నుంచే ఫుట్పాత్లపై కవర్లు వేసుకుని స్థలాలు ఆపుతుంటారు. రాత్రంతా అక్కడే ఉండే వ్యాపారులు, మహిళలు, బాలికలు తమ కనీస అవసరాలకు చాటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ నెల ఈ తతంతగం జరుగుతున్నా పరిష్కారం చూపించే నాథుడు లేడు. పండగ రోజు తెల్లవారుజామునే వచ్చినా పూలు అమ్మేందుకు రోడ్డు పక్కన స్థలం దొరకదు. అందుకే ముందు రోజు రాత్రే వచ్చి ఇక్కడ ఫుట్పాత్పై జాగ చూసుకోవాలి. రాత్రంతా రోడ్ల పక్కనే ఉండడం ఇబ్బందిగా ఉంది. – కృష్ణవేణి, వ్యాపారి, సుజాతనగర్ రోడ్ల పక్కన బండి ఆపి పూజా సామగ్రి కొనే సమయంలో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. మంచి నాణ్యమైన వస్తువులు మా దగ్గర ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా ఏదో ఒక వస్తువు కొనుక్కుని వెళ్తున్నారు. పార్కింగ్ సౌకర్యం ఉన్న చోట అమ్మకాలకు అవకాశం కల్పిస్తే అందరికీ బాగుంటుంది. – గణేశ్, వ్యాపారి, రాఘవాపురం దీపావళి పండగ సమయంలో బాణ సంచా అమ్మేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఏదైనా స్థలంలో షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూస్తారు. జిల్లాలోని ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన మార్కెట్కు సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. కనీసం ఇలాంటి స్థలాల దగ్గరైనా పర్విదినాల్లో ఉపయోగించే వస్తువులు అమ్మకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇలా చేయడంతో ఇటు చిరువ్యాపారులతో పాటు అటు భక్తులు, పట్టణవాసులకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. పూజా సామగ్రి అమ్మకాలూ ఇక్కడే -
కిన్నెరసాని నాలుగు గేట్లు ఎత్తివేత
గోదావరిలోకి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల పాల్వంచరూరల్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థం గల ఈ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 12 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో నీటిమట్టం మంగళవారం 405.70 అడుగులకు పెరిగింది. దీంతో రాత్రి సమయంలో నాలుగు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు డ్యామ్సైడ్ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. -
అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై దృష్టి
దుమ్ముగూడెం/ బూర్గంపాడు : కోడిపందేలు, పేకాట ,బెట్టింగుల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్ రాజు సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెం, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచాలని, చోరీల కట్టడికి కృషి చేయాలని చెప్పారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘నేను సైతం‘ కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సిబ్బందికి ఎస్పీ ఆదేశం -
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున లక్ష్మీతాయారమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలతో పై రెండు చేతుల్లో పద్మాలను ధరించి వరద – అభయ హస్తాలతో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన నిర్వహించగా పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. కాగా, ఉదయం చిత్రకూట మండపంలో అర్చకులు శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు నిర్వహించారు. తొలిరోజు బాలకాండ పారాయణం గావించారు. అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి హారతి, నివేదన సమర్పించారు. శ్రీరామ పారాయణానికి స్వచ్ఛందంగా వచ్చిన భక్తులకు, పండితులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. నేడు సంతానలక్ష్మిగా దర్శనం.. ‘అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం’ అంటూ సర్వం కీర్తించే సంతానలక్ష్మిగా లక్ష్మీతాయారు అమ్మవారు బుధవారం దర్శనం ఇవ్వనున్నారు. సకల చరాచర జగత్తు ఆ అమ్మ సంతానమని, అందుకే ఆమె సంతానలక్ష్మి అని, ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే సంతాన అవరోధాలు తొలగుతాయని పండితులు తెలిపారు. నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చిన అర్చకులు.. మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు
సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచపల్లి: బతుకమ్మ సంబరాల్లో మూడో రోజైన మంగళవారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ హాజరై మహిళా ఉద్యోగులతో కలిసి ఆడి, పాడారు. సంప్రదాయం ప్రకారం చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం వంటి పూలతో మూడంతరాల్లో బతుకమ్మను పేర్చి తామరపాత్రలో కళాత్మకంగా అలంకరించారు. మహిళా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పూజించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ మాట్లాడుతూ.. ఇలాంటి పండుగలు ఉద్యోగుల మధ్య సఖ్యత, సామరస్య వాతావరణాన్ని పెంచుతాయని అన్నారు. వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎంహెచ్ఓ జయలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, వైద్యశాఖ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ -
‘డ్వాక్రా’ డబ్బు మాయం..
● చేతివాటం ప్రదర్శించిన బుక్ కీపర్ ● మహిళా సంఘాలకు చెందిన రూ.7లక్షలు సొంత అవసరాలకు.. ● ఐకేపీలో వెలుగులోకి వస్తున్న వరుస అక్రమాలుబూర్గంపాడు: ఇందిరా క్రాంతి పథంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆరు నెలల క్రితం సీ్త్ర నిధి రుణాలను పెద్ద మొత్తంలో సీసీ కాజేసిన వ్యవహారం కొలిక్కి రాకముందే వరుస అక్రమాలు బయట పడుతున్నాయి. ఎస్హెచ్జీ సభ్యులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను సారపాకకు చెందిన బుక్ కీపర్ పెద్ద మొత్తంలో స్వాహా చేసినట్లు సోమవారం ఆరోపణలు వచ్చాయి. ఓ ఎస్హెచ్జీ సభ్యులు 9 నెలలుగా చెల్లించిన పొదుపు, బ్యాంకు రుణాలకు సంబంధించిన నగదును బ్యాంకుకు చెల్లించకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేలింది. 9 నెలలుగా గ్రూప్ సభ్యులు పొదుపు, లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గ్రూప్ లీడర్ను ప్రశ్నించగా.. తాము క్రమం తప్పకుండా పొదుపు, రుణం చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో రికార్డులు పరిశీలించాక బుక్ కీపర్ను గ్రూప్ సభ్యులు నిలదీయగా అసలు విషయం తేలింది. ఆమెకు ఇచ్చిన రూ. 5.96 లక్షలతో పాటు మరో గ్రూప్ సభ్యులు చెల్లించిన రూ 1.25లక్షల పొదుపు నగదును కూడా సొంతానికి వాడుకున్నట్లు వెల్లడైంది. దీంతో గ్రూప్ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి ప్రశ్నించగా సభ్యులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఐకేపీ ఏపీఎం హేమంతిని మంగళవారం బుక్ కీపర్ను, గ్రూప్ సభ్యులను కార్యాలయానికి పిలిచి విచారించగా రూ. 7లక్షలకు పైగా నగదును తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు అంగీకరించింది. కొంత సమయం ఇస్తే ఆ నగదు తిరిగి చెల్లిస్తానని సభ్యులకు ఒప్పంద పత్రం రాసిచ్చింది. ఈ బుక్ కీపర్ పరిధిలోని మిగతా గ్రూప్ సభ్యులు కూడా తమ బ్యాంకు లావాదేవీలను మంగళవారం పరిశీలించుకున్నారు. కొన్ని గ్రూపులకు చెందిన నగదు చెల్లింపుల్లో కూడా ఆమె బాగానే చేతివాటం ప్రదర్శించినట్లు చర్చ సాగుతోంది. మొత్తంగా రూ.60 లక్షల వరకు బుక్ కీపర్ తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు ప్రచారం సాగుతుండగా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసి వాస్తవాలను వెలికితీస్తామని ఏపీఎం హేమంతిని తెలిపారు. డ్వాక్రా సభ్యుల్లో ఆందోళన.. బూర్గంపాడు ఐకేపీ కార్యాలయంలో వరుసగా అక్రమాలు వెలుగు చూస్తుండటంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరు నెలల క్రితం ఓ సీసీ సీ్త్రనిధి రుణాల రికవరీలో భారీగా అవినీతికి పాల్పడ్డాడు. కృష్ణసాగర్, లక్ష్మీపురం, నకిరిపేట, సారపాక గ్రామాలకు చెందిన గ్రూపుల నుంచి సీ్త్ర నిధి రుణాల రికవరీకి సంబంధించి రూ. 45 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు సీసీని సస్పెండ్ చేసి నగదు రికవరీకి ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో సీసీని సస్పెండ్ చేసిన అధికారులు.. రికవరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే బూర్గంపాడులోని గౌతమీపురానికి చెందిన డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లోనూ అక్రమాలు జరిగాయని బాధితులు ఐకేపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై కూడా కలెక్టర్ విచారణకు ఆదేశించి, నివేదికలను అందించాలని సెర్ప్ అధికారులకు సూచించారు. ఇంతలోనే సారపాకలో బుక్ కీపర్ చేతివాటం బయటపడింది. బ్యాంకులో తీసుకునే రుణాలకు కూడా బుక్ కీపర్లు, సీసీలు గ్రూప్ సభ్యుల నుంచి భారీగానే డబ్బు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నా.. వివరాలు వెల్లడించేందుకు సభ్యులు భయపడుతున్నారు. బూర్గంపాడు ఐకేపీ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై డీఆర్డీఏ, సెర్ప్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని సభ్యులు కోరుతున్నారు. -
పత్తి కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 1,72,937 ఎకరాల్లో పత్తిసాగు చేశారని, 26,54,140 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారని చెప్పారు. ఈ సంవత్సరం పత్తి మద్దతు ధర రూ 8,110 ప్రభుత్వం నిర్ణయించిదని తెలిపారు. పత్తి కొనుగోళ్లకు ఆరు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని, తూకంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అన్నారు. జిల్లాలో ఉన్న వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని తూనికలు, కొలతల శాఖాధికారిని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, వసతి, గోదాములు, తేమ పరీక్షించే యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పత్తి తీసిన తర్వాత తోటల్లోని కట్టెను బయోచార్ తయారీకి ఉపయోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, మార్కెటింగ్ అధికారి నరేందర్, తూనికలు, కొలతల అధికారి మనోహర్, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు.మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. డ్రగ్స్తో కలిగే నష్టాలపై విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వాటికి బానిసైన వారిని గుర్తించి చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని, డీ అడిక్షన్ సెంటర్ ద్వారా అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. అటవీ శాఖాధికారులు తమ పరిధిలో గంజాయి సాగు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్కు సూచించారు. రక్తదానంపై యువతకు అవగాహన కల్పించి రక్తదాన శిబిరాలు, అనీమియా పరీక్షలు నిర్వహించాలని, నర్సింగ్, ఎన్సీసీ శిక్షణ ద్వారా యువతకు మార్గనిర్దేశం చేయాలని అన్నారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఐఈఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ రైతులకు అగచాట్లు !
● అధికారులకు ముందస్తు ప్రణాళిక లేదనే ఆరోపణలు ● బారులుదీరుతున్న గెలల ట్రాక్టర్లు ● రవాణాను అడ్డుకున్న రైతులుఅశ్వారావుపేట: ఆయిల్ఫెడ్ అధికారులు, పాలకులకు ముందస్తు ప్రణాళిక లేకనే అశ్వారావుపేట ఆయిల్పామ్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు నిత్యం ఇక్కట్ల పాలవుతున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. గంటకు 5టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో అశ్వారావుపేటలో ఆయిల్పామ్ కర్మాగారాన్ని ప్రారంభించారు. దశల వారీగా సామర్థ్యాన్ని పెంచుతూ ప్రస్తుతం గంటకు 30 టన్నుల ప్రకారం రోజుకు సరాసరి గరిష్టంగా 500 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నడుస్తోంది. కానీ అశ్వారావుపేట ఫ్యాక్టరీ పరిధిలో రోజుకు వెయ్యి టన్నుల గెలలు దిగుబడి వస్తుండడంతో అధికారులు గత మూడు రోజులుగా హార్వెస్టింగ్ హాలిడే ప్రకటించి సోమవారం నుంచి గెలలు తీసుకుంటున్నారు. మూడు రోజులు గెలలు నరకకపోవడం, నరికినా తోటల్లోనే ఉంచుకోవడంతో గెలల నుంచి గింజలు రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒకే రోజు ట్రాక్టర్లు భారీగా రావడంతో క్యూలో గంటల తరబడి వేచి ఉండలేక అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఫ్యాక్టరీ గేటుకు ట్రాక్టర్ను అడ్డుగా నిలిపి ఆందోళనకు దిగారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆలస్యం కాకుండా వెంటనే అన్లోడ్ చేసుకుంటారని, అశ్వారావుపేట ఫ్యాక్టరీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను, ట్రాక్టర్ డ్రైవర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత మేనేజర్ నాగబాబుతో వాగ్వాదానికి దిగారు. దీనికి మేనేజర్ స్పందిస్తూ అప్పారావుపేట ఫ్యాక్టరీ 90 టన్నుల సామర్థ్యంతో నడుస్తున్నందున ఎన్ని గెలలు వచ్చినా దిగుమతి చేసుకుంటారని, అశ్వారావుపేట ఫ్యాక్టరీ 30 టన్నుల సామర్థ్యంతో నడుస్తున్నందున రోజుకు 500 టన్నుల గెలులు మాత్రమే తీసుకోగలమని చెప్పారు. సోమవారం సాయంత్రానికి 350 టన్నుల గెలలు దిగుమతి చేసుకున్నామని, ఇంకా తీసుకునేందుకు కూడా సిద్ధంగానే ఉన్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఏటా ఇవే తిప్పలు.. వర్షం పడిందంటే చాలు ఫ్యాక్టరీ నుంచి జాతీయ రహదారి వరకు ఒక్కోసారి కిలోమీటర్ మేర గెలల ట్రాక్టర్లను క్యూలో నిలపాల్సి వస్తోంది. అశ్వారావుపేట పరిసరాల్లో ఆయిల్పామ్ తోటలను విస్తరిస్తున్న క్రమంలో గెలల దిగుబడికి అనుగుణంగా ఫ్యాక్టరీని ఆధునికీకరించలేదు. గంటకు 30 టన్నుల క్రషింగ్కు మించి విస్తరించడానికి 20 ఏళ్ల క్రితం నాటి పరిశ్రమ భాగాలు సహకరించవు. ఇప్పటికే అప్పుడప్పుడు ఆగుతూ సాగుతూ.. రోజుకు 500 టన్నుల గెలల క్రషింగ్ చేయడమే గొప్ప అని చెప్పొచ్చు. ఈ ఫ్యాక్టరీని అలాగే ఉంచి కొత్తగా 120 టన్నుల సామర్థ్యంతో మరో ఫ్యాక్టరీని నిర్మించడం తప్పితే వేరే ప్రత్యామ్నాయమే లేదని రైతులు అంటున్నారు. ఈ మేరకు ఆయిల్ఫెడ్ అధికారులు సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఎవరు మోకాలడ్డారో తెలియదు కానీ.. ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయిల్ఫెడ్లో ప్రాధాన్యతలు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేటలో నిర్మించాల్సిన రెండో ఫ్యాక్టరీని అప్పారావుపేటకు తరలించడం వెనుక ఉన్న శక్తులే అశ్వారావుపేటలో మూడో ఫ్యాక్టరీని కూడా అడ్డుకుంటున్నాయని అంటున్నారు. ప్రాంతీయ విబేధాలు, రాజకీయాలకు అతీతంగా అశ్వారావుపేటలో 120 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మిస్తే సీజన్లో కొత్తదాంతో, అన్సీజన్లో పాత ఫ్యాక్టరీతో క్రషింగ్ చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. -
నేడు అభయహస్త ధారిణిగా ఆదిలక్ష్మి
రామాలయంలో ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలుభధ్రాచలం : రెండు చేతుల్లో పద్మాలు ధరించి వరద, అభయ హస్తాలతో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు తొలిరోజు ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని తొలిరోజు ఆదిలక్ష్మిగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు ఉపాలయం వద్ద ప్రత్యేక వేదిక సిద్ధం చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంత్రం సామూహిక కుంకుమార్చన, చిత్రకూట మండపంలో రామాయాణ పారాయణం జరపనున్నారు. ముత్తంగి అలంకరణలో రామయ్య.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
ఏదీ.. ఆనాటి జోష్ !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ప్రకటించగానే సంప్రదాయ మార్కెట్లో ఒక్కసారిగా జోష్ వచ్చేది. అయితే కొన్నేళ్లుగా ఆన్లైన్ మార్కెట్, బడా షాపింగ్ మాళ్లు జిల్లాలో పాగా వేయడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. కాగా ఈ సారి ఆన్లైన్, బడామాల్స్కు దీటుగా తాము కూడా ధరల యుద్ధానికి సై అంటున్నాయి సంప్రదాయ మార్కెట్ వర్గాలు. పది రోజుల ముందే.. దసరా పండగ వస్తోందంటే సంప్రదాయ మార్కెట్లు కొత్తకళ సంతరించుకునేవి. కొత్తగూడెంలో ఎంజీరోడ్డు, చిన్నబజార్, పెద్ద బజార్, భద్రాచలంలో యూబీ రోడ్డు, పాల్వంచలో శాస్త్రిరోడ్, ఇల్లెందులో ఆంబజార్, మణుగూరు మెయిన్రోడ్లలో షాపులన్నీ వినియోగదారులతో నిండిపోయేవి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపుల యజమానులు రకరకాల ప్రయత్నాలు చేసేవారు. తాము అందిస్తున్న ఆఫర్లు, ప్రత్యేక బహుమతులు, లక్కీడ్రాకు సంబంధించిన వివరాలతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేవారు. బ్యాండ్ ్ మేళాలు, విచిత్ర వేషధారణతో మనుషులను షాపుల ముందు ఉంచి హంగామా చేసేవారు. పండగకు పది రోజుల ముందు నుంచే ఈ పరిస్థితి కనిపించేది. అటువైపు వాహనాల్లో వెళ్లడం కష్టంగా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇటు వస్త్ర, అటు కిరాణా దుకాణాలు క్రమంగా ఆనాటి వైభవాన్ని కోల్పోతున్నాయి. ధరల సవరణకు సై.. ఆన్లైన్ మార్కెట్, బడా షాపింగ్ మాళ్లతో పోల్చితే సంప్రదాయ మార్కెట్లో లభించే వస్తువుల ధరలు కొంత ఎక్కువగానే ఉంటున్నాయి. దీన్ని ఆసరా చేసుకుని వినియోగదారులను ఆకర్షించడం ద్వారా న్యూ ఏజ్ మార్కెట్ పుంజుకుంది. దీని దెబ్బకు నిన్నా మొన్నటి వరకు దుకాణాలు నిర్వహించే వ్యాపారులే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పడు వారికి సరుకులు సరఫరా చేసే బడా వ్యాపార సంస్థలకు సైతం ఈ సెగ తాకింది. గతంలో వలె భారీగా ఆర్డర్లు రావడం తగ్గిపోయింది. దీంతో ఆన్లైన్ మార్కెట్కు పోటీగా ధరల యుద్ధానికి సంప్రదాయ మార్కెట్ వర్గాలు, హోల్సేల్ వ్యాపారులు సై అంటున్నారు. ఈసారి పండగ సీజన్లో ఆన్లైన్, బడాషాపింగ్ మాల్స్కు దీటుగా తాము కూడా పోటీలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు వచ్చాక జీవితంలో ఇంటర్నెట్ భాగమైంది. ఇంట్లోనే తీరికగా కూర్చుని వందల రకాల వస్తువులను సెర్చ్ చేసుకుని, ధరలను సరిపోల్చుకుని, ఆ వస్తువును వాడిన వినియోగదారుల ఫీడ్బ్యాక్ తెలుసుకుని షాపింగ్ చేయడం ఎక్కువైంది. కాలు బయట పెట్టకుండానే ఇంటి వద్దకే వస్తువలు రావడం మొదలైంది. మరోవైపు పెద్ద నగరాలకే పరిమితమైన బడా షాపింగ్ మాళ్లు జిల్లాలకూ వచ్చేశాయి. కిరాణా వంటి నిత్యావసరాలతో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపడ బట్టలు, బంగారం అమ్మే మాల్స్ కూడా వచ్చాయి. దీంతో సంప్రదాయ మార్కెట్కు వచ్చే వినియోగదారులు క్రమంగా తగ్గిపోతుండగా పండగ సీజన్లో కిటకిటలాడే బజార్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ‘బజార్’ దుకాణాలకు పండగ కళ వచ్చేనా ? రెండేళ్ల క్రితం షూ కొనేందుకు దుకాణానికి వెళ్లా. ఎమ్మార్పీపై కొంత తగ్గించండి అని అడిగితే మా దగ్గర ఫిక్స్డ్ రేట్ అని షాపు యజమాని చెప్పాడు. అదే షూ మీద ఆన్లైన్లో మంచి డిస్కౌంట్ ఉంది. అప్పటి నుంచి క్రమంగా ఆన్లైన్లోనే కొనడం అలవాటైంది. ధరల విషయంలో ఆఫ్లైన్ మార్కెట్ వర్గాలు కొంత మారాల్సి ఉంది. – కె.లక్ష్మణ్, వినియోగదారుడు, కొత్తగూడెం కొన్నేళ్లుగా ఆన్లైన్, బడాషాపింగ్ మాల్స్ నుంచి మాకు తీవ్రమైన పోటీ ఎదురైంది. దీని ప్రభావం సంప్రదాయ మార్కెట్లో రిటైలర్ నుంచి తయారీదారు వరకు అందరిపైనా పడింది. అందుకే ఈసారి నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలో అమ్మాలనే వ్యూహంతో ముందుకు వస్తున్నాం. – మొరిశెట్టి భవానీ ప్రసాద్, వ్యాపారుల సంక్షేమ సంఘం కన్వీనర్, కొత్తగూడెం -
రీజియన్లో 6,376 మందికి లబ్ధి
సింగరేణి(కొత్తగూడెం) : గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన రూ. 6,394 కోట్ల నికర లాభంలో 34 శాతం కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీంతో కొత్తగూడెం రీజియన్లోని 6,376 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఇల్లెందు ఏరియాలో 585 మందికి, కొత్తగూడెం కార్పొరేట్లో 1,109, కొత్తగూడెం ఏరియాలో 2,363, మణుగూరులో 2,321 మంది కార్మికులకు రూ.1,95,610 చొప్పున అందనున్నాయి. అయితే కార్మికులు 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో చేసినమస్టర్ల ఆధారంగా బోనస్ చెల్లిస్తారు. రూ.8,289 అ‘ధనం’.. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కార్మికుడికి రూ.1,87,321 బోనస్ చెల్లించారు. ఈ ఏడాది రూ.8,289 చొప్పున పెంచగా ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 చొప్పున అందనున్నాయి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించగా.. ఇల్లెందులో 350 మందికి, మనణుగూరులో 2 వేలు, కార్పొరేట్లో 1,500, కొత్తగూడెం ఏరియాలో 2,500 మొత్తం 6,350 మందికి రూ.5,500 చొప్పున చెల్లించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక్కో కాంట్రాక్ట్ కార్మికుడు రూ.5వేల చొప్పున బోనస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెగ్యులర్ కార్మికులకు 1999 – 2000 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా లాభాల వాటాను బోనస్గా ప్రకటించారు. అప్పుడు ఒక్కో కార్మికుడికి రూ.2వేల చొప్పున అందగా.. ప్రస్తుతం రూ.2లక్షలకు చేరువలో కార్మికులు బోనస్ అందుకుంటుండడం విశేషం. సింగరేణి కార్మికులకు అందనున్న లాభాల బోనస్ -
బాలాత్రిపుర సుందరీ దేవిగా పెద్దమ్మతల్లి
వైభవంగా ప్రారంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యావాచనం, రుత్వికరణ, దీక్షా వస్త్రధారణ, అఖండ దీపారాధన, గోపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ రజినీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు దంపతులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఐదుగురు ఏఎంవీఐల నియామకం కొత్తగూడెంటౌన్: జిల్లాకు కొత్తగా నియమితులైన అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లు సోమవారం జిల్లా ఇన్చార్జ్ ఆర్టీఓ వి.వెంకటరమణ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నూతనంగా నియమితులైన వారిలో రాజశేఖర్రెడ్డి, ఆశోక్, మానస, రాకేష్, శ్వేత ఉన్నారని, వీరిలో ఇద్దరు మహబూబాబాద్, ఇద్దరు మంచిర్యాల జిల్లాలకు, మరొకరు వరంగల్ జిల్లా వారని వెంకటరమణ తెలిపారు. ప్రతీ వాహనదారుడు తప్పకుండా పన్నులు చెల్లించాలని, లైసెన్స్, వాహనాలకు సంబంధించిన పత్రాలన్నీ సక్రమంగా ఉండాలని అన్నారు. ఆరోగ్య సేవలపై దృష్టి పెట్టాలి డీఎంహెచ్ఓ జయలక్ష్మి చుంచుపల్లి: గర్భిణులు, శిశువుల ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణిని తప్పనిసరిగా నమోదు చేయాలని, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని అన్నారు. ప్రతీ శిశువుకు పూర్తి స్థాయిలో టీకాలు వేయాలని, ఈ మేరకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో వైద్యాధికారులు పుల్లారెడ్డి, మహ్మద్ ఫైజ్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
బీటీపీఎస్లో అక్రమాలపై విచారణ చేపట్టాలి
మణుగూరు రూరల్: బీటీపీఎస్ సీఈపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని జాతీయ ఆదివాసీ అఖిలపక్ష ప్రజాసంఘాల అధ్యక్షులు చందా లింగయ్యదొర జెన్కో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సాంబాయిగూడెం గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. బీటీపీఎస్ నిర్మాణంలో 641మంది ఆదివాసీలు భూములు కోల్పోతే, 73మందికే పరిహారం, ఉపాధి కల్పించారని అన్నారు. 357 మంది భూములు లేని గిరిజనేతరులకు ప్యాకేజీతోపాటు ఉద్యోగం కల్పించారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న సీఈపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు గొగ్గల రామకృష్ణ దొర, కొమరం శ్రీను, కుంజా వెంకటరమణ, చిడెం నాగేశ్వరరావు, మడి గౌతమి, గోపాల్, కుంజా ఆది లక్ష్మి, పి.విజయలక్ష్మి, మంగమ్మ, రజిని పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
● బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్సూపర్బజార్(కొత్తగూడెం)/చుంచుపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని, మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. సోమవారం డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన పాల్గొని మహిళా ఉద్యోగులతో ఆడిపాడారు. అనంతరం మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటా, పాటలతో గౌరమ్మను కొలుస్తారని చెప్పారు. ఈ పండుగను ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండేలా బతుకమ్మ దీవెనలు అందించాలని ఆకాంక్షించారు. అంతకుముందు అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి పట్టణం, మండల కేంద్రం, గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం తగిన ప్రదేశాలను గుర్తించి ముందుగానే లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. మహిళలు, పిల్లలు అధికంగా పాల్గొంటారని, భద్రతా చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలతా లెనీనా, డీఎంహెచ్ఓ డాక్టర్ జయలక్ష్మి, ఆయా శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జీవాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.. సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో మేకలు, గొర్రెల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలో శిక్షణ పొందిన వివిధ శాఖల అధికారులు తిరుపతయ్య, కార్తీక్, హేమంత్కుమార్తో సోమవారం ఆయన సమావేశమయ్యారు. శిక్షణలో నేరుకున్న అంశాలను వారు కలెక్టర్కు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా స్థానికంగా లభించే మట్టిని వినియోగించి గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణాలు, ఉపాధి కూలీలకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, ప్రహారీలు, పశువుల పాకలు, పౌల్ట్రీ షెడ్ల వంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. స్థానిక జాతి మేకల అభివృద్ధికి మేలుజాతి పోతులను ఎంపిక చేసి ఏదైనా గ్రామంలో ఐదు పోతులు పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, పశువైద్యులు ఆనంద్, సంతోష్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
‘ఆదికర్మయోగి’పై గ్రామాల్లో అవగాహన
భద్రాచలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు నేరుగా అందించేందుకు చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలు, కార్యాచరణపై సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తయిందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫైర్స్ జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్ సోమవారం పీఓను ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా అభియాన్ పథకం కార్యక్రమ అమలు తీరు వివరాలను పీఓ ఆయనకు తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు డీఎంటీలకు ప్రత్యేక శిక్షణ అందించి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించామన్నారు. ప్రతి గ్రామానికి నోడల్ ఆఫీసర్ను నియమించి, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కలిగేలా ప్రచారం చేశామని చెప్పారు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాల వారికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల గుర్తింపుకార్డులు ఈ పథకం ద్వారా అందుతాయని చెప్పారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి.. అర్హులైన ప్రతీ గిరిజనుడికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, సిబ్బంది పని చేయాలని పీఓ రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందజేసి ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, గురుకుల ఆర్సీఓ అరుణకుమారి, ఈఈ సత్యానందం, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు భాస్కర్, ఉదయ్కుమార్, రాజారావు, లక్ష్మీనారాయణ, వేణు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడి -
డీర్ పార్కు సిబ్బందికి శిక్షణ
పాల్వచరూరల్: కిన్నెరసాని డీర్ పార్కు సిబ్బందికి హైదరాబాద్లోని నెహ్రు జులాజికల్ పార్కులో సోమవారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. జింకల ఫోషణ, రెస్క్యూ విధానంపై జూపార్కు డైరెక్టర్, ఇతర అధికారులు అవగాహన కల్పించారు. యానంబైల్ సెక్షన్ ఆఫీసర్ కిషన్, బీట్ ఆఫీసర్ నరేష్, డీర్ పార్కు వాచర్లు ఇబ్రహీం, కళ్యాణ్ శిక్షణకు వెళ్లిన వారిలో ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుచండ్రుగొండ: రోడ్డు ప్రమాదంలో సోమవారం ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గానుగపాడుకు చెందిన మొగలిపువ్వు నాగరాజు, తాటికూరి ఎల్లయ్య ద్విచక్రవాహనంపై సుజాతనగర్ నుంచి గానుగపాడుకు వస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అన్నరంతండా వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను చండ్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్షఇల్లెందు: మద్యం తాగి వాహనం నడిపిన మండలంలోని మస్సివాగు గ్రామానికి చెందిన బోడ మల్సూర్కు ఇల్లెందు న్యాయమూర్తి సోమవారం నాలుగు రోజుల జైలు శిక్ష , రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఇటీవల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా మద్యం తాగి వాహనం నడుపుతున్న మల్సూర్ పట్టుబడ్డాడు. సీఐ సురేష్ కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కీర్తిచంద్రికరెడ్డి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఏజెన్సీలో వాహన తనిఖీలుఇల్లెందురూరల్: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మండలంలోని ఇల్లెందు–గుండాల ప్రధాన రహదారిపై కొమరారం పోలీసులు సోమవారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాహనదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. తనిఖీల్లో కొమరారం ఎస్సై నాగుల్మీరా, సిబ్బంది పాల్గొన్నారు. -
సుత్తితో కొట్టి వ్యక్తి హత్య
కొత్తగూడెంఅర్బన్: తలపై సుత్తితో ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన కొత్తగూడెంలో సంచలనంగా మారింది. టిఫిన్ తింటున్న సమయంలో అకస్మాత్తుగా ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడ్డాడు. త్రీటౌన్ పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గణేష్బస్తీకి చెందిన గుబ్బల రాంమోహన్రావు సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందగా, గణేష్బస్తీలో ఇంటిని కొనుగోలు చేసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రాంమోహన్రావు(62), భార్య సావిత్రిలు టిఫిన్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి చేతిలో సుత్తి పట్టుకుని ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో భయాందోళన చెందిన దంపతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తప్పించుకునే ప్రయత్నంలో రాంమోహన్రావు ఇంటి బయటకు రావడంతో అతని తలపై సుత్తితో కొట్టి అతిదారుణంగా హత్య చేశాడు. నిందితుడు చుట్టుపక్కల వారిని కూడా కొంతదూరం వరకు పరుగెత్తించి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ, వన్, టూ, త్రీటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రామవరం వైపు వెళ్లినట్లు గుర్తించారు. మృతుడు రాంమోహన్రావుకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు, భార్య సావిత్రి ఉన్నారు. రిటైర్మెంట్ అనంతరం కుమారుడికి సింగరేణి ఉద్యోగం ఇచ్చాడు. కాగా రాంమోహన్రావు కొనుగోలు చేసిన ఇల్లు వివాదంలో ఉండటం లేదా వివాహేతర సంబంధమే కారణమనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
ప్రమాదంలో వ్యక్తి మృతి
చుంచుపల్లి: చుంచుపల్లి విద్యానగర్ బైపాస్ వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం ఊకొండి గ్రామానికి చెందిన పోగుల సుభాష్ (42) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదానికి గురై మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి సోదరి కవిత ఫిర్యాదుతో చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. జూలూరుపాడు: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు వల్లపిన్ని సత్యనారాయణ(65) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. సత్యనారాయణ ఇంటి ఆవరణలో నూతనంగా తెచ్చిన వాటర్స్ప్రే మిషన్తో ట్రాక్టర్ను కడిగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం తర్వాత సత్యనారాయణ దంపతులు హైదరాబాద్లో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడికి భార్య అరుణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని సొసైటీ మాజీ చైర్మన్ పోలుదాసు క్రిష్ణమూర్తి, నున్నా రోశరావు, కాంగ్రెస్ నాయకులు నున్నా కృష్ణయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చండ్ర నరేంద్రకుమార్, మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్మీరా, యల్లంకి మధు, గార్లపాటి వీరభద్రం సందర్శించి, సంతాపం తెలిపారు. అన్నదమ్ముల ఘర్షణపాల్వంచరూరల్: తల్లిదండ్రుల ఇంటి స్థలం పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాళోత్ వీరన్న, బాహుసింగ్ అన్నదమ్ములు. ఇంటి స్థలం విషయంలో గొడవపడి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
రామయ్య సేవలో సంగీత దర్శకుడు
భద్రాచలంటౌన్: భద్రాచలం సీతారామచంద్రస్వామివారిని దేవస్థానాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు బోలె షావలీ సోమవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేష్, కోటేష్, సత్యలింగం, వెంకటేష్, సుధాకర్, శ్రీనివాస్, నటరాజ్, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణా తరగతులను జయప్రదం చేయాలిపీఓడ్లబ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ ఇల్లెందు: వచ్చే నెల 11,12 తేదీల్లో నల్లగొండ జిల్లా బొట్టుగూడలో నిర్వహించే పీఓడబ్ల్యూ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పీఓడ్లబ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ కోరారు. సోమవారం ఇల్లెందు ఎన్డీ కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడారు. సనాతన ధర్మం పేరుతో మత చాందసవాదం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. పసి పిల్లలపై అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం అమ్మకపోతే సంక్షేమ అమలు చేయలేమని ప్రభుత్వాలు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. 30 నుంచి 35 ఏళ్ల వయసులోనే ఎంతో మంది మహిళలు వితంతువులుగా మారడానికి, కుటుంబ కలహాలకు మద్యమే కారణమ ని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు ఆదిలక్ష్మి, కల్తీ సుభద్ర, మోకాళ్ల సుగుణ, సరోజిని, భూలక్ష్మి, రాపర్తి లక్ష్మి, మంగ, సమ్మక్క పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: మొదటి రోజు సోమవారం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి తెలిపారు. ఇంటర్లో 39 మంది అభ్యర్థులకు గానూ 24 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరయ్యారు. పదో తరగతిలో 36 మంది అభ్యర్థులకు గానూ 26 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షకు 59 మంది విద్యార్థులకు గానూ 48 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ రెండు సెంటర్లను సందర్శించారు. కొనసాగుతున్న కిన్నెరసాని నీటి విడుదలపాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్లోకి 10 వేల క్యూసెక్కుల వరదనీరు వస్తుండటంతో సోమవారం నీటిమట్టం 406.50 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ మూడు గేట్లు రాత్రి సమయంలో ఎత్తివేసి 15 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. యూరియా సరఫరాను మెరుగుపరుస్తాంజిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు బూర్గంపాడు: యూరియా సరఫరాను మెరుగుపరిచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు అన్నారు. బూర్గంపాడులోని పీఏసీఎస్ గోదాం వద్ద జరుగుతున్న యూరియా విక్రయాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు వానాకాలం పంటలకు యూరియా సరఫరాలో కొన్ని ఇబ్బందులు కలిగాయని, వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. యూరియా డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని విక్రయాల వద్ద పోలీస్ బందో బస్తును ఏర్పాటు కోరుతున్నామని తెలిపారు. ఏఓ శంకర్, సొసైటీ సీఈఓ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ గెలల తిరస్కరణపై నిరసన
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆయిల్పామ్ గెలల తిరస్కరణ పేరుతో ఒక్కో ట్రాక్టర్కు 50 కేజీల వరకు తగ్గించి, కాంటా రశీదును ఇస్తున్నారని గొర్రెగుట్ట గ్రామానికి చెందిన రైతు మల్లారెడ్డి రమణమూర్తి ఆరో పించారు. సోమవారం ఆయన ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలిపారు. పలుకుబడి ఉన్న రైతులకు ఎలాంటి తిరస్కరణ లేదని, కేవలం సామాన్య రైతుల గెలలనే అధికారులు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. తిరస్కరించిన గెలలను రైతులకు వెనక్కి ఇవ్వడం లేదన్నారు. దీనిపై ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ను వివరణ కోరగా.. పచ్చి, పుచ్చు, పనికిరాని గెలలను పరిశీలించాకే సిబ్బంది కాంటాలో తగ్గించి రాస్తారని తెలిపారు. -
పాడె మోసిన ఎమ్మెల్యే జారె
అశ్వారావుపేటరూరల్: మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జుజ్జురు వెంకటనారాయణ(55) సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, మృతదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. వెంకట నారాయణ పాడె మోసి అంతిమ వీడ్కోలు పలికారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నివాళులర్పించినవారిలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. క్షతగాత్రురాలిని కారులో ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యేచండ్రుగొండ: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆది నారాయణ సోమవారం అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి చండ్రుగొండ వైపు వస్తున్నారు. అదే సమయంలో సీతాయిగూడెం వద్ద దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏపీ రాష్ట్రం కుక్కునూరుకు చెందిన పూనం ఓసమ్మ, భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వస్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. దీంతో ఆమె తీవ్రగాయాలు కాగా, ఎమ్మెల్యే జారె బాధితురాలిని తన కారులో చండ్రుగొండ పీహెచ్సీ తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వీధి వ్యాపారులకు
● ఇటీవల బ్యాంకర్లు, మెప్మా అధికారులతో కలెక్టర్ సమావేశం ● మొదటి, రెండో విడత రుణాల మొత్తం పెంపు ● మూడో విడత రుణం చెల్లిస్తే క్రెడిట్ కార్డులు మంజూరు ● లోక కళ్యాణ్ మేళాలతో అవగాహన కల్పిస్తున్న మెప్మా అధికారులు మళ్లీ రుణాలు..కొత్తగూడెంఅర్బన్: పీఎం స్వనిధి పథకంలో వీధి వ్యాపారులకు ఇచ్చే రుణాలు గతేడాది నిలిచిపోయాయి. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్తోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణాలు అప్ గ్రేడ్ చేయడం, నూతన సాఫ్ట్వేర్ డిజైన్ వల్ల రుణా ల మంజూరులో జాప్యం జరిగిందని మెప్మా అధి కారులు తెలిపారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం రుణాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు, మెప్మా అధికారులతో గత శనివారం సమావేశం నిర్వహించారు. రుణాల మంజూరు గైడ్లైన్స్ను బ్యాంకర్లకు అందజేశారు. 2024 డిసెంబర్ 31 నుంచి నిలిపివేసిన రుణాలు మళ్లీ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కావడంతో వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే రుణ మొత్తం పెంచడంతో తమకు ఆసరా అవుతుందని పేర్కొంటున్నారు. ఈసారి క్రెడిట్ కార్డు సైతం.. 2020 నుంచి వీధి వ్యాపారులను గుర్తించి రుణాలు మంజూరు చేస్తున్నారు. మొదటి రుణంగా రూ.10 వేలు ఇచ్చి, వాయిదాల పద్ధతిలో అది తిరిగి చెల్లించాక రెండో రుణంగా రూ.20 వేలు, మూడో రుణంగా రూ.50 అందించేవారు. తాజాగా మొదటి రుణా న్ని రూ.15వేలు, రెండో రుణంగా రూ.25వేలు, మూడో రుణంగా రూ.50 వేలు ఇవ్వనున్నట్లు గైడ్లైన్స్లో పేర్కొన్నారు. మూడో రుణం తిరిగి చెల్లిస్తే క్రెడిట్ కార్డు కూడా ఇవ్వన్నారు. ప్రైవేటు మైక్రోఫైనాన్స్ నుంచి కాపాడేందుకు, తక్కువ వడ్డీతో రుణా లు పొంది ఆర్ధికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీధి వ్యాపారులకు ఈ రుణాలు మంజూరు చేస్తున్నారు. కొత్తగా గ్రూపుల ఏర్పాటు.. వీధి వ్యాపారులు కొత్తగూడెం కార్పొరేషన్లో 11,142 మంది, మణుగూరులో 2,028, ఇల్లెందులో 1,875 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీలో వీధి వ్యాపారులను గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు మహిళలను గ్రూప్గా ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేసేలా మెప్పా అధికారులు కృషి చేస్తున్నారు. ఇక నుంచి వీధివ్యాపారులతో కూడా గ్రూప్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటగా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో గ్రూప్లు ఏర్పాటు చేయనున్నారు. మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళా రుణాల ప్రక్రియ తిరిగి ప్రారంభమైన విషయంపై అవగాహన కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనుండగా, రుణ స్థాయి పెంపు, ఇతర మార్గదర్శకాలను మెప్మా అధి కారులు వివరిస్తున్నారు. గతంలో రుణం తీసుకుని పూర్తిగా చెల్లించినవారు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని సమీపంలోని మెప్మా కార్యాలయానికి వెళ్తే ప్రొసిడింగ్స్ ఇస్తారు. అవి తీసుకుని మళ్లీ బ్యాంక్లో అందజేస్తే రుణం మంజూరువుతుంది. కార్పొరేషన్తోపాటు మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో, బ్యాంకులలో మేళాలు నిర్వహిస్తున్నట్లు మెప్మా అధికారులు చెబుతున్నారు. ఈ సారి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి వీధి వ్యాపారులకు సర్టిఫికెట్లను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం రుణల మంజూరుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినా, కలెక్టర్ సమావేశం నిర్వహించి గైడ్లైన్స్ అందించినా బ్యాంకర్లు ఆంక్షలు పెడుతున్నారని వీధి వ్యాపారులు పేర్కొంటున్నారు. రుణంకోసం బ్యాంకులకు వెళ్తే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైందని, అప్పుడే రుణాలు రావని, ఫోన్ చేసి సమాచారం ఇస్తామంటూ బ్యాంక్ అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు. -
ఎస్పీ అభినందనలు
కొత్తగూడెంటౌన్: అశ్వారావుపేట, మణుగూరు, కొత్తగూడెం త్రీటౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో మర్డర్ కేసుల్లో నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లను ఎస్పీ రోహిత్రాజు అభినందించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీవీడీ లక్ష్మి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లావణ్య, విశ్వశాంతి, రాజారావు, కోర్టు డ్యూటీ అధికారులు అశోక్, హేమీలాల్, నాగేశ్వరావు, మోహన్, శోభన్లను అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోక్ అదాలత్లో కూడా కేసుల పరిష్కారానికి కృషి చేయచడం అభినందనీయమని పేర్కొన్నారు. కొత్తగూడెం డీఏస్పీ అబ్దుల్ రెహమాన్, త్రీటౌన్ సీఐ శివప్రసాద్, ఎస్ఐ రాఘవ పాల్గొన్నారు. ఆన్లైన్ స్కీం మోసాలపై ఫిర్యాదుఇల్లెందు: ఇల్లెందులో ఓ ఆన్లైన్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో పెద్ద సంఖ్యలో బాధితులు రోడ్డున పడ్డారు. ఈ మేరకు పరదేవీ బస్తీకి చెందిన కిరణ్ పాసీ, కళ్యాణ్ పాసీ, బాలప్రసాద్ పాసీ, లక్ష్మీనారాయణలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన శంకర్, బిస్వాస్తోపాటు మరికొందరు ఆన్లైన్ స్కీం ప్రతినిధులు ఆన్లైన్ కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురి నుంచి రూ.17,500 వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులుగా చెలామణి అయిన వారి అకౌంట్లు సీజ్ చేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. -
గుండాలలో కుండపోత వర్షం
గుండాల: గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో సోమవా రం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. సుమా రు రెండు గంటలపాటు వర్షం కురవగా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అంతర్గత రోడ్లు నీటితో నిండిపోయాయి. కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడు మెలికల వాగు, జల్లేరు, ఈదుల వాగు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెం సమీపంలోని వాగులో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. రాయపాడు గ్రామానికి చెందిన రైతు ఊకే పాపయ్య ట్రాక్టర్పై పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. జిన్నెలగూడెం వద్ద వాగు దాటుతున్న సమయంలో వరద పెరగడంతో రైతు వెంటనే పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ కొంత దూరం కొట్టుకుపోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.వాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్ -
సెలవులకు ఊరెళ్తున్నారా?!
● కొద్ది జాగ్రత్తలతో మీ సొత్తు భద్రం ● సూచనలు జారీ చేసిన పోలీసుశాఖఖమ్మంక్రైం: విద్యాసంస్థలకు దసరా సెలవులు మొదలయ్యాయి. ఇంకోపక్క బతుకమ్మ సందడి ప్రారంభమైంది. దీంతో పిల్లలతో సహా కుటుంబాలు స్వగ్రామాలు లేదా విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరనున్నాయి. ఇదే అదునుగా దొంగలు తమ చేతులకు పదును పెట్టే అవకాశముంది. ఈ నేపథ్యాన కష్టపడి సంపాదించిన నగదు, ఆభరణాలు దొంగల పాలుకాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ సూచించారు. శాఖా పరంగా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేశామని వెల్లడించిన ఆయన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సీపీ జారీ చేసిన సూచనలు ●పేపర్లు, ఖాళీ సంచులు ఏరుకోవడం, ఇతర సామగ్రి అమ్మకం పేరిట వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఎవరైనా అనుమానంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్దకు ఒకటి, రెండు సార్లు ఎవరైనా వచ్చి వెళ్లినా అప్రమత్తం కావాలి. ●ఇళ్లలో వృద్ధులు ఉంటే అపరిచితులకు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సూచించాలి. తరచుగా పరిశీలించాలని ఇరుగుపొరుగు వారికి తెలపాలి. వీరి తద్వారా తరచూ సమాచారం తెలుసుకోవాలి. ●ఇతర చోట్లకు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో పెట్టొద్దు. బ్యాంక్ లాకర్లలో పెట్టడం ద్వారా భద్రత ఉంటుంది. ఇంటికి తాళం వేసి చాలారోజులు వెళ్లాల్సి వస్తే సమీప పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. తద్వారా సిబ్బంది గస్తీకి వచ్చినప్పుడు పరిశీలించే అవకాశం ఉంటుంది. ●కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం. తద్వారా ఎక్కడ ఉన్నా సెల్ఫోన్లో తమ ఇంటి చుట్టూ జరుగుతున్న అంశాలను తెలుసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్లకు తప్పనిసరిగా వాచ్మెన్లను నియమించుకోవాలి. అంతేకాక సమీప పోలీసుస్టేషన్తో పాటు పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్నంబర్లు తీసుకుంటే అనుమానితులు కనిపించినప్పుడు సమాచారం ఇవ్వడం వీలవుతుంది. ●బీరువా తాళాలు ఇంట్లో పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి. ఇంటి తాళం కానరాకుండా చూస్కోవాలి. అలాగే, ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టం అమర్చుకోవడం సురక్షితం. -
మమ్మేలు తల్లీ..
పాల్వంచరూరల్: భక్తులు కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ)ఆలయం శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు ముస్తాబైంది. విద్యుత్దీపాల అలంకరణతో శోభిల్లుతోంది. ఏటా దసరా పండుగకు ముందు ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు వేడుకలు జరపనున్నారు. ఈ సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తారు. మొక్కులు తీర్చుకుంటారు. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా వేద పండితులను తీసుకొచ్చి అమ్మవారికి పూజలు జరిపిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని రోజూ సహస్ర నామార్చన, కుంకుమార్చనలు, చండీహోమం, శ్రీచక్రార్చనలు, ఇతర హోమాలు, అమ్మవారికి దర్బారు సేవ, నవదుర్గ అలంకారాలతో కొలువు నిర్వహించనున్నారు. కలశస్థాపనతో వేడుకలు ప్రారంభం 22న ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, అఖండ దీపారాధన, దీక్షాధారణ చేయనున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరా వు దంపతుల కలశస్థాపనతో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు క్యూలైన్లు, నీరు, నీడ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి రంగులువేశారు. వాల్పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథం ద్వారా ప్రచారం చేశారు. ఆలయం చుట్టూ లైటింగ్, పలుచోట్ల హోర్డింగులు ఏర్పాటు చేశారు. వేడుకల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచీ భక్తులు హాజరుకానున్నారు. దీంతో పదిరోజులపాటు ఆలయ ప్రాగంణం భక్తులతో కిటకిటలాడనుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ రజనీకుమారి, ఆలయ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తెలిపారు. అమ్మవారి అలంకారాలు.. వేడుకలను పురస్కరించుకుని అమ్మవారు దశ రూపాల్లో దర్శనమిస్తారని, ఈసారి ఒకరోజు ఎక్కువగా ఉత్సవాలు జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. మొదటి రోజున 22న శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. 23న మంగళ గౌరిదేవీ, 24న అన్నపూర్ణదేవి, 25న శ్రీగాయత్రీదేవి, 26న మహాలక్ష్మి దేవి, 27న శ్రీలలితా పరమేశ్వరీదేవి, 28న శ్రీచండీ దేవి, 29న శ్రీసరస్వతీదేవి, 30న శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న మహిషాసుర మర్ధిని, 2న శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథుల్లో హెచ్చు తగ్గులు వచ్చాయి. దీంతో ఈసారి నవరాత్రి వేడుకలు ఒకరోజు ఎక్కువగా జరుగుతాయి. రెండేళ్లకో సారి ఇలా జరుగుతుంది. గతంలో ఒకసారి 20 రోజు ల పాటు వేడుకలు జరిగిన సందర్భం కూడా ఉంది. – పద్మనాభశర్మ, వేదపండితుడు ఆలయంలో తొమ్మిది రోజులపాటు శ్రీదేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు వై భంగా జరుగుతాయి. చివరి రోజు సామూహిక రమాసహిత సత్యనారాయణ వ్రత పూజలు, అన్నదానం నిర్వహిస్తాం. –ఎన్.రజనీకుమారి, పెద్దమ్మగుడి ఈఓ -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరి పారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.నేడు గిరిజన దర్బార్భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేయాలని కోరారు. అధికారులు ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో హాజరుకావాలని పేర్కొన్నారు. నేడు ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా అధికారులంతా బతుకమ్మ సంబురాల ఏర్పాట్లలో నిమగ్నమైన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేతపాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటి నిల్వసామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి 8వేల క్యూసెక్కు ల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివా రం నీటిమట్టం 406.30 అడుగులకు పెరిగింది. ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తి ఉంచి 13వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. నేటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలుఖమ్మం సహకారనగర్ : ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు ఉంటాయని, ఖమ్మం నగరంలోని పదో తరగతి, ఇంటర్కు ఒక్కో పరీక్ష కేంద్రం చొప్పున ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేంద్రంలో పదో తరగతి విద్యార్థులు 287 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాల(రిక్కాబజార్) కేంద్రంలో 254 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించామని, ప్రతీ సెంటర్కు సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశామని, తాగునీరు, మెడికల్, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఏమైనా సందేహాలుంటే ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు(80084 03522)ను సంప్రదించాలని సూచించారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఈఓ దీక్షారైనా తెలిపారు. వారసత్వ ఉద్యోగాలకు ఇంటర్వ్యూఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా ఉద్యోగుల వారసులకు కారుణ్య నియమాకాల కోసం ముఖాముఖి నిర్వహించారు. ఆదివారం జీఎం కార్యాలయంలో ఎస్ఓటూ జీఎం రామస్వామి, డీజీంఎ పర్సనల్ తుకారాం ఆధ్వర్యంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులకు కుటుంబ సభ్యులు, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూ నిర్వహించారు. అన్ని వివరాలు నమోదు చేసి వైద్య పరీక్షలకు పంపారు. -
ఆర్థిక పరిపుష్టి
అధిక దిగుబడి..కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో.. రైతులు మోసపోకుండా ఉండేందుకు, అధిక దిగుబడులు సాధించాలనే లక్ష్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, జిల్లాలో కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో విత్తనాలు అందజేశారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టాల బారిన పడకుండా రక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి ఒకరిద్దరు చొప్పున ప్రగతిశీల రైతులను ఎంపిక చేసి విత్తనాలు అందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వంగడాలు.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాణ్యమైన, అధిక దిగుబడులు ఇచ్చే, చీడపీడల బారిన పడని వ్యాధి నిరోధక శక్తి కలిగిన విత్తనాలను అభివృద్ధి చేసి అందిస్తున్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపై దృష్టి సారించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం, విత్తనం కొద్దీ పంట అనే నినాదంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విత్తనాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విత్తన కిట్లు వానాకాలం సీజన్లో ఎంపిక చేసిన రైతులకు పంపిణీ చేశారు. వరిలో డబ్ల్యూజీఎల్–44, డబ్ల్యూజీఎల్–1537 రకాల విత్తనాలు, పెసర పంటలో ఎంజీజీ–295 విత్తన కిట్లను అందించారు. ఈవిత్తనాలు అధిక దిగు బడి ఇస్తాయని, నేల సారానికి అనుకూలత, రైతుల ఆదాయాన్ని పెంచే లక్షణాలు కలిగి ఉంటాయని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నాణ్య మైన విత్తనాల కార్యక్రమం సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతుందని, రైతుల ఆదా యవృద్ధి, పంటల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రతకు దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నా రు. కేవీకే ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు 836 విత్తన కిట్లను పంపిణీ చేశారు. వీటిలో వరి డబ్ల్యూజీఎల్–44 విత్తనాలు 220కిట్లు, డబ్ల్యూజీఎల్–1537 విత్తనాలు 127 కిట్లు పంపిణీ చేశారు. వరిలో పిలకలు ఎక్కువగా ఉండటం, చీడపీడలు సోకడం లేదని సాగు చేసిన రైతులు చెబుతున్నారు. దీంతో మిగతా రైతుల నుంచి ఈ రకాలకు డిమాండ్ పెరుగుతోంది. పెసర ఎంజీజీ–295 విత్తనాలు –489 కిట్లను అందించగా, దిగుబడి పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. తక్కువ వ్యవధిలో పంట, అధిక ఉత్పాదకత కారణంగా ఇతర రైతులు ఆసక్తి చూపుతున్నారు.వ్యవసాయ సీజన్ ప్రారంభంలో మార్కెట్లో వివిధ రకాల విత్తనాలు విక్రయిస్తారు. విస్తృతంగా ప్రచారం చేస్తూ అధిక దిగుబడులు వస్తాయంటూ దళారులు నమ్మిస్తారు. దీంతో పలువురు రైతులు నమ్మి ఆ విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నారు. కొన్ని నాసిరకం, నకిలీ విత్తనాలు కావడంతో పంట ఏపుగా ఎదగక, ఎదిగినా దిగుబడులు రాక నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా పూడక అప్పుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు మేలైన విత్తనాల సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. –సూపర్బజార్(కొత్తగూడెం)డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు కృషి చేస్తాం. రైతుల ఆర్థిక పరిపుష్టి, ఆహార భద్రత సాధనలో ఇవి కీలకం. సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కేవీకే సహకరిస్తుంది. –డాక్టర్ టి.భరత్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీకి శ్రీకారం -
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ముదిగొండ: ముదిగొండ మండలంలో సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని యడవల్లి, మాదాపురం, ముదిగొండలో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, పలు పార్టీల నాయకులు భట్టి సమక్షాన కాంగ్రెస్లో చేరనున్నారు. కాగా, వెంకటాపురంలో ఆదివారం ఏర్పాటుచేసిన సన్నాహాక సమావేశంలో కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడారు. భట్టి పర్యటనను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, మహిళా విభాగం జిల్లా, మండల అధ్యక్షురాలు సౌజన్య, ఝాన్సీరాణి, నాయకులు కందిమళ్ల వీరబాబు, ఇసుకల రమేష్, మట్టా బాబురాంరెడ్డి పాల్గొన్నారు. -
ఖమ్మం.. కథలకు కాణాచి
ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ తెలుగు ప్రత్యేకం కాగా.. అందులో ఖమ్మం కథలకు కాణాచిగా నిలుస్తోందని తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధకులు, విమర్శకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ‘ఖమ్మం స్ఫూర్తి– కథా తెలంగాణ సంస్థ’ ఆధ్వర్యాన ఖమ్మంలో ఆదివారం జరిగిన ‘కందిలి తెలంగాణ కథల సంకలనం’ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఈ సంకలనంలో ఆదివాసీల జీవితం, సామాజిక స్థితిగతులు తదితర అంశాలపై 11 మంది రాసిన కథలు విభిన్నమైన కథాంశాలతో ఉన్నాయని తెలిపారు. అంతేకాక కవి, కథకులు వంశీకృష్ణ రాసిన విశ్లేషణ దారీ, దీపంగా నిలుస్తుందని చెప్పా రు. సాహిత్య, సామాజిక విశ్లేషకులు వేణుగోపాల్, పెద్దింటి అశోక్కుమార్ మాట్లాడగా కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు ప్రసేన్, ధరణికోట రమేష్ కుమార్, సీతారాం, రవిమారుత్, షఫీ, ఇబ్రహీం, నిర్గుణ్, జయశ్రీ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
భద్రగిరిలో రేపటి నుంచి..
● భద్రాచలం రామాలయంలో శరన్నవ రాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు ● తొమ్మిదిరోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి తొమ్మిదిరోజులపాటు మహా లక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమివ్వనున్నా రు. తొమ్మిది రోజుల అలంకరణ అనంతరం విజ యదశమి రోజున దసరామండపంలో శమీ, ఆయుధ పూజ, శ్రీ రామలీలా మహోత్సవాలను ఘనంగా జరపనున్నారు. ప్రతీ రోజు శ్రీలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అభిషేకం, చిత్రకూట మండపంలో సామూహిక శ్రీ రామాయణ పారాయణం, మధ్యాహ్నం శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిఽధిలో సామూహిక కుంకుమార్చన, సాయంత్రం చిత్రకూట మండపంలో శ్రీరామాయణ ప్రవచనం, తిరువీధి సేవ, ఇతర ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మంగళవారం ఆదిలక్ష్మిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. 24న సంతానలక్ష్మి, 25న గజలక్ష్మి, 26న ధనలక్ష్మి, 27న ధాన్యలక్ష్మి, 28న విజయలక్ష్మి, 29న ఐశ్వర్య లక్ష్మి, 30న వీరలక్ష్మి, అక్టోబర్ 1న మహాలక్ష్మిగా అమ్మవారిని అలంకరించనున్నారు. 2న విజయదశమి సందర్భంగా విజయోత్సవం, శమీ పూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. ఆదిలక్ష్మి అలంకరణ విశిష్టత శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారు తొలిరోజు ఆదిలక్ష్మిగా దర్శనమివ్వనున్నారు. భగవంతుని గుర్తించడానికే ఆలంబమైన లక్ష్మీ తత్వాన్నే ఆదిలక్ష్మి అంటారని, ఆ అమ్మ వారి వల్లనే వేదవేద్యుని గుర్తించగలిగారని పండితులు చెబుతున్నారు. చతుర్భుజాలతో, పై రెండు చేతుల్లో పద్మాలను ధరించి, వరద–అభయ హస్తాలతో విరాజిల్లుతున్న ఆదిలక్ష్మి అమ్మవారు తొలి అలంకరణగా రామాలయంలో దర్శనమివ్వనున్నారు. -
శ్వేతపత్రం విడుదల చేయాలి
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం హయంలో వాటా ఎంత ఇచ్చినా జూన్లో చెల్లించాలనే ప్రతిపాదన పెట్టేవాళ్లం. ప్రస్తుత సంఘాలు ఈ విషయంపై పట్టించుకోవడం లేదు. కార్మికుల సమస్యలు పక్కన పెట్టి, కేవలం వారి సొంత ఆరోపణలపై ఆందోళన చేసుకోవటం సిగ్గుచేటు. గుర్తుకు వచ్చినప్పడు లాభాల విషయం మాట్లాడితే, కంపెనీకి వీలైనప్పుడు చెల్లిస్తుంది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలకు సత్తా లేదు. –మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఇది కార్మికుల సొత్తు. దసరా పండుగకు చెల్లించాల్సిన ఆనవాయి తీఉంది.గుర్తింపు,ప్రాతినిధ్య సం ఘాల చేతకానితనంతో రాష్ట్ర ప్ర భుత్వం లాభాలవాటా విషయం లో రాజకీయం చేస్తోంది. కంపెనీకి లాభాలు రూ.5 వేలకోట్లు వచ్చినట్లు ప్రచారంఉంది. ఈ విష యం ప్రకటించాలి. కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలి. –రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి -
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా..
కొత్తగూడెంటౌన్: తెలంగాణ సంప్రదాయ వేడుకై న బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆట, పాటలతో పల్లె, పట్టణం సందడిగా మారాయి. వీధులన్నీ బతుకమ్మ పాటలతో మార్మొగాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలు ఆదివారం ఎంగిలపూల బతుకమ్మతో మొదలయ్యాయి. ఆడపడచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుకుని సాయంత్రం చౌరస్తాలకు చేరుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో..., చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుడీ ముద్దుల గుమ్మ.., ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మా.. తదితర గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. కొందరు ఇళ్ల ముందు, ఆలయాల్లో సంబురాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెంలో సూపర్బజార్, రైటర్బస్తీ, పాత కొత్తగూడెం, హనుమాన్ బస్తీ, విద్యానగర్ కాలనీ, హెడ్ ఆఫీస్ ఏరియా, పోస్టాఫీస్ ఏరియా, బస్టాండ్ సెంటర్, మఽధురబస్తీ, రామవరం, రుద్రంపూర్, లక్ష్మీదేవిపల్లి తదితర ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులు సంబురాలు నిర్వహించారు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చెరువులు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రసాదం పంపిణీ చేశారు. -
అలరించిన సంగీత లహరి
భద్రాచలంటౌన్: పట్టణంలోని గుప్త ఫంక్షన్ హాల్లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని నటరాజ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంగీత లహరి కార్యక్రమం అలరించింది. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేతెల్లం వెంకట్రా వు, తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ భీమపాక నగేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. బాలసుబ్రహ్మణ్యం ఎన్నో వేల పాటలు పాడి తెలు వాడి ఖ్యాతిని చాటారని పేర్కొన్నారు. సంగీత లహరి వంటి కార్యక్రమాలతో కళాకారుల ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్, సింగర్ రాజు, పాకల దుర్గాప్రసాద్, బుడగం శ్రీనివాస్, వరలక్ష్మి, సత్యలింగం, రాఘవయ్య, విజయరావు, ఉదయ్కుమార్, శ్రీలత, శ్రీహరి, నరేష్, వెంకటేష్, గౌతమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హరిహర క్షేత్రాన్ని సందర్శించిన న్యాయమూర్తిపట్టణంలోని హరిహర అయ్యప్ప క్షేత్రాన్ని తెలంగా ణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ నంబూద్రి అరున్ రామచంద్రన్ స్వా గతం పలకగా న్యాయమూర్తి స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆవరణలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. హాజరైన హైకోర్టు న్యాయమూర్తి, ఎమ్మెల్యే -
రైతుపై బీట్ ఆఫీసర్ దాడి
గుండాల: కోతుల నుంచి కాపాడుకునేందుకు చేనుకు సమీపంలో ఉన్న చెట్లు నరికిన ఓ రైతుపై అటవీశాఖ బీట్ ఆఫీసర్ భాస్కర్ దాడి చేసి గాయపర్చిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి మండలం చంద్రాపురం గ్రామానికి చెందిన దంపతులు గొగ్గల బుచ్చయ్య – లక్ష్మి మొక్కజొన్న చేను వద్ద కాపలాకు వెళ్లారు. చేను వద్దకు వచ్చిన కాచనపల్లి రేంజ్ వలసల బీట్ ఆఫీసర్ భాస్కర్ చెట్లు ఎందుకు నరికారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భుచ్చయ్యపై చేయి చేసుకుని గాయపర్చాడు. చేను చుట్టూ కోతుల నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వల, విద్యుత్ ఫెన్సింగ్ను తొలగించాడు. విద్యుత్ మీటర్ను తీసుకెళ్తుండగా బుచ్చయ్య బతిమిలాడగా.. చేయి చేసుకున్నాడు. అసభ్యంగా దూషించినట్లు బుచ్చయ్య, లక్ష్మి ఆరోపించారు. మొక్కజొన్న చేనును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నామని, కోతులు చెట్ల మీద ఉండటం వల్ల వాటిని చేనుకు దూరం చేయాలనే ఉద్దేశంతో చెట్లు నరికితే దాడి చేశాడని, మరోమారు చెట్లు నరకమని బతిమిలాడినా వినకుండా చేయి చేసుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయమై సెక్షన్ ఆఫీసర్ బేబీని వివరణ కోరగా దాడి చేయటం అవాస్తవమన్నారు. చెట్లు నరికినందుకు హెచ్చరించాడని తెలిపారు. ఇదిలాఉండగా రైతుపై దాడి చేసిన ఫారెస్టు బీట్ ఆఫీసర్ భాస్కర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ నేతలు గొగ్గెల శ్రీను, పాయం సత్యనారాయణ కోరారు. -
వాటా.. ఎంతంటా..?
● లాభాల్లో వాటా ప్రకటించడంపై యాజమాన్యం దోబూచులాట ● 35 శాతం చెల్లించాలని కార్మికులు, సంఘాల నేతల డిమాండ్ సింగరేణి(కొత్తగూడెం): ఈ ఏడాది సింగరేణి యాజమాన్యం లాభాల్లో వాటాను ప్రకటించలేదు. కనీసం లాభాలను కూడా ప్రకటించలేదు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాలను ప్రకటించి, గతేడాది కార్మికులకు చెల్లించిన వాటా 33 శాతానికి మరో 2 శాతం పెంచి 35 శాతాన్ని ఇవ్వాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. ఏటా దసరా పండుగకు 10 రోజుల ముందు లాభాలు ప్రకటించి, ఏరోజు చెల్లిస్తారో తేదీని ప్రక టించేది. కానీ, ఈ సారి లాభాల ప్రకటన లేదు. శాతం ఊసే లేదు. అయితే, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగటంతో రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటన చేయాలని యాజమాన్యం భావిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో లాభాల వాటాపై దృష్టి సారించకపోవడంతో కార్మిక వర్గం ఆందోళన చెందుతోంది. 1998 నుంచి లాభాల్లో వాటా సింగరేణి సంస్థ ఆర్థిక సంవత్సరంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి, వాటి అమ్మకాలు టర్నోవర్పై ఏటా కంపెనీ ఆర్జించిన లాభాల్లో కొంతశాతం వాటాను 1998 నుంచి కార్మికులకు చెల్లిస్తోంది. గతేడాది కంపెనీ సాధించిన లాభాల్లో 33 శాతం వాటాను కార్మికులకు చెల్లించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు మాసాలు అయినప్పటికీ ఇంకా టర్నోవర్ను కానీ, లాభాలను కానీ ప్రకటించలేదు. యాజమాన్యం లాభాల వాటాను ఎప్పుడు ప్రకటిస్తుందోనని కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎంతో..? గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ గతంలో బీఆర్ఎస్ కంటే (2022–23)లో 32 శాతం చెల్లిస్తే, తాము అధికంగా ఇప్పిస్తామని చెప్పి 2023–24లో 33 శాతం మాత్రమే చెల్లించేలా చేసింది. అయితే ఈసారి పాత 33 శాతమే చెల్లిస్తుందా? లేక ఎంతోకొంత పెంచి ఇస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. -
97 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.41 లక్షలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫార్సుతో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 97 మందికి రూ.41 లక్షల సాయం మంజూరు కాగా, పీసీసీ ప్రధానకార్యదర్శి మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు తుంబూరు దయాకర్రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్ లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. వివిధ మండలాల నాయ కులు బాలాజీనాయక్, స్వర్ణ నరేందర్, వడ్డెబోయిన నరసింహారావు, ఉమ్మినేని కృష్ణ, ఉప్పునూతల నాగేశ్వరరావు, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, అర్వపల్లి శివ, బోడా శ్రావణ్, కాంపాటి వెంకన్న, గౌస్, విప్లవ్కుమార్, గురుమూర్తి, వేణు, రంజిత్ పాల్గొన్నారు. బాలిక ప్రసవం ఖమ్మంవైద్యవిభాగం/ఖమ్మంక్రైం: బాలిక ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తండాకు చెందిన సదరు బాలిక గర్భం దాల్చగా, నెలలు నిండడంతో కుటుంబీకులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం చేర్పించినట్లు సమాచారం. అక్కడ బాలిక ఆడశిశువుకు జన్మనివ్వగా, పాపను తీసుకెళ్లేందుకు వారు నిరాకరించారని తెలిసింది. దీంతో శిశువును అమ్మేందుకు ఆస్పత్రి నర్సు ద్వారా బేరసారాలు సాగించినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో ఐసీడీఎస్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పోలీసులు విచారణ చేపట్టారు. శిశువును స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే, చివరకు బాలిక బంధువులే తీసుకెళ్తామని చెప్పినట్లు సమాచారం. కాగా, బాలిక గర్భానికి అదే తండాకు చెందిన యువకుడు కారణమని గుర్తించి ఖమ్మం వన్టౌన్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశాక, మరిపెడ పోలీసుస్టేషన్కు బదలాయించారు. అయితే, శిశువు అమ్మకం విషయమై వివరణ కోరేందుకు బాలల సంరక్షణ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. ఎలక్ట్రీషియన్కు కరెంట్షాక్ సత్తుపల్లిరూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్కు విద్యుదాఘాతంతో గాయాలయ్యాయి. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ధర్మసోత్ రామకృష్ణ ప్రైవేట్ ఎలక్ట్రీషన్గా పని చేస్తున్నాడు. ఓ రైతు పొలంలో మోటారు ఫ్యూజ్ పోయిందని చెప్పగా, ఆదివారం మరో వ్యక్తితో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్ద సరఫరా నిలిపేందుకు ప్రయత్నించాడు. రామకృష్ణ మెడలో ఉన్న గొలుసు 33/11 కేవీ వైర్కు తాకగాషాక్తో ఆయన మెడ భాగం కాలిపోయింది. ఆయన్ను 108 ద్వారా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. -
మరక మంచిదే..!
● ఏసీబీకి దొరికినా కఠిన చర్యలు కరువు ● బదిలీ లేదా పాత స్థానంలోనే పోస్టింగ్ ● ఫలితంగా రెవెన్యూ శాఖలో యథావిధిగా దందా సత్తుపల్లి: ఏసీబీ అధికారులకు పట్టుబడడం.. ఆపై కొన్నాళ్లకు మరోచోట పోస్టింగ్ వస్తుండడంతో రెవెన్యూ శాఖలోని కొందరు ఉద్యోగులకు ‘మరక మంచిదే’ అన్న చందంలా మారింది. అవినీతి ఉద్యోగులపై కఠిన చర్యలేమి లేకపవడంతో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా యథాతధంగా దందా సాగించడం రివాజులా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 2019 మార్చిలో గంగారం వీఆర్వోగా పనిచేసిన పద్ధ వెంగళరావు రైతు దాసరి మాధవరెడ్డి నుంచి రూ.18వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆ వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ వెంగళరావు అయ్యగారిపేట జీపీఓగా సత్తుపల్లి తహసీల్లోనే ఇటీవల మళ్లీ చేరడం గమనార్హం. ఇలా రెవెన్యూశాఖలో అవినీతి కేసుల్లో ఏసీబీకి పట్టుబడిన వారిలో ఎక్కువ మంది పాత స్థానాల్లో పోస్టింగ్ తెచ్చుకుంటుండడంతో గతంలో ఫిర్యాదు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. మాకేంటి భయం? రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారులకు తలనొప్పి తీసుకొస్తుందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో ఒకరిదిద్దరు ఆర్ఐలు ఎలాంటి భయం లేకుండా ఫోన్పే ద్వారా డబ్బు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అధికార పార్టీలోని ఓ ముఖ్యనేత సదరు ఆర్ఐలను పిలిచి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. అయినా వారిలో మార్పు రాకపోగా మరింత విచ్చలవిడిగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది. అంతా ఆపరేటర్ల చేతుల్లోనే.. భూమి రిజిస్ట్రేషన్లుకు వచ్చే రైతుల నుంచి నేరుగా అధికారులు డబ్బు తీసుకోవడం లేదని సమాచారం. కంప్యూటర్ ఆపరేటర్లను మధ్యవర్తులుగా నియమించుకుని వారితోనే బేరసారాలు సాగించడంతో పాటు డబ్బు వసూళ్లు కూడా వారి చేతుల మీదుగానే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏసీబీ దాడి జరిగినా నేరుగా పట్టుబడే అవకాశం లేకపోవడంతో అధికారులు ఈ మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. దీన్ని అదునుగా తీసుకుని కొన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోని ఆపరేటర్లు అధికారులు చేయలేని పనులను సైతం అవలీలగా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నట్లు తెలిసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలైన వీరి ఆగడాలపై ఫిర్యాదులు వస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం కారణాలు అంతుపట్టక జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు వచ్చినా, ఏసీబీకి పట్టుబడినా బదిలీతోనే సరిపెడుతుండడంతో వారిలో భయం ఉండడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇంకొందరికై తే అదే మండలంలో పోస్టింగ్ దక్కుతుండడంతో మళ్లీ దందా మొదలుపెట్టేస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఆర్ఐల బదిలీ వ్యవహారం ఇందుకు నిదర్శనంగా నిలవగా... కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేసినా వారి వ్యవహార శైలిలో మార్పు రావటం లేదనే విమర్శలున్నాయి. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె
ఇల్లెందురూరల్: మండలంలోని హనుమంతులపాడు గ్రామంలో జక్కుల సతీశ్ (40) ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున తన గదిలో దూలానికి ఉరివేసుకున్న సతీశ్ను ఉదయం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అతడికి ఇద్దరు కుమార్తెలు ఉండటంతో పెద్దకుమార్తె సంజన తలకొరివి పెట్టింది. మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య పెద్ద అల్లుడైన సతీశ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సతీశ్కు భార్య ఝాన్సీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతిదమ్మపేట: కొబ్బరి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన చొప్పారపు రాజేశ్ (29) భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం మొద్దులగూడెం శివారులోని కొబ్బరితోటలో కాయలు కోయడానికి ఈ నెల 14న వచ్చాడు. ఆయన చెట్టుపైకి ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. సత్తుపల్లిలో చికిత్స అనంతరం విజయవాడ తరతలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై రాజేశ్ తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దమ్మపేట ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. -
బీటీపీఎస్లో అధికారుల చేతివాటం!
మణుగూరు రూరల్: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో అధికారుల తీరు ఇష్టారాజ్యంగా మారింది. మామూళ్లు ఇచ్చినవారికే టెండర్లు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2015లో అప్పటి ఐటీడీఏ పీఓ బీటీపీఎస్ ప్రభావిత గ్రామాలైన సాంబాయిగూడెం, దమ్మక్కపేట, సీతా రాంపురం, పోతిరెడ్డిపల్లి–1,2,3 గ్రామాల్లో వీటీడీఏలు ఏర్పాటు చేశారు. ప్లాంట్లో ప్రారంభమయ్యే అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పనులు 100 శాతం స్థానికులకు, స్థానిక వీటీడీఏ సొసైటీలకు అప్పగించాలనే నిబంధనతో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ప్లాంట్లో 150మంది వరకు సుమారు 60 కిలోమీటర్ల దూర ప్రాంతాలవారే ఉన్నారు. 2018లో స్థానిక సొసైటీ సభ్యులకే ఆర్టిజన్లుగా అవకాశం కల్పించా లని, సుమారు 300 మందికి తగ్గకుండా తీసుకోవా లని ఉత్తర్వులున్నా అమలు చేయలేదని, ఇందుకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు అవకాశాలు కల్పించారని తెలుస్తోంది. నామినేటెడ్ పనుల్లో కూడా స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫ్లైయాష్, యాష్పాండ్ టెండర్లలో ఓ అధికారి చక్రం తిప్పి ఇతర ప్రాంతానికి చెందిన ఓ కంపెనీకి రూ. 10లక్షలకు కట్టబెట్టారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే అధికారి స్క్రాప్ టెండర్ వ్యవహారంలో రూ.20లక్షలు తీసుకున్నారని, తాను గతంలో పనిచేసిన కంపెనీలోని ఓ వ్యక్తి కుటుంబానికి టెండర్ అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ అవసరాలకు వినియోగించే కమర్షియల్ వెహికల్స్ స్థానంలో సొంత వాహనాలు తిప్పుతూ రూ. లక్షల్లో బిల్లులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై బీటీపీఎస్ సీఈ బిచ్చన్నను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
ప్రకృతి ఆరాధన.. బతుకమ్మ
● ఎంగిలిపూలతో ప్రారంభమై సద్దులతో ముగియనున్న వేడుకలు ● బతుకమ్మ నైవేద్యాలూ ప్రత్యేకమే.. ● ఆనందోత్సాహాలతో ఆడి, పాడనున్న ఆడబిడ్డలు కొత్తగూడెంటౌన్/పాల్వంచరూరల్: సీ్త్ర శక్తిని గౌరవించే పండుగ.. ప్రకృతిని ఆరాధించడమే.. బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఈ పండుగ ప్రతీక. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలో ఇమిడి ఉంటుంది. ఆశ్వయుజ మాస శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. గౌరి పండుగ, సద్దుల పండుగ, పూల పండుగగా పిలుచుకుంటారు. మహాలయ అమావాస్య ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పండుగ దుర్గాష్టమితో ముగుస్తుంది. తెలంగాణ గ్రామీణ సమాజంలో నవాబులు, భూస్వాముల పెత్తందారీలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. ఆ అకృత్యాలకు ఆత్మహత్య చేసుకున్న మహిళలను తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే అని ప్రజల విశ్వాసం. కాగా, తెలంగాణ ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పండుగకు ప్రాధాన్యత పెరిగింది. గతంలో కొన్ని చోట్ల మాత్రమే బతుకమ్మ ఆడేవారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత వాడవాడనా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పండుగ బతుకమ్మ పండుగకు పుష్పాలే కళ. వానాకాలం చివరిలో శీతాకాలం ఆరంభంలో ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో నీటితో నిండిన జలాశయాల్లో తామర, కలువ వంటి పూలు లభిస్తాయి. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, నంది వర్దనం పూలు పూస్తాయి. సీతా ఫలాలు లభిస్తాయి. జొన్న పంట కోత సమయం. ఆడబిడ్డలు అత్తవారి ఇంటి నుంచి కన్న వారింటికి వచ్చి ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవటం ప్రత్యేకత. తొమ్మిది రోజుల పాటు నిత్యం ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు నైవేద్యం తయారీలో యువతీ, యువకులు పాల్గొంటారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజున మహిళలు మాత్రమే నైవేద్యాన్ని తయారు చేస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ● ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమావాస్య నుంచి ఎంగిలిపూల బతుకమ్మగా వేడుకలు ప్రారంభమవుతాయి. పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ● ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. ● నాన బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేసి సమర్పిస్తారు. ● అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ● అలిగిన బతుకమ్మ: ఆశ్వయుజ పంచమి రోజున నిర్వహించే ఈ రోజున ఏ నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించరు. ● వేపకాయల బతుకమ్మ: బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ● వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. ● సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి. ఈ రోజున దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ కలిపిన అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిది రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసలు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. రోజుకో రకంగా.. తొమ్మిది రోజుల పాటు రోజుకో విధంగా బతుకమ్మను పేర్చి పండుగను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆటపాటలతో జరుపుకుంటాం. రోజుకో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తాం. బయటకు వెళ్లి తంగేడు, గునుగు పూలను సేకరించి బతుకమ్మ పేర్చుతాం. స్నేహితులతో కలిసి పూల సేకరణ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. –ఎ.ప్రియాంక, రామవరం ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకుంటాం. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో మా ప్రాంతం సందడిగా ఉంటుంది. పూల సేకరణ, బతుమ్మ పేర్చడం అంటే ఎంతో ఇష్టం. పూలను ఆరాధించే ఈ పండుగ ఇది ఒక్కటే. ఈ పండుగ వేళ బంధు మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతాం. –కంది భారతి, వనందాస్గడ్డ, రామవరం -
ఘనంగా వేంకటేశ్వర కల్యాణం
అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసిఉన్న శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం శనివారం వైభవోపేతంగా నిర్వహించారు. పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి క్రతువు జరిపించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. పూజాది కార్యక్రమాలను దేవస్థానం ప్రధాన పూజారి ప్రసాదాచార్యులు నిర్వహించగా, కల్యాణ ఏర్పాట్లను ఆలయ మేనేజర్ టీవీ రమణ పర్యవేక్షించారు. కిన్నెరసాని గేటు ఎత్తివేత పాల్వంచరూరల్: ఎగువన కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని జలయాశానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కిన్నెరసాని రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 600 క్యూసెక్కుల వరదనీరు రావడంతో శనివారం నీటిమట్టం 406.20 అడుగులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. 23న దసరా అడ్వాన్స్కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 23న కార్మికులకు దసరా అడ్వాన్స్ చెల్లించనున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా కార్మికులకు రూ.25 వేల అడ్వాన్స్ ఇచ్చి, పది సమాన వాయిదాల్లో రికవరీ చేస్తామని తెలిపింది . నగదును 23న బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొంది. సింగరేణి అధికారుల బదిలీకొత్తగూడెంఅర్బన్: సింగరేణి మైనింగ్ విభాగంలో 31 మంది అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీఅయిన వారిలో ఏజీఎం మొదలు కొని మేనేజర్స్థాయి వరకు ఉన్నారు. ఈనెల 27వ తేదీలోగా కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పశువులు తరలిస్తున్న వాహనాల పట్టివేత చండ్రుగొండ: మూడు బొలేరో వాహనాల్లో అక్రమంగా పశువులను తరలిస్తుండగా మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శివరామకృష్ణ ఆద్వర్యంలో జాతీయ రహదారిపై పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదు ఆవులు, మూడు కోడె దూడలను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తుల నుంచి ఐదు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువులను పాల్వంచలోని గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సుజాతనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సుజాతనగర్ ఎస్ఐ ఎం.రమాదేవి శనివారం పట్టుకున్నారు. బేతంపూడి శివారులో అనుమతులు లేకుండా ఇసుక తోలుతున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు రెండు ట్రాక్టర్లను పట్టుకొని కుంజా జీవన్, జబ్బ విజేందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత సుజాతనగర్: రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం పట్టుకున్నారు. జూలూరుపాడు మండలానికి చెందిన కొమ్మి నేని నాగేశ్వరరావు స్థానిక భవాని రైస్ మిల్లు ఎదురుగా 7 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో రవాణా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బియ్యం నిల్వలను సీజ్ చేశారు. నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.రమాదేవి తెలిపారు. పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామ పంచాయతీ దేశ్యాతండాకు చెందిన బానోత్ రాంజీ మద్యం మత్తులో శనివారం పురుగులమందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఖమ్మంకు సిఫార్సు చేయగా.. కుటుంబ సభ్యులు తరలించారు. -
యువకుడి అదృశ్యం
పాల్వంచరూరల్: పది రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన యువకుడు కనిపించకుండాపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దంతలబోరు గ్రామ పంచాయతీ గంగదేవిగుప్ప గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న కుంజా రామకృష్ణ (28) ఈ నెల 10వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదని, తన ఫోన్ కూడా స్వీచ్ఛాఫ్ వస్తోందని రామకృష్ణ సోదరి వెంకటరమణ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.సురేశ్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం ఖమ్మంక్రైం: ఖమ్మం పాత బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఆస్పత్రిలో కడుపు నొప్పికి చికిత్స చేయించుకున్నట్లు ఆయన వద్ద ఓపీ స్లిప్ లభించగా, దానిపై భద్రుగా పేరు ఉందని తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59107, 87125 51370, 87126 59106 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీలకు టేకులపల్లి వాసులు టేకులపల్లి: మండలానికి చెందిన విద్యార్థులు జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. సులానగర్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఉపేందర్, చరణ్, సూర్య, మనోజ్, లోకేశ్, లోకేశ్కుమార్, ఐశ్వర్య, సిరివెన్నెల, రామ్, ఉపేందర్, గ్రీష్మగాయత్రి, పావని, ప్రణీత, శిరీష, వాసవి, లావణ్య, మాధవి, లాస్య, పల్లవి, శ్రీజ, కుసుమ, ఉదయ్భాస్కర్, చరణ్, దీపక్ అక్టోబర్లో జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం గుర్రం దేవదాస్, ఫిజికల్ డైరెక్టర్ మంజీలాల్ తెలిపారు. బొమ్మనపల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థిని బుర్రి జెశ్విత కూడా ఎంపికై నట్లు పీఈటీ సీత వెల్లడించారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
ఖమ్మంరూరల్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం సీసీఎస్, ఖమ్మంరూరల్, రఘునాథపాలెం పోలీసులు శనివారం పట్టుకున్నారు. రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వివరాలు వెల్లడించారు. రఘునాథపాలెం మండలం రేగులచెలక గ్రామానికి చెందిన జంగా వెంకన్న, వెల్లబోయిన లక్ష్మణ్రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎదురుగడ్డ ప్రాంతానికి చెందిన వల్లపు సంపత్ కలిసి ఓ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. సీసీఎస్, సివిల్ పోలీసులు సంయుక్తంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఖమ్మంరూరల్ మండలం కామంచికల్, గొల్లగూడెం, మద్దులపల్లి, నేలకొండపల్లి, ఖానాపురం, కల్లూరు, రఘునాథపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి 190 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.20 లక్షలు ఉంటుందని ఏసీపీ వివరించారు. రూరల్ సీఐ రాజు ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. బంగారు ఆభరణాలు స్వాధీనం -
అంబులెన్స్లో శిశువు జననం
● తొలుత మరోపాప జననం ● నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువగా ఉండటంతో ఖమ్మానికి తరలింపు ఇల్లెందు: అంబులెన్స్లో గర్భిణి ఓ పాపకు జన్మనిచ్చిన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. అంతకు కొద్ది సమయం ముందే ఓ పాప పుట్టింది. ఈ ఇద్దరూ 7వ నెలలో పుట్టడం, బరువు తక్కువగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఈర్యాతండాకు చెందిన డి.రాజేశ్, అదే పంచాయతీ చింతలపాడుకు చెందిన ఎస్.సంధ్యశ్రీ ఏడాది కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. సంధ్యశ్రీ ఏడు నెలల కిందట గర్భం దాల్చింది. అయితే, నెలలు నిండకుండానే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోగానే ఓ పాప పుట్టింది. మరోపాప అంబులెన్స్లో జన్మించింది. ఇద్దరు శిశువులు, తల్లి సంధ్యను ఇల్లెందుకు ఆస్పత్రికి తలరించగా.. గైనకాలజిస్ట్ సోనిక పరీక్షించి.. మొదటి పాప కిలోన్నర, రెండో పాప 800 గ్రాముల బరువు ఉండటంతో ఖమ్మానికి తరలించాలని సూచించారు. 108 ఈఎంటీ రేణుకదేవి, పైలట్ వేణుకుమార్ వారిని ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఏజెన్సీలో హైఅలర్ట్..
చర్ల: ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెప్టెంబర్ 21న మావోయిస్టు 21వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలో హైఎలర్ట్ ప్రకటించారు. అటవీ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలను తరలించి, కూంబింగ్ ముమ్మరం చేశారు. అటవీ ప్రాంత గ్రామాలకు వెళ్లే రహదార్లలో ప్రత్యేకంగా బలగాలను మోహరించి, తనిఖీలను నిర్వహిస్తున్నారు. మండలంలోని కుర్నపల్లి, పెదమిడిసిలేరు, ఉంజుపల్లి మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్న సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు ప్రతీ ఒక్కరినీ నిశితంగా పరిశీలిస్తున్నాయి. కొంతకాలం పాటు స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ లేఖలు జారీ చేయడం, వాల్పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేయడంతో పోలీసు శాఖ మరింత అప్రమత్తమైంది. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులతో పాటు అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ రెండు రోజుల క్రితం లేఖ విడుదల చేసిన నేపథ్యంలో పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. ఎస్పీ, భద్రాచలం ఏఎస్పీల ఆదేశాల మేరకు చర్ల సీఐ రాజువర్మ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నేటి నుంచి మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు -
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
మణుగూరురూరల్: మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ పసుపులేటి, మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్రెడ్డి సూచించారు. మండలంలోని ముత్యాలమ్మనగర్ జీపీ పరిధిలోని మణుగూరు శాఖా గ్రంథాలయంలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించగా.. వారు పాల్గొని మాట్లాడారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు అలవాటు పడొద్దని, దీంతో జీవితాలు చీకటిమయం కావడంతో పాటు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని తెలిపారు. క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ లక్ష్యాలను ఏర్పరచుకుని, వాటి సాధనకు కృషి చేయాలని చెప్పారు. సదస్సులో గ్రంథాలయ నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సాగులో సరికొత్తగా..
రైతులు పంటల సాగులో నూతన ఒరవడి అవలంబిస్తున్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు, సకాలంలో పురుగుమందుల పిచికారీకి ట్రాక్టర్ స్ప్రేయర్లు వినియోగిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారీ చేయగలుగుతున్నారు. ఫెస్టిసైడ్స్ కంపెనీలు సూచించిన పరిమాణంలో రసాయన మందులకు నీటిని కలిపి పంట చేలలో పిచికారీ చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. – బూర్గంపాడుపత్తి చేలో ట్రాక్టర్ స్ప్రేయర్తో పురుగులమందు పిచికారీ చేస్తున్న రైతురెండేళ్లుగా పెరుగుతున్న వినియోగం జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. ఈసారి సుమారు 2.20 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పత్తిని ఆశించే పురుగు, చీడపీడల, దోమ నివారణకు కనీసం ఎనిమిది నుంచి పదిసార్లు మందులు స్ప్రే చేయాల్సి వస్తుంది. కూలీల కొరత కారణంగా రైతులు సకాలంలో పురుగుమందులు స్ప్రే చేయలేకపోతున్నారు. దీనికితోడు స్ప్రే చేసిన కూలీలపై అప్పుడప్పుడు రసాయనాల ప్రభావం కూడా పడుతోంది. పలువురు కూలీలు అస్వస్థతకు గురైన, అక్కడక్కడా ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అధిగమించేందుకు రైతులు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్కు స్ప్రేయర్లు బిగించి పత్తిలో మందులు పిచికారీ చేస్తున్నారు. ఐదారేళ్ల క్రితం నుంచి ట్రాక్టర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నా, రెండేళ్లుగా వీటి వినియోగంగా బాగా పెరిగింది. జిల్లాలో ఈ ఏడాది చాలా గ్రామాల్లో రైతులు ట్రాక్టర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తున్నారు. పురుగు, తెగుళ్లు, దోమ ఉధృతిని గుర్తించగానే మందులు సకాలంలో పిచికారీ చేసుకుంటున్నారు. గతంలో కూలీలు దొరికేవరకు ఆలస్యమైతే పంట నష్టం జరిగేది. ఇప్పుడా ఆందోళన లేదు. నిర్దేశిత మోతాదులో.. ఫెస్టిసైడ్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను పంటలపై పిచికారీ చేసేటప్పుడు సూచించే పరిమాణంలో రైతులు నీటిని వినియోగించలేకపోతున్నారు. నీటి మోతాదు తక్కువ అవుతుండటంతో మొక్కలు పూర్తిగా తడవటం లేదు. అదే ట్రాక్టర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేస్తే కంపెనీలు సూచించిన మోతాదు నీటిని కలిపి మొక్కలు పూర్తిస్థాయిలో తడుపుతున్నారు. దీంతో పురుగు, దోమ, తెగుళ్ల ఉధృతిని కట్టడి చేయగలుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. కూలీల అవసరం లేకుండా టాక్టర్ స్ప్రేయర్లతో మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడి ఖర్చులు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్తో రోజూ 40 ఎకరాల వరకు పత్తికి మందులు పిచికారీ చేస్తున్నారు. అదే పని ని కూలీలతో చేస్తే నాలుగు రోజులు పడుతుంది. కూలీల ఖర్చు తగ్గటంతోపాటు సమ యం కలిసివస్తుంది. దీంతో రైతులు ట్రాక్టర్ స్ప్రేయర్లపై మక్కువ చూపుతున్నారు. ట్రాక్టర్కు స్ప్రేయర్ను బిగించుకునేందుకు రూ.70వేల వరకు ఖర్చవుతుంది. కూలీల ఖర్చులతో పోల్చుకుంటే రైతులకు ఎకరాకు రూ. 8వేల వరకు ఆదా అవుతుంది. జిల్లాలోని బూర్గంపాడు, అశ్వాపురం, దు మ్ముగూడెం, గుండాల, ములకలపల్లి, టేకులపల్లి మండలాల్లో రైతులు ప్రస్తుతం ట్రాక్టర్ స్ప్రేయర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్లు కొనలేని రైతులు కిరాయి ఇచ్చి మందులు పిచికారీ చేయిస్తున్నారు. ఎకరాకు రూ. 150 నుంచి రూ.200 వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. ఇద్దరు కూలీలతో రోజుకు ఆరు, ఏడు ఎకరాల వరకు మందు పిచికారీ చేయవచ్చు. వారికి కూలి రూ.1500, స్ప్రేయర్ పెట్రోలుకు రూ. 300, మొత్తం రూ. 1800 ఖర్చవుతుంది. అదే ట్రాక్టర్తో స్ప్రే చేస్తే ఆరు, ఏడు ఎకరా లకు రూ.1000 మాత్రమే ఖర్చు వస్తుంది. మందు పిచికారీ కూడా గంటన్నరలో పూర్తవుతుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రాక్టర్ స్ప్రేయర్లతో తొందరగా మందుల పిచికారీ జరుగుతోంది.ట్రాక్టర్ స్ప్రేయర్తో మందులు సకాలంలో కొట్టగలుగుతున్నాం. చేలో పురుగు ఉందంటే వెంటనే ట్రాక్టర్తో వెళ్లి మందులు కొడుతున్నాం. అదే కూలీలతో చేయించాలంటే వారు దొరకక ఇబ్బందులు పడాలి. ఖర్చు కూడా సగానికి సగం తగ్గుతుంది. –యడమకంటి రవీందర్రెడ్డి, రైతు, రెడ్డిపాలెం పత్తిచేలలో మందులు కొట్టేందుకు కూలీలు దొరకటం లేదు. స్థానికంగా దొరకకపోవటంతో ఛత్తీస్గఢ్ నుంచి వలన వచ్చిన కూలీలతో మందులు కొట్టించుకోవాల్సి వస్తుంది. వారికి మందులు కొట్టడం పెద్దగా తెలియదు. ఈ ఇబ్బందులు పడలేక ట్రాక్టర్ స్ప్రేయర్లతో మందులు కొట్టిస్తున్నాం. –పాలం లక్ష్మిరెడ్డి, రైతు, నాగినేనిప్రోలు -
వయోజన విద్యకు సిద్ధం
● జిల్లాలో 38,301 మంది నిరక్షరాస్యుల గుర్తింపు ● 964 మంది ఆర్పీలు, 3,831 మంది వలంటీర్లకు శిక్షణ ● త్వరలో గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించనున్న అధికారులు ఇల్లెందు: పదేళ్లుగా అటకెక్కిన వయోజన విద్యాబోధనను మళ్లీ ప్రారంభించనున్నారు. నిరక్షరాస్యులను గుర్తించి అక్షరజ్ఞానం కల్పించనున్నారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్లు, ఆర్పీలు, డీఆర్పీలకు శిక్షణ పూర్తిచేశారు. త్వరలోనే గ్రామాల్లో విద్యా కేంద్రాలను ప్రారంభించి గుర్తించిన వయోజనులకు బోధన చేపట్టనున్నారు. 964 పాఠశాలల ఎంపిక జిల్లాలో 22మండలాల్లో 964 పాఠశాలల్లో వయో జన విద్య కార్యక్రమం అమలు చేయనున్నారు. జిల్లాస్థాయిలో డీఆర్పీలకు, మండల స్థాయిలో 964మంది ఆర్పీలు, గ్రామస్థాయిలో 3,831మంది వలంటీర్లకు శిక్షణ పూర్తి చేశా రు. బోధనకోసం వలంటీర్లకు మార్గదర్శిని అనే పుస్తకాలు కూడా అందించారు. జిల్లాలో నిరక్షరాస్యులైన వయోజనులు 38,301 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరికి విద్య నేర్పేందుకు వయోజన విద్య కార్యక్రమం అమలు కోసం ఒక్కో మండలానికి ఇద్దరు ఉపాధ్యాయులను, మండల రిసోర్స్ పర్సన్స్ ఎంపిక చేశారు. గ్రామస్థాయిలో డ్వాక్రా గ్రూపు సభ్యుల సహకారం కూడా తీసుకోనున్నారు. వయోజనుల కోసం 38,301 అక్షర వికాసం అనే పుస్తకాలు, బ్రోచర్లు కూడా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. రోజూ గంటన్నరపాటు వలంటీర్లు రోజూ సాయంత్రం గంటన్నరపాటు వయోజనులకు బోధించాల్సి ఉంటుంది. మూడు నెలల్లో కేటాయించిన వాచకాలను బోధించి వ యోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సి ఉంది.ఇందుకోసం వలంటీర్కు పారితోషికం కూడా చెల్లిస్తారు. శిక్షణ కాలంలో వలంటీర్లకు టీ, స్నా క్స్, భోజనవసతి వంటి సదుపాయాలు కూడా కల్పిస్తారు. ఆతర్వాత మూల్యాంకనంచేసి వయో జనులు ఏ మేరకు విద్య నేర్చుకున్నారో అంచనా వేయాల్సి ఉంటుంది. వయోజన బోధనకోసం మూడంచెల పద్ధతి అనుసరిస్తున్నారు. తొలి విడతలో మార్గదర్శిని, అక్షర వికాస్ ద్వారా బోధించాలి. దీనినే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్)గా పే ర్కొంటున్నారు. నవభారత్ సాక్షరతా కార్యక్రమం లో ‘చదువుకుందాం రండి.. చదువు నేర్పుదాం పదండి’అంటూ శిక్షణ మాన్యువల్లో సూచించారు. పనుల కాలంలో బోధన సాగేనా? ముమ్మరంగా వ్యవసాయ పనులు సాగుతున్న, యూరియా దొరకక రైతులు అల్లాడుతున్న తరుణంలో వయోజన విద్యా కార్యక్రమం ముందుకు సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నిర్వహించిన అక్షరదీపం తరహాలో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగితేనే ప్రతిఫలాలు లభిస్తాయని పలువురు పేర్కొంటున్నారు. వయోజన విద్య ప్రారంభానికి శిక్షణ పూర్తయింది. గ్రామాల వారీగా నిరక్షరాస్యులైన వయోజనులల వివరాలు సేకరించి వలంటీర్లను నియమించారు. కేంద్రాలు ప్రారంభించి బోధన చేపట్టాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నాం. – మిడియం దుర్గారావు, మండల పర్యవేక్షకుడు, ఇల్లెందు -
డ్రోన్ టెక్నాలజీతో ప్రయోజనాలు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ, ఇతర పనుల్లో సాంకేతిక పరికరాల వాడకం పెరుగుతోందని, డ్రోన్ టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. శనివారం కళాశాల విద్యార్థులకు డ్రోన్లు, డ్రోన్ పైలెట్గా ఉద్యోగ, వ్యా పార అవకాశాలపై అవగాహన కల్పించారు. కళాశాలలోని పొలాల్లో సాగు చేస్తున్న వరి, పత్తి పంటలకు పురుగుల మందులు, ఎరువులను డ్రోన్ సాయంతో పిచికారీ చేయించి నేరుగా విద్యార్థులకు చూపించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ పురుగు మందుల పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగించడం వల్ల మనుషులకు ముప్పు ఉండదన్నారు. అధ్యాపకులు రాంప్రసాద్, నాగాంజలి, నీలిమ, జెమిమా, డి.స్రవంతి, రవికుమార్ పాల్గొన్నారు.కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్ -
సకాలంలో రుణాలు ఇవ్వాలి
సూపర్బజార్(కొత్తగూడెం): సకాలంలో రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి జిల్లాలోని బ్యాంకర్లు, ఇతర అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్ష నిర్వహించారు. రైతుల రుణాల పంపిణీ, స్వశక్తి సంఘాల రుణాల రికవరీ, పీఎం స్వానిధి రుణాలు, ఎఫ్పీఓల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం రూ. 2,291 కోట్ల పంట రుణాల లక్ష్యానికి సెప్టెంబర్ చివరివరకు రూ.409.55 కోట్లు, రూ.1,416.09 కోట్ల వ్యసాయ టర్మ్ రుణాల లక్ష్యానికి రూ.342.31 కోట్ల రుణాలు అందించామని వివరించారు. తక్కువ పంట రుణాలు అందించిన బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న మూడు నెలల కాలంలో 500 యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం ఎస్పీ రోహిత్రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పోషణ మాసోత్సవాలు విజయవంతం చేయాలి జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించే పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం డీఆర్డీఓ ఆధ్వర్యంలో నిర్వహించే సురక్షత, పోషణ, ఆరోగ్యం కార్యక్రమంపై సంబంధిత శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎల్బీఎం రామ్రెడ్డి, మెప్మా పీడీ రాజేష్, నాగలక్ష్మి, స్వర్ణలత లెనీనా, జయలక్ష్మి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యం
బూర్గంపాడు/అశ్వాపురం: ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడం ఆవశ్యమని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు తెలిపారు. బూర్గంపాడు మండలంలో నాగినేనిప్రోలు ప్రాథమిక పాఠశాలను, అంగన్వా డీ కేంద్రాన్ని (పూర్వ ప్రాఽథమిక పాఠశాల)ను శని వారం ఆయన కలెక్టర్ జితేష్ వి.పాటిల్తో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగే కార్యకలాపాలపై ఆరా తీశా రు. ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న కృత్రిమ మేధ(ఏఐ) తరగతులను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అశ్వాపురం మండలం నెల్లిపాకలో మునగతోటను పరి శీలించారు. ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. అధికారులు మృణాల్ శ్రేష్ఠ, సౌరభ్ శర్మ, విద్యాచందన, నాగలక్ష్మి, నాగరాజశేఖర్, సతీష్కుమార్, సైదులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్ల కీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయఅర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామయ్య సేవలో మాజీ క్రికెటర్ లక్ష్మణ్శ్రీసీతారామ చంద్ర స్వామివారిని శనివారం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. తరువాత దేవస్థాన అనుబంధ ఆలయాలను సందర్శించగా అధికారులు ఆయనకు స్వామి వారి జ్ఞాపికతో పాటు ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పీఆర్వో సాయిబాబు, వేదపండితులు పాల్గొన్నారు. వైభవంగా రుద్రహోమంపాల్వంచరూరల్: మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రహోమం పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం అమ్మవారి సన్నిధిలోని యాగశాలలో రుద్రహోమం జరిపారు. ముందుగా మేళతాళాలతో, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ రుద్రహోమం చేశారు. చివరన పూర్ణాహుతి నిర్వహించారు. డీఈపై ఈఎన్సీ ఆగ్రహం అశ్వారావుపేట: ఆర్అండ్బీ డీఈ ప్రకాశ్పై ఆ శాఖ ఈఎన్సీ మోహన్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేటలో ఏళ్ల తరబడి నిర్మిస్తున్న రహదారి విస్తరణ పనులను శనివారం రాత్రి ఆయన పరిశీ లించారు. రహదారిపై డివైడర్ వంపు కనిపించడం లేదా అని మందలించారు. రింగ్ సెంటర్లో బయటివైపు రోడ్డు వాలి నిర్మించడం వల్ల వాహనాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్లో కిలోమీటరు రహదారి విస్తరణ పనులు ఎంతకాలం చేస్తారని కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. బీటీ రహదారిని నిర్మించాకే సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఇతర పనులు చేపట్టాలని సూచించారు. రహదారి నిర్మాణంలో లోపం వల్లే రింగ్ సెంటర్లో ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్లే వాహనాలు పల్టీ కొడుతున్నాయని అన్నారు. అత్యవసరంగా రింగ్లో సాంకేతిక లోపాన్ని పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీపావళి నాటికి బీటీ పూర్తిచేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించామన్నారు. రేపు ఉమ్మడి జిల్లా ఉషూ జట్ల ఎంపికఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలలు, జూనియర్ కళాశాలల క్రీడా సంఘాల సంయుక్త ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాస్థాయి బాలబాలికల అండర్–17, 19 ఉషూ జట్ల ఎంపిక పోటీలు సోమవారం నిర్వహిస్తున్నట్లు సంఘాల బాధ్యులు పి.వెంకటేశ్వర్లు, నరేష్కుమార్, ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. అండర్–17 విభాగంలో బాలబాలికలు 2009 జనవరి తర్వాత, అండర్–19 విభాగంలో 2007 జనవరి తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో పాటు ఎస్ఎస్సీ సర్టిఫికెట్ తీసుకురావాలని, వివరాలకు 99481 99743, 98662 90609 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యుత్ లైన్ల ఏర్పాటుపై పరిశీలన
భద్రాచలం అర్బన్/మణుగూరు రూరల్: మణుగూరు మండలంలోని వైఎస్ఆర్నగర్లో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై విద్యుత్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి.మోహన్రావు శనివారం పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ నగర్వాసులు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ ప్రాంతాన్ని పరిశీలించారు. సోలార్ విద్యుత్, స్తంభాలు, లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. భద్రాచలం విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో మొక్కలు నాటారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డైరెక్టర్ను అధికారులు సన్మానించారు. ఎస్ఈ మహేందర్, డీఈలు జీవన్కుమార్, వెంకటేశ్వర్లు ఏడీఈలు వేణు, ఉమారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ త్వరితిగతిన పూర్తి చేయాలి దుమ్ముగూడెం: బండిరేవు గ్రామంలో నిర్మిస్తు న్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్రావు అధికారులను ఆదేశించారు. శనివా రం పర్ణశాల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను, బండిరేవు గ్రామంలో నిర్మిస్తున్న నూతన సబ్స్టేషన్ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రూ.1.96లక్షలతో సబ్స్టేషన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పర్ణశాల శ్రీ సీతా రామ చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజలు చేశారు. అధికారులు జీవన్, వెంకటేశ్వర్లు, యాసిన్, ప్రభాకర్, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భద్రగిరిపై నిర్లక్ష్యమేలా?
భద్రాచలం: గిరిజన కుంభమేళాగా భావించే సమ్మక్క, సారలమ్మ జాతర జరిగే మేడారంలో అభివృద్ధి పనులకు ముహుర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా పనులు ప్రారంభించనున్నారు. రాజన్న కొలువై ఉన్న వేములవాడలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. భద్రగిరి రామయ్య దేవస్థాన అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. రోజులు గడుస్తున్నా తుది మాస్టర్ ప్లాన్ సిద్ధం కాలేదు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే పనులు పట్టాలెక్కడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. మాస్టర్ ప్లాన్కు ఆమోదం ఎప్పుడో..? రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లను ప్రకటించి, పనులు చేపడుతోంది. 2026, జనవరిలో జరిగే మేడారం జాతరకు గద్దెల ఆధునికీకరణ, ఇతర అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయటంతోపాటు త్వరలోనే ముఖ్యమంత్రి పనులను ప్రారంభించనున్నారు. కానీ భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం మాస్టర్ ప్లాన్, నిధుల విడుదల మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇటీవల ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి కలెక్టర్, వైదిక కమిటీ, దేవస్థాన అఽధికారులతో భద్రాచలంలో ఆలయాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కూడా కూడా ప్లాన్పై స్పష్టత రాలేదు. రూ.350 కోట్లతో దేవస్థానం అభివృద్ధి చేపట్టాలని దేవాదాయ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినా ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. పుష్కరాల పనుల ఊసేలేదు.. పన్నెండేళ్లకోసారి జరిగే గోదావరి పుష్కరాలు మళ్లీ 2027 ఆగస్టులో జరగనున్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో భద్రాచలం రామాలయానికి భక్తుల రద్దీ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంటుంది. కోటి మందికి పైగా భక్తులు ఈ సారి పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన ప్రణాళికలపై ఇంతవరకు ముందస్తు చర్యలు చేపట్టలేదు. స్నానఘాట్ల సంఖ్య పెంపు, అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, రోడ్ల విస్తరణ, భక్తులకు సర్వ దర్శనం, వీవీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు తదితర అంశాలపై ముందస్తు మ్యాప్లను సిద్ధం చేయాలి. తగిన అంచనాలతో బడ్జెట్ రూపొందించాలి. ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా గత పుష్కరాల్లో పని చేసిన సీనియర్ ఐఏఎస్, ఇతర శాఖల అధికారుల సలహాలు, సూచనలతో పటిష్ట ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఇవేమీ ప్రారంభం కాలేదు. ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనం ప్లాన్ రూపకల్పన, బడ్జెట్లో నిధుల కేటాయింపు, విడుదలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రసాద్ పథకం పనులు ఆశించినంత వేగంగా జరగటం లేదు. ఈ నేపథ్యంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని భక్తులు కోరుతున్నారు. రామాలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు నిధులను విడుదల చేయాలని వేడుకుంటున్నారు. -
వానొస్తే సెలవే?!
ఆయిల్పామ్ ఫ్యాక్టరీల్లో యంత్రాలను ఆధునికీకరించి, పనితీరు మెరుగుపర్చాలి. గెలల ఉధృతికి తగినట్టు ఫ్యాక్టరీల సామర్థ్యం పెంచాలి. క్రషింగ్ సామర్థ్యం సరిగా లేపోవడంతోనే వందల సంఖ్యలో ట్రాక్టర్లతో వేచి ఉంటున్నాం. – సోడెం వెంకట్, ఆయిల్పామ్ రైతు, నల్లకుంట, దమ్మపేట మండలంఫ్యాక్టరీలకు తరచుగా సెలవులు ప్రకటించకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. యంత్రాలు నిర్దేశించిన సామర్థ్యం మేరకు పనిచేస్తున్నాయా లేదా అనే విషయం పరిశీలించారు. లోపాలు ఉంటే సరిచేసి చేయాలి. అందుకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. – చెక్కిరాల మల్లేశ్వరరావు, ఆయిల్పామ్ రైతు, దమ్మపేటఇదీ ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీల తీరు పక్వానికి వచ్చినా వర్షాల సమయంలో తోటలో గెలలు కోయడం వీలుకాదు. దీంతో రైతులు వర్షం తగ్గగానే రైతులందరూ గెలలు కోసి తరలిస్తున్నారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గంటకు 30 టన్నులు కాగా, గెలల నిల్వలు 1500 టన్నులు దాటగానే ఫ్యాక్టరీకి సెలవు ప్రకటించి గెలలను దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీకి తరలించాలని రైతులకు సూచిస్తున్నారు. దీంతో అక్కడా రెండు రోజుల వ్యవధిలోనే మూడు వేల టన్నుల వరకు గెలలు వచ్చి చేరుతున్నాయి. అప్పారావుపేటలో యంత్రాలు పూర్తిస్థాయిలో క్రషింగ్ చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వర్షం తగ్గగానే ఒకేసారి గెలలను కోసి తరలించడం, యంత్రాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో ఫ్యాకర్టీల వద్ద ట్రాక్టర్లు వందల సంఖ్యలో బారులుదీరుతున్నాయి. దీంతో రెండు, మూడు రోజులపాటు సెలవు ప్రకటించి, నిల్వ ఉన్న గెలలను క్రషింగ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సమస్యకు పరిష్కారం చూపకుండా సెలవులా..? అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం గతేడాది గంటకు 90 టన్నులకు పెంచారు. అయినా ఫ్యాక్టరీలో రెండు, మూడు వేల టన్నుల గెలల నిల్వలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఫ్యాక్టరీలకు వచ్చిన గెలలను ఏ రోజుకు ఆ రోజు క్రషింగ్ చేయడంలేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యులు రెండు, మూడు రోజులపాటు సెలవులు ప్రకటించి, నిల్వ ఉన్న గెలలను క్రషింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల వర్షం వచ్చి తగ్గాక ఫ్యాక్టరీలకు గెలలు పోటెత్తాయి. దీంతో ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులు, 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకుండా సెలవులు ప్రకటించడంపై పామాయిల్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టెరిలైజర్ అమరికలో తేడా వల్లే.. అప్పారావుపేట ఫ్యాక్టరీలో క్రషింగ్ సామర్థ్యం 90 టన్నులకు పెంచగా, రూ. 50 కోట్లతో బాయిలర్, స్టెరిలైజర్ యంత్రాలను అమర్చారు. కానీ ఫ్యాక్టరీలో క్రషింగ్ గంటకు 90 టన్నులు జరగడంలేదనే రైతులు ఆరోపిస్తున్నారు. క్షితిజ సమాంతరంగా ఏర్పాటు చేయాల్సిన స్టెరిలైజర్ను లంబదిశలో అమర్చడంతో క్రషింగ్ సామర్థ్యం తగ్గిందనే ఆరోపణలు వస్తున్నాయి. 90 డిగ్రీల వ్యత్యాసంలో స్టెరిలైజర్ను అమర్చడం వల్ల క్రషింగ్ సామర్థ్యం తగ్గడంతోపాటు క్రూడ్ ఆయిల్ దిగుబడి శాతం కూడా తగ్గుతోందని రైతులు పేర్కొంటున్నారు. రోజుకు 1800 నుంచి 2000 టన్నుల వరకు వేల క్రషింగ్ జరగాల్సి ఉండగా, యంత్రాల అమరికలో తేడా వల్ల 1500 నుంచి 1600 టన్నుల వరకు మాత్రమే అతి కష్టంగా క్రషింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక అశ్వారావుపేట ఫ్యాక్టరీలో గురువారం అనధికారికంగా క్రషింగనిలిపివేసినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ సామర్థ్యం ప్రస్తుతం గంటలకు 30 టన్నులుకాగా, కనీసం 45 టన్నులకు పెంచాలని రైతులు కోరుతున్నారు. వర్షం తగ్గగానే ఫ్యాక్టరీలకు గెలలు అధికంగా వస్తున్నాయి. అయినా రైతులకు, డ్రైవర్లకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. వీరి కోసం క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అశ్వారావుపేట ఫ్యాక్టరీకి వెళ్లాల్సిన గెలలను కూడా అప్పారావుపేటకు తరలిస్తున్నాం. దీంతో అప్పారావుపేట ఫ్యాక్టరీకి గెలల ఉధృతి పెరుగుతోంది. సామర్థ్యానికి మించి, సుమారు మూడు వేల టన్నుల వరకు గెలలు వచ్చిన కారణంగా, ఫ్యాక్టరీలకు సెలవులు ప్రకటించి నిల్వ ఉన్న గెలలను క్రషింగ్ చేస్తున్నాం. – కల్యాణ్, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ఒకటి, రెండు రోజులు వర్షం వస్తే ఆయిల్పామ్ ఫ్యాక్టరీలకు రెండు, మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నారు. ఇలా ఈ నెలలోనే రెండుసార్లు సెలవులు ఇచ్చారు. ఆయిల్ఫెడ్ ఫ్యాక్టరీల్లో సామర్థ్యం మేరకు గెలల క్రషింగ్ చేయడంలేదని, అందుకే సెలవు ప్రకటించి క్రషింగ్ పూర్తి చేస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. యంత్రాలను సరైన రీతిలో అమర్చకపోవడంవల్లే ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫ్యాక్టరీల్లో గెలలు గుట్టలుగా పేరుకుపోయి, వందల సంఖ్యలో ట్రాక్టర్లు బారులుదీరుతుండటంతో రైతులు అవస్థ పడుతున్నారు. –దమ్మపేట ఫ్యాక్టరీలకు ట్రాక్టర్లు వందల సంఖ్యలో రావడంతో గెలల దిగుమతికి ఐదు గంటల వరకు సమయం పడుతోంది. యాజమాన్యాలు సెలవు ప్రకటించగానే, ఆ ముందు రోజే రైతులు గెలలను కోసి రాత్రి సమయం వరకు ఫ్యాక్టరీకి పంపుతున్నారు. దీంతో దిగుమతికి పది గంటల సమయం కూడా పడుతోంది. దీంతో వాహనాల డ్రైవర్లు, రైతులు గంటలపాటు వేచి ఉండాల్సివస్తోంది. -
ఎన్నాళ్లీ వేతన వెతలు?
చుంచుపల్లి: వేతనాలు సకాలంలో అందక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీల్లోనూ అదేతీరు గ్రామపంచాయతీ కార్మికులకు కూడా రెండు నెలలుగా వేతనాలు రావడంలేదు. జిల్లాలో 471 జీపీల్లో 2,129 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో వాటర్మెన్, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్, కారోబార్, పంపు ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రోజూ తెల్లవారు జామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఒక్కో కార్మికుడికి నెలకు రూ.9,500 చొప్పున ఆన్లైన్ ద్వారా నేరుగా వేతనం చెల్లిస్తారు. వీరితోపాటు అత్యవసరాల మేరకు తాత్కాలికంగా పనిచేసే వారికి నెలకు రూ.5 వేలు వరకు చెల్లిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 12 నుంచి 15 మంది వరకు, చిన్న పంచాయతీల్లో ఎనిమిది మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో సిబ్బందికి వేతనాలు చెల్లించలేకపోతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఉపాధి, పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. గడిచిన రెండు నెలలుగా ఆర్థిక ఇక్కట్లు తప్పడం లేదని, అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని పేర్కొంటున్నారు. వచ్చే దసరా పండుగ రోజు వరకై నా వేతనాలు అందించాలని కోరుతున్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 219 మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీరిలో ఏపీఓలు 21 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 21 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 105 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 72 మంది ఉన్నారు. గతంలో మూడు నెలల చొప్పున జూన్ వరకు వేతనాలు విడుదల చేశారు. జూలై, ఆగస్టు సంబంధించి రెండు నెలల వేతనాలు ఇంతవరకు అందలేదు. ప్రతినెలా వేతనాలకు సంబంధించిన ఎఫ్టీఓ జనరేట్ చేసి పంపుతున్నా కానీ జీతాలు అందటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర శాఖలో తగిన బడ్జెట్ లేకపోవడంతోనే వేతనాలు ఆలస్యం అవుతున్నాయని అనధికార సమాచారం. అయితే సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రతీసారి వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు సకాలంలో జీతాలు అందుకున్న దాఖలాలు లేవు. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం లేదు. కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సివస్తోంది. తక్షణమే జీతాలు ఇవ్వాలి. – పిల్లి నాగరాజు, టీఏ, చుంచుపల్లి జూలై నుంచి పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించడంలేదు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. జిల్లా అధికారులను అడిగితే వేతనాలు త్వరలో వస్తాయంటున్నారు. కనీసం దసరా పండుగలోపైనా ఇవ్వాలి. – డి.అమర్నాథ్, జీపీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఏఎంఆర్తో పారదర్శకతవిద్యుత్ ఎస్ఈ మహేందర్సూపర్బజార్(కొత్తగూడెం): హెచ్టీ విద్యుత్ వినియోగదారులకు బిల్లులు అందజేయడంలో వేగం, పారదర్శకత పెంచేందుకు ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ (ఏఎంఆర్) వ్యవస్థను రూపొందించినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. అధిక సామర్థ్యం విద్యుత్ వినియోగించే పరిశ్రమలకు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మీటర్ రీడింగులను 55 హెచ్పీకి మించి సామర్థ్యం ఉంటే ఏడీఈ స్థాయి అధికారి, 55 లోపు హెచ్పీ ఉంటే ఏఈ స్థాయి అధికారి స్వీకరిస్తారని వివరించారు. నాన్స్లాబ్ రీడింగ్ను లైన్ ఇన్స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్ను ప్రైవేట్, జూనియర్ లైన్మెన్లు స్వీకరిస్తారని అన్నారు. ఆటోమెటిక్ మీటర్ రీడింగ్ విధానంతో తప్పులు జరిగే ప్రసక్తే ఉండదని, విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులు త్వరితగతిన గుర్తించవచ్చని అన్నారు. ఏఎంఆర్లో 4జీ కమ్యూనికేషన్ సిమ్ అమర్చుతామని, దీంతో డేటా హన్మకొండలోని సెంట్రల్ సర్వర్కు చేరుతుందని తెలిపారు. -
ఎస్ఐఆర్ డెస్క్వర్క్ పూర్తి చేస్తాం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డెస్క్ వర్క్ పూర్తి చేస్తామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా నుంచి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగాప్రసాద్, ఏఈఆర్ఓలు దారా ప్రసాద్, పుల్లయ్య, ఎన్నికల నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ జితేష్ -
టీజీఎస్ ఆర్టీసీలో పదోన్నతులు
ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్లోని వివిధ డిపోల ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. శ్రామిక్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఏడీసీలకు పదోన్నతులు కల్పించి నూతన స్థానాలకు బదిలీ చేస్తూ ఆర్ఎం సరిరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఆర్ఎంగా సరిరామ్ బాధ్యతలు చేపట్టాక ఉద్యోగులకు పదోన్నతులు లభించడం ఇది రెండోసారి కాగా, కోరుకున్న స్థానాలకు బదిలీ చేయడంపై వారు వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లకు అసిస్టెంట్ డిపో క్లర్క్లుగానే కాక ఏడీసీలు, టీఐ–3 ఉద్యోగులు పలువురికి పదోన్నతి లభించింది. పద్నోతులు ఇలా... శ్రామిక్లుగా విధులు నిర్వర్తిస్తున్న 14 మందికి హెల్పర్లుగా పదోన్నతి కల్పించారు. సత్తుపల్లి, ఖమ్మం డిపోల నుంచి నలుగురు చొప్పున, భద్రాచలంలో ఇద్దరితో పాటు ఖమ్మం, మధిర, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే, రీజియన్లో 14 మంది మెకానిక్స్, ఆర్టిజన్లకు గ్రేడ్–1 మెకానిక్లుగా పదోన్నతి లభించింది. ఇక కండక్టర్, డ్రైవర్లు 14 మందికి ఏడీసీలుగా పదోన్నతి కల్పించారు. ఇందులో ఖమ్మం డిపో నుంచి ఏడుగురు, భద్రాచలంలో ముగ్గురు, కొత్తగూడెంలో ఇద్దరు, సత్తుపల్లి, మణుగూరు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అలాగే, ఐదుగురు ఏడీసీలకు డిపో క్లర్క్(డీసీ)లుగా పదోన్నతి లభించింది. మధిరలో ఇద్దరు, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం డిపోల్లో ఒక్కొక్కరు ఉన్నారు. జాబితాలో శ్రామిక్లు, కండక్టర్లు, డ్రైవర్లు, ఏడీసీలు -
2జీ సిమ్లతో తిప్పలు
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలు, లబ్ధిదారుల వివరాలను మొబైల్ యాప్ల్లో నమోదు చేసేందుకు టీచర్లు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. సరైన ఇంటర్నెట్ వేగం లేకపోవడంతో హాజరు నమోదు, వివరాలు అప్లోడ్ చేసేందుకు గంటకు పైగా సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 5జీ స్పీడ్ డేటా వినియోగంలో ఉండగా 2020లో ప్రభుత్వం 2,060 మంది అంగన్వాడీ టీచర్లకు 2జీ ఫోన్లును అందించింది. ఆ సెల్లో 5జీ సిమ్ వేసినా ఇంటర్నెట్ వేగం లేక తిప్పలు తప్పడం లేదు. రోజూ కేంద్రాల కార్యకలాపాలతోపాటు లబ్ధిదారుల హాజరు, సరుకుల వినియోగం వివరాల నమోదుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. గంటల తరబడి నిరీక్షణ.. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో 10–20 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార ం అందుతోంది. ఈమేరకు యాప్ల్లో హాజరు వివరాలు, లబ్ధిదారులకు ఇస్తున్న పోషకాహారం పొందుపర్చాలి. జిల్లాలో మెయిన్ అంగన్వాడీ సెంటర్లు 2,060 ఉండగా,36,600 మంది చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలు నమోదై ఉన్నారు. అయితే, టీచర్లకు ఇచ్చిన సెల్ఫోన్లలో ఇంటర్నెట్ వేగంగా లేక హాజరు నమోదు, లబ్ధిదారులకు ఇచ్చే పౌష్టికాహారం వివరాల నమోదుకు ఇబ్బంది ఎదురవుతోంది. వీటికి తోడు నెల, మూడు నెలలకోసారి ఆరోగ్య పరమైన ఎదుగుదల, ప్రీ ప్రైమరీ పాఠశాలల పిల్లల పురోగతిని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. మూడు యాప్లో వివరాల నమోదుకు ఇంటర్నెట్ వేగం లేని కారణంగా గంటల తరబడి ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. న్యూట్రీషియన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం (ఎన్హెచ్టీఎస్) : ఈ యాప్లో ఒక్కో కుటుంబం నుంచి ఎందరు సెంటర్కు వస్తున్నారు, అందులో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎంత మందో నమోదు చేయాలి. అలాగే, పౌష్టికాహారం పంపిణీ తదితర వివరాలను ఎనిమిది విభాగాల్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పోషణ్ ట్రాకర్ యాప్ : రోజూ టీచర్లు, ఆయాలు, పిల్లలు, తల్లులు, గర్భిణుల హాజరును ఈ యాప్ ద్వారా నమోదు చేయాలి. ఉదయం 9గంటలకు ఒకసారి, సాయంత్రం 4గంటలకు రెండేసి సార్లు హాజరు నమోదుతో పాటు స్నాక్స్ ఏమేం ఇచ్చారో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ సెంటర్ ఆవరణలో ఉంటేనే పనిచేస్తుంది. ఎర్లీ చైల్డ్కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీజీ) : ప్రీ స్కూల్కు సంబంధించిన ఈ యాప్లో డిజిటల్ లైబ్రరీ, చైల్డ్ డెవలప్మెంట్, బోధన, హెల్ప్లైన్, సపోర్ట్ వివరాలు నమోదవుతాయి. మూడు నెలలకోసారి చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల, ఆరోగ్యం వంటి వివరాలే కాక 0–5 ఏళ్ల చిన్నారులకు బోధన, పోషకాహారం, హాజరు సమాచారం కూడా పొందుపర్చాలి. మొబైల్స్ యాప్లలో వివరాల నమోదులో ఆలస్యం -
విద్యా బోధన మెరుగుపడాలి
బూర్గంపాడు/అశ్వాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మరింత మెరుగుపరచాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఈఓ నాగలక్ష్మి సూచించారు. అంజనాపురం, పినపాక పట్టీనగర్లలోని ప్రాథమిక పాఠశాలలను వారు వేర్వేరుగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో నూతనంగా అమలు చేస్తున్న ఏఐ డిజిటల్ క్లాస్లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు సులభతర రీతిలో బోధన జరగాలన్నారు. విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ సౌరభ్శర్మ అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. వసతులను పరిశీలించారు. మల్లెలమడుగు–1 అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్లో నీటి సౌకర్యం లేకపోవడం, అంగన్వాడీ కేంద్రంలో తాగునీటి సౌకర్యం లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంఈఓ ఎదుసింహరాజు పాల్గొన్నారు. -
దసరాకు ఆర్టీసీ రైట్ రైట్
ఖమ్మంమయూరిసెంటర్: దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారితో పాటు సెలవుల వేళ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఖమ్మం రీజియన్ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. బతుకమ్మ, దసరా పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సొంత గ్రామాలకు వస్తారు. ఈ రద్దీకి అనుగుణంగా ఏయే ప్రాంతాలకు ఎన్ని బస్సులు నడపాలో ప్రణాళిక రూపొందించారు. అయితే, ఈసారి ప్రత్యేకం పేరిట నడిపే అదనపు సర్వీసుల్లో 50శాతం అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. అదనపు సర్వీసులన్నీ హైదరాబాద్ రూట్లోనే ఏర్పాటు చేస్తుండడంతో డిపోల నుంచి మారుమూల గ్రామాలకు నడిచే బస్సుల సంఖ్య తగ్గనున్నట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్, ఇతర పట్టణాల నుంచి జిల్లా, నియోజకవర్గ కేంద్రాల వచ్చేవారు స్వగ్రామాలకు వెళ్లడంలో ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశముంది. పూల పండుగ ప్రత్యేకం తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగకు ప్రత్యేకత ఉంది. పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఈనెల 21 నుండి సెలవులు ప్రకటించగా 20వ తేదీ నుండే ప్రయాణికులు స్వగ్రామాలకు బయలుదేరనున్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటుండడం.. ఇప్పుడు సెలవులతో మరింత పెరగనుండడంతో అధికారులు అదనపు సర్వీసులు నడిపేందుకు సిద్ధమయ్యారు. రీజియన్లోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తే, రోజువారీ మార్గాల్లో బస్సుల కొరత ఏర్పడే అవకాశముంది. దీంతో శ్రీశైలం, హన్మకొండ తదితర ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి అదనపు సర్వీసుల కింద వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుండి రీజియన్కు రద్దీ ఉంటుందనే అంచనాతో అధికారులు ఈ మార్గంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 1,025 ప్రత్యేక సర్వీసులు దసరా పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ ఖమ్మం రీజియన్లో 1,025 ప్రత్యేక సర్వీసులు నడిపిస్తారు. ఈనెల 20వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రీజియన్కు, అక్టోబర్ 2నుండి అక్టోబర్ 6 వరకు ఇక్కడి నుంచి హైదరాబాద్కు బస్సులు ఉంటాయి. రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సుల సంఖ్య పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే, 24గంటల పాటు నాన్స్టాప్ సర్వీసులు తిప్పుతారు. ఇవికాక ఖమ్మం నుంచి మణుగూరు, భద్రాచలం, సత్తుపల్లి, కొత్తగూడెం, మధిర, ఇల్లెందు ప్రాంతాలకు కూడా బస్సులు అందుబాటులో ఉంచుతారు.నేటి నుంచి ప్రత్యేక బస్సులు దసరా సెలవుల్లో ప్రయాణికులు సౌకర్యవంతగా, సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తే గమ్యస్థానాలకు సాఫీగా చేరుకోవచ్చు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం. అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉన్నందున ప్రయాణికులు వినియోగించుకోవాలి. – ఏ.సరిరాం, ఖమ్మం రీజియన్ మేనేజర్ -
ఉత్సాహంగా జోనల్ క్రీడలు
పాల్వంచరూరల్/జూలూరుపాడు: పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన క్రీడామైదానంలో శుక్రవారం పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల జోనల్ క్రీడాపోటీలను నిర్వహించారు. మూడు మండలాల నుంచి 500 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించారు. వివిధ విభాగాల నుంచి జిల్లాస్థాయి పోటీలకు 356 మందిని ఎంపిక చేశారు. జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చండ్రుగొండ జోనల్స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. జూలూరుపాడు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో విభాగాల్లో అండర్–14, అండర్–17 బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో స్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్, ఆయా మండలాల ఎంఈఓలు, పీఈటీలు పాల్గొన్నారు. -
కిన్నెరసాని గేటుకు మరమ్మతులు
పాల్వంచరూరల్: కిన్నెరసాని జలాశయంలో ఉన్న స్లూయిస్ వెల్ గేటుకు శుక్రవారం మరమ్మతులు నిర్వహించారు. జలాశయం లోపల వైపు ఉన్న స్లూయిస్ వెల్ గేటుకు ఐదు, ఆరు అడుగుల నీటిలోపల బోల్ట్లు ఊడిపోయాయి. దీంతో కొత్తగా అమర్చారు. ఈ స్లూయిస్ దిగువ భాగం నుంచి నేరుగా కేటీపీఎస్ కర్మాగారానికి నీటి సరఫరా జరుగుతుంది. మరమ్మతులను ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వరరావు, ఏడీఈ పర్యవేక్షించారు. ఐక్యతతోనే హక్కుల పరిరక్షణపాల్వంచరూరల్: హక్కుల పరిరక్షణ ఉపాధ్యాయుల ఐక్యతతోనే సాధ్యమని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్దమ్మగుడి వద్ద శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, జిల్లా అధ్యక్షుడు పి.నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, అసోసియేట్ అధ్యక్షుడు భాస్కర్, రవీందర్, కళావతి తదితరులు పాల్గొన్నారు. బంక్ నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులుదమ్మపేట: దమ్మపేట బస్టాండ్ ఆవరణలో నూతన పెట్రోల్ బంక్ నిర్మాణ సంబంధమైన కట్టడాలను తదుపరి విచారణ జరిగే వరకు నిలిపివేయాలని ఆదేశిస్తూ ఈ నెల 15న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బస్టాండ్లో బంక్ నిర్మాణం చేపట్టడం వల్ల బస్సుల రాకపోకలకు అడ్డంకిగా మారుతుందని స్థానికులు హైకోర్టులో పిటిషన్ చేశారు. పరిశీలించిన కోర్టు, బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న అన్ని కట్టడాలను ఆపి, అన్ని అడ్డుంకులను తొలగించి, ప్రజా వినియోగానికి ఉపయోగపడేలా బస్టాండ్ను ఉంచాలని ఆదేశించింది. యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిఅశ్వారావుపేటరూరల్: రైతులు యజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడి పొందొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. శుక్రవారం వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన మండలంలోని నారాయణపురంలో ఆయిల్పామ్, వరి పంటలను సందర్శించారు. పంటలను పరిశీలించి, రైతులకు అవగాహన కల్పించారు. పంటల సాగు, యజమాన్య పద్దతలు, ఎరువుల వినియోగంతోపాటు సలహాలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నాగాంజలి, జంబమ్మ, కృష్ణతేజ, ఝాన్సీ రాణి, కృష్ణతేజ, ఏఈవో షాకిరా బాను, రైతులు పాల్గొన్నారు. సొసైటీ సీఈఓపై సస్పెన్షన్ వేటుఅశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ప్రాథమిక సహకార సంఘం సీఈఓను ఉన్నతాధికారులు సస్పెన్షన్ చేసిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక సొసైటీలో సీఈఓగా విధులు నిర్వహిస్తున్న మానేపల్లి విజయ్బాబు పలు అక్రమాలకు పాల్పడటంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్ చేస్తూ ఈ నెల 17న డీసీవో శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక సీఈఓగా కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్గా పని చేస్తున్న డి హేమగిరిని నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం మత్తులో లారీ డ్రైవింగ్● పోలీసుల అదుపులో డ్రైవర్ మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని ఓ ఇసుక క్వారీకి లోడింగ్కు వస్తూ మద్యం తాగి అడ్డగోలుగా లారీ నడుపుతున్న డ్రైవర్ను స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన రాయలింగు శుక్రవారం మున్సిపాలిటీలోని అన్నారం ఇసుక క్వారీకి పూటుగా మద్యం తాగి లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ప్రమాదాలకు దారితీసే విధంగా డ్రైవింగ్ చేస్తుండటంతో స్థానికులు లారీ యూనియన్ ఆఫీస్ సమీపంలో లారీని నిలిపి వేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
ఎస్పీ రోహిత్రాజు ఇల్లెందు: సైబర్ నేరాలకు గురై మోసపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇల్లెందు డీఎస్పీ కార్యాలయలో తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. క్రైం రికార్డులు, కేసుల నమోదు, పోలీస్ శాఖ పని తీరుపై సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు, స్థోమత కలిగిన వ్యక్తులను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. డీఎస్పీ చంద్రభాను, సీఐలు టి. సురేష్, బి.సత్యనారాయణ, రవీందర్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఇసుక లారీ బోల్తా
చర్ల: మండలంలోని జీపీపల్లిలో ఇసుక రీచ్ నుంచి లోడుతో వస్తున్న ఇసుక లారీ అదుపు తప్పి బోల్తా పడింది. శుక్రవారం మొగళ్లపల్లి ఇసుక రీచ్లో లోడ్ చేసుకుని వస్తుండగా జీపీపల్లి శివారులో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్లే లారీ బోల్తా పడిందని స్థానికులు పేర్కొంటున్నారు. దరఖాస్తుల ఆహ్వానంసింగరేణి(కొత్తగూడెం): ిసంగరేణి కొత్తగూడెం కార్పొరేట్లో ఆఫీస్ అటెండెంట్ టీఎస్ గ్రేడ్–హెచ్లో 26 ఖాళీలను భర్తీకి యాజమాన్యం శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. తెలుగులో చదవటం, రాయటం తెలిసినవారు అర్హులని, సంస్థవ్యాప్తంగా పనిచేసే జనరల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ నెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
‘సీతారామ’కు గడ్డిపూల సోయగం
సీతారామ ప్రాజెక్ట్ కాలువ ఒడ్డున గడ్డిపూలు కనువిందు చేస్తున్నాయి. ప్రధాన కాలువ, సమీప రహదారికి ఇరువైపులా, సమీపంలోని మట్టిగుట్టలపై విరగబూసి ఆహ్లాదం పంచుతున్నాయి. గుబురుగా పెరిగిన గడ్డి, నిలువెత్తు తెల్లటిపూలు, వినీలాకాశం వెరసి ప్రకృతి గీసిన చిత్రంలా ఆకట్టుకుంటున్న ఈ దృశ్యాలు ములకలపల్లి మండలం పూసుగూడెం, మాధారం మధ్య అటవీ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. నీటి ఆవాసాలు, వాటి సమీపంలో పెరిగే ఈ పుష్పాలను కొన్ని ప్రాంతాల్లో రెల్లు పూలని పిలుస్తుంటారు. ఏటా ఇదే సమయంలో ఇవి పూస్తాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. – ములకలపల్లి -
చెట్టును ఢీకొట్టిన బైక్
● సింగరేణి కార్మికుడి మృతి మణుగూరు టౌన్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చెట్టుకు బైక్ ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం ముత్యాలమ్మనగర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓసీ–2లో డ్రిల్ ఆపరేటర్గా పనిచేస్తున్న కుమార్ (37) ఉదయం విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకుని ముత్యాలమ్మనగర్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో హెల్మెట్ పగిలిపోయి తలకు తీవ్రగాయాలుకాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్సైకిల్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగరేణి మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్, ఇతర అధికారులు ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి వై.రాంగోపాల్, నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు -
కారు, బైక్ ఢీ
● ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు పినపాక: ద్విచక్ర వాహనం, కారు ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డ ఘటన మండలంలోని ఐలాపురం వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మణుగూరు మండలం సమితిసింగారం గ్రామానికి చెందిన పాల్వంచ మహేష్ (32) మేనకోడలు అంజలితో కలిసి ద్విచక్రవాహనంపై గడ్డంపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న తన కూతురు వద్దకు వెళ్లాడు. కూతురిని చూసి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రహదారిపై జానంపేట నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్పై వస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించి వైద్యులు అప్పటికే మహేష్ మృతి చెందాడని తెలిపారు. అంజలి చికిత్స పొందుతోంది. కాగా కారు బైక్ ఢీకొన్నాక రోడ్డు దిగి చెట్లలోకి దూసుకెళ్లింది. కారు డ్రైవర్ అంజయ్యను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్ తెలిపారు. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆరుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్రాజు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడుకు చెందిన మడకం దేవా (ఏసీఎం ఏరియా కమిటీ సౌత్ బస్తర్), పార్టీ మెంబర్ మడవి జోగా, మిలీషియా సభ్యులు, పోడియం దేవా, మడకం ఇడుమ, మడకం ముకా, మడవి ఐతా లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులకు ఒక్కొక్కరికి తక్షణసాయం కింద రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తామని ఎస్పీ రోహిత్ పేర్కొన్నారు. -
చిన్నారుల గాంధీగిరి!
తల్లాడ: పాఠశాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు గాంధీ మార్గాన్ని అనుసరించారు. తల్లాడ మండలం మల్లవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్ మియాకు గులాబీపూలు అందించారు. పాఠశాలలో భగీరథ పైపులైన్ లేక తాగునీరు అందడం లేదని, పైపులైన్ నిర్మాణానికి తవ్వి వదిలేయడంతో రోడ్డు పాడైందని పేర్కొన్న వారు పాఠశాలకు ఇరువైపలా పిచ్చిమొక్కలు తీయించాలని కోరారు. కాగా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని కార్యదర్శి తెలిపారు. -
వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని 9వ మైలు తండాకు చెందిన మాలోత్ బీక్యా(75) భార్య ఐదేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదన చెందుతున్నాడు. వృద్ధాప్యం వల్ల అనారోగ్యం సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా అతడి కుమారుడు గమనించి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆదివాసీల అభివృద్ధికి కృషి
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా కృషి చేస్తున్నామని పీఓ బి.రాహుల్ దిసోం సంస్థ బృందానికి తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రంలోని దిసోం సంస్థ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఐటీడీఏ అమలుచేస్తున్న వివిధ పథకాల పరిశీలన నిమిత్తం గురువారం వచ్చారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్ను కలిసి వారు పరిశీలన చేసిన ప్రదేశాల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజన మహిళలకు సబ్బులు, మిల్లెట్ బిస్కెట్లు, నాప్కిన్ వంటి వస్తు తయారీ యూనిట్లను, న్యూట్రి బాస్కెట్, చిక్కి యూనిట్, దాల్ మిల్, బ్రిక్స్ తయారీ, న్యూట్రి డ్రైమిక్స్, ఇప్పపువ్వు లడ్డూ యూనిట్ల ద్వారా జీవనోపాధి కలిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించే వారికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దీపకం వర్క్బుక్స్తో పాటు కెరీర్ గైడెన్స్ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన సంస్కృతిని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశామని, వారి గోత్రాలు సేకరించి ఇలవేల్పుల గ్రంధాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. దిసోం సంస్థ వ్యవస్థాపకుడు బిరేన్ భాటు మాట్లాడుతూ.. తమ సంస్థ విద్యార్థులు 15 నెలల పాటు దేశ పర్యటన చేసి వివిధ ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో గిరిజ మావిలన్(కేరళ), మిజింగ్ నర్జరి(అసోం), మునిర్(మహారాష్ట్ర), సోడె శ్రీను, సోడే లెనిన్, రాజేంద్రప్రసాద్(ఏపీ) పాల్గొన్నారు. బూడిద తరలింపుతో జీవనోపాధి కల్పించాలి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే బూడిదను తరలించే బాధ్యత నిరుద్యోగ గిరిజన యువతకు అప్పగించాలని, వారికి జీవనోపాధి కల్పించాలని రాహుల్ అన్నారు. తన చాంబర్లో గురువారం బీటీపీఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీటీపీఎస్ కింద భూములు కోల్పోయిన దమ్మక్కపేట సొసైటీలో 31 మంది, సాంబాయిగూడెం సొసైటీలో 38 మంది, సీతారాంపురం సొసైటీలో 33 మంది, పోతిరెడ్డిపల్లిలో మూడు సొసైటీలు కలిపి 253 మంది గిరిజన యువకులు సొసైటీల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని, బీటీపీఎస్ బూడిద తరలించే బాధ్యత ఎక్కువ శాతం వీరికే అప్పగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, డీఈ మురళీకృష్ణ, ఎస్ఈ శ్రీనివాస్, శివచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
కలల ప్రపంచం!
కార్పొరేషన్ పేరుతోసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు పాల్పడేవారు మళ్లీ రెక్కలు విప్పుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సామాన్యుల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ఆగడాలకు ఆరంభంలోనే అడ్డుకట్ట వేయకుంటే జిల్లా ఆవిర్భావం సమయంలో జరిగిన మోసాలే పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా సమీకృత కార్యాలయం ఎదురుగా 2017లో వెంచర్లో స్థలాలు కొనుగోలు చేసిన పలువురికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. తమకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపించాలని, తమలా మరొకరకు మోసపోకుండా చూడాలని గత నాలుగైదేళ్లుగా కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో బాధితులు పలుమారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడు. ఎనిమిదేళ్లుగా తేలని పంచాయితీ.. అనధికారిక వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ఇళ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా ఇవి తమ ప్లాట్లని, తాము ఫలానా వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని వేరే వ్యక్తులు రంగంలోకి దిగారు. ఈ విషయమై పాల్వంచ పోలీస్స్టేషన్, ఎస్పీ ఆఫీస్, కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్లో బాధితులు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎనిమిదేళ్లుగా ఎటూ తేలడం లేదు. స్థానిక దాదాలు రంగంలోకి దిగినా గొడవలు, రక్తపాతాలు మినహా ఒరిగిందేమీ లేదు. అనధికారిక వెంచర్ వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భారీ కమీషన్లు తీసుకుని అమాయకులకు ప్లాట్లు అంటగట్టిన బ్రోకర్లు తమను మోసం చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిస్తేజంగా కార్పొరేషన్.. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను ఏకం చేస్తూ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైంది. ఈ మేరకు కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు జీఓ వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు పాల్వంచ మొదలు సుజాతనగర్ వరకు ఎక్కడిక్కడ వెంచర్లు వెలుస్తూనే ఉన్నాయి. వీటికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ పేరుతో కలల ప్రపంచం చూపిస్తూ అనధికారిక వెంచర్లు పుట్టగొడుల్లా పుట్టుకొస్తున్నా బల్దియా నుంచి కనీస అప్రమత్తత కనిపించడం లేదు.జిల్లా ఏర్పాటు తర్వాత ప్రస్తుత పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 416/1/2/1లో (ఐడీఓసీ ఎదురుగా) ఉన్న ఎకరం స్థలంలో 2017లో అనధికారిక వెంచర్ వేశారు. సాధారణంగా ఎకరం స్థలంలో 30, 20 అడుగులతో రోడ్లు, పదిశాతం కమ్యూనిటీ స్థలాన్ని మినహాయిస్తే 200 గజాల చొప్పున 12 నుంచి 14 ప్లాట్లు చేయొచ్చు. కానీ ఈ వెంచర్లో ఏకంగా 29 మందికి 200 గజాల ప్లాట్లు ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. త్వరలో నిర్మించే కలెక్టరేట్ ఎదురుగా ప్లాట్లు కారుచౌకగా వస్తున్నాయని, ఆలస్యం చేస్తే మళ్లీ అవకాశం రాదని ఆరు నెలల్లోనే ప్లాట్లు అమ్మేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది కూలీలు, టైలర్లు, చిన్న చిన్న కిరాణా కొట్ల నిర్వాహకులే ఉన్నారు. వీరిలోనూ మహిళలే అధికంగా ఉన్నారు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. నా భర్త కూలీ పని, నేను టైలరింగ్ చేస్తూ పైసాపైసా కూడబెట్టాం. ఇద్దరు పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని 2017లో కలెక్టరేట్ ఎదురుగా వెలిసిన వెంచర్లో 200 గజాల ప్లాట్ కొనుగోలు చేశాం. ప్లాట్ అమ్మిపెట్టిన బ్రోకర్, వెంచర్ వేసిన యజమాని చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇప్పటికీ మాకు ప్లాటు దక్కలేదు. అడిగితే మహిళ అని కూడా చూడకుండా కొడుతున్నారు. – రమాదేవి, కొత్తగూడెంనా భర్త దుబాయ్లో ఉంటాడు. అక్కడ రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, కడుపు మాడ్చుకుని కూడబెట్టిన డబ్బుతో 2017లో కలెక్టరేట్ ఎదురుగా వేసిన వెంచర్లో రెండు ప్లాట్లు కొనుగోలు చేశా. ఇప్పటికీ ఆ ప్లాట్లు మాకు అప్పగించలేదు. ఈ విషయమై కుటుంబంలో కలతలు వచ్చాయి. దయచేసి ఇప్పటికై నా అనధికారిక వెంచర్ల విషయంలో సర్వే జరిపి మాకు న్యాయం చేయాలి. మరొకరు నష్టపోకుండా చూడాలి. – అరుణ, భద్రాచలం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, అక్టోబర్ 7న నిర్వహించే శబరి యాత్రపై ఆలయ ఈఓ దామోదర్రావు ఆదివాసీ గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. శబరి యాత్రకు గిరిజనులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈఓ కోరారు. నిత్యాన్నదానానికి విరాళంభద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుకు చెందిన గారపాటి తులసమ్మ రూ.లక్ష, బొప్పొడి కాశీబాబు–శాంతారాణి దంపతులు రూ.50వేల చెక్కును ఆలయ అధికారులకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతల కుటుంబసభ్యులు స్వామివారిని దర్శించుకోగా, అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. ఆలయ పీఆర్వో రామిరెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు. కాగా, మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలో శనివారం రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. పూజలో పాల్గొనేవారు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేయించుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు నందీశ్వరుడికి అభిషేకం పెద్దమ్మగుడి సముదాయంలోని శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ నందీశ్వరస్వామికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. నేడు జాబ్ మేళాసింగరేణి(కొత్తగూడెం): హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో 200 ఖాళీల (ప్రొడక్షన్ ట్రైనీ) భర్తీకి కొత్తగూడెం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బీఎస్సీ చదువుకునేందుకు ఆసక్తి గలవారికి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ వారు ఆర్థిక సాయం, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ‘ఎర్త్ సైన్సెస్’లో స్పాట్ అడ్మిషన్లకు 14 మందికొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్, బీఎస్సీ జియాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నిర్వహించిన స్పాట్ అడ్మిషన్లకు 14 మంది విద్యార్థులు హాజరయ్యారని ఓఎస్డీ జగన్మోహన్రాజు ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందేందుకు ఈనెల 20 వరకు అవకాశం కల్పించేందుకు యూనివర్సిటీ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సింగరేణి విస్తరణకు సహకరించండి
ఎస్బీఐ చైర్మన్తో భేటీలో సీఎండీ బలరామ్కొత్తగూడెంఅర్బన్: సింగరేణి విశ్వవ్యాప్తంగా విస్తరించేలా దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సంసిద్ధత తెలిపింది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీ సత్యేంద్రకుమార్ సింగ్, సీజీఎం శైలేష్ ఉన్నితన్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానాన ఉన్న సింగరేణి త్వరలోనే దేశ, విదేశాల్లో కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించనుందని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ లభించిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వినియోగించుకుంటూ దేశంలోనూ పెద్ద ఎత్తున కీలక ఖనిజాల ఉత్పత్తికి సిద్ధమవుతున్నామని, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, 5 వేల మెగావాట్ల సోలార్, థర్మల్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్, మిథనాల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎండీ వివరించారు. సింగరేణి చేపట్టే భారీ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో ఆర్థిక సహకారం అందించాలని కోరగా ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే సింగరేణి ప్రధాన ఆర్థిక లావాదేవీల (లీడ్) బ్యాంకుగా సేవలదింస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా సత్తా చాటాలని ఆకాంక్షించారు. -
ఇదేం జీ(వి)తం !
● 104 సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాల్లేవ్.. ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలుబూర్గంపాడు: ఆరు నెలలుగా వేతనాలందక 104 సిబ్బంది అప్పుల్లో కూరుకుపోతున్నారు. విఽధి నిర్వహణకు రోజూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా చార్జీలకు కూడా కటకటలాడుతున్నారు. జీతాలు చెల్లించాలని అటు అధికారులను, ఇటు ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం శూన్యం. చివరకు మంత్రులు, ఆరోగ్యశాఖ కమిషనర్ను కలిసినా వేతనాలు మాత్రం రావడం లేదు. కనీసం దసరా పండుగకై నా చెల్లించి తమను ఆదుకోవాలని జిల్లాలోని 104 ఉద్యోగులు కోరుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో సర్దుబాటు.. జిల్లాలో 59 మంది 104 సిబ్బంది వివిధ పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరు ఫార్మసిస్ట్లుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా, డ్రైవర్లుగా, సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. వీరికి గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో క్రమం తప్పకుండా వేతనాలు అందిన దాఖలాలు లేవు. 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని దీర్ఘకాల రోగులకు ప్రతీ నెల వైద్యారోగ్య శాఖ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులు అందించే లక్ష్యంతో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించగా 2022 వరకు ప్రజలకు వైద్య సేవలు అందించారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 104 వాహనాలను తొలగించి, ఆ సిబ్బందిని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సర్దుబాటు చేసింది. ఫార్మసిస్ట్లకు, ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ. 22,750, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, మల్టీపర్పస్ హెల్త్ ఆసిస్టెంట్లకు రూ.19,500, సెక్యూరిటీ గార్డులకు రూ.15,600 చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని సిబ్బంది కోరుతుండగా.. ఆ మాటేమో కానీ సక్రమంగా వేతనాలు కూడా రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా బడ్జెట్ విడుదల చేసి తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయమై బూర్గంపాడు సీహెచ్సీ సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావును వివరణ కోరగా.. 104 సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వలేదని, రాగానే వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఆస్పత్రుల రాకపోకలకు రవాణా చార్జీలకు కూడా డబ్బులుండడం లేదు. కుటుంబం గడవటం కష్టంగా మారింది. కనీసం దసరా పండుగకై నా వేతనాలు అందించి ఆదుకోవాలి. – రవి, 104 వర్కర్స్ యూనియన్ నాయకుడురోజూ ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు అందిస్తున్న మమ్మల్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఐదారు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతకాలి. పిల్లల చదువులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి తక్షణమే వేతనాలు అందించాలి. – శ్రీనివాస్, 104 వర్కర్స్ యూనియన్ నాయకుడు -
22 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
ఏర్పాట్లు పూర్తి చేయాలన్న అదనపు కలెక్టర్ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఈనెల 22 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. పదో తరగతి పరీక్షలకు చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇంటర్ అభ్యర్థులకు బాబుక్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతికి 320 మంది, ఇంటర్కు 300 మంది హాజరు కానున్నారని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్టికెట్ వెంట తెచ్చుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు, కాలిక్యులేటర్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వివరాలకు 89192 79238 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఈఓ బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా పోడు నరికాడని..
జూలూరుపాడు: అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లఘించి 124 చెట్లు నరకడాన్ని గుర్తించిన అటవీ అధికారులు కేసు నమోదు చేసి, రూ 23 వేలు జరిమానా విధించారు. మండలంలోని రాజారావుపేట బీట్ను గురువారం అటవీశాఖ టాస్క్ఫోర్స్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్లు లోకనాథం, రాఘవరావు పరిశీలించారు. కంపార్ట్మెంట్ 35లో పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లాతండాకు చెందిన నునావత్ రమేష్ అనే వ్యక్తి కొత్తగా పోడు నరికినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా రమేష్కు 2006లో 5.5 ఎకరాల పోడు భూమికి ప్రభుత్వం అటవీ హక్కు పత్రాన్ని అందించింది. ఐదున్నర ఎకరాల పోడు భూమిలో సాగు చేయకుండా కొంత భూమి వదిలేశానని, ఆ స్థలంలోని చెట్లు నరికానని బాధిత రైతు రమేష్ చెబుతున్నాడు. హక్కు పత్రాలున్న భూమి పక్కన అటవీ ప్రాంతాన్ని ఆక్రమించి చెట్లు నరికి కొత్తగా పోడు సాగు చేసేందుకు రమేష్ ప్రయత్నిస్తున్నాడని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో రాజారావుపేట సెక్షన్ ఆఫీసర్ హారిక, బీట్ ఆఫీసర్లు ఎస్కే రహీం, రేఖ పాల్గొన్నారు. గిరిజన రైతుపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు -
కెమికల్ లారీ బోల్తా
టేకులపల్లి: అదుపు తప్పి కెమికల్ లారీ బోల్తా పడింది. త్రుటిలో డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం... కర్నూల్ నుంచి భద్రాచలం వెళ్తున్న కెమికల్ లారీ బొమ్మనపల్లి వద్ద గురువారం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ , క్లీనర్ లారీ నుంచి పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. లారీలో కెమికల్స్ ఉన్నా లీకేజీ కాకపోవడంతో ప్రమాదం జరగలేదు. ఆలయంలో చోరీజూలూరుపాడు: మండలంలోని కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలోకి బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. తాళం పగులగొట్టి గుర్తుతెలియని ఆలయంలోకి చొరబడ్డారు. గర్భగుడి తలుపు తాళం పగులగొట్టి అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. హుండీ కూడా పగులగొట్టారు. రెండు రోజుల క్రితమే ఆలయ కమిటీ కానుకలు లెక్కించడంతో అందులో డబ్బులు లేవు. దొంగలు అపహరించిన ఆభరణాల విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ బాదావత్ రవి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా మంగళవారం రాత్రి మాచినేనిపేటతండా గ్రామంలో ఓ ఇంట్లోకి దొంగలు చొరబడి బంగారు, వెండి వస్తువులను చోరీ చేశారు. రెండో రోజు బుధవారం రాత్రి కొమ్ముగూడెం శ్రీ పెద్దమ్మ ఆలయంలో చోరీ జరగింది. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ముస్లిం దంపతుల మత సామరస్యం
అశ్వారావుపేటరూరల్: ముస్లిం దంపతులు భవానీ మాలధారులకు భిక్ష(అన్నదానం) చేసి మత సామరస్యం చాటారు. మండలంలోని ఆసుపాక గ్రామానికి చెందిన ఎస్కే కరీం–గౌసియా దంపతులు గురువారం తమ గ్రామంలో భవాని మాలధరించిన స్వాములకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ముస్లిం దంపతులు మాట్లాడుతూ కుల మతాలు వేరైనా మనుషులంతా ఒకటేనని, ఎంతో కఠోర దీక్ష చేసే భవాని మాలదారులకు అన్నదానం చేసే అదృష్టం తమ దక్కడం సంతోకరమని అన్నారు. పీడీఎస్యూ జిల్లా కమిటీ ఎన్నికసింగరేణి(కొత్తగూడెం): సెప్టెంబర్ 16,17 తేదీల్లో కొత్తగూడెంలోని ఉర్దూఘర్ ఫంక్షన్ హాల్లో పీడీఎస్యూ జిల్లా మహాసభలు జరిగాయి. మొదటి రోజు పట్టణంలో విద్యార్థుల ప్రదర్శన, రెండో రోజు ప్రతిఽనిధుల సభ నిర్వహించారు. నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోగా, గురువారం వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా వి.విజయ్, జిల్లా ఉపాధ్యక్షులుగా రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జే.గణేష్లతోపాటు మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సింగరేణి మహిళా కళాశాల లెక్చరర్కు డాక్టరేట్సూపర్బజార్(కొత్తగూడెం): సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఇంగ్లిష్ విభాగం హెచ్ఓడీగా పనిచేస్తున్న జి.మంజులకు ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆంగ్లంలో పరిశోధన చేసినందుకు ఆమెకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా సింగరేణి జీఎం ఎడ్యుకేషన్ ఎస్.వెంకటాచారి, కరస్పాండెంట్ జీకే కిరణ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శారద, కళాశాల లెక్చరర్లు అభినందనలు తెలిపారు. నర్సరీలోని మొక్కలు ధ్వంసం! దుమ్ముగూడెం : మండలంలోని పెద్దబండిరేవు గ్రామంలోని అటవీశాఖ నర్సరీలోని దాదాపు 2 లక్షల మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు సమాచారం. నర్సరీలోని మొక్కలపై దుండగులు పురుగు మందు స్ప్రే చేయడంతో మొక్కలు మాడిపోయినట్లు తెలిసింది. రేంజర్ కమల సిబ్బందితో కలిసి గురువారం పరిశీలించారు. 22న ఫుట్బాల్ జట్టు ఎంపిక ఖమ్మం స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 ఫుట్బాల్ బాలుర జట్టును ఈనెల 22న ఎంపిక చేయనున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.మూసాకలీం తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే పోటీలకు క్రీడాకారులు వయసు ధ్రువపత్రాలతో పాటు ఇంటర్ స్టడీ సర్టిఫికెట్తో హాజరుకావాలని చెప్పారు. ఇక్కడ ఎంపిక చేసే జిల్లా జట్టు రాష్ట్రస్థాయి అండర్–19 జూనియర్ కళాశాలల పోటీల్లో పాల్గొంటుందని, వివరాలకు 99896 47696, 98483 41238 నంబర్లలో సూచించారు. పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదుచర్ల: కాంట్రాక్టర్లు, వ్యాపారులు, భూస్వాములు, రాజకీయ నాయకులతో పాటు ఓ విలేకరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతా రామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి విప్లవ పేరిట గురువారం రాత్రి లేఖ విడుదలైంది. విప్లవోద్యమంపై పాలకుల, భూస్వా మ్య, పెత్తందారుల విధానాలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయని, పేద, మధ్య తరగతి వర్గాలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొందరు పెత్తందారులు ఈ పోకడలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో రాజకీయ బ్రోకర్లతో కలిసి పెత్తందారులు, భూస్వాములు ఈ పైశాచిక చర్యలకు పాల్పడుతున్నట్లు తమదృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. భూస్వాములు వారి భూములను పేదలకు పంచాలని, లేదంటే తామే స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని ప్రకటించారు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, భూస్వాములు, కాంట్రాక్టర్లు పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, ఓ విలేకరి(సాక్షి కాదు) కూడా ఇలాంటి వైఖరే ప్రదర్శిస్తున్నాడని, వారు పద్ధతి మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భద్రాచలంటౌన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన కరకట్టపై గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మొక్క నాటి మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి సంస్థ మరిన్ని పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాల సెంటర్లోని షిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందదర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు చిట్టె లలిత, పామరాజు తిరుమలరావు, పల్లింటి దేశప్ప, కామిశెట్టి కృష్ణార్జునరావు, గంగాధర వీరయ్య, బిర్రు సుధాకర్, రామరాజు, ఆలయ చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అబ్బినేని శ్రీనివాసరావు, గొర్ల వెంకటేశ్వరరావు, ఆర్ఐ నరసింహారావు పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మొక్క నాటుతున్న సబ్ కలెక్టర్, తదితరులు -
‘రేడియో’లో రామానుజవరం విద్యార్థినులు
మణుగూరు రూరల్ : మండలంలోని రామానుజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం కొత్తగూడెం ఆకాశవాణి రేడియో కదంబ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చూపారు. సుమారు గంట సేపు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పి.నిఖిత, జి.అక్షయ దివ్య, ఎస్కే. అస్రత్, ఎ.శ్రావణి, పి.పుష్పాంజలి, బి.మహిమతేజలు గురువులకు వందనాల పాట పాడారు. సెల్ఫోన్లతో కలిగే నష్టాలను తెలిపే కవితలను చదివారు. పొడుపుకథలు, కనువిప్పు నాటిక, జోకులు, ఐకమత్యమే మహాబలం ఆంగ్ల కథ, తెలుగునీతి పద్యాలు, నాకు నచ్చిన నాయకుడు అబ్దుల్ కలాం తదితర అంశాలను వివరించారు. విద్యార్థినులను, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు వీవీ కోటేశ్వరరావు, జి.సురేష్లను పాఠశాల హెచ్ఎం యశోద అభినందించారు. కాగా రేడియో కార్యక్రమం ఈ నెల 21న మధ్యాహ్నం 12.40 గంటలకు కొత్తగూడెం ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుందని హెచ్ఎం తెలిపారు. -
విద్యావసతుల విస్తరణకు కృషి
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యా వసతుల విస్తరణకు నిరంతరం కృషి చేస్తున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని రామవరం ఏరియా బాలికల గురుకుల పాఠశాలలో రూ.5 కోట్ల ఐటీడీఏ నిధులతో చేపట్టనున్న వసతిగృహాల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువ మంది గిరిజన, గిరిజనేతర పేద విద్యార్థులు గ్రామీణ వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారని, వీరిని మరింత ప్రోత్సహించి ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కారానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి, ప్రిన్సిపాల్ శిరీష, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సీతారామ’ మట్టి మాయం!
● టిప్పర్ లారీలతో అర్ధరాత్రి తరలింపు ● వందలాది ట్రిప్పుల కాలువ మట్టి స్వాహాములకలపల్లి : మండల పరిధిలోని సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ) ప్రధాన కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీలతో టిప్పర్ లారీల్లో నింపి ఇతర ప్రాంతాలకు తోలి విక్రయిస్తున్నారు. పూసుగూడెం, మాధారం మధ్య అటవీ ప్రాంతంలోని మెయిన్ కెనాల్ సమీపం నుంచి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా మట్టి తరలించుకుపోతున్నారు. గత కొన్ని నెలులగా ఈ దందా సాగుతుండగా, ఇప్పటికే వందల కొద్దీ టిప్పుల మట్టి పాల్వంచతోపాటు పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో 12 అడుగులకు పైగా ఎత్తుగా పోసిన కాలువ మట్టి తరలిపోతోంది. సుమారు ఐదు వందల టిప్పర్ లారీలకు పైగా మట్టి బయటకు తరలించినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్ రూ.5 వేలకు విక్రయించినా రూ.25 లక్షల విలువైన మట్టి తరలించినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సహకారంతోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. టిప్పర్ సీజ్, జరిమానా విధింపు కొన్ని నెలలుగా దందా సాగుతున్న క్రమంలో పోలీసులు ఇటీవల ఓ లారీని సీజ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో రాత్రి వేళ సాగుతున్న మట్టి తోలకాల విషయం బయటకు పొక్కింది. సదరు మట్టి టిప్పర్ లారీని పోలీసులు, రెవెన్యూ శాఖకు అప్పగించారు. రూ.5 వేలు జరిమానా విధించినట్లు తహసీల్దార్ భూక్యా గనియా తెలిపారు.మట్టి తోలకాల విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అక్రమ తోలకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. మట్టి అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. –రాంబాబు, డీఈ, నీటి పారుదల శాఖ -
యంత్రాలు వినియోగించుకుంటే..
ఇల్లెందు: మద్దతు ధర పొందాలంటే నిబంధనల ప్రకారం పంట ఉత్పత్తుల్లో వ్యర్థాలు ఉండకూడదు. తేమ నిర్దేశిత శాతానికి మించొద్దు. అప్పుడే రైతులు తాము పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందారు. పంటల్లో వ్యర్థాల తొలగింపునకు, ఉత్పత్తులను ఆరబెట్టేందుకు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవగాహన లేకపోవడంతో రైతులు ఉపయోగించుకోవడంలేదు. దీంతో రూ. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు కార్యాలయాల్లో, గోదాంలలో మూలుగుతున్నాయి. 5.92 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో 5,92,264 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. 1,39,169 మంది రైతులు ఉన్నారు. వరి 42 వేల ఎకరాలు, పత్తి 2.11 లక్షలు ఎకరాలు, మొక్కజొన్న 84 వేల ఎకరాలు, పెసర 346 ఎకరాలు, కంది 1,071 ఎకరాలతోపాటు మరికొన్ని పంటలను రైతులు సాగు చేస్తున్నారు. పంటల కొనుగోలు సమయంలో వ్యాపారులు, అధికారులు ఆయా పంటలను పరిశీలించి యంత్రాలతో నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయిస్తుంటారు. అందుకు తగ్గట్లు పరిశుభ్రత పాటించకపోతే మద్దతు ధర లభించదు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నష్టం వాటిల్ల కుండా ఉండేందుకు ఆయా మార్కెట్ యార్డుల్లో ధాన్యం నాణ్యత నిర్ధారణ యంత్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎక్కువ మంది రైతులు వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తద్వారా ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారు. ఇందుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడంలేదు. అందుబాటులో ఉన్న యంత్రాలు ధాన్యానికి సంబంధించి నూర్పిడి యంత్రం, తాలు లేకుండా చేసేందుకు జల్లెడ, ప్యాడీ క్లీనర్, తూర్పార యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే డ్రయ్యర్ అనే యంత్రంతో ఆరబెట్టవచ్చు. ఇల్లెందు వ్యవపాయ మార్కెట్లో ప్యాడీ క్లీనర్ యంత్రాలు 60, ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్స్ రెండు, పెద్ద ప్యాడీ క్లీనర్ యంత్రాలు 13, ఒక డ్రయ్యర్ ఉన్నాయి. టార్పాలిన్లు 1900, ఎలక్ట్రానిక్ తూకం కాంటాలు 157, తేమ శాతం తేల్చే మిషన్లు 83, క్యాలీబర్స్ 54, టస్క్ రిమూవర్స్ 57 వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్రాలను రైతులకు ఉచితంగా అందజేస్తారు. కాగా జిల్లాలో 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీలు వీటిని నిర్వహిస్తాయి.పంట ఉత్పత్తుల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు మార్కెట్ యార్డుల్లో పంటల పరిశుభ్రతకు ఉపయోగించుకోవాల్సిన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెంచుకుంటే మద్దతు ధర పొందవచ్చు. యంత్రాలను రైతులకు ఉచితంగానే అందజేస్తాం. –ఈ.నరేష్, మార్కెట్ కార్యదర్శి, ఇల్లెందు -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ
చర్ల: చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొన్న ప్రమాదంలో లారీడ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని సీ–కత్తిగూడెంలో ప్రధాన రహదారిపై ఇసుక లారీ నిలిపి ఉంది. వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీడ్రైవర్కు తీవ్ర గాయాలవగా, లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. స్థానికులు గమనించి, గాయపడిన డ్రైవర్ను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అటవీ శాఖకు నూతన హంగులుసత్తుపల్లిటౌన్: సత్తుపల్లి అటవీశాఖకు జిల్లా కేంద్రం తరహాలో నూతనహంగులు రానున్నాయి. టింబర్ డిపోప్రాంగణంలోని స్థలాన్నిపరేడ్గ్రౌండ్గా తీర్చిదిద్దారు. ఇందులోరూ.2లక్షలతో అటవీ అమరవీరుల స్తూపం, రూ.4 లక్షలతో పోడియం ఏర్పాటు చేశారు. డివిజన్స్థాయిలో ఉద్యోగులకు శిక్షణ, సమావేశాల నిర్వహణకోసం రూ.12 లక్షలతో మీటింగ్హాల్ నిర్మించారు.నీలాద్రి అర్బన్ పార్కులో..సందర్శకుల ఆదరణ పెరుగుతున్న నీలాద్రి అర్బన్ పార్కుకు రూ.10 లక్షలతో మారో రెండు బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అర్బన్ పార్కులోని వన్యప్రాణులు బయటకు రాకుండా.. వీధి కుక్కలు లోపలికి చొరబడకుండా కన్జర్వేషన్ జోన్ ఏర్పాటు చేశారు. రూ.50 లక్షలతో 1.5 కిలోమీటర్ల మేర చైన్లింగ్ ఫెన్సింగ్తో రక్షణ చర్యలు చేపట్టారు. పనులను ఎమ్మెల్యే రాగమయితో కలిసి మంత్రి తుమ్మల ప్రారంభిస్తారు. -
యాత్రాదానం.. సేవాభావం
● వినూత్న కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం ● పేదలు, అనాథలను యాత్రలకు తీసుకెళ్లేలా కార్యాచరణ ● దాతలు ముందుకొస్తే బస్సుల కేటాయింపుసత్తుపల్లిటౌన్: పుణ్యక్షేత్రాలు, పర్యాటక, విజ్ఞాన విహార యాత్రలను సందర్శించాలనే కోరిక ఎంతో మందికి ఉంటుంది. కానీ, పేదరికం వల్ల ఆ కల నెరవేర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం వినూత్నంగా ‘యాత్రా దానం’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పలు యాత్రలు, అధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకబస్సులు నడుపుతున్న ఆర్టీసీ యాత్రాదా నం పేరిట ఆదాయాన్ని ఆర్జించేందుకు నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను దాతల సహకారంతో అనాథలు, పేద లు సందర్శించేలా ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీరికి అవకాశం కల్పించేలా.. జిల్లాలోని అనాథలు, ఆశ్రమాలలోని వృద్ధులు, దివ్యాంగులు, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదివే పేద విద్యార్థులకు ఆర్టీసీ ‘యాత్రాదానం’తో పర్యాటక, పుణ్య క్షేత్రాల సందర్శనకు తీసుకెళ్తారు. అందుకోసం రీజియన్ లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల పరిధి లో డిపోమేనేజర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. దాతల చేయూతతో.. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర ప్రత్యేక రోజులు, పండుగలు తదితర సందర్భాలు, సంతోషకరమైన రోజుల్లో అన్నదానం, రక్తదానం, నేత్రదానం, అవయవదానం ఎక్కువగా చేస్తుంటా రు. ఈసందర్భాలలో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పేద విద్యార్థులకు పుణ్యక్షేత్రాల దర్శ నం కల్పించటానికి ఆర్టీసీకి డబ్బులు విరాళంగా అందజేస్తే బస్సు సదుపాయం కల్పిస్తారు. అలాంటి దాతలు, సంస్థల సేవలను వినియోగించుకునేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఎన్ఆర్ఐలతో పాటు కార్పొరేట్ సంస్థలు, స్వస్ఛంద సంస్థలు, సంఘాలు ముందుకు వచ్చి ఆర్టీసీ ‘యాత్రాదానం’లో భాగస్వాములు కావొచ్చు. మిత్రుల భాగస్వామ్యంతోనైనా.. యాత్రాదానం కార్యక్రమంలో దాతలు ఆధ్యాత్మిక సంతృప్తితో పాటు సామాజిక సేవ చేశామనే ఆనందం పొందవచ్చు. దాతలు ఏ పుణ్యక్షేత్రానికి యా త్రాదానం చేయదల్చుకున్నారో వివరాలతో డిపో మేనేజర్లను సంప్రదించాలి. యాత్రకు సంబంధించి కిలోమీటర్లను లెక్కించి దాని ప్రాతిపదికన ఏసీ, సూపర్లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల చార్జీలు వెల్లడిస్తారు. ఆపై బస్సులను ఎంచుకుంటే డిపోల నుంచి కేటాయిస్తారు. యాత్రకు సంబంధించి నగదును ఒకరైనా.. ఇంకొందరితో కలిపైనా చెల్లించవచ్చు. పుణ్యక్షేత్రాలతో.. ఖమ్మం రీజియన్లో ఏడు డిపోలకు గాను మొత్తం 563 బస్సులు ఉన్నాయి. గతంలో జూన్ నుంచి పుణ్యక్షేత్రాలు, యాత్రల పేరిట అరుణాచలం తదితర ప్రాంతాలకు ప్రత్యేకరోజుల్లో బస్సులు ఏర్పా టు చేస్తున్నారు. రీజియన్ నుంచి 42 బస్సులు నడపగా 25,682 మంది భక్తులు ఉపయోగించుకున్నారు. తద్వారా రీజియన్కు రూ.17,03,668 ఆదాయం లభించింది. సేవాభావంతో ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చి యాత్రాదానానికి సహకరించవచ్చు. సామాజిక సేవలో భాగంగా విరాళాలు ఇస్తే పేదలు పుణ్యక్షేత్రాలు, విజ్ఞాన, విహారయాత్రలకు ఆర్టీసీ బస్సుల్లో సందర్శించే అవకాశం లభిస్తుంది. వారం రోజులు ముందుగానే బస్సును బుక్ చేసుకోవాలి. –ఎ.సరిరామ్, ఆర్టీసీ ఆర్ఎం, ఖమ్మం -
ఏడుగురిపై కేసు
అశ్వాపురం: మండల కేంద్రంలో కాలువబజార్లో బుధవారం జరిగిన గొడవ, దాడి కేసులో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాలువబజార్లో బొల్లం కుమార్ తల్లి ఇటీవల మరణించగా బుధవారం పెద్ద కర్మ నిర్వహించారు. అక్కడికి వచ్చిన కొందరు మద్యం సేవించి గొడవ పడి కుమార్ తండ్రి, బంధువులపై దాడి చేసి గాయపరిచారు. బొల్లం కుమార్ ఫిర్యాదు మేరకు జగ్గారం గ్రామానికి చెందిన నూకల సంపత్, పిండి శ్రావణ్, బాలిన రాజేశ్, నూకల నాగరాజు, నెట్టెం రామకృష్ణపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో నూకల నాగరాజు ఫిర్యాదు మేరకు కొత్తగూడెంనకు చెందిన కాటిబోయిన అరవింద్, జంగిలి శ్రీనివాస్పై సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంట నిల్వ ప్రాజెక్టులకు రాయితీలు
ఖమ్మంవ్యవసాయం: పంటల నిల్వ, రవాణా, ప్రాససింగ్ చేయడం వంటి ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. 2025–26 వార్షిక ప్రణాళికలో భాగంగా ఉద్యాన రైతులకు ఈ మేరకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. దేశంలో రైతులు పండించిన పంటల్లో 20–30 శాతం వరకు తగిన నిర్వహణ లేక నాణ్యత కోల్పోయి మద్దతు ధర దక్కడం లేదు. ఉద్యాన పంటల్లో ప్రధానంగా పండ్లు కోత తరువాత శీతలీకరించడం, గ్రేడ్ చేయడం, ప్యాకింగ్, రవాణా, ప్రాసెసింగ్ వంటి విధానాలు అవలంభించడం ద్వారా విలువ పెరగడంతో పాటు ప్రత్యేక మార్కెటింగ్ చానల్ ద్వారా అమ్మకాల కు అవకాశం ఉంటుంది. తద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాక వినియోగదారులకు నాణ్యమైన పండ్లు లభిస్తాయి. జిల్లాలో పండ్లతోటలు పెంచే రైతుల కు ఏడు ప్యాక్ హౌస్ యూనిట్లు, రెండు కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ఒక రైషనింగ్ చాంబర్, 15సోలార్ ప్యానెల్ యూనిట్లు మంజూరయ్యాయని జిల్లా ఉద్యానాధికారి ఎం.మధుసూదన్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పాఠశాల ప్రారంభం
అన్నపురెడ్డిపల్లి, (చండ్రుగొండ): మండలంలోని కనకగిరి గుట్టల ప్రాంతంలో ఉన్న రజబ్అలీ నగర్లో గిరిపుత్రుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను బుధవారం ఎంఈఓ ఉండేటి అనంద్కుమార్ ప్రారంభించారు. మహబూబ్నగర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రజబ్అలీనగర్ 3 కి.మీ. దూరంలో ఉంది. గొత్తికోయ చిన్నారులు పాఠశా లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్న ఎంఈఓ ఆనంద్కుమార్ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ ప్రారంభించారు. కార్యక్రమంలో సీసీఓ వెంకటరమణ, సీఆర్పీలు శిరీష, కృష్ణ, బుచ్చయ్య, వి.వెంకటేశ్వరరావు, జయరాం, శంకర్, మహదేవన్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు అదనపు చెల్లింపులు
చండ్రుగొండ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తొలి విడత బిల్లుల చెల్లింపుల తర్వాత అదనంగా మరోసారి నగదు జమ చేసిన ఘటన బుధవారం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వెలుగు చూసింది. ఆలస్యంగా దీనిని గుర్తించిన అధికారులు లబ్ధిదారుల వద్ద నుంచి వాటిని రికవరీ చేసేందుకు యత్నిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చండ్రుగొండ మండలానికి చెందిన ఎస్డీ ఇమాంబీ, సిరికొండ స్వామి, గంగారపు సుబ్బమ్మ, కునసోతు జయ, పొట్టా భవానీ, బండ ఉషారాణి, కంచర్ల తిరుమలి, ఇనుముల లక్ష్మి, కుక్కముడి రాణి, గోసుల నర్సింహారావు, సీతమ్మ, జాల పద్మకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ నెల 11వ తేదీన వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున నగదు జమ అయింది. కాగా, వారికి అదనంగా మరోసారి ఈ నెల 15న బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ కావడం గమనార్హం. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి అదనంగా నగదు చెల్లింపులు జరిగాయని, ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సిందిగా స్థానిక గృహ నిర్మాణ శాఖ అధికారులు కోరుతున్నారు. కాగా, చండ్రుగొండ మండలంతోపాటు అన్నపురెడ్డిపల్లి మండలం, జిల్లాలోని మరికొన్ని మండలాల్లో కుడా ఇలాగే జరిగినట్లు తెలిసింది.టెన్నిస్ కోర్టు ప్రారంభంభద్రాచలంటౌన్: ఉద్యోగులకు టెన్నిస్ క్రీడలు ఎంతో మేలు చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని నివాస సముదాయంలలో కొత్తగా నిర్మించిన లాన్ టెన్నిస్ కోర్టును పీఓ బుధవారం ప్రారంభించి, మాట్లాడారు. టెన్నిస్ ఆడితే వ్యాయామంతో పాటు మనసుకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు. క్రమం తప్పకుండా ఉద్యోగులు తమ పిల్లలు గంట పాటు టెన్నిస్ ఆడాలని సూచించారు. చెత్తా చెదారాన్ని మైదానంలో వేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, అలివేలు మంగతాయారు, గోపాల్రావు, నాగేశ్వరరావు, ఆదినారాయణ, పీడీలు వెంకటేశ్వర్లు, హరికృష్ణ ఈశ్వర్,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.మార్గదర్శక శక్తిగా పనిచేస్తాయి..అశ్వాపురం: ఎన్సీసీ శిబిరంలో పొందిన శిక్షణ, అనుభవాలు వారి భవిష్యత్ ప్రయత్నాల్లో మార్గదర్శక శక్తిగా పనిచేస్తాయని ఐటీడీఏ పీఓ రాహుల్, వరంగల్ గ్రూప్ కమాండర్ వీరచక్ర కల్నల్ సచిన్ అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాలలో పది రోజులుగా జరుగుతున్న ఎన్సీసీ శిక్షణ శిబిరం బుధవారం ముగిసింది. ఐటీడీఏ పీఓ, వరంగల్ గ్రూప్ కమాండర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. కేడెట్లు దేశభక్తి గీతాలు, తెలంగాణ సాంస్క్రతిక నృత్యాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాహుల్, సచిన్ మాట్లాడుతూ.. ఎన్సీసీ శిక్షణలో పొందిన అనుభవాలు నాయకత్వం, దేశభక్తి, బాధ్యతను పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంజయ్భద్ర, కళాశాల ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి, సిబ్బంది పాల్గొన్నారు.వృద్ధుడి అదృశ్యంచండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామానికి చెందిన బొర్రా భావ్సింగ్ కనిపించకుండా పోగా.. బుధవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ తెలిపారు. 70 ఏళ్ల వయసున్న భావ్సింగ్ మంగళవారం మండలంలోని టేకులపల్లిలో ఉన్న తన కుమార్తెను చూసి వస్తానని వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా, ఆయన అక్కడకు రాలేదని చెప్పారు. భావ్సింగ్ ఆచూకీ తెలియకపోవడంతో కుటంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 87126 82043కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీజూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. మాచినేనిపేటతండాకు చెందిన బీరేల్లి సుధాకర్ ఈనెల 16న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. బుధవారం ఇంటికి వచ్చి చూడగా.. చోరీ జరిగిందని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ శ్రీలక్ష్మి.. సిబ్బంది, క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.12 వేల విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని ఎస్ఐ రవి తెలిపారు. -
యూరియా కోసం రైతుల పాట్లు
పాల్వంచరూరల్: యూరియా కోసం నిత్యం అవస్థ పడుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జగన్నాథపురం రైతువేదిక వద్ద మూడు రోజుల క్రితం రైతులకు యూరియా పంపిణీ చేస్తామని చెప్పి ఆధార్కార్డు, పాస్ పుస్తకాల జిరాక్స్లు తీసుకున్నారు. కానీ, బుధవారం వాటిని తిరిగి రైతులకు ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీ చేస్తారని ఆశతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతువేదిక వద్ద 150 మందికి పైగా పలు గ్రామాలకు చెందిన రైతులు నిరీక్షించారు. కానీ, అధికారులు యూరియా పంపిణీ చేయకుండా తీసుకున్న జిరాక్స్ పత్రాలు ఇచ్చారు. కాగా, యూరియా కోసం వచ్చిన రైతులకు బీఆర్ఎస్ నాయకులు కాంపెల్లి కనకేశ్ భోజనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రంజిత్, హర్షవర్దన్, ప్రసాద్, శోభన్, పుల్లయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవంతంగా శస్త్రచికిత్స
భద్రాచలంటౌన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు బాలుడు మింగిన స్టార్ డ్రిల్ బిట్ను శస్త్రచికిత్స ద్వారా బుధవారం విజయవంతంగా తొలగించారు. సరిహద్దు ఏపీలోని ఎటపాక మండలం చోడవరం గ్రామానికి చెందిన 8 ఏళ్ల గౌతమ్ ఆడుకుంటూ 6 అంగులాల డ్రిలింగ్ మిషన్కు సంబంధించిన స్టార్ డ్రిల్ బిట్ను గత శనివారం మింగాడు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం తల్లికి చెప్పాడు. దీంతో కుంటుంబ సభ్యులు ఏరియా వైద్య శాలకు తరలించగా పిల్లల వైద్యుడు రాజశేఖర్రెడ్డి పరీక్షించి విసర్జన ద్వారా బయటకు వస్తుందేమోనని రెండు రోజులు వేచిచూశారు. ఈ క్రమంలో బాలుడికి బాగా కడుపులో నొప్పి వస్తుండడంతో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం శస్త్ర చికిత్స నిర్వహించి డ్రిల్ బిట్ను తొలగించారు. బాలుడికి శస్త్ర చికిత్స చేసిన వారిలో అనస్థీషియన్, నిఖిత, మల్లేశ్దొర పాల్గొన్నారు. కడుపులోని డ్రిల్ బిట్ తొలగింపు -
కమనీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారి నిత్యకల్యాణ వేడుక కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైభవంగా భద్రగిరి ప్రదక్షిణభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శ్రీరామచంద్రుని జన్మనక్షత్రం (పునర్వసు)ని పురస్కరించుకుని భక్తరామదాసు ట్రస్ట్ (కొత్తగూడెం) నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం భద్రగిరి ప్రదక్షిణా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కృపాకటాక్షాలకు గిరిప్రదక్షిణానే మార్గంగా ప్రతి నెలా పునర్వసు రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులు గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించి, ప్రసాదం అంజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్, సీసీ శ్రీనివాస రెడ్డి, పీఆర్ఓ సాయిబాబు, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గొత్తికోయల వలసగూడెం ఖాళీ..అటవీ సిబ్బంది కృషితో అడవిని వీడేందుకు అంగీకారం చుంచుపల్లి: కొత్తగూడెం డివిజన్ అటవీ సిబ్బంది సమష్టి కృషితో బుధవారం గొత్తికోయల వలసగూడెం వాసులు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నారు. సత్యంపేట బీట్ పరిధిలో 18 కిలోమీటర్ల మేర మాస్ కూంబింగ్–ఫారెస్ట్ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు. 2018లో అటవీలో ఏర్పడిన మామిడిగూడెం గొత్తికోయల వలసగూడెంలోని సుమారు 45 కుటుంబాలు దాదాపు 45 ఇళ్లను, పశువుల కొట్టాలను ఏర్పాటు చేసుకున్నాయి. గతేడాది నుంచి నిరంతరంగా జరిగిన సమావేశాల ఫలితంగా చివరికి వారు అటవీ బయటకు వెళ్లేందుకు అంగీకరించారు. అటవీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లో భాగంగా వారంలోగా గ్రామం పూర్తిగా ఖాళీ చేసే అవకాశం ఉందని ఎఫ్డీఓ యూ.కోటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెం వాసికి డాక్టరేట్కొత్తగూడెంఅర్బన్: పట్టణంలోని ఎస్ఆర్ డిజీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దోర్బల లక్ష్మీఅనురాధకు ఏపీలోని నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘పర్సెప్షన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆన్ది ఫంక్షనింగ్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై డాక్టర్ గోగినేని యశోద పర్యవేక్షణలో ఆమె పరిశోధనాపత్రం సమర్పించారు. బుధవారం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా అనురాధను పాఠశాల యాజమాన్యం లక్ష్మణరావు, సతీష్, తిరుమల్రెడ్డి, రామారావు అభినందించారు. -
ఉన్నత లక్ష్యాలతో రాణించాలి
దమ్మపేట/ములకలపల్లి : ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో రాణించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఆయన ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి ప్రారంభించారు. అదే పాఠశాలలో రూ.8 కోట్ల 60 లక్షలతో నిర్మించనున్న బాలుర హాస్టల్, ఉద్యోగుల క్వార్టర్ల భవనాల శంకుస్థాపన నిమిత్తం ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించారు. అడ్వెంట విత్తన కంపెనీ ఆర్థికసాయంతో రూ.46 లక్షలతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను, రూ.21 లక్షలతో గండుగులపల్లిలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి తుమ్మల మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత స్థానిక మంగపేట పీహెచ్సీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి, దేశంలోని ఏకలవ్య పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థినులకు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఏర్పాటు చేయాలని వైద్య శాఖాధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లతోపాటు, శాస్త్రవేత్తలుగా కూడా ఎదగాలని, ప్రధానంగా భూ, జల, వ్యవసాయ రంగాల్లో రాణించాలని సూచించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్సైన్స్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు అద్భుత అవకాశాలు దక్కుతాయన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ దసరా సెలవుల్లోగా అన్ని పాఠశాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళలదే ప్రధాన పాత్ర పేర్కొన్నారు. ఐటీడీఏ పీఓ గౌతమ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఆర్డీఓ విద్యాచందన, డీఎంఅండ్హెచ్ఓ జయలక్ష్మి, తహసీల్దార్ గనియా నాయక్, ఎంపీడీఓ రామారావు, కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు, తాండ్ర ప్రభాకర్రావు, పర్వతనేని అమర్నాథ్, పువ్వాల మంగపతి, కరుటూరి కృష్ణ, అడపా నాగేశ్వరరావు, బాల అప్పారావు, కారం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
మరో సర్వేకు అడుగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్తోపాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్లలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. కొత్తగూడెంలో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో చిన్న విమానాలతోపాటు ఎయిర్బస్ వంటి భారీ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకునేందుకు వీలుగా మూడు కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 950 ఎకరాల భూమి అవసరమని భావించారు. కొత్తగూడెం మండల పరిధిలోని రామవరం, గరీభ్పేట శివారులలో 707, సుజాతనగర్ మండల పరిధిలో 195, చుంచుపల్లి మండల పరిధిలో 50 ఎకరాల స్థలాలను కూడా గుర్తించారు. ఇక్కడున్న ఎత్తైన గుట్టలు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా నిలిచాయి. మరోవైపు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టుల విషయంలో సానుకూల ఫలితాలు వచ్చి క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. దీంతో సెప్టెంబరు 16న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కొత్తగూడెం ఎయిర్పోర్టు కోసం విజ్ఞప్తి చేయగా.. మరోసారి ఫీజుబులిటీ సర్వేకు అడుగులు పడ్డాయి. ఇరవై ఏళ్లుగాఽ అదే సమస్య కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే అంశంపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరైన స్థలాన్ని ఎంపిక చేయడమే సవాల్గా మారింది. భవిష్యత్లో బోయింగ్ విమానాలు దిగేందుకు వీలుగా వెయ్యి ఎకరాల్లో ఎయిర్పోర్టు కోసం సుజాతనగర్ ప్రాంతంలో భూములు వెతికారు. అయితే అది సాధ్యపడలేదు. చివరకు ఎయిర్కార్గో సేవల కోసం ప్రయత్నాలు చేసినా అవి ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ముందుగా లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక ఆ తర్వాత పాల్వంచ మండలం గుడిపాడు – బంగారుజాలల మధ్య ఎయిర్పోర్టు నిర్మాణం కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. పాల్వంచ పట్టణాన్ని అనుకుని ఉన్న ఎత్తైన గుట్టలు, కేటీపీఎస్ చిమ్నీలు, కూలింగ్ టవర్ల వల్ల సాంకేతిక ఇబ్బందులు రావడంతో ఈ ప్రతిపాదన అక్కడే ఆగిపోయింది. కొత్తగూడెం – భద్రాచలం మధ్య.. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎన్నిసార్లు స్థలాలను గుర్తించినా ఎత్తైన కొండలు, అభయారణ్యం, హై టెన్షన్ కరెంటు లైన్లు, రైల్వే మార్గాలు, నేల స్వభావం, గాలుల తీవ్రత, నీటి ప్రవాహాలు వంటి భౌగోళిక, సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మండలాలను మినహాయించి భద్రాచలం – కొత్తగూడెం మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి అనువుగా ఉన్న స్థలాలను పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు సైతం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు రెండు మూడు చోట్ల స్థలాలను గుర్తించగా, ఇందులో ఒక స్థలాన్ని ఎయిర్పోర్టు కోసం ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఎంతో ఉపయుక్తం జిల్లాలో దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే దేశం నలుమూలల నుంచి భద్రాచలం క్షేత్రానికి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగా మెడికల్ కాలేజీ, డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ జిల్లాలో ఏర్పాటైంది. దేశం మొత్తం మీద ఎర్త్ సైన్సెస్ విభాగంలో ప్రత్యేక కోర్సులు అందిస్తున్న వర్సిటీగా ఇది నిలిచింది. త్వరలోనే సేంద్రియ సాగు విధానానికి సంబంధించి ఎక్స్లెన్స్ సెంటర్ కూడా జిల్లాకు రానుంది. మరోవైపు అడవులు విస్తారంగా ఉండటంతో ఎకో టూరిజానికి ఈ ప్రాంతం అనువుగా ఉంది. ఇప్పటికే ఎకో టూరిజంలో ప్రసిద్ధి చెందిన మారేడుమిల్లి, పాపికొండలు, సీలేరు – పొల్లూరు వాటర్ఫాల్స్ వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు భద్రాచలం గేట్వేగా ఉంది. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఆధ్యాత్మిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలు ఈ ప్రాంతంలో పుంజుకుంటాయి. సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చేందుకు ఆస్కారముంది. -
మతాల మధ్య చిచ్చుకు కుట్ర
● సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుముతారా..? ● సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ ఖమ్మంగాంధీచౌక్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు మత పరమైన రంగు పులుముతున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ విమర్శించారు. నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఈ పోరాటంలో శ్రామికులు, కార్మికులు, రైతులు భాగస్వాములయ్యారని, మహిళల భాగస్వామ్యం కూడా గొప్పదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరులో అనేక మంది ప్రాణత్యాగం చేశారని నివాళులర్పించారు. దున్నేవాడికే భూమి కావాలని భూ స్వాములకు ఎదురొడ్డి పోరాటం సాగిందని, దీని ఫలితంగానే లక్షలాది ఎకరాల భూములు పేదలకు పంచారని తెలిపారు. అయితే కేంద్రంలోని నేటి పాలకులు ఈ పోరాటానికి మతం రంగు పులుముతూ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దీన్ని ముస్లింలకు – హిందువులకు మధ్య జరిగిన పోరాటమని కొందరు వక్రీకరిస్తూ విమోచన, విలీనం, విద్రోహం అనే పేర్లతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. హక్కులు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి, అత్యాచారాల నిరోధంతో పాటు దున్నే వాడిదే భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, నాయకులు బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రం, ఎం. సుబ్బారావు, బండి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో అగ్రగామి
సూపర్బజార్(కొత్తగూడెం): అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రధానంగా ఖనిజసంపద, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయపతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మొదట సింగరేణి అతిథి గృహంలో మంత్రికి కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసిన చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరులు, ప్రజాపోరాట యోధుల త్యాగాల వల్లే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలేపాలకులని, ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని ప్రజాపాలన దినోత్సవం గుర్తు చేస్తోందని అన్నారు. విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఉపాధి, సంక్షేమరంగాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలతో రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్గా నిలిచిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కల నెరవేరిందని, దేశంలోనే తొలిసారిగా జిల్లాలో ఎర్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. భద్రాచలం రైల్వే లైన్కు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. అడ్డంకులను తొలగించి కలెక్టర్ సూచించిన ప్రాంతంలో విమానాశ్రయం నిర్మిస్తామని తెలిపారు. రింగ్రోడ్డు, బైపాస్రోడ్డు, నేషనల్హైవే పనులు కూడా పురోగతిలో ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులు మిర్చి, పత్తి వంటి పంటలను తగ్గంచి లాభదాయకమైన ఉద్యాన పంటల వేయాలని సూచించారు. దేశంలోనే జిల్లా ఆయిల్పామ్ హబ్గా మారుతుందని అన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు జిల్లాలో జరుగుతున్న ఆయిల్పామ్ సాగు గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. సిద్ధిపేటలో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణాగౌడ్, అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టరేట్లో విశ్వకర్మ జయంతికలెక్టరేట్లో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు కొత్వాల శ్రీనివాసరావు, నాగ సీతారాములు, కాపర్తి వెంకటాచారి, వారాధి సత్యనారాయణ, బసవపాత్రుని తిరుపతి, వారాధి రామాచారి, బి.సాంబయ్య, ఎస్.కృష్ణమాచారి, కూరపాటి లింగాచారి, పి.వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.‘ప్రజాపాలన’తో సమానత్వం, న్యాయం: ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలంటౌన్: ప్రజాభిప్రాయాలు, ఆకాంక్షలు, సమస్యలను గుర్తించి సరైన పరిష్కారం చూపి, సమాజాన్ని సమానత్వం, న్యాయం అభివృద్ధి దిశగా నడిపించడమే ప్రజాపాలన ఉద్దేశమని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పతాక ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ 17తో నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్ రాజ్, మణెమ్మ, సున్నం రాంబాబు, భాస్కరన్, హరీష్, ఉదయ్ కుమార్, అశోక్ కుమార్,ఆదినారాయణ, ప్రభాకర్ రావు, హరికృష్ణ, చలపతి, బిక్షం తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం
భధ్రాచలం: భద్రాద్రి రామయ్య చెంతకు వచ్చే భక్తులకు ప్రశాంత దర్శనం, సకల సౌకర్యాల కల్పన, దేవస్థానం అభివృద్ధే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తిస్తానని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొల్లు దామోదర్రావు తెలిపారు. ఇటీవల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భక్తులకు సౌకర్యాల కల్పన భద్రాచలం ఆర్డీఓగా పనిచేసి ఉండటంతో భద్రాచలం, దేవస్థానంపై అవగాహన ఏర్పడింది. దీంతోపాటు ఆలయ అభివృద్ధిలో కీలకమైన మాఢ వీధుల విస్తరణలో భూ సేకరణ చేసి నిర్వాసితులకు నష్టపరిహారం అందజేశాం. ఇప్పుడు ఆలయ ఈఓగా అదే అభివృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తా. ఇప్పటికే భక్తులకు అందుతున్న ఆన్లైన్ సౌకర్యాలను ఇతర విభాగాలకూ విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక ప్రధానంగా రామాలయంలో నిర్వహించే సేవలు, ఆలయ ప్రాశస్త్యంపై ప్రచార లోపం ఉందనే అపోహలు తొలగించేందుకు ఆ సేవలు, ఇతర హోర్డింగ్లను భద్రాచలంతోపాటు మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై నిరుపయోగంగా ఉన్న టీటీడీ, అన్నవరం సత్రాలను పూర్తిగా తొలగించి ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రామాలయం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తొలగించి క్లీన్ భద్రగిరిగా ఉంచేందుకు కృషి చేస్తా. మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలు.. ఇక ప్రభుత్వం సంకల్పించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తా. ప్రధానంగా ఆలయం, ఉపాలయాల అభివృద్ధి, మార్పులు, చేర్పులపై ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ పండితులు, వైదిక కమిటీలతో సమన్వయం చేసుకుంటూ వారి సలహాలు, సూచనల మేరకు ముందుకెళ్తాం. ఈ మేరకు ఇప్పటికే వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. చర్చలు ముగిశాక కలెక్టర్, ఇతరులతో కలిసి తగిన నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తాం. ఆలయ అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాల కల్పనే ప్రధాన అజెండాగా పని చేస్తాం. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని తట్టుకునేందుకు తాత్కాలిక వెయిటింగ్ గదులు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మిథిలా స్టేడియం, ఇతర ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. భక్తులకు సరిపడా లడ్డూలు, వీఐపీలకు ఇతర సేవలను దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలతో ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తాం. రాముడికి చెందిన భూములను చట్ట ప్రకారం కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఏపీలోని పురుషోత్తపట్నంలో రాముడి భూములు దేవస్థానానికి చెందేలా అన్ని పత్రాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించాం. వీటిని న్యాయపరంగానే దక్కించుకుంటాం. ఏపీలోని అన్ని శాఖల సహాయ సహకారాలతో ఈ భూములపై పోరాడుతాం. ఇతర ప్రాంతాలలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులకు సేవ చేసేందుకు రామయ్య కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. -
స్వచ్ఛతా హీ సేవా పోస్టర్ ఆవిష్కరణ
చుంచుపల్లి: స్వచ్ఛతా హీ సేవా–2025 పోస్టర్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛ శ్రామికులకు ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛత ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు చిత్ర లేఖనం, వ్యాసరచన, నాటక, ఇతర పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన, సిబ్బంది రేవతి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యా విధానంతో సులభంగా నేర్చుకోవచ్చుసూపర్బజార్(కొత్తగూడెం): డిజిటల్ విద్యావిధానంతో విద్యార్థులు సులభంగా నేర్చుకోవచ్చని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో బుధవారం ఎనిమిది ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, రెండు భవిత సెంటర్ల ఐఈఆర్పీలకు సీఎస్ఆర్ పాలసీ ద్వారా హైదరాబాద్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యాజమాన్యం క్యాన్ ప్రొజెక్టర్ (డిజిటల్ బోధనా పరికరాలు)లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ.25 లక్షల విలువైన భోధనా పరికరాలను అందజేసినందుకు అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో జిల్లాలో 250 పాఠశాలలకు కూడా మంజూరు చేయాలని ప్రతిపాదించామని తెలిపారు. బీఈఎల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డీఈఓ బి.నాగలక్ష్మి, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్కుమార్, సైదులు, నాగరాజశేఖర్, బీఈఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ నిర్మాణంపై చొరవ తీసుకోండి
కేంద్ర మంత్రికి తుమ్మల వినతి ఇల్లెందు/ఖమ్మంఅర్బన్: కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రాంమోహన్నాయుడుకు వివరాలు అందజేసి మాట్లాడారు. గతంలో గుర్తించిన స్థలం అనుకూలంగా లేదని తేల్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించిన నేపథ్యాన సర్వే చేయించాలని కోరారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులే కాక సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ పరిశ్రమలకు వచ్చివెళ్లే అధికారులకు అనువుగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డీ.కుమారస్వామిని కూడా కలిసిన తుమ్మల.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఆవశ్యకతను వివరించారు.కలెక్టరేట్లో నేడు ప్రజాపాలన దినోత్సవంసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో బుధవారం నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవివిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు పతాకావిష్కరణ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. వివిధ అభివృద్ధి పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం 11.30 గంటలకు ములకలపల్లి మండలం మంగపేటలో నిర్వహించే జిల్లా స్థాయి ఆరోగ్య శిబిరంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు దమ్మపేట మండలం గండుగులపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. రైతులు కూపన్లు తీసుకోవాలిములకలపల్లి: పీఏసీఎస్లో యూరియా కోనుగోలు చేసే రైతులు.. ఏఈఓలు జారీ చేసే కూపన్లు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి. బాబూరావు సూచించారు. మండలంలోని పూసుగూడెం రైతువేదికలో ఏర్పాటు చేసిన యూరియా విక్రయ కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆధార్కార్డు, పట్టా పాస్ పుస్తకాలు వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సొసైటీలతో పాటు రైతు వేదికల్లోనూ యూరి యా విక్రయిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏడీఓ జి.లాల్చందర్, ఎంఏఓ అరుణ్బాబు, ఏఈఓ రజనీకాంత్, పీఏసీఎస్ సిబ్బంది మురళీ, నాగేంద్ర పాల్గొన్నారు. లైసెన్స్ హక్కులకు 29న వేలంభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్ధానంలో వివిధ లైసెన్స్ల హక్కు మంజూరుకు ఈనెల 29న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈఓ కె.దామోదర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తానీషా కల్యాణ మండపంలోని కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని సూచించారు. గతంలో దేవస్థానానికి బాకీ, తగాదాలు ఉన్నవారు అనర్హులని పేర్కొన్నారు. వివరాలకు కార్యాలయ పనివేళల్లో 9515545354 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. నేడు ఖమ్మంలో సాయుధ పోరాట వారోత్సవాల సభ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో బుధవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ నిర్వహిస్తున్నట్లు సీపీఎం నాయకులు తెలిపారు. గత వారం రోజులుగా అమరువీరులకు నివాళులర్పించడమేకాక సభను విజయవంతమయ్యేలా ప్రచారం చేశామని వెల్లడించారు. ఈమేరకు బుధవారం జరిగే సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబి, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్రావు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
చదువుతో పాటు కళల్లోనూ రాణించాలి
కొత్తగూడెంఅర్బన్ : విద్యార్థులు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పాటు జరగనున్న జిల్లా స్థాయి కళోత్సవం పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని, కానీ వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయానని తెలిపారు. నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్ బాగుంటుందని సూచించారు. పిల్లలంతా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించేది ఇలాంటి పోటీలేనని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తీపి జ్ఞాపకాలను తమతో తీసుకెళ్లాలని సూచించారు. ఈ పోటీలలో సుమారు 200 మంది విద్యార్థులు 12 రకాల కళారూపాలను రెండు రోజులపాటు ప్రదర్శించనున్నారని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగ రాజశేఖర్ మాట్లాడుతూ.. మొదటి రోజు శాసీ్త్రయ, జానపద నృత్యాలు, థియేటర్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ 2డీ, 3డీ అంశాల్లో, రెండో రోజు గాత్ర సంగీతం, వాయిద్య సంగీ తం, కథలు చెప్పడం వంటి పోటీలు ఉంటాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, సైదులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
‘స్వచ్ఛత’కు సర్వం సిద్ధం
చుంచుపల్లి: దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని చెప్పిన మాహాత్మాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీలో స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్వాన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేయగా.. స్వచ్ఛోత్సవ్ – పక్షోత్సవాల పేరుతో కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేస్తారు. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు పాల్గొని పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రధానంగా పరిసరాల పరిశుభ్రతపై మానవహారాలు, స్వచ్ఛత పరుగు, ర్యాలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బహిరంగ స్థలాలు, కూడళ్లలో ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, శ్రమదానాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం వంటివి జరిపిస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తారు. ప్రధాన కార్యక్రమాల వివరాలిలా.. ● పల్లెల్లో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాన కూడళ్లు, ప్రజోపయోగ స్థలాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త, మురుగు తొలగిస్తారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజల శ్రమదానంతో పారిశుద్ధ్య పనులు చేపడతారు. ● కంపోస్ట్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయడం, చెత్త నుంచి ప్లాస్టిక్, గాజు, ఇతర వస్తువులు తొలగించి మిగిలిన తడిచెత్త వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మారుస్తారు. ● అక్టోబర్ 2న చివరి రోజు గ్రామసభల్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక తీర్మానాలు చేస్తారు. వస్త్ర సంచులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. స్వచ్ఛత ప్రాధాన్యంపై విద్యాలయాల్లో క్విజ్ పోటీలు, విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపడతారు. నిధుల సంగతేంటి..? ‘స్వచ్ఛతా హీ సేవ’ పేరుతో బుధవారం నుంచి వచ్చే నెల 2 వరకు 15 రోజులపాటు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గ్రామ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రతి పనికీ కార్యదర్శులే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలకు నిధుల లేమితో అడ్డంకులు ఏర్పడతాయనే భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. రోజువారీ ప్రణాళికలతో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి స్వచ్ఛ పల్లెలుగా మార్చడమే లక్ష్యం. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. – ఎం. విద్యాచందన, డీఆర్డీఓ -
సృజనాత్మక బోధన అందించాలి
టీఎల్ఎం మేళాలో పీఓ రాహుల్భద్రాచలం: విద్యార్థులకు సృజనాత్మక బోధన అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన టీఎల్ఎం మేళాను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు వివిధ అంశాలను సులువుగా నేర్చుకునేందుకు ఈ ప్రక్రియ ఉపకరిస్తుందన్నారు. ఉద్దీపకం వర్క్బుక్–2 లోని సారాంశాలను సృజనాత్మక చిత్రాల ద్వారా అవగాహన కల్పించేందుకే ఈ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే భద్రాచలం, దమ్మపేట, ఇల్లెందు డివిజన్ల పరిధిలో ఈ మేళాలను నిర్వహించామని వెల్లడించారు. జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో తెలుగు, గణితం, ఇంగ్లిష్ విభాగాల్లో ఉత్తమంగా ఎంపికై న పాఠశాలల ఉపాధ్యాయులకు నగదు బహుమతులు అందిస్తామని వివరించారు. ప్రథమ బహుమతిగా రూ. 5,000, రెండో బహుమతి రూ. 3,000, మూడో బహుమతి రూ.2,000తో పాటు మెమెంటోలు అందిస్తామని తెలిపారు. స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి.. నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని రాహుల్ అన్నారు. వైటీసీలో జరుగుతున్న వీడియో, ఫొటోగ్రఫీ శిక్షణను పరిశీలించిన పీఓ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం, ఐటీడీఏ అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాతృభాషపై పట్టు సాధించాలి.. భద్రాచలంటౌన్ : పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపునకు పలు రకాల పోటీలు నిర్వహించాలని, తద్వారా మాతృభాషపై మరింత విజ్ఞానం, పట్టు కలుగుతాయని పీఓ బి.రాహుల్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక గిరిజన భవన్లో నిర్వహించిన వివిధ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి పోటీలతో పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందన్నారు. అనంతరం వివిధ అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీలు మణెమ్మ, విజయలక్ష్మి, జేడీఎం హరికృష్ణ, ఆర్సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల ఉద్యోగులు రమేష్, రాములు, అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, నారాయణరెడ్డి, కృష్ణార్జున, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.