Bhadradri District News
-
గుండెపోటుతో హఠాన్మరణం
● మృతుడు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వాసి టేకులపల్లి: మండలంలోని కారుకొండ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఖమ్మం పాడుకు చెందిన బండి రామకృష్ణ(48) గురువారం కారుకొండ క్రాస్ రోడ్ వద్ద గల జామాయిల్ యార్డ్ వద్దకు వచ్చి నీళ్లు తాగాడు. అక్కడే చాప వేసుకుని కాసేపు నిద్రపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా లేచి ‘నాకు ఊపిరి ఆడడం లేద’ంటూ అరుస్తూ కింద పడిపోయాడు. స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా స్పందించకపోవడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడిని పరీక్షించి మృతిచెందాడని నిర్ధారించారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. మృతుడి వెంట ట్యాబ్లెట్లు, బట్టలు ఉన్నాయని, మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామని ఎస్ఐ తెలిపారు. -
‘బార్’ అధ్యక్షుడిగా లక్కినేని
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లక్కినేని సత్యనారాయణ విజయం సాధించారు. గురువారం ఎన్నికలు నిర్వహించగా, అధ్యక్ష పదవికి ఎన్.వెంకటరాజేష్, అనుబ్రోలు రాంప్రసాద్, లక్కినేని సత్యనారాయణ, కె. వెంకటేశ్వరావు, జీ.రాంమూర్తి పోటీ పడ్డారు. లక్కినేని సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థిపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్గా గోపికృష్ణ 18 ఓట్లు, జనరల్ సెక్రటరీగా భాగం మాధవరావు 4 ఓట్లు, ట్రెజరర్గా చిన్నకృష్ణ ఐదు ఓట్లు, స్పోర్ట్స్ సెక్రటరీగా ఉప్పు అరుణ్ 14 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జాయింట్ సెక్రటరీగా కె.రమేష్, లైబ్రరీ సెక్రటరీగా ఎం.ప్రసాద్, లేడీ రిప్రెజెంటివ్గా ఏ.పార్వతి ఎన్నికయ్యారు. విజేతలు కొత్తగూడెం కోర్టు ఆవరణలో రంగులు చల్లుకుని స్వీట్లు పంచుకున్నారు. పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తనపై నమ్మకం ఉంచి మళ్లీ గెలిపించినందుకు అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,84,502 మెట్రిక్ టన్నులు కాగా అందులో సన్నరకం 99,729 మెట్రిక్ టన్నులు, మిగిలినవి దొడ్డు రకం వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 144 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ధాన్యం ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బీ గ్రేడ్కు రూ. 2,300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా సరిహద్దులో ఎనిమిది చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు ధాన్యాన్ని ఏరోజుకు ఆరోజు ఆన్లైన్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని, దిగుమతిలో జాప్యం లేకుండా మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సెంటర్ ఇన్చార్జ్, మిల్లర్పై చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రతీ రైతు ఆధార్, బ్యాంకు, పట్టాదారు పాస్పుస్తకం తమవెంట తీసుకురావాలని చెప్పారు. పోస్టర్లు ఆవిష్కరణ.. ధాన్యం మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి మార్కెటింగ్ శాఖ రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎం సివిల్ త్రినాథ్బాబు, డీఎస్ఓ రుక్మిణి, డీఏఓ బాబురావు, డీసీఓ ఖుర్షిద్, జీసీసీ మేనేజర్ విజయ్కుమార్, తూనికల, కొలతల అధికారి మనోహర్, మార్కెటింగ్ అధికారి నరేందర్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ బాధ్యులు ఆనందరావు, రాజేంద్రప్రసాద్లు పాల్గొన్నారు.‘రాజీవ్ యువవికాసా’నికి దరఖాస్తు చేసుకోవాలి సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, బట్రాజు, కృష్ణబలిజ, పూసల నగర, ఉప్పర, వాల్మీకి బోయ, కుమ్మరి, శాలీవాహన, విశ్వబ్రాహ్మణ, మేదర, కల్లుగీత కార్మికులు, గంగపుత్ర, పెరిక, పద్మశాలి, మేర, ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవ, లింగాయత్ కులాలకు చెందినవారు అర్హులని తెలిపారు. tgobmmsnow.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 21 నుంచి 55 సంవత్సరాలలోపు వారు అర్హలని, వ్యవసాయ సంబంధ వృత్తులకు 60 సంవత్సరాల వరకు అర్హత ఉందని వివరించారు. -
ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు?
● ఐదంతస్తుల భవనం కూలి రెండు కుటుంబాలు ఆగం ● బలహీన పునాదిపై బహుళ అంతస్తుల భవన నిర్మాణం ● కార్మికులకు శాపంగా మారిన అధికారుల అలసత్వం! భద్రాచలం: పొట్టకూటి కోసం భవన నిర్మాణ పనులకు వెళ్లిన ఇద్దరు వ్యక్తుల కుటుంబాలు ఆగమయ్యాయి. భవనం కూలి ఓ కార్మికుడు మృతి చెందగా, శిథిలాల కింద మరో కార్మికుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో ఈ దుర్ఘటనకు బాధ్యులెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బలహీనమైన పునాదిపై అధికారులు, స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పెడచెవిన పెట్టిన ఇంటి యజమానిదా..? కళ్ల ముందే పేకమేడలా గిరిజన చట్టాలు, నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టానురీతిగా నిర్మాణం చేస్తున్నా నోటీసులతో సరిపెట్టిన అధికారులదా? సత్వరమే చర్యలు తీసుకోలేని ఉన్నతాఽధికారులదా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. వీరందరీ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయని పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల అలసత్వానికి.. బహుళ అంతస్తుల భవనం బుధవారం కుప్పకూలిన సంఘటనలో యజమాని నిర్లక్ష్యంతోపాటు అందరి అలసత్వమూ కనిపిస్తోంది. గతేడాది జూలైలోనే నిబంధనలకు విరుద్ధంగా ఐదో అంతస్తు నిర్మాణం జరుగుతుండటంతో స్థానిక ఆదివాసీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారికి ఫిర్యాదు చేయటంతో... ఆయన ఆ అంతస్తు శ్లాబు సమయంలో పనులు నిలిపివేయించారు. ఆ తర్వాత గ్రామపంచాయతీ అధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టిన ఆ ఇంటి యజమాని ఆ అంతస్తు శ్లాబును పూర్తి చేశాడు. ఈ క్రమంలో గిరిజన సంఘ నాయకులు ఐటీడీఏ పీఓ, కలెక్టర్, డీఎల్పీఓ, మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదులు అందించారు. దీంతో గ్రామపంచాయతీ అధికారులు గతేడాది జూలై నుంచి సదరు ఇంటి యజమానికి నోటీసులను అందజేస్తున్నారు. మూడు అంతస్తులను కూలగొట్టాలని, లేని పక్షంలో వాటిని కూలగొట్టి సదరు ఖర్చును రికవరీ చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే నోటీసుల వరకు మాత్రమే పరిమితం కావడంతో సదరు ఇంటి యజమాని గత 15 రోజుల నుంచి పనిని తిరిగి ప్రారంభించాడు. అలా కాకుండా జిల్లా ఉన్నతాధికారులే చొరవ తీసుకుని వివాదాస్పదంగా ఉన్న భవన నిర్మాణాన్ని పరిశీలించి, కూలగొడితే.. ఇప్పుడు రెండు కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేవి. ప్రభుత్వం సైతం బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడంపై రాజకీయ పార్టీలు, వివిధ కుల, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి గిరిజన చట్టాలకు లోబడే ఉండాలి.. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భద్రాచలంలో గిరిజన, గిరిజనేతర జనాభా క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలో 1/70 యాక్ట్ పరిధిలో ఉండటంతో ఆ చట్టాలకు అనుగుణంగానే అభివృద్ధి సాగుతోంది. అయితే గిరిజన, గిరిజనేతరులకు నివాస సౌలభ్యం కోసం ఇంటి నిర్మాణాలకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయనప్పటికీ ఇటీవల కాలంలో భద్రాచలంలో ఇంటి నిర్మాణాల పేరిట లాడ్జీలను పెద్ద ఎత్తున నిర్మించడం ఆందోళనకు గురిచేస్తోంది. జీప్లస్ టూ కు మాత్రమే అనుమతులున్నా, పట్టాలు కలిగిన భూములకు నిబంధనల సడలింపు ఉంది. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ జరిగే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేస్తున్నారు. గిరిజన చట్టాలకు లోబడే గిరిజన, గిరిజనేతరులకు లాభం చేకూరేలా, భద్రాచలం పట్టణ అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గిరిజన చట్టాలకు విఘాతం లేకుండా.. ఏజెన్సీ చట్టాలకు లోబడి అభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించాలి. గిరిజన, గిరిజనేతరులకు లాభం చేకూరేలా, గిరిజన చట్టాలకు విఘాతం కలుగకుండా చూడాలి. అఽధికారుల అలసత్వానికి, నిర్లక్ష్యానికి అమాయకుల ప్రాణాలు కోల్పోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. – పూనెం ప్రదీప్కుమార్, మావన హక్కుల సంఘం నాయకుడు -
బడ్జెట్లో తీపి కబుర్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాల విభజనకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాల్లో మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలను మినహాయిస్తే ప్రతీ జిల్లాలో ఒక యూనివర్సిటీ స్థాపన జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేయాలనే డిమాండ్ రాష్ట్ర విభజన ముందు నుంచే వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో గిరిజన యూనివర్సిటీని ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా అది ములుగు జిల్లాకు తరలిపోయింది. దీంతో కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మైనింగ్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ డిమాండ్ నాయకులు, ప్రజల నోళ్లలో నానుతుండగానే జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో వచ్చాయి. దీంతో మైనింగ్ వర్సిటీ డిమాండ్ సైతం ప్రాభవం కోల్పోయింది. అయితే ఈ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేయడంతో మరోసారి యూనివర్సిటీ అంశం తెర మీదకు వచ్చింది. సీఎం రేవంత్రెడ్డి హామీ కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు జరుగుతాయంటూ శాసన మండలిలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ రావడం ఖాయమైంది. సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మైనింగ్ విభాగాన్ని 1978లో కొత్తగూడెం తరలించారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా మార్చారు. గడిచిన నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది ఇంజనీర్లు ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చి దేశ మైనింగ్ అవసరాలకు ఉపయోగపడ్డారు. నిధుల కొరత, పర్యవేక్షణ లేమి, అధ్యాపకులు రాకపోవడం, ల్యాబుల ఆధునికీకరణ ఆగిపోవడంతో కొన్నేళ్లుగా ఈ కాలేజీ ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రస్తుతం యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించడంతో మరోసారి ఈ కాలేజీకి గత వైభవం రానుందనే నమ్మకం కలిగింది. సుమారు 400లకు పైగా ఎకరాల్లో కళాశాల క్యాంపస్ విస్తరించి ఉంది. ఈ కాలేజీ భూముల్లోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జిల్లా అధికారుల సమీకృత కార్యాలయాల భవనం(కలెక్టరేట్) నిర్మించారు. నిధుల విడుదల దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం పట్టణంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ వచ్చాక భద్రాచలం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తామంటూ అప్పటి సర్కారు ప్రకటన చేసింది. అయితే ఇది ఒక పట్టాన అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాన ఆలయం చుట్టూ మాడ వీధుల విస్తరణ ఇతర అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.60 కోట్లలో రూ.34 కోట్లు విడుదల అయ్యాయి. ఇక పర్యాటక శాఖపై జరిగిన చర్చలో కిన్నెరసాని, కనకగిరి గుట్టలు, భద్రాచలం దగ్గర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చేసిన ప్రయత్నాలు విఫలం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో గుమ్మడికి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఇల్లెందు–సీతారామ అంశంపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కు గ్రీన్ సిగ్నల్ కొత్తగూడెం కార్పొరేషన్, కల్లూరు మున్సిపాలిటీల బిల్లు ఆమోదం భద్రాద్రికి నిధుల విడుదల, ఇల్లెందుకు దక్కిన సీతారామ హామీ బడ్జెట్ సమావేశాల్లో ఉమ్మడి జిల్లాకు వరాలుకార్పొరేషన్ బిల్లు ఆమోదం కొత్తగూడెం – పాల్వంచ – సుజాతనగర్లను ఒక్కటిగా చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు గత జనవరి 4న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తదుపరి కార్యాచరణలో భాగంగా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో కొత్తగూడెం కార్పొరేషన్ బిల్లును మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆ తర్వాత జరిగిన చర్చలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆమోదం పొందింది. మరోవైపు ఇదే బడ్జెట్లో నగరాభివృద్ధి పద్దు కింద కొత్తగూడెం కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు కేటాయించారు. మరోవైపు కల్లూరుకు మున్సిపాలిటీ హోదా దక్కింది. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
పాల్వంచరూరల్: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా స్పోర్ట్స్ అధికారి పరంధామరెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో ఐదు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో వాలీబాల్ పోటీలో పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రథమ, షటిల్ పోటీలో బాలురు ప్రథమ, బాలికలు ద్వితీయ, అథ్లెటిక్స్ పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బహుమతులతో పాటు ధ్రువీకరణపత్రాలు అందించి మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, ఎంప్లాయ్మెంట్ అధికారి శ్రీరామ్, నెహ్రూ యువకేంద్రం ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.భానుచందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జాగృతి యూత్ అసోసియేషన్ సభ్యులు సయ్యాద్ ఫరూక్, యూత్ క్లబ్ అధ్యక్షులు మురళికృష్ణ, బానోతు వెంకట్లు పాల్గొన్నారు. -
అడ్రెస్ లేని ఐకానిక్
● అమలుకు నోచని రామాలయం–గోదావరి మధ్య వంతెన ● యాదగిరిగుట్టతో పాటే భద్రాచలం అభివృద్ధికీ ప్రణాళిక ● పదేళ్ల క్రితమే సస్పెన్షన్ బ్రిడ్జి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ● కనీసం తీగల వంతైనెనా నిర్మించాలంటున్న భక్తులుభద్రగిరి అభివృద్ధికి మార్గం.. టెంపుల్ టూరిజంలో భాగంగా భద్రాచలంలో ఆలయం నుంచి గోదావరి కరకట్ట వరకు సస్పెన్షన్ బ్రిడ్జి (తీగల వంతెన) నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. భద్రాచలం వచ్చిన భక్తుల్లో చాలా మంది సీతారాముల దర్శనానికి ముందు పావన గోదావరిలో స్నానం ఆచరించడం, అక్కడ పూజాదికాలు నిర్వహించడం ఆనవాయితీగా భావిస్తారు. మరికొందరు దర్శనం చేసుకున్న తర్వాత గోదావరి తీరానికి వెళ్లి నదిలో నీటిని తలపై చల్లుకుంటారు. అందువల్ల ఆలయం నుంచి కరకట్ట వరకు నడుచుకుంటూ వెళ్లేందుకు వీలుగా ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తే భద్రాచలం క్షేత్రానికి కొత్త శోభ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భద్రాచలం అభివృద్ధి కోసం ప్రస్తుతం రూపొందిస్తున్న ప్రతిపాదనల్లో సస్పెన్షన్ బ్రిడ్జికి చోటు కల్పించాలనే డిమాండ్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. -
జీపీఎఫ్ నగదు అందక..
● భార్యను కాపాడుకోలేకపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ● అనారోగ్యంతో బాధపడుతూ మృతి పాల్వంచరూరల్ : జీపీఎఫ్ నగదు అందని కారణంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కాపాడుకోలేకపోయాడు. చేతిలో డబ్బు లేక సరైన వైద్యం అందక ఆమె మృతి చెందింది. ఈ సంఘటన జిల్లా పాల్వంచలో గురువారం జరిగింది. పాల్వంచలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీకి చెందిన పొదిలి సత్యనారాయణ స్థానిక కేటీపీఎస్ బాలికల హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య లత(52) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో వైద్యం చేయించేందుకు జీపీఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఏడాది క్రితమే మంజూరైంది. కానీ ఇప్పటివరకు నగదు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. దీంతో మెరుగైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందింది. దహన సంస్కారాల అనంతరం ఉపాధ్యాయులు పీఆర్టీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ వివేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వెంకటేశ్వరరావు, బి.రవి మాట్లాడుతూ ఉపాధ్యాయుడి భార్య మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్ నగదు అందక మెరుగైన వైద్యం చేయించలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే నగదు ఖాతాల్లో జమచేయాల్సి ఉందని, కానీ ఏడాది గడిచినా నగదు అందకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఉపాధ్యాయులు వి.శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు, సంఘమేశ్వరరావు, ప్రభావతి, సుధాశ్రీ, మోతీలాల్, శంకర్ పాల్గొన్నారు. -
కంనువిందు చేసేలా గిరిజన మ్యూజియం
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో గిరిజన మ్యూజియం పర్యాటకులకు కనువిందు చేసేలా ముస్తాబు చేశామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని గురువారం ఆయన సందర్శించి అందులోని పెయింటింగ్, కళాఖండాలు, వెదురుతో తయారుచేసిన కళారూపాలు, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, గిరిజన వంటకాల కోసం తయారుచేస్తున్న స్టాళ్లను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరామనవమి రోజున ఈ మ్యూజియాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో పెయింటింగ్తో పాటు గిరిజన తెగలకు చెందిన దేవతామూర్తులను ప్రతిష్ఠించడం పూర్తిచేసిన్నట్లు పేర్కొన్నారు. గోరు బంజారా సంప్రదాయానికి సంబంధించిన పెయింటింగ్ చిత్రాలతో పాటు మిగిలిన పనులు కూడా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామని తెలిపారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్ చెరువులో అందమైన పూల మొక్కలు, చిన్న చిన్న చేపల పెయింటింగ్ చిత్రాలు వేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రమణయ్య, భాస్కర్, ప్రభాకర్రావు, పవర్ వేణు, హరీష్, హరికృష్ణ, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
కన్నీటి వేదన..
● విషాదంగా మారిన భవనం కూలిన సంఘటన ● భవన నిర్మాణ కార్మికుడు కామేశ్వరరావు మృతి ● మరో కార్మికుడు ఉపేందర్ ఆచూకీ కోసం సహాయక చర్యలు ● బంధువుల ఆందోళనతో భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితి అధికారుల నిర్లక్ష్యం వల్లే.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నా భర్త ఉపేందర్ శిథిలాల్లో చిక్కుకున్నాడు. ఈ ఘటనకు అధికారులు బాధ్యత వహించి మా ఇంట్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలి. రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలి. మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – పడిసాల రమాదేవి, ఉపేందర్ భార్య, లంబాడీ కాలనీ, భద్రాచలంభద్రాచలం అర్బన్: భవన నిర్మాణ కార్మికుల కుటుంబ సభ్యుల రోదనలు, బంధువుల ఆందోళనలతో భద్రాచలంలో విషాదం నెలకొంది. మరో వైపు రెస్క్యూ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మండుటెండల్లో కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణలతో శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. భద్రాచలంలో ఐదు అంతస్తుల భవనం కూప్పకూలిన ఘటనలో బుధవారం అర్ధరాత్రి శిథిలాల కింద చల్లా కామేశ్వరరావును గుర్తించి బయటకుతీశారు. 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆస్పత్రికి తరలించిన కొంతసేపటికే మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి 1.47 గంటలకు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2.20 గంటలకు మృతి చెందాడు. మరో కార్మికుడు పడిసాల ఉపేందర్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, విపత్తుల నివారణ శాఖ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కుటుంబీకులు, బంధువుల ఆందోళన ఉపేందర్ ఆచూకీ గురువారం మధ్యాహ్నం వరకు లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, కాలనీవాసులు ఆందోళనకు దిగారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ఉన్నతాధికారులదే బాధ్యత అని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ. కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. అంతకుముందు బ్రిడ్జి సెంటర్ వద్ద కూడా ఆందోళన చేపట్టారు. కాగా సంఘటనా స్థలం వద్ద ఉపేందర్ భార్య రమాదేవి, కుమారుడు జశ్వంత్, కుమార్తె నందుశ్రీ, రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. తమకు దిక్కెవరంటూ ఏడుస్తున్న వారిని సముదాయించటం కష్టతరమైంది. కొనసాగుతున్న సహాయక చర్యలు రెస్క్యూ బృందాలు మరో కార్మికుడు ఉపేందర్ ఆచూకీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం స్నీపర్ డాగ్తో ప్రయత్నించినా ఫలితం రాలేదు. దీంతో క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఇనుప చువ్వలను కట్ చేసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించగా, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు. దుర్వాసన వచ్చిన వైపుగా.. గురువారం మధ్యాహ్నం ఇంటి యజమాని శ్రీపతి శ్రీనివాస్కు చెందిన ఓ లాకర్ శిథిలాల నుంచి బయట పడగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 7 గంటల సమయంలో భవన ప్రవేశ ద్వారం వైపు దుర్వాసన వస్తుండటంతో.. అటువైపుగా శిథిలాల తొలగింపు పనులు సాగుతున్నాయి. రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కామేశ్వరరావు మృతితో విషాద ఛాయలు చల్లా కామేశ్వరరావు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు అవివాహుతుడు. ఏడాది క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లి రేవతి తానే సాకుతున్నాడు. ఇద్దరు అక్కలు ఉన్నారు. కాగా కామేశ్వరరావు మృతి చెందడంతో తల్లి ఒంటరిగా మారింది. కాగా పలువురు రాజకీయ నాయకులు బాధితులను పరామర్శించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులెవరు?కొడుకు సంపాదన మీదనే.. గత ఏడాది నా భర్త మృతిచెందాడు. ఇప్పుడు నా కొడుకు కామేశ్వరరావు కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. కొడుకు సంపాదన మీదనే బతుకుతున్నాను. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లుతోపాటు నష్టపరిహారం రూ. కోటి ఇవ్వాలి. – చల్లా రేవతి, కామేశ్వరరావు తల్లి, జగదీష్కాలనీ, భద్రాచలంగతంలో 13మందిని కాపాడాం బొగ్గు గనుల్లో ప్రమాదాలు జరిగితే లేయర్స్ ప్రకారం రెస్క్యూ చేసుకుంటే వెళ్తాం. వాటితో ఈ ప్రమాదాన్ని పోల్చలేం. ఇది ఆర్సీసీ స్ట్రక్చర్ కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ నమ్మశక్యంగా చేయొచ్చు. గతంలో కారేపల్లిలో ఓ కళాశాల కుప్పకూలిన ఘటనలో 13 మందిని కాపాడాం. – అనంతరామయ్య, సింగరేణి రెస్క్యూ అడిషనల్ మేనేజర్, కొత్తగూడెంఇలాంటివి పెద్ద పట్టణాల్లోనే.. 25 మంది సిబ్బంది, 10 మంది అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాం. వీఎల్ఎస్, కాంబి టూల్, హైడ్రాలిక్ కట్టర్, వంటి పరికరాలను రెస్క్యూలో ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఇలాంటి ఘటనలు పెద్ద పట్టణాల్లోనే చూస్తాం. కాగా మొదటి సారి ఇలాంటి ఘటనలో పాల్గొంటున్నాను. –క్రాంతి కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారిIIలో -
ఆ ఇద్దరి జాడెక్కడ..?
భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నిద్ర లేకుండా రెండు రోజులుగా శ్రమిస్తున్నారు. కానీ కార్మికుల మృతికి బాధ్యత వహించాల్సిన ఆ ఇంటి యజమానులైన భార్యాభర్తల జాడ మాత్రం లేదు. బుధవారం ఘటన జరిగిన అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లినట్టు ప్రచారం జరిగినా, పోలీసులు మాత్రం వారు లొంగిపోయారా.. అరెస్ట్ చేశారా? అనే వివరాలు వెల్లడించలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఇష్టారీతిగా నిర్మాణాలు సాగించిన వారిపై కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కరకగూడెం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కరకగూడెం ఎస్సై రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మోతే గ్రామానికి చెందిన నైనారపు సాగర్ (30) ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యాన ఈనెల 9న ఇంటి వద్ద కుటుంబసభ్యులతో గొడవపడి క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. దీంతో అతడికి కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడ నుంచి మణుగూరు వైద్యశాలకు, చివరకు వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఇటీవల అతడు ఇంటికి తీసుకుని రాగా గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి ఇల్లెందురూరల్: మండలంలోని బోయితండా గ్రామపంచాయతీ ఎల్లన్ననగర్ గ్రామంలో ఆటాడుకుంటున్న ఏడాదిన్నర వయసు గల ఓ బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. గురువారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలను కుటుంబసభ్యులు ఇలా తెలిపారు. గ్రామంలో వాంకుడోత్ రాములు తన ట్రాక్టర్ను ఇంట్లో ఓ పక్కకు పెట్టే ప్రయత్నంలో అక్కడే ఆడుకుంటున్న రాములు సోదరుడు శ్రీకాంత్– కల్యాణి దంపతుల కుమారుడు ఆర్యన్ మీదకు ఎక్కించాడు. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి భౌతికకాయాన్ని మార్చురీకి తరలించారు. కనుల మందు అల్లారుముద్దుగా ఆడుకుంటున్న బాలుడు హఠాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. చికిత్స పొందుతున్న మహిళ.. అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన మామిడి సామ్రాజ్యం(40) పురుగుమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందులతో సామ్రాజ్యం గత రెండు రోజుల క్రితం పురుగుమందు తాగింది. అస్వస్థతకు గురికావడంతో ఆమెను కుటుంబసభ్యులు భద్రాచలం ఆస్పత్రికి, ఆపై ఖమ్మంకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈమేరకు మృతదేహానికి మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు సీఐ అశోక్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి.. సత్తుపల్లి టౌన్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్వరరావు (35) ద్విచక్ర వాహనంపై సత్తుపల్లిలోని ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న తన భార్యను తీసుకెళ్లేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో కాకర్లపల్లి శివారులోని పాత ఎన్టీఆర్ కాలువ వంతెన సమీపంలో ఓ పానీపూరి బండిని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య భవాని, ఒక కుమార్తె ఉన్నారు. -
ఆకట్టుకున్న ‘అంతరిక్ష నమూనా’
పాల్వంచ: పట్టణంలోని కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్స్లెన్స్ ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన అంతరిక్ష నమూనా ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనంలో 40కి పైగా అంతరిక్ష, రక్షణ నమూనాలను ప్రదర్శించగా.. ఎక్స్లెన్స్ వ్యవస్థాపకుడు నరేష్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతీ అంశాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.నాగమణి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామాలయానికి రూ.1,00,116 విరాళం అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన కమటం హుస్సేన్ జ్ఞాపకార్థం ఆయన మనవడు కమటం రవి–రజిత దంపతులు గురువారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. ఈమేరకు రవి దంపతులకు ఆలయ నిర్మాణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణిలో మైనింగ్ అధికారుల బదిలీ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలో 11 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఇద్దరు డీవైజీఎంలు, ఇద్దరు సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్, ఇద్దరు అడిషనల్ మేనేజర్లు, ఒక ఎస్ఈ, ఇద్దరు డీవైఎస్ఈలు, ఇద్దరు అండర్ మేనేజర్లు ఉన్నారు. వీరు ఏప్రిల్ 7 కల్లా వారికి కేటాయించిన ఏరియాలో విధుల్లో చేరాల్సి ఉంది. సింగరేణిలో సర్వే ఆఫీసర్ల బదిలీ.. సింగరేణిలో వివిధ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న 11 ఏరియాల్లోని సర్వే అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు డీవైజీఎం సర్వే అఫీసర్లు, ఇద్దరు సీనియర్ సర్వే ఆఫీసర్లు, మరో 7గురు సర్వే ఆఫీసర్లు ఉన్నారు. వీరందరు ఏప్రిల్ 6 కల్లా విధుల్లో చేరాల్సి ఉంది. ఇల్లెందుకు ‘సీతారామ’ నీటిని తరలించాలి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందు: సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు, మహబూబాబాద్ నియోజకవర్గాలకు అందించాలని గతంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సరయ్య విపతి పత్రం ద్వారా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం దృష్టికి తెచ్చారు. తాజాగా ఇల్లెందులో ఎన్డీ ఆధ్వర్యాన దశలవారీ ఆందోళనలు చేపడుతున్నట్లు ఎన్డీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కోరం కనకయ్య గురువారం అసెంబ్లీలో సీతారామ ప్రాజెక్టు విషయం ప్రస్తావించారు. తన నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం రోళ్లపాడులో 2016లో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి రిజర్వాయర్గా మార్చుతామని ప్రకటించాడని, ఆ తర్వాత ఆ ప్రాజెక్టు అటవీశాఖ అనుమతులు లేవని, రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉందని, ప్రాజెక్టును రిజర్వాయర్గా మార్చలేమని ఎత్తివేశారు. ఇక ఏన్కూర్ నుంచి చీమలపాడు మీదుగా లలితాపురం చెరువు వరకు నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని గత ప్రభుత్వంలో పలు దఫాలు అధికారులు ప్రకటించారు. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ తరుణంలో సీతారామ అంశాన్ని, ఇల్లెందుకు గోదావరి నీటిని తరలింపు అంశాన్ని ఎమ్మెల్యే కనకయ్య ప్రస్తావించారు. కానీ ప్రభుత్వం మాత్రం నోట్ చేసుకున్నామంటూ మాత్రమే ప్రకటించింది. సంబంధిత శాఖ మంత్రి నుంచి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
‘పెద్దమ్మతల్లి’ పాలకవర్గంలో అవకాశం కల్పించాలి
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయ కమిటీలో కేశవాపురం, జగన్నాథపురం గ్రామస్తులకు అవకాశం కల్పించాలని, అప్పటివరకు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇద్దరు యువకులు ఆలయం ఎదుట ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంధం నర్సింహారావు, బాదర్ల నాగేశ్వరరావు, గంధం సతీష్, గంధం రామయ్య, కొండం పుల్లయ్య, లింగయ్య, లక్ష్మి, అల్లం స్వరూప, రాములు, భూలక్ష్మి, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎండోమెంట్ కమిషనర్ నుంచి మంగళవారం సర్క్యులర్ రావడంతో బుధవారం నూతన కమిటీ సభ్యులతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, ప్రమాణ స్వీకారానికి ఇంకా మూహుర్తం ఖరారు చేయలేదని ఈఓ రజనీకుమారి తెలిపారు. -
కారుకు నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల కాలనీ గ్రామంలో ఇంటి బయట పార్కింగ్ చేసిన కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. గ్రామానికి చెందిన హరీష్ రోజూ లాగే రాత్రి ఇంటి బయట తన కారు పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. అర్ధరాత్రి 1.30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు లేచిన యజమాని మంటలు గమనించాడు. చుట్టు పక్కలవారిని నిద్రలేపి మంటలను ఆర్పివేశారు. సీఐ అశోక్రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ తనిఖీలు
అశ్వారావుపేటరూరల్: పదో తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అశ్వారావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాలల కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని వినాయకపురం గ్రామ శివారులో ఉన్న శ్రీ చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పూజలు చేశారు. జాతరకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్ పోటీలకు 1న ఎంపికలుభద్రాచలంటౌన్ : పట్టణంలో వచ్చేనెల 1న జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ ఎంపిక పోటీలను జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవి రామిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై నవారిని హైదరాబాద్ రామంతపూర్లో ఏప్రిల్ 18 19 తేదీల్లో జరిగే క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు, మేలో జరిగే ఎక్యిప్పీడ్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకుని రావాలని, ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని వివరించారు. బేకరీ తినుబండారంలో పురుగువినియోగదారుల ఫోరంను ఆశ్రయించిన బాధితుడు! పాల్వంచ: పట్టణంలోని బీసీఎం రోడ్లో ఉన్న ఓ బేకరీ షాపులో తినుబండారం ఆర్డర్ ఇవ్వగా అందులో పెద్ద పురుగు ప్రత్యక్షమైంది. ఇదేమని వినియోగదారుడు ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వినియోగదారుల ఫోరంలో కేసు వేసినట్లు సమాచారం. నేడు ‘నిధి ఆప్కే నికట్’ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈనెల 27న ‘నిధి ఆప్కే నికట్’ నిర్వహించనున్నట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ బి.నాగుల్ తెలిపారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం ఎస్బీఐటీ కళాశాలలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇల్లెందు మున్సిపాలిటీలో ఉదయం 9–30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జెడ్పీ సీఈఓ సందర్శనదమ్మపేట: మండల పరిషత్ కార్యాలయాన్ని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి బుధవారం సందర్శించారు. కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం జమేదారుబంజర గ్రామంలో పర్యటించి పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించి, పలు సూచనలు చేశారు. ప్రాథమిక పాఠశాలలో తాగునీటి ట్యాంకు, వంట షెడ్డు, మరుగుదొడ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, ఎంపీఓ రామారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. గణిత పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 12,273 మందికి గాను 12,240 మంది హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు. సప్లిమెంటరీ విద్యార్థులు 360 మందికి గానూ 320 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్, ఇద్దరు జిల్లా పరిశీలకులు డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కలిసి 28 సెంటర్లు తనిఖీ చేశారు. ఈ మేరకు డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి వివరాలు వెల్లడించారు. ఎటువంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. -
రామయ్య పెళ్లికి రండి
జిల్లా జడ్జికి ఆలయ ఈఓ ఆహ్వానం కొత్తగూడెంటౌన్: భద్రాచలంలో ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్న శ్రీరామనవమి వేడుకలకు రావాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ను ఆలయ ఈఓ రమాదేవి కోరారు. ఈ మేరకు జడ్జికి బుధవారం ఆహ్వాన పత్రిక అందజేసి, ఘనంగా సత్కరించారు. కల్యాణానికి పోచంపల్లి పట్టువస్త్రాలు.. భద్రాచలంటౌన్ : శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకల వినియోగించే పోచంపల్లి పట్టువస్త్రాల నేత పనులను ఈఓ రమాదేవి బుధవారం ప్రారంభించారు. ముందుగా భక్త రామదాసు మందిరంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయం మాజీ చైర్మన్ ఎస్.ఎస్.జయరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మగ్గానికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, స్వామివారి వస్త్రాలను ఏప్రిల్ 4న ఆలయ అధికారులకు అందజేస్తారు. కార్యక్రమంలో పద్మశాలీ అన్న సత్రం అధ్యక్షుడు గోషిక యాదగిరి, పోచంపల్లి చేనేత కళాకారులు కడవేరు చంద్రశేఖర్, ఆడెపు ఆంజనేయులు, ఇంజమూరి యాదగిరి, దోర్నాల శ్రీనాద్, ఎలగందుల కరుణాకర్, రాపోలు గణేష్ పాల్గొన్నారు. -
9 మంది మావోయిస్టులు లొంగుబాటు
దుమ్ముగూడెం : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్చవాన్ ఎదుట ఆరుగురు మహిళా మావోయిస్టులతో సహా తొమ్మిది మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టిన గర్ వాపస్ అయే పునరావాస విధానంతో మావోయిస్టులు లొంగుబాటు పడుతున్నారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన తొమ్మిది మందిపై రూ.26లక్షల రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో బండు అలియాస్ బండి మడ్కం, మాసే అలియాస్ వెట్టి కన్ని, పదమ్ సమ్మి, మాద్వి హుంగా, పూనెం మగండి కడ్తి విజ్జే అలియాస్ జయో, మడ్కం శాంతి, ముచాకి మాసే, కడ్తి హిడియా అలియాస్ హితేష్ ఉన్నట్టు వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణసాయంగా రూ.25 వేలు అందించినట్లు తెలిపారు. -
లక్ష్యం చేరనట్టే..?
● పన్ను వసూళ్లలో మున్సిపాలిటీల వెనుకబాటు ● చివరిలో 90 శాతం వడ్డీ రాయితీ అవకాశం ● ఆర్థిక సంవత్సరంలో మిగిలింది ఐదు రోజులే.. కొత్తగూడెంఅర్బన్: మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఆర్థిక సంవత్సరం మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కానీ పన్ను వసూలు లక్ష్యానికి చాలా దూరంలోనే ఉంది. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఇల్లెందు మినహా మిగిలిన మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు వసూలు లక్ష్యంలో సగం వరకు పెండింగ్లో ఉన్నాయి. వార్డుల్లో మున్సిపల్ బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, రెవెన్యూ సిబ్బంది తిరుగుతున్నా పన్ను వసూలు పూర్తి స్థాయిలో కావడం లేదు. ఇంటి పన్ను కట్టని వారి పేర్లను వార్డుల్లో బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామని, ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు ఇటీవల హెచ్చరికలు జారీ చేసినా పన్ను చెల్లింపులు మెరుగుపడలేదు. ఏటా పురపాలికల్లో లక్ష్యం పూర్తికావడంలేదు. దీంతో బకాయిలు మరుసటి సంవత్సరంలో కలుస్తుండగా లక్ష్యం పెరిగిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 19.42 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.12.11 కోట్లే వసూలు చేశారు. 90 శాతం వడ్డీ రాయితీ పేరుకుపోయిన మొండిబకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్శాఖ 90 శాతం వడ్డీ రాయితీని బుధవారం నుంచి అమలు చేస్తోంది. ఈ అవకాశం ఈ నెల 31వ తేదీ వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొండిబకాయిలకు ఇంటి పన్ను ఎంతో ఉంటుందో, వడ్డీ కూడా అంత పెరిగింది. దీంతో ప్రజలకు పన్ను చెల్లింపులు భారంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ రాయితీ ఇస్తుండటంతో చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పన్ను చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అయితే వడ్డీ రాయితీకి మూడు, నాలుగు రోజులకే పరిమితం చేయకుండా నెల రోజులపాటు అవకాశం ఇస్తే ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉంటుంది. పన్ను చెల్లింపులు కూడా పెరుగుతాయి. కాగా పన్ను బకాయిలు పేరుకుపోతుండగా ఆదాయం తగ్గి వేతనాలు, ఇతర అభివృద్ధి పనులకు మున్సిపల్ జనరల్ ఫండ్ను వినియోగించాల్సి వస్తోంది. దీంతో జనరల్ ఫండ్తో చేపట్టాల్సిన పనులకు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు 56 మంది, వార్డు ఆఫీసర్లు 57 మంది, మొత్తం 113 మంది ఉన్నారు. వీరంతా ఇంటింటికీ తిరిగి పన్ను వసూళ్లు చేస్తే ఆదాయం పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. రెండు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్ కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలిటీలకు ఒక్కరే కమిషనర్గా వ్యహరిస్తున్నారు. దీని వల్ల మున్సిపల్ అధికారులు, సిబ్బందిని సమన్వయం చేయడంలో జాప్యం జరుగుతోంది. కమిషనర్ పూర్తిస్థాయిలో సమయం కేటాయించే అవకాశం లేకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాయితీని సద్వినియోగం చేసుకోవాలి మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలు 90 శాతం వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 31న సెలవు అయినప్పటికీ మున్సిపల్ కార్యాలయం తీసి ఉంటుంది. పన్నులు చెల్లించవచ్చు. పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. –సుజాత, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ వార్డులు లక్ష్యం వసూలు రూ.కోట్లలో కొత్తగూడెం 36 7.93 4.84 పాల్వంచ 24 6.36 3.80 ఇల్లెందు 24 2.68 2.09 మణుగూరు 20 2.45 1.38 మొత్తం 104 19.42 12.11 -
ఉపాధ్యాయులు, విద్యార్థులే కూలీలా..?
టేకులపల్లి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వంట పాత్రలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, గిరిజన పాఠశాలలకు మధ్యాహ్న భోజన వంట పాత్రలను పంపిణీ చేసింది. బుధవారం టేకులపల్లి మండలంలోని 68 పాఠశాలలకు ఎంఈఓ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి జగన్ హెచ్ఎంలకు, ఉపాధ్యాయులకు వంట పాత్రలను అప్పగించారు. వంట పాత్రలు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధ్యాయులే తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను కూడా తీసుకొచ్చి వంట పాత్రలు మోయించారు. కాగా వంట పాత్రలను తరలించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాల సమయంలో ఉపాధ్యాయులను పిలిచి వంటపాత్రలు అప్పగించడం సరికాదని యూటీఎఫ్ జిల్లా నాయకుడు కిషోర్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల వంట పాత్రలను వారే మోసుకెళ్లిన వైనం -
●బాధితుడి గుర్తింపు (సాయంత్రం 6–15నుంచి రాత్రి 6–57గంటల వరకు)
తొలి ప్రయత్నం విఫలం కావడంతో నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లేలా క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిండం మొదలెట్టారు. అడ్డుగా వచ్చిన బీమ్లను కట్టర్ల సాయంతో కత్తిరించారు. దీంతో ఫస్ట్ ఫ్లోర్ లోపలి భాగం కొంత మేర కనిపించింది. ఆ ప్రాంతంలో ఒక చిన్న వెలుతురు కనిపించడంతో తీక్షణంగా పరీక్షించగా అది మొబైల్ ఫోన్గా తేలింది. ఆ మొబైల్ ఫోన్ లంచ్ బాక్స్ సంచిలో ఉన్నట్టు గుర్తించారు. లోపల ఎవరైనా ఉన్నారా అని రెస్క్యూ టీమ్ సభ్యులు పదే పదే అడగగా శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్వరరావు నుంచి బదులు వచ్చింది. -
●ఆది నుంచీ అనుమానాస్పదమే
భద్రాచలం: భద్రాచలానికి శ్రీనివాసం శ్రీరామ స్వాతి – శ్రీపతి దంపతులు పదేళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీపతి తెలుపు, కాషాయ వస్త్రాలు ధరించి, గుబురు గడ్డంతో స్వామిజీలా కనిపించేవారు. ఆ తర్వాత పాత భవనాన్ని కొనుగోలు చేసి అక్కడే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అది పూర్తికాక ముందే జీ ప్లస్ 5 భవన నిర్మాణం మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమ కట్టడాలేమిటని ప్రశ్నించిన స్థానికులతో పలుమార్లు తగదా పడ్డారు. భవన నిర్మాణ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నేతలతోనూ గొడవ పెట్టుకున్నారు. భవనం కూలిపోయిన తర్వాత ఈ దంపతుల విషయమై స్థానికులను వాకబు చేయగా ఎవరూ పూర్తి వివరాలు చెప్పలేకపోయారు. అయితే, శ్రీపతిని బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా స్పష్టత రాలేదు. -
అధ్యాపకుడికి డాక్టరేట్
ఇల్లెందురూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడు జి.శేఖర్కు కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందించింది. కేయూ చరిత్ర, టూరిజం మేనేజ్మెంట్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ పోలవరపు హైమావతి పర్యవేక్షణలో ‘డిప్లమసి ఆఫ్ ది రాయస్ ఆఫ్ ది విజయనగర 1336–1565’ అనే పరిశోధన అంశంపై శేఖర్ వైవా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్నప్పయ్య మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే ఐదుగురు అధ్యాపకులు డాక్టరేట్ పొందారని, తద్వారా ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది డాక్టరేట్ పట్టా అందుకున్న చరిత్ర ఇల్లెందు కళాశాలకు దక్కిందని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్రావు, అధ్యాపకులు శ్రీదేవి, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, వెంకటేశ్వరరావు, రాకేష్ శ్రీరాం, రాజు, శేఖర్, ఈశ్వర్, సురేందర్, సరిత, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, లక్ష్మణ్రావు, సుజాత, యువకుమార్ పాల్గొన్నారు. -
రామయ్య కల్యాణానికి.. కావాలి రాష్ట్ర హోదా
● ఈ ఏడాదే ప్రకటించాలని కోరుతున్న భక్తులు ● భద్రాచలంలో సీతారాముల పెళ్లికి వందల ఏళ్ల చరిత్ర ● ప్రతీ సంవత్సరం కనులపండువగా కల్యాణ వేడుక ● నవమి రోజున ఉభయ రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక శోభ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో వందల ఏళ్లుగా జరుగుతున్న సీతారాముల కల్యాణం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఘన చరిత్ర కలిగిన ఈ వేడుకకు సముచిత గుర్తింపు, నిధులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత పదేళ్లుగా ఆశించిన సహకారం కరువైంది. అయితే ఇప్పుడీ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆలయం, భద్రాచలం పట్టణ అభివృద్ధిపై దృష్టి పెరిగింది. తొలి విడతలో రూ.60 కోట్లు కేటాయించగా ఇందులో రూ.34 కోట్లు విడుదల కూడా అయ్యాయి. ఆలయ అభివృద్ధి నమూనాకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఊహా చిత్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఇదే ఒరవడిలో ఈ ఏడాది నుంచి శ్రీరామ నవమి వేడుకలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించాలని భక్తులు కోరుతున్నారు. సీఎం చేతుల మీదుగా.. మధ్యయుగాల కాలంలో పాల్వంచ తహసీల్దార్గా పని చేసిన కంచర్ల గోపన్న భద్రాచలంలో సీతారాములకు ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ చైత్ర శుద్ధ నవమి రోజున స్వామి, అమ్మవార్ల కల్యాణం జరిపించే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. అనంతరం అప్పటి గోల్కొండ నవాబు తానీషా సైతం ఈ వేడుకలో భాగమయ్యారు. సీతారాముల పెళ్లికి స్వయంగా హాజరై పట్టువస్త్రాలు సమర్పించడమే కాకుండా ముత్యాల తలంబ్రాలు, గులాల్తో పాటు ఆర్థికంగా తోడ్పాటు అందించారు. స్వాతంత్రం వచ్చేనాటికి నవమి వేడుకలకు అప్పటి ప్రభుత్వం తరఫున రూ.1,300 ఇచ్చేదని రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇప్పటి తెలంగాణ వరకు నవమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. కొన్నేళ్లుగా ఈ సంప్రదాయానికి బ్రేక్ పడినా.. ఈసారి ఉత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి వస్తారని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఊరూ వాడా జరిగే వేడుక.. భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకల విశేషాలను అప్పట్లో భక్తులు రేడియోల్లో వినేవారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక బృందం భద్రాచలం వచ్చేది. ఆ తర్వాత దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారాలు వచ్చేవి. మారిన పరిస్థితుల్లో టీవీలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, మొబైల్ ఫోన్లలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు లైవ్ స్ట్రీమింగ్లో ఈ వేడుకలను చూస్తున్నారు. ఇక్కడ జరిగే పెళ్లి వేడుకలకు సమాంతరంగా తెలుగు నేలపై పల్లె, పట్నం తేడా లేకుండా వేలాది ఆలయాల్లో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ఆదర్శ దంపతుల వివాహ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర పండుగ హోదా దక్కితే ఇటు దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి నిధులు మంజూరవుతాయి. ఫలితంగా ఆలయంతో పాటు పట్టణంలో మౌలిక సదుపాయాలూ మెరుగవుతాయి. రాష్ట్ర పండుగ హోదా వస్తే.. భారీ స్థాయిలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రాల్లో మెరుగైన సౌకర్యాలు, రవాణా సదుపాయాలతో పాటు విస్తృత ప్రచారం చేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపునకు మించి లాభాలు వస్తాయనడానికి తాజా ఉదాహరణ ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళా. రూ.3వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రకటించారు. రాష్ట్రంలో మేడారం జాతర మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఒకప్పుడు గిరిజన పూజారులే చందాలు వసూలు చేసి జాతర నిర్వహించేవారు. ప్రభుత్వ సహకారం నామమాత్రంగా ఉండేది. అయితే 1996లో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా నాటి ప్రభుత్వం గుర్తించగా.. వేడుకల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించారు. ఆ వెంటనే 1998లో జంపన్న వాగుపై వంతెన నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి మేడారం జాతరకు భక్తుల రాక, నిధుల ప్రవాహం పెరిగాయి. ఒకప్పుడు అడవిలా ఉన్న మేడారం ఇప్పుడు చిన్న పట్టణంగా మారింది. సెలవు రోజుల్లో భక్తులు తండోపతండాలుగా మేడారం వస్తుంటారు. స్థానికులకూ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. -
●శిథిలాల కింద మైనింగ్ (రాత్రి 8–50 గంటల నుంచి)
ఆరు వేల టన్నుల బరువైన కాంక్రీట్ శిథిలాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు తెలిపారు. దీంతో శిథిలాల తొలగింపు నిర్ణయాన్ని పక్కన పెట్టి, భవనం కింద నుంచి తవ్వుతూ లోపలికి వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ వరకు చేరాలని నిర్ణయించారు. బొగ్గు గనుల్లో నేలను తవ్వుతూ భూగర్భంలోకి వెళ్లినట్టుగా ఆరువేల టన్నుల బరువైన శిథిలాల కింద నేలను తవ్వడం మొదలెట్టారు. ఇలా తవ్వుకుంటూ(ఎలుక బొరియ చేసినట్టుగా) బాధితుడు కామేశ్వరరావు ఉన్న ప్రదేశం కిందకు చేరుకోవాలని, ఆ తర్వాత బాధితుడికి ఇబ్బంది లేకుండా పైన ఉన్న బరువులు పడకుండా రక్షించాలని నిర్ణయించారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్న ఇంకో బాధితుడు ఉపేందర్ ఉనికిని గుర్తించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. -
కొలతల ప్రకారమే చెల్లింపులు
దమ్మపేట/ములకలపల్లి : ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు కొలతల ప్రకారమే వేతనం చెల్లిస్తామని డీపీఓ చంద్రమౌళి అన్నారు. దమ్మపేట మండలం మందలపల్లి, ములకలపల్లిలోని సుందరయ్య నగర్ శివారులో చేస్తున్న ఉపాధి హామీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఎంత పనిచేస్తే రూ.300 కూలీ వస్తుందనే విషయాన్ని కొలతల ద్వారా వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31 లోగా అన్ని పంచాయతీల్లో ఇంటి పన్ను బకాయిలు పూర్తిగా వసూలు చేయాలని జీపీ కార్యదర్శులను ఆదేశించారు. వసూలైన నగదును వెంటనే ఎస్టీఓలో జమ చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ రవీంద్రారెడ్డి, ఎంపీఓ రామారావు, ఇన్చార్జ్ ఎంపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ కార్యదర్శులు రవి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
అశ్వారావుపేటరూరల్: కబేళాకు తరలిస్తున్న పశువులను మంగళవారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం సంత నుంచి డీసీఎం వ్యాన్లో అనుమతి లేకుండా 40 ఎద్దులు, 32 ఆవులను హైదారాబాద్లోని కబేళాకు తరలిస్తుండగా అశ్వారావుపేటలోని రింగ్ రోడ్ సెంటర్లో పట్టుకున్నారు. వ్యాన్ను పోలీస్ స్టేషన్కు తరలించి, పార్వతీపురానికి చెందిన కె.అంజి, గుబ్బల ప్రసాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పశువులను ఏపీలోని రాజమండ్రి గోసంరక్షణ కేంద్రానికి తరలించి, వ్యాన్ను సీజ్ చేశామని చెప్పారు. -
రెండు కార్లను దహనం చేసిన దుండగులు
సింగరేణి యాజమాన్యమే చేయించిందని బాధితుడి ఆరోపణ కొత్తగూడెంటౌన్: ఆరుబయట పార్క్ చేసిన రెండు కార్లను గుర్తుతెలియని దుండగులు దహనం చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున రామవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు జీకే సంపత్కుమార్, పోలీసుల కథనం ప్రకారం.. రామవరం సుభాష్చంద్రభోస్నగర్ కాలనీలో పార్క్ చేసిన సంపత్కుమార్ కారుకు తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు పక్కనే ఉన్న వీరుకు చెందిన కారుకు అంటుకున్నాయి. చుట్టుపక్కల పొగ వ్యాపించడంతో సంపత్కుమార్ అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నించాడు. పోలీసులు, ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకునేలోగానే రెండు కార్లు పూర్తిగాకాపోయాయి. టూటౌన్ సీఐ రమేశ్కుమార్, క్లూస్ టీం వివరాలు సేకరించారు. సీసీ కెమెరా పరిశీలించగా ఆగంతకులు తచ్చాడుతున్నట్లు కనిపించిందని, చీకటి ఉండటంతో స్పష్టంగా కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిఆపరు. జీకే సంపత్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కాగా, సంపత్కుమార్ మాట్లాడుతూ.. గతంలో తాను సింగరేణి సంస్థపై కేసు వేశానని, తనను భయపెట్టేందుకే సింగరేణి యాజమాన్యం ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. కేసు విషయంలో బుధవారం హైదరాబాద్కు వెళ్లాల్సి ఉందని తెలిపారు. -
ట్రాక్టర్ టైరు పంక్చర్
చర్ల: మండలంలోని ఉంజుపల్లిరోడ్లో మంగళవారం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రం టైరు పంక్చర్ అయ్యి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఒకరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పరిధిలోని కమలాపురానికి చెందిన కొందరు ఆదివాసీలు వెంకటచెరువులోని బంధువుల ఇళ్లల్లో ఉంటూ మండలంలోని వివిధ గ్రామాలకు కూలీ పనులకు వెళ్తున్నారు. వారు ట్రాక్టర్లో వెంకటచెరువు నుంచి చీమలపాడుకు వెళ్తుండగా దేవరబండ సమీపంలో ట్రాక్టర్ ముందు చక్రం టైరు పంక్చర్ అయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమలాపురానికి చెందిన సోడి లక్మ గాయపడగా.. 108 ద్వారా చర్ల ప్రభుత్వ వైద్యశాలకు.. అక్కడి నుంచి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. అదుపుతప్పి చెట్టుకు ఢీ -
హాస్టల్ తాళం పగులగొట్టిన అధికారులు
మణుగూరుటౌన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్ను బదిలీ చేసినా వెళ్లకుండా ఇన్చార్జ్ వార్డెన్కు బాధ్యతలు అప్పగించకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో హాస్టల్లో పంచనామా నిర్వహించి ఇన్చార్జ్కి బాధ్యతలు అప్పగించిన ఘటన మణుగూరులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం, మెనూ పాటించకపోవడం, అందుబాటులో ఉండకపోవడం, అధికారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్న శ్రీనివాస్ను జిల్లా అధికారులు డిప్యూటేషన్పై గతేడాది డిసెంబర్లో భద్రాచలం బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా రాంబాబును నియమించగా ఆయనకు తాళాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో వార్డెన్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ను కలిసి మొదటి తప్పుగా క్షమించాలని కోరడంతో వార్డెన్ని అశ్వారావుపేట బదిలీ చేశారు. అయినా నాటి నుంచి నేటివరకు మణుగూరు ఎస్సీ బాలుర హాస్టల్ తాళాలు ఇన్చార్జ్ వార్డెన్కు అప్పగించకుండా తాత్సారం చేస్తుండటంతో ఫోన్ చేసినా అందుబాటులో లేనంటూ సమాధానం చెబుతూ పిల్లలకు వారానికి సరిపడా సరుకులు ఇస్తూ వస్తున్నాడు. దీంతో ఇన్చార్జ్గా నియమితులైన వార్డెన్ రాంబాబు తరచూ హాస్టల్కి రావడం తాళాలు వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏఎస్డబ్ల్యూఓ హనుమంతరావు, ఆర్ఐ గోపి, సమితిసింగారం సెక్రటరీ శ్రీకాంత్ సమక్షంలో హాస్టల్ తాళాలు పగులగొట్టి సామగ్రిపై పంచనామా నిర్వహించి ఇన్చార్జ్ వార్డెన్ రాంబాబుకి బాధ్యతలు అప్పగించారు. -
ఇంజనీర్ల బదిలీలెప్పుడో..?
● జెన్కోలో పైరవీలు చేసేవారికి పోస్టింగ్లు.. ● గతానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ● ప్రత్యేక సీఎండీ లేక పరిష్కారం కావడం లేదనే ఆరోపణలు ● రాష్ట్రంలోని మూడు సీఈ పోస్టుల్లో ఇన్చార్జ్లే.. పాల్వంచ: టీఎస్ జెన్కోలో పనిచేస్తున్న ఇంజనీర్ల సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోతున్నాయి. యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని ఇంజనీర్లు, సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సంస్థ పురోభివృద్ధిలో కీలకపాత్ర వహిస్తున్న ఇంజనీర్లపై వివక్ష చూపిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని వాపోతున్నారు. పదోన్నతులతో పాటే బదిలీలు చేపట్టాల్సి ఉండగా పదోన్నతులు వచ్చి నెలలు గడుస్తున్నా పోస్టింగ్ లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, యాజమాన్యాలకు కలిసి విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా పైరవీలు చేసుకుంటున్న వారు మాత్రం మంచి పోస్టింగ్లు పొందుతున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎండీ ఉండాలి.. జెన్కోకు ప్రత్యేక సీఎండీ లేకపోవడం ఇంజనీర్ల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ఎనర్జీ, పంచాయతీ రాజ్, ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న అధికారే జెన్కో సీఎండీగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన ఈ శాఖ సమస్యలపై సరిగ్గా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇంజనీర్ల సమస్యలపై ఇంజనీర్ల సంఘాలు ఇప్పటికే అనేక మార్లు వినతిపత్రాలను సమర్పించారు. రేపు, ఆ తర్వాత కూడా విద్యుత్ శాఖ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రుల దృష్టికి ఇంజనీర్ల సమస్యలను తీసుకుపోనున్నారు. అయినా, సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇన్చార్జ్లతో సీఈ పోస్టుల భర్తీ జెన్కోలో మూడు చీఫ్ ఇంజనీర్ పోస్టులు సైతం ఇన్చార్జ్లతో నడుస్తుండటం గమనార్హం. పాల్వంచలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 7వ దశలో పనిచేసే చీఫ్ ఇంజనీర్ పి.వెంకటేశ్వరరావు జనవరి 31న ఉద్యోగ విరమణ పొందారు. దీంతో జెన్కో ట్రైనింగ్ సెంటర్ సీఈ శ్రీనివాసబాబు 7వ దశ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉండగా హైదరాబాద్ విద్యుత్ సౌధలో ఈఆర్సీ సీఈ టీఎస్ఎన్ మూర్తి సైతం జనవరి 31న ఉద్యోగ విరమణ పొందారు. ఫిబ్రవరి 28న కమర్షియల్ సీఈ ఆనందం ఉద్యోగ విరమణ చెందారు. ముగ్గురు సీఈలు ఉద్యోగ విరమణ పొందినా ఇంకా ఆయా పోస్టుల్లో ఎవరినీ భర్తీ చేయలేదు. ఇతర సీనియార్టీ ఉన్న ఎస్ఈలకు కూడా పదోన్నతులు ఇవ్వలేదు. వినతులు బుట్టదాఖలు జెన్కోవ్యాప్తంగా గత అక్టోబర్ 14వ తేదీన 205 మంది ఇంజనీర్లు పదోన్నతులు పొందారు. ఇందులో ఏఈలు ఏడీఈలుగా, ఏడీఈలు డీఈలుగా, డీఈలు ఈఈలుగా, ఈఈలు ఎస్ఈలుగా పదోన్నతులు పొందారు. ఇక 2012 బ్యాచ్కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్లు ఏడీలుగా పదోన్నతులు పొంది ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పోస్టింగ్లు లభించలేదు. నాలుగేళ్లుగా జెన్కోలో ఇంజనీర్లకు ట్రాన్స్ఫర్లు కూడా ఇవ్వడం లేదు. రిటైర్మెంట్ ద్వారా ఖాళీ అయిన చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా వాటిని పట్టించుకోవడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులతో పైరవీలు చేసుకుని కొందరు ఇంజనీర్లు బదిలీలు చేయించుకున్నారు. కాగా, అక్రమంగా విద్యుత్ సౌధకు ఇచ్చిన ట్రాన్స్ఫర్లను రద్దు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. విద్యుత్ సౌధకు బదిలీ కావాలంటే గతంలో సీనియార్టీ ప్రాతిపదికన మాత్రమే బదిలీలు జరిగేవి. కానీ, ఇటీవలికాలంలో పైరవీ ఉన్న వారికి పోస్టింగులు వస్తుండటం గమనార్హం. -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి నేడు, రేపు ఎంపిక పోటీలు
భద్రాచలంటౌన్/పాల్వంచరూరల్/గుండాల: పాల్వంచ మండలం కిన్నెరసాని, గుండాల మండలం కాచనపల్లిలోని గిరిజన ఆశ్రమ క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు చివరి దశ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలో బాలురకు ప్రవేశాలు కల్పించేందుకు బుధవారం, కాచనపల్లి పాఠశాలలో బాలికలకు ప్రవేశాలు కల్పించేందుకు గురువారం ఆయా పాఠశాలల్లో ఎంపిక పోటీలు ఉంటాయని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఎంపికై న విద్యార్థినీ, విద్యార్థులే కాక ఆసక్తి ఉన్న వారు నేరుగా పాల్గొనవచ్చని తెలిపారు. విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, రెండు పాస్ఫొటోలు, టీషర్ట్తో నిర్ణీత తేదీల్లో ఉదయం 8.30 గంటలకల్లా హాజరుకావాలని వారు సూచించారు. ఈ మేరకు తొమ్మిది రకాల బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపికలు ఉంటాయని పీఓ వివరించారు. కొత్తగూడెం ఏరియాలో రికార్డుస్థాయి బొగ్గు రవాణా సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలో రికార్డ్స్థాయిలో బొగ్గు రవాణా సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేంరాజు మంగళశారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏరియాలో సోమవారం ఒక్కరోజు 68,056 వేల టన్నుల బొగ్గును రవాణా చేసి రికార్డ్ నెలకొల్పామని, సింగరేణి చరిత్రలో ఏ ఏరియా కూడా ఇప్పటివరకు ఒక్కరోజులో 14 రేకులను రవాణా చేయలేదని పేర్కొన్నారు. సమంత సీహెచ్పీలో 10 రేకులు, రుద్రంపూర్లోని సీహెచ్పీ నుంచి 4 రేకులు రవాణా చేశారని వివరించారు. ఇదే స్ఫూర్తితో వార్షిక లక్ష్యాన్ని సాధించాలని, జీరో యాక్సిడెంట్కు కృషి చేయాలని పిలుపునిచ్చారు. టేకులపల్లి సంత వేలం రూ.11.60 లక్షలుటేకులపల్లి: టేకులపల్లి, గోలియాతండా గ్రామ పంచాయతీల సంయుక్త వారాంతపు సంత నిర్వహణకు సంబంధించిన వేలం పాట మంగళవారం టేకులపల్లి పంచాయతీ కార్యాలయంలో జరిగింది. మొత్తం 8 మంది డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనగా రూ.11.60 లక్షలకు మూడు వాసు కై వసం చేసుకున్నారు. కిందటిసారి 9 నెలలకు గాను సంత వేలం రూ.8 లక్షలకు పాడారు. ప్రస్తుత సంత కాలపరిమితి ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంటుంది. కార్యక్రమంలో ఎంపీడీఓ జి.రవీందర్రావు, ఎంపీఓ జేఎల్ గాంధీ, కార్యదర్శులు ఉప్పు దీప్తి, ప్రశాంత్, సిబ్బంది మూడు బిచ్చు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడికి జాతీయ పురస్కారంపాల్వంచ: స్థానిక డీఏవీ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు ఎంఎస్వీ కృష్ణారావును అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కారం వరించింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13న గుంటూరులో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు తనకు అందజేస్తారని కృష్ణారావు మంగళవారం వెల్లడించారు. ఉపాధ్యాయుడిపై దాడి?దుమ్ముగూడెం: మండలంలోని పాత జిన్నెలగూడెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, కాశీనగరం గ్రామానికి చెందిన విజయ్పై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి 8 గంటల సమయాన దాడి చేసినట్టు సమాచారం. పాఠశాలకు అవసరమైన సామగ్రిని ఆటోలో తీసుకెళ్లి దింపి తిరిగివస్తుండగా బురకనగడ్డ సమీపాన ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తులు దాడి చేసినట్టు తెలిసింది. ‘నువ్వు ఎవరో తెలు సు.. ఎందుకు వస్తున్నావో తెలుసు.. ఇంకోసారి ఇటువైపు వస్తే ప్రాణాలు పోతాయి జాగ్రత్త’ అని హెచ్చరించారని, ఈలోగా ఇతరవాహనా లు వస్తుండడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. కాగా, విజయ్ గతంలో పోలీస్ శాఖలో విధులు నిర్వర్తించి ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడిపై దాడికి కారణం వ్యక్తిగత కక్షలా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. వడదెబ్బతో రైతు మృతి టేకులపల్లి: వడదెబ్బతో రైతు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండా పంచాయతీ కొండంగుల బోడు గ్రామానికి చెందిన కేలోతు గోబ్రియా (49) కూరగాయలు, నువ్వులు సాగు చేశాడు. సోమవారం చేనుకెళ్లి ఎండలోనే కూరగాయలు, నువ్వులు కోశాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అస్వస్థతకు గురై ఇంటికొచ్చాడు. మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య బుజ్జి, ఒక పాప, బాబు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. -
ముస్తాబవుతున్న భద్రగిరి
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రగిరి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. భద్రాచలం దేవస్థానంలో శ్రీరామనవమి నవాహ్నిక వసంత ప్రయుక్త బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6, 7 తేదీల్లో శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఏడాది రామయ్య కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారనే ప్రచారం నేపథ్యంలో ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జి సెంటర్, అభయాంజనేయస్వామి పార్కు తదితర ప్రాంతాల్లో స్వాగత ద్వారాలు సిద్ధం కాగా, మరికొన్ని చోట్ల పనులు నడుస్తున్నాయి. రెండో బ్రిడ్జి డివైడర్లకు, మిథిలా స్టేడియంలో కల్యాణ మండపానికి రంగులు వేస్తున్నారు. శాశ్వత స్వాగత ద్వారాల వద్ద గల విగ్రహాలకు ఇప్పటికే రంగులు అద్దారు. ఇక గ్రామపంచాయతీ, ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనులు వేగవంతం చేశారు. ఈనెల 30 నాటికి పూర్తి కావాలని ఇప్పటికే కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా తాత్కాలిక మరుగుదొడ్లు, పట్టణంలో పారిశుద్ధ్య పనులు, స్టేడియంలో సెక్టార్ల విభజన, బారికేడ్ల నిర్మాణం వంటివి పెండింగ్లో ఉన్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. 200 క్వింటాళ్ల తలంబ్రాలు.. ఈ ఏడాది భక్తుల కోసం 200 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. ఇక స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారు చేయాల్సి ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సరిపడా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ముత్యాల తలంబ్రాలను కార్గో ద్వారా భక్తుల ఇంటికే చేరుస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించగా, పరోక్ష సేవల్లో భాగంగా తలంబ్రాలు, అర్చనలకు సంబంధించి ఈ నెల 31 వరకు తపాలా శాఖ అందించనుంది. స్వాగత ద్వారాలు సిద్ధం పూర్తి కావొస్తున్న పెయింటింగ్, ఇతర పనులు -
వైద్యులు, సిబ్బంది సేవలు భేష్
● ఇల్లెందు ఆస్పత్రిని సందర్శించిన కాయకల్ప బృందం ● అవార్డుకు ప్రతిపాదనలు ఇల్లెందు: ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని వైరా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బాలునాయక్ బృందం కితాబిచ్చింది. కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఈ బృందం మంగళవారం ఇల్లెందు ఆస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలునాయక్ తదితరులు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తనిఖీ చేసి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ వార్డులో ఉన్న సదుపాయాలు, ఆస్పత్రిలో లేబర్ రూం, ల్యాబ్లు, మందుల గదులతో పాటు ఓపీ, పిల్లల వార్డును పరిశీలించారు. శానిటేషన్, తాగునీరు, విద్యుత్, పేషెంట్ల రాక, వారికి అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్లు అధికంగా వస్తుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆస్పత్రి భవనం, కిటికీలు, తలుపులు అంత బాగా లేకపోవడంతో కొంత లోటని పేర్కొన్నారు. మొత్తంగా 70 శాతం మేర మార్కులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా, వీరు అందించే నివేదిక ప్రకారం కాయకల్ప పథకం వర్తిస్తే.. ఆస్పత్రి అభివృద్ధికి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మంజూరయ్యే అవకాశం ఉంది. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్దన్, ఎండీలు రాంనివాస్, శేఖర్, ఆర్ఎంఓ డాక్టర్ బన్సీ, హెడ్ సిస్టర్ నాగేంద్రమ్మ, ఫార్మసిస్ట్ రజనీ, ఆఫీస్ ఇన్చార్జ్ రాహుల్ పాల్గొన్నారు. -
అదుపుతప్పి వాగులో పడిన ట్రాలీ
జూలూరుపాడు: మొక్కజొన్న కంకులు విరిసేందుకు వెళ్తున్న కూలీల ట్రాలీ అదుపుతప్పి వాగులో పడడంతో పలువురు గాయపడిన ఘటన మండల పరిధిలోని భేతాళపాడులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం రాజులపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో మొక్కజొన్న కంకులు విరిసేందుకు జూలూరుపాడు మండలం చీపురుగూడెం, టాక్యాతండా, ఎలుకలొడ్డు గ్రామాలకు చెందిన 31 మంది కూలీలు చీపురుగూడేనికి చెందిన టాటా ఏస్ ట్రాలీ ఎక్కారు. భేతాళపాడు సమీపంలోని పెద్దవాగు బ్రిడ్జి వద్దకు రాగానే ట్రాలీ ముందు టైర్ బరస్ట్ కావడంతో అదుపుతప్పి వాగులో పడిపోయింది. దీంతో కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రంగా, మరో 13 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న 108 వాహనంలో ముగ్గురిని, మిగితా వారిని మరో వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోడె శేఖర్, సోడె లక్ష్మీనారాయణ, వజ్జా పగడయ్య, వజ్జా సత్యం, బల్లెం రమేశ్, బొర్రా రాఘవులు, బానోత్ సురేశ్బాబు, బచ్చల అజయ్, కోడెం వెంకటేశ్వర్లు, సోడె లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో శేఖర్, లక్ష్మీనారాయణ, బచ్చల అజయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. టాక్యాతండాకు చెందిన బానోత్ సురేశ్బాబు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రాలీ డ్రైవర్ పాయం సాయికి స్వల్ప గాయాలయ్యాయి. 10 మంది కూలీలకు తీవ్రంగా, 13 మందికి స్వల్పంగా గాయాలు భేతాళపాడులో వద్ద ప్రమాదం పరిమితికి మించి ప్రయాణం.. టాటాఏస్ ట్రాలీ వాహనంలో పరిమితికి మించి 31 మంది కూలీలు ఎక్కగా భేతాళపాడు వద్ద టైర్లకు ఫుల్గా గాలి పెట్టించాడు. ఆ తర్వాత కాసేపటికే వాహనం ఎడమ వైపు ముందు టైర్ బరస్ట్ కావడంతో అదుపుతప్పి బ్రిడ్జి కుడి వైపున వాగులో బోల్తా పడింది. అయితే వాగులో నీళ్లు లేకపోవడం, బ్రిడ్జి మొదట్లోనే పడడంతో పెనుప్రమాదం తప్పింది. బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్ సక్రమంగా లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమైందని స్థానికులు అంటున్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు. జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. కాగా గాయపడిన వారిని వివిధ పార్టీల నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మాళోత్ మంగీలాల్, జాటోత్ కృష్ణ, బానోత్ ధర్మా, ఎం.రాజశేఖర్, గౌని నాగేశ్వరరావు, వల్లోజి రమేశ్, ప్రణయ్ తదితరులు పరామర్శించారు. -
పంచాయతీ మోటార్లు దగ్ధం
పినపాక: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పంచాయతీ మోటార్లు కాలిపోయిన ఘటన మండలంలోని జానంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పంచాయతీ అధికారుల కథనం ప్రకారం.. జానంపేట జెడ్పీహెచ్ఎస్ ప్రాంగణంలో మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వరిదొప్పలు కొన్ని మండించడంతో ఆ మంటలు వ్యాపించి మోటార్లు, వైర్లు, పైపులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని పంచాయతీ అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గుండాల: ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ అక్సర్ (45) గుండాలకు తునికాకు ప్రూనింగ్ పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. గుండాల – దుబ్బగూడెం మధ్య మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో అక్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సీఐ మృతదేహాన్ని ములుగు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు. వరి గడ్డివామి దగ్ధం పినపాక: ప్రమాదవశాత్తు వరి గడ్డివామి పూర్తిగా దగ్ధమైన ఘటన మండలంలోని అమరావరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత రైతు మహ్మద్ ముజాఫర్ కథనం ప్రకారం.. పొలంలో మూడు ఎకరాలకు సంబంధించిన వరిగడ్డిని పశువుల మేత కోసమని కుప్పగా వేశారు. ప్రమాదవశాత్తు వామికి మంటలు అంటుకోవడంతో గమనించిన రైతులు ఆర్పే ప్రయత్నం చేసేలోపు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. -
గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటాలి
మంత్రి పొంగులేటి భద్రాచలం : గిరిజనుల సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని, భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో దీనికి మరింత అవకాశం ఏర్పడిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం బ్రోచర్ను శాసనసభ ఆవరణలో మంత్రి సీతక్కతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయాలు, వేషభాషలు, జీవన విధానాన్ని ప్రదర్శించేందుకు మ్యూజియం ఉపకరిస్తుందన్నారు. తద్వారా భద్రాచలం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా మ్యూజియాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పాల్గొన్నారు. -
భక్తులు ఇబ్బంది పడకుండా చూడాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా బస్సులు ఏర్పాటు చేయాలని టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ కుష్రో షా ఖాన్ అన్నారు. సంస్థ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణానికి వచ్చిన ప్రతీ భక్తుడిని తిరిగి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాలని, అందుకు ఆర్టీసీ ఉద్యోగులంతా కృషి చేసి ప్రయాణికుల మన్ననలు పొందాలని సూచించారు. భద్రాచలం – పర్ణశాల మధ్య కూడా అధిక సంఖ్యలో బస్సులు నడపాలని, తెలంగాణలోని అన్ని రూట్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు ఏపీ నుంచి వివిధ డిపోల మేనేజర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ ఈడీ కుష్రో షా ఖాన్ -
పూల పాన్పులు!
ఇసుక తిన్నెలే.. శ్రీరామనవమికి సామాన్య భక్తులకు తప్పని ఇక్కట్లు ● దేవస్థానం పరిధిలోని గదులన్నీ ముందే బ్లాక్ ● దాతల సహకారంతో నిర్మించినవి కావడమే కారణం ● ప్రైవేట్ సెక్టార్లోవీ సింహభాగం ఆన్డ్యూటీ అధికారులకే.. ● భక్తుల అవసరాలను తీర్చలేకపోతున్న హరిత, టీటీడీ గదులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధీనంలో సౌమిత్రి సదనం, మారుతి సదనం, జానకీ సదనం, శ్రీరామ నిలయం, శ్రీరామ సదనంతో పాటు 14 కాటేజీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 150 వరకు సింగిల్, డబుల్ బెడ్లతో కూడిన ఏసీ, నాన్ ఏసీ గదులు ఉన్నాయి. వీటి అద్దె ఒక రోజుకు కనిష్టంగా రూ.448 నుంచి గరిష్టంగా రూ.2,400 వరకు ఉంటాయి. సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు ఈ గదులను అద్దెకు ఇస్తారు. ఆన్లైన్/ఆఫ్లైన్లో గదులు బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. దీంతో రాబోయే నవమి నాడు సీతారాముల కల్యాణం కళ్లారా చూసేందుకు భద్రాచలం వచ్చే భక్తులు ఈ గదులు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వారికి నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 4, 5, 6, 7 తేదీల్లో దేవస్థానం ఆధీనంలో ఉన్న గదులన్నీ బ్లాక్ అయి ఉన్నాయి. కరకట్ట మెట్లు, ఇసుక తిన్నెలే దిక్కు.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన గదులు, డార్మెటరీలే ప్రస్తుతం సామాన్య భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన కరకట్ట దిగువన, విస్తా కాంప్లెక్స్ సమీపంలో భారీ షెడ్లు నిర్మిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ షెడ్లు.. ఇక్కడా చోటు లభించకపోతే కరకట్ట మెట్లు, గోదావరి తీరంలో ఉన్న ఇసుక తిన్నెలే దిక్కవుతున్నాయి. ప్రతీ ఏడాది ఈ తంతు జరుగుతున్నా ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రైవేటులోనూ కష్టమే.. భద్రాచలంలో ప్రైవేట్, హోం స్టే విధానంలో సుమారు 600 వరకు గదులు అందుబాటులో ఉన్నాయి. నవమి సందర్భంగా ఉమ్మడి ఖమ్మంతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు విఽధి నిర్వహణ నిమిత్తం భద్రాచలం వస్తారు. దీంతో ప్రైవేట్ సెక్టార్లో ఉన్న గదుల్లో సగం వరకు సిబ్బందికే సరిపోతున్నాయి. ఇతర భక్తులకు పరిమిత సంఖ్యలోనే గదులు లభిస్తున్నాయి. డిమాండ్ ఎక్కువ, గదులు తక్కువ కావడంతో పర్వదినాల్లో వీటి అద్దె ఒక రాత్రికి రూ.5,000 వరకు చేరుతోంది. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తితో భద్రాచలం వచ్చే భక్తులు ఈ ధరలు చూసి బెంబేలెత్తున్నారు. మరికొందరు అంత డబ్బు వెచ్చించేందుకు సిద్ధపడినా గదులు దొరకని పరిస్థితి ఉంటోంది. దీంతో తాము ప్రయాణించిన వాహనాల్లోనే నిద్రించి, మరుసటి రోజు గోదావరిలో స్నానం చేసి దర్శనాలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్తవి కావాలి.. భద్రాచలంలో ఉన్న హరిత హోటల్లో పరిమిత సంఖ్యలోనే గదులు ఉన్నాయి. శ్రీరామనవమి, ముక్కోటి సమయాల్లో ఉండే డిమాండ్కు ఇవి ఏ మూలకూ సరిపోవు. దీంతో చాలా మంది భక్తులు ముందురోజు సమీపంలోని పాల్వంచ, కొత్తగూ డెం, ఖమ్మంలో బస చేసి, నవమి రోజు ఉదయం భద్రాచలం వస్తున్నారు. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా భద్రాచలంలో సామాన్య భక్తులకు వసతి, బస సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరముంది.దాతల కోసం.. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన భద్రాచలం దేవస్థానం ఆధీనంలో ఉన్న గదుల్లో సింహభాగం దాతల సహకారంతో నిర్మించినవే. భద్రాచలం సీతారాములకు ప్రపంచ నలుమూలలా భక్తులున్నారు. వీరిలో చాలా మంది భద్రాచలంలో గదుల నిర్మాణానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించారు. వారు భద్రాచలం వచ్చినప్పుడు, లేదా వారు సిఫార్సు లేఖలు ఇచ్చిన భక్తులు ఆయా గదుల్లో బస చేసే వీలు ఉంటుంది. సాధారణ రద్దీ రోజుల్లో ఈ గదులు భక్తులకు ఉపయోగపడుతున్నప్పటికీ శ్రీరామనవమి, ముక్కోటి వంటి పర్వదినాలు, ఇతర పండగ రోజుల్లో వారికి కేటాయించే అవకాశం ఉండడం లేదు. ఇక వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్మించిన సత్రాలు, కాటేజీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. -
భూగర్భజలాల పెంపునకు కృషి చేయండి
డీపీఓ రాజమౌళి చండ్రుగొండ : భూగర్భజలాలు పెంచేందుకు రైతులు తమవంతు కృషి చేయాలని, వ్యవసాయ క్షేత్రాల్లో బోరుబావుల వద్ద ఫాంపాండ్లు నిర్మించాలని జిల్లా పంచాయతీ అధికారి రాజమౌళి సూచించారు. ఇళ్లలో ఇంకుడుగుంతల నిర్మాణంతోనూ భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. చండ్రుగొండ మండలం తుంగారం, అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన, పెద్దిరెడ్డిగూడెం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. కూలీలు పనిచేసే ప్రదేశంలో నీడ కోసం టెంట్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. నర్సరీలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాన్, టీఏ రాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్గా అమరనేనిసింగరేణి(కొత్తగూడెం): ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్గా అమరనేని రామారావు, కన్వీనర్గా సంగం వెంకటపుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎంపిక జరగగా, వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, పెండింగ్ పీఆర్సీ, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు, ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న బకాయిల మంజూరుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘ఇందిరమ్మ’ పనులు ప్రారంభించండిపాల్వంచరూరల్ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఇంకా పునాదులు తీయని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని హౌసింగ్ పీడీ శంకర్ అన్నారు. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ పరిధిలో 200 ఇళ్లు మంజూరైతే 60 మంది మాత్రమే పునాదులు తీసి పనులు చేపట్టారని, మిగిలిన వారు త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట ఏఈ రమేష్, గ్రామ కార్యదర్శి రవికుమార్ ఉన్నారు. -
మందులు కలిసిన నీళ్లు తాగి 22 గొర్రెలు మృతి
రఘునాథపాలెం: దాహార్తితో అల్లాడుతున్న మూగజీవాలు మందు కలిపిన నీళ్లు తాగగా మృత్యువాత పడ్డాయి. బాధితులు, గ్రామస్తులు కథనం ప్రకారం.. మండలంలోని కోయచలకకు చెందిన బొరిగర్ల లింగయ్య, బాబుకు చెందిన గొర్రెల మందను రోజూలాగే మేతకు తీసుకెళ్లారు. ఒక రైతు మిర్చి తోటలో మందుల పిచికారీకి నీళ్లలో కలిసి సిద్ధం చేసి ఉంచగా... గొర్రెలు ఆ నీళ్లు తాగాయి. దీంతో గొర్రెలు వరుసగా కింద పడిపోతుండడంతో కాపరులు వెంటనే పశు వైద్యుడికి సమాచారం ఇస్తుండగానే 20 గొర్రెలు, రెండు పోతులు ప్రాణం విడిచాయి. మిగిలిన వాటికి వైద్యం అందిస్తుండగా ఎన్ని కోలుకుంటాయో తెలియడం లేదు. సుమారు రూ.3.25 లక్షల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
మణుగూరు టౌన్: ప్రేమించిన యువతి కాదనడంతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని వాసవీనగర్కి చెందిన సుగ్గల కార్తీక్(26) ఓ యాప్లో పరిచయమైన యువతిని ప్రేమించాడు. పెళ్లిచేసుకునేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఓ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తల్లిదండ్రులు గుంటూరు వెళ్లగా, సోదరుడు మరో గదిలో ఉన్నాడు. గమనించి సోదరుడు స్థానికుల సాయంతో కిందకు దింపి 100 పడకల ఆస్పత్రికి తరలించాడు. పరీక్షంచిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా ఎదిగి వచ్చిన కుమారుడు ప్రేమ అంటూ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.మనస్తాపంతో వివాహిత.. పాల్వంచరూరల్: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి సారెకల్లు గ్రామానికి చెందిన మడకం రాఖి(21) మద్యానికి అలవాటుపడటంతో భర్త రామ మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఈ నెల 21న పురుగుల మందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అక్కడి నుంచి కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. ములకలపల్లిలో యువకుడు..ములకలపల్లి: ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుట్టగూడెం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. గుట్టగూడెం గ్రామానికి చెందిన గుండి భారతి, అర్జున్ దంపతులకు కుమారుడు చైతన్య (19), కూతురు కల్యాణి ఉన్నారు. చైతన్య చెడు వ్యసనాలకు గురై చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుండగా ఆదివారం రాత్రి తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది గ్రామ శివారులోని పాఠశాల ఆవరణలో నిద్రించేందుకు వెళ్లాడు. తెల్లవారుజామునే చెట్టుకు ఉరి వేసుకోగా, స్థానికులు గమనించి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పగిడిపల్లి వెంకటేశ్వర్లుకు డాక్టరేట్ లభించింది. కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆయన ‘డాక్టర్ సీతారాం సాహిత్యం – ఒక అధ్యయనం’ అంశంపై పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించగా కేయూ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లును కళాశాల ప్రిన్సిపాల్ జకీరుల్లా , అధ్యాపకులు, జాషువా సాహిత్య వేదిక అధ్యక్షుడు మువ్వా శ్రీనివాసరావు తదితరులు సోమవారం అభినందించారు. -
అర్జీలను పరిష్కరించాలి
కొత్తగూడెంఅర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ● ప్రభుత్వం నుంచి రావాల్సిన భూమి ఇప్పించాలని జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యదేవర రాజయ్య భార్య సీతమ్మ వినతిపత్రం అందజేసింది. పరిశీలించిన అదనపు కలెక్టర్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. ● అగ్నిప్రమాదంలో ఇల్లు, కుమార్తె వివాహం కోసం దాచుకున్న నగదు, బంగారం దగ్ధమయ్యాయని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన గుగులోతు వీరు అర్జీ అందించారు. అర్జీని పరిశీలించి చర్యలు నిమిత్తం హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు. ● పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయితీ వర్కర్ల వేతనాలు చెల్లించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో, ఖబరస్థాన్ స్థలానికి అనుమతి మంజూరు చేయాలని జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ యాకూబ్పాషా ఆధ్వర్యంలో వినతి అందజేశారు. ● ఇసుక అక్రమ తవ్వకాలను ప్రభుత్వం అరికట్టాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ మాస్లైన్ నాయకుడు రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి పత్రం అందజేశారు. ● కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని, సబ్ రిజిస్ట్రార్ వ్యవహారశైలి, అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ జిల్లా సమాచార హక్కు చట్టం కో–ఆర్డినేషన్ కమిటీ మెంబర్ జూలూరి రఘుమాచారి ఫిర్యాదు చేశారు. ● జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అప్పగించాలని కోరుతూ బీఆర్ఎస్, తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. ● 2021లో తన తండ్రి మరణించాడని, ఆయన పేరు మీద ఎస్ఐబీలో ఉన్న పంట రుణం మాఫీ చేయాలని జూలూరుపాడు మండలం వినోబా నగర్కు చెందిన గంగావత్ ప్రసాద్ విన్నవించగా.. దరఖాస్తును వ్యవసాయ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ● భూక్యా పులి సింగ్, సరోజ అనే వ్యక్తులు తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని, విచారణ జరిపి తమకు పట్టా మంజూరు చేయాలని ఇల్లెందు మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన కున్సోత్ అరుణ ఫిర్యాదు చేయగా, దరఖాస్తును టేకులపల్లి తహసీల్దార్ ఎండార్స్ చేశారు. ● వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్న భూమికి తన మరిది కందుకూరి నాగార్జున అడ్డుపడుతున్నాడని, తగిన చర్యలు తీసుకుని ఆలయానికి భూమి ఇప్పించేలా చూడాలని దమ్మపేటకు చెందిన కందుకూరి లక్ష్మీ నరసమ్మ అనే మహిళ ఫిర్యాదు చేసింది. అర్జీని పరిశీలించిన అదనపు కలెక్టర్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్కు ఎండార్స్ చేశారు. గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన -
రామయ్య సన్నిధిలో జడ్జి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని చైన్నె హైకోర్టు జడ్జి శివగ్నానమ్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. శ్రీ అభయాంజనేయస్వామి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం జరిపి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పర్ణశాల రామయ్యను.. దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని చైన్నె హైకోర్టు జడ్జి శివగ్నానమ్ కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎస్ఐ గణేష్, ఆలయ ఇన్చార్జ్ అనిల్కుమార్ పాల్గొన్నారు. సింగరేణి విద్యార్థినుల ప్రతిభసింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 19న ఖమ్మంలోని కవితా మోమెరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెిస్టివల్లో సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఫెస్టివల్కు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి 108 మంది హాజరుకాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి ఎంపిక చేసి బహుమతులు అందించారు. సింగరేణి కళాశాల విద్యార్థినులు కె.వెన్నెల, ఎండీ ఆయేషా మూడో, నాలుగో స్థానాల్లో నిలవగా సోమవారం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, కరస్పాండెంట్ కే.సునీల్కుమార్, ప్రిన్సిపాల్ చింతల శారద తదితరులు అభినందించారు. నేత్రదానంటేకులపల్లి: మండలంలోని బోడు గ్రామానికి చెందిన పంజాల సముద్ర(60) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ సోమవారం మృతి చెందింది. ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా మృతురాలికి భర్త రాములు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మున్నేటిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి ఖమ్మంరూరల్: ఖమ్మం బాలాజీనగర్కు చెందిన సయ్యద్ మౌలానా అలియాస్ అఫ్రోజ్(21) రాజీవ్ గృహకల్ప వద్ద మున్నేటికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పలువురు స్నేహితులతో కలిసి ఆయన సోమవారం సరదాగా వెళ్లాడు. అయితే, మౌలానాకు ఈత రాకపోవడంతో నీటిలోకి దిగగానే మునిగిపోసాగాడు. ఆయన వెంట ఉన్న వారికి కూడా ఈత రాక రక్షించే అవకాశం లేకపోవడంతో మృతి చెందాడు. ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న మౌలానా కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఈమేరకు సమాచారం అందుకున్న సీఐ ముష్క రాజు, పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐదుగురిపై పోక్సో కేసు ఎర్రుపాలెం: మండలంలోని భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన బాలికను(17)ను ప్రేమ పేరిట మాయమాటలతో నమ్మించి గర్భవతిని చేసి వ్యక్తితో పాటు పలువురిపై పోక్సో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడైన ముల్లంగి జమలయ్యతో పాటు ఆయన తల్లిదండ్రులు ముసలయ్య – మరియమ్మ, బాలికను అబార్షన్ను ప్రేరేపించిన ఆర్ఎంపీ నరేందర్, గర్భ విచ్ఛిత్తికి ప్రయత్నించిన నర్సు భవానీపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై పి.వెంకటేశ్ తెలిపారు. కోడి పందేల స్థావరాలపై దాడి ములకలపల్లి: గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజుపేట శివారులో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, రూ 1,500 నగదు, మూడు కోడిపుంజులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు. -
రెండు ఇసుక టిప్పర్లు సీజ్
పాల్వంచరూరల్: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్ వాహనాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తహసీల్దార్ వివేక్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని భోజ్యాతండా సమీపంలోని మొర్రేడు వాగు చెక్డ్యామ్ వద్ద నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందగా రూరల్ ఆర్ఐ నళిని కుమార్, పోలీస్ సిబ్బంది సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఒక రోజు ముందు తీసుకున్న అనుమతి కాగితాలతో రవాణా చేస్తుండగా టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. టేకులపల్లిలో ట్రాక్టర్... టేకులపల్లి: మండలంలోని శంభునిగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను సోమవారం ముత్యాలంపాడు క్రాస్రోడ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్టేషన్కు తరలించి, ఇసుక రవాణా చేస్తున్న బిల్లుడుతండాకు చెందిన అజ్మీర మాన్సింగ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. చండ్రుగొండలో రెండు ట్రాక్టర్లు..చండ్రుగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న ఎదుళ్లవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ సోమవారం రాత్రి తెలిపారు. వాహనాలను స్టేషన్కు తరలించామని, డ్రైవర్లు నర్సింహారావు, హేమంత్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్లో మండలవాసి మృతిదుమ్ముగూడెం : మండలంలోని సున్నంబట్టి గ్రామానికి చెందిన బంటు రాజ్కుమార్ (18) హైదరాబాద్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజ్కుమార్ హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై హైవేపై వెళ్తుండగా డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రాజ్కుమార్ మృతితో సున్నంబట్టి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పశువులు పట్టివేతటేకులపల్లి: మండలంలోని తడికలపూడి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు పశువులను స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ వాహనం సీజ్ చేసి, నిందితులు గరుడపల్లి లాలయ్య, మొరం నాగరాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.సురేష్ తెలిపారు. పశువులను పాల్వంచలోని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. పేకాటరాయుళ్ల అరెస్ట్కరకగూడెం: మండల పరిధిలోని బర్దారం అటవీ ప్రాంతంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, రూ.7వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కరకగూడెం ఎస్సై రాజేందర్ తెలిపారు. జేసీబీ స్వాధీనందమ్మపేట : అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న జేసీబీ యంత్రాన్ని రెవెన్యూ అధికారులు సోమవారం సీజ్ చేశారు. మండలంలోని గట్టుగూడెం గ్రామశివారులో అనుమతులు లేకుండా జేసీబీ యంత్రంతో మట్టి తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారనే సమాచారం రెవెన్యూ అధికారులకు అందింది. దీంతో రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి, సీజ్ చేశామని ఇన్చార్జ్ తహసీల్దార్ కె.వాణి తెలిపారు. -
‘యాంత్రీకరణ’కు మోక్షం
బూర్గంపాడు: వ్యవసాయ యాంత్రీకరణకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. ఏడేళ్లుగా నిలిచిన పథకానికి ప్రభుత్వం మళ్లీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు, పనిముట్లు అందించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. 14 రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందించేందుకు వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. తొలుత మహిళా రైతులకు ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలివిడతలో ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు పనిముట్లు అందించాలని భావిస్తోంది. జిల్లాకు రూ.కోటి నిధులు తొలివిడతగా వ్యవసాయ యాంత్రీకరణ కోసం జిల్లాకు రూ. కోటి నిధులు కేటాయించింది. ఈ నిధులను కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లకు విభజించి కేటాయింపులు జరిపారు. రైతులకు పవర్ స్ప్రేయర్లు, హ్యాండ్ స్ప్రేయర్లు, కల్టివేటర్లు, నాగళ్లు, డిస్క్లు, కేజ్ వీల్స్, రోటో పడ్లర్, రోటోవేటర్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్స్,స్ట్రా బేలర్స్ వంటి పనిముట్లు అందించనున్నారు. రైతులు తమకు అవసరమైన పనిముట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించనున్నారు. 448 యూనిట్లే..? జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం యాంత్రీకరణకు గ్రీన్సిగ్నల్ ఇవ్వటంతో రైతుల్లో ఆశలు రేకెత్తాయి. ప్రభుత్వంఅరకొర నిధులు, తక్కువ యూనిట్లు కేటాయించటంతో తమవరకు ఈ పథకాలు వర్తిస్తాయో లేదోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దరఖాస్తులు వేలసంఖ్యలో వచ్చే అవకాశం ఉండగా, జిల్లాలో 448 యూనిట్లు మాత్రమే అందే పరిస్థితి ఉంది. లబ్ధిదారుల ఎంపిక కూడా వ్యవసాయశాఖఅధికారులకు కత్తిమీద సాములా మారనుంది.అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం, స్థానికఎమ్మెల్యేల సిఫారసులు ఉంటేనే యాంత్రీకరణ పథకాలు అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 50శాతం రాయితీతో వ్యవసాయ పనిముట్లు తొలుత మహిళా రైతులకు ప్రాధాన్యం దరఖాస్తులు స్వీకరిస్తున్న వ్యవసాయశాఖ నిధులు పెంచాలని రైతుల డిమాండ్ యాంత్రీకరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి యూనిట్ల సంఖ్యను పెంచాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం మొక్కుబడిగానే నిధులు కేటాయించటం సరికాదని పేర్కొన్నారు. ఏడేళ్లుగా యాంత్రీకరణకు నిధులు కేటాయించకపోవటంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులు పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. కనీసం ఏజెన్సీ ప్రాంతాలలోనైనా యాంత్రీకరణకు ఎక్కువ నిధులు కేటాయించాలని గిరిజన రైతులు కోరుతున్నారు. -
వాటర్ బాటిళ్లు ఏమయ్యాయి?
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగులకు తాగునీరు సమకూర్చేందుకు గాను గతంలో విధులు నిర్వర్తించిన కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సుమారు 200 వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయించారు. అందరూ మిషన్ భగీరథ నీటినే తాగాలనే ఉద్దేశంతో వీటిని సమకూర్చారు. అయితే, అప్పుడొకటి.. ఇప్పుడొకటి అన్నట్లు బాటిళ్లు మాయమవుతుండగా ప్రస్తుతం 50కూడా లేవని సమాచారం. ప్రస్తుత కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కలెక్టరేట్ను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చాలనే లక్ష్యంతో శాఖల వారీగా ఎన్ని స్టీళ్లు బాటిళ్లు కావాలో నివేదిక ఇవ్వాలని సూచించారు. దీంతో గతంలో కొనుగోలు చేసిన బాటిళ్లపై అధికారులు ఆరా తీయగా 200కు గాను 150మేర కనిపించడం లేదని తేల్చినట్లు సమాచారం. దీంతో ఈ బాటిళ్లు ఎవరు తీసుకెళ్లారు, ఎలా మాయమయ్యాయనే అంశంపై కలెక్టరేట్లో చర్చ జరుగుతోందిఖమ్మం కలెక్టరేట్లో 150కిపైగా సీసాలు మాయం -
రైతుకు లాభాలు పెంచడమే లక్ష్యం
● అధికారుల అవగాహనతో ఫలితాలు ● వ్యవసాయ విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైరా: పంటల సాగునే నమ్ముకున్న రైతులు లాభాలు ఆర్జించడమే ధ్యేయంగా అధికారులు అవగాహన కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన మధ్య తెలంగాణ(ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్) మండల వ్యవసాయ పరిశోధనా విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15, 20ఏళ్లుగా రైతుల ఆదాయం గణనీయంగా తగ్గుతోందన్నారు. గతంలో వరిపై ఎకరాకు రూ.40వేల ఆదాయం వస్తే ఇప్పుడు రూ.20వేలు కూడా రావడం లేదన్నారు. దీనికి తోడు వాతావరణ మార్పులతోనూ వారు నష్టపోతున్నారన్నారు. ఈమేరకు ఆయిల్పామ్, కూరగాయలు, డ్రాగన్ ప్రూట్ తదితర పంటలు సాగు చేయడం, ఆధునిక విధానాలు పాటించడంపై ఎప్పటికప్పుడు వివరించాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ బలరామ్, విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాదాద్రి, మధ్య తెలంగాణ రీజియన్ సహాయ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, డీడీఏ సింగారెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మాలతి, మధిర వ్యవసాయ పరిఽశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రుక్మిణీదేవి మాట్లాడారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం డైరెక్టర్లు, వివిధ విభాగాల శాస్త్రవేత్తలు, ఉమ్మడి ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాల వ్యవసాయ అనుబంధ ఽశాఖల అధికారులు, ఆర్ఈఏసీ సభ్యుడు రాణాప్రతాప్, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. -
వారికి ‘ఆధారం’ లేదు
కేంద్ర ప్రభుత్వం జారీ చేసే అత్యున్నత గుర్తింపు కార్డుల్లో ఒకటైన ఆధార్ లేక గిరిజన దంపతులు మూడేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్యాలయం మొదలు కలెక్టరేట్ వరకు చెప్పులరిగేలా తిరుగుతున్నా వారి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం●హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర అక్షరాస్యత 75 శాతంగా ఉంటే జిల్లా సగటు 73 శాతంగా ఉంది. జిల్లాలో 43 శాతం అడవులే ఉన్నాయి. గిరిజన జనాభానే ఎక్కువ. గ్రామస్థాయిలో పరిష్కారం కాని సమస్య కోసం ఐడీఓసీలో నిర్వహించే గ్రీవెన్స్కు వస్తున్నారు. అయితే దరఖాస్తులు ఎలా రాయాలో తెలియక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్న సమస్యలకే మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో గ్రీవెన్స్సెల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ●ఆర్థికంగా అండ కావాలి కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన జిమ్మిడి శ్రీనుకు ప్రస్తుతం 47 ఏళ్లు. ఇరవై ఏళ్ల క్రితం వరకు జీవితం సాఫీగానే సాగింది. ఆయనకు 27 ఏళ్లు ఉన్నప్పుడు కనుబొమ్మ దగ్గర నొప్పి రాగా, ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించింది. నాటి నుంచి కన్ను, కాలు, చేయి పని చేయకుండాపోయాయి. అప్పటి వరకు అరెకరం సొంత పొలానికి తోడు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయగా.. అతడి జీవితానికి బ్రేకులు పడ్డాయి. అయినా నమ్మకం కోల్పోకుండా ఇంటి వద్దే కిరాణా షాపు పెట్టుకుంటే నష్టాలు రావడంతో అది మూతబడింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులపైనే ఆధారపడి జీవిస్తున్నాడు. ప్రస్తుతం తాటిగూడెం వరకు నాణ్యమైన రోడ్డు నిర్మిస్తుండగా.. ఆ పని పూర్తయి రోడ్డు బాగుంటే కిరాణా షాపు మళ్లీ పుంజుకుంటుందని, తద్వారా తన కాళ్లపై తాను నిలబడే అవకాశం వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. అయితే షాపు ఏర్పాటుకు అవసరమైన రుణం ఇప్పించాలని గ్రీవెన్స్కు వచ్చి అధికారులను వేడుకున్నాడు.●ఆగిన సంక్షేమం పాల్వంచ మండలం పాండురంగాపురంలో వాంకుడోతు మోంగ్య, భద్రి దంపతులు జీవిస్తున్నారు. ఇద్దరిదీ ఇదే గ్రామం. ఇక్కడే పెళ్లి చేసుకుని, ఇన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఓటరు గుర్తింపు కార్డులో మోంగ్య 1951లో పుట్టినట్టుగా వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో ఈ కుటుంబ సభ్యులకు ఆధార్కార్డులు కూడా వచ్చాయి. దీంతో పాటు ప్రభుత్వం అందించే ఉపాధిహామీ పథకం, ఆసరా పింఛన్లు, రేషన్ బియ్యం వంటి సంక్షేమ పథకాలూ అందాయి. కానీ మూడేళ్ల క్రితం మోంగ్య, భద్రిల ఆధార్లో సమస్యలు వచ్చాయి. బయోమెట్రిక్ హాజరు నమోదైన తర్వాత వీరి వేలి ముద్రలు ఆధార్తో మ్యాచ్ కావడం లేదు. దీంతో గత మూడేళ్లుగా ఉపాధి హామీ, పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు. వయసు పైబడి, ఒంట్లో శక్తి సన్నగిల్లుతున్న తరుణంలో ఈ సమస్య రావడంతో ఇబ్బంది పడుతూనే ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఓటర్ ఐడీలు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న జిరాక్స్ కాపీలు పట్టుకుని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిరక్షరాస్యులైన ఈ దంపతులకు ఎదురైన సాంకేతిక సమస్యకు జిల్లా ఉన్నతాధికారులే పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డుల్లేక రెండేళ్లుగా ఇబ్బందులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు గ్రీవెన్స్లో అయినా పరిష్కారం దొరుతుందనే ఆశ.. -
భద్రగిరి అభివృద్ధికి హామీలిచ్చేనా..?
● శ్రీరామనవమికి సీఎం రాక దాదాపు ఖరారు ! ● డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తావనపై ఆశలు భద్రాచలం: శ్రీరామనవమికి సీఎం హాజరు కావాలనే భద్రాచలం వాసుల కోరిక ఈ ఏడాది తీరనుంది. ‘నవమికి సీఎం సారొస్తార’ని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీనికి తోడు కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డిని ఆలయ ఈఓ, వైదిక కమిటీ ఆహ్వానించిన సమయంలో అభివృద్ధి, భూ సేకరణపై ఆయన అధికారులను ఆరా తీయడంతో దాదాపుగా సీఎం హాజరవుతారని ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్కు ఉన్నతాధికారులు సమర్పించే నివేదికలో సామాన్య భక్తులకు అందించాల్సిన వసతులు, డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, నిధుల మంజూరు వంటి అంశాలను కూడా పొందుపర్చాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. భూసేకరణపై ఆరాతో ఆశలు.. ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలుత మాఢ వీధుల విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు భూ సేకరణకు అవసరమైన నిధులు కేటాయిస్తూ జీఓ విడుదల చేసింది. దీంతో ఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి భూ సర్వేతో పాటు ఇళ్ల స్థలాలు కోల్పోతున్న వారితో సంప్రదింపులు చేశారు. అయితే ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా భూ, ఇళ్ల నిర్వాసితులకు అందాల్సిన నిధులు మాత్రం విడుదల కాలేదు. కాగా ఆదివారం భద్రాచలం వచ్చిన మంత్రి పొంగులేటి కల్యాణానికి సీఎం వస్తారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మాఢ వీధుల విస్తరణ, అభివృద్ధి పనులకు కల్యాణం రోజునే ప్రారంభోత్సవం చేస్తారని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు నిర్వాసితులకు మూడు రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిని ఆలయ అధికారులు కలిసినప్పుడు కూడా అభివృద్ధి పనులు, భూ సేకరణ వివరాలను ఆయన అడిగారు. పటిష్ట నివేదిక, ప్రణాళిక అందజేయాలని ఆదేశించారు. అయితే నష్టపరిహారం చెల్లింపునకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాల్సి ఉంది. నివేదికలో ఇవి పొందుపరిస్తే మేలు.. భద్రాచలం ఆలయ అభివృద్ధికి అధికారులు అందజేసే నివేదికలో పట్టణ అభివృద్ధిపై సైతం పొందుపర్చాలని స్థానికులు కోరుతున్నారు. వారి డిమాండ్లు ఇలా ఉన్నాయి. ●రామాలయ అభివృద్ధికి పటిష్ట మాస్టర్ ప్లాన్ రూపొందించాలి ●ఆలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులకు అసరమైన వసతులపై దృష్టి సారించాలి ●భక్తుల వసతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి ●భద్రాచలంతో పాటు పర్ణశాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి ●అధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను కలిపేలా స్పెషల్ కారిడార్ రూపొందించాలి ●ఆలయంతో పాటు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలి ●గోదావరి వరదల సమయంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలను ముంపు నుంచి తప్పించేందుకు కరకట్ట ఆధునికీకరణకు చర్యలు చేపట్టాలి ●కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ప్రసాద్ పథక అమలు తీరును నిరంతరం పర్యవేక్షించేలా సమన్వయం చేయాలి ●ఏపీలోని పురుషోత్తపట్నంలో ఉన్న రామయ్య భూముల విషయంలో న్యాయపరమైన చిక్కులు తొలగేలా చర్యలు తీసుకోవాలి ●ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించాలి. తద్వారా భద్రాచలం అభివృద్ధికి అవసరమైన స్థల సమస్య తీరుతుంది. -
ఎట్టకేలకు కార్పొరేషన్ !
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం ప్రాంతం జనాభా వైశాల్యం కొత్తగూడెం 97,337 15.87 చ.కి.మీ పాల్వంచ 89,721 40.87 చ.కి.మీ సుజాతనగర్ 11,124 28.48 చ.కి.మీమొత్తం 1,98,182 85.22 చ.కి.మీ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ – కొత్తగూడెం మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను ఏకం చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 18న కొత్తగూడెం కార్పొరేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. సోమవారం చర్చను ప్రారంభించారు. ఓటింగ్లో మెజారిటీ సభ్యుల సమ్మతితో బిల్లు ఆమోదం పొందినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేయగానే చట్టంగా మారుతుంది. ఆ వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అప్పటి నుంచి కొత్తగూడెం – పాల్వంచ – సుజాతనగర్ (ఏడు గ్రామ పంచాయతీలు)తో కూడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధి పద్దు కింద కొత్తగూడెం కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం విదితమే. ఎన్ఎండీసీపై దృష్టి పెట్టాలి.. పాల్వంచలో ఎన్ఎండీసీకి చెందిన 500 ఎకరాల స్థలాన్ని వినియోగంలోకి తేవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీరో అవర్ సందర్భంగా జిల్లాకు సంబంధించిన కీలక అంశాలను ఆయన సభలో ప్రస్తావించారు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమకు ఒకప్పుడు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు ఉండేదని, ఈ పరిశ్రమ మూతపడిన తర్వాత ఈ స్థలం ఎన్ఎండీసీ పరిధిలో నిరుపయోగంగా ఉందని కూనంనేని తెలిపారు. దీన్ని ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమపై కూడా నిర్ణయం తీసుకోవాలని కోరారు. చర్చకొచ్చిన షెడ్యూల్ సమస్యలు.. షెడ్యూల్ ఏరియాల్లో గౌడలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అయితే కల్లు గీసే విషయంలో వారికి ఎలాంటి హక్కులు లేవని, స్థానిక సర్దుబాటుతోనే గీత కార్మికులు పని చేస్తున్నారని కూనంనేని అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగినప్పుడు గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. షెడ్యూల్ ఏరియాలో గీత కార్మికులను ఆదుకునే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. దీంతో పాటు సింగరేణి ప్రాంతాల్లో క్రమబద్ధీకరణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన జీఓ 76ను వేగంగా అమలు చేస్తే ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంబ సత్రం భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు లేక రైతు భరోసా పొందలేకపోతున్నారని తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమయ్యే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి హామీ పథకం వర్తించేలా చూడాలని కోరారు.అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు ఎన్ఎండీసీ, బయ్యారం ఉక్కు, జీవో 76పైనా చర్చ షెడ్యూల్ ఏరియా సమస్యల ప్రస్తావన బడ్జెట్ సమావేశాల్లో ‘భద్రాద్రి’ సంగతులుఅందరికీ ధన్యవాదాలు కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సహకరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు. మున్సిపల్ అధికారులు దానకిశోర్, శ్రీదేవి, గౌతమ్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు ధన్యవాదాలు. కొత్తగూడెం ప్రజల తరఫున సీఎం రేవంత్రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్. కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయంతో పాతికేళ్ల తర్వాత పాల్వంచలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. –కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే -
పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
● రోయింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచన ● పగిడేరులో జియోథర్మల్, తుమ్మలచెరువు సందర్శనమణుగూరు టౌన్/అశ్వాపురం : మణుగూరు మండలంలోని కొండాయిగూడెం వద్ద గోదావరి, రథంగుట్ట, సింగరేణి, అంబేద్కర్ పార్క్, పగిడేరు జియోథర్మల్ను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం మణుగూరులో పర్యటించిన ఆయన జియోథర్మల్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం సాంబాయిగూడెం ఇసుక క్వారీ వద్ద లారీ యజమానులతో మాట్లాడారు. పరిమితికి మించి ఇసుక లోడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోడింగ్ వద్ద డబ్బులు వసూలు చేస్తే చర్య తప్పదని హెచ్చరించారు. అంతకుముందు అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత నెల్లిపాకలో మండ్రు నాగసుధీర్ అనే రైతు సాగు చేస్తున్న మునగ పంటను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మునగకాయలతో పాటు ఆకు కూడా అమ్మి ఆర్థికాభివృద్ధి సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలచెరువు వద్ద రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్న అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు యలమంచిలి కిరణ్తో మాట్లాడారు. శిక్షణకు ఎంత మంది వస్తున్నారు.. యువకులు ఆసక్తి చూపుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారజల కర్మాగారంలో.. మణుగూరు భారజల కర్మాగారాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. జీఎం హెచ్కే.శర్మ, అధికారులతో సమావేశమై పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. గోదావరి నుంచి నీరు సేకరించి భారజలం ఉత్పత్తి అయ్యాక మిగిలే నీటిలో మినరల్స్ కలిపి వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మణుగూరు, అశ్వాపురం తహసీల్దార్లు రాఘవరెడ్డి, స్వర్ణలత, ఎంపీడీఓలు శ్రీనివాస్, వరప్రసాద్, ఏపీఎం సత్యనారాయణ, ఎంపీఓ ముత్యాలరావు, ఆర్ఐ లావణ్య, ఈఓఆర్డీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్పీకి సీఆర్పీఎఫ్ అధికారుల అభినందనకొత్తగూడెంటౌన్: జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తూ గత లోక్సభ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేసిన ఎస్పీ రోహిత్రాజును సీఆర్పీఎఫ్ ఐజీపీ చారూసిన్హా అభినందించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసాపత్రం అందజేశారు. మావోయిస్టు ప్రభావిత జిల్లా అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసి సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించారని ప్రశంసించారు. కాగా, జిల్లాలో పోలీసులతో పాటు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని ఎస్పీ తెలిపారు. స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా రాజమల్లుకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్గా మెండు రాజమల్లును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ద్వారా సోమవారం ఆయన అందుకున్నారు. అనంతరం చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జిల్లా జడ్జి పాటిల్ వసంత్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.భానుమతి, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, సీనియర్ న్యాయవాదులు పలివెల సాంబశివరావు, రమేష్కుమార్, సూరెడ్డి రమణారెడ్డి, గాదె సునంద పాల్గొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యందుమ్ముగూడెం : అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా తమ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని లచ్చిగూడెం సబ్స్టేషన్లో నూతన బ్రేకర్ను ప్రారంభించారు. గతంలో లచ్చిగూడెం – గుర్రాలబైలు గ్రామాలకు కలిపి ఒకటే బ్రేకర్ ఉండగా విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడేది. దీంతో నూతన బ్రేకర్ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఈ జీవన్కుమార్, ఏడీఈ ప్రభాకర్రావు, ఏఈ మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
భద్రాచలం: అర్హులైన ప్రతీ గిరిజనుడికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్కు హాజరైన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. వారి వినతులను యూనిట్ అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అర్హులైన గిరిజన కుటుంబాలకు విడతల వారీగా సంక్షేమ పథకాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన క్రీడా సామగ్రి పంపిణీ చేయాలి టెండర్ నిబంధనల మేరకు విద్యార్థులకు నాణ్యమైన క్రీడా సామగ్రి, దుస్తులు సరఫరా చేయాలని పీఓ టెండర్దారులకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ క్రీడా పాఠశాలలకు సరఫరా చేసే టీ షర్ట్, షార్ట్, ట్రాక్ షూట్ క్రీడా సామగ్రి టెండర్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. టెండర్ సమయంలో చూపిన శాంపిల్ ప్రకారమే సరఫరా చేయాలని, కోచ్లు, ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారి లైసెన్స్లు రద్దు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గిరిజన మ్యూజియంలో పనులు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాలల్లో ఐటీడీఏ ఏపీఓ జనరల్ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ ఉదయభాస్కర్, ఉద్యానవనాధికారి ఉదయ్కుమార్, ఏపీఓ వేణు, లక్ష్మీనారాయణ, సమ్మయ్య, ఆదినారాయణ పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీ.. ములకలపల్లి : మండల పరిఽధిలోని కమలాపురం ఆశ్రమ పాఠశాల హాస్టల్ను పీఓ రాహుల్ సోమవారం రాత్రి తనిఖీ చేశారు. హాస్టల్లోని మొదటి అంతస్తు గదిలో షార్ట్సర్క్యూట్తో క్రీడా వస్తువులు, పాత పరుపులు దగ్దమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఓ హాస్టల్ను సందర్శించి ఘటన వివరాలపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
హోమియో వైద్యానికి ఆదరణ
● మొగ్గుచూపుతున్న దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు ● ఉమ్మడి జిల్లాతోపాటు ఏపీ నుంచీ చికిత్స కోసం వస్తున్న రోగులు చండ్రుగొండ : హోమియో వైద్యానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో ఓ విభాగమైన హోమియో వైద్యం వైపు బాధితులు మొగ్గుచూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వరకు హోమియో వైద్యకేంద్రాలు ఉన్నాయి. అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, చండ్రుగొండ, కల్లూరు, పెనుబల్లి, మధిర, కూసుమంచి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు ఏపీ నుంచి కూడా బాధితులు చండ్రుగొండ కేంద్రానికి వచ్చి చికిత్స పొందుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వస్తున్నట్లు ఇక్కడి డాక్టర్ పానం ప్రవీణ్కుమార్ తెలిపారు. రోజుకు ఓపీ 150 నమోదవుతుందని, ఇప్పటివరకు ఇక్కడ 12 వేల మందికి చికిత్స పొందారని పేర్కొన్నారు. బీపీ, షుగర్, కీళ్లవాతం, థైరాయిడ్, కిడ్నీల్లో రాళ్ళు, మైగ్రెయిన్, సొరియాసిస్, తామర, సైనసిస్, ఆస్తమా జ్వరం తర్వాత వచ్చే నొప్పులు తదితర సమస్యలతో బాధపడేవారు, మహిళకు సంబంధించి అండాశయంలో నీటిబుడగలు, గర్భాశయ సమస్యలు, రుతు సమస్యలు ఉన్నవారు వచ్చి చికిత్స పొందుతున్నారు. సాధారణంగా కేంద్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుందని, రోగుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కో రోజు రాత్రి 8 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. వైద్యుడికి అదనంగా ఇన్చార్జి బాధ్యతలు చండ్రుగొండ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రవీణ్కుమార్కు కొన్ని నెలలక్రితం శాఖ ఉన్నతధికారులు కల్లూరు మండలం చినకోరుకొండిలోని వైద్యకేంద్రం బాధ్యతలను అదనంగా అప్పగించారు. దీంతో వారంలో మూడు రోజులు చండ్రుగొండలో, మరో మూడురోజులు చినకోరుకొండిలో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఫలితంగా ఇక్కడకు వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అయినా పరిష్కారం కాలేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
రాజ్యాంగ పరిరక్షణకు కదలిరావాలి
కొత్తగూడెంఅర్బన్: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కదలిరావాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తగూడెంలోని కేసీఓఏ క్లబ్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్య అధ్యక్షతన జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ జిల్లాస్థాయి సదస్సుల మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న రాజ్యాంగాన్ని తొలగించేందుకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఇరిగేషన్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, కొప్పుల చంద్రశేఖర్, చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ హాస్టల్లో అగ్ని ప్రమాదం
ములకలపల్లి: మండల పరిధిలోని కమలాపురం ఆశ్రమ హాస్టల్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు సమాచారం. గదిలో ఉన్న పాత పరుపులు, క్రీడా వస్తువులు దగ్ధమయ్యాయి. స్థానికులతో సమాచారంతో కొత్తగూడెం నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆదివారం కావడంతో విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉన్నారు. అయితే ప్రమాద సమయంలో గ్రౌండ్ఫ్లోర్లో స్టడీ అవర్స్లో ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. కాగా రూ. 30 వేల నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాదా ఘటనపై ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆరా తీశారు. -
పర్ణశాలను సందర్శించిన న్యాయమూర్తి
దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచవటీ కుటీరం, సీతమ్మవారి నారచీరల ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతలను తెలుసుకున్నారు. ముందుగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.అఽథ్లెటిక్స్లో జిల్లాకు ఐదు పతకాలుకొత్తగూడెంటౌన్: తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు ఐదు పతకాలు వచ్చాయని జిల్లా అఽథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.మహీధర్ తెలిపారు. ఈ మేరుకు ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరుగుపందెంలో జర్పుల దీక్షిత్ బంగారు పతకం, మాలోతు సింధు రజత పతకం, డి.లోకేష్, బి.దుర్గ కాంస్య పతకాలు, జావెలిన్లో ఎం.కృష్ణవేణి కాంస్య పతకం సాధించారని వివరించారు. విజేతలను జిల్లా క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు కె.సారంగపాణి, యుగంధర్రెడ్డి, రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణ, పి.నాగేందర్, మల్లికార్జున్, గిరిప్రసాద్, జి,కృష్ణ, జె. నాగరాజు, కోచ్లు అభినందించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలిఖమ్మం సహకారనగర్ : రాష్ట్రంలో ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభవాని కోరారు. నగరంలోని సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పూర్వ ప్రాథమిక పాఠశాలల వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సౌలభ్యం కలుగుతుందని, పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రెండో వేతన సవరణ సంఘం రిపోర్టును తెప్పించి 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, వల్లకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లిఫ్ట్ ప్రమాద ఘటనపై విచారణఖమ్మంవైద్యవిభాగం : నగరంలోని ప్రసూన ఆస్పత్రిలో లిఫ్ట్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రిలో అపరేషన్ అనంతరం సరోజని(62) అనే మహిళను అపరేషన్ థియేటర్ నుంచి లిఫ్ట్ ద్వారా తరలించే క్రమంలో స్ట్రెచర్ పైనే ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నిమిత్తం డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సైదులు విచారణ నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలపై సిబ్బందితో ఆరా తీశారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు డాక్టర్ సైదులు తెలిపారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి నివేదించనున్నట్లు వివరించారు. ఆస్పత్రిలో లిఫ్ట్ స్థితిగతులు, కంపెనీ వివరాలు, ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు, ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాలపై నివేదిక సమర్పించాలని ఆస్పత్రి యాజమాన్యానికి నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి నివేదిక వచ్చాక యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లి, తనయుడు మృతి
● బైక్ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం ● మృతులు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వాసులు దమ్మపేట: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో తల్లి, తనయుడు మృత్యు ఒడిలోకి చేరుకున్న ఘటన దమ్మపేట మండలం గాంధీనగరం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన అరిసెపల్లి కృష్ణ(45), తల్లి సరస్వతి(65)తో కలసి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గాంధీనగర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లీ, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్లో ఆశ్వారావుపేటకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
దమ్మపేట: కుటుంబ సభ్యులు మందలించడంతో మద్యం మత్తులో ఓ యువకుడు శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పార్కలగండి గ్రామానికి చెందిన కొండ్రు శివ(19) మద్యానికి బానిసగా మారడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంటి పైకప్పు ఊచకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో కిందకు దింపి చూడగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి సీతారాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. గోదావరిలో దూకి మరొకరు..భద్రాచలంఅర్బన్: పట్టణంలో బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం సరిహద్దున ఉన్న ఎటపాక గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈ నెల 20న ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి అదే రోజు రాత్రి బ్రిడ్జి మీద నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం నదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వగా, పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు చేర్పించారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు వివరాలతో కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా అనిల్ భార్య పదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల మతిస్థిమితం కోల్పోయాడని, ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బావిలో విషం.. చేపలు మృతినేలకొండపల్లి: మండలంలోని మోటాపురం (బీల్యాతండా) గ్రామానికి చెందిన భూక్యా వీరు అనే రైతు తన వ్యవసాయ బావిలో గతేడాది క్రితం చేప పిల్లలు పోశాడు. ప్రస్తుతం అవి ఒక్కోటి సుమారు 2 కిలోల వరకు పెరిగాయి. మరో రెండు, మూడు రోజుల్లో చేపలు పట్టి విక్రయించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బావిలో పురుగుల మందు కలపగా చేపలు మొత్తం ఆదివారం మృత్యువాత పడ్డాయని, దాదాపు రూ. లక్ష మేర నష్టపోయానని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. యువకుడి ఆత్మహత్యాయత్నంపాల్వంచరూరల్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మల్లారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కుమారుడు ఈసం విజయ్ గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ పని చేస్తునానడు. ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబీకులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెల్ టవర్ వద్ద అగ్నిప్రమాదంబూర్గంపాడు: నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలోని సెల్ టవర్ వద్ద ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెల్ టవర్ పక్కన ఉన్న పంటచేలలోని వ్యర్థాలను కాలుస్తున్న క్రమంలో మంటలు టవర్ వరకు వ్యాపించాయి. మంటలు అంటుకుని టవర్ ఫైబర్ కేబుల్స్ కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో వచ్చిన భద్రాచలం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా కేబుల్స్ కాలిపోవటంతో స్నిగల్స్కు స్వల్ప అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. -
సామాన్యులకు ‘ఇసుక’ కష్టాలు
● ఇళ్లు నిర్మించుకునేందుకు తప్పని తిప్పలు ● పట్టించుకోని సంబంధిత అధికారులు మణుగూరు రూరల్ : పక్కనే గోదావరిలో ఇసుక పుష్కలంగా ఉన్నా సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయింది. దీంతో ఇంటి నిర్మాణాలకు మణుగూరు మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదే దళారులకు అడిగినంత చెల్లిస్తే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా లారీల కొద్దీ ఇసుక సరఫరా చేస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.500 నుంచి రూ.800 ఖర్చు చేస్తే, ప్రస్తుతం రూ.2వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయలేకపోవడంతో ప్రజలు దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలంలోని చినరాయిగూడెం, అన్నారం, కొండాయిగూడెం వంటి గోదావరి తీర ప్రాంతాల్లో ఇసుక రీచ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్ల కట్టడాలు, ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతుండటంతో ఇసుక డిమాండ్ ఎక్కువే ఉంది. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే ఇసుక సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీంతో ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు దళారులను ఆశ్రయించి రూ.లక్షలు చెల్లించాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. లేకపోతే ఇసుక లేక నిర్మాణాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. నిర్మాణాలకు సిమెంట్, ఐరన్, కంకర కొనుగోలు చేయడం కంటే ఇసుక కొనుగోలు చేయడమే భారంగా మారిందని గృహ నిర్మాణదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సామాన్యులకు ఇసుక లేకపోవడంతో నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెబుతుందే.. కానీ ఆ దిశగా చర్యలు మాత్రం కనబడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీ సీజ్పాల్వంచరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని రెవెన్యూ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. మండల పరిధిలోని నాగారం గ్రామం నుంచి ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు తహసీల్దార్ వివేక్ తెలిపారు. శనివారం రాత్రి జగన్నాథపురం వద్ద మట్టిని తరలిస్తున్న మరో రెండు లారీలను పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
ఘనంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గోటి తలంబ్రాల సమర్పణభద్రాచలంటౌన్: భద్రాచలం రామాలయంలో జరిగే స్వామివారి కల్యాణంలో వినియోగించే తలంబ్రాలను భక్తులు ఆదివారం సమర్పించారు. భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన భక్త రామదాసు భక్త మండలి సభ్యులు స్వామివారి ప్రత్యేక పండించిన కోటి వరి ధాన్యం గింజలను భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచి ఆలయానికి తీసుకొచ్చి అప్పగించారు. వీరు ఎనిమిదేళ్లుగా తలంబ్రాలు అందజేస్తున్నారు. ఆలయ పీఆర్వో సాయిబాబా, భక్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రామాలయంలో రంగారెడ్డి ఎస్పీ పూజలుభద్రాచలంటౌన్: శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని రంగారెడ్డి ఎస్పీ పరితోష పంకజ్ ఆదివారం కుటుంబ సమేతంగా సందర్శించారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఎస్పీకి స్వామివారి జ్ఞాపికతో పాటు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్ఐ మధు ప్రసాద్, ఆలయ పీఆర్వో సాయిబాబా, వేద పండితులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేషపూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు.నేడు ప్రజావాణిసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని కోరారు. ఆలయానికి రూ.1.20 లక్షల విరాళంజూలూరుపాడు: పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వర ఆలయ అభివృద్ధి, మరమ్మతులకు గ్రామానికి చెందిన బండ్ల వెంకటరామ రఘు, శ్రీదేవీ దంపతులు రూ.1.20 లక్షలను ఆదివారం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పూసాల శ్రీనివాసాచారి, బండ్ల మధుసూదన్రావు, నిమ్మటూరి కనకయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ పాదాలకు వందనం
● ఇటీవల గాయపడి తల్లి మృతి ● మెటల్తో పాదముద్రలను తయారు చేయించిన కుమారుడు పాల్వంచ: తల్లి మృతి చెందాక పాదముద్రలను మెటల్ తయారు చేయించి అమ్మపై ప్రేమను చాటుకున్నాడో కుమారుడు. పాల్వంచలో ఈ విశేషం జరిగింది. పట్టణంలోని మార్కెట్ ఏరియాకు చెందిన బాలాజీ ఫొటో స్టూడియో నిర్వాహకుడు అల్లి శరత్ తల్లి లక్ష్మి(55) ఇటీవల కిందపడి గాయపడి కోమాలోకి వెళ్లింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని, ఎక్కువ కాలం బతకదని చెప్పారు. దీంతో కుమారుడు నిపుణులను పిలిపించి తల్లి పాదముద్రలను సేకరించి మెటల్తో తయారు చేయించాడు. కాళ్లకు మెట్టెలు, తల్లి పట్టీలను అమర్చాడు. కాగా లక్ష్మి మృతి చెందగా ఆదివారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి ఫొటోలు, పాదముద్రలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా, పలువురు ఆసక్తిగా తిలకించారు. -
ఇంట్లో మొక్కలు పెంచుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: ఇంట్లో మొక్కలు పెంచుకుని ఆరోగ్యం కాపాడుకుందామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఆదివారం ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో జరిగిన ప్రకృతి–ఆరోగ్య మహాసభల్లో మాట్లాడారు. చిన్నతనంలో తన తండ్రి మొక్కలు నాటేవారని పేర్కొన్నారు. మునగ ఆకుకు ప్రపంచంలో అమితమైన డిమాండ్ ఉందని అన్నారు. మెడిసినల్ ప్లాంట్స్, కూరగాయ మొక్కలు, ఆకుకూరలను ఇంటిపంటగా పెంచుకుంటే పురుగు మందులు లేని ఆహారం తినవచ్చని చెప్పారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు జయరాజు మాట్లాడుతూ గ్రీన్ ప్రపంచాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆరోగ్యం, ఆనందం కోసం ప్లాస్టిక్ నిర్మూలన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, సుగుణారావు, డి.సత్యనారాయణ, డాక్టర్ అనిల్ కుమార్ తంబరేణి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య, శనగ వెంకటేశ్వర్లు, డాక్టర్ లక్ష్మణస్వామి, గోనే శ్రీకాంత్, టూమట్ల వెంకన్న పాల్గొన్నారు. -
సమయం ఆసన్నం
వచ్చే నెల 1 నుంచి సన్నబియ్యం పంపిణీ ● జిల్లాలో 2,93,263 మంది రేషన్ కార్డుదారులకు లబ్ధి ● పంపిణీ ప్రక్రియపై కొనసాగుతున్న సమావేశాలు ● కొత్త రేషన్కార్డుల మంజూరుపైనా కసరత్తు కొత్తగూడెంఅర్బన్: పేద ప్రజలకు వచ్చే నెల నుంచి ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం అందించనుంది. ఉగాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని గతంలోనే ప్రకటించగా, దీనిపై పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు దొడ్డు బియ్యం అందిస్తుండగా కొందరు లబ్ధిదారులు తినలేక దళారులకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం రానుండటంతో కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెరగనున్న రేషన్కార్డులు జిల్లాలో గత జనవరిలో 1,203 కార్డులు కొత్తగా మంజూరు చేశారు. నూతన కార్డుల లబ్ధిదారులకు ఫిబ్రవరి నుంచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం గతం కంటే 7,152 కిలోల బియ్యాన్ని అదనంగా రేషన్షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇక ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, గతంలో పెండింగ్లో ఉన్నవి మొత్తం కలిసి మరో 34 వేల మందికి కొత్తగా కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 2,93,263 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో కార్డులేని కుటుంబాలు దశాబ్దకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. స్కాలర్షిప్, ఆరోగ్యశ్రీ,సేవలు, ఆదాయ సర్టిఫికెట్, రుణాలు పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో కొత్త కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ నుంచే అందించే అవకాశం జిల్లాలో ఏప్రిల్ నెల నుంచి రేషన్కార్డుల లబ్ధిదారులకు సన్నబియ్యం అందించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియపై రాష్ట్ర అధికారులు వీడియో, టెలీకాన్ఫరెన్స్లు నిర్వహిస్తున్నారు. కొత రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. –రుక్మిణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారిమార్కెట్లో అధిక ధరలతో.. మార్కెట్లో సన్నబియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. క్వింటా సన్న బియ్యం రూ.6 వేల నుంచి మొదలుకుని రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం అందిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించనుంది. కాగా ప్రజాపాలన గ్రామసభల్లో రేషన్కార్డుల కోసం 34 వేల దరఖాస్తులు, మార్పులు, చేర్పుల కోసం మరో 20 వేల దరఖాస్తులు రాగా, ఆ ప్రక్రియ పూర్తి చేసే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని రేషన్కార్డుల వివరాలు రేషన్షాపులు 443 ఆహారభద్రత కార్డులు 2,72,112 అంత్యోదయ 21,148 అన్నపూర్ణ కార్డులు 3 మొత్తం కార్డులు 2,93,263 ప్రతీనెల అందించే బియ్యం 5,384.762 మెట్రిక్ టన్నులు ఇటీవల మంజూరైన కార్డులు 1203 కొత్తగా వచ్చిన దరఖాస్తులు 34,083 మార్పులు చేర్పుల దరఖాస్తులు 20,000 -
జిల్లాలో టీబీ సేవలు భేష్
రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి.. కొత్తగూడెంఅర్బన్: రాష్ట్రస్థాయిలో క్షయ విభాగంలో ఉత్తమసేవలు అందించినందుకు జిల్లాకు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. శనివారం రాత్రి హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ, రాష్ట్ర క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ రాజేశం చేతులమీదుగా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ బాలాజీనాయక్ అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. -
డయాలసిస్ సేవలు మెరుగు
● జిల్లాలో ఏడు కేంద్రాల్లో 53 యంత్రాలు ● ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 248 మంది ● మరో 170 మందికి సేవలందించే అవకాశం ఇల్లెందు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడు కేంద్రాల్లో డయాలసిస్ సౌకర్యం కల్పించారు. గతంలో డయాలసిస్ చేయాలంటే పైరవీలు చేయాల్సి వచ్చేది. లేదంటే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేవారు. బాధితులు వారంలో రెండు నుంచి నాలుగు దఫాలు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారికే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం జిల్లాలోని ఏడు ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో అవసరమైన వారందరికీ సేవలు అందుతున్నాయి. ఖాళీ బెడ్లు కూడా ఉంటున్నాయి. కొత్తగూడెం సర్వజన ఆస్పత్రి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ఏరియా హాస్పిటల్, చర్ల, పాల్వంచ సీహెచ్సీలలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీలలో డయాలసిస్ సేవలు అందిస్తున్నాం.ప్రస్తుతం 248 మంది సేవలు పొందుతుండగా, ఇంకా 170 మంది రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి. –డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్డయాలసిస్ సెంటర్లు, యంత్రాలు, ఖాళీల వివరాలు.. సెంటర్ పేరు యంత్రాలు బాధితులు ఖాళీలు జీజీహెచ్, కొత్తగూడెం 10 44 40 ఏరియా ఆస్పత్రి, భద్రాచలం 10 60 25 సీహెచ్సీ, పాల్వంచ 10 41 20 ఏరియా ఆస్పత్రి, ఇల్లెందు 08 32 25 ఏరియా ఆస్పత్రి, మణుగూరు 05 32 10 సీహెచ్సీ, చర్ల 05 10 30 ఏరియా ఆస్పత్రి, అశ్వారావుపేట 05 29 20 మొత్తం 53 248 170 -
పచ్చని చెట్లను పడేశారు..
పాల్వంచరూరల్ : ‘మొక్కలు నాటండి.. చెట్లు పెంచండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి’ అంటూ ప్రభుత్వం నిత్యం ప్రచారం చేస్తుంటే మరోవైపు అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి పెద్ద పెద్ద వృక్షాలను నేలకూల్చుతున్నారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి వెళ్లే రహదారికి ఇరువైపులా హరితహారంలో రూ.లక్షల వ్యయం చేసి రోడ్డు వెంట నాటిన మొక్కలు పెరిగి పెద్దవై ఆయా గ్రామాల ప్రజలకు, పర్యాటకులకు చల్లని నీడను ఇస్తున్నాయి. అయితే పాల్వంచ నుంచి కరకవాగు – కిన్నెరసాని వరకు 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు అడ్డొస్తున్నాయంటూ విద్యుత్ శాఖ అధికారులు రహదారిపై ఉన్న వృక్షాలను నరికేశారు. కొమ్మలు మాత్రమే కొడతామని అటవీ, ఆర్అండ్బీ శాఖల నుంచి అనుమతి పొందిన విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ గత పది రోజులుగా పది కిలోమీటర్ల దూరం వరకు చెట్లను నరికించారు. అయినా అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నరికిన వృక్షాల కలపను సొంతానికి తరలిస్తుండగా సమాచారం అందుకున్న అటవీ అధికారులు వాటిని కలప డిపోకు తరలిస్తున్నారు. కాగా, ఈ విషయమై విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్విభాగం ఏఈ రాజేశ్ను మాట్లాడుతూ.. కిన్నెరసాని రోడ్డులో 33 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లను నరికేందుకు ఆర్అండ్బీ, అటవీ శాఖల అనుమతి తీసుకున్నామని చెప్పారు. -
సమన్వయంతో పనిచేయాలి
భద్రాచలంఅర్బన్: శ్రీరామనవమి వేడుకల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాచమ చంద్రస్వామివారి కల్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని చర్ల రోడ్డులో ఉన్న ఏఎంసీ కాలనీలో అసంపూర్తిగా ఉన్న 117 ఇందిరమ్మ ఇళ్లకు రూ.7.36 కోట్లతో మరమ్మతులకు చేయగా, మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఐటీడీఏ రోడ్డులోని మనుబోతుల చెరువులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రూ.1.40 కోట్లతో నిర్మించిన డీఆర్సీసీ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎండ వేడి అధికంగా ఉన్నందున తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలని, వైద్య సిబ్బంది అవసరమైన మందులు, అంబులెన్స్లో సిద్ధంగా ఉండాలని, అగ్నిపమాక సిబ్బంది ఫైర్ ఇంజన్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో మద్యం షాపులు మూసి వేయించాలని ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. శ్రీరామనవమి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని, అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని, మాడవీధుల విస్తరణ పనులు కూడా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఘనత కాంగ్రెస్దే.. ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్దేనని మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇప్పటికే సీఎం రూ.387 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. గిరిజనులకు కూడా పక్కా ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. రామయ్య ఆశీస్సులతో భద్రాచలం అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. అనంతరం ఐటీడీఏలో ఏర్పాటు చేస్తున్న మ్యుజియాన్ని సందర్శించారు. పెయింటింగ్ చిత్రాలు, పాతకాలపు ఇళ్లు, సెల్ఫీ పాయింట్ను ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీరామనవమి ఏర్పాట్ల పరిశీలన, సమీక్ష -
పట్టు రైతుల విజ్ఞాన యాత్ర
ఖమ్మంవ్యవసాయం: పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన విజ్ఞాన యాత్రలో ఉమ్మడి జిల్లాకు చెందిన 50 మంది పట్టు రైతులు పాల్గొన్నారు. రైతుల బృందం శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింటకుంటలోని మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకం, రేరింగ్ షెడ్లను పరిశీలించింది. ఉమ్మడి జిల్లా పట్టు పరిశ్రమ ఉపంచాలకులు ముత్యాల పర్యవేక్షణలో రైతులు ఈ యాత్రలో పాల్గొనగా, శాస్త్రవేత్తలు వినోద్కుమార్, రాఘవేంద్ర వారికి అవగాహన కల్పించారు. ముత్యాలు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ ఏర్పాటుకు వనరులు ఉన్నాయని, రైతులు ముందుకు రావాలన్నారు. సహా య పట్టు పరిశ్రమ అధికారి దేవరాజు పాల్గొన్నారు. -
శ్రీ వేణుగోపాలస్వామివారి సేవలో డీపీఓ
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామివారిని శనివారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి దంపతులు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీపీఓ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు, పూజారి ఫణి రాజాచార్యులు, ఎంపీఓ తులసిరామ్, చెరుకుమల్లి కృష్ణయ్య, పొన్నెకంటి సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి
మణుగూరురూరల్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక ప్రజల అవసరాల కోసం ఉచితంగా సరఫరా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యాన మణుగూరులోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాక ధర్నా చేశారు. కాంతారావు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సూచిస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా చెక్పోస్టులను బలోపేతం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల, పట్టణ కన్వీనర్లు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, నాయకులు పోశం నర్సింహరావు, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, నర్సింహరావు, మునుకోటి ప్రమీల, రమాదేవి, చంద్రకళ రుద్ర వెంకట్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ వేణుగోపాలస్వామివారి సేవలో డీపీఓ
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామివారిని శనివారం జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి దంపతులు దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శించుకుని పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీపీఓ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు, పూజారి ఫణి రాజాచార్యులు, ఎంపీఓ తులసిరామ్, చెరుకుమల్లి కృష్ణయ్య, పొన్నెకంటి సతీష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
25ఏళ్లపాటు విద్యుత్ కొనుగోలు చేస్తాం..
సౌరప్లాంట్లపై అవగాహన సదస్సులో ఎన్పీడీసీఎల్ సీఎండీఖమ్మంవ్యవసాయం: ఆసక్తి ఉన్న రైతులు పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదక శక్తి, నవీన శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా పీఎం కుసుమ్ పథకాన్ని రూపొందించిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి వెల్లడించారు. ఈ ప్లాంట్ల ద్వారా రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్ను 25ఏళ్ల పాటు సంస్థలు కొనుగోలు చేస్తూ యూనిట్కు రూ.3.13 చెల్లిస్తాయని తెలిపారు. జిల్లాలో సౌరప్లాంట్లకు దరఖాస్తు చేసుకున్న 80 మంది రైతులకు ఖమ్మంలో శనివారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో అదనపు కలెక్టర్ శ్రీజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, టీజీ రెడ్కో మేనేజర్ పి.అజయ్కుమార్ పాల్గొనగా.. హనుమకొండ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ సౌరప్లాంట్ల ఏర్పాటుతో లాభాలను వివరించారు. 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగతంగా లేక సమూహాలుగా ఏర్పాటుచేసుకునే అవకాశముండగా, 33/11 కేవీ సబ్ స్టేషన్లకు ఐదు కిలోమీటర్ల దూరాన స్థలం ఉండాలని చెప్పారు. -
పట్టు రైతుల విజ్ఞాన యాత్ర
ఖమ్మంవ్యవసాయం: పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన విజ్ఞాన యాత్రలో ఉమ్మడి జిల్లాకు చెందిన 50 మంది పట్టు రైతులు పాల్గొన్నారు. రైతుల బృందం శనివారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింటకుంటలోని మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపకం, రేరింగ్ షెడ్లను పరిశీలించింది. ఉమ్మడి జిల్లా పట్టు పరిశ్రమ ఉపంచాలకులు ముత్యాల పర్యవేక్షణలో రైతులు ఈ యాత్రలో పాల్గొనగా, శాస్త్రవేత్తలు వినోద్కుమార్, రాఘవేంద్ర వారికి అవగాహన కల్పించారు. ముత్యాలు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ ఏర్పాటుకు వనరులు ఉన్నాయని, రైతులు ముందుకు రావాలన్నారు. సహా య పట్టు పరిశ్రమ అధికారి దేవరాజు పాల్గొన్నారు. -
లైసెన్స్ ఉండాల్సిందే..
● ప్రజల్లో పెరుగుతున్న అవగాహన.. ● అవసరాన్ని గుర్తించి లైసెన్స్కు క్యూ కడుతున్న యువత ● మూడేళ్లలో 36,243 మందికి డ్రైవింగ్ లైసెన్స్ ● పోలీసులు, ఆర్టీఏ అధికారుల చొరవ కొత్తగూడెంటౌన్: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే శిక్షార్హులు.. రోడ్డెక్కి వాహనం నడపాలి అంటే లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి.. అనే నినాదాలు పనిచేస్తున్నాయి. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు యువతలో మార్పు కనిపిస్తోంది. లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని యువత భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో లైసెన్స్ కోసం వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజూ ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతుండడం, లైసెన్స్ లేకుంటే పడే శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండటం.. ప్రమాదంతోపాటు లైసెన్స్ లేకుంటే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుండటంతోపాటు ఆర్టీఏ అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తుండటంతో యువతతో పాటు అన్ని వర్గాల్లో కదలిక వచ్చినట్లయిందని అధికారులు చెబుతున్నారు. 2 లక్షలకు పైగానే వాహనాలు జిల్లావ్యాప్తంగా దాదాపు 2,02,811 టూ, త్రీ, ఫోర్ వీలర్లు (వాహనాలు) ఉన్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వాహనం నడపాలంటే తప్పని సరిగా లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన ఉంది. అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారు అసలు వాహనం నడపడానికి అర్హులుకారనే విషయం తెలిసిందే. కాగా, మూడేళ్లలో పోలీస్ అధికారులు, జిల్లా రవాణా శాఖాధికారులు, ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో మార్పు వచ్చిందని, రోజూ ఆర్టీఏ కార్యాలయానికి లైసెన్స్ల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో దాదాపు 36,243 మంది డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. ఇటివల ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్.. లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న వారిని ఆర్టీఏ కార్యాలయానికి తీసుకువెళ్లి, లైసెన్స్కు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాంటే 18 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత లెర్నింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ట్రాఫిక్ సంబంధించి లైసెన్స్ (మొదట లెర్నింగ్ లైసెన్స్ను) టెస్టును నిర్వహించి కేటాయిస్తారు. ఇది పూర్తి అయిన తరువాత ఆరునెలల కాలంలో మరోసారి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని, ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు. వాహనదారులకు లైసెన్స్ ఉండాల్సిందే.. జిల్లావ్యాప్తంగా సుమారు 2,02,811 టూ, త్రీ, ఫోర్ చక్రాలు కలిగిన వాహనాలున్నాయి. ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చినట్లు గణాంకాలు చూస్తే తెలుస్తోంది. అందరూ లైసెన్స్ తీసుకుని వాహనం నడిపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్లుగా 36,243 మంది లైసెన్స్ పొందారు. ట్రాఫిక్, రవాణాశాఖ నియమ, నిబంధనలను వాహనదారులు పాటించాలి. ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాల్సిందే.. –వి.వెంకటరమణ, జిల్లా ఇన్చార్జ్ రవాణా శాఖ అధికారి జిల్లాలో లైసెన్సుల జారీ వివరాలు కేటగిరీ 31–12–2022 2023 2024 2025 వరకు (ఇప్పటివరకు) హెవీ మోటార్ వెహికల్స్ 252 291 269 49 మీడియం మోటార్ వెహికల్స్ 0 0 0 0 లైట్ మోటార్ వెహికల్స్ 3,531 4,420 258 950 మోటార్ సైకిల్, స్కూటర్, మోపెడ్స్ 4,351 5,189 5,336 926 ట్రాక్టర్స్ 564 668 728 148 ఇతర కేటగిరి వాహనాలు 763 1,082 1,269 199 మొత్తం 9,461 11,650 12,860 2,272 -
‘గేట్’లో ర్యాంక్ సాధించడంపై హర్షం
పాల్వంచ: జాతీయస్థాయిలో నిర్వహించిన గేట్–2025 కాంపిటేటివ్ పరీక్షలో స్థానిక అనుబోస్ మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో (మైనింగ్) ఫైనల్ ఇయర్ చదువుతున్న టి.దీపిక ఆల్ ఇండియాలో 602 ర్యాంక్ సాధించింది. శనివారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ టి.భరత్కృష్ణ, సెక్రటరీ డాక్టర్ ఎ.అవని దీపికను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ సుబ్బారావు, ప్రిన్సిపాల్ బి.రవి, వైస్ ప్రిన్సిపాల్ జి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. జమిలీ ఎన్నికలు చారిత్రక అవసరం పాల్వంచరూరల్: జమిలీ ఎన్నికలు జరపడం ఈ దేశానికి చారిత్రక అవసరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. స్థానిక అంబేడ్కర్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. బీజేపీ దృష్టికోణం’అంశంపై వర్క్షాప్ నిర్వహించగా బైరెడ్డి మాట్లాడారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షడు రంగాకిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంపన సీతారామరాజుతోపాటు చింతలచెరువు శ్రీనివాసరావు, రాపాక రమేశ్, కుంజా ధర్మ, బాలునాయక్, పైడిపాటి రవీందర్, గొడుగు శ్రీధర్, చందు, జల్లారపు శ్రీనివాస్, పసుమర్తి సతీశ్, పున్నం భిక్షపతి పాల్గొన్నారు. పర్ణశాల వేలం పాటలు ఖరారు దుమ్ముగూడెం: పర్ణశాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పార్కింగ్, బోట్ షికారు, మరుగుదొడ్ల నిర్వహణకు శనివారం వేలంపాట నిర్వహించారు. ఎంపీఓ, పంచాయతీ ప్రత్యేకాధికారి బద్ధి రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సంపతి శ్రీనివాసరావు సమక్షంలో తొలుత బోట్ షికారు వేలం పాట నిర్వహించారు. గోవిందాపురం గ్రామానికి చెందిన తెల్లం భీమరాజు రూ.44,40,000కు దక్కించుకున్నాడు. గతేడాది ఇది రూ.42,40,000కు దక్కగా.. ఈ ఏడాది రూ.2 లక్షలు లాభం వచ్చింది. వాహన పార్కింగ్ పాటను పొడియం వెంకటరమణ రూ.61లక్షలకు దక్కించుకున్నాడు. గతేడాది పార్కింగ్ రూ.40లక్షలకు దక్కగా ఈ ఏడాది రూ.21 లక్షలు అదనంగా వచ్చాయి. మరుగుదొడ్ల నిర్వహణ పాటను జానకీరామ్ రూ.85 వేలకు దక్కించుకున్నాడు. గతేడాది రూ.1లక్ష 5 వేలకు వెళ్లింది. వేలం పాటలతో పంచాయతీకి రూ.1,06,25,000 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న మలేరియా కేసులు భద్రాచలంఅర్బన్: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో 20 రోజులుగా మలేరియాతో బాధపడుతూ చేరుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అందులో అందరూ చిన్నారులుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే 25 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా, 42 మంది ఇతర జ్వరాలతో చేరారు. మలేరియా బాధితుల్లో చిన్నారులే అధికంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చినవారిలో 4 శాతం రక్తం ఉండటం లేదా, ప్లేట్లెట్ల సంఖ్య 20 వేల నుంచి 30 వేలకు పడిపోయిన తరువాత ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఐదు రోజులపాటు వైద్యం అందించి, ఇంటికి పంపిస్తున్నామని వారు చెప్పారు. ఇదే వైద్యానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.30 వేల వరకు ఖర్చు అవుతోందని సమాచారం. సకాలంలో రోగాన్ని గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చిన్నారుల ప్రాణాల కాపాడుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. -
శ్రీసీతారామచంద్రస్వామివారికిసువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 28న రుద్రహోమ పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో ఈ నెల 28న రుద్రహోమ పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు యాగశాలలో రుద్రహోమపూజలు నిర్వహించనున్నారు. పూజలో పాల్గొనే భక్తులు రూ.1,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులు మగవారు ధోతి, కండువా, మహిళలు చీరలు ధరించాలని కోరారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు. నేడు ఉమ్మడి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత తిరుపతమ్మతల్లి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి మధ్యాహ్నం 2–30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ మీదుగా భద్రాచలం చేరుకుంటారు. అక్కడ ఏఎంసీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. సాయంత్రం 4–30 గంటలకు భద్రాచలంలోని మనుబోతుల చెరువు వద్ద తడి, పొడి చెత్త కలెక్షన్ సెంటర్ను ప్రారంభించాక, సాయంత్రం 5–45 గంటలకు కొత్తగూడెంలోని ఆఫీసర్స్ క్లబ్లో జరిగే ఇఫ్తార్విందులో పాల్గొంటారు. తగ్గుతున్న కిన్నెరసాని నీటిమట్టంపాల్వంచరూరల్: వేసవి ఎండలు మండుతుంటడంతో కిన్నెరసాని జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. 407 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లో ఈ నెల 22న (శనివారం) 398.60 అడుగులకు చేరింది. గతేడాది ఇదే రోజు 399.60 అడుగులు నమోదైంది. గతేడాదికంటే అడుగు మేర నీటిమట్టం తగ్గిందని డ్యామ్సైడ్ ఇంజనీర్ తెలిపారు. రిజర్వాయర్ నుంచి రోజూ 100 క్యూసెక్కుల జలాలను కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ కర్మాగారాలకు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో రోజు ప్రశాంతంగా పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 12,227 మందికి గాను 12195 మంది హాజరయ్యారని, 32 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. డీఈఓ, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పల కేంద్రాల్లో తనిఖీలు చేశారు. -
ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి
మణుగూరురూరల్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక ప్రజల అవసరాల కోసం ఉచితంగా సరఫరా చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యాన మణుగూరులోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాక ధర్నా చేశారు. కాంతారావు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సూచిస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా చెక్పోస్టులను బలోపేతం చేసి అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాక ప్రజల అవసరాలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల, పట్టణ కన్వీనర్లు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్, నాయకులు పోశం నర్సింహరావు, వట్టం రాంబాబు, అడపా అప్పారావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, నర్సింహరావు, మునుకోటి ప్రమీల, రమాదేవి, చంద్రకళ రుద్ర వెంకట్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
కొత్తగూడెంటౌన్: బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్రాజు పేర్కొన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందితో ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై సంచరిస్తూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్–100కు ఫోన్ రాగానే వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని, బాధితులకు న్యాయం చేయడంతో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్చార్జ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ..
మణుగూరుటౌన్: పట్టణంలో రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనటడంతో పెట్రోల్ పైపులు ఊడిపోయి మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ పైపులు ఊడిపోయి మంటలు చేలరేగాయి. సుందరయ్యనగర్కి చెందిన భుక్య సక్రాం, పగిడేరు గ్రామానికి చెందిన దోమల పవన్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 100 పడకల ఆస్పత్రికి తరలించారు. బైక్ ఢీకొట్టిన ఘటనలో కేసు నమోదు పాల్వంచరూరల్: స్కూటీపై వెళ్తున్న మహిళను మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ తీవ్రంగా గాయపడగా.. శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాండురంగాపురం సమీపంలోని తవిశలగూడెంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఎం.పుష్పలత ఈ నెల 20వ తేదీన స్కూటీపై పాల్వంచకు వెళ్తుండగా ఆదే సమయంలో తవిశలగూడెం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న చలిమల వేణు ఢీకొట్టాడు. పుష్పలతకు తీవ్రగాయాలు కాగా స్కూటీ ధ్వంసమైంది. ఆమెను 108 ద్వారా పాల్వంచలోని ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పుష్పలత సోదరుడు చింతపల్లి విజయకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. గుట్కాప్యాకెట్ల పట్టివేత భద్రాచలంఅర్బన్: పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను శనివారం పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని ఇందిరామార్కెట్లోని రాందేవ్ ఫ్యాన్సీ దుకాణం నిర్వాహకుడు మల్లిబేరరామ్.. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా గుట్కాప్యాకెట్లు కొనుగోలు చేసి తన దుకాణంలో నిల్వ ఉంచాడు. ఇక్కడి నుంచి చిన్నచిన్న దుకాణాలకు రిటైల్గా విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో గుట్కా ప్యాకెట్లు లభ్యమవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ను తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గుట్కాప్యాకెట్ల విలువ రూ.1,76,100 అని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని టౌన్ ఎస్ఐ వెల్లడించారు. నీటి గుంటలో జారిపడి బాలుడి మృతి వైరా: ప్రమాదవశాత్తు నీటి గుంటలో జారి పడిన బాలుడు మృతి చెందిన ఘటన వైరా మున్సిపాలిటీ పరిధి బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బీసీ కాలనీకి చెందిన బెజ్జం బాలస్వామి – మేరీ దంపతుల కుమారుడు రాబిన్(9) స్నేహితులతో కలిసి వైరా రిజర్వాయర్ సమీపాన ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో నీటి అంచునకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు అక్కడి గుంటలో జారి పడగా, ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. ఆయన స్నేహితులు ఇచ్చిన సమాచారంతో స్ధానికులు, రాబిన్ తల్లిదండ్రులు చేరుకుని ఆయనను బయటకు తీసి ద్విచక్రవాహనంపై అస్పత్రికి తీసుకెళ్లేలోగా ఆయన బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా, బాలుడు బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా, ఆయన సోదరి మణుగూరులోని గురుకులంలో పదో తరగతి చదువుతోంది. పాఠశాల నుంచి రాగానే ఆడుకోవడానికి వెళ్లిన రాబిన్ మృత్యువాత పడడంతో ఆయన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మంటలు చెలరేగి ఇద్దరికి గాయాలు -
ఉగాదికై నా వేతనాలిస్తారా..?
● మూడు నెలలుగా జీతాలు రాక పంచాయతీ కార్మికుల అవస్థ ● ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన చుంచుపల్లి: పారిశుద్ధ్య పనులు చేపడుతూ పల్లెను పరిశుభ్రంగా ఉంచే పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదు. జనవరి నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా అవస్థ పడుతున్నాయి. ఏడాది కాలంగా పంచాయతీలకు సర్పంచులు లేరు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు సకాలంలో రాక వీరి వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 4,492 మంది కార్మికులు ఉమ్మడి జిల్లాలోని 1,070 గ్రామ పంచాయతీల పరిధిలో 4,252 మంది పారిశుద్ధ్య కార్మికులు (ఎంపీడబ్ల్యూ) విధులు నిర్వర్తిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామపంచాయతీల్లో 2,129 మంది, ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీల్లో 2,363 మంది పనిచేస్తున్నారు. మల్టీపర్పస్ వర్కర్లుగా పేర్కొంటున్న వీరిని స్థానిక అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పనులకు వినియోగించుకుంటున్నారు. వాటర్మెన్, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్, కారోబార్, పంపు ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ విధులు నిర్వర్తింజేస్తున్నారు. జీఓ నంబర్ 51 ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు రూ.9,500 చొప్పున ఆన్లైన్ ద్వారా వేతనం చెల్లిస్తారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా నియమించుకునే వారికి నెలకు రూ.5 వేలు ఇస్తారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 12 నుంచి 15 మంది వరకు, చిన్న పంచాయతీల్లో ఎనిమిది మంది వరకు వీరు ఉన్నారు. పారిశుద్ధ్య పనులు, హరితహారం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల పరిశుభ్రత, ఇంటింటికీ ట్రాక్టరు ద్వారా చెత్త సేకరణ, విద్యుద్దీపాల నిర్వహణ, డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ ఎరువు తయారీ, తాగునీటి సరఫరా తదితర విభాగాల్లో పనిచేస్తున్నారు. పలుమార్లు వేతన సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30న ఉగాది పండుగ లోపైనా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు జనవరి నుంచి వేతనాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. జిల్లా అధికారులను అడిగితే త్వరలో వస్తాయంటున్నారు. కనీసం ఉగాది పండుగ లోపైనా వేతనాలు విడుదల చేయాలి. –డి.అమర్నాథ్, జీపీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడుత్వరలో విడుదలకు అవకాశం పారిశుద్ధ్య కార్మికులకు జనవరి నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ జీతాల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వీరికి త్వరలోనే వేతనాలు విడుదలయ్యే అవకాశం ఉంది. – వి.చంద్రమౌళి, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం -
రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు..
● పడవల్లో తీసుకొచ్చిన 121 కిలోలగంజాయి పట్టివేత ● వివరాలు వెల్లడించిన పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ బూర్గంపాడు: భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద నిరంతరం పోలీసులు నిఘా పెట్టడంతో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. పడవలపై గోదావరిని దాటిస్తూ దూరప్రాంతాలకు గంజాయి రవాణా చేయటం మొదలెట్టారు. బూర్గంపాడుకు సమీపంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో కారులో తరలిస్తున్న 121 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ శనివారం వివరాలు వెల్లడించారు. శనివారం బూర్గంపాడు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కుక్కునూరు వైపు నుంచి వస్తున్న ఓ కారు పోలీసులను చూడగానే వెనుక్కి తిప్పే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఎస్ఐ రాజేశ్ కారును పట్టుకున్నారు. అందులో రూ.60.57 లక్షల విలువైన 121 కిలోల గంజాయి దొరికింది. కారును సీజ్ చేసి, కారులో ఉన్న సారపాక రాజీవ్నగర్కు చెందిన వాంకుడోత్ సాయికుమార్, కూనవరం మండలం పొలిపాక గ్రామానికి చెందిన పెడముత్యం వంశీని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఒడిశాలోని బలిమెలకు చెందిన భీమా వద్ద గంజాయి కొనుగోలు చేసి కారులో పొలిపాక తరలించారు. అక్కడి నుంచి నాటు పడవల్లో కుక్కునూరు మండలం వింజరం గ్రామానికి.. అక్కడి నుంచి కారులో తరలిస్తూ పట్టుబడ్డారని డీఎస్పీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో ఎస్కే మున్వర్, రమేశ్, కత్వాల సురేశ్, జగదీశ్, స్వరూప్, ఎల్లాజి, వాంకుడోత్ సురేశ్ భాగస్వాములుగా ఉన్నారని, వింజరం నుంచి కారులో గంజాయిని ఇల్లెందు క్రాస్రోడ్ వరకు తరలించి, అక్కడి నుంచి సోలాపూర్కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వాంకుడోత్ సురేశ్కుమార్ ప్రస్తుతం సోలాపూర్లో ఉంటూ గంజాయిని విక్రయించేందుకు పథకం వేసుకున్నారని, ఎస్కే మున్వర్, రమేశ్, కత్వాల సురేశ్, జగదీశ్, వాంకుడోత్ సాయికుమార్ గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారన్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, మరో ఏడుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ సతీశ్కుమార్ పేర్కొన్నారు. పాల్వంచ సీఐ సతీశ్, ఎస్ఐలు రాజేశ్, ప్రవీణ్, రామారావు, ట్రెయినీ ఎస్ఐ కేవ్సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు పెంచుకోవాలి
● ఇంకుడు, నీటి గుంతలు నిర్మించాలి ● ప్రపంచ నీటి దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్పాల్వంచరూరల్: భూగర్భజలాల పెంపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామ రైతు వేదికలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఇంట్లో ఇంకుడు గుంతలు, పంట పొలాల్లో ఫారం పాండ్లు నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని చెప్పారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలలని, వివిధ వనరులకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, నీటి వనరుకు మాత్రం ప్రత్యామ్నాయం లేదని వివరించారు. ఇంటి ఆవరణలో, ఉద్యాన వనాల్లో, రహదారుల పక్కన మ్యాజిక్ సోక్ పిట్స్ నిర్మించాలని సూచించారు. రైతులు మునగ సాగుకు ముందుకు రావాలన్నారు. విరివిగా చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. నివాసాల్లో తీసుకుంటున్న మ్యాజిక్ సోక్ పిట్ పనులను పరిశీలించి, వారితోపాటు కలిసి పనిచేశారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో సోక్ పిట్ కోసం ప్రభుత్వం రూ.6,800 చెల్లిస్తోందని తెలిపారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఈఏ బాబూరావు మాట్లాడుతూ నీటి వినియోగంపై అంతరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. రీచార్జి గుంతలు, సేద్యపు గుంతలు, కందకాలను నిర్మాణంచేసుకోవాలని, ఇంటిపైకప్పు, రోడ్డుపై పడిన వర్షపు నీటిని రీచార్జి గుంతల ద్వారా కందకాలకు మళ్లించుకోవాలని సూచించారు. ఉపాధి పనులకు హాజరు కావాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం పనులు కోరే ప్రతీ ఒక్కరు హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో పెద్దఝెత్తున పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 29వ తేదీ వరకు వారం రోజులు వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. బోరు ఆధారిత వ్యవసాయ భూముల్లో రైతులు ఫారం పాండ్స్ నిర్మించుకోవాలన్నారు. బైక్పై వెళ్లి.. పలుగుతో గుంత తవ్వి.. పాల్వంచ మండలం తోగ్గూడెంలో ఉపాధి పనులను కలెక్టర్ జితేష్ పరిశీలించారు. తోగ్గూడెం ప్రధాన రహదారి మీదుగా ఉపాధి పనులు నిర్వహించే ప్రదేశానికి వాహనాలు వెళ్లే అవకాశంలేదు. దీంతో కలెక్టర్ కారును పక్కన పెట్టి సిబ్బంది ద్విచక్రవాహనంపై కూర్చుని సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించి ఉపాధి పని ప్రదేశానికి వెళ్లారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. పలుగు(గడ్డపార) చేత పట్టి నీటిగుంతను తవ్వి కొద్దిసేపు పనిచేశారు. తవ్వకం పనులు అంత సులువు కాదని, నిత్యం పనిచేసేవారికే స్కిల్స్ ఉంటాయని, వారే సులువుగా గుంతలు తవ్వగలరని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఏఓ బాబూరావు కూడా పలుగు పట్టి గుంత తవ్వారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా భూగర్భజల అధికారి రమేష్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేశ్, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, ఎయిడ్ ఎన్జీఓ హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
జీవనోపాధి పెంపొందించుకోవాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన యువత జీవనోపాధిని పెంపొందించుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని శ్రీ జయ దుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నెలకొల్పిన శ్రీ దుర్గా భవాని సెంట్రింగ్, బ్రిక్స్ యూనిట్ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.25 లక్షల వ్యయంలో రూ.15 లక్షల సబ్సిడీతో ఏర్పాటు చేసుకున్న యూనిట్ అందరూ కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. మార్కెటింగ్ పెంచుకుని, బ్యాంకు రుణం ప్రతినెలా చెల్లించాలని సూచించారు. అనంతరం యంత్రాలు, సామగ్రిని పరిశీలించారు. ఇటుకలు రవాణా చేసే వాహనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వాహన తాళాలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, అశోక్ కుమార్, హరికృష్ణ, యూనిట్ సభ్యులు రాజు, వెంకటమ్మ, మహేశ్వరి, వెంకటమ్మ, నాగరాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అర్థమయ్యే రీతిలో బోధించాలిదుమ్ముగూడెం : విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం మండలంలోని జిన్నెలగూడెం జీపీఎస్ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3,5 తరగతి విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లలతో బోర్డుపై రాయించి పరిశీలించారు. అనంతరం గణిత శాస్త్రం అంటే పిల్లల్లో భయం పోగొట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని సారాంశాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్నారని అన్నారు. ఏటీడీఓ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
స్మార్ట్ రామయ్య!
‘బీటీఐ’ యాప్లో రామాలయ సమస్త సమాచారం ● భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఆలయ అధికారులు ● శ్రీసీతారామ చంద్రస్వామివారి పూజలు, సేవల వివరాలు లభ్యం ● ఉపాలయాల వివరాలు, మార్గాలు కూడా అనుసంధానం ● ఆలయ అధికారులను అభినందించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్ (బీటీఐ) యాప్ సిద్ధమైంది. సుదూర ప్రాంతాల భక్తులు, యువతకు అరచేతిలో సమస్త సమాచారం అందించేలా రామాలయ ఈఓ ఎల్.రమాదేవి ఆధ్వర్యంలో ఆత్రేయ ఇన్ఫోటెక్ సిస్టం కంపెనీ అన్ని వివరాలతో రూపొందించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లకు ప్లే స్టోర్లో ఈ యాప్ లభ్యమవుతుండగా, బార్ కోడ్ స్కాన్ ద్వారా సైతం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వినియోగంలోకి తెచ్చినా శ్రీరామనవమి నాటికి అఽధికారికంగా ప్రారంభించనున్నారు. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ యాప్ గురించి తెలుసుకుని ఆలయ ఽఅధికారులను ప్రశంసించారు. సుదూర ప్రాంతాల భక్తులు సేవలు పొందటం సులభతర మవుతుందని పేర్కొన్నారు. – భద్రాచలం22 రకాల సేవలు.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లే స్టోర్లో భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్ అని టైపు చేయగానే యాప్ డిస్ప్లే అవుతుంది. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం పేరుతో మూలమూర్తుల ఫొటోతో పేజీ దర్శనమిస్తుంది. ఆలయ చరిత్ర ఆంగ్లంలో కనిపిస్తుంది. కింద కనిపించే సేవ అండ్ టైమింగ్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ బుకింగ్ జాబితా పేరుతో ఆలయంలో నిత్యం అందే సేవలు, వేళల వివరాలు దర్శనమిస్తాయి. దేవస్థానంలో లభించే 22 రకాల సేవల వివరాలు పొందవచ్చు. ఇదే పేజీలో ఆలయం అందిస్తున్న సర్వీసులను, భక్తులు చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ను అనుసంధానం చేశారు. భద్రాచలంలో ఉన్న అన్నదానం, కల్యాణ కట్ట, లడ్డూ కౌంటర్, పురుషోత్తపట్నం, ఆలయం వద్ద ఉన్న గోశాలలు, రామదాసు ధ్యాన మందిరం, ఆర్టీసీ బస్టాండ్, ఘాట్, ఎమర్జెన్సీ, ప్రచార రథం, ఇన్ఫర్మమేషన్ సెంటర్ (సీఆర్ఓ) శ్రీ సీతారామ కల్యాణ మండపం, పర్ణశాలలో పర్ణశాల, నార చీరల ప్రాంతాలు, నేలకొండపల్లి, కొత్తగూడెం రైల్వే స్టేషన్ వివరాలను పొందుపర్చారు. ఇదే పేజీలో ఎటపాకలో ఉన్న జటాయువు మండపం, భద్రాచలంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం, అభయాంజనేయస్వామి ఆలయం, ఏపీలోని పాపికొండలు, శ్రీరామగిరి వెళ్లే మార్గాల మ్యాప్లను అనుసంధానం చేశారు. ఉపాలయాలు వివరాలు కూడా.. మరో పేజీలో శ్రీ సీతారాముల రామాయణ ఇతివృత్తాన్ని తెలుగులో ఉంచారు. ఆ తర్వాత ఉపాలయాల వివరాలను అందుబాటులో ఉంచారు. ఈ పేజీలో భద్రాచలంలో రామాలయానికి అనుబంధంగా ఉన్న నర్సింహస్వామి ఆలయం, శివాలయం, తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయం, రంగనాయకుల గుట్ట మీద ఉన్న రంగనాథ స్వామి ఆలయం, పర్ణశాలలో ఉన్న పర్ణశాల ఆలయం, నేలకొండపల్లిలో ఉన్న బుద్ధవనం, భక్తరామదాసు మందిరం వివరాలను పొందుపర్చారు. ఇలా మొత్తంగా భద్రాచలం రామాలయం, పర్యాటక, భక్తి ప్రాంతాల వివరాలను యాప్లో అందుబాటులో ఉంచారు. ఇవే కాకుండా ఇతర సేవలను సైతం భక్తులకు మరింత చేరువ చేసేలా యాప్లో మెరుగులు దిద్దుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా శాంతికుమార్
మణుగూరు రూరల్: వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుడిగా మణుగూరు ప్రాంతానికి చెందిన పప్పుల శాంతికుమార్ ఎంపికయ్యాడు. ఆయన ఇప్పటికే మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహనకు శిక్షణ పొందగా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఈ నేపథ్యాన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు, అరికట్టడంపై ఇచ్చిన శిక్షణకు రాష్ట్రం నుంచి వంద మంది ఎంపికవగా శాంతికుమార్కు జాబితాలో చోటు దక్కింది. ఇటీవల శిక్షణ పూర్తయిన అనంతరం హైదరాబాద్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఇల్లెందురూరల్: మండలంలోని రాజీవ్నగర్తండా సమీపంలోని జెండాలవాగు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాంకుడోత్ కిషన్ (50) మృతి చెందాడు. మృతుని బంధువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నకిష్టాపురం గ్రామ పంచాయతీ దేశ్యాతండా గ్రామానికి చెందిన కిషన్ ఇల్లెందులో నివాసం ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు భార్యతో కలిసి బైక్పై ఇల్లెందుకు బయలుదేరాడు. జెండాలవాగు వద్ద మహబూబాబాద్ నుంచి ఇల్లెందుకు వస్తున్న ట్రాలీ ఢీకొట్టడంతో కిషన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదంతో సామగ్రి దగ్ధం అశ్వారావుపేటరూరల్: ఓ ఇంట్లో వెలిగించిన దీపం కిందపడి మంటలు వ్యాపించి, సామగ్రి దగ్ధమైన ఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని కట్టా రామదాసు వీధిలో నివాసం ఉండే అరవి శ్రీను, భార్యతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఇంట్లో దేవుడి చిత్రపటాల వద్ద దీపారాధన చేసి షాపు వద్దకు వెళ్లారు. దీపం కిందపడి మంటలు మంటలు వ్యాపించి ఏసీ, కూలర్, ఫ్యాన్లు, బీరువాతోపాటు వంట సామగ్రి కాలిపోయాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో గమనించిన చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకొని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. -
లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలి
మణుగూరు టౌన్: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్(పీపీ, పా) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మణుగూరులో పర్యటించిన ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్తో కలిసి వ్యూ పాయింట్ నుంచి ఓసీ–2లో బొగ్గు వెలికితీతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 22 నాటికి 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం అభినందనీయమని అన్నారు. యూనియన్ల నాయకులు, అధికారులు, కార్మికుల కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. తొలుత జీఎం కార్యాలయంలో డైరెక్టర్కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్యాంసుందర్, ఆర్.శ్రీనివాస్, వీరభద్రరావు, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాసాచారి, రమేశ్, అనురాధ, మదన్నాయక్, శ్రీనివాసమూర్తి, వీరభద్రుడు, బైరెడ్డి వెంకటేశ్వర్లు, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
సూపర్బజార్(కొత్తగూడెం): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని ముస్లిం ఉద్యోగులకు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు కలెక్టర్కు ఖురాన్ను బహూకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సీపీఓ సంజీవరావు, డీపీఆర్ఓ అజ్గర్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచధారులై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకంపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేం చేశారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించిన అర్చకులు నివేదన, పంచహారతులు సమర్పించారు. ఆ తర్వాత నీరాజన మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీని కలిసిన సింగరేణి డైరెక్టర్లుసింగరేణి(కొత్తగూడెం) : కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజును సింగరేణి డైరెక్టర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డైరెక్టర్(పీపీ అండ్ పా) కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ వారిని పుష్పగుచ్ఛాలు అందించారు. కార్యక్రమంలో జీఎంలు ఎన్.రాధాకృష్ణ, చందా లక్ష్మీనారాయణ, ఎస్ఓటుజీఎం వేణుమాదవ్, తావురియా, డి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలిసుజాతనగర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలతోనే మంచి భవిష్యత్ ఏర్పడుతుందన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు హాస్టల్లో అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బ్యూలారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రతీ మనిషికి 100 లీటర్లు
● వేసవిలోనూ సాఫీగా నీటి సరఫరా ● గతేడాదితో పోలిస్తే 20శాతం అధికంగా నీరు ● పైపులైన్ లేనిచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలు ● మిషన్ భగీరథ ఎస్ఈ గడ్డం శేఖర్రెడ్డి ఖమ్మంవన్టౌన్: ఎండలు ముదురుతున్న నేపథ్యాన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తాగునీటికి ఇక్కట్లు ఎదురుకాకుండా ప్రణాళికాయుతంగా వ్యవహరించనున్నట్లు మిషన్ భగీరథ ఎస్ఈ గడ్డం శేఖర్రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనూ నిరంతరాయంగా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా తమ శాఖ అధికారులు, సిబ్బంది ఇప్పటికే సమాయత్తమయ్యారని తెలిపారు. కొద్ది రోజుల క్రితం మంత్రి సీతక్క నేతృత్వాన హైదరా బాద్లో జరిగిన సమావేశంలో చేసిన సూచనల మేరకు గత నెలలోనే ముందస్తుగా క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. మిషన్ భగీరథ ఎస్ఈగా ఖమ్మంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన వేసవి సన్నద్ధతపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్ల డించారు. అవి ఆయన మాటల్లోనే.. 22గ్రామాలకు స్థానిక వనరులతో.. ఖమ్మం జిల్లాలో 931 గ్రామాలకు గాను ఏడు గ్రామాలకు మిషన్ భగీరధ పథకం ద్వారా కాకుండా స్థానిక వనరులతో నీరు అందిస్తున్నాం. అలాగే, భద్రాద్రి జిల్లాలోని 1,599 గ్రామాలకు గాను 15 గ్రామాల్లో స్థానికంగానే నీరు సమకూరుస్తున్నాం. వేసవికి ప్రత్యేక ప్రణాళిక వేసవిని సమర్థంగా ఎదుర్కొనేందుకు నెల రోజులు గా ప్రణాళికలు సిద్ధం చేశాం. గత నెలలోనే ఉద్యోగులంతా పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించారు. ఆయా ఆవాసాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరాకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోనున్నాం. జోన్లుగా గ్రామాల విభజన ఉమ్మడి జిల్లాలో ప్రతీ మనిషికి 100 లీటర్ల తాగునీరు అందించాలనేది లక్ష్యం. ఈ స్థాయిలో నీరు అందుతున్న గ్రామాలను గ్రీన్ జోన్గా గుర్తించాం. ఇక 55 – 100 లీటర్లు అందించే గ్రామాలను ఆరెంజ్ జోన్గా, 20 – 55 లీటర్లు అందించే గ్రామాలను ఎల్లో జోన్గా, 20లీటర్ల కంటే తక్కువ సరఫరా అవుతున్న గ్రామాలను రెడ్జోన్గా విభజించాం. అయితే, గతేడాదితో పోలిస్తే ఇప్పటికై తే 20 శాతం నీరు అధికంగానే ఉంది. మిషన్ భగరథ పైప్లైన్ ఉన్న గ్రామాలకు గ్రిడ్ ద్వారా, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. మారుమూల పల్లెలకు సైతం.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని మారుమూల పల్లెల్లోనూ ఇప్పటికే స్థానికంగా ఉన్న వనరుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. ఆదివాసీ గూడేల్లో సైతం బోర్లు వేసి సోలార్ ప్యానళ్ల ద్వారా నిరంతరాయంగా నీరు అందిస్తున్నాం. -
‘రోయింగ్’ శిక్షణ షురూ..
● తుమ్మలచెరువులో సందడే సందడి.. ● ఈనెల 26 వరకు కొనసాగనున్న ట్రైనింగ్ అశ్వాపురం: మండల పరిధిలో కాకతీయుల కాలంలో నిర్మించిన తుమ్మలచెరువులో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ శిక్షణ ఈనెల 26 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ హుస్సేన్సాగర్లో మాత్రమే ఈ శిక్షణ ఇస్తున్నారు. అయితే తుమ్మలచెరువు 2 నుంచి 3 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్లకు పైగా వెడల్పుతో నీరు నిలకడగా ఉంటుండడంతో ఈ శిక్షణకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. బోటింగ్తో గుర్తింపు.. గత జనవరిలో ప్రారంభించిన బోటింగ్తో తుమ్మలచెరువుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవ చూపించగా స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బోటింగ్ ప్రారంభించారు. మొదట 10 నుంచి 15 మంది మాత్రమే బోట్ షికారు చేయగా ప్రస్తుతం రోజుకు 100 నుంచి 150 మంది బోట్ ఎక్కుతున్నారు. గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళలు దీన్ని నిర్వహిస్తున్నారు. యువతకు ఉచిత శిక్షణ.. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలచెరువు వద్ద అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు యలమంచిలి కిరణ్ గిరిజన యువతకు ఉచితంగా రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో క్రీడల్లో విశేషంగా రాణించే గిరిజన యువత రోయింగ్ వాటర్ స్పోర్ట్స్లోనూ ప్రతిభ చాటే అవకాశం ఉంది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. పురుషుల్లో లైట్ వెయిట్(68–72.5 కేజీలు), ఓపెన్ వెయిట్ (72.5 పైన), సీ్త్రలలో లైట్ వెయిట్(57–59), ఓపెన్ వెయిట్ (62.5 పైన) విభాగాల్లో స్వీప్ రోయింగ్, స్కల్ రోయింగ్ ఉంటాయి. సింగిల్ స్కల్, డబుల్ స్కల్, క్వార్డ్బుల్ స్కల్, స్వీప్ రోయింగ్లో పెయిర్(ఇద్దరు), కాక్స్లెస్(నలుగురు), కాక్స్డ్ యైట్(ఎనిమిది మంది) పోటీలు ఉంటాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారికి హుస్సేన్సాగర్లో ఓపెన్ ట్రైల్స్ నిర్వహించి పోటీలకు ఎంపిక చేస్తారు. -
అడవులను పరిరక్షిద్దాం
చుంచుపల్లి: నిత్యం ఆరోగ్యంగా ఉంటూ అడవులను రక్షిద్దామని జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్ అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ శాఖ సిబ్బందికి నిర్వహించిన 5కే రన్ను స్థానిక ప్రకాశం స్టేడియం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీ సిబ్బంది నిత్యం పని ఒత్తిడికి లోనవుతుంటారని, ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు అవసరమైన వ్యాయామం చేయాలని సూచించారు. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించొద్దని అన్నారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటేనే విధుల్లో రాణిస్తామని చెప్పారు. జిల్లాలో అడవుల సంరక్షణకు సిబ్బంది చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. వేసవిలో జంతువుల రక్షణకు చర్యలు చేపట్టాలని, అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని భరోసా ఇ చ్చారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఎఫ్డీఓ యు. కోటేశ్వరరావు, రేంజ్ అధికారులు శ్రీనివాసరావు, ప్రసాదరావు, ఎల్లయ్య, ముక్తార్ హుస్సేన్, రామవరం రేంజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోడు సాగు జరగకుండా చర్యలు.. పాల్వంచరూరల్ : అడవుల సంరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, పోడుసాగును అరికట్టాలని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. స్థానిక టెరిటోరియల్ డివిజన్ కార్యాలయంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా అటవీ ప్రాంతంలో పోడు సాగు చేయకుండా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. అడవులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, మొక్కలను విరివిగా పెంచాలని, వన సంరక్షణే ధ్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎఫ్ఓలు కట్టా దామోదర్రెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. 5కే రన్ ప్రారంభోత్సవంలో డీఎఫ్ఓ కిష్టాగౌడ్ -
పరీక్షల్లో కొన్ని ఘటనలు..
కరకగూడెం: మండల పరిధిలోని భట్టుపల్లి పాఠశాలకు చెందిన ఓ ఇద్దరు విద్యార్థినులు పరీక్ష కేంద్రానికి మండల కేంద్రం నుంచి కాలినడకన వెళ్తుంటే అటువైపుగా వెళ్తున్న ఎస్సై రాజేందర్ వారిని తన బైక్పై ఎక్కించుకున్నారు. ఆలస్యం కాకుండా పరీక్ష కేంద్రం వరకు తీసుకెళ్లారు. ములకలపల్లి: స్థానిక జెడ్పీ హైస్కూల్ కేంద్రంలో గేట్ బయట విద్యార్థుల గదుల కేటాయింపు వివరాలతో కూడిన నోటీసు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఉదయం 8.45 తరువాతే పరీక్ష కేంద్రం ఆవరణలోకి ఆనుమతించడం, 8.50కి గదుల్లోకి ప్రవేశించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. -
రూ.1.25 కోట్లు పలికిన ఆశీలు
వేలంపాట నిర్వహించిన పంచాయతీ అధికారులుభద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆశీలు (పార్కింగ్), సంత, గోదావరి ఫెర్రీ, పంచాయతీ దుకాణాలకు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. డీఎల్పీఓ సుధీర్, గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ సమక్షంలో వేలంపాట నిర్వహించగా, ఆశీలు కాంట్రాక్ట్ను రూ.1.25 కోట్లకు పట్టణానికి చెందిన రంగా అనే వ్యక్తి దక్కించుకున్నాడు. గత ఏడాది ఇదే టెండర్ 9 నెలలకుగాను రాములు అనే వ్యక్తి రూ.79 లక్షలకు దక్కించుకున్నాడు. గోదావరి నదిలో ఉండే బోట్లు (ఫెర్రీ) గతేడాది 9 నెలలకు రూ. 16.90 పలకగా, ఈసారి ఏడాదికి గాను రూ. 27లక్షల 25 వేలు పలికింది. చర్ల రోడ్డులో నిర్వహించే వారపు సంత గతేడాది 9 నెలలకు గాను రూ.3.90 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.3.80 లక్షలకు దక్కించుకున్నారు. చర్చి రోడ్డులో ఉన్న మొదటి దుకాణం, రూ.1.45 లక్షలు, రెండో దుకాణం రూ.1.32 లక్షలు పలికాయి. బ్రిడ్జి సెంటర్లో పార్క్ వద్ద ఉన్న షాప్ రూ.90 వేలు పలికింది. మొత్తంగా టెండర్ ప్రక్రియ ద్వారా గ్రామ పంచాయతీకి రూ.1,59,72,200 ఆదాయం సమకూరనుంది. -
‘పది’ పరీక్షలు షురూ..
● జిల్లాలో 99 శాతం హాజరు నమోదు ● పటిష్ట పోలీస్ బందోబస్తు.. ● కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశంకొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని 73 కేంద్రాల్లో 12,269 మంది విద్యార్థులకు గాను 12,235 మంది హాజరు కాగా, 34 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 25 మందికి 18 మంది హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లోనూ విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స అందించేందుకు ప్రతీ కేంద్రంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు విధులు నిర్వర్తించారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు భారీగా చేరుకోవడంతో సందడి వాతావరణం కనిపించింది. మొదటి రోజున ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల అనంతరం పోలీసు బందోబస్తు నడుమ సమాధానపత్రాలను పోస్టాఫీస్లకు తరలించారు. ఇక పాత కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్కు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లపై గతేడాది లాగే ఆనందఖని పాఠశాల అని పేర్కొనడం, కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు బయట ఒక బోర్డు, హాల్ టికెట్పై మరో పేరు ఉండడంతో ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అక్కడి సిబ్బందిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఇక పరీక్ష సమయానికంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు ముందే ప్రకటించినప్పటికీ.. విద్యార్థులంతా ముందుగానే ఆయా కేంద్రాల వద్దకు చేరుకోవడం విశేషం. అధికారులు, స్క్వాడ్ బృందాలు తనిఖీ.. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. కొత్తగూడెంలోని లిటిల్ బర్డ్స్, పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. డీఈఓ వెంకటేశ్వరాచారి ఏడు కేంద్రాలను తనిఖీ చేయగా మిగితా కేంద్రాలను ఇతర అధికారులు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతుల కల్పనపై పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శుభ్రంగా ఉండాలని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తగిన వసతులు కల్పించాలని సూచించారు. -
సారపాక ఈఎస్ఐలో గలాట
బూర్గంపాడు: సారపాకలోని ఈఎస్ఐ డిస్పెన్సరీలో శుక్రవారం గలాట చోటుచేసుకుంది. కార్మిక కుటుంబాలకు వైద్యసేవలు అందించాల్సిన ఈఎస్ఐలో కనీసం మందుబిల్లులు కూడా లేవని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ, షుగర్, రాయిడ్ వంటి రోగాలకు కూడా మందులు ఇవ్వకపోవటం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. మందులు ఎందుకు ఇవ్వటం లేదని జిల్లా దళిత హక్కుల పోరాటసమితి అధ్యక్షుడు పేరాల శ్రీనివాసరావు ప్రశ్నించగా ఈఎస్ఐ వైద్యుడు కరుణాకర్ దురుసుగా సమాధానం చెప్పటంతో గలాట మొదలైంది. మందులు కావాలంటే మీ ఎమ్మెల్యేకో, సెక్రెటరీయేట్కు కంప్లయింట్ చేసుకోండని డాక్టర్ దురుసుగా వ్యవహరించారని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ క్రమంలో స్థానిక నాయకులు ఈఎస్ఐకి చేరుకుని వైద్యుని తీరుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. కాగా వైద్యుడు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని పేరాల శ్రీనివాస్ బూర్గంపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
అనతికాలంలోనే అనేక విజయాలు
● ఇకపై పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోలకు మంచి రోజులు ● ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఖమ్మం సహకారనగర్: ఎన్నో చారిత్రక పోరాటాలు, జాతీయ స్థాయి ఉద్యమాలకు పురుడు పోసుకున్న ఖమ్మం వేదికగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీఎస్ సహకారంతో అనేక విజయాలు సొంతమయ్యాయని చెప్పారు. సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల సాధన, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల సంఖ్య పెంపు, గ్రామానికో అధికారి నియామకం సహా పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలను మాతృశాఖలోకి తీసుకోవడం వంటి విజయాలు సాధించామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా సమస్యలను కూడా ప్రభుత్వ సహకారంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈసమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, పాక రమేష్తో పాటు వివిధ సంఘాల బాధ్యులు పూల్సింగ్ చౌహన్, నరసింహారావు మంగీలాల్, తూమాటి శ్రీనివాస్, కోట రవికుమార్, అశోక్కుమార్, భద్రునాయక్, గుండు రాజు, జాదవ్ మాణిక్యరావు, ప్రతాప్, అభిరామ్, మురళి, బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, గరికె ఉపేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
మునగ సాగు లాభదాయకం
● ఐదెకరాల భూమి ఉన్న రైతులకు రాయితీ ● అదనపు కలెక్టర్ విద్యాచందన దమ్మపేట: మునగ పంట సాగు చిన్న, సన్నకారు రైతులకు లాభదాయకమని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్లారం రైతు వేదికలో మునగ సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మునగ సాగు ప్రారంభ దశ నుంచి తొమ్మిది నెలల లోపు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.10 లక్షలను ప్రోత్సాహకం, రాయితీల రూపంలో ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రాయితీకి ఐదు ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులతో పాటు పదెకరాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులు కూడా అర్హులేనని అన్నారు. మునగ పంట ద్వారా ఏటా ఎకరాకు రూ.లక్ష ఆదాయంపాటు మునగ ఆకుల ద్వారా మరికొంత ఆదాయం పొందవచ్చని వివరించారు. వ్యవసాయ క్షేత్రాల్లో చిన్న చెరువులను నిర్మించుకుని చేపల పెంపకం, గెదేలు, కోళ్ల ఫారం షెడ్డులు, ఇంకుడు గుంతలు నిర్మించుకుని ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు పొందాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు మాట్లాడుతూ పామాయిల్ సాగు తొలిదశలో అంతర పంటగా మునగ సాగు చేపట్టవచ్చని అన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణం వలన భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు రవికుమార్, దమ్మపేట ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఎంపీఓ రామారావు, ఏపీఓ సుధాకర్రావు, పంచాయతీ కార్యదర్శి సంజీవ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో విద్యార్థి మృతి
దుమ్ముగూడెం : మండలంలోని నారాయణరావుపేట బాలుర ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పెద్దబండిరేవు గ్రామానికి చెందిన సోయం సుకుమార్ (12) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ నెల 13న జ్వరం రావడంతో మరుసటి రోజు తల్లి సుభద్ర విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లింది. ఆయాసం వస్తుండటంతో ఈ నెల 17న దుమ్ముగూడెం ఆస్పత్రికి తీసుకెళ్లగా కామెర్లు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు భద్రాచలం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఏరియా ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు పరీక్షించి రక్తం ఒక శాతమే ఉన్నట్లు తేల్చారు. మూడు దఫాలుగా రక్తం ఎక్కించారు. అయినా విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. విద్యార్థి మృతిపై హెచ్ఎం కుంజా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. -
భక్తులకు ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు
● భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు ● శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమావేశం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి కల్యాణం, మహాపట్టాభిషేకం మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు సూచించారు. ఏప్రిల్ 6,7 తేదీల్లో జరిగే రామయ్య కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం డివిజన్స్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిథిలా స్టేడియంలో కల్యాణ మండపాన్ని 24 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. భక్తులు ఒక సెక్టార్ నుంచి మరో సెక్టార్కు వెళ్లకుండా భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, ఆన్లైన్లో లాడ్జిలు బుకింగ్, టికెట్లు విక్రయాలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తామని, పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు పట్టణాన్ని 25 జోన్లుగా విభజించి అధికారులను కేటాయించినట్లు వివరించారు. దాదాపు 200 తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. రెస్క్యూ టీమ్లను అందుబాటులో ఉంచాలి వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని వివరించారు. రెస్క్యూ టీములను, నాటు పడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. నదిలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 20 బెడ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తలంబ్రాలు, ప్రసాదం భక్తులందరికీ అందేలా చూడాలన్నారు. పోలీసుల సహకారంతో మొబైల్ తలంబ్రాల కౌంటర్లు కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. 25 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డీపీఆర్వోకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమాదేవి, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎండుతున్న వరి పొలం
పాల్వంచరూరల్: ఐదు రోజులుగా ఆరు ఆయిల్ ఇంజన్లు పెట్టి నీటిని కాలువలోకి తరలిస్తున్నా పంట పొలాలకు చేరకపోవడంతో రైతులు కలవరం చెందుతున్నారు. పొట్ట దశకు చేరిన వరి పంట నీరందరక ఎండిపోతోంది. వరి మడులు నెర్రెలు వారుతున్నాయి. మండల పరిధిలోని ప్రభాత్నగర్లో కిన్నెరసాని ఎడమ కాలువ కింద మూడు వందల ఎకరాల వరకు యాసంగిలో వరి సాగుచేశారు. ఈ పొలాలకు కిన్నెరసానితోపాటు రాళ్లవాగు పికప్ డ్యామ్ నీళ్లు కూడా వస్తాయి. గత వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా రాళ్లవాగు పికప్ డ్యామ్ తూము వద్ద గండిపడి నీళ్లు వృథాగా పోయాయి. దీంతో నీటిమట్టం అడుగంటింది. దీనికితోడు కిన్నెరసాని ఎడమ కాలువ తూము వద్ద నీటిమట్టం తగ్గిపోవడంతో నీళ్లు రావడంలేదు. రైతులు సమస్యను మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు ఈ నెల 17న కిన్నెరసాని వద్ద ఆరు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పగలు నీటిని ఎడమ కాలువలోకి మళ్లిస్తున్నా ఇంతవరకు ఆ నీళ్లు కాలువ ద్వారా ఎండిపోతున్న పంటలకు చేరుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాలువలో మట్టికట్టలు అడ్డంగా ఉన్నాయి కిన్నెరసాని ఎడమ కాలువ తూము వద్ద ఆరు ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసి ఐదు రోజుల నుంచి నీటిని కాలువలోకి తరలిస్తున్నాం. కాలువలో అక్కడక్కడా మట్టికట్టలు అడ్డంగా ఉండటంతో నీటి ప్రవాహం నెమ్మదించింది. ఇప్పటివరకు మూడు కిలోమీటర్ల వరకు నీళ్లు వెళ్లాయి. రైతులు ముందుకు వచ్చి మట్టికట్టలు తొలగిస్తే ప్రవాహం పెరిగి నీళ్లు త్వరగా పొలాలకు అందుతాయి. –చంద్రశేఖర్, ఇరిగేషన్ డీఈ ఆరు ఆయిల్ ఇంజన్లతో ఎత్తిపోస్తున్నా అందని సాగునీరు పొట్ట దశకు చేరిన పంట చేజారుతోందని రైతుల ఆవేదన -
రోడ్డు ప్రమాదంలో బీట్ ఆఫీసర్కు గాయాలు
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పద్దం ఎర్రయ్యకు బూర్గంపాడు మండలం సారపాక పుష్కర్ ఘాట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బీట్ ఆఫీసర్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా పుష్కర్ ఘాట్ వద్ద జామాయిల్ లోడ్తో ఉన్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో గాయపడగా చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బైక్లు ఢీ : ముగ్గురికి తీవ్ర గాయాలుఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టేకులపల్లి నుంచి కొమరం శ్రీను, అతని కుమార్తె హేమ బైక్పై ఇల్లెందుకు వస్తున్నారు. అదే సమయలో ఇల్లెందు నుంచి మరో బైక్పై నరేష్ అనే వ్యక్తి కొత్తగూడెం వెళుతున్నాడు. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు ఖమ్మం సిఫారసు చేశారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో శుక్రవారం ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగసాని నారాయణ (45) తన ఇంటి పక్కనే ఉన్న చిట్టయ్య ఇంటి పెరట్లోని కొబ్బరిచెట్టు ఎక్కాడు. కాయలు కోసే క్రమంలో అడ్డువస్తున్న కొబ్బరిమట్టను నరికాడు. ఆ మట్ట విద్యుత్ తీగలపై పడి విద్యుదాఘాతానికి గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఎర్రగుంట పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యసిబ్బంది తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
వన్యప్రాణులు అడవి దాటి రాకుండా చర్యలు
ఎఫ్డీఓ కోటేశ్వరరావు చండ్రుగొండ : వేసవి ఎండలు మండుతున్న నేపధ్యంలో దాహార్తి తీర్చుకునేందుకు వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కొత్తగూడెం ఎఫ్డీఓ కోటేశ్వరరావు తెలిపారు. చండ్రుగొండలోని రేంజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జంతువుల దాహార్తి తీర్చుకునేందుకు అడవుల్లో నీటి గుంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీట్ అధికారులు, బేస్క్యాంప్ సిబ్బంది, 50 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా వన్యప్రాణుల వేటకు వచ్చిన ఇద్దరిని గుర్తించి అరెస్టు చేశామన్నారు. డివిజన్ పరిధిలో 500 ఎకరాల్లో కొత్తగా ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా ఐదు మీటర్ల విస్తీర్ణంలో ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రేంజర్ ఎల్లయ్య పాల్గొన్నారు. ముగిసిన జాతరలుగుండాల: మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్న గోవిందరాజు, దూలుగొండ జాతరలు శుక్రవారంతో ముగిశాయి. మండలంలోని చెట్టుపల్లిలో సనప వంశీయుల ఇలవేల్పు అయిన గోవిందరాజు, రోళ్లగడ్డ దూలుగొండ దేవత జాతరల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు డోలీ చప్పుళ్ల నడుమ నృత్యాలు చేశారు. ఆయా దేవతలను గుట్టకు తరలించడంతో జాతరలు ముగిశాయి. గిరిజన గురుకులంలో తాగునీటి పాట్లుపాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్ సైడ్లో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. దీంతో విద్యార్థులు తాగునీళ్ల కోసం పాఠశాల నుంచి కళాశాలకు వస్తున్నారు. చిన్నారులు పెద్ద క్యాన్లలో పట్టుకుని సుమారు అరకిలోమీటర్ దూరం మోయాల్సివస్తోంది. సిబ్బంది ఉన్నా తాగునీళ్లు విద్యార్థులే తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్కుమార్ను వివరణ కోరగా.. ఆర్ఓఆర్ ప్లాంట్ మరమ్మతులకు గురైందని, బాగు చేసేందుకు మెకానిక్ను పిలిస్తే రావడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు కళాశాల ప్రాగంణంలో ఉన్న ప్లాంట్ నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. గంజాయి సీజ్భద్రాచలంఅర్బన్: ద్విచక్రవాహనంపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి ద్విచక్రవాహనంపై రెండు కిలోల గంజాయిని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. నిందితులు, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన సమీర్, రామకృష్ణలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నాగుపల్లిలో కార్డన్ అండ్ సెర్చ్
దమ్మపేట: మండలంలోని నాగుపల్లి గ్రామంలో గురువారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టి సోదాలు చేశారు. వాహనాలకు సరైన ధ్రువ పత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. అనంతరం ఎస్సై సాయికిషోర్ రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉన్నత విద్యను అభ్యసించి, భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద రీతిలో ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి, అదనపు ఎస్సై బాలస్వామి, అశ్వారావుపేట ఎస్సైలు యయాతి రాజు, రామ్మూర్తి, ఎకై ్సజ్ ట్రైనీ ఎస్సైఅఖిల, తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సై చొరవతో మహిళకు ఊరట
వేరే ఖాతాకు బదిలీ అయిన నగదు తిరిగి అందజేతకరకగూడెం: మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జుగుణమ్మ తాను పనికి వెళ్లిన చోట నుంచి ఇటీవల రూ. 28,000 ఫోన్ పే ద్వారా తన నంబర్కు పంపించుకుంది. మరుసటి రోజు నగదు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో నగదు జమ కాలేదని అధికారులు తెలిపారు. జుగుణమ్మ ఫోన్ నంబర్ బ్లాక్ అవ్వడంతో, అదే నంబర్ వేరే వాళ్లు తీసుకుని ఫోన్ పేకు లింక్ చేసుకున్నారు. దీంతో నగదు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన ఓ మహిళ ఖాతాలో జమైంది. పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండు రోజుల క్రితం కరకగూడెం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై రాజేందర్కు తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఎస్సై స్పందించి ఓ కానిస్టేబుల్ను అక్కడికి పంపి సదరు ఖాతాదారురాలి అకౌంట్ నుంచి నగదు డ్రా చేయించి తెప్పించారు. గురువారం స్టేషన్లో బాధితురాలికి నగదు అప్పగించారు. దీంతో జుగుణమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రైటర్ దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
సుజాతనగర్ : పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ప్రతీ విద్యార్థి 10/10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. మండలంలోని సర్వారం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన అనంతరం పదో తరగతి వారికి హాల్ టికెట్లు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యార్థుల జీవితానికి ఈ పరీక్షలు మైలురాయి వంటివని చెప్పారు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తేనే విజయం సాధిస్తారని, దీంతో పాటు ప్రణాళికాయుతంగా చదువుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు ఆస్కారం లేకుండా సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి ఐటీడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులను కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ జనరల్ డేవిడ్రాజ్, ఏటీడీఓ చంద్రమోహన్, క్రీడల అధికారి గోపాలరావు, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పరిధిలో 2,665 మంది.. భద్రాచలంటౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మొత్తం 2,665 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారని పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో బాలురు1,423 మంది, బాలికలు 1,242 మంది ఉన్నారని, వీరంతా 55 ఆశ్రమ పాఠశాలలు, 21 వసతిగృహాలు, మూడు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, 79 ఇతర పాఠశాలల్లో చదువుతున్నారని వివరించారు. ప్రతీ విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలని పీఓ ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులకు పీఓ సూచన -
కోడ్ ముగిసినా ముసుగు తొలగలే !
బూర్గంపాడు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినా రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు వేసిన ముసుగులు మాత్రం ఇంకా తొలగలేదు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గత నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది. నాటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో గ్రామాల్లోని రాజకీయ పార్టీల దివంగత నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. గత నెల 27న ఎన్నికలు నిర్వహించి ఈ నెల 3న ఫలితాలు వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు గడుస్తున్నా విగ్రహాలకు వేసిన ముసుగులను మాత్రం అధికారులు తొలగించలేదు. సంబంధిత రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ నాయకుడి విగ్రహానికి వేసిన ముసుగులు తొలగించకపోవటం గమనార్హం. -
40 రోజుల్లో రూ.కోటి ఆదాయం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా 40 రోజుల్లో రూ. కోటికి పైగా ఆదాయం సమకూరింది. హుండీలను గురువారం లెక్కించగా రూ.1,14,60,041 నగదుతో పాటు 133 గ్రాముల బంగారం, 1,262 గ్రాముల వెండి లభ్యమయ్యాయి. ఇంకా ఇతర దేశాల కరెన్సీ కూడా లభించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు శ్రవణ్కుమార్, భవానీ రామకృష్ణ, సీసీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి రామాలయంలో హుండీల లెక్కింపు -
దగ్ధమైన ఆయిల్పామ్ తోటలను పరిశీలించిన అధికారులు
రఘునాథపాలెం: మండలంలోని బావోజీతండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఆయిల్పామ్ తోటలను నాలుగు శాఖల అధికారులు గురువారం పరిశీలించారు. విద్యుత్శాఖ ఎస్ఈ శ్రీనివాసచార్యులు, డీఈ రామారావు, ఏడీ సంఽజీవ్కుమార్, ఏఈ సతీష్, వ్యవసాయశాఖ ఏడీఏ కొంగర వెంకటేశ్వర్లు, ఏఓ ఉమామహేశ్వర్రెడ్డి, ఉద్యానవన అధికారి నగేష్, ఆర్ఐలు సత్యనారాయణ, ప్రవీణ్ బాధిత రైతులతో మాట్లాడారు. ఈమేరకు బానోత్ పార్వతి, ప్రమీలకు చెందిన తొమ్మిది ఎకరాల తోటకు నష్టం జరిగిందని చెప్పగా, ఆయిల్పామ్, శ్రీగంధం చెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు కూడా కాలిపోయాయని వివరించారు. తోటలపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్ను మార్చాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైతులు వాపోయారు. కాగా, నష్టం వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఉద్యాన శాఖ అధికారి నగేష్ తెలిపారు. -
కీటక జనిత వ్యాధులపై అవగాహన
దుమ్ముగూడెం : కీటక జనిత వ్యాధులపై వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య బృందం అవగాహన కల్పించింది. మండలంలోని పర్ణశాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మలేరియా–ఫైలేరియా బృందం గురువారం సందర్శించింది. వైద్యాధికారి, సిబ్బందితో మలేరియా, డెంగీ కేసులపై బృందం సభ్యులు చర్చించారు. రక్త పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మలేరియా కేసు నమోదైన పులిగుండాల గ్రామాన్ని సందర్శించారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించి నీటి నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందరూ దోమతెరలు కట్టుకోవాలని చెప్పారు. వైద్యాధికారులు కుమార్ స్వామి, రేణుకారెడ్డి, ధర్మారావు, రామకృష్ణ, నాగేశ్వరరావు, మురళి, సురేష్ పాల్గొన్నారు. ఎస్బీఐ మేనేజర్కు రాష్ట్రస్థాయి అవార్డుములకలపల్లి: మండల పరిధిలోని ఎస్బీఐ పూసుగూడెం శాఖ మేనేజర్ బి.రాజేంద్రనాయక్కు రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది. ఉత్తమ బ్యాంకింగ్తోపాటు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్కు గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజీఎం రాజేశ్కుమార్ అవార్డు అందజేశారు. డీర్ పార్కు మహిళా వాచర్పై దాడి పాల్వంచరూరల్: ఇంట్లో ఉన్న కిన్నెరసాని డీర్ పార్కులో వాచర్గా పనిచేస్తున్న మహిళపై దాడి ఘటనలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిన్నెరసాని గ్రామానికి చెందిన గుంటుపల్లి జ్యోతి ఈ నెల 14న తన ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన సీహెచ్.శివ వచ్చి గొడవ పడి దాడి చేశాడు. గాయపరిచి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. చీటింగ్ కేసు నమోదుమణుగూరు టౌన్: పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో కలెక్షన్ ఏజెంట్గా పనిచేసే వ్యక్తి వసూలు చేసిన రూ.90వేల నగదుతో ఉడాయించాడు. గురువారం బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేయగా మణుగూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ ఖైదీ మృతిభద్రాచలంఅర్బన్: గంజాయి కేసులో పట్టుబడిన భద్రాచలం పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన ధనసరి మల్లేష్ అలియాస్ పోడియం మల్లేష్ను 2021లో రిమాండ్ నిమిత్తం ఖమ్మం జైలుకు తరలించారు. అనంతరం చంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. ఈ ఏడాది జనవరి 22న అతని ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 19న మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే 70958 88604నంబర్లో 24 గంటల లోపు సంప్రదించాలని చంచల్గూడ జైలర్ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగు టన్నుల చేపలు మృతి పాల్వంచరూరల్: చేపలు పట్టకుండా అడ్డుకోవడంతో నాలుగు టన్నుల చేపలు మృతిచెందాయని బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు పన్నాల శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామ శివారులో అన్ని అనుమతులతో చెరువు నిర్మించి చేపలు పెంచుకుంటున్నాడు. ఈ నెల 18న చేపలు పడుతుంటే పన్నాల చంద్రశేఖర్రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తమ అనుచరులు 15మందితో కలిసి వచ్చి చేపలు పట్టకుండా అడ్డుకున్నారు. చేపల లారీని కూడా అడ్డుకుని చంపుతామని బెదిరించారు. దీంతో రూ.2.80 లక్షల విలువైన నాలుగు టన్నుల చేపలు మృతిచెందాయని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పన్నాల శ్రీనివాసరెడ్డి తెలిపాడు. పశువులు స్వాధీనంపాల్వంచ: అక్రమంగా లారీలో తరలిస్తున్న పశువులను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు నుంచి హైదరాబాద్కు లారీలో తరలిస్తుండగా ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో నవభారత్ సమీపంలో పట్టుకున్నారు. 36 పశువులను స్వాధీనం చేసుకుని అన్నపూర్ణ గోశాలకు తరలించారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. -
పురుగు మందుకు బదులు గడ్డి మందు పిచికారీ
నేలకొండపల్లి: ఆరుగాలం కష్టపడి, అందిన దగ్గరల్లా అప్పులు తెచ్చి సాగుచేసిన వరి పంట చేతికందే సమయాన నిలువెల్లా మాడిపోయింది. పురుగుల నివారణ మందుకు బదులు గడ్డి నివారణ మందు పిచికారీ చేయడంతో ఈ పరిస్థితి ఎదురుకాగా రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నేలకొండపల్లి మండలం చెన్నారానికి చెందిన గంజికుంటల చిన్న సంగయ్య ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. పంటకు మెడ విరుపు తెగులు సోకడంతో నివారణ మందుకు బదులు ఆయన గడ్డి నివారణ మందు పిచికారీ చేశాడు. దీంతో పంట మొత్తం ఎండిపోవడంతో రూ.2లక్షల మేర పెట్టుబడి, పంట చేతికొస్తే అందే రూ.4లక్షల ఆదాయం కోల్పోయినట్లేనని కన్నీరుమున్నీరవుతున్నాడు. ఐదెకరాల్లో మాడిపోయిన వరి పంట -
పర్యావరణ స్పృహ పెంచేలా..
విద్యార్థులతో యూత్ ఎకో క్లబ్ల ఏర్పాటు ● బాల్య దశ నుంచే మొక్కలు, జల సంరక్షణపై అవగాహన ● ప్రభుత్వ పాఠశాలల్లో ఔషధ, పూల మొక్కల పెంపకానికి చర్యలు ● ఉమ్మడి జిల్లాలోని స్కూళ్లకు రూ.79.57 లక్షలు విడుదల పాల్వంచరూరల్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన యూత్ ఎకో క్లబ్ కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రీయ సప్తాహ్ ఆవిస్కార్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2024–2025 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు రూ.3 వేల చొప్పున, ప్రాథమికోన్నత, హైస్కూళ్లకు రూ.5 వేల చొప్పున నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధుల వినియోగం ఇలా ఉమ్మడి జిల్లాకు రూ.79.57 లక్షలు విడుదలయ్యాయి. వీటితో ప్రభుత్వ పాఠశాలల్లో ఔషధ మొక్కలు కరక్కాయ, విప్ప, తిప్పతీగ, కలబంద, రణపాల వంటి మొక్కలు పెంచుతారు. టాల్ ప్లాంటేషన్లో ఉసిరి, పనస, మునగ, చింత, కరివేపాకు, కానుగ, మోదుగు, పశువుల దాణాకు ఉపయోపడే అజోల్లా, కిచెన్ గార్డెన్లో ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, వివిధ రకాల పూలతోటలను పెంచాల్సి ఉంటుంది. స్కూల్ ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించి వాన నీటి సంరక్షణతోపాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. భద్రాద్రి జిల్లాలో 1,057 పాఠశాలలకు.. భద్రాద్రి జిల్లాలో 782 ప్రాథమిక పాఠశాలలకు రూ.23.46 లక్షలు, 159 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7.95 లక్షలు, 101 హైస్కూళ్లకు రూ.5.5లక్షలు, 15 సెకండరీ హైస్కూళ్లకు రూ.75 వేలు.. మొత్తంరూ.37.25 లక్షలు మంజూరు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,148 పాఠశాలలకు.. ఖమ్మం జిల్లాలోని 752 ప్రాథమిక పాఠశాలలకు రూ.22.56 లక్షలు, 187 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.9.35 లక్షలు, 194 హైస్కూళ్లకు రూ.9.70 లక్షలు, 15 సెకండరీ హైస్కూళ్లకు రూ.75 వేలు మంజూరు చేశారు. పర్యావరణ, జలసంరక్షణ నిర్వహణలో ఉత్తమ యూత్ ఎకో క్లబ్లను ఎంపిక చేసి కలెక్టర్ ప్రశంసా పురస్కారాలు కూడా అందజేస్తారు. వేసవి సెలవుల్లో విత్తన సేకరణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వేసవి సెలవుల్లో ఔషధ మొక్కలు, స్కూల్ గార్డెన్ మొక్కలు, పూలతోటల మొక్కలకు సంబంధించిన విత్తనాలను సేకరించాల్సి ఉంటుంది. వర్షాకాలం సీజన్లో ఆయా పాఠశాలల ఆవరణల్లో నర్సరీలో ఏర్పాటు చేసి మొక్కలు పెంచి, అనంతరం నాటి సంరక్షించాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు అందిస్తాం పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాస్ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎకో క్లబ్లను విజయవంతంగా నిర్వహించే పాఠశాలలకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక చొరవతో ప్రోత్సాహకాలు అందించనున్నారు. జిల్లాస్థాయిలో రూ. 50 వేలు, మండల స్థాయిలో రూ.5 వేలు, కాంప్లెక్స్ స్థాయిలో రూ.1000 చొప్పున నగదు అందజేస్తాం. ఈ నిధులతో విత్తన సేకరణతోపాటు టబ్బులు, పలుగు, పార కొనుగోలు చేసుకోవచ్చు. జల సంరక్షణకు ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంతలు నిర్మించాలి. –వెంకటేశ్వరాచారి, డీఈఓ -
విద్యుత్ శాఖలో ఎమర్జెన్సీ బృందాలు
● ఆరుగురు చొప్పున ఐదు బృందాల ఏర్పాటు ● జీపీఆర్ఎస్ లొకేషన్ ఆధారంగా పయనం, సమస్యల పరిష్కారం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంబంధించి సేవలను యుద్ధ ప్రాతిపదికన అందించేలా ఎమర్జెన్సీ రిస్టోర్ టీం(ఈఆర్టీ)లను ఏర్పాటు చేస్తున్నారు. వేసవిలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తరచుగా విద్యుత్ సమస్యలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించేలా ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు ఐదు వాహనాలను కేటాయించారు. ఈ వాహనాల ఆధారంగా ఖమ్మం సర్కిల్లో ఐదు ఈఆర్టీలను ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించారు. ఖమ్మం సర్కిల్లో ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, సత్తుపల్లి విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఖమ్మం, వైరా డివిజన్లలో ఐదు బృందాలను నియమించారు. సమాచారం అందగానే... ఎక్కడైనా విద్యుత్ సంబంధిత సమస్య ఎదురైనట్లు స్థానికులు ఫిర్యాదు చేసినా లేదా ట్రోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా సమాచారం అందినా ఈఆర్టీ బృందం వెంటనే రంగంలోకి దిగుతుంది. ఈ సేవలకు జీపీఆర్ఎస్ను వినియోగించుకుంటున్నారు. స్థానికులు, విద్యుత్ సిబ్బంది సమస్య ఉన్న ప్రాంతం జీపీఆర్ఎస్ లొకేషన్ పెడితే ఈఆర్టీలు వాహనంలో బయలుదేరతారు. ఈ యాన వాహనంలో థర్మో విజన్ కెమెరాలు, రంపాలు, టార్చ్లైట్లు, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ఈ సేవలను ఎన్పీడీసీఎల్ ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినా 24గంటల అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. కాగా, సర్కిల్ పరిధిలో వేసవి ప్రణాళికలో భాగంగా మరిన్ని ఈఆర్టీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. సత్వర సేవల కోసం... వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ఈఆర్టీలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలకు అవసరమైన వాహనాలు, సామగ్రిని సమకూర్చాం. సాంకేతిక పరిజ్ఞాం ద్వారా సమస్య ఎదురైన ప్రాంతాన్ని గుర్తించి ఆయా బృందాలు చేరుకుంటాయి. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగియగా, ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారంతో పరిసమాప్తమయ్యాయి. చివరిరోజు ద్వితీయ సంవత్సర ప రీక్షలకు జనరల్, ఒకేషనల్ కలిపి 8,115 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 7,915 మంది మాత్రమే పరీక్ష రాశారని, 200 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.మెడికల్ బోర్డుకు 170 మంది హాజరుసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో గురువారం నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డుకు 170 మంది కార్మికులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఆస్పత్రిలో గురు, శుక్రవారాల్లో మెడికల్ బోర్డు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు 199 మందికి గాను 29 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. రిపోర్ట్ ఆధారంగా శుక్రవారం అన్ఫిట్ చేస్తారు.పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చన, నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు 10 కి.మీ.
● పరీక్షల వేళ బస్సులు లేక విద్యార్థులకు తప్పని ఇక్కట్లు ● ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలే శరణ్యం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న తల్లిదండ్రులు కొత్తగూడెంఅర్బన్/ములకలపల్లి : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రయాణ పాట్లు తప్పేలా లేవు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆర్టీసీ బస్సులు సకాలంలో అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించినా.. కార్యరూపం దాల్చడం లేదు. కొన్ని మారుమూల గ్రామాల వారు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలంటే 10 నుంచి 15 కి.మీ.ప్రయాణించాలి. అయితే ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆటోలు, ఇతర వాహనాలకు డబ్బు చెల్లించలేని వారికి కాలినడకే శరణ్యం. అదే ఆర్టీసీ బస్సులు నడిపిస్తే బాలురు తక్కువ చార్జీతో, బాలికలు ఉచితంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. జగన్నాథపురానికి కేటాయిస్తే.. ములకలపల్లిలోనే రెండు కేంద్రాలు కాకుండా ఒకటి జగన్నాథపురం హైస్కూల్లో ఏర్పాటుచేస్తే అక్కడి 25 మందికి సౌకర్యంతో పాటు కమలాపురం పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులకు కూడా ఏడు కి.మీ.లోపే ఉంటుందని తల్లిదండ్రులు అంటున్నారు. వచ్చే ఏడాదైనా దీనిపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. బస్సులు నడపాలని కోరాం పదో తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సులు నడపాలని డీఈఓ ఆర్టీసీ అధికారులను కోరారు. మారుమూల గ్రామాల విద్యార్థులు పరీక్ష సమయానికి కొంత ముందుగానే ఇంటినుంచి బయలుదేరి సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలి. పరీక్ష సమయంలో ఆర్టీసీ అధికారులు కూడా చొరవ తీసుకుని విద్యార్థుల కోసం బస్సులు నడపాలి. – మాధవరావు, జిల్లా ప్రభుత్వ పరీక్షల అధికారి పాల్వంచరూరల్ :పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు నడకయాతన తప్పేలా లేదు. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్ సైట్ పరీక్ష కేంద్రానికి యానంబైల్ ఉన్నత పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. పాండురంగాపురం నుంచి 29 మంది విద్యార్థులు బూర్గంపాడు మండలం ఉప్పుసాకకు వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తోంది. ఆయా విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ప్రజావాణిలో విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. మండలాల్లో పరిస్థితి ఇలా.. ములకలపల్లి మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మండలంలో ఏడు ప్రభుత్వ, ఒక ప్రైవేటు పాఠశాల ఉండగా మొత్తం 249 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో ములకలపల్లి జెడ్పీ హైస్కూల్లో 130 మందికి, గురుకుల పాఠశాలలో 119 మందికి కేంద్రాలుగా కేటాయించారు. మండలంలోని కమలాపురం ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 మంది, జగన్నాథపురం ఉన్నత పాఠశాలకు చెందిన 25 మంది, పూసుగూడెం పాఠశాలకు చెందిన 18 మంది విద్యార్థులు పది కిలోమీటర్లు, పొగళ్లపల్లి హైస్కూల్కు చెందిన 46 మంది విద్యార్థులు 13 కి.మీ. ప్రయాణించి మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది. కాగా కమలాపురం, పొగళ్లపల్లి గ్రామాలకు అసలు ఆర్టీసీ బస్సు సౌకర్యమే లేదు. జగన్నాథపురం, పూసుగూడెం గ్రామాలకు బస్సు ఉన్నా ఉదయం వేళ రాదు. దీంతో ఆ పాఠశాలల వారికీ ప్రైవేటు వాహనాలే శరణ్యం. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలక, మైలారం ప్రాంతాల నుంచి రేగళ్ల లేదా కొత్తగూడెం వచ్చి పరీక్ష రాయాల్సి ఉండగా వారు 15 కి.మీ. మేర ప్రయాణించాల్సి ఉంటుంది. అశ్వారావుపేట, అశ్వాపురం, టేకులపల్లి మండలాల్లోనూ కొన్నిచోట్ల ఇదే సమస్య ఎదురవుతోంది. -
తలసరిలో ఓకే!
జిల్లాలో సగటు ఆదాయం రూ.3,21,281 ● ఎనీమియా ముక్త్ భారత్లో భేష్ ● ఉపాఽధి హామీలోనూ సత్ఫలితాలు ● అడవుల విస్తీర్ణంలో రాష్ట్రంలో రెండో స్థానం ● సోషియో ఎకనామిక్ ఔట్లుక్ – 2025లో వెల్లడి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: 2025 – 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వెంటనే తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ను విడుదల చేసింది. ఇందులో స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం వంటి అంశాల్లో రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లా కొద్ది తేడాతోనే వెనుకంజలో ఉన్నట్టు తేలింది. 2024 – 25లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,46,457 (ప్రస్తుత ధరలు) ఉండగా, స్థిర ధరల ప్రకారం రూ.1.77లక్షలుగా ఉంది. ఈ విషయంలో జిల్లా తలసరి ఆదాయం వరుసగా రూ.3,21,281, రూ.1,73,951గా ఉంది. జిల్లా విస్తీర్ణంలో 44 శాతం అడవులే విస్తరించి ఉన్నప్పటికీ ఇక్కడున్న పరిశ్రమల కారణంగానే రాష్ట్ర తలసరి ఆదాయంతో జిల్లా పోటీ పడగలుతోంది. ఈ నివేదికలో వెల్లడించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.. రక్తహీనత అరికట్టే దిశగా.. పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల్లో రక్త హీనత (ఎనీమియా) సమస్య దేశవ్యాప్తంగా ఉంది. దీని కోసం 2018లో ఎనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. సీ్త్రలలో రక్తహీనత తగ్గించేందుకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ విషయంలో 80 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించిన జిల్లాలు రాష్ట్ర స్థాయిలో 12 ఉండగా భద్రాద్రి జిల్లా 87.80 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ‘ఉపాధి’ ఇంకా కావాలి.. ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులైన వారికి పని దినాలు కల్పించడంలో జిల్లా 87.50 శాతం ఫలితాలు సాధించింది. రాష్ట్ర స్థాయిలో ఇది 89 శాతంగా ఉంది. ప్రస్తుతం మునగ సాగు, చేపల చెరువు, వెదురు పెంపకం చేపట్టే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ఉపాధి హామీ వర్తింపజేసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పనితీరులో జిల్లా ముందు వరుసలోకి వెళ్లే అవకాశముంది. ఇతర వివరాలిలా.. ● ఖనిజ సందప ద్వారా ఆదాయాన్ని అందించడంలో జిల్లా మెరుగైన పనితీరునే కనబరుస్తోంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా నుంచి రూ.44 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించగా రూ.42.49 కోట్ల ఆదాయం సాధించింది. ● వాణిజ్య ఎగుమతుల్లో దూసుకుపోతున్న జిల్లాల జాబితాలో మనకు చోటుదక్కలేదు. ● జిల్లాలో ఉన్న మొత్తం విద్యుత్ కనెక్షన్లలో 76.50 శాతం గృహ, 12 శాతం వ్యవసాయ, 0.5 శాతం పరిశ్రమలు, ఇతర కనెక్షన్లు 11.10 శాతంగా ఉన్నాయి. ● రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ 100 చదరపు కిలోమీటర్లకు 99.29 కి.మీ రహదారి సౌకర్యం ఉండగా జిల్లాలో ఇది 61 కి.మీ.గానే ఉంది. రోడ్డు కనెక్టివిటీ విషయంలో జిల్లా పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ● వామపక్ష ప్రభావిత నిధుల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 17.7 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. ● కొత్తగూడెం ఎయిర్పోర్టు కోసం రామవరం వద్ద 950 ఎకరాలు గుర్తించామని, ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫీజుబిలిటీ, అబిస్టికల్ లిమిటేషన్ సర్వేలు జరిగాయిని, పూర్తి స్థాయి నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని నివేదికలో పేర్కొన్నారు. ● జిల్లా జనాభా, అర్బన్, రూరల్ పాపులేషన్, లింగ నిష్పత్తి తదితర వివరాలన్నీ 2011 జనాభా లెక్కలకు సంబంధించిన పాత వివరాలే ప్రస్తుత రిపోర్టులోనూ ఉన్నాయి. 41శాతం అడవులే.. ఒక దేశం, రాష్ట్రం లేదా జిల్లా విస్తీర్ణంలో 30 శాతం అడవులు ఉండాలనే నియమాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటించేందుకు కృషి జరుగుతోంది. మన దగ్గర హరితహారం, వనమహోత్సవం పేరుతో ప్రతీ ఏటా మొక్కలు నాటుతున్నారు. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లోనే 30 శాతం.. అంతకు మించిన విస్తీర్ణంలో అడవులు ఉండగా భద్రాద్రి జిల్లా 41.38 శాతం అడవులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో ములుగు జిల్లా ఉంది. జిల్లా మొత్తం విస్తీర్ణం, అందులో అడవులను తీసుకుంటే ఇప్పటికీ వనాల విషయంలో భద్రాద్రి బెస్ట్ అనే పరిస్థితి ఉంది. -
భద్రాద్రి రామయ్యపై శీతకన్నే !
● తాజా బడ్జెట్లో యాదాద్రి, వేములవాడకు రూ.వందల కోట్లు ● భద్రాచలానికి మాత్రం మొండిచేయి.. ● డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ఎప్పుడో ?అథారిటీ ఎందుకంటే.. ఒక ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలంటే సాధారణ పద్ధతులు సరిపోవు. అందుకే ప్రభుత్వాలు ప్రత్యేక అథారిటీలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇటీవల ఖమ్మం నగరాభివృద్ధికి స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఎప్పటినుంచో పని చేస్తోంది. టెంపుల్ టౌన్గా ఉన్న భద్రాచలం అభివృద్ధికి కూడా ఈ తరహా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. భద్రాచలం: ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా భద్రాచలం పట్టణం, రామాలయ అభివృద్ధికి మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. ప్రతీ బడ్జెట్ సమయంలో భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నా.. వారికి నిరాశే మిగులుతోంది. తాజా బడ్జెట్లో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి రూ.200 కోట్లు, వేములవాడ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు ప్రకటించి.. భద్రాచలానికి గుండుసున్నా చూపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘భద్రాచలం టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. రామదాసు కాలం నాటిదే.. యాదాద్రి, వేములవాడలకు డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం..ప్రతీ బడ్జెట్లో నిధులు కేటాయించి భక్తులకు, స్థానికులకు అవసరమైన వసతులు కల్పిస్తోంది. కానీ భద్రాచలం రామాలయానికి, పట్టణాభివృద్ధికి ఎలాంటి అథారిటీ లేదు. ఎప్పుడో భక్త రామదాసు నిర్మించిన ఆలయానికి కొద్దిపాటి మార్పులు, చేర్పులు, సీతారాముల కల్యాణానికి నిర్మించిన మిథిలా స్టేడియం తప్ప ఇతర అభివృద్ధి పనులేవీ జరగలేదు. కల్యాణానికి ప్రతీ ఏడాది భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో మిథిలా స్టేడియాన్ని ఆధునాతనంగా పునఃనిర్మించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో రెండుమార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడడం లేదు. ఆలయం పక్కన మాఢ వీధుల విస్తరణకు రెవెన్యూ అధికారులు ఇటీవల భూ సేకరణ చేసి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినా దానికీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఇక రామాలయ హుండీ ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలు, ఉత్సవాల నిర్వహణకే సరిపోతుండగా భక్తులకు వసతుల సమస్య అపరిష్కృతంగానే ఉంటోంది. ఇప్పటికీ వెనుకబాటే.. భద్రాచలం పట్టణం అభివృద్ధిలో ఇప్పటికీ వెనుకబడే ఉంది. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న భద్రాచలంలోని దాదాపు 25 కాలనీల్లో లక్ష వరకు జనాభా నివసిస్తున్నారు. దీన్ని మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం యోచించినా ఏజెన్సీ చట్టాల కారణంగా న్యాయపరంగా సాధ్యం కావడం లేదు. అయితే జనాభాకు తగినట్లుగా వసతుల కల్పనలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతోంది. అన్ని విభాగాలను సమన్వయం చేస్తేనే.. భద్రాచలం అభివద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రకటనలు చేసిందే తప్ప రూపాయి కూడా మంజూరు చేయలేదు. వరదల సందర్భంగా రూ. 1,000 కోట్లు ప్రకటించినా అందులోనూ పైసా రాలేదు. అయితే ఆ స్థాయిలో నిధులు మంజూరైనా ఇక్కడ పనులు చేపట్టడం అంత తేలికై న అంశం కాదు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో స్థల సమస్య తీవ్రంగా మారింది. ఇక్కడ కీలకమైన దేవాదాయ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీశాఖ, ఐటీడీఏ, పోలీస్, పర్యాటక విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి పనులు సాధ్యమని, లేదంటే తేనెతుట్టెను కదిల్చినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక విభాగం పనులు ప్రారంభిస్తే మరో విభాగం అడ్డుకునే పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
పాల్వంచరూరల్: ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో గ్రామపంచాయతీల ద్వారా తాగునీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన ఆదేశించారు. మండల పరిధిలోని కేశవాపురం గ్రామంలో ఉపాధి పనులు, నర్సరీలను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎండ తీవ్రంగా ఉన్నందున ఉదయం ఏడుగంటలకే పని ప్రదేశాలకు చేరుకోవాలన్నారు. రూ.300 వచ్చేలా కొలతల ప్రకారం పనులు చేయాలని సూచించారు. పలుగు, పార, తట్టలు లేని కారణంగా పనులు ఎక్కువగా చేయలేకపోతున్నామని ఈ సందర్భంగా ఉపాధి కూలీలు అదనపు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి, సిబ్బంది రంగా, కృష్ణవేణి, శంకర్ పాల్గొన్నారు. ఏజెంట్ల వద్ద సైతం తలంబ్రాల బుకింగ్ ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఖమ్మం డిపో పరిధిలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ దినేష్కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్లో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వారి తలంబ్రాలను ఇంటి వద్దే అందించనుండగా, ఖమ్మం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(91542 98583), ఖమ్మం పాతబస్టాండ్ ఏజెంట్(97043 45599), కొణిజర్ల ఏజెంట్(85220 12587), నేలకొండపల్లి ఏజెంట్ 83310 06959, బోనకల్ ఏజెంట్(83091 25037)ను సంప్రదించాలని సూచించారు. ఇసుక లారీ సీజ్దమ్మపేట: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని బుధవారం రాత్రి పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... రాత్రి వేళ ఎస్సై సాయికిషోర్ రెడ్డి సిబ్బందితో కలసి మండల పరిధిలోని జలవాగులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని గుర్తించి, స్టేషన్కు తరలించారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వైస్ ఎంపీపీ మృతిటేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో వైస్ ఎంపీపీ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. టేకులపల్లి ఎస్ఐ పి.సురేష్ కథనం ప్రకారం.. మండలంలోని సులానగర్ గ్రామానికి చెందిన, తాజా మాజీ వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ (56) బుధవారం రాత్రి బైక్పై కొత్తగూడెం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. అదే సమయంలో లక్ష్మీదేవిపల్లి మండలం వేపలగడ్డకు చెందిన పాయం రాకేష్, టేకులపల్లి మండలం బోడు కొత్తగూడేనికి కిషోర్ మరో బైక్పై కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బోరింగ్ తండా సమీపంలో కొత్తగూడెం–ఇల్లెందు ప్రధాన రహదారిపై రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. ఉండేటి ప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో రాకేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తీసుకెళ్లారు. కాగా మృతుడు ప్రసాద్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సురేందర్ సందర్శించి సంతాపం తెలిపారు. -
ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
పాల్వంచరూరల్: పాలకులు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని పెద్దమ్మగుడి సమీపంలొ బుధవారం నిర్వహించిన రైతు సంఘం జిల్లాస్థాయి జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులను, వ్యవసాయరంగాన్ని కాపాడాలని కోరారు. వ్యవసాయరంగం బలంగా ఉంటేనే అన్ని రంగాలు బలంగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, గత ప్రభుత్వం ఎత్తేసిన వ్యవసాయ యంత్రాల సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. రైతులు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, అధ్యక్షుడు చంద్ర నరేంద్రకుమార్, నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, నరాటి ప్రసాద్, శ్రీనివాస్, వీసంశెట్టి పూర్ణచందర్రావు, అడుసుమల్లి సాయిబాబా, దస్రూ, హన్మంతరావు, బండి నాగేశ్వరరావు, ఉప్పశెట్టి రాహుల్, సుధాకర్, యూసుఫ్, రమేష్, లక్ష్మి, బిక్షం, కొంగర అప్పారావు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు -
అంగన్వాడీల్లోనూ ‘హాఫ్ డే’
● ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం వరకే అంగన్వాడీ కేంద్రాలు ● ఒకేపూట నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం ● వేసవిలో చిన్నారులకు ఉపశమనం భద్రాచలంఅర్బన్ : ప్రభుత్వ పాఠశాలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలను సైతం ఈ ఏడాది వేసవికాలంలో ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచే భానుడు భగ్గుమంటుండగా మార్చి రెండో వారం నుంచి ఉష్టోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిన్నారుల తల్లిదండ్రుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరుకు గదుల్లో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే చిన్నారులకు ఉపశమనం కలుగుతోంది. పాఠశాలలను మాత్రమే హాఫ్డే స్కూళ్లు నిర్వహించే ప్రభుత్వం ఈసారి అంగన్వాడీ కేంద్రాలకూ ఈ అవకాశం కల్పించింది. ఈనెల 15 నుంచే ఈ నిర్ణయం అమలు కాగా, మే 31 వరకు ఒక్కపూటే కేంద్రాలు కొనసాగుతాయని, ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తాయని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లే ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నారులకు ఉపశమనం.. జిల్లా వ్యాప్తంగా 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 853 మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. 445 సెంటర్లను ప్రభుత్వ భవనాలు, పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. 762 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 5,967 మంది గర్భిణులు, 6,681 మంది బాలింతలు, మూడేళ్ల లోపు చిన్నారులు 30,941 మంది, 3 – 6 ఏళ్ల లోపు వారు 25,479 మంది ఉన్నారు. అద్దె భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న కేంద్రాల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉండగా వేసవిలో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను సైతం ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో చిన్నారులకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తోంది. ఇదిలా ఉండగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. తగినంత గాలి, వెలుతురు లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు వేడితో ఇబ్బంది పడుతున్నారు. ఉత్తర్వులు అందాయి అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని రాష్ట్ర మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే కేంద్రాలు నిర్వహిస్తున్నాం. మే 31 వరకు ఇలాగే కొనసాగుతాయి. దీంతో చిన్నారులకు కొంత ఇబ్బంది తగ్గుతోంది. – స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మధ్యాహ్నం వరకే.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వేసవి కాలం దృష్ట్యా మధ్యాహ్నం 12.30 గంటల వరకే వారికి ఆహారం సమకూర్చేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎండ, ఉక్కపోతతో చిన్నారులు, గర్భిణులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే 12.30 గంటల వరకే అయినా ఎండ ప్రభావం పడుతుందని, ప్రతీ అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, పనిచేయని చోట మరమ్మతు చేయించాలని, సరైన వసతులు కల్పించాలని గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు. -
ఆలయంలో రెండోసారి చోరీ
అశ్వారావుపేటరూరల్: మండలంలోని పాత మామిళ్లవారిగూడెం గ్రామ శివారులో ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం గేటు తాళాన్ని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు లోపల ఉన్న హుండీని తెరిచి నగదు అపహరించారు. హుండీలో సుమారు రూ.10 వేలు ఉంటాయని భక్తులు చెప్పారు. కాగా, ఇదే ఆలయంలో గత జనవరి 9న హుండీ పగులగొట్టి రూ. 40 వేలు చోరీ చేశారు. ఆలయంలో రెండోసారి చోరీ జరిగిన నేపథ్యంలో పోలీసులు దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. చోరీపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై యయాతి రాజు తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనంఅశ్వారావుపేటరూరల్: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై టీ యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని వినాయకపురం నుంచి బోలెరో వాహనంలో పది బస్తాల్లో ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వైపు తరలిస్తుండగా అశ్వారావుపేట బస్టాండ్ సెంటర్లో పోలీసులు పట్టుకున్నారు. వాహనం డ్రైవర్ దారం చిన్న శ్రీనివాస్, వాహన యజమాని ఆదివిష్ణుపై కేసు నమోదు చేశారు. బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులకు అప్పగించి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యబూర్గంపాడు: మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతున్న వ్యక్తిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్ఐ రాజేష్ ఘటనా ప్రాంతానికి చేరుకుని ట్రాక్టర్ సాయంతో చెట్టుకు ఉరివేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో మృతుడు ఎవరనేది గుర్తించలేకపోయారు. మృతుడి వివరాలు తెలిస్తే సమాచారమందించాలని ఎస్ఐ రాజేష్ కోరారు. పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్యదమ్మపేట: పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న యువకుడు బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన అయినవెల్లి నాని(28) కొంతకాలంగా వేరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో భార్య సునీత, కుటుంబ సభ్యులు మంగళవారం మందలించారు. దీంతో మనస్తాపం చెంది అదేరోజు రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు దమ్మపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి మూడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. నాటుసారా స్వాధీనంపాల్వంచరూరల్: మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో బుధవారం ఎకై ్సజ్ అధికారులు నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయానికి రావాలని చెప్పి విక్రయదారులను వదిలేసి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ ప్రసాద్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. మర్కోడు రేషన్ షాపు సీజ్గుండాల: కొంతకాలంగా రేషన్షాపు డీలర్ విధులు హాజరు కాకుండా సరుకులు ఇవ్వకపోవడంతో ఇల్లెందు సివిల్ సప్లయీస్ అధికారులు బుధవారం దుకాణాన్ని సీజ్ చేశారు. ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీ కేంద్రంలోని రేషన్ షాపు సేల్స్మెన్ తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నాడని, బియ్యం ఇవ్వడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో సివిల్ సప్లయీస్ డీటీ యాకూబ్పాషా తదితరులు తనిఖీ చేశారు. బుధవారం గ్రామస్తుల సమక్షంలో తాళాలు పగులగొట్టి వీడియో తీస్తూ స్టాక్ను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి 41 క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పలుమార్లు విచారణ కోసం ప్రయత్నించినా సేల్స్మన్ నుంచి స్పందన లేకపోవడంతో షాపును సీజ్ చేశారు. రేషన్ షాపు నిర్వహణ బాధ్యతలను మరో సేల్స్మెన్కు అప్పగించాలని జీసీసీ అధికారులను కోరామని, నివేదిక అందించామని డీటీ వివరించారు. -
తొమ్మిదో తరగతి బాలికతో అసభ్య ప్రవర్తన
టేకులపల్లి: విద్యార్థినిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన డిప్యూటీ వార్డెన్ను తల్లిదండ్రులు, గ్రామస్తులు బుధవారం చితకబాదారు. మండలంలోని గంగారం ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్ (హిందీ టీచర్) మాలోత్ ప్రతాప్సింగ్ మంగళవారం మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పాఠశాల ఆవరణలో తొమ్మిదో తరగతి బాలికపై చేతులు వేసి అసభ్య పదాలు మాట్లాడుతూ ఇబ్బందికి గురి చేశాడు. బాలిక ప్రతిఘటించి డిప్యూటీ వార్డెన్ను నెట్టివేసింది. అదే సమయంలో వంట చెరకు డబ్బుల కోసం వచ్చిన గ్రామస్తులకు బాలిక ఏడ్చుకుంటూ విషయం తెలిపింది. దీంతో వారు ప్రశ్నించగా తప్పయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గ్రామస్తులు విషయం తెలపడంతో బాలిక తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, బంధువులు రాత్రి పాఠశాలకు రాగా, డిప్యూటీ వార్డెన్ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో బుధవారం మళ్లీ సుమారు వంద మందికి పైగా పాఠశాలకు చేరుకుని డిప్యూటీ వార్డెన్, హెచ్ఎంలను నిలదీశారు. డిప్యూటీ వార్డెన్ పశ్చాత్తాపం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చితకబాదారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడు. బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్, డిప్యూటీ తహసిల్దార్ ముత్తయ్య, ఏటీడీవో రాధ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక, తల్లిదండ్రులు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా ఈ ఘటనలో డిప్యూటీ వార్డెన్పై హెచ్ఎం జగన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో పాఠశాలకు వచ్చి, కోరిక తీర్చాలని బాలికను బలవంతం చేయబోయిన డిప్యూటీ వార్డెన్ను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పాఠశాల నుంచి తిరిగి వెళ్తున్న బోడు పోలీసులకు బైక్పై వెళ్తున్న డిప్యూటీ వార్డెన్ తారస పడటంతో అదుపులోకి తీసుకుని బోడు పోలీసు స్టేషన్కు తరలించారు. డిప్యూటీ వార్డెన్ను చితకబాదిన గ్రామస్తులు -
బడ్జెట్లో అన్ని వర్గాలకూ అన్యాయం
మాజీ మంత్రి వనమా పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకూ అన్యాయం జరిగిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదని, విద్యాబోధన గురించి ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని పార్టీకి పంచిపెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. రేషన్ కార్డులు రాక పేదలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతానికి భిన్నంగా ప్రస్తుత బడ్జెట్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా -
బొమ్మనపల్లి విద్యార్థినికి కలెక్టర్ ప్రశంస
టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని గాయత్రిని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం అభినందించారు. కలెక్టర్ ప్రయోగాత్మకంగా చేసిన బాలమేళా కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ ద్వారా అమలు చేసిన రాయటం, చదవడం అనే విధానం ద్వారా రెండో తరగతి విద్యార్థి గాయత్రి వేదికపై కథను చదివి వినిపించింది. దీంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పాత కొత్తగూడెంలో ఉన్న జిల్లా విద్యా వనరుల కేంద్రంలో జరిగిన బాలమేళా ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ బొమ్మనపల్లి విద్యార్థులు ప్రదర్శించిన నాటిక, పద్యం, కథలతో ప్రతిభ చాటారని ప్రశంసించారు. బొమ్మనపల్లి పాఠశాల బాలమేళాలో బెస్ట్ స్కూల్గా ఎంపిక కాగా, హెచ్ఎం ఎం.జ్యోతిరాణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరచారి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్, టేకులపల్లి ఎంఈఓ జగన్, జర్పల పద్మ పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సిద్ధం
● జిల్లాలో 73 కేంద్రాలు, హాజరుకానున్న 12,282 మంది.. ● విద్యార్థులకు ఐదు నిమిషాల వెసులుబాటు ● పోలీస్స్టేషన్లకు చేరిన ప్రశ్నపత్రాలుజిల్లాలోని పాఠశాలలు, విద్యార్థుల వివరాలిలా.. మేనేజ్మెంట్ స్కూళ్లు బాలురు బాలికలు మొత్తం ప్రభుత్వ 13 279 209 488 స్థానిక సంస్థలు 97 1731 1511 3242 ఎయిడెడ్ 09 163 309 472 గిరిజన సంక్షేమ 51 1077 1321 2398 టీఎస్ఎంఆర్ఎస్ 08 114 112 226 టీఎస్టీడబ్ల్యూఆర్ఎస్ 11 380 457 837 కేజీబీవీ 14 00 519 519 ఎంజేపీటీ 11 297 293 590 ప్రైవేట్ 126 1948 1562 3510కొత్తగూడెంఅర్బన్ : జిల్లాలో ఈనెల 21 నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత వారం రోజులుగా ఎంఈఓలు, హెచ్ఎంలతో వీడియో, టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 73 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా గురువారమే తరగతి గదుల్లో హాల్టికెట్ నంబర్లు వేయనున్నారు. వారం రోజుల క్రితమే ప్రశ్నపత్రాలు కేంద్రాల సమీప పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఎండల నేపథ్యంలో విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే చికిత్స చేసేందుకు పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడిపించాలని ఆర్టీసీ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు.. పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12. 30 వరకు పరీక్షలు జరుగనుండగా 9.35 నిమిషాల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అయితే గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,282 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఏడుగురు రూట్ అధికారులు, 73 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 26 మంది సెంటర్ కస్టోడియన్లు, 73 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష అనంతరం సమాధానపత్రాల బండిళ్లను పోస్టాఫీసులకు చేరవేసేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు సకాలంలో చేరుకోవాలి విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలి. పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం కానుండగా ఆ తర్వాత ఐదు నిమిషాల వరకు కూడా అనుమతిస్తాం. పరీక్ష సమయంలో ఆర్టీసీ అధికారులు నడిపే బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష కేంద్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – వెంటేశ్వరాచారి, డీఈఓ -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేడు, రేపు కార్పొరేట్ మెడికల్ బోర్డుసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాస్పత్రిలో గురు, శుక్రవారాల్లో కార్పొరేట్ మెడికల్ బోర్డ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నేడు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా మెడికల్ రిపోర్ట్ల ఆధారంగా పని చేయలేని వారిని శుక్రవారం అన్ఫిట్ చేస్తామని తెలిపారు. పీహెచ్సీలో డీఎంహెచ్ఓ తనిఖీకొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం పట్టణ పరిధి సఫాయిబస్తీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి భాస్కర్నాయక్ బుధవారం తనిఖీ చేశారు. మందుల స్టాక్ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఇందుకోసం విస్తృత ప్రచారం నిర్వహించాలని పారా మెడికల్ సిబ్బందికి సూచించారు. ‘వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్’లో నేటి నుంచి శిక్షణకొత్తగూడెంటౌన్: ఆశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు వద్ద ‘రోయిండ్ వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్’లో గురువారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీవైఎస్ఓ పరంధామరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు యలమంచి కిరణ్ శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని, లేదంటే నేరుగా తుమ్మలచెరువు వద్దకు వెళ్లి సంప్రదించవచ్చని వివరించారు. వివరాలకు తమ కార్యాలయ సిబ్బంది లక్ష్మయ్య(99661 25087), కోచ్ యలమంచి కిరణ్ (94945 97083)ను సంప్రదించాలని సూచించారు. 27న కొత్తగూడెం ‘బార్’ ఎన్నికలునామినేషన్లకు నేడు తుది గడువు కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఎన్నిక ఈనెల 27న నిర్వహించనున్నట్లు సీఈఓ పలివేల గణేష్బాబు తెలిపారు. బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పారు. స్థానిక కోర్టులో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మహిళా రిప్రజెంటేటివ్, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రటరీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయని వివరించారు. ఈనెల 17 నుంచి నామినేషన్లు స్వీకరిస్తుండగా బుధవారం నాటికి 34 మంది దాఖలు చేశారని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంటుందని, అదేరోజు సాయంత్రం 4 గంటలకు బరిలో ఉండేవారి పేర్లు ప్రకటిస్తామని చెప్పారు. సమావేశంలో సహాయ ఎన్నికల అధికారులు ఎర్రపాటి కృష్ణ, పాల రాజశేఖర్ పాల్గొన్నారు. -
కనువిందు చేసేలా మ్యూజియం
ఐటీడీఏ పీఓ రాహుల్ భధ్రాచలం: భద్రాచలం వచ్చే పర్యాటకులు, భక్తులకు కనువిందు చేసేలా గిరిజన మ్యూజియం వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బుధవారం ఆయన బోటింగ్, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ పనులు, మ్యూజియం లోపల పెయింటింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల సంస్కతి, సంప్రదాయాల పెయింటింగ్లతో పాటు గిరిజన వంటకాల స్టాళ్ల నిర్మాణం తదితర పనులు శనివారం లోగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. శ్రీరామనవమికి వచ్చే భక్తులు ఈ మ్యూజియాన్ని సందర్శించేలా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఉద్యానవన అధికారి ఉదయ్కుమార్, ఏసీఎంఓ రమణయ్య, డీఈ హరీష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఏఈ రవి, పంచాయతీ ఈఓ శ్రీనివాస్, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి బూర్గంపాడు: విద్యార్థులు, అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందించాలని పీఓ రాహుల్ రెవెన్యూ అధికారులకు సూచించారు. బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ఎలా చేస్తున్నారని తహసీల్దార్ ముజాహిద్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. యువతకు రాజీవ్ యువ వికాసం పథకంతో ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను సకాలంలో అందించాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ సిబ్బందిని రీచ్ల వద్ద ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. క్రీడా దుస్తుల సరఫరాకు టెండర్ల ఆహ్వానంభద్రాచలంటౌన్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని క్రీడా పాఠశాలలకు దుస్తుల (టీ షర్ట్, షార్ట్, ట్రాక్ షూట్) సరఫరాకు సీల్డ్ షార్ట్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. టెండర్లో పాల్గొనే వారు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని, ఆసక్తి గలవారు గురువారం నుంచి ఈనెల 24 వరకు ఐటీడీఏ కార్యాలయంలో టెండర్ షెడ్యూళ్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.1000 ఐటీడీఏ భద్రాచలం పేరుతో ఎస్బీఐ భద్రాచలం బ్రాంచ్లో చెల్లుబాటు అయ్యేలా డీడీ సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. ధరావత్ సొమ్ము రూ.లక్ష డీడీ, టెండర్ షెడ్యూల్ను బాక్స్లో వేస్తే 24వ తేదీ మధ్యాహ్నం హాజరైన వారి సమక్షంలో బాక్స్ తెరిచి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
భక్తులకు చల్లదనం కల్పిస్తాం
● శ్రీరామ నవమికి భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు ● సరిపడా వసతులు, తలంబ్రాలు అందిస్తాం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి భద్రాచలం : ఏప్రిల్లో ఎండలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో ఈ ఏడాది శ్రీరామనవమికి వచ్చే భక్తులకు చల్లదనం కోసం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. నవమి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. మిథిలా స్టేడియంలో పునాది, స్వాగత ద్వారాలతో పాటు ఇతర పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవికాలంలో భక్తులకు ఉపశమనం కలిగించేందుకు తొలిసారి ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో మిస్ట్ ఫాగింగ్(పొగమంచు కురిసినట్టుగా) ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులందరికీ సరిప డా ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలను దేవస్థానం ఆధ్వర్యంలో తయారుచేస్తున్నామని, కల్యాణాన్ని వీక్షించిన భక్తులు వాటిని స్వీకరించాలని సూచించారు. అందరికీ సరిపడా వసతులను కల్పించాలని, వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ప్రశాంతంగా కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొబైల్యాప్పై అభినందన.. కలెక్టర్ పాటిల్ తొలుత రామాలయానికి చేరుకోగా ఈఓ రమాదేవి, అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలంయలో ప్రత్యేక పూజల అనంతరం శ్రీ లక్ష్మీతాయారమ్మవారి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈఓ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. భక్తుల కోసం రూపొందించిన మొబైల్ యాప్ గురించి, అందులో పొందుపర్చిన సేవలు, సందర్శనీయ స్థలాలు, వసతుల గురించి వివరించారు. దీన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులను అభినందించారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలికొత్తగూడెంఅర్బన్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఎదగాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లా విద్యాశాఖ, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత పరికరాలు, ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే సదుపాయాలను దివ్యాంగులు వినియోగించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. దివ్యాంగులకు దృఢ సంకల్పం ఎక్కువగా ఉంటుందని, తనతో కలిసి చదువుకున్న మానసి జోషి ప్రమాదంలో కాళ్లు కోల్పోయినా దృఢ నిశ్చయంతో ఆడి పారా ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించిందని గుర్తు చేసుకున్నారు. దివ్యాంగ విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటునందిస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను అభినందించారు. -
జిల్లాకు ఊరట..
కొత్తగూడెం కార్పొరేషన్కు బడ్జెట్లో నిధులు ● సీతారామ ప్రాజెక్టుకూ భారీగానే కేటాయింపు ● పల్లెలు, గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం ● జిల్లాలో టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం ● ‘భద్రాద్రి’, ఇంజనీరింగ్ కాలేజీకి మాత్రం మొండిచేయే..సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: త్వరలో ఏర్పాటుకాబోయే కొత్తగూడెం కార్పొరేషన్కు ప్రస్తుత బడ్జెట్లో చోటు దక్కింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోగా ఆమోదం రావడంతో పాటు గవర్నర్ సంతకం చేసి గెజిట్ వచ్చే అవకాశం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా కొత్తగూడెం – పాల్వంచ కార్పొరేషన్కు నగరాభివృద్ధి పద్దులో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో పలుమార్లు పేర్కొన్నారు. ఇటీవల కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ అయిన మంచిర్యాల, మహబూబ్నగర్తో పాటు కొత్తగూడేనికి వివిధ పద్దుల కింద రమారమీ రూ.1,000 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్కు పెద్దపీట వేసినట్టయింది. కాగా, ఓఎన్జీసీ, సింగరేణి భాగస్వామ్యంలో మణుగూరు మండలం పగిడేరు వద్ద జియో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని భట్టి వెల్లడించారు. సాగునీటి రంగానికీ ఊతం.. 2025 – 26 రాష్ట్ర బడ్జెట్లో సీతారామ ప్రాజెక్టుకు రెండు పద్దుల కింద వరుసగా రూ.643 కోట్లు, రూ. 56 కోట్లు కేటాయించారు. తొమ్మిదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టి రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల ఆరంభంలో తొలిసారిగా గోదావరి నీళ్లు ఎన్నెస్పీ కెనాల్కు చేరుకోవడం సానుకూల అంశం. ఇదే తీరుగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులకు నీరు మళ్లించేందుకు ప్రస్తుత కేటాయింపులు దోహదపడనున్నాయి. ఇక మధ్య తరహా ప్రాజెక్టుల్లో పెదవాగుకు రూ.46 కోట్లు, తాలిపేరుకు రూ.7.30 కోట్లు కేటాయించడం గమనార్హం. రైస్ మిల్లులు రాబోతున్నాయి.. జిల్లాలో రైస్ మిల్లుల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ పండించిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుత బడ్జెట్లో ప్రతీ మండలంలో మహిళా రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఐకేపీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ రైస్ మిల్లులకు తరలిస్తామని, ఇక్కడి నుంచే ఎఫ్సీఐకి ఆ ధాన్యాన్ని విక్రయిస్తామని తెలిపారు. మరోవైపు ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా కోసం ఆర్టీసీ బస్సులను మండల సమాఖ్యలకు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలోని డిపోలకు బస్సులు చేరుకున్నాయి. దీనికి తోడు మండలాల్లో మినీ గోడౌన్లు నిర్మిస్తామన్నారు. ఈ గోడౌన్లు, వాటి ప్రాంగణాలు సైతం రైతులకు ఉపయోగకరం కానున్నాయి. టూరిజానికి ఊతం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టూరిజం పాలసీలో జిల్లా చోటు దక్కించుకుంది. కిన్నెరసాని దగ్గర అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంట్ను నియమిస్తామని డిప్యూటీ సీఎం ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్ ద్వారా జిల్లాలో పర్యాటక రంగానికి రూ.775 కోట్లు ప్రకటించడంతో టూరిజం పరంగా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. పల్లెలకు బాటలు.. జిల్లాలో ప్రతీ పంచాయతీకి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించారు. అడవుల్లోనే నివాసం ఉండే పీవీటీజీ ఆవాసాలకు సైతం సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని దమ్మపేట మండలంలో కాలిబాట ఉన్న పూసుగూడెం పరిసర గ్రామాలకు పక్కా రోడ్డు రానుంది. అలాగే రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలోని మండలాల్లో రోడ్ల నిర్మాణాలకు రూ.450 కోట్ల కేటాయించగా.. ఈ మూడు ఐటీడీఏల్లో భద్రాచలమే పెద్దదిగా ఉంది. మావోయిస్టు ప్రభావిత నిధులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా కేంద్ర పద్దు కింద రూ.82 కోట్ల కేటాయింపులు చూపారు. ఇందులో లొంగిపోయిన మావోయిస్టులకు రూ.20కోట్లు ఉండగా మిగిలినవి ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ, ఎస్టాబ్లిష్మెంట్ తదితర అవసరాల కోసం వెచ్చించనున్నారు. భరద్రగిరికి నిరాశే రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్టకు రూ.200 కోట్లు, వేములవాడ టెంపుల్ అథారిటీకి రూ.100 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. అయితే భద్రాచలం క్షేత్రానికి మాత్రం మళ్లీ నిరాశే ఎదురైంది. గత పదకొండేళ్లుగా ప్రతీ బడ్జెట్లో భద్రాచలం ఆలయానికి ప్రత్యేక నిధుల కేటాయింపు అనేది ఎండమావిగానే నిలుస్తోంది. సాంకేతిక విద్య విషయానికి వస్తే కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త భవనాలు, ల్యాబ్లు, పరికరాల కోసం రూ.75 కోట్లు కేటాయించాలని 2023లో ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ మోక్షం రాలేదు. అయితే జేఎన్టీయూ, పాలేరుకు రూ.50 కోట్ల కేటాయింపు ఊరటనిచ్చే అంశంగా మిగిలింది. -
పశువులు తరలిస్తున్న వ్యాన్ పట్టివేత
అశ్వారావుపేటరూరల్: అక్రమంగా పశువులను కబేళాకు తరలిస్తుండగా సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని విజయనగరం జిల్లా అలమంద సంత మార్కెట్లో కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే 8 ఆవులు, 4 ఎద్దులను వ్యాన్లో హైదరాబాద్లోని కబేళాకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడి చేసి స్థానిక రింగ్ రోడ్ వద్ద పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యాన్ను సీజ్ చేసి, మూగజీవాలను పాల్వంచలోని గోశాలకు తరలించారు. వ్యాన్ యజమాని, డ్రైవరు ఓర్సు శ్రీను, క్లీనర్ అల్లపు వెంకటేశ్, దళారీ మానేపాటి ఎల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
యువతిపై బాబాయి దాడి..
ఇల్లెందురూరల్: తండ్రి లాంటి వ్యక్తి.. తన అన్న కూతురిపై దాడి చేసి గాయపర్చిన ఘటన మండలంలోని ఒడ్డుగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఒడ్డుగూడేనికి చెందిన శ్రీలత కుటుంబానికి.. ఆమె బాబాయ్ జగదీశ్ కుటుంబానికి మధ్య ఇంటి స్థలం విషయంలో గొడవలు జరగుతున్నాయి. మంగళవారం కూడా గొడవ జరగడంతో జగదీశ్.. శ్రీలతపై దాడి చేసి గాయపర్చాడు. కుటుంబ సభ్యులు ఆమెను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీలత తండ్రి వీరభద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు -
అడవులపై ఆదివాసీలకే హక్కులు
అశ్వారావుపేటరూరల్: అడవులపై ఆదివాసీలకే సంపూర్ణ హక్కు ఉంటుందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ అన్నారు. మండలంలోని కావడిగుండ్ల, గాండ్లగూడెం, పండువారిగూడెంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ఫలాలతో పాటు ఏ విషయంలోనూ గిరిజనులకు అడ్డు చెప్పొద్దన్నారు. కొండరెడ్ల గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు. అటవీ చట్టాల్లో ఏమైనా లొసుగులు ఉంటే సవరించాలన్నారు. పోడు పట్టాలున్న వారికి గిరి వికాసం పథకం కింద కరెంట్, బోర్లు, మోటార్లు ఇవ్వాలని కోరారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. గిరిజనుల్లో ఇంకా ఎవరైనా అర్హులుంటే సర్వే చేసి పోడు పట్టాలు ఇస్తామని చెప్పారు. కావడిగుండ్ల, గాండ్లగూడెంలో 60 మందికి హక్కు పత్రాలు ఇచ్చామన్నారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. గాండ్లగూడెం నుంచి చెన్నాపురం వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని, పనులు పూర్తి కాగానే ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాగా, ఐటీడీఏ రుణాల మంజూరుకు ఓ ఉద్యోగి రూ.10వేల చొప్పున వసూలు చేస్తున్నాడని కావడిగుండ్ల సభలో గిరిజనులు ఫిర్యాదు చేయగా అతడిని సస్పెండ్ చేయాలని హుస్సేన్నాయక్ పీఓకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాద్రావు, ఎఫ్డీఓ దామోదర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ మహేందర్, డీడీ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ -
పోడు భూములకు విద్యుత్ లైన్లు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోడు పట్టాలు పొందిన రైతుల సాగుకు వీలుగా నీటి వసతి కల్పించాలని, ఈ మేరకు విద్యుత్, అటవీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో తగిన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యుత్ లైన్లు సాధ్యం కాని పక్షంలో అటవీ శాఖ అధికారుల ఆమోదంతో బావులు తవ్వి సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పోడు భూముల్లో ఆయిల్పామ్ సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధిహామీ పథకం లక్ష్యాలను పూర్తిచేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్ తవ్వకాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని, నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయ శాఖ అధికారుపై చర్య తప్పదని హెచ్చరించారు. జలశక్తి అభియాన్లో భాగంగా పంచాయతీ పరిధిలోని ప్రతీ కార్యాలయం, పాఠశాలలు, రోడ్డు పక్కన ప్రాంతాలను గుర్తించి ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వు ఎక్కడా కనిపించడం లేదని, ఆమొక్కలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని నర్సరీల్లో ఇప్ప, కరక్కాయ, చింత, విషముష్టి, కుంకుడు, తంగేడు వంటి మొక్కలు పెంచాలన్నారు. గింజలు సేకరించే విద్యార్థులకు గ్రామస్థాయిలో రూ. 1,000, మండల స్థాయిలో రూ 5,000, జిల్లాస్థాయిలో రూ 50,000 బహుమతిగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. వీసీలో అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఏడీఆర్డీఓ రవి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారులు అనసూర్య, ఇందిర, మిషన్ భగీరథ అధికారి నళిని పాల్గొన్నారు. పిల్లల కలలకు రూపం ఇవ్వండి కొత్తగూడెంఅర్బన్: పిల్లల కలలు, ఊహా శక్తికి సరైన ప్రోత్సాహం అందిస్తే వారి భవిష్యత్ బంగారుమయం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా స్థాయి బాలమేళా ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తీసుకున్న ఈ వినూత్న కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయమన్నారు. పిల్లల అభ్యసన అభివృద్ధికి ఉపాధ్యాయులు అద్భుత కృషి చేశారని అభినందించారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 23 పాఠశాలలను, అత్యుత్తమ పనితీరు కనబరిచిన పది మంది కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఐదుగురు ఎంఈఓలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో వినూత్నంగా ప్రవేశపెట్టిన ప్రాథమిక స్థాయి నోట్ పుస్తకాల ప్రాజెక్టు విజయవంతంలో కీలక పాత్ర పోషించిన 15 మంది ఆర్పీలను కూడా సత్కరించారు. అనంతరం టేకులపల్లి మండలం బొమ్మనపల్లి పాఠశాల విద్యార్థుల ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీంతో స్పందించిన కలెక్టర్ వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు బహుమతిగా అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ సతీష్, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.అధికారులకు కలెక్టర్ ఆదేశం -
జిల్లాలో సీపీఐకి ఆదరణ భేష్
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి ప్రజాదరణ మెండుగా ఉందని, ప్రజలపక్షం వహించే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. మంగళవారం ఆయన జగదల్పూర్ నుంచి కొత్తగూడెం మీదుగా విజయవాడ వెళ్తూ.. స్థానిక సీపీఐ జిల్లా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషాతో చర్చించారు. అనంతరం రాజా మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే ప్రజాపోరాటాలకు రాష్ట్రంలోనే ఈ జిల్లా అదర్శంగా నిలుస్తోందని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంతోమంది జాతీయ స్థాయి నాయకులను అందించిందని, ప్రజావాణి వినిపించే నేతలను చట్ట సభలకు పంపిందని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జిల్లాలో పార్టీ విస్తరణకు, ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం శ్రమిస్తుండడం హర్షణీయమన్నారు. ఈ ఏడాది సకాలంలో సభ్యత్వాలు పూర్తి చేసిన జిల్లా నాయకత్వాన్ని అభినందించారు. సిపిఐ శత ఆవిర్భావ వేడుకలు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఐ జాతీయ నాయకులు రామకృష్ణ పాండే తదితరులు ఉన్నారు. -
ఈత.. కావొద్దు గుండెకోత..
చుంచుపల్లి: జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. ప్రస్తుతం మార్చిలోనే పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చిన్నారులు, యువకులు, పెద్దలు ఈత కొట్టేందుకు వ్యవసాయ బావులు, చెరువులు, కాల్వలు, కుంటలను ఆశ్రయిస్తుంటారు. నీటిలోతు తెలియక మునిగి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయేది నిండు వేసవి కాలం. విద్యార్థులకు ఒక్కపూట బడులు మొదలు కాగా మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువకులు ఈతకు వెళ్లే సందర్భాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అత్యధిక ఉష్ణోగ్రతలు వేసవి ఆరంభంలోనే జిల్లావ్యాప్తంగా రాష్ట్రంలోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండు వేసవిలో చిన్నారులు, యువకులు చెరువులు, కుంటలు, కాల్వల్లో ఈత కొట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఈత మంచి వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమే కానీ.. ఈత నేర్చుకోకుండా నీటిలోకి దిగడం చాలా ప్రమాదకరం. చిన్నారులు, యువకులందరికీ ఈత రాకపోవడం, ప్రమాదకర ప్రదేశాల్లో హెచ్చరికలు లేకపోవడంతో స్నేహితులతో కలిసి నీటి వనరుల వద్దకు వెళ్లే పిల్లలు, యువకులు ప్రమాదాలను అంచనా వేయలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదాలకు నిలయమైన చెరువులు, వాగులు, కుంటలు, కాల్వల వద్ద నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు. ఈ మేరకు ఈత విషయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తగిన అవగాహన కల్పించాల్సి ఉంది. అలాగే, కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి. నీటి కుంటలు, వాగులు, పంట కాల్వలు, చెరువులు, వ్యవసాయ బావులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటాయి. అందుకే పొంచి ఉన్న ప్రమాదాల గురించి చిన్నారులను హెచ్చరించాలి. నిపుణులైన శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే ఈత నేర్పించాలి. నీట మునిగేవారిని కాపాడే ప్రయత్నంలోనూ కొందరు ఈత వచ్చినవారూ ప్రాణాలు కోల్పోతున్నారు. అగ్నిమాపక, పోలీస్ శాఖ, గజ ఈతగాళ్ల సహకారంతో, రక్షించే మెళకువలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నిఘా అవసరం ● ప్రస్తుతం పాఠశాలలు ఒకటే పూట కొనసాగుతుండగా, త్వరలో వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు ఎటు వెళ్తున్నారనే అంశంపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ● ఈత రానికారణంగా గట్టుమీద ఉండేవారు సైతం కాసేపటికి నీటిలో దిగుతుంటారు. ఇదే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈత నేర్పించడం ద్వారా ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ● ఈత విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉంది. ● ఈత నేర్చుకునే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ● బావులు, కాల్వలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు వాటి లోతును ముందుగానే పరిశీలించాలి. తక్కువ నీరు ఉన్న ప్రదేశంలోకే వెళ్లాలి. ● ఈత కొట్టే సమయంలో సరదాలు, పందేలు, అత్యుత్సాహం వంటివి వద్దు. అవి ప్రాణాలకే ముప్పు తెస్తాయి. ● పూర్తిగా ఈత వచ్చే వరకు లోతైన ప్రాంతానికి వెళ్లొద్దు. ఈత నేర్చుకునే సమయంలో ట్యూబులు, బెండ్లు వాడుతున్నప్పటికీ శిక్షకులు లేకుండా జలవనరుల్లోకి దిగడం మంచిది కాదు. సరదా కోసం వెళ్తే ప్రాణాలు హరీ కాపాడే ప్రయత్నంలోనూ మరణాలు ప్రతి వేసవి సీజన్లోనూ ఘటనలు పిల్లలపై తప్పనిసరి తల్లిదండ్రుల నిఘా గతంలో జరిగిన కొన్ని ఘటనలు.. 2023 ఏప్రిల్ 13న అశ్వారావుపేట ఉసిర్లగూడేనికి చెందిన కొర్సా ఏసుబాబు (17) స్థానిక ఊర చెరువులో స్నేహితులతో కలిసి ఈతకు దిగి లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లి మృత్యువాత పడ్డాడు. 2023 ఫిబ్రవరి 28న భద్రాచలానికి చెందిన ఆరుగురు స్నేహితులు మేడువాయి వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లారు. అందులో అక్బర్బాషా (17), పాలపర్తి వాసు (16) లోతు గమనించక గల్లంతై చనిపోయారు. పాల్వంచ బొల్లోరిగూడెం ఏరియాకు చెందిన సిద్దెల రీక్షిత్కుమార్ (11) 2022 మార్చి 14న స్నేహితులతో కలిసి కిన్నెరసాని నుంచి కేటీపీఎస్కు వెళ్లే నీటి కాల్వలో ఈతకు వెళ్లి నీళ్లలో మునిగి కొట్టుకుపోయి మృతి చెందాడు. కొత్తగూడెం సంజయ్నగర్ కాలనీకి చెందిన ఎస్డీ సోహెల్పాషా (17), అబ్దుల్ హమీద్, జక్కినిబోయిన అనిల్కుమార్ (15) 2022 జూన్ 27న పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి కేటీపీఎస్ వెళ్లే కాల్వలో ఈతకు వెళ్లి లోతు ఉండటంతో మునిగి చనిపోయారు. గతేడాది జనవరి 20న టేకులపల్లి మండలం సీతారాంపురానికి చెందిన బోడ అజయ్ (20) కొత్తగూడెంలో చదువుతూ స్నేహితులతో కలిసి పాల్వంచ కరగకవాగుకు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. -
ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
చుంచుపల్లి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ముత్యాల తలంబ్రాలను ఆర్టీసీ ద్వారా నేరుగా ఇంటికే పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెం డిపోలో వాల్పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. నవమి సందర్భంగా భద్రాచలం వెళ్లలేని భక్తులు ఆర్టీసీ కార్గో విభాగం ద్వారా రూ.151 చెల్లించి తలంబ్రాలను పొందవచ్చన్నారు. ఇందు కోసం ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగూడెం–91542 98599, పాల్వంచ–93473 40036, ఇల్లెందు– 83280 18525, గుండాల–95021 42298, ఆళ్లపల్లి–84650 70239 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిబ్బంది సునీత, జహీరుద్దీన్, రాములు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ హనుమ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం టేకులపల్లి: బీసీ గురుకులాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8, 9 (ఇంగ్లిష్ మీడియం) తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, తుది గడువు ఈనెల 31 వరకు ఉందని టేకులపల్లి ఎంజేపీ బాలుర గురుకుల ప్రిన్సిపాల్ ఎస్.రవీందర్ మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 20 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు బోనఫైడ్, ఆధార్కార్డు, ఫొటోపై సంతకం, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ పత్రం కలిగి ఉండాలని తెలిపారు. తండ్రికి కుమార్తె తలకొరివి.. కొత్తగూడెంటౌన్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తాటిపల్లి రాజేశ్కుమార్కు పెద్ద కూతురు అంతక్రియలను నిర్వహించడం అందరినీ కలచివేసింది. కొత్తగూడెం న్యూగొల్లగూడెం రాజీవ్గృహకల్పలో నివాసం ఉంటున్న ‘సాక్షి’ఉద్యోగి తాటిపల్లి రాజేశ్కుమార్ ఈనెల 14న కారు ఢీకొని మృతిచెందిన విషయం విదితమే. మంగళవారం మృతుడి పెద్ద కూతురు శ్రీకరి తలకొరివి పెట్టింది. తండ్రికి ఏమైందో తెలియని వయస్సులో అంతక్రియలు నిర్వహించడంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్ దుమ్ముగూడెం: మండలంలోని తూరుబాక, నర్సాపురం గ్రామాల్లోని గోదావరి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసి ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్టు సీఐ అశోక్ మంగళవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. తూరుబాక, నర్సాపురం గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య.. దాడి చేసి ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో తూరుబాకకు చెందిన చిట్టిమల్ల వెంకటేశ్, పాత మారేడుబాక వాసి జాబిశెట్టి రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మహ్మద్నగర్లో.. చండ్రుగొండ: మండలంలోని మహ్మద్నగర్ గ్రామశివారులోని పెద్దవాగు నుంచి మంగళవారం రాత్రి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ పాపయ్య తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పెద్దవాగు నుంచి ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. డ్రైవర్ ఎస్కే యాకూబ్ను అదుపులో తీసుకున్నామని ఏఎస్ఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కల్లూరు: కల్లూరులోని తిరువూరు క్రాస్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువూరు క్రాస్ మీదుగా వెళ్తున్న కంటైనర్ కల్లూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా వెనక కూర్చున్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటకు చెందిన దుబ్బాక రాజారావు(50) అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే బైక్ నడుపుతున్న వెంకటేశ్వరరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు మృతుడి బంధువు ప్రసాద్ ఫిర్యాదుతోకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘శానిటేషన్’ ప్లాన్ రూపొందించండి
● కంపోస్టు డెవలప్మెంట్ అధికారి హేమలత ● 9 మున్సిపాల్టీల సిబ్బందికి ఇల్లెందులో ఒకరోజు శిక్షణ ఇల్లెందు: ప్రతీ మున్సిపాలిటీలో ‘సిటీ శానిటేషన్ ప్లాన్’ రూపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్లు, శానిటేషన్ జవాన్లకు కంపోస్టు డెవలప్మెంట్ అధికారి హేమలత సూచించారు. నూరుశాతం జీరో బేస్డ్ శానిటేషన్ పట్టణాలుగా మార్చాలని, అందుకు అగ్రభాగాన ఉన్న ఇల్లెందు మున్సిపాల్టీలోని సక్సెస్ను అధ్యయనం చేసేందుకు వచ్చిన మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 మున్సిపాల్టీల అధికారులు, సిబ్బందికి ఇల్లెందులో మంగళవారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. భైపాస్ రోడ్లోని డంప్యార్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హేమలత పలు అంశాలపై వివరించారు. ప్రతీ మున్సిపాల్టీలో చెత్త ఉత్పత్తి అయ్యే ప్రదేశాలను గుర్తించాలని, ఎంత మేర చెత్త లభిస్తుందో అంచనా వేయాలని సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీకి తడి చెత్త లభించే ప్రదేశాలను గుర్తించాలన్నారు. కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మార్కెట్ను ఎంచుకోవాలని సూచించారు. ప్రతీ వారం సమీక్షలు నిర్వహించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్, డోర్నకల్, తొర్రూర్, ఖమ్మం, మఽధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, మణుగూరు మున్సిపాలిటీల అధికారులు పాల్గొన్నారు. -
నవమి పనుల్లో నాణ్యత ఎంత..?
● ఆలస్యంగా ప్రారంభం కావడంతో భక్తుల్లో అనుమానాలు ● ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వేడుకోలు ● స్టేడియంలో ఓపెన్ షెడ్ నిర్మాణం ఈ ఏడాదికి లేనట్టే ! ● ఇప్పటికీ పునాదులకే పరిమితమైన పనులు భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే శ్రీసీతారాముల కల్యాణం, పట్టాభిషేక బ్రహ్మోత్సవాలు ఈనెల 30న ఉగాది రోజున ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పలు పనులు దేవస్థానం ఆధ్వర్యంలో చేపడతారు. ఈ మేరకు ఇటీవలే రూ.కోటి విలువైన పనులకు అధికారులు టెండర్లు ఖరారు చేశారు. భద్రాచలంలో మూడు వైపులతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సిద్ధం చేస్తున్నారు. మిథిలా స్టేడియం ప్రాంతంలో హోర్డింగ్లకు రంగులు అద్దుతున్నారు. కరకట్ట దిగువ భాగాన ఏర్పాటు చేసిన రామాయణ ఇతివృత్తాల బొమ్మలకు సైతం పెయింటింగ్ వేస్తున్నారు. కరకట్ట ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఇక తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుతో పాటుగా ఇతర పనులు ప్రారంభించాల్సి ఉంది. ఓపెన్ షెడ్ లేనట్టే.. ప్రసాద్ పథకంలో భాగంగా మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ షెడ్ ఈ ఏడాది శ్రీరామనవమికి లేనట్టేనని స్పష్టమవుతోంది. ఈ ఓపెన్ షెడ్ నిర్మాణంలో నిర్లక్ష్యంపై ఫిబ్రవరి 22న సాక్షిలో ‘నలభై రోజుల్లో నవమి.. పునాదుల్లో పనులు’ అనే కథనం ప్రచురితమైంది. ఇందులో దేవస్థానం, టూరిజం ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎత్తిచూపింది. అనుకున్నట్టుగానే ఈ ఓపెన్ షెడ్ నిర్మాణాన్ని ఈ నవమికి అందించలేమని సంబంధిత కాంట్రాక్టర్ జిల్లా ఉన్నతాఽధికారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. కేవలం పునాదుల వరకు మాత్రమే పూర్తి చేస్తామని చెప్పి ఆ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఆ పునాదుల పనులు మాత్రమే నడుస్తున్నాయి. ఇవి పూర్తయిన అనంతరం సెక్టార్ల విభజన, బారికేడింగ్ ఇతర పనులు చేపట్టాల్సి ఉంది. దీనిపై దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు సైతం పరిస్థితిని అంచనా వేసి టూరిజం శాఖ ఉన్నతాధికారులను అప్రమత్తం చేయాల్సి ఉండగా మనకెందుకులే అన్నట్టుగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు అంటున్నారు. ఇప్పటికై నా ఇటు దేవస్థానం, అటు జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని భక్తులతో పాటు భద్రాద్రి పట్టణ వాసులు కోరుతున్నారు. హడావిడిగా పనులు చేయొద్దు.. ప్రతీ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు నెలరోజుల ముందుగానే టెండర్లు ఖరారు చేసేవారు. అయితే ఈ ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ ప్రక్రియలో చాలా ఆలస్యం జరిగింది. అయితే సమయం తక్కువగా ఉందనే సాకుతో పనులు హడావిడిగా, నాణ్యత లేకుండా చేపట్టే అవకాశం ఉంటుందని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. గతంలో ఎక్కువ సమయం ఉన్నప్పుడే నవమికి ముందు రోజు రాత్రి డివైడర్లకు, రోడ్లకు పెయింటింగ్ వేసి తూతూ మంత్రం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఏడాది పాటు ఖాళీగా ఉంచి నవమికి కొద్ది రోజుల ముందు పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనులను సైతం ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్ఇల్లెందురూరల్: ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు రావులపాటి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. కేయూ సీనియర్ ప్రొఫెసర్ పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ‘డాక్టర్ సీతారాం సాహిత్యం – అధ్యయనం’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య ఆధ్వర్యాన సన్మానించారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్రావు, అధ్యాపకులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నాగేశ్వరరావు, కృష్ణవేణి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాకేష్ శ్రీరాం, డాక్టర్ రాజు, ఈశ్వర్, సురేందర్, సరిత, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, లక్ష్మణ్రావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కొత్తగూడెంఅర్బన్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భాస్కర్నాయక్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలని, పనిచేసే వైద్యుల సర్టిఫికెట్లను ఫైల్ చేయాలని తెలిపారు. ఆయుష్ ఆస్పత్రులు, ఫిజియోథెరిపీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓతో పాటు డిప్యూటీ డెమో ఫయాజ్ మొహినుద్దీన్, పాయం శ్రీను, డిప్యూటీ పీఎంఓ తదితరులు పాల్గొన్నారు. కవితా పోటీల కరపత్రాలు ఆవిష్కరణపాల్వంచ: పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి కవితా పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ వాదం పరిణామాలు అనే అంశాలపై 30 లైన్లకు మించకుండా కవితలు రాసి ఈనెల 26వ తేదీ నాటికి 93993 24497, 98498 90322 నంబర్లకు పంపించాలని కోరారు. విజేతలకు నగదు బహుమతులు, సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, కొండల్ రావు, నర్సింహాకుమార్ పాల్గొన్నారు. -
కంపగూడెం పాఠశాలకు అవార్డు
ములకలపల్లి: మండలంలోని కంపగూడెం ప్రభుత్వ పాఠశాలకు బాలమేళాలో అవార్డు లభించింది. బా లమేళాలో భాగంగా ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (లిటరసీ, న్యూమరసీ) అంశాల్లో కంపగూడెం పాఠశాల గత నెలలో ఎంపికై ంది. మండలంలోని 48 పాఠశాలలకు గాను కంపగూడెం పాఠశాలను బెస్ట్ స్కూల్గా విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమ్మేళనంలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, డీఈఓ వెంకటేశ్వరాచారి, హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయురాలు కీసరి జయసుధను సత్కరించి, మెమెంటో అందజేశారు. ఎంఈఓకు ప్రశంస దమ్మపేట: విధి నిర్వహణలో ఉత్తమంగా వ్యవహరించిన స్థానిక ఎంఈఓ కీసర లక్ష్మిని మంగళవారం కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అభినందించారు. బాలమేళా కార్యక్రమ నిర్వహణతో పాటుగా విధులను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వహించిన దమ్మపేట ఎంఈఓ లక్ష్మి.. జిల్లాస్థాయిలో ఉత్తమ ఎంఈఓగా ఎంపికయ్యారు. కొత్తగూడెంలో నిర్వహించిన జిల్లాస్థాయి బాలమేళాలో మండలంలోని జగ్గారం ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో ఎంఈఓ లక్ష్మితో పాటుగా జగ్గారం పాఠశాల హెచ్ఎం పుష్పకుమారిని కలెక్టర్ సత్కరించారు. ప్రశంసాపత్రాలను అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి
కొత్తగూడెంటౌన్: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాక్షి దినపత్రిక ఉద్యోగి సోమవారం మృతి చెందాడు. కొత్తగూడెం వన్టౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూగొల్లగూడేనికి చెందిన తాటిపల్లి రాజేష్కుమార్(38) సాక్షి దినపత్రికలో సీనియర్ యాడ్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం బైక్పై రామవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కొత్తగూడెం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేష్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అదే కారులో క్షతగాత్రుడిని కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఏడేళ్లలోపు కూతుళ్లు ఇద్దరు ఉన్నారు. సాక్షులపై బెదిరింపులు? పోలీసుల విచారణలో ప్రమాదానికి కారణమైన కారు రుద్రంపూర్ తిలక్నగర్కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ సబ్సిడీపై పొందిన కారు అయినప్పటికీ మూడేళ్లుగా నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు నడిపింది ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదాన్ని చూసిన సాక్షులను సైతం కారుతో ఢీకొట్టినవారు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై కొత్తగూడెం వన్టౌన్ సీఐ ఎం.కరుణాకర్ను వివరణ కోరగా.. బైక్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు రుద్రంపూర్ తిలక్నగర్కు చెందిన వ్యక్తిదిగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు. -
న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులు న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ సూచించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన న్యూట్రిషియన్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 1,050 మందికి కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా ఆరు నెలలపాటు పూర్తిగా ఉచితంగా మందులు అందిస్తుందని పేర్కొన్నారు. వైద్యాధికారులు బి.బాలాజీ, హరీష్, పాయం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలిఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి జేఎంఎస్ లెనీనా అన్నారు. మండలంలోని ఎర్రగుంట సెక్టార్ శాంతినగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటి పెంచాలని సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సలోని, సూపర్వైజర్ రాణి పాల్గొన్నారు. మహిళపై దాడి ఇల్లెందు: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన బానోత్ మంగమ్మ సోమవారం చేను వద్ద పనిచేస్తుండగా అదే గ్రామానికి చెందిన సంపత్ అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకుని వెళ్తుండగా రాయితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్దుమ్ముగూడెం : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్ కథనం ప్రకారం.. రేగుబల్లి గ్రామ శివారులో గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో పాత మారేడుబాక గ్రామానికి చెందిన గుండి చిట్టిబాబు, కుర్శం కనకరాజు, తూరుబాక గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీనులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పరస్పరం దాడి : కేసు నమోదుకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం న్యూగొల్లగూడెంలోని ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం దాడి చేసుకోగా త్రీటౌన్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. న్యూగొల్లగూడేనికి చెందిన సోదరులు గుమ్మడేల్లి రమణ, దుర్గా మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం అనుచరులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. కాపర్ వైరు చోరీ చేస్తున్న వ్యక్తి పోలీసులకు అప్పగింత అశ్వాపురం: వ్యవసాయ మోటార్లలో కాపర్ వైరు చోరీ చేస్తున్న వ్యక్తిని రైతులు సోమవారం పట్టుకున్నారు. మండల పరిధిలోని జగ్గారం గ్రామంలో రైతులు పర్శబోయిన సుధాకర్, రాసబంటి లింగరాజు, నాగరాజు, ఆవుల ఎల్లయ్య, మదమంచి నరసింహారావుకు చెందిన మోటార్ల కాపర్ వైరు చేసిన పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన మొద్దుల నరేష్ను రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతనిపై గతంంలో పాల్వంచ మండలంలో కేసు కూడా నమోదైనట్లు సమాచారం. మనస్తాపంతో లారీడ్రైవర్ బలవన్మరణం కొణిజర్ల: ఓ వైపు అప్పుల బాధ, మరోవైపు పెళ్లయిన కొద్దిరోజులకే కూతురి భర్త మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన ఓ లారీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని తనికెళ్ల గంగెడ్లపాడుకు చెందిన లారీ డ్రైవర్కు తాళ్ల ఆనందరావు(51)కు భార్య శౌరమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేయగా ఈ ఏడాది జనవరిలో అల్లుడు మృతి చెందాడు. అప్పటి నుంచి మనస్తాపంతో మద్యానికి బానిసైన ఆనందరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకుని మృతి చెందాడు. ఘటనపై భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు. -
మనస్థాపంతో వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సోమవారం కేసు నమోదైంది. టేకులపల్లి ఎస్ఐ పోగుల సురేష్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండా గ్రామానికి చెందిన బాదావత్ చిన్న లక్ష్మా (60) భార్య నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో మరొకరు... దమ్మపేట: భార్య మందలించిందనే కారణంగా మద్యం మత్తులో ఓ వ్యక్తి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన పాండ్ల నాగరాజు(42) మద్యానికి బానిసగా మారి ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో భార్య సత్యావతి మందలించింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. పేకాట శిబిరంపై దాడిదమ్మపేట: మండల పరిధిలోని మొద్దులగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ.2,500 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఏఎస్సై బాలస్వామి తెలిపారు. అత్యాచార యత్నంఇల్లెందు: అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నెహ్రూనగర్ గ్రామానికి చెందిన భూక్య సునీతపై అదే గ్రామానికి చెందిన నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. బియ్యం లారీ సీజ్అశ్వాపురం: మణుగూరు నుంచి పాల్వంచ వైపు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్రెడ్డి, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో సుమారు 180 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
ఇద్దరు నిందితుల అరెస్ట్
భద్రాచలంఅర్బన్: మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కథనం ప్రకారం.. గత నెల 19న పట్టణంలోని ఇందిరా మార్కెట్లోని కిరాణా షాపులో ఉన్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించి ఈ నెల 11న ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందుతులు పరారీలో ఉండగా గాలింపు చేపడుతున్నారు. సోమవారం పట్టణంలోని బ్రిడి్జ్ సెంటర్లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2.35 లక్షల విలువైన ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
రేపు దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగ విద్యార్థులకు ఈ నెల 19న సహాయ ఉపకరణాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తన్నట్లు సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్కే సైదులు తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర శిక్షా, ఆర్టిఫిషియల్ లింబ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి, 288 మంది అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వారికి ఈ నెల 19న కొత్తగూడెంలోని ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ చేతుల మీదుగా ఉపకరణాలు పంపిణీ చేస్తామని తలెఇపారు. ఎంపికై న అభ్యర్థులు రెండు ఫొటోలు, సదరం ధ్రువపత్రం, పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ ధ్రువీకరణతో ప్రభుత్వ వైద్యుడి నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్కార్డు, ఆధార్కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. బ్రెయిలీ కిట్లు–13, హియరింగ్ ఎయిడ్–33, వీల్చైర్లు–76, ఎంఆర్ కిట్లు–96, ట్రైసైకిళ్లు–16, రోలెటర్లు–29, కాలిఫర్స్–23, బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్–2, ఇతరాలు–64 పంపిణీ చేస్తారని ఆయన వివరించారు. సమావేశంలో హెచ్ఎం మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిలో 290 సెల్ఫోన్ల రికవరీ
ఖమ్మం క్రైం: సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తుండగా, ఐటీ సెల్ బృందం ట్రాక్ చేశాక స్వాధీనం చేసుకుని బాధితులకు అందిస్తున్నామని ఖమ్మం అదనపు డీసీపీ నరేష్కుమార్ తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో రూ.7లక్షల విలువైన 48 ఫోన్లను యజమానులకు ఆయన అందజేసి మాట్లాడారు. ఇందులో రూ.10వేలు మొదలు రూ.1.50 లక్షల విలువైన ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 680 ఫోన్లు పోగొట్టుకున్నట్లు పోర్టల్లో నమోదు కాగా 582ఫోన్లను గుర్తించి, 290 ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్, ఏసీపీ వెంకటేశ్, ఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ హేమనాధ్, కానిస్టేబుళ్లు నరేష్, శ్రీనును కమిషనర్, అదనపు కమిషనర్ అభినందించారు. ఖమ్మం అదనపు డీసీపీ నరేష్కుమార్ -
సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని పీకే–1 ఇంక్లైన్ ఏరియాలో నిర్మిస్తున్న సెల్ టవర్ను నిలిపివేయాలని స్థానికులు సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే బీటీపీఎస్, సింగరేణి, సోలార్ ప్లాంట్, హెచ్డబ్ల్యూపీ(ఎం) పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, దీనికితోడు సెల్ టవర్ నిర్మిస్తే రేడియేషన్ ప్రభావంతో అనారోగ్యం పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం సీసా చట్టం, గిరిజన హక్కులకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు వినతి