Bhadradri District News
-
జాతీయస్థాయి అథ్లెటిక్స్లో కానిస్టేబుల్ ప్రతిభ
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ జాతీయస్థాయి అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 20 నుంచి 26 వరకు జరుగుతున్న 7వ జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్లో సోమవారం జరిగిన జావెలిన్ త్రో పోటీలో ప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ప్రసాద్ను పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పట్టణానికి చెందిన పలువురు క్రీడాకారులు అభినందించారు. ఖమ్మం రీజియన్లో అగ్రస్థానం గుండాల: ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండల కేంద్రంలోని గురుకుల కళాశాల ఖమ్మం రీజియన్లో అగ్రస్థానంలో నిలిచింది. బైపీసీ సెకండియర్లో సఫియా 917 మార్కులు సాధించింది. కస్తూర్బా కళాశాలలో ఫస్టియర్లో 21 మందికి అందరూ, సెకండియర్లో 10 మందికి 10 మంది ఉత్తీర్ణులయ్యారు. గుండాల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ 96 మందికి 72 మంది, సెకండియర్లో 76కు 75 మంది ఉత్తీర్ణత సాధించారు. యూఆర్జేసీలో ద్వితీయ సంవత్సరం 30 మందికి 30 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఎంపీసీలో బి.సతీశ్కుమార్ 985, బైపీసీలో జె.భరత్కుమార్ 863, సీఈసీలో కె.హేమంత్ 797 మార్కులు సాధించారు. కేసు నమోదు ఇల్లెందు: మండలంలోని హనుమంతులపాడు గ్రామానికి చెందిన కీసరి మౌనికను ఆమె భర్త నెహ్రూ, అత్త గురువమ్మ, బావ శ్రీను కొంతకాలంగా వేధిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెహ్రూ మద్యానికి బానిసగా మారి భార్య మౌనికను ఇబ్బంది పెడుతున్నాడు. తాళలేక మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ మసీనా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడి ఆత్మహత్య కరకగూడెం: మద్యానికి బానిసై ఓ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేకుంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన తాళ్ల మురళి (63) మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో పురుగులమందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మొక్కజొన్న కంకులు దగ్ధం ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం శివారులో బంధంకుంట చెరువు సమీపంలోని మొక్కజొన్న చేనులో కుప్పగా పోసిన కంకులు మంగళవారం దగ్ధమయ్యాయి. రైతులు గుడిపెల్లి సుధాకర్, మంచె రామనాథం, మంచె రవీందర్, మంచె శ్రీనుకు చెందిన ఐదెకరాల విస్తీర్ణంలోని మొక్కజొన్న పంటకు సంబంధించిన కంకులను కోసి, చేనులోనే కుప్పగా పేర్చారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నేల తడిగా ఉండటంతో కుప్పలు పూర్తిగా కాలిపోకుండా కాపాడుకోగలిగారు. అయినప్పటికీ తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. విద్యుదాఘాతంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచర్ల : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో విద్యుత్ షాక్తో ఓ జవాను మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా గంగులూరు సీఆర్పీఎఫ్ 195వ బెటాలియన్ క్యాంప్లో జవాన్గా పని చేస్తున్న సుజోయ్పాల్ (34) సోమవారం సాయంత్రం ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుకు మరమ్మతు చేస్తుండగా షాక్కు గురయ్యాడు. దీంతో సహచర జవాన్లు గంగులూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని బీజాపూర్కు తరలించి శవ పంచనామా అనంతరం అతడి స్వస్థలమైన పశ్చిమ బెంగాల్కు మంగళవారం తరలించినట్లు ఏఎస్పీ చంద్రకాంత్ గవర్ణ తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత టేకులపల్లి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్తండాకు చెందిన బాణోతు వినోద్ ఎలాంటి అనుమతులు లేకుండా శంభునిగూడెం ముర్రేడు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లో నింపుకుని ఇల్లెందుకు తరలిస్తుండగా ముత్యాలంపాడు క్రాస్రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి వినోద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
మా ఊళ్లో ఏం జరుగుతోంది..?
‘మేరీ పంచాయతీ’ యాప్లో సమస్త సమాచారం ● నిధుల ఖర్చులో పారదర్శకతకు ప్రాధాన్యత ● ఆదాయ, వ్యయాలను గ్రామస్తులు తెలుసుకునే అవకాశం ● తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట భద్రాచలంఅర్బన్: గ్రామ పంచాయతీలో అభివృద్ధి వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మేరీ పంచాయతీ (నా పంచాయతీ)యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్తో పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను పాలకవర్గం ఎలా ఖర్చు చేస్తోందనే విషయాన్ని ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చు. ఈయాప్ను 2019లోనే రూపొందించినా పలు కారణాలు, సాంకేతిక సమస్యలతో ప్రజలకు కొన్ని వివరాలను అందించలేపోయింది. అయితే ప్రస్తుతం ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పారదర్శక పాలన.. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటారు. ఆ నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో పొందుపర్చాలని, తద్వారా గ్రామాల్లో పారదర్శక పాలన సాగుతుందని అధికారులు చెబుతున్నారు. నిధుల వివరాలు ఆన్లైన్లో ఉండడంతో గ్రామాభివృద్ధికి ఎలాంటి పనులను చేపడుతున్నారో ప్రజలు తెలుసుకోవచ్చు. ఇందులో వివరాల నమోదు సమయంలోనే జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించే అవకాశం ఉండడంతో, అక్కడి పనులకు కేటాయించిన డబ్బును ఇతర చోట్ల వినియోగించేందుకు వీలుండదు. పాలకవర్గాలు సైతం పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. పాలకులు, అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలకు ప్రశ్నించేందుకు వీలు కలుగుతుంది. అన్ని వివరాలు నిక్షిప్తం.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధుల వివరాలు మాత్రమే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం పంచాయతీలకు మంజూరు చేసే నిధుల వివరాలు, ఏ పనికి ఎంత ఖర్చు చేశారు, అవి ఏ దశలో ఉన్నాయి అనే వివరాలు యాప్లో నమోదై ఉంటాయి. ఆదాయ, వ్యయాలతో పాటు పంచాయతీలో నిర్వహించే గ్రామ సభల వివరాలు సైతం యాప్లో అందుబాటులో ఉంటాయి. ప్లేస్టోర్ ద్వారా... స్మార్ట్ ఫోన్లో ఉండే ప్లేస్టోర్ యాప్లో ‘మేరీ పంచాయతీ’ పేరుతో సెర్చ్ చేయగానే వచ్చే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అవ్వాలి. ఆ వెంటనే ఫైనాన్షియల్ ఇయర్, స్టేట్, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనిపిస్తాయి. వాటిని నమోదు చేయగానే ఆయా పంచాయతీలకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.కొరవడిన అవగాహన ‘మేరీ పంచాయతీ’ యాప్నకు సంబంధించి గ్రామ పంచాయతీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో వెనకబడి ఉన్నారనే చెప్పాలి. చాలావరకు గ్రామాల్లో కొంత చదువుకున్న యువతకు తప్ప, ఇతరులకు ఈ యాప్ ఉన్నట్టు కూడా తెలియదు. యాప్పై అవగాహన లేకపోవడంతో చాలామంది తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికై నా పంచాయతీ అధికారులు యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించాలి పంచాయతీ పద్దులకు సంబంధించి ఇలాంటి యాప్ ఉన్న విషయం చాలామందికి తెలియదు. ప్రజలకు యాప్పై అవగాహన లేకపోవడంతో నిధుల వినియోగానికి సంబంధించి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలే నేరుగా నిధుల వివరాలను తెలుసుకునేలా అధికారులు ఈ యాప్పై అందరికీ అవగాహన కల్పించాలి. – వీవీఎన్ ప్రసాద్, భద్రాచలం -
వ్యవసాయ కుటుంబం నుంచి 697వ ర్యాంకు
కల్లూరురూరల్: కల్లూరు మండలం వాచ్యానాయక్ తండాకు చెందిన గిరిజన యువకుడు బానోత్ నాగరాజు నాయక్ సివిల్స్ ఫలితాల్లో మెరిశాడు. ఆయన ఆల్ఇండియా స్థాయిలో 697వ ర్యాంక్ సాధించాడు. నాగరాజు నాయక్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కల్లూరులో, 6నుంచి 10వ తరగతి వరకు పాలేరులోని నవోదయ విద్యాలయంలో చదవగా, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాల, బీటెక్ హైదరాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో పూర్తిచేశారు. సివిల్స్లో సోషయాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్గా తీసుకున్న నాగరాజు ఐదో ప్రయత్నంలో విజయం సాధించాడు. నాగరాజు తండ్రి పంతులు నాయక్ – తల్లి మారోని వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. ప్రస్తుతం నాగరాజు సివిల్స్ సాధించగా.. ఆయన సోదరుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమ్స్ దశ దాటిన వారికి ఇచ్చే రూ.లక్ష పారితోషికం అందుకున్న గిరిజన తండా వాసి నాగరాజు సివిల్స్కు ఎంపికవడంపై పలువురు అభినందించారు. -
ఆద్యంతం ఉత్కంఠే..
ఉద్రిక్తత నడుమ పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణస్వీకారం ● కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు ● పోలీస్ పహారా నడుమ కార్యక్రమం పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ఆద్యంతం ఉత్కంఠ నడుమే కొనసాగింది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉద్రిక్తత, పోలీస్ బందోబస్తు మధ్య పూర్తయింది. అమ్మవారి సాక్షిగా ఇద్దరు యువకులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, ఓ మహిళ గాజులు పగులగొట్టుకోవడంతో పాటు మెడ కోసుకుంటానని ఆందోళనకు దిగింది. అసలేం జరిగింది.. పెద్దమ్మతల్లి ఆలయ పాలకమండలి సభ్యులుగా 14 మంది పేర్లతో కూడిన జాబితా గతనెల 6వ తేదీన విడుదల కాగా, దీనిపై వివాదం తలెత్తింది. దేవాదాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆ జీఓను రద్దు చేసి 19వ తేదీన 13 మంది సభ్యులతో మరో జాబితా వెల్లడించారు. ఈ కమిటీని ప్రమాణస్వీకారానికి ఈఓ రజినీకుమారి ఆహ్వానించగా.. స్థానికులకు అవకాశం కల్పించాలంటూ కేశవాపురం గ్రామస్తులు అందోళన చేయడంతో వాయిదా పడింది. రెండో జీఓ వెలువడి నెల రోజులు దాటడంతో తిరిగి మంగళవారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయగా.. మళ్లీ ఘర్షణ జరుగుతుందనే ఉద్దేశంతో డీఎస్పీ సతీశ్కుమార్, సీఐ సతీశ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, స్థానికులు భారీగా చేరుకుని ప్రమాణ స్వీకారం నిలిపేయాలంటూ ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన బండి ఉదయ్, అజ్మీర రమేశ్.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారించి అదుపులోకి తీసుకున్నారు. గంధం నర్సింహారావును ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆలయం వద్ద ఆందోళన చేస్తున్న వారిని సైతం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అందోళన సద్దుమణగడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కొనసాగించారు. స్థానికులకు చోటేది..? అమ్మవారి ఆలయం కొలువై ఉన్న కేశవాపురం గ్రామస్తులకు కమిటీలో స్థానం కల్పించకుండా ఇతర ప్రాంతాల వారికి, అన్యమతస్తులకు అవకాశం ఇవ్వడం ఏం న్యాయమంటూ స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామస్తులకు అవకాశం కల్పించాలని కోరడం తప్పా అంటూ ప్రశ్నించారు. చైర్మన్గా నాగేశ్వరరావు.. పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి చైర్మన్గా సోములగూడెం గ్రామానికి చెందిన బాలినేని నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. సభ్యులుగా భూక్యా గిరిప్రసాద్, కోరం స్వర్ణలత, పెండ్లి రామయ్య, చందుపట్ల రమ్య, ధర్మరాజుల నాగేశ్వరరావు, చీకటి కార్తీక్, చెవుగాని పాపారావు, చెరుకూరి శేఖర్బాబు, దుగ్గిరాల సుధాకర్, శనిగారపు శ్రీనివాసరావు, అడుసుమల్లి సాయిబాబా, ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా అర్చకుడు మూర్తి రవికుమార్శర్మతో దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు ఈ.వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నాగేశ్వరరావు ఏడో చైర్మన్గా నియమితులయ్యారు. -
సివిల్స్లో మెరిసిన రత్నాలు
● మత్కేపల్లి వాసి చరణ్ తేజకు 231 ర్యాంక్ ● 697వ ర్యాంకు సాధించిన గిరిజన యువకుడు నాగరాజు చింతకాని: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు యువకులు ర్యాంకులు సాధించారు. చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన నర్శింశెట్టి చరణ్ తేజ 231 ర్యాంక్ను సాధించడం విశేషం. గ్రామానికి చెందిన నర్శింశెట్టి హరినాధ్బాబు – నాగమణి దంపతుల చిన్న కుమారుడు చరణ్ తేజ 10వ తరగతి వరకు హైదరాబాద్లోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తిచేశాక జేఈఈలో 88వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆతర్వాత తొమ్మిది నెలల పాటు రూ.32 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా సివిల్ సాధించాలనే లక్ష్యంతో ఉద్యోగం మానేశాడు. సొంతంగానే సిద్ధం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాక చరణ్తేజ ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వనరుల ద్వారా సివిల్స్కు సిద్ధమయ్యాడు. 2022లో తొలిసారి పరీక్ష రాసినా ప్రిలిమ్స్కు అర్హత సాధించకపోగా 2023లో ఇంటర్వ్యూ దశకు చేరాడు. ఇక మూడో ప్రయత్నంలో ఈసారి ఆలిండియా 231వ ర్యాంక్ సాధించడం విశేషం. ఆయన తల్లిదండ్రులు 25ఏళ్ల క్రితమే హైదరాబాద్లో స్థిరపడగా తండ్రి హరినాధ్బాబు ప్రైవేట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా, తల్లి నాగమణి మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. చరణ్ సోదరుడు జైశిక్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. ఈ సందర్భంగా చరణ్తేజతో ‘సాక్షి’ మాట్లాడగా సివిల్స్లో ఆప్షనల్గా గణితం ఎంచుకున్నట్లు వెల్లడించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించానని, ఐఎఫ్ఎస్ ఎంచుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిపాడు. -
ఎన్నాళ్లకు మోక్షం..
● సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ● పదేళ్లుగా ఉద్యోగుల నిరీక్షణ ● ఉమ్మడి జిల్లాలో 335 మంది ఉద్యోగులు ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చుంచుపల్లి: దశాబ్దకాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 335 మందికి బదిలీ అయ్యే అవకాశం ఏర్పడింది. బదిలీల ప్రక్రియ పూర్తయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లలో కొత్తవారు రానున్నారు. గతేడాది జూలైలో జరిపిన సాధారణ బదిలీల్లో తమకు అవకాశం కల్పించాలని సెర్ప్ ఉద్యోగులు కోరినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వర్తింపజేయటం లేదంటూ కొన్నేళ్లుగా వాపోతున్నారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వీరి బదిలీల విషయం ఊసెత్తకపోవడంతో కొందరు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సెర్ప్ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఏళ్లుగా ఒకే కేడర్లో పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023 నుంచి సెర్ప్ సిబ్బందికి పే–స్కేల్ విధానం ద్వారా వేతనాలు చెల్లిస్తోంది. వీరిలో ఎంఎస్ సీసీ నుంచి డీపీఎం స్థాయివరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో యూనియన్ నాయకులు సంబంధిత శాఖ మంత్రులతో గతంలోనూ అనేక దఫాలుగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు ముందుకురావడంతో వారి పదేళ్ల నిరీక్షణకు త్వరలో తెర పడనుంది. 335 మందికి అవకాశం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి ఉపాధి కల్పనలో ఆర్థిక తోడ్పాటును అందిస్తున్న సెర్ప్ ఉద్యోగులు దాదాపు 23 ఏళ్లుగా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. సెర్ప్ పరిధిలో మినిస్టీరియల్, ఫీల్డ్ సిబ్బంది, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్లు, కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లు వివిధ హోదాలో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్ని కేడర్లకు సంబంధించి 335 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 156 మంది, ఖమ్మం జిల్లా పరిధిలో 179 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని సెర్ప్ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.1.30 కోట్ల మేర వేతనాల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000లో ‘వెలుగు’ పేరుతో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం సంస్థను పరిమిత జిల్లాల్లో ప్రారంభించారు. 2002లో ఆ ప్రాజెక్టును క్రమంగా రాష్ట్రం అంతటా విస్తరింపజేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకం పేరును పూర్తిగా ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ)గా మార్చగా, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్)గా తిరిగి నామకరణం చేసింది. ఇక ప్రాజెక్టు ప్రారంభమైన 2002 నుంచి ఉద్యోగులంతా కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగుతుండగా, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2023 ఏప్రిల్లో వీరి ఉద్యోగాలను క్రమబద్ధీరిస్తూ అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ ప్రక్రియలో పే–స్కేల్, ఇతరత్రా వర్తింపజేసినా.. ఇంకా అంశాలను అమలు చేయాల్సి ఉంది. గతేడాది జూలైలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖల పరిధిలో ఉద్యోగులు, సిబ్బంది బదిలీలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే పదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కొందరు ఉద్యోగులు ఆందోళన చెందారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు ముందుకురావడం మంచి పరిణామం. ఉద్యోగులు, సిబ్బంది పదేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన చాలామంది సిబ్బంది పదేళ్లు, అంతకంటే ఎక్కువగానే ఒకేచోట పనిచేస్తున్నారు. ప్రభుత్వం 100 శాతం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇవ్వనుండటంతో దాదాపు అందరికీ స్థానచలనం కలుగుతుందని భావిస్తున్నాం. – డి.నీలయ్య, అదనపు డీఆర్డీఓ (సెర్ప్) -
హాస్టళ్లు, పాఠశాలలు సిద్ధంగా ఉండాలి
● నెలరోజుల్లో మరమ్మతులు పూర్తిచేయాలి ● ఐటీడీఏ పీఓ బి.రాహుల్ భధ్రాచలం: వేసవి సెలవులు పూర్తయి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లు, పాఠశాలల్లోని మేజర్, మైనర్ మరమ్మతులను పూర్తి చేసి, సిద్ధంగా ఉంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో స్పెషలాఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, హెచ్ఎం, వార్డెన్లతో పీఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లోని డార్మెటరీ, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్రూంలు ఇతర మౌలిక వసతులన్నింటినీ నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పాఠశాలను, హాస్టల్ను సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసి త్వరగా అందచేయాలన్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టాలని, సెలవుల్లో సైతం పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఉద్దీపనం వర్క్బుక్లు విద్యార్థులకు ఉపయోగపడేలా చేసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు సైతం వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అందుకోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులను ఎంపిక చేసి 15 రోజుల్లో ప్రతిపాదనలు తనకు సమర్పించాలన్నారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఈఈ చంద్రశేఖర్, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓలు అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, డీఈ మధూకర్, ఏఈ రవి, జీసీడీఓ అలివేలుమంగతాయారు పాల్గొన్నారు. కాగా, ఇంజనీరింగ్లో సీటు సాధించిన విద్యార్థినికి ఐటీడీఏ తరఫున ల్యాప్టాప్ను పీఓ రాహుల్ మంగళవారం అందజేశారు. అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన వాసం గాయత్రి భద్రాచలంలోని టీటీడబ్ల్యూఆర్ఎస్లో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివి, గేట్ రాసి 8,300 ర్యాంకు సాధించింది. ఆమెకు ల్యాప్టాప్ను పీఓ అందజేశారు. కార్యక్రమంలో డేవిడ్ రాజ్, విద్యార్థిని తల్లి లలిత తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యలకు చెక్
● జూన్ 2 నుంచి అందుబాటులోకి పోర్టల్ ● కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడి అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ప్రభుత్వం తాజాగా రూపొందించిన భూ భారతి చట్టం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని, ఈ చట్టంతో భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అన్నపురెడ్డిపల్లిలో భూ భారతి చట్టంపై మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి పోర్టల్ అందుబాటులోకి వస్తుందన్నారు. గతంలో ఉన్న ధరణికి ఇది విరుద్ధమని, రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఏడీఏ రవికుమార్, తహసీల్దార్ జగదీశ్వర్ప్రసాద్, ఎంపీడీఓ మహాలక్ష్మి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఏఓ అనూష, వనమా గాంధీ, పర్సా వెంకటేశ్వరరావు, వేముల రమణ పాల్గొన్నారు. ఆర్వైవీ అర్హుల జాబితా రూపొందించాలిసూపర్బజార్(కొత్తగూడెం): రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో అధికారులు, బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని, మండల ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, బ్యాంకు మేనేజర్లు, కమిటీ సభ్యులు కార్యాచరణ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఒకే గ్రామంలో ఒక యూనిట్కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించాలని అన్నారు. ఆయా కార్పొరేషన్ల అధికారులు సైతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించాలని, చేపల పెంపకం యూనిట్ల ద్వారా ఆర్థిక పురోగతి ఉంటుందని తెలిపారు. సమావేవంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమాధికారి ఇందిర, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు హాజరయ్యారు. -
బాలికలదే పైచేయి..
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం ఉత్తీర్ణత ● ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం.. ● ప్రతిభ చాటిన ప్రైవేటు కళాశాలలు, కేజీబీవీలు ● రాష్ట్రంలో జిల్లాకు 9వ స్థానం కొత్తగూడెంఅర్బన్ : ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కాగా, బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అమ్మాయిలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం జనరల్లో 3,028 మంది బాలురకు 1,570 మంది, 4,187 మంది బాలికలకు 2,944 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో 860 మంది బాలురకు 402 మంది, 1,179 మంది బాలికలకు 863 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్లో2,996 మంది బాలురకు 1,855 మంది, 4,083 మంది బాలికలకు 3,190 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో బాలురు 763 మందికి 495 మంది, బాలికలు 1,024 మందికి 882 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్సరంలో 62.56 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ప్రథమ సంవత్సరంలో 54.83, ద్వితీయ సంవత్సరంలో 70.72 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది కొంతమేర పెరిగి రాష్ట్ర స్థాయిలో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు బుధవారం నుంచి 30వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. మే 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 421 మందికి 181 మంది, ద్వితీయ సంవత్సరంలో 376 మందికి 238 మంది ఉత్తీర్ణత సాధించారు. జనరల్ విభాగంలో బి. శ్వేతశ్రీ 1000కి 936 మార్కులు సాధించింది. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో మేఘన 470కి 423 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కత్తి రమేష్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. కలెక్టర్ను కలిసిన డీఐఈఓసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వివరాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్కు డీఐఈఓ సీహెచ్ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందొద్దని, ఇలాంటి ఫెయిల్యూర్సే జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయని, తద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు. త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయ స్వామివా రికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
కార్పొరేషన్గా కొత్తగూడెం
● గెజిట్ విడుదల, త్వరలో జీఓ ● రెండు మున్సిపాలిటీలు, ఏడు పంచాయతీలతో ఏర్పాటుకొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ఈ మేరకు త్వరలోనే జీఓ కూడా వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు అంటున్నారు. జీఓ విడుదల అయ్యాక డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ జరుగనుంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలు కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా లక్షకు పైగా జనాభా, 65 వేల మంది ఓటర్లు ఉన్నారు. పాల్వంచ మున్సిపాలిటీలో 24 వార్డులు, లక్ష జనాభా, 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో కలిపి 14 వేల మంది జనాభా, 10 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తంగా కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఏర్పాటు చేయాలని గెజిట్లో పేర్కొన్నారు. కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయితే భూములు, ఆస్తుల విలువతో పాటు ఇళ్లు, పంపుల పన్నులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. కాగా, పాల్వంచ మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు కేసులు ఉండడంతో రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరుగలేదు. ఇక కార్పొరేషన్ ఆమోదంతో ఎన్నికలు జరుగుతాయని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు..! కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల్లో పని చేసే ఉద్యోగులకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు చెల్లించే పన్నులు పెరిగినట్టుగానే ఉద్యోగుల హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది. జీఓ విడుదల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్గా పేరు మార్చడం, డివిజన్ల ఏర్పాటుతో పాటు కమిషనర్ను నియమించాల్సి ఉంది. -
ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కొత్తగూడెంలోని గాజులరాజం బస్తీకి చెందిన లిక్కి విశృత్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. 1000కి 994 మార్కులు సాధించాడు. విశృత్ స్థానిక నలంద కాలేజీలో ఇంటర్(ఎంపీసీ) చదివాడు. తండ్రి కోటేశ్వరరావు పాల్వంచ పోలీస్స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా, తల్లి నివేదన నగరంలోని ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేసున్నారు. చిన్నప్పటి నుంచే ప్రణాళికాయుతంగా చదివించడంతో ఉత్తమ ఫలితాలు సాధించాడని విశృత్ తల్లిదండ్రులు తెలిపారు. ఎస్పీ రోహిత్రాజు స్ఫూర్తితో.. ఉత్తమ ఫలితాలు సాఽధించిన అనంతరం విశృత్ మాట్లాడుతూ.. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చేరడం తన లక్ష్యమని, ఆ తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నది తన జీవిత కల అని తెలిపాడు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పని చేస్తున్న రోహిత్రాజు తనకు ఆదర్శమని చెప్పాడు. తండ్రి ఏఎస్ఐగా పని చేస్తున్నప్పుడు రోహిత్రాజు ఐపీఎస్కు సెలక్ట్ అయ్యారని తెలుసుకుని తాను ఎంతో స్ఫూర్తి పొందానని, ఆయన తరహాలోనే తన తండ్రి పోలీస్గా పని చేస్తున్నప్పుడే తాను ఐఏఎస్ అధికారిని కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. కాగా, ఎస్పీ రోహిత్రాజు విశృత్ను మంగళ వారం అభినందించారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విశృత్ -
ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్దే విజయం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం స్థానిక హరిత హోటల్లో ఉద్యమకారులు, పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచిందని, 2014, 2018 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే గెలుచుకున్నామని, అయినా కేసీఆర్ హయాంలో ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి 3.50లక్షల ఎకరాలకు నీరందించారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, ఆస్పత్రులు, హాస్టళ్లు ఏమీ లేవని, ఎమ్మెల్సీలుగా తాను, తాతా మధు చట్టసభల్లో అడుగుతున్న ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క అన్నీ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పండుతోందంటే అది కేసీఆర్ చలువేనని చెప్పారు. కార్యకర్తల కష్టంతో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత అధికార పార్టీలోకి వెళ్లారని అన్నారు. ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, హరిప్రియనాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, ఆకోజు సునీల్ తదితరులు పాల్గొన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేయండి బూర్గంపాడు/పాల్వంచ/మణుగూరురూరల్ : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజోతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత నివాసంలో, మణుగూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కాగా, భద్రాచలంలో మాజీ మంత్రి వనమా ఎమ్మెల్సీ కవితకు మెమెంటో అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వనమా రాఘవేందర్ రావు, కిలారు నాగేశ్వరరావు, బూర్గంపాడు పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, నాయకులు పోశం నర్సింహరావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ, జలగం జగదీశ్, గోనెల నాని, సిరిపురపు స్వప్న, భూక్యా శ్రావణి, ఎడ్ల శ్రీనివాస్, యాదగిరిగౌడ్, నూకారపు రమేష్, పాకాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మణుగూరులో వపన్ నాయక్ ప్రతాప్ నివాసంలో తేనేటి విందు, ఎక్స్లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్ ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించారు. పార్టీ శ్రేణుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మొదట రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు ఉద్యమకారులను పట్టించుకోండి ‘భద్రాచలంలో మొదట బీఆర్ఎస్ కండువా కప్పుకున్నది మా నాన్న నరసింహమూర్తి. మా ఇంటికి కేసీఆర్, కవితమ్మ వచ్చారు, కానీ జిల్లా నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేం దళితులమనే చిన్న చూపు చూశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా నుంచి పార్టీలో చేరిన పలువురు ఎవరి వర్గానికి వారు పదవులు ఇప్పించుకున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు రాలేదు. ఏదేమైనా మాకు కేసీఆరే నాయకుడు. ఇప్పుడున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి నా పేరు కూడా తెలియదు’ అంటూ భద్రాచలానికి చెందిన రాజేంద్రవర్దన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రామాలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్సీ కవిత మొదట భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీతారాములను దర్శించుకుని సీతమ్మవారికి సారె సమర్పించి గర్భగుడి నుంచి బయటకు వచ్చిన కవిత ‘రామలక్ష్మణ జానకి’ అంటూ జేజేలు పలికారు. అనంతరం లక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన జడ్జి కవితకొత్తగూడెంటౌన్: కొత్తగూడెం జిల్లా కోర్టులో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన కర్నాటి కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిన్నరగా ఈ పోస్టు ఖాళీగా ఉండగా హైదరాబాద్ నాంపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి బదిలీపై వచ్చిన కవిత నియమితులయ్యారు. భాద్యతల స్వీకరణ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. నేడు పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారం పాల్వంచరూరల్ : ఎట్టకేలకు పెద్దమ్మగుడి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 19న పాలకమండలి జాబితాను ప్రభుత్వం జారీ చేయగా.. స్ధానికులకు కమిటీలో అవకాశం కల్పించాలంటూ కొందరు అందోళన చేయడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయింది. దీంతో ఈఓ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తుతో నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని ఈఓ వెల్లడించారు. మే 1 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణకొత్తగూడెంఅర్బన్: మే 1వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా సోమవారం హైదరాబాద్ నుంచి జూమ్ సమావేశం నిర్వహించగా జిల్లా నుంచి డీఈఓ హాజరయ్యారు. అనంతరం వివిధ విభాగాల కో – ఆర్డినేటర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం పాఠశాల పని దినాలు నష్టపోకుండా వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా, మండల రిసోర్స్ పర్సన్ల ఎంపికకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలవుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని వేసవి సెలవుల్లో కూడా కొనసాగించాలని ఆదేశించారు. పీఎంశ్రీకి ఎన్నికై న పాఠశాలలకు విడుదలైన నిధుల వినియోగంపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కార్యక్రమంలో భాగంగా బడిబాటను విజయవంతం చేయాలని, ఇందుకోసం ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్లు ఎ.నాగరాజ శేఖర్, ఎస్కే సైదులు, జె.అన్నామణి, ఎఫ్ఏఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం.. మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా పని చేసేందుకు ఆసక్తి గల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీ లోపు నిర్ణీత నమూనాలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు. -
అప్పుల బాధతో ఆత్మహత్య
టేకులపల్లి: అనారోగ్యం, అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. టేకులపల్లి ఎస్ఐ ఎ.రాజేందర్ కథనం ప్రకారం... మండలంలోని బావోజీతండాకు చెందిన భూక్య లాలు(35) కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించగా రూ.4 లక్షల అప్పు అయింది. దీనికితోడు పంటలు కూడా సరిగా పండలేదు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపం చెంది సోమవారం తెల్లవారు జామున పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.గడ్డి మందు తాగి ఒకరు.. ఇల్లెందు: మండలంలోని రొంపేడు గ్రామానికి చెందిన జి. భద్రూ(55) సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ హసీనా కథనం ప్రకారం.. భద్రూ మద్యం బానిసగా మారడంతో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆయన ఇంట్లో గడియ వేసుకుని పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపుల కేసు నమోదుచండ్రుగొండ: వివాహితను అదనపు కట్నం కోసం వేధించిన ఘటనలో భర్త, అత్తలపై సోమవారం పోలీసులు కేసు నమోౖదు చేశారు. ఎస్ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మండల పరిధిలోని టేకులబంజర గ్రామానికి చెందిన సోనుకు టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లికి చెందిన వీరన్నతో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్న కానుకలిచ్చారు. కాగా అదనపు కట్నం తేవాలని సోనును భర్త వీరన్న, అత్త లక్ష్మి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భూ భారతితో అందరికీ మేలు
● కొత్త చట్టంపై ఆందోళన వొద్దు ● కలెక్టర్ జితేష్ పాటిల్ వెల్లడిమణుగూరు టౌన్/అశ్వాపురం : భూ భారతి చట్టంతో రైతుల భూములకు రక్షణతో పాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన మణుగూరు, అశ్వాపురం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చట్టంపై ఎలాంటి ఆందోళనలు, అపోహలు అవసరం లేదని చెప్పారు. భూ బదలాయింపులో ప్రవేశపెట్టిన నిబంధనలు ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ధరణి కంటే భూ భారతి చట్టంతోనే భూములకు రక్షణ కలుగుతుందన్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వారి సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసి, వినతులు స్వీకరించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు. ఈ చట్టం రైతులకు, ప్రజలకు మాత్రమే కాక రెవెన్యూ అధికారులకు కూడా ధైర్యం ఇచ్చిందని, సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగంచలతో పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ దామోదర్రావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, స్వర్ణలత, ఏడీఏ తాతారావు, ఎంపీడీఓ వరప్రసాద్, ఎంపీఓ ముత్యాలరావు, ఆర్ఐ లావణ్య, సీనియర్ అసిస్టెంట్ కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లంచం అడిగితే ఏసీబీకి పట్టించండి అశ్వాపురంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో రైతుల సందేహాలు తెలపాలని కలెక్టర్ సూచించగా.. ఓ రైతు మాట్లాడుతూ గతంలో ధరణిలో సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు రూ.10 వేల నుండి రూ.లక్ష వరకు లంచాలు తీసుకున్నారని, భూ భారతిలో ఎంత లంచాలు తీసుకుంటారని ప్రశ్నించాడు. డైరెక్ట్గా తీసుకుంటే ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారని గ్రామానికి ఓ బ్రోకర్ ద్వారా అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చాడు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. డబ్బు తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరమని అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఏసీబీ అధికారులకు పట్టించండని చెప్పారు. బ్రోకర్ల ద్వారా తీసుకుంటే ఆధారాలతో తనకు తెలియజేస్తే పోలీసు కేసు పెడతానని చెప్పగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
బోరు పూడ్చివేతపై ఆగ్రహం
చర్ల: చర్ల మండలంలోని పులిగుండాలలో పోడు సాగుదారులు వేసిన బోరును దుమ్ముగూడెం అటవీ రేంజ్ అధికారులు పూడ్చివేయగా.. వారి వైఖరిని నిరసిస్తూ రాళ్లగూడెంలో సోమవారం గిరిజన రైతులు ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలి చిపోగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య చేరుకొని రైతులతో మాట్లాడారు. డీఎఫ్ఓతో ఫోన్లో మాట్లాడి ఘటనపై వెంటనే విచారణ నిర్వహించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోరు పూడ్చివేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధిత రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పులిగుండాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సోడి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ల చోరీ.. నంబర్ మార్చి విక్రయం
పెనుబల్లి: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీ చేయడమే కాక నంబర్ ప్లేట్లు మార్చి ఇతరులకు అమ్ముతున్నారు. ఇప్పటివరకు 18 బైక్లను చోరీ చేసిన వీరు వీఎం బంజర్ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలను వీఎం బంజర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కల్లూరు ఏసీపీ కె.రఘు, సత్తుపల్లి రూరల్ సీఐ ఎంఎల్.ముత్తిలింగయ్యగౌడ్, వీఎం బంజర్ ఎస్ఐ కె.వెంకటేశ్ వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట అర్బన్ కాలనీకి చెందిన మక్కెళ్ల నాగరాజు, సత్తుపల్లి మండలం తుంబూరుకు చల్లా శివప్రసాద్ వీఎం బంజర్, సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా పెద్దవేగి స్టేషన్ పరిధిలో రూ.12.45 లక్షల విలువైన 18 ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. వీటిలో కొన్నింటి నంబర్ మార్చి పెనుబల్లి మండలం గంగదేవిపాడు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం వాసులకు అమ్మగా, వచ్చిన డబ్బుతో జల్సాలు చేశారు. మిగతా వాహనాలను ఎన్ఎస్పీ కాలువ పక్కన పొదల్లో దాచి అందులో రెండింటిని అమ్మేందుకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం ఖమ్మం వైపు నుంచి వీఎంబంజర్ వైపు వెళ్లే మార్గంలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. ఎలాంటి పత్రాలు లేకపోగా, తడబడుతుండడంతో వాహనాల చాయిస్ నంబర్ ఆధారంగా ప్రశ్నించడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. దీంతో నాగరాజు, శివప్రసాద్ను అరెస్ట్ చేయడమే కాక వీరి నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పెనుబల్లి మండలం గంగదేవిపాడుకు చెందిన ఓర్సు వెంకటనారాయణ, పందేళ్ల సింహాద్రి, తిరుమలకొండ కొండల్రావు, బత్తుల కొండల్రావు, అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురానికి చెందిన డేరంగుల నాగసాయి, ఉప్పతాల సతీశ్, ఉప్పతాల గోపి, ఉప్పతాల రాజుపైనా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ వెంకటేశ్, కానిస్టేబుళ్లు శ్రీగాద రాజమల్లు, పి.వెంకటేశ్వర్లు, మోహిద్పాషా, బాలకృష్ణ, సురేశ్ను ఏసీపీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. రెండు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్ -
కొత్త క్వార్టర్లు నిర్మించేనా..?
● శిథిలావస్థలో కేటీపీఎస్ నివాస సముదాయాలు ● అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న కార్మికులు ● నిర్మాణాలపై దృష్టి సారించని జెన్ కో యాజమాన్యం పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ కర్మాగారాల్లో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఇక్కడి ఉద్యోగులకు నివాస సముదాయాలు(క్వార్టర్లు) సక్రమంగా లేవు. దశాబ్దాల క్రితం నిర్మించినవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. కేటీపీఎస్ ఒఅండ్ఎం కర్మాగారం నిర్మించిన సమయంలో ఉద్యోగుల కోసం ఏ,బీ,సీ, ఇంటర్మీడియట్, బాంబే కాలనీలుగా క్వార్టర్ల సముదాయాలు నిర్మించారు. అప్పుడే క్వార్టర్లు నిర్మించినా చాలా ఎత్తు తక్కువ, ఇరుకు గదులతో నిర్మాణాలు చేపట్టారు. సరైన ప్రహరీలు కూడా లేవు. కాలనీల చుట్టూ అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఒఅండ్ఎం కర్మాగారం కాలం చెల్లడంతో ఆ కర్మాగారాన్ని కూల్చివేశారు. క్వార్టర్లు కూడా శిథిలావస్థకు చేరాయి. దీంతో 80 శాతం మంది కార్మికులు కార్టర్లను ఖాళీ చేసి ప్రైవేటు ఇళ్లల్లో అద్దెకు ఉంటున్నారు. కొందరు రుణాలు తీసుకుని సొంత ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా.. శిధిలావస్థకు చేరిన క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నిత్యం కొందరు యువకులు, గంజాయి, మద్యం సేవించడం, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ క్వార్టర్ల తలుపులు, కిటికీలు, ఐరన్ సామగ్రి చోరీకి గురవుతున్నాయి. కేటీపీఎస్ ఒఅండ్ కర్మాగారం మూతబడటంతో సుమారు 2500 మంది ఉద్యోగ, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. దీంతో కాలనీలు జన సంచారం లేకుండా వెలవెలబోతున్నాయి. గతంలో కన్యూమర్ స్టోర్స్, పాల ప్యాకెట్లు, గ్యాస్ బుకింగ్, గోడౌన్, ఇతర కూల్ డ్రింక్ షాపులు ఉండేవి. ప్రస్తుతం అవన్నీ మూతబడ్డాయి. నిధుల విడుదలలో జాప్యం పాల్వంచ కేటీపీఎస్ కేంద్రంగా 5,6దశల కర్మాగారాల్లో వెయ్యి మెగావాట్లు, 7వ దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. 1969–78 సంవత్సరంలో ఒఅండ్ఎం కర్మాగారం నిర్మించగా కాలం చెల్లడంతో తొలగించారు. ఆ స్థానంలో 7వ దశ నిర్మాణం జరిపారు. ఇటీవల మణుగూరులో నిర్మించిన బీటీపీఎస్ సిబ్బంది కోసం రూ.600 కోట్లతో క్వార్టర్ల నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ కూడా పాత నిర్మాణాలు తొలగించి వాటి స్థానంలో అపార్ట్మెంట్ తరహాల్లో నిర్మాణాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కావడంలేదు. యాజమాన్యం కూడా దృష్టి సారించడం లేదు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా జెన్కో యాజమాన్యం స్పందించి క్వార్టర్లను నిర్మించాలని కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం కేటీపీఎస్లో ఉద్యోగుల కొత్త క్వార్టర్ల కోసం ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే పనులు చేపడతాం. ఈ విషయం యాజమాన్యం దృష్టిలో ఉంది. త్వరలో మంజూరు అవుతాయని వేచి చూస్తున్నాం. –కె.శ్రీనివాసబాబు, సీఈ, 7వ దశ -
రేణుకకు జ్యోతిష్యంలో డాక్టరేట్
బూర్గంపాడు/పాల్వంచ: మండలంలోని అంజనాపురానికి భూక్యా రేణుక జ్యోతిష్యంలో ఆర్యన్ పరిశోధన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆమె భర్త కిరణ్గాంధీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వివాహ సంతాన అంశంలో పరిశోధన చేసినందుకు గాను రేణుకకు ఈనెల 20న సింహాచలంలో జరిగిన జ్యోతిష్య సదస్సులో డాక్టర్ నరసింహస్వామి, తదితరుల చేతుల మీదుగా డాక్టరేట్ అందించారు. ఇంటి కొలతల్లో తేడాలు రాకుండా చూడాలిపాల్వంచరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించిన ఇంటి కొలతల్లో తేడాలు రాకుండా చూడాలని గ్రామ కార్యదర్శులను హౌసింగ్ బోర్డు పీడీ శంకర్ ఆదేశించారు. మండల పరిధిలోనితోగ్గూడెంగ్రామపంచాయతీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లనుసోమవారం ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తేనే బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందుతాయన్నారు. ఇప్పటివరకు గ్రామంలో వంద ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని కార్యదర్శి రవికుమార్ పీడీకి వివరించారు. న్యాయవాద సంక్షేమ నిధి పెంచాలికొత్తగూడెంటౌన్: న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ కార్పస్ ఫండ్ రూ. 100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని ఏఐఎల్యూ జిల్లా కార్యదర్శి రమేష్కుమార్ మక్కడ్ అన్నారు. సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సమావేశంలో మాట్లాడారు. న్యాయవాదులకు ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులను అందజేయాలని, ఇన్సూరెన్స్ను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. తొలుత సంక్షేమ నిధి పెంచాలని సంతకాల సేకరణ చేశారు. కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ జె.శివరాంప్రసాద్, న్యాయవాదులు కిలారు పురుషోత్తం, గాదె సునంద, అరికాల రవికుమార్, డి.రాజేందర్, వైవీ రామారావు, ఏ.పద్మకళ, పగిడిపల్లి రవి, దేవదాసు, రామకృష్ణ, మహేష్, ఆనంద్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. తాగునీటి సమస్య ఎదరుకావొద్దుడీపీఓ చంద్రమౌళి దమ్మపేట: వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అఽధికారి చంద్రమౌళి గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ నిధుల ద్వారా వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కనీసం వంద మంది ఉపాఽధి హామీ పనులకు వచ్చేలా చూడాలన్నారు. ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, ఎంపీఓ రామారావు, కార్యదర్శులు పాల్గొన్నారు. అక్రమ కట్టడం కూల్చివేతకు యత్నంఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఒడ్డున అక్రమంగా చేపట్టిన నిర్మాణం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సోమవారం యత్నించారు. వాగు ఒడ్డున ఓ గది నిర్మాణం తలపెట్టగా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సిబ్బంది, జేసీబీతో అక్కడికి వెళ్లి కూల్చివేతకు ప్రయత్నించారు. దీంతో నిర్మాణదారులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం కొంత గడువు ఇస్తే తామే తొలగిస్తామని నిర్మాణదారులు పేర్కొనడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు వెనుదిరిగారు. -
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వ కృషి
భద్రాచలం: గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పేర్కొన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలో కొర్రాజుల గుట్ట ఏరియాలోని ఏహెచ్ఎస్ బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.25.50లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ భోజనశాలను ఆయన ఐటీటీపీ పీఓతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెరీర్ గైడెన్స్పై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం వేసవి సెలవుల్లో తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి సమస్యలపై గిరిజనులు సమర్పించే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని పీఓ రాహుల్ అధికారులకు సూచించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ అధికారులు మణెమ్మ, నాగార్జున రావు, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, అశోక్ కుమార్, నరేందర్, హరీష్, శ్రీనివాసరావు, ప్రసాద్, మోహన్, రాంబాబు, భాస్కరన్, లక్ష్మీనారాయణ, మనిధర్, ఉదయ్ కుమార్, నరేష్, నారాయణ రావు, ఆదినారాయణ, హరికృష్ణ, లింగా నాయక్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు, పీఓ రాహుల్ -
బ్రిడ్జి పాఠశాలలతో సత్ఫలితాలు
● వలస ఆదివాసీ ఆవాసాల్లో ఏర్పాటు ● ఐడీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ చండ్రుగొండ : జిల్లాలో ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న బ్రిడ్జి పాఠశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. ఐడీఓ (ఇండిజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మూడేళ్లుగా ఈ పాఠశాలలు నడుపుతున్నారు. అటవీప్రాంతాల్లో నివాసముంటున్న వలస గొత్తికోయ ఆదివాసీల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో గొత్తి కోయల ఆదివాసీ ఆవాసం ఎర్రబోడు ఉంటుంది. కనకగిరి అటవీప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ద్వారా పిల్లలకు చదువు నేర్పేవారు. నిర్వహణ కష్టతరం కావడంతో ఐసీడీఎస్ అధికారులు కేంద్రం ఎత్తేశారు. ఈ క్రమంలో ఐడీఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్రిడ్జి పాఠశాల ఏర్పాటు చేశారు. 39 మంది చిన్నారులకు 1 నుంచి 3వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 13 పాఠశాలల్లో 351 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడి మూడో తరగతి పూర్తి చేసినవారిని గత మూడేళ్లల్లో బూర్గంపాడు, ఉల్వనూరు, బూర్గంపాడులో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో 500 పిల్లల్ని చేర్పించారు. ఆకర్షించేలా విద్యాబోధన గొత్తి కోయ ఆదివాసీ పిల్లలను ఆకర్షించేలా విద్యాబుద్ధులు నేర్పుతున్నాం. అక్షరాలను నేర్పడమే కాకుండా కవితలు, కథలు నేర్పిస్తున్నాం. ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. –పద్దం విజయకుమారి, వలంటీర్, బెండాలపాడు ఆటపాటలతో నేర్పుతున్నారు.. బ్రిడ్జి పాఠశాలలో విద్యాబోధన బాగుంది. చిన్నపిల్ల లకు ఆటపాటలతో అక్షరాలు నేర్పుతున్నారు. మా ఆవాసంలో పిల్లలంతా క్రమంతప్పకుండా పాఠశాలకు వెళ్తున్నారు. –రవ్వా రమేష్, ఆదివాసీ పెద్ద, ఎర్రబోడు జిల్లాలో బ్రిడ్జి పాఠశాలల వివరాలు మండలం గ్రామం పిల్లల సంఖ్య లక్ష్మీదేవిపల్లి క్రాంతినగర్ 31 పాల్వంచ సిర్తన్పాడు 23 పాల్వంచ కోయగట్టు 34 పాల్వంచ రాళ్లచిలుక 26 పాల్వంచ సీతారాంపురం 40 చుంచుపల్లి జగ్గారం 26 చంచుపల్లి పాలవాగు 18 పినపాక ఎర్రకుంట 32 పినపాక ఉమేష్చంద్రనగర్ 28 మణుగూరు బుడుగుల 24 ములకలపల్లి రాచన్నగూడెం 23 చండ్రుగొండ బెండాలపాడు 31 టేకులపల్లి ఒంటిగుడిసె 15 -
ఆలయాల అప్గ్రేడ్..
● ఉమ్మడి జిల్లాలోని పలు దేవస్థానాలకు భక్తుల తాకిడి ● ఖమ్మం జిల్లాలో ఆరు దేవాలయాలు 6ఏ పరిధిలోకి.. ● మరో ఆరింటికి 6 బీ హోదా ● భద్రాద్రి జిల్లాలో ఐదు ఆలయాలు 6సీ నుంచి 6బీకి.. పాల్వంచరూరల్ : ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను అప్గ్రేడ్ చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయాలకు భక్తుల తాకిడి పెరుగుతుండగా అంతే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. దీనికి తోడు ఆలయాల్లో ఏటా బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాల, ఇతర పండుగ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. ఇలా ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాల ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటున్న దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు వాటికి గ్రేడ్లను పెంచుతుంటారు. తద్వారా భక్తులకు ఆలయాల్లో వసతులు కల్పనతో పాటు సిబ్బంది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం ఆధారంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏడు ఆలయాలకు 6ఏ హోదా ఉండగా కొత్తగా మరో ఆరు ఆలయాలను 6బీ నుంచి 6ఏకు అప్గ్రేడ్ చేశారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు ఆలయాలు 6ఏ పరిధిలో ఉండగా కొత్తగా ఏ ఆలయమూ అప్గ్రేడ్ కాలేదు. 6ఏ ఆలయాలు ఇవే.. ఉమ్మడి జిల్లాలో పాత, కొత్తవి కలిపి మొత్తం 17 ఆలయాలు 6ఏ గ్రేడ్ పరిధిలో ఉన్నాయి. వీటిలో దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయం, పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయం, అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కొత్తగూడెంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం(గణేష్ టెంపుల్)తో పాటు జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి శ్రీ మారెమ్మతల్లి ఆలయం, పెనుబల్లిలోని శ్రీ నీలాద్రీశ్వరస్వామి, ఖమ్మం నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి(గుట్ట), కమాన్బజార్ శ్రీ వేంకటేశ్వరస్వామి, కాల్వొడ్డులోని సత్యనారాయణ సహిత వీరాంజయనేయస్వామి, వేంసూరు మండలం కందుకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు గతంలోనే 6ఏ పరిధిలో ఉండగా కొత్తగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల శ్రీ సంగమేశ్వరస్వామి, మధిరలోని మృత్యుంజయస్వామి, ఖమ్మంలోని శ్రీ గుంటుమల్లేశ్వరస్వామి, ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, సింగరేణి మండలం ఉసిరికాయలపల్లిలోని శ్రీ కోటమైసమ్మ తల్లి, ఖమ్మం ఇందిరానగర్ శ్రీ సీతారామచంద్రస్వామి(పర్ణశాల) ఆలయాలు అప్గ్రేడ్ అయ్యాయి. 6బీ హోదా పొందిన ఆలయాలు.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం శ్రీమల్లికార్జునస్వామి, కొణిజర్ల మండలం పల్లిపాడు శ్రీ శంభులింగేశ్వరస్వామి, కూసుమంచి మండలం పెరికసింగారం శ్రీవేణుగోపాల అంజనేస్వామి, ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్ శ్రీసీతారామాంజనేయస్వామి, కామేపల్లి మండలం కొత్తలింగాల శ్రీ కోటమైసమ్మ, ఖమ్మం వరదయ్యనగర్లోని శ్రీమైసమ్మ అమ్మవారి ఆలయాలు 6బీ హోదా పొందాయి. వీటితో పాటు భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి శ్రీదాసాంజనేయస్వామి, కొత్తగూడెం బాబూక్యాంప్లోని శ్రీసీతారామచంద్రస్వామి, జూలూరుపాడు మండలం పాపకొల్లు శ్రీ ఉమాసోమలింగేశ్వరస్వామి, పాల్వంచలోని శ్రీ రామాలయం (భజనమందిరం), అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం ఉన్నాయి. భక్తుల రద్దీ, ఆదాయం ఆధారంగా.. ప్రతీ మూడేళ్లకోసారి ఆలయాలకు భక్తుల తాకిడి, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గ్రేడ్లు నిర్ణయిస్తారు. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం ఉంటే 6ఏ, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఉంటే 6బీ, రూ.2లక్షల లోపు ఆదాయం లభించే ఆలయాలకు 6సీ హోదా కల్పిస్తాం. – వీరస్వామి, దేవాదాయ శాఖ ఏసీ -
అకాల వర్షానికి తడిసిన ధాన్యం
మణుగూరు టౌన్: మండలంలోని సమితిసింగారం గ్రామంలో ఆరబెట్టి ధాన్యం ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయింది. దీంతో సోమవారం ఉదయం ధాన్యాన్ని చూసిన రైతులు కన్నీరుమున్నీరయ్యారు. సుమారు 80 ఎకరాల రైతులు లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్ద ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద పట్టాలు వేసి వడ్లు ఎండబోశారు. పది రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా గన్నీ సంచులు లేవంటూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందని సొసైటీలో విక్రయించేందుకు వేచి చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం తడిసిందని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని కటింగ్ లేకుండా సొసైటీలో కొనాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పీఏసీఎస్ సొసైటీ కార్యదర్శిని వివరణ కోరగా.. నాలుగు రోజుల క్రితం కేంద్రం ప్రారంభించామని, గన్నీ బ్యాగులు లేకపోవడంతో కొనుగోళ్లు చేపట్టలేదని, మంగళవారం నుంచి కొంటామని తెలిపారు. ఆవేదన చెందుతున్న రైతులు -
వడదెబ్బతో మహిళ మృతి
అశ్వాపురం: మండల కేంద్రానికి చెందిన తౌటం వజ్రమ్మ(60) కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురికాగా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సోమవారం వరంగల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బైక్ను లారీ ఢీకొని ఒకరు..బూర్గంపాడు: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం పట్టణానికి చెందిన పసుపుతోట నాగేశ్వరరావు (65) బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని ఓ మిల్లులో పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఈ క్రమంలో లక్ష్మీపురం బంకు సమీపంలో పాల్వంచ వైపు నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో నాగేశ్వరరావు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొగ్గు చోరీ ఇల్లెందు: సింగరేణి బొగ్గు అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను సెక్యూరిటీ విభాగం పట్టుకుని పోలీసులకు అప్పగించింది. సోమవారం మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన బి.రాజు, కె. ప్రసాద్లు ఓ ట్రాక్టర్ ద్వారా సింగరేణి బొగ్గు చోరీ చేసుకుని వెళుతుండగా రాజీవ్నగర్ తండా వద్ద పట్టుకున్నారు. ఎస్అండ్పీసీ సిబ్బంది రామస్వామి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి సూర్య కేసు నమోదు చేసి ట్రాక్టర్ను సీజ్ చేశారు. మద్యం మత్తులో దాడి ఇల్లెందు: మండలంలోని ధనియాలపాడు గ్రామానికి చెందిన పి.రమాదేవి ఇంటికి సోమవారం సుదిమళ్లకు చెందిన ఆమె సమీప బంధువు వచ్చాడు. మద్యం తాగి అల్లరి చేస్తుండటంతో ప్రశ్నించిన రమాదేవి, ఆమె కుమారుడు సంతోష్ను తీవ్రంగా దాడి చేసి గాయపర్చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ హసీనా కేసు నమోదు చేశారు. -
పార్కులపై పట్టింపేది?
నెహ్రూ పార్కుదీ అదే పరిస్థితి.. రామవరంలో ఉన్న నెహ్రూ పార్కును ప్రస్తుతం వనమా పార్కుగా పిలుస్తున్నారు. ఈ పార్కుకు అయితే తాళం కూడా తీయడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు రానుండగా పార్కులోకి పిల్లలు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. పట్టణంలో పలు ఏరియాల్లో ఉన్న మినీ పార్కులు సైతం అధ్వానంగా మారాయి. ఇక పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్ పార్కు, బొల్లోరిగూడెం పార్కుల నిర్వహణ కొంత మేర బాగానే ఉంది. అయిఏ వీటిలోనూ చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ పార్కులోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. పార్కు నిర్వహణ సక్రమంగా లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట పార్కులో మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పడు శుభ్రపరుస్తున్నారు. దీంతో ఇక్కడ సమస్యలు అంతగా లేవనే చెప్పాలి. కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారాయి. పార్కుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. మున్సిపల్ నిధులు రూ.లక్షల్లో కేటాయిస్తున్నా పార్కులలో శాశ్వత సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దలతో కలిసి చిన్నారులు ఆడుకునేందుకు సమీప పార్కులకు వెళ్తుంటారు. అయితే వారి ఆటలకు సంబంధించిన పరికరాలు ఎక్కడా పని చేయడం లేదు. అవి తుప్పపట్టి, ముట్టుకుంటే చిన్నారుల చేతికి గాయాలయ్యే ప్రమాదం నెలకొంది. పార్కుల అభివృద్ధి, నిర్వహణకు రూ.లక్షలు కేటాయిస్తున్నట్లు పేపర్పై చూపించడమే తప్ప ఆచరణ లేదని, దీంతో సందర్శకులు అవస్థ పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో అయినా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక నిర్వహణ లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. నాటడానికి తీసుకొచ్చిన మొక్కలు ఎండి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇలా.. కొత్తగూడెంలో ప్రధానంగా రాజీవ్ పార్కు, రైటర్ బస్తీలోని పంచతంత్ర పార్కు, సింగరేణి చిల్డ్రన్ పార్కు, రామవరంలోని వనమా పార్కుతో పాటు పలు మినీ పార్కులు ఉన్నాయి. రాజీవ్ పార్కును 2005లో ఏర్పాటుచేయగా ఆది నుంచీ ఇక్కడ సమస్యలే ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ మినహా మిగితావన్నీ మరమ్మతులకు గురయ్యాయి. పిల్లల ఆట పరికరాలు పని చేయడం లేదు. బాత్రూమ్లు వినియోగంలో లేవు. పార్కంతా పాముల పుట్టలు ఉండడంతో సందర్శకులు భయాందోళన చెందుతున్నారు. ఓపెన్ జిమ్లో పరికరాలు కొన్ని పని చేయడం లేదు. అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుపై కనీసం మూత కూడా లేక ప్రమాదకరంగా మారింది. పార్కు ఎంట్రన్స్లో ఉన్న ఫౌంటెన్ పని చేయడం లేదు. ఇక పంచతంత్ర పార్కు మరీ దారుణంగా మారింది. రూ.20 లక్షలతో నిర్మించిన ఈ పార్క్లో వాకింగ్ ట్రాక్, ఇతర ఆవరణంతా చెత్తతో నిండింది. ఓపెన్ జిమ్ పరికరాలు విరిగిపోయాయి. మున్సిపల్ అధికారులు పార్కు నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.జిల్లాలో అధ్వానంగా మున్సిపల్ ఉద్యానవనాలు పని చేయని ఓపెన్ జిమ్లు అస్తవ్యస్తంగా వాకింగ్ ట్రాక్లు.. పట్టించుకోని పురపాలక అధికారులు ఆట సామగ్రి కొత్తవి ఏర్పాటు చేయాలి పార్కుల్లో పిల్లల ఆట సామగ్రి, పరికరాలు అన్నీ మరమ్మతులకు గురై ఉన్నాయి. కొన్ని అయితే తుప్పు పట్టి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. తుప్పు పట్టిన పరికరాలతో పిల్లలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అధికారులు చర్యలు చేపట్టి నూతన పరికరాలను ఏర్పాటు చేయాలి. – చిన్ని, గాజులరాజంబస్తీ జిమ్ పరికరాలు మరమ్మతు చేయించాలి రాజీవ్ పార్కులోని ఓపెన్ జిమ్లో ట్రైనీని ఏర్పాటు చేయాలి. జిమ్లో కొంత సామగ్రి మరమ్మతుకు గురైంది. దీంతో జిమ్ చేసే వారు ఇబ్బంది పడుతున్నాం. మరమ్మతు చేయించాలని మున్సిపల్ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదు. – రాజు, బూడిదగడ్డ, కొత్తగూడెం -
రన్ రాజా.. రన్ !
ఖమ్మం పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ● రూ.6.65కోట్ల నిధులతో పనులు ప్రారంభం ● మూడు నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ ఖమ్మం స్పోర్ట్స్: వేలాది మంది క్రీడాకారులకు ఓనమాలు నేర్పడమే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే వేదికగా నిలిచిన ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. రూ.6.65 కోట్ల వ్యయంతో ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యయి. మట్టి ట్రాక్లో శిక్షణ పొందుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న క్రీడాకారులకు కొత్త ట్రాక్ అందుబాటులోకి వస్తే అత్యుత్తమ క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ఖమ్మంలో అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటై రెండు దశాబ్దాలు గడుస్తుండగా.. స్టేడియంలో ఇన్నాళుల సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి అడుగులు పడలేదు. జిల్లా క్రీడాశాఖ అధికారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు చొరవ చూపినా ఫలితం కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో ట్రాక్ మంజూరు చేసినా నిధులు మాత్రం కేటాయించలేదు. అంతేకా క ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ భావించినా నిధుల లేమి వేధించింది. ఇంతలోనే ట్రాక్ ప్రతిపాదిత స్థలాన్ని క్రికెట్ శిక్షణకు కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. ఇలా రకరకాల అడ్డంగకులతో ట్రాక్ నిర్మాణం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. పట్టుబట్టడంతో... గత రెండేళ్లుగా జిల్లా క్రీడల శాఖ, అథ్లెటిక్స్ అసోసియేషన్, కోచ్లు సింథటిక్ ట్రాక్ కోసం పట్టుపట్టా యి. స్టేడియంలో మట్టిట్రాక్పై శిక్షణ పొందిన అబ్దుల్ నజీబ్ఖరేషి, పవన్కుమార్, సుధాకర్ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటారు. మరి కొందరు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇక్కడ అకాడమీకి తోడు అనుభవం కలిగిన కోచ్ ఉన్నందున సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందుతుందనే భావనతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికా రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం ఇవ్వగా, ఆయన ట్రాక్ ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ మున్సి పల్ శాఖ అధికారులతో చర్చించి నిధులు కేటాయింపునకు సూచనలు ఇచ్చారు. ఈమేరకు ఏళ్లుగా క్రీడాకారులు ఎదురుచూస్తున్న సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు శనివారం మొదలయ్యాయి. ఈ ట్రాక్ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకరావాలనే లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
సీఎం వచ్చిన రోజే పెళ్లి చేసుకుంటా !
● ఓ కాంగ్రెస్ కార్యకర్త స్పష్టీకరణ ● రేవంత్రెడ్డిని రప్పించాలంటూ వైరా ఎమ్మెల్యేకు వినతి కారేపల్లి: ‘సీఎం రేవంత్రెడ్డి వచ్చిన రోజే నా పెళ్లికి ముహూర్తం ఖరారు చేస్తా’ అంటూ కారేపల్లి మండలం మేకలతండాకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్త అంటున్నాడు. మేకలతండాకు చెందిన భూక్యా గణేష్కు ఇటీవల పెళ్లి నిశ్చితార్థం అయింది. కాగా, గణేష్కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్నా, సీఎం రేవంత్రెడ్డి అన్నా చాలా ఇష్టం. దీంతో రేవంత్రెడ్డి వస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించాడు. ఆయనకు కుదిరిన రోజే పెళ్లి తేదీ ఖరారు చేస్తా అంటున్నాడు. ఎలాగైనా సీఎంను రప్పించాలంటూ ఆదివారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్కు వినతిపత్రం అందించాడు. దీంతో అతడి వినతిపై ‘రెస్పెక్టెడ్ సీఎం సార్, ప్లీజ్ కై ండ్లీ అటెండ్ ది మ్యారేజ్.. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ ఇన్ సింగరేణి మండల్, ప్లీజ్ ఎనీ డేట్ డు ఫిక్స్’ అని రాసి సంతకం చేసిన ఎమ్మెల్యే సీఎం ఆఫీస్కు పంపించారు. కాగా గణేష్ పెళ్లికి సీఎం వస్తారా.. అప్పటిదాకా అతడు పెళ్లి చేసుకుంటాడా లేదా అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. -
విద్యార్థి మృతిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: ఫోన్చూడొద్దని చెప్పినందుకు మనస్థాపంలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని బొల్లారంలో నివాసముంటున్న బందెల రాముకు ఇద్దరు కుమారులు కాగా, చిన్నకుమారుడైన శ్రీరామ్(17) శనివారం కాలనీ శివారులో ఊరివేసుకుని మృతిచెందాడు. ఇతడు పాల్వంచ పట్టణంలోని ప్రశాంత్నగర్ కాలనీకి చెందిన బంధువు ఇంట్లో ఉంటూ 8వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 18న ఇంట్లోనే ఫోన్లో గేమ్ అడుతున్న శ్రీరామ్ను అమ్మమ్మ ఫోన్ చూడొద్దు, గేమ్ ఆడొద్దని మందలించింది. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారిని మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేశారు. యువతిని వేధించిన యువకుడిపై.. కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణానికి చెందిన యువతిని అసభ్యకరంగా సోషల్మీడియా వేదికగా వేధించిన ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన యువకుడు రాహుల్పై ఆదివారం కొత్తగూడెం వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ యువతి సుజాతనగర్ మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంది. ఆ సమయాన ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడుగు గ్రామానికి బి.రాహుల్తో పరిచయం ఏర్పడి అతడి వద్ద కొంత డబ్బులు అప్పుగా తీసుకుంది. తిరిగి కొంత కాలానికి డబ్బులు తిరిగి ఇచ్చినా ఇవ్వలేదని చెప్పి తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధింపులకు గురి చేశాడని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు విషయాన్ని యువకుడి తల్లిదండ్రులకు చెప్పి మళ్లీ అమ్మాయి జోలికి రావొద్దని మందలించారు. అయినా సదరు యువతి స్నేహితుల ద్వారా సోషల్ మీడియాలో యువతి పేరుతో నకిలీ ఇన్స్ట్రాగాం అకౌంట్ క్రియేట్ చేసి ఆమె బంధువులు, స్నేహితులను ఫాలో అవుతున్నట్లు అసభ్యపదజాలంతో ఆమె క్యారెక్టర్ను కించపరిచేలా పోస్టులు పెట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై యువతితో పాటు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై.. పాల్వంచరూరల్: మిర్చి పరదాల విషయంలో తలెత్తిన వివాదంలో మహిళను చంపుతానని బెదిరించి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి నాగారం గ్రామానికి చెందిన అరేపల్లి ప్రమీల, జలగం అనిల్ పక్కనే మిర్చి పంట కల్లాలు చేసుకున్నారు. పంటపై రక్షణ కప్పే పరదాల విషయంలో శనివారం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనిల్ తనను చంపుతానని, రాళ్లతో కొట్టడానికి వచ్చాడని అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తికి తీవ్ర గాయాలు కరకగూడెం: ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కౌలూరు గ్రామానికి చెందిన మలకం రమేష్ ఆదివారం తన ట్రాక్టర్తో పని నిమిత్తం చిరుమళ్ల గ్రామం వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈక్రమంలో చిరుమళ్ల ఎస్సీ కాలనీ మూలమలుపు వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పల్టీ కొట్టి పక్కనే ఉన్న పొలంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రమేష్పై ట్రాక్టర్ పడగా.. కొందరు యువకులు గమనించి ట్రాక్టర్ను పక్కకు జరిపారు. అనంతరం 108లో అతడిని కరకగూడెం పీహెచ్సీకి ఆపై మణుగూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విజేతగా భద్రాద్రి గాయకుడు
భద్రాచలంటౌన్: ఖమ్మం జిల్లా ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యాన జిల్లాస్థాయిలో నిర్వహించిన సినీ హంగామ సమ్మర్ స్పెషల్ సినీ ట్రాక్ సింగింగ్ పోటీల్లో భద్రాద్రి గాయకుడు పోకల శ్రీనివాస్ విజేతగా నిలిచాడు. ఈపోటీల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 75 మంది గాయనీ గాయకులు పాల్గొనగా.. శ్రీనివాస్ విజేతగా గెలిచి రూ.5వేల ప్రోత్సహక బహుమతి అందుకున్నాడు. న్యాయ నిర్ణేతలుగా రాజాబాబు, సరళ వ్యవహరించారు. బైక్లను ఢీకొన్న లారీ.. ● ఒకరి మృతి నేలకొండపల్లి: బైక్ను ఢీకొట్టిన లారీ.. తప్పించుకునే క్రమంలో మరో బైక్ను ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండ అండర్పాస్ వద్ద రాజస్థాన్కు చెందిన, క్వారీలో పనిచేసే కూలీల బైక్ను లారీ ఢీకొట్టింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో లారీని వేగంగా నడుపుతూ డ్రైవర్.. కొద్దిదూరంలో మరోబైక్ను ఢీకొట్టాడు. దీంతో మొదటి బైక్పై వస్తున్న రాజస్తాన్ కూలీల్లో హరికిరణ్ (36) మృతిచెందాడు. అదే ప్రమాదంలో రాజ్బహుదూర్, రాంజీలాల్, మరో బైక్పై వస్తున్న తిరుమలాపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకటసాయి తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. లారీడ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చెన్నారంలో చోరీలు.. నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చెన్నారంలో మూడు రోజుల కిందట కందగట్ల కృష్ణ, బోయినపల్లి వేణు నివాసాల్లో చోరీ జరిగింది. తలుపులు పగలగొట్టి.. బీరువాలో ఉన్న నగదును చోరీ చేశారు. రెండిళ్లలో కలిపి రూ.6 వేల వరకు నగదు చోరీకి గురవగా.. ఆదివారం బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య నేలకొండపల్లి: ఖరీదైన మొబైల్ కొన్నందుకు తల్లిదండ్రులు మందలించారని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శంకరగిరితండాకు చెందిన ధరావత్ రాజు (24) రెండు రోజుల కిందట ఖరీదైన మొబైల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనుగోలు చేశావని.. పైగా ఏపని చేయటం లేదని.. తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన రాజు పురుగులమందు తాగగా కుటుంబసభ్యులు ఖమ్మం వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు అదృశ్యం చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన 64 ఏళ్ల తుడుం బక్కయ్య కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన కటింగ్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. బక్కయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. బైక్ దొంగను పట్టుకున్న స్థానికులు అశ్వారావుపేట: అశ్వారావుపేటలో బైక్ను దొంగిలించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఆదివారం స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానిక తూర్పు బజారు వాసి కొడమంచిలి రాజు ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన బల్లెం నాగేశ్వరరావు దొంగిలించే ప్రయత్నించాడు. గమనించి పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలోనే నాగేశ్వరరావుపై ఏపీలో దొంగతనం కేసులున్నట్లు గుర్తించామని, విచారించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు. -
మితిమీరితే మోతే..!
భద్రాచలంఅర్బన్: ఎండలు మండుతున్న నేపథ్యాన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండతాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లను అధికంగా వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. జీరో బిల్ కోసం పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. కాగా, వేసవి దృష్ట్యా 200 యూనిట్లు దాటితే బిల్లు మరింత అదనపు భారం కానుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. 4,57,216 కనెక్షన్లు.. రూ.13.69 కోట్ల బిల్లులు జిల్లా వ్యాప్తంగా 4,57,216 కనెక్షన్లు ఉండగా.. ప్రభుత్వం నెలకు సుమారు రూ.5.12 కోట్లు, అదే ఏడాదికి సుమారు రూ.67.88 కోట్ల బిల్లులు చెల్లిస్తోంది. వీటిలో వ్యవసాయం, కంపెనీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు వస్తున్నప్పటికీ గృహజ్యోతి బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తోంది. 1,64,080 మందికి లబ్ధి.. జిల్లా వ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగదారులు 1,68,003 ఉండగా.. ప్రభుత్వం జీరో బిల్ అమలు చేసిన నాటి నుంచి 1,64,080 మందికి లబ్ధి చేకూరుతోంది. ఇప్పటికే ఎండలు దంచికొడుతుండగా.. రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం పెరగడం ఖాయం కాగా కొందరికకే జీరో బిల్ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యుత్ను పొదుపుగా వాడుకుంటే తప్పా.. 200 యూనిట్లు దాటిన వారంతా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిందేనని అధికారులు తేల్చి చెబుతున్నారు. 3,923 మంది పథకానికి దూరం.. జిల్లా వ్యాప్తంగా 1,64,080 మంది పథకానికి అర్హులు కాగా గడిచిన ఫిబ్రవరికి సంబంధించిన విద్యుత్ను మార్చిలో మీటరు రీడింగ్ తీయగా.. 3,923 మంది గృహజ్యోతి పథకానికి దూరమయ్యారు. దీంతో వారు ఫిబ్రవరి బిల్లంతా చెల్లించాల్సి వస్తోంది. రానున్న రెండు నెలల్లో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. గతేడాది మార్చిలో 4,942 మంది, ఏప్రిల్లో 10,119 మంది, మేలో 16,036 మంది లబ్ధిదారులు పథకానికి దూరమై జూన్ తర్వాత నుంచి మళ్లీ పథకం లబ్ధి పొందారు. ఒక్క యూనిట్ మించినా.. ఉచిత విద్యుత్ 200 యూనిట్లకే పరిమితం. ఒక్క యూనిట్ దాటినా యూనిట్కు రూ.5.10 చొప్పున బిల్లు పడుతుంది. 201 యూనిట్లు నమోదైతే ఇతర చార్జీలతో కలిపి కనీస బిల్లు రూ.1,050 చెల్లించాల్సి ఉంటుంది. పొదుపుగా వాడుకోవాలి.. వేసవిలో ప్రతీ వినియోగదారుడు విద్యుత్ను పాదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వం 200 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ అందిస్తుండగా.. అవసరాల మేరకే వాడుకోవాలి. లేదంటే ఒక్కయూనిట్ దాటినా బిల్లు మొత్తం కట్టాల్సిందే. వృథాను అరికట్టి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – మహేందర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ జీరో బిల్లు అందిస్తున్నాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీరో బిల్లు అమలు చేస్తోంది. కంపెనీలు, ప్రభుత్వ భవనాలు, వ్యవసాయ బిల్లులు అధికారులు, రైతుల వద్ద వసూళ్లు చేస్తూ ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. – జీవన్కుమార్, డీఈ, భద్రాచలం బిల్లు భారాన్ని అధిగమించాలంటే.. ● అవసరం మేరకే ఫ్యాన్లు, కూలర్లు వాడాలి. ● ఏ గదిలో ఉంటే ఆ గదిలోనే ఫ్యాన్లు, లైట్లు వినియోగించాలి. ● ఉక్కపోత అధికంగా ఉన్నప్పుడే కూలర్లు వాడాలి. ● నాణ్యతలేని కూలర్లు, ఫ్యాన్లతో అధిక విద్యుత్ వినియోగించడానికి ఆస్కారం ఉంది. ● ఉచిత విద్యుత్ అనే భావనతో నిర్లక్ష్యం చేస్తే బిల్లు మోత తప్పదు. ● ఎల్ఈడీ బల్బులు, ట్యూట్లైట్లు వాడాలి. గత మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా విద్యుత్ వినియోగం నెల వినియోగం (మిలియన్ యూనిట్లలో) ఫిబ్రవరి 151.45 మార్చి 175.03 ఏప్రిల్ 59.62 (ఇప్పటి వరకు) వేసవిలో పెరగనున్న విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే జీరో బిల్లుకు దూరం జిల్లా వ్యాప్తంగా 1,64,080 మందికి పథకం వర్తింపు లబ్ధిదారులూ బహుపరాక్ -
‘భూభారతి’తో రైతులకు మేలు
ఇల్లెందురూరల్/టేకులపల్లి: భూభారతి చట్టం భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ రైతులకు మేలు చేస్తుందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఇల్లెందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో, టేకులపల్లి తహసీల్లో ఆదివారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. బేతంపూడి సొసైటీ ఆధ్వర్యంలో టేకులపల్లి వ్యవసాయ మార్కెట్ సబ్యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామా సమస్యలు నిర్దిష్ట గడువులోగా పరిష్కారమవుతాయని తెలిపారు. అన్యాయం జరిగినట్లు భావిస్తే బాధితులు ఆర్డీఓ, కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చన్నారు. ఆర్థికస్తోమత లేని రైతులకు ఉచితంగా న్యాయ సహాయం కూడా అందుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. గతంలో ధరణి పోర్టల్ను ప్రైవేటు సంస్థ నిర్వహించడం వల్ల అనేక తప్పిదాలకు అవకాశం ఏర్పడిందని, కానీ ఽభూభారతి పోర్టల్ను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, తప్పిదాలకు అవకాశం ఉండదని అన్నారు. రైతులు ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర, బోనస్ పొందాలని సూచించారు. అనంతరం పలువురు రైతుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. పలువురి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొత్త సొసైటీలకు స్థలాలు కేటాయించాలని కలెక్టర్కు చైర్మన్ విన్నవించారు. ధరణితో చాలా నష్టపోయారు.. తప్పుల తడకగా ఉన్న ధరణితో పోర్టల్తో రైతులు చాలా నష్టపోయారని, భూభారతి చట్టం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, రికార్డులను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు. కాస్తుదారు కాలమ్ తొలగించడంతో అనేక మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ సిబ్బంది వైద్య శిబిరం నెలకొల్పారు. కాగా ఇల్లెందులో ఆదివాసీ చట్టాలకు సంబంధించి ఓ న్యాయవాది సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. ఇదే విషయమై సదస్సు అనంతరం ఘర్షణకు దారి తీయడంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆర్డీఓ మధు, ఏడీఏ లాల్చంద్, తహసీల్దార్లు రవికుమార్, నాగభవాని, ఎంపీడీవోలు ధన్సింగ్, రవీంద్రరావు, ఏఓలు సతీష్, అన్నపూర్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటరాజశేఖర్రెడ్డి, సొసైటీ సీఈఓ పి.ప్రేమాచారి, నాయకులు భూక్య దళ్సింగ్నాయక్, చరణ్, పీఏసీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, కోరం సురేందర్, కె.వెంకట్, శివలాల్, బి.బాలాజీ, శ్యాం, ఉదయ్ పాల్గొన్నారు. వివాదాలకు ఇక శాశ్వత పరిష్కారం పేద రైతులకు ఉచిత న్యాయసహాయం అవగాహన సదస్సులో కలెక్టర్ జితేష్ -
నిర్లక్ష్యం నీడన నిరసనల వేదిక
● పడావుగా మారుతున్న ధర్నాచౌక్ స్థలం ● కలెకర్టేట్ ఎదుటే కొనసాగుతున్న ఆందోళనలు ● చదును చేసి ఫెన్సింగ్ వేయాలని విన్నపాలు సూపర్బజార్(కొత్తగూడెం): సమస్యల పరిష్కారం కోసం వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపే కలెక్టరేట్ ధర్నాచౌక్ నిర్లక్ష్యానికి గురవుతోంది. జిల్లాల పునర్విభజన తర్వాత చాలా ఆలస్యంగా కలెక్టరేట్ సమీపంలో ధర్నాచౌక్కు స్థలాన్ని కేటాయించారు. కానీ ఆ స్థలాన్ని చదును చేసి కనీస సౌకర్యాలు కల్పించలేదు. ధర్నా చౌక్ ఏర్పాటు తర్వాత వివిధ సమస్యలపై ప్రజా సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ఇబ్బడిముబ్బడిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో ధర్నా స్థలం కొంత శుభ్రంగా ఉండేది. ఎన్నికల కోడ్లు వచ్చిన సందర్భంగా ధర్నాలకు, ఆందోళనలకు బ్రేక్ పడింది. కోడ్ ముగిశాక మళ్లీ ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ధర్నాచౌక్ స్థలం అనుకూలంగా లేకపోవడంతో కలెక్టరేట్ ఎదుటే నిరసన తెలుపుతున్నారు. మరికొందరు కలెక్టరేట్ ఎదుట గేట్ ముందు కాకుండా ఏకంగా కలెక్టరేట్ ఆవరణలోనే ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇక ధర్నాచౌక్ను ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి పడావుగా మారుతోంది. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగే సమయంలో జనసమీకరణ ఎక్కువగా ఉంటుంది. కలెక్టరేట్ ఎదుటే జాతీయ ప్రధాన రహదారి ఉండటంతో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఏదైనా వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే నిరసన చేపడుతున్న ఆందోళకారులపైకి దూసుకు వెళ్తే జరిగే ప్రాణనష్టం ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. ఇప్పటికై నా ధర్నాచౌక్ స్థలం చదును చేసి ఫెన్సింగ్ వేయాలని, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరిష్కార వేదికే సమస్య కావొద్దు సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు వేదిక ధర్నాచౌక్. అలాంటి ప్రాంతమే సమస్యగా మారొద్దు. జిల్లా యంత్రాంగం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలి. – ఎస్కె సాబీర్పాషా, సీపీఐ జిల్లా కార్యదర్శినిర్లక్ష్యం సరికాదు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా మనది. ఉద్యమాలకు పెట్టింది పేరు. అలాంటి జిల్లాలో ధర్నాచౌక్ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఉద్యమాలకు అనుకూలంగా తీర్చిదిద్దాలి. తాగునీటి సౌకర్యం కల్పించాలి. వేదికను ఏర్పాటు చేయాలి. –మచ్చా వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి -
ఆ ఊరికి రామయ్యస్వామే రుణదాత
● ఏడాదిలోగా వడ్డీతో సహా అప్పు చెల్లిస్తున్న గ్రామస్తులు ● అశ్వాపురం ఎస్సీ కాలనీలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం అశ్వాపురం: సాధారణంగా ఏదైనా అవసరం వస్తే ఇతరుల వద్ద అప్పు తీసుకుంటారు. కానీ ఆ గ్రామంలో ప్రతీ ఒక్కరు దేవుడి వద్దే అప్పు తీసుకుంటున్నారు. తిరిగి ఏడాదిలోగా వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో 20 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 2004లో శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయంలో హోమం, యాగాలు నిర్వహించాక గ్రామస్తులు సేకరించిన నగదులో రూ. 15 వేలు మిగిలాయి. ఆలయ అభివృద్ధికి మరో రెండు సంస్థలు రూ.25 వేల చొప్పున రూ. 50 వేలు విరాళం ఇచ్చాయి. మొత్తం రూ. 65 వేలు కాగా, ఆ నగదును ఎక్కడా ఖర్చు చేయకుండా గ్రామస్తులకు రుణం ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఒక్కరికి రూ.6 వేల వరకు రుణం ఇవ్వాలని, తీసుకున్న అప్పు ఏడాదిలోపు చెల్లించాలని, రుణానికి ఆ గ్రామంలోనివారే అర్హులని నిబంధనలు పెట్టుకున్నారు. అప్పటి నుంచి గ్రామస్తులు అప్పు తీసుకుంటూ, తిరిగి చెల్లిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం స్వామివారికి గ్రామస్తులు రూ.20.90 లక్షల వరకు అప్పు ఉన్నారని ఆలయ కమిటీ వారు చెబుతున్నారు. సీతారామచంద్రస్వామి వద్ద అప్పు తీసుకుని ప్రారంభిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. కాగా గ్రామంలో రామాలయం నిర్మించాలనుకున్న స్థలంలో ఏటా పందిరి మండపం ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహిస్తున్నారు. -
బాధితులకు భరోసా..
● వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం రూ. 4 లక్షలకు పెంపు ● త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా చెల్లింపులు ● వడగాల్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా గుర్తింపుబూర్గంపాడు/చుంచుపల్లి: వడగాడ్పులను రాష్ట్ర ప్రత్యేక విపత్తుగా ప్రభుత్వం పరిగణించింది. వడదెబ్బతో మృత్యువాత పడిన కుటుంబాలకు అండగా నిలవనుంది. బాధిత కుటుంబాలకు అందించే పరిహారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచింది. మండలస్థాయి కమిటీ చేసే సిఫార్సును కలెక్టర్ పరిశీలించి ఆమోదించాక పరిహారం అందనుంది. సకాలంలో చికిత్స అందక పలువురు మృతి వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, వ్యవసాయ కూలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, హమాలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృత్యువాత పడుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్బంధు పథకం కింద రూ. 50 వేల ఆర్థికసాయమందించేది. వరుస వారీగా దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితాను కలెక్టర్కు పంపితే, అక్కడ కూడా వరుస వారీగా నిధుల లభ్యతను బట్టి సాయమందించేవారు. ఆపద్బంధు పథకానికి ప్రమాదవశాత్తు మరణించిన వారు, వివిధ కారణాలతో మృతిచెందిన వారు కూడా దరఖాస్తు చేసుకునేవారు. ఏడేనిమిదేళ్లుగా ఆపద్భందు పథకం దాదాపుగా నిలిచిందనే చెప్పాలి. సాయం అందకపోవటం, పరిహారం కూడా తక్కువ మొత్తంలో ఉండటం, పోస్టుమార్టం వ్యయప్రయాసలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి కూడా చూపడంలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబీకులు పేర్ల నమోదుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితేనే.. రూ.4 లక్షల పరిహారమందించటం బాధిత కుటుంబాలకు ఒకింత ఊరటనిస్తుంది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలో తీసుకుంటారు. వడదెబ్బతో అస్వస్థత గురై ఎవరైనా మరణిస్తే తహసీల్దార్, మండల వైద్యాధికారి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదికలను సిద్ధం చేయాలి. మృతుని కుటుంబ సభ్యులు ముందుగా ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీస్శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి. శవ పంచనామా నివేదికల అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి. పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి పరిశీలించి కలెక్టర్కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి, ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది. అవగాహన కల్పిస్తున్నాం పరిహారం పెంచడం వల్ల వడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. జిల్లాలో వేసవి రక్షణ చర్యలు చేపట్టాం. కొన్ని మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చలి వేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం. ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. వైద్యశాఖను అప్రమత్తం చేసి అవగాహన చర్యలు చేపడతాం. – డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్ఇటీవలి వడదెబ్బ మృతులు.. ఇల్లెందు మండలం లక్ష్మీనారాయణ తండాకు చెందిన మేకల కాపరి బానోత్ హేమ్లా (55) గత సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. టేకులపల్లి మండలం మద్రాసు తండా కొండంగులబోడుకు చెందిన కేళోత్ గోబ్రియా (49) గత నెల 24న చేలో వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డాడు. పినపాక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాటి రత్తాలు (55) గత నెల 15న బంధువుల పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి వడదెబ్బ బారినపడి మృతి చెందింది. -
యంత్రం.. పాత మంత్రం
వ్యవసాయ యాంత్రీకరణను పునరుద్ధరించిన ప్రభుత్వం ● గత మార్చిలో పథకం విధివిధానాల వెల్లడి ● మళ్లీ పాత తరహా యంత్రాలకే సబ్సిడీల ప్రకటన ● ప్రస్తుత పరిస్థితులకు తగిన కొత్త పరికరాలకు దక్కని చోటు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్(స్మామ్) పథకంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను అందిస్తోంది. ఇతర రైతులకు ఈ సబ్సిడీ 40 శాతం ఉంటుంది. గరిష్టంగా రూ.5 లక్షల విలువైన యంత్రాలను అందించే వీలుంది. గతంలోనూ ఈ పథకం అమల్లో ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 2018లో రైతుబంధు పథకం ప్రవేశపెట్టాక నిలిపివేసింది. దీంతో వ్యవసాయ యాంత్రీకరణలో వేగం తగ్గింది. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించింది. కానీ డ్రోన్లు మినహాయిస్తే ప్రస్తుత అవసరాలకు తగ్గ ఆధునిక యంత్రాలకు చోటు కల్పించకపోవడం లోటుగా మారింది. మారిన అవసరాలు గడిచిన ఐదారేళ్లుగా తెలంగాణలో వరిసాగు గణనీయంగా పెరిగింది. గతేడాది నుంచి సన్న రకాలు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్మేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ధాన్యం ఆరబెట్టడం సమస్యగా మారింది. సాధారణంగా కోతలు పూర్తయ్యాక ధాన్యంలో తేమ 35 నుంచి 40 శాతం ఉంటుంది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలంటే తేమ 17శాతమే ఉండాలి. దీంతో ఆరబెట్టేందుకు ఆధునిక యంత్రాలు (ప్యాడీ డ్రయర్స్) అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇప్పటికీ పాత పద్ధతులే అవలంబించాల్సి వస్తోంది. కొత్త వాటికి చోటివ్వాలి ప్రస్తుతం వ్యవసాయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రోటవేటర్లు, కల్టివేటర్ల వంటి యంత్రాల వినియోగం దాదాపు సంతృప్త స్థాయికి చేరింది. తిరిగి ఇవే యంత్రాలకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదనే అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ఆరబోత, కోత యంత్రాల అవసరం పెరిగింది. మిర్చి, పత్తి కోతల సమయంలో స్థానికంగా కూలీలు పొరుగు రాష్ట్రాల నుంచి రప్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆధునిక యంత్రాలకు సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు తగ్గట్టు నిబంధనల్లో మార్పు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వరి ధాన్యం ఆరబెట్టే యంత్రాలు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైనవి అందుబాటులో ఉన్నాయి. గంట వ్యవధిలో ఒక ఎకరం పొలంలో పండే ధాన్యాన్ని ఆరబెట్టడంతోపాటు తాలు కూడా ఇవి వేరు చేస్తాయి. తద్వారా రోజుల తరబడి ఆరబోయాల్సిన ఇక్కట్లు తప్పుతాయి. అదే విధంగా మిర్చి, పత్తి కోత మిషన్ల అవసరం ఉన్నందున రైతులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది.ఆఖరికి శ్మశానంలోనూ ధాన్యంలో తేమ శాతం తగ్గించేందుకు గ్రామాల్లో ఖాళీ స్థలాలు, రోడ్ల వెంట, పాఠశాలలు, మైదానాలు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఆరబెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఎక్కడా చోటు లభించక వైకుంఠ ధామా(శ్మశాన వాటిక)ల్లోనూ ధాన్యం ఆరబోసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా పగలూరాత్రి, ఎండావానా తేడా లేకుండా కాపలా ఉంటున్నారు. పగటి వేళ కూలీలను పెట్టుకుని అరగంటకోసారి ధాన్యాన్ని నేరుపుతూ తేమ తగ్గించేందుకు వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. కనీసం వారం పాటు జరిగే ఈ తంతు కారణంగా అయ్యే ఖర్చు, ప్రభుత్వం అందించే బోనస్కు సరిపోతోంది. దీంతో చాలామంది సన్నకారు, చిన్నకారు రైతులు మద్దతు ధర రాకున్నా పొలాల వద్ద ప్రైవేట్ వ్యాపారులకు పచ్చి ధాన్యమే అమ్ముకుంటున్నారు. ఫలితంగా బోనస్ చాలా మంది సన్నకారు, చిన్నకారు రైతులకు అందడం లేదు. -
రజతోత్సవ సభకు తరలిరావాలి
ఖమ్మంమయూరిసెంటర్ : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని చాటి చెప్పేందుకు ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. పార్టీ రజతోత్సవ సభల జయప్రదానికి ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణుల తరలింపుపై దిశా నిర్దేశం చేశారు. సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు, తాగునీరు, భోజనాల సరఫరాతో పాటు నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్ల నియామకం తదితర అంశాలపై చర్చించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న ఉదయం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని పార్టీ దిమ్మెలను ముస్తాబు చేయాలని, లేని చోట నిర్మించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఎల్కతుర్తి సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ, బానోత్ మదన్లాల్, బానోత్ చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, దిండిగాల రాజేందర్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ముత్యాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా, వద్దిరాజు, పువ్వాడ -
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వరుస సెలవులు కావడంతో నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా అర్చకులు విశేష పూజలు జరిపారు. అనంతరం అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్శర్మ పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లావ్యాప్తంగా అవగాహనా సదస్సుల నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేయడానికి కలెక్టరేట్కు రావొద్దని సూచించారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 562 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.30,420 ఆదాయం లభించగా, 180మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.8,060 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ కుటుంబ సభ్యులతో కిన్నెరసానిని సందర్శించారు. మ్యూజియంలోని జంతువుల బొమ్మలను వీక్షించి బోటు షికారు చేశారు. -
రైతులకు న్యాయం చేయండి
● ధాన్యం అమ్మిన వారికి బోనస్ జమ కావడం లేదు.. ● మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకెళ్లిన తుమ్మల దమ్మపేట : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు అందాల్సిన బోనస్ వారి ఖాతాల్లో జమ కావడం లేదని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. మండలంలోని గండుగులపల్లిలో తన నివాసంలో ఉన్న తుమ్మలను స్థానిక రైతులు శనివారం కలిశారు. ధాన్యం అమ్మిన తమకు ఇంకా బోనస్ జమ కాలేదని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో తుమ్మల ఉత్తమ్కుమార్కు ఫోన్ చేశారు. కొందరు మిల్లర్లు దళారులతో కుమ్మకై ్క, రైతులకు నష్టం జరిగేలా చేస్తున్నారని, ఈ విషయంలో రైతులకు న్యాయం చేరాలని కోరారు. స్పందించిన మంత్రి ఉత్తమ్.. ఉన్నతాధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు. కాగా, దమ్మపేటలోని శివాలయం ఎదురుగా ఉన్న ఆర్అండ్బీ వంతెన ఎత్తు పెంచాలని స్థానిక కాంగ్రెస్ నాయకుడు చిన్నశెట్టి యుగంధర్ మంత్రి తుమ్మలను కోరగా.. వంతెనకు సంబంధించిన అంచనాలు తయారు చేయాలని ఆర్అండ్బీ డీఈని ఫోన్లో ఆదేశించారు. రెడ్యాలపాడుకు చెందిన మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా తుమ్మల ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, దొడ్డా ప్రసాద్, ఎర్రా వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరిలో మునిగి బాలుడి మృతి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నదిలో మునిగి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని ముదిరాజ్ బజార్కు చెందిన కొమ్ము దుర్గ కుమారుడు హర్షవర్దన్ (15), శనివారం మధ్యాహ్నం అదే కాలనీకి చెందిన ఓ మహిళ బట్టలు ఉతికేందుకు వెళ్తుండగా, ఆమెతోపాటు గోదావరికి వెళ్లాడు. హర్షవర్ధన్ నీళ్లలో ఆడుకుంటూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. అక్కడున్నవారి సమాచారంతో వచ్చిన గజ ఈతగాడు గోదావరిలో వెతికి బాలుడిని బయటకు తీశాడు. కుటుంబ సభ్యులు బాలుడికి సీపీఆర్ చేసి, స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా సాయంత్రం మృతి చెందాడు. హర్షవర్దన్ బాల్యంలోనే తండ్రి మృతి చెందగా, తల్లి దుర్గ కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని సాకుతోంది. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాల వాహనం ఢీకొని వృద్ధుడు..పినపాక: పాల వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు (60) తెల్లవారుజామున ఈ.బయ్యారం క్రాస్ రోడ్కు వస్తన్నాడు. ఈ క్రమంలో మణుగూరు నుంచి పాలతో రాజపేట వెళ్తున్న వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వాహనంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. -
ఎస్పీకి ఘన సన్మానం
కొత్తగూడెంటౌన్: అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ రోహిత్రాజును శనివారం ఘనంగా సన్మానించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ సహకరించిందని, ఈ మేరకు కృతజ్ఞతనగా ఎస్పీని సత్కరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జే.బీ శౌరీ, మారపాక రమేష్, కూసపాటి శ్రీనివాస్, ఎర్రా కామేష్, సుబ్బారావు, నాగేందర్, చదలవాడ సూరి తదితరులు పాల్గొన్నారు. డీసీహెచ్ఎస్ రవిబాబుకు.. పాల్వంచ: డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎక్స్లెన్సీ అవార్డు రావడంతో శనివారం పాల్వంచ సీహెచ్సీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ పి.రాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆస్పత్రుల బలోపేతానికి రవిబాబు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజు దొర, వైద్యులు వెంకన్న, మోహన్వంశీ, ప్రసాద్, పూజిత తదితరులు పాల్గొన్నారు. -
రేపు భద్రాచలానికి ఎమ్మెల్సీ కవిత
ఇల్లెందు : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం భద్రాచలం వస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శనం చేసుకుంటారని, ఆ తర్వాత హరిత హోటల్లో తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసే సమావేశంలో మాట్లాడుతారని వివరించారు. ఉద్యమకారులంతా సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు. ఫొటోలు తొలగించిన అధికారులుభద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి విచారణ చేపట్టకుండానే బిల్లుల మంజూరుకు ప్రతిపాదించిన ఉద్యోగి పూసా జగదీష్ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. తప్పుడు ఫొటోలు అప్లోడ్ చేసినట్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించిన విషయం విదితమే. ఈమేరకు శనివారం మరోమారు విచారణ చేపట్టిన అధికారులు సదరు ఉద్యోగి అప్లోడ్ చేసిన ఫొటోలను సైట్ నుంచి తొలగించారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వెదురుసాగుపై అవగాహన కల్పించాలిసెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత చుంచుపల్లి: జిల్లాలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సెర్ప్ ఫార్మా డైరెక్టర్ రజిత సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఐడీఓసీలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన మిర్చి కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్పీసీల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.కోటి టర్నోవర్ చేశారని, ఇంకా పెంచాలని అధికారులకు సూచించారు. గుండాల, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో ఎంతమంది వెదురు రైతులను గుర్తించారు, ఆన్లైన్లో ఎందరి డేటా ఎంట్రీ చేశారనే వివరాలపై ఆరా తీశారు. వెదురు సాగుతో కలిగే లాభాలతో పాటు సమీకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. మునగ సాగు, మునగ ఆకుల సేకరణ ఎలా ఉందంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎఫ్పీసీ కో– ఆర్డినేటర్ శ్రీనివాస్, టీపీఎం ఫార్మా వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం వెల్ల డించారు. ఎక్కువ శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల విద్యార్థుల పరీక్ష ఫీజును యూనివర్సిటీకి చెల్లించకపోగా, నామినల్ రోల్స్ కూడా పంపలేదు. దీంతో పరీక్షలను వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని రాజేందర్ తెలిపారు. -
బాక్స్ క్రికెట్కు క్రేజ్
బూర్గంపాడు: పల్లె, పట్టణ ప్రాంతాల శివారు భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతుండగా.. ఊరి బయట కాసేపు ఆడుకునేందుకు సరైన క్రీడా ప్రాంగణాలు లేవు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా అక్కడ వసతులు శూన్యం. దీంతో యువత క్రీడలకు దూరమవుతోంది. ఈ తరుణంలో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బాక్స్ క్రికెట్ క్రేజ్ ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే బాక్స్ క్రికెట్ కోర్టులు వెలుస్తున్నాయి. మొదట ఆసక్తి చూపని యువకులు, చిన్నారులు ఇప్పుడు బాక్స్ క్రికెట్పై మోజు పెంచుకుంటున్నారు. రోజూ గంటో, రెండు గంటలో ఈ ఆట ఆడుతున్నారు. ఫ్లడ్లైట్ల వెలుగులో క్రికెట్ ఆడడం సరికొత్త అనుభూతి ఇస్తోందని కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రూ.లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ కోర్టులకు ఆశించిన స్థాయిలో యువకులు రావడం లేదని నిర్వాహకులు అంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ.. జిల్లాకు చెందిన యువతీ యువకులు క్రీడా రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. వీరికి సరైన శిక్షణ అందించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించే అవకాశం ఉంది. పినపాక మండలానికి చెందిన తొలెం రమేష్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పతకాలు సాధిస్తున్నాడు. భద్రాచలం పట్టణానికి చెందిన గొంగిడి త్రిష క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వీరితో పాటు చాలా మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. అయితే జిల్లాలో సరైన క్రీడా మైదానాలు, కోచ్లు అందుబాటులో లేకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో బాక్స్ క్రికెట్ కోర్టులు క్రీడాకారులకు కొంతమేర ఊరట కలిగిస్తున్నాయి. కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు.. జిల్లా కేంద్రం కొత్తగూడెంతో పాటు భద్రాచలం, సారపాకలో ప్రస్తుతం బాక్స్ క్రికెట్ కోర్టులు నడుస్తున్నాయి. కోల్బెల్డ్ ఏరియాలైన ఇల్లెందు, మణుగూరు పట్టణాల్లోనూ ఈ కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు బాక్స్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవులు సమీపిస్తుండడంతో విద్యార్థులు కూడా బాక్స్ క్రికెట్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.గ్రౌండ్ లేని లోటు తీరుతోంది పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ లేదు. క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉన్నా గ్రౌండ్ లేకపోవడంతో నిరుత్సాహ పడేవాళ్లం. ఇప్పుడు బాక్స్ క్రికెట్ కోర్టు అందుబాటులోకి రాడంతో ఆ ఇబ్బంది తొలగింది. ఫిట్నెస్ కోసం వారానికి నాలుగు రోజులు బాక్స్ క్రికెట్ ఆడుతున్నా. – మాదినేని ఆకాశ్, సారపాకసౌకర్యంగా ఉంది సారపాకలో బాక్స్ క్రికెట్ కోర్టు వచ్చిన తర్వాత మిత్రులతో కలిసి రోజూ రెండు గంటల పాటు క్రికెట్ ఆడుతున్నాం. ఊర్లో క్రికెట్ గ్రౌండ్ లేకపోవడంతో గల్లీలోనే ఆడేవాళ్లం. ఇప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఆటలో నైపుణ్యం పెంచుకుంటున్నాం. ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడడం కొత్త అనుభూతిని ఇస్తోంది. – కన్నెదారి తరుణ్సాగర్, రెడ్డిపాలెం జిల్లాలో వెలుస్తున్న క్రీడా కోర్టులు ఫ్లడ్లైట్ల వెలుగులో ఆడుతున్న యువత, చిన్నారులు క్రీడా ప్రాంగణాలు లేక ఇటువైపు మొగ్గు -
వన్యప్రాణి వధ!
నాటు తుపాకులతో సాగుతున్న వేట ● నీటి స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్న వేటగాళ్లు ● కొందరు అటవీ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు ● ఫిర్యాదులు అందితేనే దాడులు.. అరెస్ట్లోనూ తాత్సారం వేడుక చూస్తున్న అటవీశాఖాధికారులు వేటగాళ్లు ఉచ్చులు, నాటు తుపాకులు, వలలతో వేటాడుతున్నా అటవీ శాఖాధికారులు మాత్రం వేడుక చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అడవుల్లో పులులు, ఇతర జంతువుల సంచారాన్ని రికార్డు చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలు జంతువుల జాడను గుర్తిస్తున్నాయి కానీ వేటగాళ్ల జాడను మాత్రం గుర్తించలేక పోతున్నాయా? లేక సీసీ కెమేరాల ఆధారంగా జంతువుల జాడను అటవీ శాఖలో పనిచేస్తున్నవారు వేటగాళ్లకు సమాచారం అందిస్తున్నారా..? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ నెల 9న తుపాకులతో అడవిలో సంచరించిన వ్యక్తులకు ఓ బీట్ ఆఫీసర్కు మధ్య లావాదేవీలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంతా సార్కు తెలిసే జరిగిందని అనుకున్నారు. తాజాగా దమ్మపేట రేంజ్లో దుప్పి మాంసం పట్టుబడగా రెండు రోజుల జాప్యం అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై పాల్వంచ ఎఫ్డీఓ దామోదర్రెడ్డిని వివరణ కోరగా.. వన్యప్రాణులను వధిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడవిలో గస్తీ నిర్వహించేందుకు సిబ్బంది కొరత ఉందని, సీసీ కెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని వివరించారు. అశ్వారావుపేట: వేసవి కాలం కావడంతో వన్యప్రాణులను వేటాడుతున్నారు. జిల్లాలో సీతారామ కాలువల నిర్మాణం ప్రారంభమయ్యాక అడవుల్లోకి నేరుగా మార్గాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు వేసవిలో కాలువల్లో నీళ్లు తాగేందుకు జింకలు, ఇతర వన్య మృగాలు వస్తుండటంతో కాలువల సమీప ప్రాంతాలు వేటగాళ్లకు లక్ష్యంగా మారాయి. అడవుల్లో జంతువులు దాహార్తిని తీర్చేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన సాసర్పిట్లను కూడా లక్ష్యంగా చేసుకున్ని వన్యప్రాణులను వధిస్తున్నారు. ఏటా శీతాకాలం చివరిలో సుదూర ప్రాంతాల నుంచి జిల్లాలోని పలు అటవీ ప్రాంతాలకు వేటకు వస్తుంటారు. తుపాకులతో వేటాడం, ఉచ్చులు పెట్టడం, విద్యుత్ వైర్లు అమర్చడం, వలలు అమర్చడం వంటి విధానాల్లో వేట జరుగుతుండేది. విద్యుత్ వైర్లు తగిలి వేటగాళ్లే మరణించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో విద్యుత్ వైర్లు అమర్చడం తగ్గించారు. కొద్దిరోజులుగా నాటు తుపాకులతో అటవీ జంతువులను వేటాడుతున్నారు. కొన్ని చోట్ల ఉచ్చులు, వలలు కూడా వినియోగిస్తున్నారు. అశ్వారావుపేట, దమ్మపేట రేంజ్లలోని అటవీ ప్రాంతాలు, చంద్రుగొండ మండలం కనకగిరి గుట్టలు, అన్నపురెడ్డిపల్లి అటవీ ప్రాంతాలు, పాల్వంచ మండలం, ఇల్లెందు నియోజకవర్గం గుండాల, పూబెల్లి, పూసపల్లి, బేతంపూడి ప్రాంతం, బీటీపీఎస్ పరిసర ప్రాంతాల్లో జంతువుల వేట జరుగుతున్నట్లు సమాచారం. అటవీ శాఖ నిబంధనలు కట్టుదిట్టంగా ఉన్నా వేటగాళ్లు వెనక్కు తగ్గటంలేదు. పాల్వంచ డివిజన్లో వరుస ఘటనలు.. ఈ నెల 9న పాల్వంచ ఫారెస్ట్ డివిజన్లోని అశ్వారావుపేట రేంజ్ కంట్లం బీట్లో ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు తుపాకులతో అడవిలో సంచరిస్తుండగా బేస్ క్యాంపు సిబ్బంది పట్టుకుని కేసు నమోదు చేశారు. గడిచిన వారం రోజుల్లో దమ్మపేట మండలంలో దుప్పి మాంసం పంపిణీ జరిగినట్లు ప్రచారం జరిగింది. స్థానికుల ఫిర్యాదుతో గత గురువారం దమ్మపేట మండలం చెన్నువారిగూడెం గ్రామంలో అటవీ అధికారులు దాడులు చేసి దుప్పి మాంసం, చర్మం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తాత్సారం తర్వాత శనివారం నలుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనలో ఏ–1 నిందితుడు పరారీలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): యాసింగి సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శనివారం సచివాలయం నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్నామని, రేషన్ దుకాణాల ద్వారా అర్హులందరికీ సరఫరా చేస్తున్నామని చెప్పారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. పంపులు లేని ప్రాంతాల్లో ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీరు అందిస్తున్నామని వివరించారు. వీసీలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబూరావు, ఇరిగేషన్ ఈఈ అర్జున్రావు, మిషనర్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, పౌరసరఫరాల శాఖ డీఎం త్రినాథ్బాబు, డీఎస్ఓ రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
జేఈఈలో తాపీమేసీ్త్ర కుమారుడి ప్రతిభ
ఆలిండియాస్థాయిలో 385వ ర్యాంక్ పాల్వంచరూరల్: తాపీ మేసీ్త్ర కుమారుడు జేఈఈ మొయిన్స్ పరీక్షలో ఆలిండియా ర్యాంక్ సాధించాడు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన బోగి లక్ష్యయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి తాపీమేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమారుడు సంతోష్ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. ఇటీవల జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయగా, ఆలిండియా స్థాయిలో 385 ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు, కళాశాల అధ్యాపకులు అభినందించారు.రహదారిపై ధాన్యం.. బస్తాలకు ఎత్తిన పోలీసులుఅశ్వాపురం: మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ రైతు ట్రాక్టర్లో ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తూ కొత్తగూడెం వైపు వెళ్తున్నారు. మండల పరిధిలోని గొల్లగూడెం వద్ద ట్రాక్టర్ను గుర్తు తెలియని వాహనం స్వల్పంగా ఢీకొట్టింది. దీంతో సుమారు 10 బస్తాల ధాన్యం రహదారిపై పడిపోయింది. సుమారు రెండు, మూడు బస్తాల ధాన్యం పిండి అయింది. రహదారిపై వెళ్తున్న వాహనాలతో ధాన్యం పిండి అవుతుండగా ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తూ అశ్వాపురం వైపు వెళ్తున్న ఏఎస్సై రామచంద్రారెడ్డి, పెట్రోలింగ్ సిబ్బంది ఆగి వాహనాలు ధాన్యం ఎక్కకుండా చూసి ధాన్యం బస్తాలలో ఎత్తి రైతుకు సహకరించారు. ధాన్యం బస్తాలకు ఎత్తి సహకరించిన ఏఎస్సై, సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. మొక్కల సంరక్షణపై శ్రద్ధ పెట్టాలిజూలూరుపాడు: మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మండలంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ, అటవీ నర్సరీలను సందర్శించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఎంపీడీఓ డి.కరుణాకర్ రెడ్డి, ఎంపీఓ టి తులసీరామ్, తాళ్లూరి రవి, ఏపీఓ రవికుమార్, హనుమంతు, లక్ష్మణ్ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలిడీపీఓను కోరిన ఎమ్మెల్యే ఆదినారాయణ అశ్వారావుపేటరూరల్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల పరిధిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ డీపీఓ చంద్రమౌళిని కోరారు. ఇందిరా బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు జీపీ కార్యదర్శి రజిని సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కాగా, ఎమ్మెల్యే పర్యటనకు కూడా హాజరు కాలేదు. దీంతో గ్రామస్తుల సమక్షంలోనే ఎమ్మెల్యే డీపీఓతో ఫోన్లో మాట్లాడి కార్యదర్శిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. సైబర్ కేసు నమోదుపాల్వంచరూరల్: స్మార్ట్ఫోన్లో అపరిచితుడు పంపిన లింక్ ఓపెన్ చేసి ఓ యువకుడు రూ. 35 వేలు పోగొట్టుకున్నాడు. మండల పరిధిలోని పునుకుల గ్రామానికి చెందిన ఎస్కె.మహబూబ్ గతేడాది అక్టోబర్ 30న తన ఫోన్కు అపరిచితుడు పంపిన లింక్ను ఓపెన్ చేశాడు. దీంతో బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.35 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు శనివారం ఫిర్యాదు చేయగా, సైబర్ నేరం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
ఆదివాసీ బిడ్డకు పతకాల పంట
స్పీడ్ స్కేటింగ్ విభాగంలో ప్రతిభజూలూరుపాడు: ఆదివాసీ గిరిజన బిడ్డ స్పీడ్ స్కేటింగ్ స్పోర్ట్స్ విభాగంలో ప్రతిభ చాటి పతకాలు సాధించింది. మండలంలోని పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జెజ్జర గోపి సుధీర్ కుమార్ – అలివేలు దంపతుల కుమార్తె తేజస్వి.. పుదుచ్చేరి కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. ఈనెల 17న చైన్నెలో జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్లో స్పీడ్ స్కేటింగ్ జూనియర్ విభాగం వన్ ల్యాప్ రోడ్లో గోల్డ్ మెడల్, 2వేలు, 1000 మీటర్ల ఫోర్ ల్యాప్ రోడ్ విభాగంలో రెండు రజత పతకాలు సాధించింది. దీంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. తేజస్వి పతకాలు సాధించడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
‘భూ భారతి’తో సత్వర పరిష్కారాలు
● సింగరేణి ఓసీ విస్తరణలో భూ సేకరణకు సహకరించాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మణుగూరు టౌన్/కరకగూడెం/పినపాక: భూ భారతి చట్టం రైతన్నలకు చుట్టంలా మారిందని, ఈ చట్టం ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం జెడ్పీ సెంటర్లో, పినపాక మండలం బయ్యారం క్రాస్రోడ్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సింగరేణికి భూసేకరణ కోసం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో తిర్లాపురం, మణుగూరు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం సమన్యాయానికి సూచికగా నిలుస్తుందని, సాగు భూమికి రక్షణ కవచంలా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బిల్డింగులకు, ప్రభుత్వ పాఠశాలలకు, అభివృద్ధి పనులకు కేటాయించడానికి ఉపయోగపడుతుందన్నారు. భూ హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు కూడా పరిష్కారమవుతాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీలు వ్యవస్థ ఉంటుందన్నారు. మణుగూరు ఓసీ విస్తరణ కోసం భూ సేకరణకు నిర్వాసితులు సహకరించాలని కోరారు. నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు తిర్లాపురంలో సేకరించే భూములకు పట్టణంలో మాదిరిగా ఎకరాకు రూ.22.5లక్షల వరకు చెల్లించేందుకు కృషి చేస్తామని, సింగరేణిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతులతోపాటు గిరిజన సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. బయ్యారం క్రాస్రోడ్లో మునగపంటను పరిశీలించి, సాగు చేసిన రైతు కొప్పుల వర్మను అభినందించారు. ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారం కావని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, నాగ ప్రసాద్, నగేష్, ఎంపీడీఓలు కుమార్, సునీల్ కుమార్, ఎస్డీసీ సుమ, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, ఆర్ఐ కృష్ణ ప్రసాద్, తిర్లాపురం మాజీ సర్పంచ్ పాయం కామరాజు, పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి.. సింగరేణిలో బ్లాస్టింగ్ల వల్ల ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని మున్సిపాలిటీ పరిధిలోని పీకే–1, బాపనకుంట, రాజుపేట, విఠల్రావ్ నగర్ల గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. సింగరేణి కోసం భూములు ఇచ్చే రైతుల ఇళ్లు కూడా ఉన్నాయని, కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం వల్ల మా ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దగ్గరగా బ్లాస్టింగ్ జరిగితే ఎలా నివసించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ విస్తరణలో తమ నివాసాలు కూడా తీసుకుని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విఠల్రావు నగర్, పీకే–1 సెంటర్ రైతులు, గ్రామస్తులు, సీపీఐ నాయకుడు దుర్గ్యాల సుధాకర్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
● గంట ముందే కేంద్రాల్లోకి అనుమతి ● తాగునీరు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పించిన అధికారులుఖమ్మం సహకారగర్: ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 20నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 20నుంచి 26వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనుండగా, ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2–30నుంచి 5–30గంటల వరకు జరిగే పరీక్షలకు గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఉద్యోగుల నియామకం పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఎనిమిది కేంద్రాల్లో ఎనిమిది మంది చొప్పున, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించారు. అలాగే, వేసవి నేపథ్యాన కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు వంటి వసతులు కల్పిస్తున్నారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి ఈ.సోమశేఖర శర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. కేంద్రాల సమీపాన జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు. -
కరుణామయుడా..
● భక్తిశ్రద్ధలతో గుడ్ రౖఫైడే ● ప్రత్యేక ప్రార్థనలు, శాంతి ర్యాలీలు పాల్వంచ/కొత్తగూడెంటౌన్: క్రీస్తును సిలువ వేసిన రోజును స్మరించుకుంటూ క్రైస్తవులు శుక్రవారం గుడ్ రౖఫైడే వేడుకలను జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా చర్చిలు, మందిరాల్లో ప్రార్థనలు చేశారు. పలు ప్రాంతాల్లో క్రీస్తు సిలువ వేసిన ప్రదర్శనలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టారు. పలువురు గీతాలను ఆలపించారు. కొత్తగూడెంలోని సెయింట్ అండ్రుస్, బేతానియా, సెయింట్ థామస్ చర్చిలు, పాల్వంచలోని సీఎస్ఐ, ఆరోగ్య మాత చర్చిల్లో వేడుకలు జరిగాయి. పాల్వంచ ఆరోగ్యమాత చర్చి(ఆర్సీఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన సిలువ మార్గ ప్రదర్శన చూపరులను కంటతడి పెట్టించింది. చర్చి నుంచి బీసీఎం రోడ్లో సీ కాలనీ సెంటర్, అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్ మీదుగా శ్రీనివాస కాలనీ కార్మెల్ గిరి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రదర్శన సాగింది. రాత్రి భక్తులు కార్మెల్ గుట్టకు అధిక సంఖ్యలో చేరుకుని ప్రార్థనలు చేశారు. గిడియోన్ సంస్థ ఆధ్వర్యంలో బైబిళ్లు, న్యూలైఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చల్లటి పానీయాలు పంపిణీ చేశారు. చిత్రమాలిక IIవ పేజీలో -
అంతా సవ్యంగానే ఉందా?!
● పాఠశాలల స్థితిగతులపై ఏటా యు–డైస్ సర్వే ● ఇందులో వివరాలపై థర్డ్ పార్టీ ద్వారా పరిశీలన ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన ఎలా జరుగుతోంది.. ఇంకా ఏమేం వసతులు కావాలనే సమాచార సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఏటా యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యు–డైస్) సర్వే చేయిస్తోంది. ప్రతీ ఏడాది అక్టోబర్, నవంబర్లలో ఈ సర్వే చేస్తుండగా.. ఇందులో నమోదైన వివరాలను సరిచూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ పార్టీ సర్వేకు నిర్ణయించింది. డైట్ కళాశాల విద్యార్థులతో చేయిస్తున్న ఈ సర్వే 15వ తేదీన మొదలుకాగా 21వ తేదీతో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డైట్ కళాశాల ఒకటే ఉన్నందున భద్రాచలం ఐటీడీఏలోని బీఈడీ కళాశాల విద్యార్థులను కూడా సర్వేకు వినియోగించుకుంటున్నారు. యు–డైస్ సర్వే ఇలా.. ఏటా కేంద్ర ప్రభుత్వం యు–డైస్ పేరిట సర్వే నిర్వహిస్తుంది. పాఠశాలల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా సదుపాయల కల్పనకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. కొన్ని తేడాలు.. కేంద్రం చేయించిన యు–డైస్ సర్వేలో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని తేల్చారు. టాయిలెట్లు, డిజి టల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం లేవని గుర్తించారు. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా వివరాలు ఇలా నమోదు కావడానికి సర్వే లోపాలే కారణమని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో థర్డ్ పార్టీ సర్వేకు నిర్ణయించినట్లు తెలిసింది. డైట్ విద్యార్థులతో.. డైట్ విద్యార్థులతో థర్డ్ పార్టీ సర్వే కొనసాగుతుండగా, డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. యు–డైస్లో ఏం నమోదు చేశారు.. వాస్తవ పరిస్థితులు ఏమిటో పరిశీలించి తేడాను నివేదికలో పొందుపరుస్తున్నారు. ఖమ్మం సమీపాన ఓ పాఠశాలలో ర్యాంప్ లేకున్నా ఉన్నట్లు నమోదు చేశారని, మరుగుదొడ్లు ఉన్నా లేనట్లుగా పేర్కొన్నారని గుర్తించినట్లు సమాచారం. అలాగే, చిన్న మరమ్మతులు అవసరమైతే భవనాలు శిథిలావస్థకు చేరాయని యు–డైస్ సర్వేలో పొందుపర్చారని తేల్చినట్లు తెలిసింది. కాగా ఈ సర్వేతో వాస్తవ పరిస్థితులు వెలుగుచూస్తాయని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.జిల్లా పాఠశాలలు సర్వే చేస్తున్న విద్యార్థులు ఖమ్మం 1,170 80 మంది భద్రాద్రి కొత్తగూడెం 530 72 మంది -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శు క్ర వారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకం గావించారు. పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, కుంకుమ పూజలు, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. 22, 25 తేదీల్లో టీబీజీకేఎస్ నిరసనలుసింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గనుల వేలం, సింగరేణి ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న సింగరేణివ్యాప్తంగా గనులు, డిపార్ట్మెంట్ వద్ద, 25న జీఎం కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టి, వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్ప పూల సేకరణఅశ్వాపురం: మండలంలోని అటవీ ప్రాంతంలో గిరిజనులు ఇప్ప పూలు సేకరిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభం నుంచి వర్షాలు కురిసే వరకు గిరిజన గ్రామాల్లో ఇప్ప పూల సేకరణ సాగుతుంది. తెల్లవారుజామునే అడవుల్లోకి వెళ్లి సేకరించి ఇళ్లకు తెచ్చి ఎండబడతారు. అనంతరం కేజీ రూ.15 నుంచి 20చొప్పున విక్రయిస్తుంటారు. వీరి నుంచి జీసీసీ అధికారులు, కొందరు ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు చేపడతారు. వేదగణితంలో విద్యార్థి ప్రతిభఅశ్వారావుపేటరూరల్: వేద గణితం శిక్షణలో అశ్వారావుపేటకు చెందిన సిద్ధాంతపు సాత్విక్ సాయికుమారాచార్యులు ప్రతిభ కనబరిచాడు. ఏపీలోని విశాఖపట్నానికి చెందిన వాగ్దేవి కళాపీఠం ఆధ్వర్యంలో గడిచిన ఆరు నెలలుగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా వేద గణితంపై శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ ముగిశాక పరీక్ష నిర్వహించి, శుక్రవారం ఫలితాలు విడుదల చేశారు. కాగా సాత్విక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ మేరకు సర్టిఫికెట్ను వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి, వేదగణితం శిక్షకురాలు జి.సత్య ఈ మెయిల్ ద్వారా పంపించారు. -
ధాన్యం కాపాడేదెట్టా..?
పాల్వంచరూరల్: అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను రక్షించుకునేందుకు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ధాన్యం, మిర్చి కల్లాల్లో ఆరబెడితే వానలకు తడిసిపోతున్నాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే రైతుల గుండెలు గుభేల్మంటున్నాయి. టార్పాలిన్ పట్టాలు కప్పుకుని కాపాడుకుందామంటే ప్రభుత్వం వాటిని సరఫరా చేయడంలేదు. దీంతో ఏటా యాసంగి సీజన్లో రైతులు నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై.. యాసంగి సీజన్లో అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 30,557మంది రైతులు 74,600 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి తడిసిపోయింది. గతంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై టార్పాలిన్లు (పట్టాలు) అందించారు. మార్కెట్లో టార్పాలిన్ ధర రూ.2500 ఉంటే ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రూ.1250కు ఇచ్చేది. దీంతో రైతులు అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకునేవారు. కానీ 2017 నుంచి టార్పాలిన్ పట్టాల పంపిణీ నిలిపివేశారు. దీంతో ఎనిమిదేళ్లుగా టార్పాలిన్ల పట్టాల కొరత రైతులను వేధిస్తోంది. అద్దెకు తీసుకుందామంటే అధిక ధర ధాన్యం తడవకుండా పరదాలను రైతులు అద్దెకు తెచ్చి వినియోగించుకుంటున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటే భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు పట్టణాలకు వెళ్లి పరదాలను అద్దెకు తెస్తున్నారు. ఒక్కో పరదాకు రోజుకు రూ.20పైన చెల్లించాల్సివస్తోంది. దీనికితోడు రానుపోను చార్జీలు కలిపి రైతులపై భారం పడుతోంది. పట్టాల్లేక అకాల వర్షంతో తడిసిపోతున్న వడ్లు ఏటా యాసంగి సీజన్లో రైతులకు తప్పని ఇక్కట్లు గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు మంజూరు 2017 నుంచి పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం ప్రైవేటులో నాణ్యతలేని పరదాలు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. సమీప పట్టణాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం, వరంగల్, విజయవాడ, హైదరాబాద్లకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటుగా కొనుగోలు చేసిన మన్నిక, నాణ్యత ఉండటం లేదని, నాసిరకంగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు పంటలు తడిసిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికీ పాతవి, పాడైన టార్పాలిన్లనే వినియోగిస్తున్నారు. కొందరు గోనె సంచులను ఉపయోగిస్తున్నా పెద్దగా ఉపయోగం ఉండటంలేదు. ధాన్యం తడిసి మళ్లీ తేమశాతం పెరిగి కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు తప్పడం లేదు. -
బూడిదే మిగులుతోంది!
● ఏటా ఏజెన్సీలో అగ్ని ప్రమాదాలతో తీవ్ర నష్టం ● ఇళ్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగులుతున్న బాధితులు ● అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్యం ● చర్ల, గుండాల, ములకలపల్లిలో ఏర్పాటు చేయాలని విన్నపం చర్ల: ఏజెన్సీలో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు కలగానే మిగిలిపోతోంది. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సుదూర ప్రాంతాల్లోని కేంద్రాల నుంచి ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లోని చర్ల, వెంకటాపురం, వాజేడు, ములకలపల్లి, దమ్మపేట, గుండాల, ఆళ్లపల్లి మండలాలు అగ్నిమాపక కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. ఆయా మండలాల్లో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలల్లో తీవ్రమైన ఆస్తినష్టం సంభవిస్తోంది. ఫైరింజన్లు వచ్చేసరికి నష్టం జరిగిపోతోంది.. భద్రాచలం నియోజకవర్గం కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి దుమ్ముగూడెం 20 కిలోమీటర్లు, చర్ల 55 కిలోమీటర్ల దూరంలో ఉండగా, వెంకటాపురం 110, వాజేడు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పినపాక మండలంలో ఉన్న గుండాల, ఆళ్లపల్లి మండలాలకు కొత్తగూడెం అగ్నిమాపక కేంద్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి, దమ్మపేట మండలాలు కొత్తగూడెంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో ఆయా మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అంత దూరం నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పేందుకు కనీసం గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతోంది. రహదార్లు సరిగా లేని ప్రాంతాలకు ఇంకా ఆలస్యం అవుతోంది. ఆలోపే అంతా అగ్గికి బుగ్గి అవుతోంది. దీంతో బాధితులు కట్టుబట్టలతో మిగులుతున్నారు. రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. వేసవిలో ఇళ్లతోపాటు ధాన్యం కుప్పలు, మిర్చి కల్లాలు, పత్తి కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏటా అగ్ని ప్రమాదాలతో సుమారు రూ.10 కోట్లకు పైగానే నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. పట్టించుకోని ప్రజాప్రతినిధులు అగ్ని ప్రమాదాల నుంచి ఏజెన్సీలో ఆస్తులను కాపాడేందుకు అగ్ని మాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేవలం జిల్లా, నియోజకవర్గ కేంద్రాలను తప్ప ఏజెన్సీలోని మండలాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో మాత్రమే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాలను గాలికొదిలేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, వెంకటాపురం ప్రాంతాలను కూడా పట్టించుకోవడంలేదు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న ములకలపల్లి, దమ్మపేట మండలాల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఏజెన్సీలో అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కాలి బూడిదవుతున్నాయి.. ఏటా చర్ల మండలంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తులన్నీ కాలిబూడిదవుతున్నాయి. భద్రాచలం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే సరికి బూడిద మాత్రమే మిగులుతోంది. ప్రభుత్వం స్పందించి చర్లలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి. –పి.సాంబశివరావు, ఆర్.కొత్తగూడెంఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలి చర్ల మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలి. ఏటా అగ్ని ప్రమాదాల్లో రూ. లక్షల్లో ఆస్తి నష్టం జరుగుతోంది. వందల సంఖ్యలో పేదలు, గిరిజనులు నిరాశ్రయులవుతున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించాలి. –సాయికుమార్, తేగడ ప్రతిపాదనలు పంపాం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అదనంగా అగ్నిమాపక కేంద్రాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నియోజకవర్గ కేంద్రాలకు సుదూర ప్రాంతంలో ఉన్న చర్ల, గుండాల మండల కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నాం. త్వరలోనే మంజూరవుతాయి. –ఎం.క్రాంతి కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి -
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
అశ్వాపురం: జీవితం మీద విరక్తితో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం మండల పరిధి మల్లెలమడుగుకు చెందిన బండి అనిల్(34) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో 17న ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొండికుంట గ్రామ సమీపాన పొలాల్లో అనిల్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని చూసిన గేదెల కాపరులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అశోక్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా, మృతదేహం దుర్వాసన వస్తుండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్తో మహిళ.. జూలూరుపాడు: బ్రెయిన్ స్ట్రోక్తో ఓ మహిళ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన షేక్ జాన్బీ(53) గత కొన్ని రోజులుగా ఉపాధి పనులకు వెళ్తుంది. ఈ క్రమంలో రోజుమాదిరిగానే ఈనెల 15న పనికి వెళ్లి ఇంటికి వచ్చి రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అదేరోజు రాత్రి తెల్లవారుజామున ఆమె శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. కుటుంబసభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, ఆపై ఖమ్మంకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. గత ఐదేళ్ల క్రితం జాన్బీకి బ్రెయిన్ ఆపరేషన్ జరిగినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. మృతురాలికి భర్త జానీ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు.. బోనకల్: భర్త వదిలేసినా, ఇద్దరు కుమారులు మానసిక వైకల్యంతో బాధపడుతున్నా బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళ కుమారుడిని బావి మింగేసింది. ఆ కుటుంబంతో పాటు, స్థానికంగా విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు... జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన షేక్ రేష్మాకు ఓ కుమార్తెతో పాటు మానసిక దివ్యాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఆమెను భర్త వదిలివేసినా అధైర్యపడకుండా పిల్లలతో కలిసి చింతకాని మండలం ప్రొద్దుటూరుకు వచ్చి గుడారం వేసుకుని జీవనం సాగిస్తోంది. పాత రాతెండి సామగ్రి కొనడం, మరమ్మతు పనులతో పొట్ట పోసుకుంటుండగా, శుక్రవారం పెద్దకుమారుడు యాకూబ్(15) బోనకల్ మండలం లక్ష్మీపురం పరిధి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. దీంతో నీటమునిగిన ఆయన మృతి చెందగా తల్లి సహా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, వారి కుటుంబ పరిస్థితి దృష్ట్యా మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు బీఆర్ఎస్ నాయకుడు పెంట్యాల పుల్లయ్య ఆటో సమకూర్చగా, స్థానికులు రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈమేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుబాబు తెలిపారు. బావిలో పడి గుర్తుతెలియని వ్యక్తి.. తిరుమలాయపాలెం: కొద్ది రోజులుగా మండలంలోని మేడిదపల్లి ప్రాంతంలో తిరుగుతున్న గుర్తుతెలియని వ్యక్తి(30) వ్యవసాయ బావిలో మృతదేహంగా తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మతిస్థిమితం లేని సదరు వ్యక్తి మేడిదపల్లిలో తిరుగుతూ ఎవరైనా భోజనం పెడితే తినేవాడు. ఈక్రమాన మేడిదపల్లి – మేకలతండా మార్గంలో వ్యవసాయ బావిలో ఆయన మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఈమేరకు పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 87126 59136, 87126 59137 నంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ కూచిపూడి జగదీష్ సూచించారు. రెండు మందుపాతరల గుర్తింపు చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం పోలీసు బలగాలు రెండు మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లా మూడి మార్గంలో కోబ్రా 205 బెటాలియన్ బలగాలు తనిఖీ చేస్తుండగా 1.5 కిలోల సామర్థ్యం కలిగిన రెండు బీరు బాటిల్ బాంబులను గుర్తించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాటిని అక్కడే నిర్వీర్యం చేశారు. -
ఏడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..
టేకులపల్లి: అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను శుక్రవారం టేకులపల్లి పోలీసులు పట్టుకున్నారు. టేకులపల్లి ఎస్ఐ అలకుంట రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. శంభునిగూడెం ముర్రేడు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న శంభునిగూడెం, సూర్యాతండా, కూనారం, చంద్రుతండా, మంగ్యతండాలకు చెందిన ఏడు ట్రాక్టర్లను సులానగర్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈమేరకు డ్రైవర్లు, యజమానులు గుగులోత్ సురేష్, గుగులోత్ సర్ధార్, బానోత్ హత్తిరామ్, బానోత్ రమేష్, గుగులోత్ శివ, గుగులోత్ గన్యా, గుగులోత్ పవన్కల్యాణ్, గుగులోత్ భద్రు, పాయం సర్వేష్, బోడ మంగ్య, కంగల రాము, ఇలాసాగర్ కృష్ణ, బానోత్ శంకర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇసుక ట్రాక్టర్, మట్టి లారీలు.. బూర్గంపాడు: మండల పరిధిలోని మోతె పట్టీనగర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి, ట్రాక్టర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు తప్పవని ఎస్ఐ రాజేశ్ హెచ్చరించారు. అలాగే మండల పరిధిలోని టేకులచెరువు గ్రామ సమీపాన సీతారామ ప్రాజెక్ట్ కాలువ మట్టిని రెండు టిప్పర్లలలో తరలిస్తుండగా.. శుక్రవారం ఉదయం ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టుకున్నారు. లారీలను పోలీస్స్టేషన్కు తరలించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 13 మందిపై కేసు నమోదు -
పంచాయతీ సిబ్బంది సస్పెన్షన్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీలో ఓ అధికారి సరైన విచారణ చేయకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్మెంట్ లేని లబ్ధిదారులను ఆన్లైన్లో నమోదు చేశాడని ఆధునిక సాంకేతిక విచారణలో తేలింది. దీంతో పూసా జగదీష్ను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం విధుల నుంచి తొలగించారు. ఎక్కడైనా ఇలాంటి పొరపాట్లలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సోదాలు భద్రాచలంఅర్బన్: భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల్లో శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్ ఆధ్వర్యాన పట్టణ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు బెల్ట్ షాపుల్లో నిల్వ ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఎకై ్సజ్ శాఖ సీఐ షేక్ రహీమున్నీసా బేగంకు అప్పగించారు. అనంతరం పట్టణంలోని మూడు లాడ్జీలలో ఏఎస్పీ విక్రాంత్, తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకముందు అంబేడ్కర్సెంటర్లో వాహనాలు తనిఖీ నిర్వహించి ట్రాఫిక్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా రమేష్మణుగూరు రూరల్: జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శిగా బీర రమేష్ను, మండల చైర్మన్గా భోగ వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి వాకపల్లి ప్రవీణ్బాబు నియమితులయ్యారు. శుక్రవారం మణుగూరులో నిర్వహించిన సమావేశంలో నియామక పత్రాలు అందజేశారు. జిల్లా చైర్మన్ ధూళిపూడి శివప్రసాద్, జిల్లా కార్యదర్శి లింగంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బైక్ను ఢీకొట్టిన వ్యాన్.. పాల్వంచరూరల్: ద్విచక్రవాహనాన్ని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామ పంచాయతీ ధర్మన్ననగర్ చెందిన మడవి మున్నా, అతడి మేనల్లుడు కోర్స సురేష్లు శుక్రవారం ద్విచక్రవాహనంపై పాల్వంచకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో జగన్నాధపురం గ్రామ శివారు తోగ్గూడెం రోడ్డులో పాల్వంచ వైపు వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్లున్న ఇద్దరికి తీవ్ర గాయలు కాగా 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియా, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మడవి నందా ఫిర్యాదు మేరకు చండ్రుగొండ మండలం రేపల్లేవాడకు చెందిన వ్యాన్ డ్రైవర్ ఇనుము నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలుడిని ఢీకొట్టిన ట్రాక్టర్.. జూలూరుపాడు: రోడ్డు దాటుతున్న ఓ బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో కాలు విరిగిన సంఘటన మండలంలోని భేతాళపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నాగమల్లిఖార్జున్, త్రివేణి దంపతుల మూడేళ్ల కుమారుడు సిద్దు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఊళ్లో రాత్రి పూట అక్రమంగా మట్టి తోలకాలు జరుపుతున్న ఓ ట్రాక్టర్ బాలుడిని ఢీకొట్టి కాలుపై నుంచి ట్రాక్టర్ ముందు టైర్ వెళ్లడంతో విరిగిపోయింది. ఈమేరకు సిద్దును కొత్తగూడెం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. చోరీపై కేసు నమోదు దమ్మపేట: దమ్మపేట గ్రామానికి చెందిన తాండ్ర నరసింహారావు రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి ఊరెళ్లి శుక్రవారం ఉదయం ఇంటికొచ్చాడు. ఈక్రమంలో ఇంటి తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించి లోపలికి వెల్లగా రూ.20 వేల విలువైన వెండి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించాడు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్రెడ్డి తెలిపారు. భూ వివాదంలో పలువురిపై.. అశ్వాపురం: మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో ఇటీవల భూ వివాదంలో అశ్వాపురం సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యాన గురువారం రాత్రి పలువురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో 190/1 సర్వే నంబర్లో ఎకరం 20 కుంటల భూమికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా భూమి గ్రామకంఠానిదని రెవెన్యూ అధికారులు కూడా సర్వే చేపట్టి మాకు ఇచ్చారని గ్రామస్తులు, తాతల కాలంగా మా కుటుంబానికి చెందిందని హరిప్రసాద్ కుటుంబసభ్యులకు గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యాన ఇటీవల హరిప్రసాద్ తన అనుచరులతో జేసీబీతో భూమి చుట్టూ ఫెన్షింగ్ వేసేందుకు రాగా రామచంద్రాపురం గ్రామస్తులకు, సారపాకకు చెందిన కొందరికి ఘర్షణ జరిగి దాడులు చేసుకున్నారు. గురువారం సామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఐటీసీ టీఎన్టీయూసీ నాయకుడు కనకమేడల హరిప్రసాద్తో పాటు ఐటీసీ ఉద్యోగులు, మరికొందరు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కంటైనర్, కారు ఢీ..
జూలూరుపాడు: కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటన తల్లాడ–కొత్తగూడెం ప్రధాన రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కంటైనర్, భద్రాచలం నుంచి ఖమ్మం వెళ్లే కారు జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డు సమీపంలోకి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రధాన రహదారిపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు కారణంగా కంటైనర్, కారు ఢీకొన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి ఘటనాస్థలానికి చేరుకుని తన పోలీస్ సిబ్బందితో పాటు కూలీలతో కలిసి గుంతలను పూడ్పించారు. -
7.63 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: ఏపీలోని చింతూరు నుంచి భద్రాచలం మీదుగా మధ్యప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.తిరుపతి కథనం ప్రకారం.. కూనవరం రోడ్డులోని ఇసుక రీచ్ వద్ద శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ ద్విచక్రవాహనాన్ని ఆపి తనిఖీ చేయగా 7.63 కిలోల ఎండు గంజాయి లభించింది. పట్టుబడిన వ్యక్తిని విచారించగా మధ్యప్రదేశ్కు చెందిన బ్రిజేష్ ఏపీలోని చింతూరులో గుర్తుతెలియని వ్యక్తి వద్ద గంజాయి కొని మధ్యప్రదేశ్లోని విదిశాకు బైక్పై తరలిస్తున్నట్లు చెప్పాడు. ఈమేరకు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక సెల్ఫోన్, ద్విచక్ర వాహనం, గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశామని, గంజాయి విలువ సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 10 లీటర్ల నాటుసారా.. బూర్గంపాడుకు చెందిన గుండె రాజేష్, రేపాకుల సంతోష్లు ద్విచక్ర వాహనంపై 10 లీటర్ల నాటుసారాను సారపాకకు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సిబ్బంది కరీం, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి పట్టివేత? అశ్వారావుపేట: ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతున్న నిషేధిత గంజాయిని అశ్వారావుపేట సరిహద్దు చెక్పోస్టు వద్ద నార్కోటిక్ పోలీసులు పట్టకున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఏపీ వైపు నుంచి ఖాళీగా వస్తున్న ఓ లారీలో టార్పాలిన్ పట్టా కింద సుమారు 400 కిలోల గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో దాడి చేయగా లారీ గంజాయితో సహా పట్టుబడినట్లు తెలిసింది. కాగా, ఇట్టి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి గంజాయితో పట్టుబడ్డాడు. సీఐ రమేష్ వెల్లడించిన వివరాలు.. మధిరకు చెందిన రాజకొండ దుర్గారావు కొన్నేళ్లుగా బొక్కలగడ్డ వెంకటేశ్వర్నగర్లో ఉంటూ చిరువ్యాపారం చేస్తున్నాడు. అయితే, త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈనేపథ్యాన పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ఐ రమేష్ ఆయనన తనిఖీ చేయడంతో రూ.20వేల విలువైన 450 గ్రాముల గంజాయి లభించింది. దీంతో నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. -
ఇష్టంతో సాగు చేస్తున్నాం..
దమ్మపేట గ్రామంలోని పేరంటాల చెరువు ఆయకట్టు కింద నాకున్న ఎకరం భూమిలో వరి సాగు చేసేవాన్ని. గతంలో అంతగా లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే దాదాపుగా నష్టపోయినట్లే. కానీ ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్తో ఖరీఫ్లో పెట్టిన పెట్టుబడి పోగా లాభం కూడా వచ్చింది. దీంతో యాసంగిలోనూ ఇష్టంతో వరి సాగు చేస్తున్నా. – నక్కా వెంకటేశ్వరరావు, రైతు, దమ్మపేట ● -
మామిడి మొక్కల పెకిలింపు
దమ్మపేట: వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించి, మామిడి మొక్కలను పెకిలించడంతోపాటు చంపుతామని బెదిరించిన వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన యర్రపాటి పకీర్రావు అఖినేపల్లిలోని తన వ్యవసాయ భూమి మామిడి మొక్కలు సాగు చేస్తున్నాడు. బుధవారం మందలపల్లి గ్రామానికి చెందిన వేమవరపు రామకృష్ణ, దండాబత్తుల కాంతారావులు పకీర్రావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించి, సాగులో ఉన్న మామిడి మొక్కలను పెకిలించారు. ప్రశ్నించిన పకీర్రావు కుమారుడు ఏకాంబరేశ్వరరావు, అతడి మిత్రుడు కోలికపోగు కాంతారావులను చంపుతామని కత్తితో బెదిరింపులకు పాల్పడ్డారు. పెకిలించిన మొక్కల విలువ రూ.10,000 ఉంటుందని బాధితులు తెలిపారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. ‘రాజీవ్ యువ వికాసం’పై ఆరాచండ్రుగొండ : రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులపై జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. రుణాల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తుల జాబితా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీఓ బయ్యారపు అశోక్ను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీల్లో 3200 మంది లబ్ధిదారులు ఉన్నారని, తొలి, మలి విడతల్లో బెండాలపాడు గ్రామానికి మంజూరైన 303 ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎంపీడీఓ వివరించారు. బాల్య వివాహం.. కేసు నమోదుపాల్వంచరూరల్: మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన 21 ఏళ్ల గండికోట రవీందర్ అదే గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను ఈ నెల 11న వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై చైల్డ్లైన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవీలత ఫిర్యాదు మేరకు రవీందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. సెల్ఫోన్లో గేమ్ ఆడి... రూ.68 వేలు పోగొట్టుకున్న యువకుడు పాల్వంచరూరల్: సెల్ ఫోన్లో గేమ్ ఆడి రూ. 68 వేలు పోగొట్టుకున్నాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన మాళోత్ రాణి కుమారుడు వంశీ ఈ నెల 14న సెల్ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాడు. అదే సమయంలో రూ.పదివేలు పెట్టి ఆడితే రెట్టింపు డబ్బులు గెలవవచ్చని అపరిచిత వ్యక్తి నుంచి లింక్ వచ్చింది. దీంతో యువకుడు లింక్ ఓపెన్చేసి గేమ్ ఆడగా, రూ.68 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులపై ఫిర్యాదుచుంచుపల్లి: మండల పరిధిలో మైక్రో ఫైనాన్స్ యజమానులు పలువురు మహిళలను రుణాల విషయంలో వేధిస్తున్నారని గురువారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవి కుమార్కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. లారీ ఢీకొని మహిళకు గాయాలు దమ్మపేట: బైక్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని వెంకటరాజాపురం సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన నడ్డి రాజు, అల్లంశెట్టి కృష్ణారావు, తంగిరాల శ్రీలత(35)లు బుధవారం రాత్రి సమయంలో బైక్పై అశ్వారావుపేట నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరాజాపురం గ్రామ సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ బైక్ను ఢీకొట్టింది. దీంతో శ్రీలతకు తీవ్రగాయాలయ్యాయి. ఖమ్మం తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రురాలి భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలో చోరీజూలూరుపాడు: మండల కేంద్రంలోని కోయకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చేసరికి పాఠశాల తలుపులు, లోపల ఇనుప బీరువా పగులగొట్టి మైక్ స్పీకర్, క్రీడా సామగ్రి అపహరించారని హెచ్ఎం జర్పల కృష్ణ తెలిపారు. దీంతో ఎంఈఓ బానోత్ జుంకీలాల్, కాంప్లెక్స్ హెచ్ఎం లక్ష్మీనర్సయ్యలకు, పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారని, అనంతరం తాను స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎం తెలిపారు. -
ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం
ఖమ్మం మయూరిసెంటర్/పాల్వంచ/చింతకాని: అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎంఎస్) జాతీయ సమితిలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో గురువారం ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే, భద్రాద్రి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్లో సభ్యులుగా స్థానం దక్కింది. నేలకొండపల్లి మండలం ముటాపురానికి చెందని హేమంతరావు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేయడంతో ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, గోవిందరావు 1991లో సీపీఐలో కొనసాగుతుండగా వివిధ హోదాల్లో పనిచేయడమే కాక రాఘవాపురం సర్పంచ్గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈమేరకు వీరిని పలువురు అభినందించారు -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
పాల్వంచ: ప్రస్తుత వేసవిలో కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కేటీపీఎస్ 5,6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు అన్నారు. 81వ జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా కేటీపీఎస్ 5,6 దశల ఫైర్, సేఫ్టీ విభాగాల ఆధ్వర్యంలో గురువారం అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్మాగారంలో సిబ్బంది రక్షణ పరికరాలు ధరించాలన్నారు. ఎస్ఈలు జీవి.ధర్మారావు, టి.సత్యనారాయణ, ఎస్.సునీల్, ఇతర అధికారులు సతీష్, చంద్రశేఖర్, డి.కిరణ్, భాగం రాంప్రసాద్, వై.శ్రీనివాస్, సమ్మయ్య, నాగయ్య, శేషసాయి, మహేశ్వరరావు, నాగరాజు, రజిత, సిబ్బంది పాల్గొన్నారు. -
బీటీపీఎస్లో సిబ్బంది కొరత
● ఇటీవల మరో 49 మంది కార్మికుల బదిలీ ● రెండు, మూడు పని ప్రదేశాల్లో ఒక్కరికే బాధ్యతలు ● సబ్ ఇంజనీర్లు, కార్మికులపై పెరుగుతున్న పనిభారం మణుగూరు రూరల్: బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్)లో సిబ్బంది కొరత వెంటాడుతోంది. జెన్ కో యాజమాన్యం సిబ్బంది నియామకాలపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా ఉన్న ఉద్యోగులపై తీవ్ర పనిభారం పెరుగుతోంది. బీటీపీఎస్లోని నాలుగు యూనిట్లలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. కోల్ ప్లాంట్, యాష్ప్లాంట్, ఈఎస్పీ (ఎలక్రో స్టార్టర్ పెసిఫికేటర్) వంటి ప్రదేశాలు కీలకంగా ఉంటాయి. అలాంటి పని ప్రదేశాల్లోనూ రెండు నుంచి మూడు ప్రదేశాలను ఒక్కరే పర్యవేక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. సబ్ ఇంజనీర్లు పర్యవేక్షించాల్సిన పనులు కూడా పనిఒత్తిడితో కిందిస్థాయి కార్మికులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్లో సుమారు 1200 నుంచి 1500మంది ఉద్యోగులు అవసరం ఉండగా, ప్రస్తుతం వెయ్యి మంది మాత్రమే పనిచేస్తున్నారు. తాజాగా మరో 49 మంది బదిలీలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పనిభారమైనా విధులు నిర్వహించాలని హుకుం జారీ చేయడం, చిన్న తప్పిదాలకే బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేస్తుండటంపై ఇటీవల ప్లాంట్లో పర్యటించిన సీఎండీకి పలు యూనియన్ల నాయకులు విన్నవించారు. నియామకాలు చేపట్టకుండా.. నిబంధనల ప్రకారం ఒక్కో పని ప్రదేశంలో కనీసం ఇద్దరు పనిచేయాల్సి ఉంటుంది. ఒకరు అనారోగ్యానికి గురైనా, లేక అవగాహన, అనుభవ లేమి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నా, ఔట్ సోర్సింగ్ ఉపాధి అవకాశాలు పెంచే పరిస్థితులు ఉన్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే క్రమంలోనే సిబ్బంది నియామకాలు చేపట్టకుండా, ఉద్యోగులపై పనిభారం పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా నియామకాలు చేపట్టి ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించాలని పలువురు కోరుతున్నారు. సమస్యలు లేకుండా చూస్తున్నాం ప్లాంట్లో కొంత సిబ్బంది కొరత ఉన్న మాట నిజమే. డిప్యూటేషన్పై వచ్చిన 49 మంది తిరిగి వారి స్థానాలకు వెళ్లారు. సిబ్బంది కొరతతో ఏర్పడుతున్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య ఏర్పడకుండా ఉన్నవారితోనే పనులు చేయిస్తున్నాం. త్వరలో నియమాకాలు చేపట్టే అవకాశం ఉంది. –బిచ్చన్న, సీఈ -
‘కొర్రమేను’ పెంపకంపై దృష్టి సారించాలి
● 5వ తేదీకి యూనిఫాం కుట్టు పనులు పూర్తి చేయాలి ● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అశ్వాపురం/ పాల్వంచరూరల్: కొర్రమేను చేపల పెంపకంపై రైతులు, మహిళలు దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. మండల పరిధిలోని మిట్టగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ కొర్సా దుర్గారావు కొర్రమేను చేపల పెంపకం చేపడుతుండగా గురువారం అదనపు కలెక్టర్ సందర్శించారు. చేపల పెంపకానికి ఉపాధి హామీ పథకంలో ఉచితంగా నిర్మిస్తున్న ఫామ్పాండ్ను పరిశీలించారు. మల్లెలమడుగు, పాల్వంచ మండలం నాగారం, కేశవాపురం గ్రామాల్లోని కుట్టుమిషన్ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొర్రమేను చేపల పెంపకం అశ్వాపురం మండలం మిట్టగూడెంలో జిల్లాలోనే ఆదర్శవంతంగా ఉందన్నారు. మే 5వ తేదీ నాటికి విద్యార్థుల యూనిఫాం ఒక జత చొప్పున కుట్టి అందజేయాలని నిర్వాహకులకు సూచించారు. పిల్లల వ్యక్తిగత కొలతలను, రిజిస్టర్లో నమోదు చేసుకుని వాటి ఆధారంగా స్టిచింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎస్కె.సైదులు, డీపీఎం జ్యోతి, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ ముత్యాలరావు, ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఏపీఎంలు రాంబాబు, ఏపీఎం సత్యనారాయణ, నాగార్జున, సీతరామయ్య, వెంకటేష్, మల్లేశం పాల్గొన్నారు. -
ఎండల్లో బండ్లు జాగ్రత్త
కొత్తగూడెంటౌన్: ఎండలు భగభగ మండిపోతున్నాయి. బయటకు వెళ్తే ఎండవేడిమితో అవస్థ పడాల్సి వస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు మనతోపాటు వాహనాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలను ఎండలో పార్కింగ్ చేస్తే ట్యాంకులు, టైర్లు పేలే అవకాశం లేకపోలేదు. ఎండలో ప్రయాణించేటప్పుడు పెట్రోల్, డీజిల్ లీకై ఏ చిన్న నిప్పు రవ్వపడ్డా పెనుప్రమాదం సంభవిస్తుంది. ఎండల నుంచి మనం ఎలా రక్షణ చర్యలు తీసుకుంటున్నామో వాహనాలకూ అదే రీతిలో రక్షణ చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు, నిపుణులైన మెకానిక్లు సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలపై దూర ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే కొత్తగూడెం ఫైర్ ఆఫీస్ 87126 99296, ఇల్లెందు ఫైర్ ఆఫీస్ 87126 99295 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు ఇవి పాటించాలి ● ద్విచక్రవాహనాలను క చ్చితంగా నీడలోనే పార్కింగ్ చేయాలి.టైర్లలో గాలిని తగ్గించుకోవాలి. ● వాహనాలను గంటల తరబడి ఎండలో ఉంచితే రంగు కోల్పోతాయి. మళ్లీ రంగులు వేయించాలంటే దాదాపు రూ.6 నుండి 10 వేల వరకు ఖర్చు అవుతుంది. ● ఎండలో ఎక్కువ సేపు నిలిపి ఉంచితే వాహనాల ట్యాంకుల్లోని పెట్రోల్ ఆవిరి అవుతుంది. ● ఫుల్ ట్యాంకు పెట్రోల్ కొట్టిస్తే ఎండలకు ట్యాంకులు పేలే అవకాశం ఉంటుంది. ● రాత్రి వేళల్లో పెట్రోల్ ట్యాంకు మూతను ఓ సారి తెరిచి మూసివేస్తే అది సెట్ అవుతుంది. కార్లు, లారీల యజమానులు.. ● కార్లు, లారీలు, ఆటోలు వంటి వాహనాల్లో దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ● వాహనాలను ఎండలో ఉంచితే ట్యాంకులో 40 నుంచి 80 శాతం ఇంధనం ఆవిరి అవుతుంది. ● వాహనాల రేడియేటర్లలో తగినన్ని నీళ్లు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఎండలకు ఇంజన్లు తరుచుగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఎండ వేడికి ఇంజన్ అయిల్ తగ్గిపోతుంది. ● పెట్రోల్, డీజీల్, గ్యాస్ వాహనాలు నడిపే వారు వీలైనంత వరకు వేసవిలో గ్యాస్ కిట్ను వినియోగించుకుండా చూసుకోవాలి. కార్లలో ఏసీ వినియోగిస్తే అద్దాలకు మ్యాట్స్ను బిగించుకోవాలి. ● ఎల్పీజీ వాహనాలను వేసవిలో ఉపయోగించకపోవడమే మేలు. ● ప్రభుత్వ అనుమతి ఉన్న గ్యాస్ కిట్లను మాత్రమే ఉపయోగించాలి. నాసిరకానివి వినియోగిస్తే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● ప్రస్తుతం ఉదయం 8, 9 గంటలు దాటితే ఎండ తీవ్రత ఉంటోంది. వాహనదారులు ఎండలో ప్రయాణాలను చేయకూడదు. ● ప్రస్తుతం ఎలక్ట్రిక్ బైకులు, కార్ల వినియోగం కూడా పెరుగుతోంది. వేసవిలో ఈవీలతో యజమానులు చాలా జాగ్రత్తలు పాటించాలి. చార్జీంగ్ పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టకూడదు. అప్రమత్తంగా ఉండాలి ఎండకాలంలో ప్రతీ వాహనదారుడు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను ఎండలో కాకుండా నీడలో పార్కింగ్ చేయాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల్లో టైర్లలో గాలి తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రీ బటన్ టైర్లను ఉపయోగించకూడదు. అదే విధంగా పెట్రోల్, డీజిల్ను ట్యాంక్ ఫుల్ చేయించొద్దు. బైక్లపై ఎండల్లో దూర ప్రయాణాలు చేయొద్దు. – వి.వెంకటరమణ, ఇన్చార్జ్ ఆర్టీఓ వాహనదారులు నీడలోనే పార్కింగ్ చేయాలి ట్యాంక్ నిండా పెట్రోల్ నింపినా డేంజరే.. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే దూర ప్రయాణం చేయొద్దు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు -
వర్గీకరణతోనే ఆదివాసీలకు న్యాయం
ఇల్లెందు: ఎస్టీ వర్గీకరణతోనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ సంఘాల జేఏసీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే చందాలింగయ్య దొర అన్నారు. గురువారం ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ నియమించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిందని, అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కమిషన్ చట్టం చేసి జీఓ విడుదల చేసినందున ఎస్టీల్లో వర్గీకరణ ఆశలు రేకెత్తాయన్నారు. ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తే అందులో 600 పోస్టులు ఎస్టీలకు వచ్చాయని, వాటిలో ఆదివాసీలకు 93 ఉద్యోగాలే వచ్చాయని పేర్కొన్నారు. మిగిలిన 507 పోస్టులను లంబాడీలు, ఇతర ఎస్టీలు పొందారని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ ఇతర సోదర ఆదివాసీ సంఘాల వారు పోరాటం కంటే ఇతరుల మీద ద్రుష్పచారం చేసేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొన్నారు. వారు తమ వైఖరి మార్చుకుని ఎస్టీ వర్గీకరణ పోరాటంలో కలిసి రావాలని కోరారు. తొలుత ఫారెస్టు గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. సభలో తుడుందెబ్బ కళాకారులు గీతాలు ఆలపించారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, నాయకులు వట్టం నారాయణ, పొడుగు శ్రీనాథ్, యాసం రాజు, రేగ నరేందర్కుమార్, కబ్బాక శ్రావణ్కుమార్, మైపతి వీణారాణి, కోరం శేషయ్య, గంట సత్యం, గుంపిడి వెంకటేశ్వర్లు, బూర్క యాదగిరి, వట్టం కన్నయ్య పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర -
ఆదివాసీలకు మౌలిక వసతులు కల్పిస్తాం
చర్ల: సరిహద్దు ప్రాంతాల ఆదివాసీలకు విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌళిక వసతుల కల్పిస్తామని ఎస్పీ రోహిత్రాజు భరోసా ఇచ్చారు. మండలంలోని మారుమూల గ్రామం పూసుగుప్ప నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు వరకు ఇటీవల నిర్మించిన బీటీ రోడ్డును గురువారం ఆయన సందర్శించారు. చర్ల నుంచి 18 కిలోమీటర్ల దూరంలోని పూసుగుప్ప వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణించిన ఎస్పీ.. మధ్యలో నిర్మిస్తున్న వంతెనలు, లోలెవల్ చప్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా రాంపురం, బీమారంపాడు, పూజారికాంకేర్, చిన్న ఊట్లపల్లి, పెద్ద ఊట్లపల్లి తదితర గ్రామాల ఆదివాసీల కోసం రూ.3కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మించామని తెలిపారు. ఆదివాసీలను అభివృద్ధికి దూరం చేయాలని మావోయిస్టులు చూస్తున్నారని, వారి ఆటలు చెల్లవని అన్నారు. గిరిజనులకు విద్య, వైద్యం, రవాణా సౌకర్యాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ పని చేస్తున్నాయని వివరించారు. పూసుగుప్ప, చెన్నాపురం గ్రామాల్లో త్వరలోన మొబైల్ ఆస్పత్రులను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు 220 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్కుమార్, చర్ల సీఐ రాజువర్మ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు ఆర్.నర్సిరెడ్డి, పి.కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రోహిత్రాజు భరోసా -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి
పాల్వంచరూరల్ : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వి.చంద్రమౌళి అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని ఎర్రబోరు, బండ్రుగొండ, కొయ్యగుంపు తదితర గొత్తికోయల ఆవాసాలను గురువారం ఆయన పరిశీలించారు. తాగునీటి సౌకర్యాలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. చేతిపంపులు నిరంతరం పనిచేసేలా చూడాలని, సోలార్ మోట్లార్లను వెంటనే మరమ్మతు చేయాలని మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కోయగట్టు అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు సక్రమంగా పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని పిల్లలంతా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామానికి రహదారి, విద్యుత్ సౌకర్యం లేదని, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో పిల్లలు మధ్యలోనే బడి మానేస్తున్నారని స్థానిక గిరిజనులు డీపీఓ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఎంపీఓ బొగ్గ నారాయణ, ఏఈ మహేశ్వరి, కార్యదర్శులు ప్రవీణ్, నారాయణ, దుర్గారావు పాల్గొన్నారు.డీపీఓ చంద్రమౌళి -
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
గుండాల: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, అన్ని రికార్డులు సక్రమంగా ఉన్న హక్కుదారులు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భూ భారతి చట్టంపై గురువారం ఆళ్లపల్లి, గుండాల మండల కేంద్రాల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, సకాలంలో విచారణ చేస్తామని, అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అన్నదమ్ముల భూ పంపకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుందన్నారు. హక్కుల రికార్డుల్లో ఏమైనా తప్పులుంటే ఈ చట్టంతో సవరణ చేసుకునే అవకాశం ఉందన్నారు. కొన్నేళ్లుగా పెండింగ్ ఉన్న సాదాబైనామా దరఖాస్తులూ ఇప్పుడు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఇంటి స్థలాలకు, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఉంటుందని, రైతులు ఎలాంటి రుసుం చెల్లించకుండా ఉచిత న్యాయ సహాయం అందుతుందని చెప్పారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేసే అధికారం ఈ చట్టంలో ఉందని వివరించారు. సదస్సులో ఆర్డీఓ మధు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్ ఇమ్మానియేల్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఏంపీఓ శ్యాంసుందర్ రెడ్డి, ఏఓ వెంకటరమణ, ఎస్సై రాజమౌళి పాల్గొన్నారు. మునగసాగుతో అధిక లాభాలు.. ఆయిల్ పామ్, మునగసాగుతో అధిక లాభాలు పొందొచ్చని కలెక్టర్ పాటిల్ అన్నారు. ఆళ్లపల్లి మండలంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్పామ్, మునగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల ఆయిల్పామ్ సాగు పెరిగిందని, నీరు పుష్కలంగా అందిస్తూ మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని అన్నారు. పొలం గట్లపై, అంతర పంటగా మునగ సాగు చేసుకోవాలని సూచించారు. ఇది తక్కువ కాలంలో వచ్చే పంట అన్నారు. అనంతరం గుండాల మండలం యాపలగడ్డలో సమక్క–పగిడిద్దరాజు దేవతలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడి -
ధీమా ఇవ్వని బీమా
● ఆరేళ్లుగా అడ్రస్ లేని పశువుల బీమా పథకం ● పాడి రైతులకు కరువైన భరోసా ● పునరుద్ధరించాలని వేడుకోలు బూర్గంపాడు: పశువుల బీమా పథకం పత్తా లేకుండా పోయింది. కంటికి రెప్పలా కాపాడుకునే పశువులకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా వర్తించే పరిస్థితి లేదు. గతంలో పశువుల బీమాను ప్రోత్సహించిన ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్లక్ష్యం చేస్తున్నాయి. దీంతో పశువులను పోషించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఊతమిచ్చాయి. రైతులు కొంత సొమ్ము చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. ప్రమాదవశాత్తు పశువులు మృతిచెందితే యజమానులకు బీమా సొమ్ము అందడం ద్వారా ఆర్థిక భరోసా దక్కేది. భారీగా పెరిగిన ధరలు.. పశు పోషణ రోజురోజుకూ కష్టంగా మారుతోంది. పశు సంపద తగ్గిపోతున్న తరుణంలో ఆవులు, గేదెల ధరలు నింగినంటుతున్నాయి. మేలు రకం జాతి పశువుల ధర రూ. లక్షల్లో ఉంటుండగా.. మాంసానికి డిమాండ్ ఉండడంతో మేకలు, గొర్రెల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పశువులు, జీవాలకు బీమా చేయించేందుకు రైతులు ఆరాట పడుతున్నారు. అవి మేతకు వెళ్లినప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే యజమానులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. జిల్లాలో ప్రతీ సంవత్సరం విద్యుదాఘాతం, పిడుగుపాట్లతో వందల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. రోడ్లపై గుర్తు తెలియని వాహనాలు ఢీకొని కూడా పశువులు మృతి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశువుల బీమా అమలు చేయాలని రైతులు, యజమానులు కోరుతున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు మేలు జాతి పశువులకు బీమా చేస్తున్నా.. ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్న, సన్నకారు రైతులు బీమా చేయించలేకపోతున్నారు. ప్రభుత్వం కొంత, రైతులు కొంత చెల్లించే అవకాశం ఉంటే ఎక్కువ మంది బీమా చేయించేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అటకెక్కిన పథకం.. 2017 – 18 వరకు పశువుల బీమా పథకం పూర్తిస్థాయిలో కాకున్నా అక్కడక్కడా అమలయ్యేది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించాయి. దీంతో ఈ పథకం అటకెక్కింది. పశువులు మృతి చెందితే రూ.లక్షల్లో నష్టపోతున్నామని, ఇకనైనా పాలకులు స్పందించి పశువుల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. బీమా అమలు చేయాలి పశువుల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. ప్రైవేటుగా బీమా చేయాలంటే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. బీమా చేయకుంటే ఏదైనా ప్రమాదం జరిగి పశువులు చనిపోతే ఒక్క రూపాయి కూడా చేతికి రావడం లేదు. – నిమ్మల రాములు, రైతు, నాగినేనిప్రోలుప్రభుత్వానికి నివేదిస్తున్నాం పశువుల బీమా పథకం అమలు చేయాలంటూ చాలా మంది రైతులు అడుగుతున్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా కోసం కొంత బడ్జెట్ను ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించేవి. గత ఆరేళ్లుగా బీమా పథకం పూర్తిగా నిలిచిపోయింది. రైతుల వినతులను ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. – డాక్టర్ పురంధర్, జిల్లా పశు సంవర్థకశాఖ అధికారిజిల్లాలో పశు సంపద వివరాలిలాఆవులు, ఎద్దులు : 2,00,844గేదెలు : 1,25,587గొర్రెలు : 1,55,406మేకలు : 2,00,462పందులు: 1,964 మొత్తం :6,84,263 -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణం వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించాక మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ పాల్గొన్నారు పవర్ లిఫ్టింగ్లో బీటీపీఎస్ ఉద్యోగి ప్రతిభమణుగూరురూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బీటీపీఎస్ ఉద్యోగి పి.రాజేష్ 110 కేజీల బెంచ్ ప్రెస్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయనను బీటీపీఎస్ సీఈ బిచ్చన్న గురువారం అభినందించారు. అనంతరం సీఈ మాట్లాడుతూ.. భవిష్యత్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని, సంస్థకు పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. క్రీడలు, క్రీడాకారులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో క్రీడా కార్యదర్శి కల్తీ నర్సింహరావు, డీఈ టెక్ సత్యనారాయణ, ఏడీఈ మూర్తి, సంతోష్రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగుల గైర్హాజరును నివారించాలిసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి ఉద్యోగులు, కార్మికుల గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలని పర్సనల్ జీఎం (ఐఆర్పీఎం అండ్ వెల్ఫేర్) కవితానాయుడు అన్నారు. కొత్తగూడెం రీజియన్ పరిధిలోని ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులతో స్థానిక సింగరేణి ప్రధాన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియాల వారీగా విధులకు గైర్హాజరవుతున్న వారిపై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగుల పదోన్నతులు, కారుణ్య నియామకాలు, రిటైర్డ్ ఉద్యోగుల సీఎంపీఎఫ్, పెన్షన్, క్లెయిమ్, గ్రాట్యుటీ వంటి అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం కవితానాయుడు మాట్లాడుతూ.. తరచుగా గైర్హాజరయ్యే ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులతో కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఫైళ్లు కూడా పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. సమావేశంలో డీజీఎంలు అజయ్కుమార్, రాజేంద్రప్రసాద్, ఎస్.రమేష్, ఎస్.వరప్రసాద్, వెంకటేశ్వరరావు, జి.వి. మోహన్రావు, వైవీఎల్ ప్రసాదరావు, రాజ్గోపాల్, ముకుంద సత్యనారాయణ, సీవీవీఎస్ మూర్తి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
హామీపై గప్చుప్!
● ఇల్లెందుకు సీతారామ నీరందించాలనికోరుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి ● గత నెల 18న రేవంత్రెడ్డిని కలిసి విన్నవించిన నర్సయ్య ● వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం ఆదేశం ● నేటికి నెల రోజులైనా పురోగతి శూన్యం సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ నీళ్లు ఇచ్చే విషయంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడిచినా ఈ అంశంపై పురోగతి లేదు. సీఎంకు గుమ్మడి వినతి.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా గత నెల 18న సీఎం రేవంత్రెడ్డిని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కలిసి, ఇల్లెందు నియోజకవర్గానికి సీతారామ ద్వారా గోదావరి నీరు అందించాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ.. ఇల్లెందుపై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశానికి సంబంధిత అధికారులు, మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలను ఆహ్వానించాలని సూచించారు. గతంలో ఏం జరిగింది.. ఇప్పుడేం జరుగుతోంది.. ఎలా చేస్తే ఇల్లెందు ప్రజలకు మేలు అనే అంశాలపై చర్చించి న్యాయం చేయాలని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందిస్తూ త్వరలోనే ఇల్లెందు సమస్యపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇల్లెందుకు అదనపు ప్రణాళిక.. సీతారామ ప్రాజెక్టులో ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి అదనపు ప్రణాళికను 2023 వేసవిలో జలవనరుల శాఖ సిద్ధం చేసింది. దీని ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిఽధిలో కొత్తగా 1,13,287 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ అంచనా వ్యయం రూ. 3,200 కోట్లు. ఇందులో కొత్త పంపుహౌస్లు నిర్మించడంతో పాటు బయ్యారం చెరువు మత్తడిని 16 అడుగుల నుంచి 19 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. తద్వారా మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల్లోని పొలాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారు. పునాది పడింది ఇక్కడే.. సీతారామ ప్రాజెక్టుకు 2016లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తొలి ప్లాన్లో ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలకు గోదావరి జలాలు పారించాలని నిర్ణయించారు. అయితే గోదావరి నుంచి రోళ్లపాడు వరకు నీటిని తరలించే కెనాల్ మార్గంలో కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాక్లు ఉండడంతో అనుమతుల సాధన సాధ్యం కాదంటూ ఈ ప్లాన్లో మార్పులు చేశారు. ఇలా సీతారామ ద్వారా లబ్ధి పొందే నియోజకవర్గాల జాబితా నుంచి ఇల్లెందు (కామేపల్లి మండలం మినహా) కనుమరుగైంది. దీంతో సీతారామతో ఇల్లెందు నియోజకవర్గానికి న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా జిల్లాతో పాటు గార్ల, బయ్యారం మండలాల ప్రజలు పోరాటం చేస్తున్నారు. పిలుపు కోసం ఎదురుచూస్తున్నా ఇల్లెందుకు గోదావరి నీళ్లు ఇచ్చే అంశంపై నీటి పారుదల శాఖ అధికారులు నిర్వహించే సమావేశానికి పిలుపు ఎప్పుడొస్తుందా అని ప్రతీరోజు ఎదురుచూస్తున్నా. ప్రాజెక్టుకు సంబంఽధించి మీడియాలో వస్తున్న ప్రతీ విషయాన్ని ఆసక్తిగా తెలుసుకుంటున్నా. ఇల్లెందుకు న్యాయం జరగాలన్నదే నా లక్ష్యం. – గుమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నెలయినా కదలిక లేదు.. సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చి నేటికి నెల రోజులైనా ఎలాంటి పురోగతి లేదు. ఈ అంశంపై గుమ్మడి నర్సయ్యకు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు, అఖిల పక్ష నేతలకు కానీ ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు సమావేశం నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీతారామ ప్రాజెక్టు డీపీఆర్కు ఇంకా సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) అనుమతులు రాలేదు. ఈ అంశంపై కేంద్ర జల సంఘం ఈనెల 24న ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. అప్పటివరకై నా ఇల్లెందు ప్లాన్పై చర్చించి సీతారామ డీపీఆర్లో చేర్చాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలి
పినపాక: ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, అడ్మిషన్ల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరా చారి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండల పరిధిలోని ఈ బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందజస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెనూ సక్రమంగా పాటించాలని, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగరాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. తొలివిడత పాఠ్య పుస్తకాలు చేరాయి.. కొత్తగూడెంఅర్బన్: 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడతగా జిల్లాకు 39,150 పాఠ్య పుస్తకాలు వచ్చాయని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న పాఠ్య పుస్తకాలను ఆయన పరిశీలించారు. వచ్చ విద్యా సంవత్సరంలో 5,08,400 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా, తొలి విడతగా 39,150 పుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలన్నీ వస్తాయని, ఆ వెంటనే మండలాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. అభ్యసన స్థాయిని గుర్తించాలికరకగూడెం: విద్యార్థుల అభ్యసన స్థాయిని గుర్తించాలని డీఈఓ వెంకటేశ్వరాచారి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని భట్టుపల్లి, కరకగూడెం ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. బోధనా తీరును మెరుగుపర్చుకోవాలని, నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. అనంతరం మండల వనరుల కేంద్రంలో జరుగుతున్న నవోదయ పాఠశాల తాత్కాలిక మరమ్మతు పనులను పరిశీలించారు. ఆయన వెంట ఏఎంఓ నాగరాజశేఖర్, ఎంఈఓ గడ్డం మంజుల, భట్టుపల్లి పాఠశాల హెచ్ఎం మోహన్బాబు తదితరులు ఉన్నారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టండి
డీఎఫ్ఓ కిష్టాగౌడ్జూలూరుపాడు: మొక్కల సంరక్షణపై అటవీ శాఖ సిబ్బంది దృష్టి పెట్టాలని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని అనంతారం నుంచి నల్లబండబోడు వరకు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు వినోభానగర్ అటవీ నర్సరీలో మొక్కలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కల పెరుగుదల, రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలన్నారు. అడవిలో చెట్లు నరకకుండా నిఘా పెంచాలని, వేసవి దృష్ట్యా అడవి జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి వసతి కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్రావు, గుండెపుడి డీఆర్ఓ ఎస్కే నసూర్బీ, ఎఫ్బీఓలు రేఖ, డి.కిషన్, సలీమ్, శరణ్ పాల్గొన్నారు. -
మ్యూజియం అభివృద్ధికి సహకరించాలి
భద్రాచలంటౌన్: ఐటీడీఏ ఆవరణలో నిర్మించిన గిరిజన మ్యూజియంపై భక్తులు, పర్యాటకులకు అవగాహన కల్పించాలని, మ్యూజియం అభివృద్ధికి అందరూ సహకరించాలని పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక గిరిజన భవనంలో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకులు పర్ణశాల, పాపికొండల సందర్శనకు మొగ్గు చూపుతారని, అంతకంటే ముందు గిరిజన మ్యూజియాన్ని చూసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. పాత తరం కళాఖండాలతో పాటు వ్యవసాయ పద్ధతులు, గిరిజన వంటకాలు, పాతకాలపు ఇళ్లు, వెదురు బొమ్మలను మ్యూజియంలో ఏర్పాటు చేశామని వివరించారు. మ్యూజియం సందర్శనకు వచ్చే పర్యాటకుల నుంచి అధిక చార్జీలు తీసుకోవద్దని చెప్పారు. అనంతరం మ్యూజియానికి సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
దమ్మపేట: అప్పులు ఇచ్చిన వ్యక్తుల నుంచి వచ్చే వేధింపులు తాళలేక, పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని మందలపల్లి గ్రామానికి చెందిన మడిపల్లి శ్రీనివాసరావు(48) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం మందలపల్లి, రంగువారిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తుల వద్ద అప్పులు తీసుకున్నాడు. కాగా అప్పు తిరిగి చెల్లించాలని అప్పిచ్చిన వ్యక్తులు వేఽధింపులకు గురిచేశారు. దీంతో శ్రీనివాసరావు మనోవేదన చెంది బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
మూడు రోజుల వ్యవధిలో దంపతులు మృతి
తిరుమలాయపాలెం: మూడు రోజుల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందడాన్ని తట్టుకోలేక భార్య కూడా గుండెపోటుతోనే మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలోని ఏలువారిగూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దిండు ఉపేందర్ గత సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆవేదనతో ఉన్న ఆయన భార్య పద్మ (50)ను తిరుమలాయపాలెంకు చెందిన అన్న తురక వెంకన్న తమ ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఉపేందర్ చిన్న కర్మ చేయాల్సి ఉండడంతో బుధవారం ఏలువారిగూడెం వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలోనే కాక గ్రామంలో విషాదాన్ని నింపింది. -
ప్రజాహక్కుల రక్షణ కమ్యూనిస్టుల బాధ్యత
● సీపీఎం 24వ మహాసభల తీర్మానాల ఆధారంగా పోరాటాలు ● యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభలో పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు ఖమ్మంమయూరిసెంటర్: ప్రజాహక్కుల పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా భావిస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు తెలిపారు. ఇందులో భాగంగానే ఇటీవల మధురైలో జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్లు దేశంలోని పౌరులందరి హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ తీర్మానాల అమలుకు ఉద్యమాలు నిర్వహించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మధురైలో సభలకు హాజరై గుండెపోటుతో మృతి చెందిన ఖమ్మంకు చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభ ఖమ్మంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తే కార్మికులు సంక్షేమ ఫలాలు కోల్పోనున్నందున వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. అలాగే, నూతన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. కాగా, హక్కుల సాధనకు ఉద్యమిస్తూ, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడమే శ్రీకాంత్కు నిజమైన నివాళి అని తెలిపారు. కష్టాలొస్తే గుర్తొచ్చేది కమ్యూనిస్టులే.. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టులు అండగా నిలుస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోతే సంగతి చూస్తామని సీఎంను హెచ్చరించడం.. అలాంటి వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే పార్టీ శ్రేణులు గీత దాటే పరిస్థితులు వచ్చినట్టేనని చెప్పారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో ప్రజా మన్ననలు పొందిన శ్రీకాంత్ దూరం కావడం నష్టదాయకమని తెలిపారు. ఈ సభలో సీపీఎం ఏపీ, తెలంగాణ, ఉమ్మడి జిల్లా నాయకులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్రావు, సీహెచ్.బాబూరావు, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, వై.విక్రమ్, యర్రా శ్రీకాంత్ సతీమణి సుకన్య, కుటుంబీకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు దండి సురేష్, యర్రా బాబు, రామాంజనేయులు, పునుకొల్లు నీరజ, డాక్టర్ యలమందలి రవీంద్రనాథ్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, చిన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్లకు పాల్పడే వారిపై నిఘా
కొత్తగూడెంటౌన్: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బుధవారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత నేరస్తులపైనా దృష్టి సారించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారిపై చర్య తీసుకోవాలని అఽధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా పని చేయాలని, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నేరస్తులకు శిక్షపడేలా పని చేయాలన్నారు. పెట్రోల్ బ్లూకోల్డ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, డయల్ 100 కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అన్నారు. జిల్లా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం గత నెలలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్కుమార్ సింగ్, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజురెడ్డి, సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు వెల్లడి -
మందు.. ‘ఫుల్’ ఆదాయం
● 2023–24తో పోలిస్తే 24–25లో పెరిగిన అమ్మకాలు ● 2024 మే నెలలో రూ.237 కోట్ల మద్యం అమ్మకాలతో రికార్డు ● మొత్తంగా ఆర్థిక సంవత్సరంలో రూ.2,294 కోట్ల సేల్స్ వైరా: మద్యం అమ్మకాలు ఏటేటా పెరుగుతుండగా.. ప్రభుత్వానికి అంతే మొత్తంలో ఆదాయమూ పెరుగుతోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో వైరాలోని ఐఎంఎల్ డిపో ద్వారా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైన్స్, బార్లకు రూ.2,294 కోట్ల విలువైన మద్యం సరఫరా కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో 210 వైన్స్, మూడు క్లబ్లు, 50 బార్లు ఉన్నాయి. కాగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,281 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, 2024–25కు వచ్చేసరికి అమ్మకాలు మరింత పెరిగాయి. సహజంగా ఏటా వేసవిలో బీర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇందులో భాగంగానే గత ఏడాది మే నెలలో రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ నెలలో శుభకార్యాలు ఉండటం, ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఏపీలో ఎన్నికల నేపథ్యాన ఇక్కడి నుంచి మద్యం సరఫరా అయిందని తెలుస్తోంది. ఇక గత ఏడాది సెప్టెంబర్ 30న ఒకేరోజు 45 వేల కేసుల మద్యం, 16,500 కేసుల బీర్లు అమ్ముడవడం.. వీటి విలువ రూ.33 కోట్లు ఉండడం విశేషం. పెరిగిన బీర్ల ధరలు.. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచడంతో వేసవిలో బీర్ల అమ్మకం ఎలా ఉంటుందోనని మద్యం షాపుల యజమానుల్లో అనుమానం వ్యక్తమవుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బీర్లకు అంతగా డిమాండ్ లేనట్లు ఎకై ్సజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో స్ట్రాంగ్ బీర్ ధర రూ.160 ఉండగా ఇ ప్పుడు రూ.190కి, లైట్ బీరు రూ.150 నుంచి రూ.180 కి చేరింది. గతంలో రోజుకు 8 వేల నుంచి 10 వేల కేసులు అమ్ముడయ్యే బీర్లు 7 వేల కేసులు దాటడం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి పెరిగిన బీర్ల ధరలు అమల్లోకి రాగా ఈ నెల 11వ తేదీ వరకు రూ.60 కోట్ల విలువైన 2,92,000 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే, బీర్లకు డిమాండ్ తగ్గినా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం గణనీయంగా నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు నెల విక్రయాలు (రూ.కోట్లలో) 2024 ఏప్రిల్ 181 మే 237 జూన్ 210 జూలై 180 ఆగస్టు 196 సెప్టెంబర్ 184 అక్టోబర్ 152 నవంబర్ 134 డిసెంబర్ 225 2025 జనవరి 201 ఫిబ్రవరి 181 మార్చి 201 మొత్తం రూ.2,294 -
మూడేళ్లు కష్టపడితే భవిష్యత్ మీదే..
● విద్యార్థులకు కలెక్టర్ సూచన ● లక్ష్మీదేవిపల్లి డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల పాల్వంచరూరల్ : డిగ్రీ విద్యార్థులు మూడేళ్లు కష్టపడి చదివితే ఆ తర్వాత భవిష్యత్ బాగుంటుందని, జీవితాంతం సుఖపడే అవకాశం ఉంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. చదువును నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవని చెప్పారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ అటాన్మస్ కళాశాలలో బుధవారం ఆయన ప్రథమ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారని, తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. అంతేకాక విశాలమైన తరగతి గదులు, క్రీడామైదానంతో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పైనా ఆసక్తిని కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఆటలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతాయన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.పద్మ మాట్లాడుతూ.. కళాశాల అటానమస్ హోదా పొందిన తర్వాత తొలిసారిగా పరీక్షలు నిర్వహించి సకాలంలో మూల్యాంకనం చేసి కలెక్టర్ చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కలెక్టర్ పాటిల్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ప్రిన్సిపాల్ ఫ్రొఫెసర్ వై.చిన్నప్పయ్య, అటాన్మస్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వేముల కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాధవి, అధ్యాపకులు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ కొండలరావు, విజయప్రసాద్, శెట్టి స్వరూపరాణి, పి.శ్రీనివాసరావు, శ్రీదేవి, లీల, దీపిక, విమల, కావ్య, కరీమాపర్వీన్, హారిక, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి గనుల పరిసర ప్రాంతాలు, సంస్థ కార్మికులు, వారి పిల్లలు, ప్రభావిత ప్రాంత నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే మందమర్రి, రామగుండం ఏరియాల్లో సంస్థ ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు కొనసాగుతుండగా, భూపాలపల్లిలోనూ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావును సింగరేణి జీఎం(కార్పొరేట్ హెచ్ఆర్డీ) జి.రఘుపతి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో డీజీఎం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మూగజీవాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ గుండాల: అడవుల్లో మూగజీవాలకు నీటి సదుపాయం కల్పించడంతో పాటు వాటి రక్షణ కోసం సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని గణపురం, పాలగూడెం ప్లాంటేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొక్కలు ఎండిపోకుండా నిత్యం నీరందించాలని, ప్లాంటేషన్ చుట్టూ ట్రెంచ్లు ఉండాలని అన్నారు. అడవుల్లో జంతువులకు ఏర్పాటు చేసిన తొట్లలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండాలన్నారు. వేటగాళ్ల ఉచ్చులకు జంతువులు బలికాకుండా నిఘా పటిష్టం చేయాలని, వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అడవులకు నిప్పు పెట్టకుండా జాగత్ర చర్యలు తీసుకోవాలని, ప్రమాదవశాత్తు కాలిపోతున్న ప్రదేశాలను వెంటనే ఆర్పివేయాలని ఆదేశించారు. అడవులు, అటవీ జంతువుల రక్షణలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ కలప రవాణాపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట ఇల్లెందు ఎఫ్డీఓ కోటేశ్వరరావు, గుండాల రేంజర్ నర్సింహారావు, డీఆర్ఓ బాలాజీ, సిబ్బంది కోటేశ్వరావు, రవి, వెంకన్న తదితరులు ఉన్నారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
పాల్వంచ: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట బుధవారం పోలీసులను ఆశ్రయించింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ యువతి అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు యువతి, పునుకుల గ్రామానికి చెందిన యువకుడు కలిసి పోలీసుస్టేషన్కు వచ్చారు. తాము ప్రేమించుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మట్టి తరలింపుపై ఫిర్యాదు చుంచుపల్లి: మండల పరిధిలోని బృందావనం వద్ద ప్రభుత్వ అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకుని ఇతర అవసరాలకు మట్టిని తరలిస్తున్నారని బుధవారం స్థానికులు చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణకు ఫిర్యాధు చేశారు. దీనిపై సిబ్బందితో విచారణ చేపట్టి నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. పదో తరగతి విద్యార్థిని అదృశ్యం పాల్వంచరూరల్: ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి రాత్రి సమయంలో బయటకు వెళ్లిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామపంచాయతీలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఈ నెల 11వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. విద్యార్థిని తండ్రి బుధవారం ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు భద్రాచలంఅర్బన్: పట్టణంలోని శిల్పినగర్ కాలనీలో నెలకొన్న ఫ్లెక్సీ వివాదంలో బుధవారం ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శిల్పినగర్లో ఏర్పాటు చేసిన ఓ ఫెక్సీని చింపి వేసిన వేసిన ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో మాటామాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సుభాష్నగర్ కాలనీకి చెందిన రాహుల్తేజ్ అనే వ్యక్తి శిల్పినగర్కు చెందిన రఘుతోపాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశాడు. రాహుల్తేజ్పై కూడా రఘు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యంటేకులపల్లి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. టేకులపల్లి పంచాయతీ రేగులతండా గ్రామానికి చెందిన ధరావత్ కవితకు మధిరకు చెందిన యువకుడితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 7 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సుమారు మూడు నెలల క్రితం కవిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లి బాణోతు భామిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుండెపోటుతో మహిళ మృతిఅశ్వారావుపేటరూరల్: కాలినడకన వెళ్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా కిందపడి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన ఎస్కే జరీనా(55) కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేటలోని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉండే తన మరిది ఖలీల్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం తోటి కోడలితో కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్కు వెళ్లింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై కుప్పకూలి పడిపోయింది. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి గుండెపోటుకు గురై మృతి చెందిందని తెలిపారు. -
అన్నదాతకు ‘అకాల’ దెబ్బ
● జిల్లాలో ఇటీవల రోజూ కురుస్తున్న వర్షం ● కల్లాల్లోనే తడుస్తున్న ధాన్యం ● వరికోతలకూ ఆటంకం బూర్గంపాడు: అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ముమర్మంగా వరికోతలు, ధాన్యం అమ్మకాల సమయంలో కురుస్తున్న వానలు కలవరపరుస్తున్నాయి. గాలి దుమారంతో కోతకు వచ్చిన వరి నేలకొరుగుతోంది. ఇప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. గత పది రోజులుగా జిల్లాలో ఏదో ఓ ప్రాంతంలో గాలిదుమారంతో కూడిన వర్షాలు పడుతుండగా పంటలు పాడవుతున్నాయి. మంగళవారం రాత్రి పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు తీశారు. బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వారావుపేట, ఇల్లెందు, అశ్వాపురం, గుండాల మండలాల్లో భారీ గాలులతో కూడిన వర్షం కురవగా కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలు చేసి టార్పాలిన్లు, పరదాలు కప్పుతూ కొంతమేర కాపాడుకునే ప్రయత్నం చేశారు. నత్తనడకన కొనుగోళ్లు.. జిల్లాలో పలువురు రైతులు ఇప్పటికే ధాన్యం కోసినా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు చేయడం, ఉదయం ఆరబెట్టడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. బూర్గంపాడు మండలంలో పలుచోట్ల రాశుల కిందకు వర్షపు నీరు చేరి ధాన్యం తడిసింది. దీన్ని తిరిగి ఆరబెట్టుకునేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మరో రెండురోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సొమ్ము చేసుకుంటున్న మిల్లర్లు, వ్యాపారులు.. అకాల వర్షాలతో వరి పొలాలు బురదమయంగా మారాయి. దీంతో పంట కోసేందుకు రైతులు ట్రాక్బెల్ట్తో నడిచే హార్వెస్టర్ల కోసం పోటీ పడుతున్నారు. గంటకు రూ. 3,500 చొప్పున చెల్లించి వరి కోతలు చేపడుతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టడం కూడా కష్టం అవుతుండడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం వేచిచూడకుండా తక్కువ ధరలకే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. యాసంగిలో సాగు చేసిన సన్నరకం ధాన్యానికి కూడా ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించినా.. రైతులు అవేవీ పట్టించుకోకుండా ఏదో ఒక ధరకు అమ్ముకోవాలని చూస్తుండగా.. ఇదే అదనుగా వ్యాపారులు, మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. -
గిన్నిస్ బుక్లో సంపత్నగర్వాసికి చోటు
టేకులపల్లి: మండలంలోని సంపత్ నగర్ గ్రామానికి చెందిన కుడితేటి రమేష్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. హైదరాబాద్కు చెందిన హోలెల్ మ్యూజిక్ స్కూల్ ప్రోత్సాహంతో క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ మ్యూజిక్ ప్రదర్శనలో అతను పాల్గొన్నాడు. ఏకకాలంలో 1,090 మంది సంగీత కళాకారులు కీ బోర్డు ప్లే చేశారు. వారిలో 1,046 మంది సుమారు నిమిషం నిడివి కలిగిన వీడియో క్లిప్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్ కూడా ప్రతిభ చూపి రికార్డు సాధించాడు. నిర్వాహకులు మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. 10 మంది స్పౌజ్ ఉపాధ్యాయుల బదిలీఖమ్మంసహకారనగర్: గత ప్రభుత్వ హయాంలో 317 జీఓ ద్వారా ఉపాధ్యాయ దంపతుల్లో ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకు బదిలీ అయ్యారు. దీంతో వీరికి స్పౌజ్ కేటగిరీ ద్వారా బదిలీకి అవకాశం కల్పించగా రాష్ట్రంలో 165మంది ఉపాధ్యాయులను వారి భాగస్వామి పనిచేస్తున్న జిల్లాలకు కేటాయించారు. ఇందులో పది మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానుండగా, అంతే సంఖ్య ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు వెళ్లనున్నారు. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు విడుదల చేయడంపై టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆయా ఉపాధ్యాయులు ఈనెల 22న ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ అయి.. 23న కొత్త జిల్లాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ కమిషన్ సభ్యుడిని కలిసిన నాయకులు సింగరేణి(కొత్తగూడెం): జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ను ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్లో బుధవారం సింగరేణి కాలరీస్ అసోషియేషన్ ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల సమస్యలపై త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు. విజిలెన్స్ అఽధికారుల వేధింపులు, ప్రమోషన్లు పెండింగ్లో పెట్టడం వంటివి సరికాదని అన్నారు. అసోషియేషన్ నాయకులు ఆంతోటి నాగేశ్వరరావు, ఆరెపల్లి రాజేందర్, బందెల విజేందర్, మొగిలిపాక రవికుమార్, చెరిపెల్లి నాగరాజు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీఅశ్వాపురం: మండల కేంద్రంలో బస్సు, లారీ స్వల్పంగా ఢీకొన్న ఘటన బుధవారం జరిగింది. మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు వైపు వెళ్తున్న లారీ అశ్వాపురంలో స్టేట్ బ్యాంక్ ఎదుట బస్సును ఢీకొని, సైడ్ రాసుకుంటూ దూసుకెళ్లింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనతో సుమారు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వచ్చి పునరుద్ధరించారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతిచర్ల: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన ఘటన దానవాయిపేటలో బుధవారం రాత్రి జరిగింది. మండలంలోని బోటిగూడేనికి చెందిన తాటి మహేష్(29) దానవాయిపేట వైపు నుంచి ఆర్.కొత్తగూడెం వైపు బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్.కొత్తగూడెం వైపు నుంచి దానవాయిపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో మహేష్కు తీవ్ర గాయాలు కాగా, క్షతగాత్రుడిని స్థానికులు సత్యనారాయణపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి 108 అంబులెన్సులో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీపీఓల విధులపై 19న సెమినార్ ఖమ్మంసహకారనగర్: గ్రామ పాలన ఆఫీసర్ల (జీపీఓ) ‘విధులు – బాధ్యతలు’అంశంపై ఈ నెల 19న ఖమ్మంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరిక ఉపేందర్రావు తెలిపారు. భూభారతి చట్టంలోని అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జీపీఓలుగా వచ్చేందుకు ఆప్షన్ ఇచ్చిన ఉమ్మడి జిల్లాలోని వీఆర్వోలు, వీఆర్ఏలు హాజరుకావాలని సూచించారు. -
సీతారామలో ఏదీ?
‘రాజీవ్’ స్ఫూర్తి..ప్రారంభం కాని డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ● నెలల తరబడి కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ● గతంలో శరవేగంగా పూర్తయిన రాజీవ్ లింక్ కెనాల్ ● ప్రాజెక్టు ఫలాలు ‘భద్రాద్రి’కీ అందించాలంటున్న రైతులు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులు ఎక్కువ మంది భద్రాద్రి జిల్లాలో ఉంటే.. గరిష్ట ప్రయోజనాలు మాత్రం ఖమ్మం జిల్లాకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి. దీనికి తోడు ఈ జిల్లాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనుల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. పూర్తి కాని టెండర్ల ప్రక్రియ.. జిల్లా పరిధిలో నిర్మించే డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల కోసం గతేడాది అక్టోబర్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమై వేగంగా సాగుతోంది. మరోవైపు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణ పనులకు గతేడాది అక్టోబర్లోనే టెండర్లు పిలిచారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో టెండర్ల గడువు పొడిగిస్తూ 2025 జనవరి వరకు లాగారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు చేపట్టే కంపెనీల ఎంపిక ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకు అగ్రిమెంట్లు జరగలేదు. దీంతో నిర్మాణ పనులు ఇంకా మొదలే కాలేదు. ఫలితంగా పనులకు అనువుగా ఉండే వేసవి సమయం వృథా అవుతుండగా.. అంచనా వ్యయం కూడా పెరుగుతోంది. 2024 జూలైలో ఇరిగేషన్ అధికారులు సమర్పించిన రిపోర్టులో జిల్లా పరిధిలోని నాలుగు ప్యాకేజీల నిర్మాణ అంచనా వ్యయం రూ.1,656 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ. 1,773 కోట్లకు చేరుకుంది. ‘రాజీవ్’ ఆదర్శంగా.. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. గోదావరి జలాలను తక్షణమే ఖమ్మం జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేందుకు రాజీవ్ లింక్ కెనాల్కు శ్రీకారం చుట్టడంతో పాటు సుమారు రూ.100 కోట్లు మంజూరు చేసింది. అధికారులు యుద్ధప్రాతిపదికన భూ సేకరణ చేపట్టారు. అటవీ శాఖ అనుమతులు సాధించారు. కాలువ నిర్మాణానికి అడ్డంకులు ఎదురైనప్పుడు జాతీయ రహదారుల సంస్థ, గ్యాస్ సరఫరా కంపెనీలతో చర్చలు జరిపారు. ప్రత్యేక అనుమతులపై విదేశాల నుంచి ఇంజనీర్లను రప్పించి పంప్హౌస్ల్లో మోటార్లను సిద్ధం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమీక్షలు నిర్వహించారు. వెరసి రికార్డు సమయంలో రాజీవ్ కెనాల్ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అదే స్ఫూర్తితో భద్రాద్రి జిల్లాలో నిర్మించాల్సిన 1, 2, 7, 8 డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు కూడా చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అప్పుడే ప్రాజెక్టు నిర్వాసిత జిల్లాగా పేరున్న ‘భద్రాద్రి’కి కొంతైనా న్యాయం జరుగుతుందని అంటున్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తాం సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లకు సంబంధించి మొత్తం ఎనిమిది ప్యాకేజీల పనులు చేపడుతున్నాం. ఇందులో జిల్లాకు సంబంధించిన నాలుగు ప్యాకేజీల టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో అగ్రిమెంట్లు చేసి పనులు ప్రారంభిస్తాం. రెండేళ్లలో డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. – రవికుమార్, నీటి పారుదలశాఖ డిప్యూటీ సీఈడిస్ట్రిబ్యూటరీ కెనాల్ ప్యాకేజీ వివరాలిలా.. ప్యాకేజీ కొత్త ఆయకట్టు నిర్మాణ వ్యయం లబ్ధిపొందే (ఎకరాల్లో) (రూ. కోట్లలో) నియోజకవర్గాలు 1 41,813 రూ. 523 పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట 2 36,231 రూ. 262 కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట 7 63,310 రూ. 521 అశ్వారావుపేట 8 38,598 రూ. 467 అశ్వారావుపేట, సత్తుపల్లి రైతులకు పైసా ప్రయోజనం లేదు.. సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాలువ, పంప్హౌస్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లు దాటినా ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల పనులు ప్రారంభించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు నయా పైసా ప్రయోజనం కలగలేదు. ఎట్టకేలకు 2024 ఆగస్టులో ఈ ప్రాజెక్టులోని మూడు పంపుహౌస్లను ప్రారంభించిన తర్వాత డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో జిల్లా పరిధిలో 1,49,952 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి తెచ్చేలా 1, 2, 7, 8 ప్యాకేజీల కింద డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించాలని నిర్ణయించారు. దీంతో రెండు దశాబ్దాల తర్వాత అయినా జిల్లా పొలాల్లోకి గోదావరి జలాలు ప్రవహించే రోజులు దగ్గర్లోకి వచ్చాయనే నమ్మకం కలిగింది. -
హరినాధుడికి పొంచి ఉన్న ముప్పు
● గతంలోనే దెబ్బతిన్న కల్యాణ మండపం ● మాడ వీధుల విస్తరణతో మరింత ప్రమాదం ● అభివృద్ధి ప్లాన్లో చేర్చితే ఆలయానికి ఆదరణ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి కూత వేటు దూరంలో ఉన్న కుసుమ హరినాధ ఆలయానికి ముప్పు పొంచి ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ గుడి రామాలయానికి ఉత్తర దిక్కులోని గుట్టపై ఉంది. ఈ ఆలయాన్ని సుమారు 100 ఏళ్ల క్రితమే నిర్మించినట్లుగా చెబుతుండగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. దీంతో ఈ ఆలయ అభివృద్ధిని సైతం రామాలయ మాస్టర్ప్లాన్లో పొందుపర్చాలని, తద్వారా భక్తుల, పర్యాటకుల రాక పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మాడ వీధులు విస్తరిస్తే.. రామాలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల విస్తరణకు ఇటీవల ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు నిర్వాసితులకు రూ.34 కోట్ల నష్ట పరిహారం కూడా అందజేసింది. ఇక వారి నుంచి భూమి తీసుకోవడమే మిగిలి ఉంది. మాడ వీధుల విస్తరణకు సేకరించే భూమి వెనుక భాగంలో ఉన్న గుట్టపైనే ఈ కుసుమ హరినాధ ఆలయం ఉంది. గతంలోనే ఈ గుట్టను ఆక్రమించి కొంతమేర నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పుడా స్థలాల్లో అభివృద్ధి పనులు చేస్తే గుట్ట కింది భాగం కొద్దిమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి తోడు శతాబ్దం క్రితం నిర్మించిన ఆలయం కావడంతో ప్రాభవం లేక పురాతనంగా మారింది. గుట్టపై భాగంలో ఆలయం వద్ద ఉన్న కల్యాణ మండపం సైతం ఇటీవల కుంగి కొంత పడిపోయింది. గతంలో రథసప్తమి రోజున ఈ మండపంలోనే కుసుమ హరినాధుల కల్యాణం నిర్వహించేవారు. అది పూర్తిగా శిథిలం కావడంతో ప్రస్తుతం ఆలయంలోనే జరిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆలయం చెంతన అభివృద్ధి పనులు చేపడితే మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయాభివృద్ధిపై దృష్టి పెట్టాలి.. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న కుసుమ హరినాధ ఆలయాన్ని ప్రమాదం నుంచి తప్పించడంతో పాటు భక్తుల రాక పెంచేలా రామాలయ అభివృద్ధి ప్రణాళికలో దీన్ని కూడా భాగం చేయాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా రామాలయానికి అనుబంధంగా ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు ఈ దేవస్థానాన్ని కూడా దర్శించుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక రంగనాయకుల గుట్టపై ఉన్న కాటేజీలు, రామదాసు జ్ఞాన మందిరం, రంగనాధ స్వామి ఆలయానికి వెళ్లేందుకు ఇటువైపు నుంచి మార్గం దగ్గరవుతుంది. రామాలయానికి వచ్చే భక్తులు ప్రస్తుతం అక్కడికే పరిమితమవుతున్నారు. ప్లాన్లో చేర్చి దీన్ని కూడా అభివృద్ధి చేస్తే శివాలయం, కుసుమ హరినాధాలయం, రంగనాయకుల ఆలయాలు సైతం భక్తులకు చేరువవుతాయి. ఇక పడమర దిక్కున ఉన్న నరసింహస్వామి వారి ఆలయానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రతిపాదన గత మాస్టర్ ప్లాన్లో పొందుపర్చారు. దీన్ని తీగల వంతెనగా మార్చి నరసింహాలయం, అటు నుంచి గోదావరి వరకు నిర్మిస్తే నేరుగా ఉపాలయానికి, అక్కడి నుంచి గోదావరి కరకట్ట వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భద్రాచలానికి కొత్త సొబగులు చేకూరే అవకాశం ఉంటుంది. ప్రతిపాదనలు పంపాం ఇటీవల పడిపోయిన కల్యాణ మండపం, శిథిలావస్థకు చేరుకున్న ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రమాద పరిస్థితుల నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని నివేదికలో కోరాం. – సుదర్శన్, ఈఓ, కుసుమ హరినాధాలయం -
పోషకాహారంతోనే ఆరోగ్యం
● ఈ నెల 22 వరకు పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు ● ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన ● జిల్లాలోని 2,060 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహణ భద్రాచలంఅర్బన్: మాతా శిశు సంరక్షణ, ఆరోగ్యం పెంపొందించేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి పోషణ్ అభియాన్ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. పోషకాహారం ఆవశ్యకతను వివరించేలా జిల్లావ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పూర్తి స్థాయిలో పోషకాహారమందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలపై ప్రదర్శనలు చేపట్టామని, తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఎన్ఆర్సీకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పండ్లు, కూరగాయలు, వ్యాయామం వల్ల జరిగే ఉపయోగాలను వివరిస్తున్నారు. పక్షోత్సవాల్లో అంగన్వాడీ సిబ్బందితో పాటు వైద్యారోగ్య, ఆర్డ్బ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులను భాగస్వామ్యులను చేస్తున్నారు. ఆరోగ్యం పరిశీలన, సూచనలు పోషణ పక్షోత్సవాల్లో గర్భిణులు, చిన్నారుల బరువు, ఆరోగ్యాలను పరిశీలిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యత, పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్ను పరిశీలిస్తున్నారు. గర్భిణుల సంరక్షణలో భర్తల పాత్రపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2060 అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాదిలోపు చిన్నారులు 49,627 మంది, ఆరేళ్ల లోపు చిన్నారులు 13,012 మంది, గర్భిణులు 6,337 మంది, బాలింతలు 6,336 మంది ఉన్నారు. కాగా పోషకాహారం లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అవగాహన కల్పిస్తున్నాం.. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. సీమంతం, అన్నప్రాసన, అక్షరభ్యాసం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీని ద్వారా గ్రామాల్లో మాతాశిశు మరణాలు తగ్గించవచ్చు. రక్తహీనత వంటి సమస్యలు రాకుండా చూడొచ్చు. –స్వర్ణలత లెనినా, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి -
కొర్రమేను పెంపకంతో సిరులు
● చేపల పెంపకంలో రాష్ట్రానికే ఆదర్శం కావాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపు సూపర్బజార్(కొత్తగూడెం): సిరులు పండించే కొర్రమేను చేపల పెంపకంతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొర్రమేను చేపల పెంపకంపై జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొత్తగూడెం క్లబ్లో మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసిరాక పోవచ్చని, ప్రకృతి సహకరిస్తేనే అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. అందుకే ఒకసారి పెట్టుబడితో నిరంతరం ఆదాయం వచ్చే చేపల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కొర్రమేను చేప ఎలాంటి వాతావరణానికై నా తట్టుకుంటుందని అన్నారు. వీటి పెంపకానికి ఎక్కువ భూమి కూడా అవసరం లేదని, పావుగుంట స్థలంలో నీటి ట్యాంక్, మరో పావుగుంటలో ఫామ్పాండ్ నిర్మిస్తే చాలని, దాణాతో కలిపి మొత్తం సుమారు రూ 3.50 లక్షలతో తయారు చేసుకోవచ్చని వివరించారు. ఒక్కో చేపపిల్ల ఖరీదు రూ.15 ఉంటుందని, 1000 పిల్లలు పెంచితే అందులో 900 చేతికొచ్చినా కిలో రూ.300 చొప్పున ఏడు నెలల్లో రూ.2.70 లక్షలు చేతికొస్తాయని చెప్పారు. ఈ యూనిట్ స్థాపనకు పీఎంఈజీపీ పథకం ద్వారా 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా ఫామ్పాండ్ ఉచితంగా నిర్మించుకోవచ్చని అన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు అధిక సంఖ్యలో కొర్రమేను చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. చేపలకు రోజుకు ఐదుసార్లు దాణా వేయాలని, పిల్లలను నాలుగు నెలలు ట్యాంకర్లో పెంచిన తర్వాత వాటిని నీటి కుంటలో వేస్తే పెద్ద పరిణామంలో ఎదుగుతాయని అన్నారు. రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు కొర్రమేను చేపల పెంపకం చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్వా కనెక్ట్స్ సంస్థ వారు చేపల పెంపకం, మార్కెటింగ్ తదితర అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, వ్యవసాయాధికారి బాబూరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, మత్స్య శాఖ ఏడీ ఇంతియాజ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రెంచ్ పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లాపురంలో ఆదివాసీలు, అటవీ శాఖ అధికారుల మధ్య మంగళవారం పోడు వివాదం చోటుచేసుకుంది. అధికారులు సోమవారం ట్రెంచ్ కొట్టే పనులు చేపట్టారు. ఆ పనులు కొనసాగించేందుకు మళ్లీ మంగళవారం వెళ్తుండగా గ్రామ పొలిమేరలోనే ఆదివాసీలు అడ్డుకున్నారు. తమకు పట్టాలున్న భూముల్లో ట్రెంచ్ పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అయితే తాము సాగు భూముల జోలికి వెళ్లడం లేదని, అడవికి సరిహద్దుగా మాత్రమే ట్రెంచ్ పనులు చేపట్టామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూముల వద్దకు వెళ్లనిచ్చేది లేదని భీష్మించడంతో అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు. అడవికి సరిహద్దుగా ట్రెంచ్ పనులు చేసుకోవాల్సిన అధికారులు.. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి ఉన్న భూముల్లోనూ పనులు చేపట్టారని ఆదివాసీలు ఆరోపించారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు ఒక రైతు చెట్ల కొమ్మలను నరికితే దీన్ని సాకుగా తీసుకుని పట్టా భూముల్లో ట్రెంచ్ పనులు చేపట్టడం అన్యాయమని అన్నారు. ఈ విషయమై కొమరారం ఇన్చార్జ్ ఎఫ్ఆర్ఓ చలపతిరావును వివరణ కోరగా.. పట్టా భూమి పక్కనే ఉన్న అడవిని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినట్లుగా గుర్తించామని, అడవికి, పట్టా భూములకు సరిహద్దును నిర్ధారించేందుకే ట్రెంచ్ పనులు చేపట్టామని చెప్పారు. తమ ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు.ఎల్లాపురంలో పోడు వివాదం -
రజతోత్సవ సభకు కదం తొక్కాలి
ఇల్లెందు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం యావత్ దేశమే కాదు ప్రపంచంలోని తెలుగు వారంతా ఎదురుచూస్తున్నారని.. ఈ సభకు గులాబీ సైన్యం కదం తొక్కి విజయవంతం చేయాలని ఎంపీ వద్ది రాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఇల్లెందులో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన డొల్ల అని తేలడంతో తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కేసీఆర్ పేరు తెలంగాణ చరిత్రలో ఉంటుందని చెప్పారు. హామీలేవీ అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని ఎంపీ కోరారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ అధికారులు కాంగ్రెస్ నేతలకు వత్తాసుగా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చర్యలు తప్పవన్నారు. హనుమకొండ సభను బీఆర్ఎస్ శ్రేణులు పండుగగా భావించాలని సూచించారు. ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగాల రాజేందర్ తదితరులు ఇల్లెందు 8వ వార్డులో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. ఇంకా ఈ సమాశంలో మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సంజీవనాయక్, లక్కినేని సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గత ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఆశించిన సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవనాయక్ ఈ సభకు హాజరుకావడం చర్చనీయాంఽశంగా మారింది. సన్నాహక సదస్సులో ఎంపీ రవిచంద్రరాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆరే.. దమ్మపేట : సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎంపీ రవిచంద్ర అన్నారు. మండలంలోని పార్కలగండిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ తేవడం వల్లే నేడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులు ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ సభకు నియోజకవర్గం నుంచి 1000 మందిని తరలిస్తామని తెలిపారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సోయం వీరభద్రం, సున్నం నాగమణి, వగ్గెల పూజ, రావు జోగేశ్వరరావు, దారా యుగంధర్, తూతా నాగమణి, దొడ్డా రమేష్, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, దారా మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
నాలుగేళ్లకే నేలమట్టమా !
● కుప్పకూలిన ‘సీతారామ’ ప్యాసేజ్ పిల్లర్ ● ఇదేం నాణ్యత అంటూ సర్వత్రా విస్మయం ● అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతుల ఆరోపణములకలపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువపై రూ.కోటి వ్యయంతో నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ నాలుగేళ్లకే నేటమట్టం కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత లేకపోవడమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. 20 రోజుల క్రితమే పిల్లర్ కూలిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. సుమారు ఏడాది కాలంగా రాకపోకలు నిలిపివేశారని రైతులు అంటున్నారు. వీకే రామవరం పంప్హౌస్ –2 నుంచి కమలాపురంలోని పంప్హౌస్ –3కు వెళ్లే ప్రధాన కాల్వపై 48.30 కిలోమీటర్ వద్ద నాలుగు పిల్లర్లతో సూపర్ ప్యాసేజ్ నిర్మించారు. రెండు పిల్లర్లు కాల్వలో, కాల్వకు కుడివైపున సిమెంట్ రివిట్మెంట్లో ఒకటి, ఎడమ పక్కన మరోకటి నిర్మించారు. ఐతే పూసుగూడెం నుండి కమలాపురం వెళ్లే ప్రధాన కాలువలో ఎడమ పక్కన పిల్లర్ కూలిపోయింది. ఇరిగేషన్ అధికారులు ఇరవై రోజుల క్రితం ఘటన జరిగిందని చెపుతున్నా, సుమారు ఏడాది క్రితమే పిల్లర్ నేటమట్టమైనట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈక్రమంలో అసలు పిల్లర్ ఎలా కూలింది అనే విషయంలోనూ స్పష్టత కరువైంది. పిల్లర్ కింద మట్టి కదిలి, పునాది కదలడంతో పిల్లర్ కూలిపోయిందని ఇరిగేషన్ అఽధికారులు చెపుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కాలువ కుడివైపున రివిట్మెంట్లో ఉన్న పిల్లర్కు కూడా ప్రమాదం పొంచిఉండే అవకాశం ఉంది. ఇదే పద్ధతితో పిల్లర్ బేస్మెంట్ కదిలితే ఆ పిల్లర్కూడా కూలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గోప్యత ఎందుకో..? ఏడాది క్రితమే పిల్లర్ నేలమట్టమైందని రైతులు అంటుండగా 20 రోజుల క్రితమే కూలిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ 20 రోజులు మాత్రం గోప్యత ఎందుకు పాటించారనేది ప్రశ్నార్థకంగా మారింది. పిల్లర్ను పునర్నిర్మించాలని యోచిస్తున్న అధికారులు.. కూలిపోవడానికి కారణమేంటని సమగ్ర అధ్యయనం చేశారా లేక ఇష్టారీతిన పనులు సాగిస్తారా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్యాసేజ్ నిర్మించిన కాంట్రాక్ట్ ఏజన్సీ పని మొత్తం పూర్తయ్యాక కూడా రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యత చూడాల్సి ఉంటుందని ఇరిగేషన్ ఇంజనీర్లు అంటుండగా.. అసలు పని పూర్తికాకుండానే పిల్లర్ కూలడం నాణ్యతను తెలియజేస్తోంది. సమగ్ర విచారణ చేపట్టాలి అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వంతోనే పిల్లర్ కూలిపోయింది. దీంతో ప్రజాధనం వృథా అయింది. రూ.కోటితో నిర్మించిన ప్యాసేజ్ ప్రమాదకర పరిస్థితిలో ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – నూపా భాస్కర్, మాస్లైన్ నాయకుడు పనులు ప్రారంభించాం 20 రోజుల క్రితమే పిల్లర్ కూలిపోయింది. తిరిగి ఇప్పటికే పనులు ప్రారంభించాం. బేస్మెంట్ లోతు పెంచి, పకడ్బందీగా పిల్లర్ నిర్మిస్తాం. ప్రజాధనం వృథా కాకుండా కాంట్రాక్టరే ఖర్చు భరించేలా చర్యలు తీసుకుంటున్నాం. పిల్లర్ కూలినందునే తాత్కాలికంగా ప్యాసేజ్ దారి మూసేశాం. – రాంబాబు, ఇరిగేషన్ డీఈ -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క బ్యారేజీ నుంచి నీరు విడుదలసూపర్బజార్(కొత్తగూడెం)/అశ్వాపురం : జిల్లాలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేయనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం తెలిపారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీరు అడుగంటుతోందని, దీంతో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బంది కలుగకుండా మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో తుపాకులగూడెంలోని బ్యారేజీ నుంచి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని వివరించారు. ఏప్రిల్, మే నెలల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రాద్రి తలంబ్రాలకు ఆదరణ భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కొనుగోలు చేసే భక్తుల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగింది. శ్రీరామనవమికి భద్రాచలం రాలేని భక్తుల ఇంటివద్దకే తలంబ్రాలు అందించాలని ఆర్టీసీ కార్గో సంకల్పించింది. గత నెల 15 నుంచి ఈనెల 7 వరకు రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో సిబ్బంది తలంబ్రాలు అందించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బుక్ చేసుకున్నారు. గతేడాది ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా 4,500 మంది మాత్రమే బుక్ చేసుకోగా ఆర్టీసీకి రూ.6.79 లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి 4,948 మంది బుక్ చేసుకోగా రూ.7.47 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గల 11 ఆర్టీసీ రీజియన్లలో పరిధిలో 2024లో 47,092 బుకింగ్లకు రూ.71,10,892 ఆదాయం రాగా, ఈ ఏడాది 82,147 మంది బుక్ చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 40 వేల తలంబ్రాల ప్యాకెట్లు కార్గో ద్వారా అందజేయగా రూ.60.40 లక్షల ఆదాయం వచ్చింది. ఇంకా 42 వేల మంది భక్తులకు త్వరలోనే తలంబ్రాలు అందిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. -
పాలక మండలికి మోక్షమెప్పుడో ?
జీఓ వచ్చి నెల కావొస్తున్నా ప్రమాణస్వీకారం ఊసే లేదు పాల్వంచరూరల్ : అమ్మవారు వరమిచ్చినా అధికారులు కరుణించని చందంగా ఉంది పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి పరిస్థితి. ఆలయ పాలకమండలి కోసం 13 మంది పేర్ల జాబితాతో ప్రభుత్వం మార్చి 19న జీఓ నంబర్ 112 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దేవాదాయ శాఖ అధికారులు ఇంకా ప్రమాణ స్వీకారానికి మోక్షం కల్పించడం లేదు. జీఓ వచ్చిన ఏడు రోజుల తర్వాత అంటే గత నెల 26న జాబితాలో పేర్లున్న వారందరనీ ప్రమాణస్వీకారోత్సవానికి ఈఓ ఆహ్వానించారు. దీంతో వారంతా ఆలయం వద్ద గల ఈఓ కార్యాలయానికి వెళ్లారు. అయితే స్థానికులకు కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఇద్దరు యువకులు గుడి ఎదుట గల వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలపగా, మరి కొందరు ఈఓ కార్యాలయం ఎదుట అందోళన చేశారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయింది. మొదట 14 మందితో.. పెద్దమ్మతల్లి ఆలయ పాలకవర్గం ఎన్నిక విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం రెండుసార్లు జీఓలు జారీ చేయడం వివాదానికి దారితీసింది. మొదట గతనెల 6వ తేదీన 14 మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. అయితే ఈ కమిటీపై వివాదం తలెత్తడం, అధికారులు, మంత్రులకు ఫిర్యాదులు అందడంతో ఆ జీఓను రద్దుచేసి గతనెల 19న జీఓ నంబర్ 112 ద్వారా 13 మందితో కూడిన మరో జాబితా విడుదల చేశారు. ఇప్పుడు ఈ జీఓ వచ్చి కూడా 27 రోజులు కాగా, మరో మూడు రోజుల్లో ఈ జాబితా కూడా రద్దయ్యే అవకాశం ఉందని పాలకమండలిలో చోటు దక్కిన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ రజినీకుమారిని వివరణ కోరగా.. పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఉన్నతాధికారుల నుంచి మరోసారి ప్రొసీడింగ్స్ రావాల్సి ఉందని, రాగానే చేయిస్తామని చెప్పారు. -
ఆలయ హుండీ చోరీకి యత్నం
అశ్వారావుపేటరూరల్: మండలంలోని వినాయకపురం గ్రామ శివారులోని శ్రీచిలకలగండి ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. ఆలయం లోపల ఉన్న ఐరన్ హుండీని గుర్తుతెలియని దుండగులు సుమారు 15 మీటర్ల దూరంలో ఆలయం వెనక వైపునకు తీసుకెళ్లి తాళాలను తెరిచేందుకు యత్నించగా.. తెరుచుకోకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లారు. ఉదయం ఆలయానికి వచ్చిన సిబ్బంది గుర్తించి, స్థానిక పోలీసులకు సమచారం అందించారు. ఏఎస్ఐ యాకూబ్అలీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఇటీవల వచ్చిన గాలి దుమారంతో ఆలయంలోని సీసీ కెమెరాలు కాలిపోగా, చోరీకి వచ్చిన దుండగులను గుర్తించేందుకు వీలు లేకుండా పోయింది. -
అన్యమత ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
ములకలపల్లి : ఏజెన్సీ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను అగౌరవపరుస్తూ ఓ వ్యక్తి అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నాడని రాజీవ్నగర్ గ్రామస్తులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మత మార్పిడికి యత్నిస్తున్న అతడిపై చర్య తీసుకోవాలని కోరారు. చికిత్స పొందుతున్న మహిళ మృతి పాల్వంచరూరల్: భర్తతో గొడవపడి పురుగులమందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మండలంలోని నాగారంకాలనీకి చెందిన, నవభారత్ కంపెనీలో క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న తేజావత్ లాల్బాబు భార్య కల్యాణి (26) తన భర్త పనికి రావడం లేదని ఈ నెల 8వ తేదీన పురుగులమందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి తండ్రి భీముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. గ్రామపంచాయతీ ఈఓపై దాడికి యత్నం ముగ్గురిపై కేసు నమోదు భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాస్పై మంగళవారం ఓ మాంసం వ్యాపారి దాడికి యత్నిచాడు. చర్ల రోడ్డులో గల హోండా బైక్ షోరూం ఎదుట ఉన్న ఓ మాంసం దుకాణం కింద ఉన్న డ్రెయినేజీలో పూడికతీత కోసం సిబ్బంది ప్రయత్నించగా సదరు దుకాణం వ్యాపారి అడ్డుకున్నాడు. ఇదే విషయంపై ఈఓ శ్రీనివాస్ సదరు దుకాణం నిర్వాహకుడిని అడిగేందుకు వెళ్లగా ఒక్కసారిగా కుర్చితో దాడికి యత్నించాడు. మరో వ్యక్తి అక్కడే ఉన్న కర్ర మొద్దులను ఈఓపైకి విసిరేశాడు. పూడికతీతకు వచ్చిన పొక్లెయిన్పై దాడికి చేయగా, అద్దం పగిలింది. దీంతో ఈఓ శ్రీనివాస్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గ్రావెల్ తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు మణుగూరురూరల్: మండలంలోని సాంబాయిగూడెం గ్రామంలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు చేపట్టి లారీలు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. మంగళవారం గ్రావెల్ను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు నిలిపి వేసి ఆందోళన చేపట్టారు. లారీలు, ట్రాక్టర్లతో తోలకాలు చేపడుతుండడంతో రోడ్లు పాడైపోయి దుమ్ము, ధూళి ఎగిసిపడి ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా పర్యావరణానికి నష్టం కూడా వాటిల్లుతోందన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలు, తోలకాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. కలప పట్టివేత దుమ్ముగూడెం: మండలంలోని జిన్నెలగూడెం – చింతగుప్ప గ్రామాల మధ్య నిల్వ చేసిన 15 టేకు దిమ్మెలను రేంజర్ కమల ఆధ్వర్యంలో మంగళవారం పట్టుకున్నారు. వాటిని రేంజ్ కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు మట్టి ట్రాక్టర్ల పట్టివేత జూలూరుపాడు: అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. జూలూరుపాడు ప్రభుత్వ స్థలంలో తవ్విన మట్టిని రెండు ట్రాక్టర్లలో తరలిస్తుండగా స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వాటిని పోలీస్స్టేషన్కు తరలించి, ఇద్దరు డ్రైవర్లు పాపకొల్లుకు చెందిన అశోక్, జూలూరుపాడుకు చెందిన ప్రవీణ్ను అదుపులోకి తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. మట్టి ట్రాక్టర్లను తహసీల్దార్కు అప్పగించనున్నట్లు ఎస్ఐ రవి వెల్లడించారు. -
ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా దమ్మపేట వాసి
దమ్మపేట: ఏపీలోని అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు దమ్మపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పసుమర్తి మల్లికార్జునరావును నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సలహాదారుడుగా నియమిస్తూ మంగళవారం జీఓ జారీ చేసింది. మల్లికార్జునరావు గతంలో ఏపీలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఘనంగా అర్చక సంఘం ఆత్మీయ సమ్మేళనం పాల్వంచ: పట్టణంలోని అల్లూరి సెంటర్ వరలక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా ధూప, దీప, నివేదన ఆత్మీయ అర్చక సంఘం సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నావరుజుల ప్రసాద్శర్మ, అధికార ప్రతినిధి మరింగంటి భార్గవాచార్యులు ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులు పురాణం కిరణ్కుమార్శర్మ, ప్రధాన కార్యదర్శి పాడికంటి సంతోష్కుమార్, కోశాధికారిగా కౌత ప్రసాద్శాస్త్రి, కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పంచాంగ ఆవిష్కరణ చేయించి ఐడీ కార్డులు ఆవిష్కరించారు. పాస్టర్కు గిన్నిస్బుక్లో స్థానం పాల్వంచ: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పాల్వంచ వాసి, కాంట్రాక్టర్స్ కాలనీ ఇండియన్ పెంతికోస్త్ చర్చి పాస్టర్ మర్రి ఏసుదాసు స్థానం పొందారు. ఇటీవల హైదరాబాద్ మణికొండలో న్యూలైఫ్ చర్చ్లో జరిగిన, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన సరళీ స్వరాలు కీబోర్డ్ ప్లే చేసినందుకు స్థానం పొందారు. నిర్వాహకులు ఆగస్టీన్ దండింగి వేణుగోపాల్ చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. మంగళవారం పలువురు ఏసుదాసును అభినందించారు. వేసవిలో దాహం తీర్చే చలివేంద్రం టేకులపల్లి: వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని అన్నదానం తర్వాత జలదానం అనేది గొప్ప కార్యమని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.మహేందర్ అన్నారు. మంగళవారం పిండిపోలు రామయ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మనపల్లిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ రంగస్వామి, సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు, బొమ్మనపల్లి సబ్స్టేషన్ ఏఈ పిండిపోలు బుజ్జికన్నయ్య, ఏడీఈ హేమచంద్రబాబు, దేవ్సింగ్, నాగుల్మీరా, చరణ్, షకీల్, వసీం, యాకూబ్, శ్రీనివాసాచారి పాల్గొన్నారు. కేసు నమోదు ములకలపల్లి: చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మంగళవారం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్హెచ్ఓ ప్రకాష్రావు కథనం మేరకు.. చాపరాలపల్లి గ్రామానికి చెందిన అర్జున్రావు తన ఇంటి ఆవరణలో పశువుల షెడ్డు నిర్మించుకొంటుండగా అదే గ్రామానికి చెందిన బాణోతు బాలాజీ దుర్భాషలాడాడు. అనంతరం ఇంటి ప్రహరీని బద్ధలు కొడతామని, ట్రాక్టర్ ఎక్కించి చంపుతామని బెదిరించారు. అర్జున్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య నేలకొండపల్లి: తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని నాచేపల్లికి చెందిన నల్లగొండ యశ్వంత్(18) ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఆతర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నట్లు తెలియగా, వారు మందలించారు. దీంతో బౌద్ధక్షేత్రం వద్ద ఓ వెంచర్లో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించగా.. తండ్రి రాంబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నాసిరకం విత్తనం..రైతు పతనం..
రైతులను నిండా ముంచిన మొక్కజొన్న ● నాణ్యత లేని విత్తనాలతో బెండు కంకులు ● లబోదిబోమంటున్న రైతులు ● ముఖం చాటేస్తున్న విత్తన కంపెనీ డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు జూలూరుపాడు: పలు కంపెనీలకు చెందిన ఆడ, మగ మొక్కజొన్న విత్తనాలు రైతులను నిండా ముంచాయి. మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆడ, మగ మొక్కజొన్న పంటను సుమారు 1000 ఎకరాల్లో సాగు చేయగా.. వినోభానగర్లో 400 ఎకరాల్లో పంట వేశారు. విత్తనాలు వేసే సమయంలో వివిధ కంపెనీల డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లు రైతులకు మాయమాటలు చెప్పి పంటను కొనుగోలు చేస్తామని, పంట పండకపోతే పరిహారంగా రూ.75,000 నుంచి రూ.80 వేలు ఇస్తామని, పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.20,000ల నుంచి రూ.30,000 నగదు ఇవ్వడం, ఎకరానికి 3.5 – 4 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, మెట్రిక్ టన్నుకు రూ.33,000 నుంచి రూ.35,000 ఇస్తామని, ఎకరానికి రూ.లక్ష లాభం వస్తుందని నమ్మబలికారు. 90 – 100 రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశపడిన రైతులు ఆడ, మగ మొక్కజొన్న పంటను సాగు చేశారు. కంపెనీల ప్రతినిధులు కొందిరికి ఒప్పంద పత్రాలు ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకుండా దాటవేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా కంపెనీ వారు ఇచ్చిన నగదుకు సంబంధించి ఖాళీ ప్రామిసరీ నోట్పై సంతకాలు తీసుకున్నారు. మూడు నెలల్లో ఏపుగా పెరిగిన మొక్కజొన్న మొక్కలకు విత్తనాలు లేని బెండు కంకులు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వినోభానగర్లో సుమారు 150 ఎకరాల్లో పంట దెబ్బతినడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే తమకు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఫోన్ కూడా ఎత్తడం లేదని, గట్టిగా నిలదీస్తే ఏమైనా చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. తాము సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు సంబంధిత కంపెనీలకు చెందిన డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్ల వద్ద ఉండటం ఆందోళన కల్గిస్తోందని రైతులు వాపోతున్నారు. సంబంధిత మొక్కజొన్న కంపెనీలపై వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆడ, మగ మొక్కజొన్న పంటలను పరిశీలించి, న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఖాళీ ప్రామిసరీ నోట్పై సంతకం పెట్టా.. ఓ విత్తన కంపెనీ వారు ఆడ, మగ మొక్కజొన్న పంట సాగుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.20 వేలు చొప్పు న 5.5 ఎకరాలకు డబ్బులు ఇచ్చారు. నగదు ఇచ్చిన తరువాత ఖాళీ ప్రాంసరీ నోట్పై సంతకం పెట్టి కంపెనీ ఆర్గనైజర్కు ఇచ్చాను. కంపెనీ ఆర్గనైజర్ చెప్పిన మాయమాటలు విని పత్తి పంటను తొలగించి ఆడ, మగ మొక్కజ్నొ పంట సాగుచేస్తే విత్తనాలు లేని బెండు కంకులు రావడంతో తీవ్రంగా నష్టపోయాను. –గంగావత్ లక్ష్మణ్, రైతు వినోభానగర్ పరిహారం ఇస్తామని చెప్పారు.. ఆడ, మగ మొక్కజొన్న పంట పండకపోతే నష్ట పరిహారంగా ఎకరానికి రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. కంపెనీ డీలర్లు, ఆర్గనైజర్లు, ఏజెంట్లకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. పలుమార్లు ఫోన్ చేస్తే గానీ లిఫ్ట్ చేస్తున్నారు. కానీ, నష్ట పరిహారం గురించి మాట్లాడటం లేదు. ఈ అంశంపై వ్యవసాయశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాం. విత్తన కంపెనీలపై ఇప్పటికై నా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి. –భూక్యా బాలు, రైతు, వినోభానగర్ అధిక దిగుబడి వస్తుందని నమ్మించారు.. ఓ కంపెనీకి చెందిన విత్తనాలు వేస్తే బెండు కంకులు రావడంతో తీవ్ర నష్టం వచ్చింది. 40 శాతం పండి 60 శాతం పండకపోతే ఎకరానికి రూ.80 వేలు ఇస్తామని చెప్పారు. విత్తనకంపెనీ వారు నాణ్యతలేని విత్తనాలు ఇచ్చి మోసం చేశారు. బాండు పేపర్ రాసి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. పంట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.20 వేలు ముందుగా ఇచ్చి ఖాళీ ప్రాంసరీ నోట్పై సంతకం పెట్టించుకొని తీసుకున్నారు. ఇప్పుడు ప్రాంసరీ నోట్ అడిగితే ఇవ్వడం లేదు. –భూక్యా రాంబాబు, రైతు, వినోభానగర్ టేకులపల్లిలో.. టేకులపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ఓ విత్తన కంపెనీ ప్రతినిధులు ఆడ, మగ మొక్కజొన్న విత్తనోత్పత్తి కోసం రైతులకు సాగు ఖర్చులు ఇచ్చి పంట పండిన తరువాత కొనుగోలు చేస్తామని రైతులతో ఒప్పందం చేసుకున్నారు. మంగళితండాకు చెందిన ఆంగోతు సేవ్యా 10 ఎకరాలు, తేజావత్ పూల్సింగ్ ఎకరం, దారావత్ నాగ రెండున్నర, తేజావత్ దళ్సింగ్ 3, లాకావత్ రాజు 2, లాకావత్ రాజేశ్ ఒకటి, రెడ్డి 3, శంకర్ 3, గుగులోత్ రాంజీ ఒకటి, కోటేశ్వర్రావు 2, మోతీలాల్ 7, నారాయణ 2, భూక్య రాములు 2, భూక్య దశరథ్ 7.. చుక్కాలబోడు, గోలియాతండా తదితర గ్రామాలకు చెందిన సుమారు వందకుపైగా రైతులు 1,500కు పైగా ఎకరాల్లో ఆడ, మగ మొక్కజొన్న సాగు చేశారు. పంట దెబ్బతింటే ఎకరానికి రూ.70 వేలు, పండితే క్వింటాకి రూ.2,600 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు. ఒప్పందం ప్రకారం ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో సాగు ఖర్చు కోసం రూ.20 వేలు వేసింది. రైతులు సాగు చేశారు. మూడు నెలల్లో రావాల్సిన పంట నాలుగు నెలలు పట్టిందని, అది కూడా కంకి పూత, కాత సరిగా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు పంటను కోసి సిద్ధంగా ఉంచారని కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేస్తే రావడం లేదని, స్పందించడం లేదని వాపోయారు. నమ్మించి ఆశ పెట్టి తీరా పంట పాడైతే కంపెనీ ప్రతినిధులు స్పందించడం లేదని, ఇప్పటికే వేల రూపాయలు, శ్రమ పోయిందని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. -
సుముహూర్తాలు వచ్చేశాయ్..
● ఏప్రిల్లో బలమైన ముహూర్తాలు ● నేటి నుంచి 30 వరకు పెళ్లిళ్ల సీజన్ ● వివాహాలతో కళకళలాడనున్న మండపాలు భద్రాచలంఅర్బన్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన, మహోన్నతమైన ఘట్టం. నూతన వధూవరులు నూరేళ్లు కలిసి జీవించాలంటే ముహూర్త బలం ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారికి ఈ నెలలో సుముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో ఒకటి, రెండూ, మూడూ లేదా నాలుగైదు ముహూర్తాలు ఉంటాయి. కానీ, ఏప్రిల్లో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ రాలేదు. ఏప్రిల్లో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఏప్రిల్లో 13వ తేదీ నాటికి మూఢాలు వెళ్లిపోతాయి. సూర్యుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏప్రిల్లో 13 తేదీ వరకు అంటే దాదాపు సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. కానీ, ఆ తర్వాత మరో సగం రోజుల్లో అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ ప్రత్యేకం ఏప్రిల్లో మొత్తం తొమ్మిది ముహూర్తాలు ఉన్నాయి. ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే చాలా అంశాలను పరిశీలించాలి. జాతకాలు, గ్రహస్థితి, తారాబలం, వధూవరుల గణన, రాశిఫలం ఇలా ఎన్నో అంశాలు కలిస్తేనే ఒక మంచి పెళ్లి ముహూర్తం సెట్ అవుతుంది. మీ ఇంట్లో పెళ్లి వేడుక చేయాలనుకుంటే ఏప్పిల్లో మంచి ముహూర్తం కుదురుతుందంటున్నారు. ఈ ముహూర్తాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సెట్ అవుతుందని పండితులు చెబుతున్నారు. మార్చి 30 ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం, బహుళ పక్షం పాఢ్యమి తిథి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. వారి జాతక రీత్యా ఏఏ నక్షత్రానికి మంచి ముహూర్తం ఉందో తెలుసుకుని ముహూర్తాలు నిర్ణయించుకోవచ్చని పండితులు పేర్కొంటున్నారు. మంచి తరుణం పెళ్లిళ్లు చేసుకునేందుకు విశ్వావసు నామ సంవత్సరం ఏప్రిల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. వారి వారి జాతకాల రీత్యా సరిపడా ముహూర్తాలు పెట్టుకోవచ్చు. పెళ్లి ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి తరుణం. –విశ్వనాథశర్మ, అర్చకులు, భద్రాచలం -
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
దుమ్ముగూడెం: మండలంలోని సీతానగరం, పెద్దనల్లబల్లి, ములకపాడు గ్రామాల్లో మావోయిస్టు పార్టీ కి వ్యతిరేకంగా ఆదివాసీ యువజన సంఘం పేరిట మంగళవారం వాల్పోస్టర్లు వెలిశాయి. అందులో మావోయిస్టుల్లారా! నిత్యం ఆదివాసీలపై ఆధారపడి బతికే మీకు.. అడవులే ఆధారంగా జీవనోపాధి పొందుతున్న ఆదివాసీలను అడవుల్లోకి రావొద్దని చెప్పే అధికారం ఎవరిచ్చారు?.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను నియంత్రించే అధికారం మీకెక్కడిది?.. మీరు అమర్చిన మందుపాతరల వల్ల ఇప్పటికే చాలామంది అమాయక ఆదివాసులు చనిపోయారు.. ఎందరో శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు.. ఇన్ఫార్మర్ల నెపంతో దారుణ హత్యలు చేస్తున్నారు.. ఇలాంటి దుశ్చర్యలు ఆపకపోతే పోరాటం చేస్తామని పోస్టర్లలో ఉంది. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన
కొత్తగూడెంటౌన్: తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తూ ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం జరిగే వరకు కదలనని భీష్మించింది. బాధితురాలు కొర్రా నిరోష మాట్లాడుతూ.. సూజాతనగర్ మండలం సర్వారం నందతండాకు చెందిన తన భర్త కానిస్టేబుల్ అని, తమ మధ్య గొడవలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో మరో మహిళతో కావాలని తనపై ఏప్రిల్ 11న అక్రమ కేసు పెట్టించారని, తన భర్త డిపార్ట్మెంట్లో పనిచేస్తుండటంతో తనకు పోలీసులు మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించింది. ఈ విషయమై టూటౌన్ సీఐ రమేశ్కుమార్ను వివరణ కోరగా ఏప్రిల్ 11వ తేదీన రామవరానికి చెందిన మహిళ తనను కొర్ర నీరజ కొట్టిందని కేసు పెట్టిందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందన్నారు. అక్రమంగా కేసు పెట్టారంటూ ఆరోపణ -
రోడ్డు ప్రమాదంలో కార్మిక నాయకుడి మృతి
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మిక నాయకుడు సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సింగరేణి మాజీ ఉద్యోగి, టీబీజీకేఎస్ నాయకుడు, కాంట్రాక్ట్ కార్మిక పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ (58) కొత్తగూడెం నుంచి గౌతంపూర్లోని తన ఇంటికి బైక్పై వెళ్తున్నాడు. అదే సమయంలో మరో ద్విచక్రవాహనంపై కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు ఇద్దరు యువకులు వెళ్తున్నారు. ఈ క్రమంలో ధన్బాద్ పోచమ్మ గుడి వద్ద రోడ్ క్రాస్ చేస్తుండగా ఢీకొట్టారు. దీంతో శంకర్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 ద్వారా సింగరేణి ప్రధానాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా శంకర్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడిగా కార్మిక సమస్యల పరిష్కారానికి, ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు అనేక పోరాటాలు చేశారు. మృతిపట్ల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతోపాటు ఎండీ రజాక్ తదితరులు సంతాపం తెలిపారు. -
బడుగు వర్గాల ఆశాజ్యోతి.. అంబేడ్కర్
సూపర్బజార్(కొత్తగూడెం): అంటరానితనంతో ఎదురైన అవమానాలనే ఆయుధాలుగా మలుచుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని పోస్టాఫీస్ సెంటర్లో సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్రాజుతో కలిసి పాల్గొన్న కలెక్టర్.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. జయంతి రోజునే కాకుండా ప్రతి రోజూ ఆ మహనీయుడిని స్మరించుకోవాలని, అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించడానికి అవసరమైన అన్ని హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చారని చెప్పారు. అంబేద్కర్ ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరి వాడని అన్నారు. ఆయన సిద్ధాంతాలను నేటి తరా ల వారు తెలుసుకోవాలని సూచించారు. సామాజిక రుగ్మతలు అనుభవించి భావితరాల భవిష్యత్కు రుగ్మతలు అడ్డుకారాదని హక్కులు కల్పించారని అన్నారు. అంబేడ్కర్ వంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో జన్మించడం అందరికీ గర్వకారణమని అన్నారు. ఎస్పీ రోహిత్రాజు మాట్లాడుతూ.. యువతలో ఉన్న శక్తిని సమాజోద్ధరణకు ఉపయోగించడమే అంబేడ్కర్కు నిజమైన నివాళి అన్నారు. ఆయనకు ప్రతీ కుటుంబంలోనూ ఓ అభిమాని ఉండాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, సూపరింటెండెంట్ హనుమంతరావు, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, ఉత్సవ కమిటీ కన్వీనర్ మారపాక రమేష్, కో కన్వీనర్లు కొప్పరి నవతన్ కుమార్, వేమూరి లక్ష్మీబాయి, సంభారపు నాగేందర్, కనుకుంట్ల నిర్మల, ఎం.లక్ష్మీబాయి, భార్గవి, కూరపాటి రవీందర్, బి.పుష్పలత, కుమారస్వామి, కరిసె రత్నకుమారి, ఆర్.మాధవి, జి.కల్పన, ఎం.సాయిసుధీర్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ నివాళి -
అకాల వర్షంతో పంట నష్టం
దుమ్ముగూడెం : మండలంలోని రామారావుపేటలో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. గ్రామంలో సుమారు 60 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వడగాళ్ల వానకు మిగతా గ్రామాల్లో కూడా పంటనష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గింజలు రాలిపోయాయని పేర్కొన్నారు. గాలి దుమారంతో ఇళ్లపై రేకులు లేచిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, తాగేందుకు నీళ్లు లేక చేతి బోరు దగ్గర నుంచి నీళ్లను తెచ్చుకున్నామని గ్రామస్తులు తెలిపారు. చెట్టు విరిగిపడి పంచాయతీ ట్రాక్టర్ కూడా ధ్వంసమైంది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. గాలిదుమారంతో రాలిన మామిడిచండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లిలో గాలిదుమారం, వడగళ్ల వానతో మామిడి పంట దెబ్బతిన్నది. ఆదివారం రాత్రి వడగళ్ల వర్షం కురియడంతో తోటలోల మామిడికాయలు రాలిపోయాయి. దీంతో పలువురు రైతులు నష్టపోయారు. -
ఆస్పత్రుల్లో అంబులెన్స్లేవి..?
● ఏరియా ఆస్పత్రుల నుంచి బాధితుల తరలింపునకు ఇక్కట్లు ● మండల కేంద్రాల్లో ఉండే 108 వాహనాలపైనే ఆధారం ● అవి గ్రామాలకు వెళ్తుండటంతో సకాలంలో అందని వైద్యంఇల్లెందు: జిల్లా వ్యాప్తంగా ఏరియా ఆస్పత్రులకు అంబులెన్స్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మండలానికో 108 వాహనం ఉందని, వాటినే వినియోగించుకోవచ్చనే భావనతో ఆస్పత్రుల అంబులెన్సులను తొలగించారు. వాటి డ్రైవర్లను ఇతర అవసరాలకు ఉపయోగించుకున్నారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ పరిధిలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, భధ్రాచలం, అశ్వారావుపేట, చర్ల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ఆస్పత్రికీ అంబులెన్సు సౌకర్యంలేదు. గత పదేళ్ల కాలంగా ఉన్న అంబులెన్సులు కూడా తొలగించారు. ఆయా ఆస్పత్రుల నుంచి అత్యవసర వైద్యం కోసం ఖమ్మం, వరంగల్ వంటి ఆస్పత్రులకు తరలించాలంటే 108 వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రమాద, అనారోగ్య బాధితుల కోసం అవి గ్రామాలకు వెళ్తుండటంతో సకాలంలో ఏరియా ఆస్పత్రులకు రావడంలేదు. దీంతో ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా రోగులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రాణాలు కోల్పోతున్నారు.. జిల్లా కేంద్ర ప్రధానాస్పత్రి, ఏరియా ఆస్పత్రితోపాటు జిల్లాలో జిల్లాలో 29 పీహెచ్సీలు, 10 యూపీహెచ్సీలు, 376 సబ్ సెంటర్లు ఉన్నాయి. పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి ఏరియా ఆస్పత్రులకు రిఫరల్ పేషెంట్లు వస్తుంటారు. వారికి ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు కొత్తగూడెం, ఖమ్మం తరలించాల్సి ఉంటుంది. 108 వాహనాలు సమయానికి రాకపోవడంతో వైద్యసేవలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. గత శనివారం రాత్రి ఇల్లెందుకు చెందిన లోథ్ కార్తీక్ సోనూ గుండెపోటుతో అనారోగ్యం పాలు కావటంతో ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక వైద్యం అందించాక డాక్టర్లు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108కు ఫోన్ చేస్తే అంబులెన్ వచ్చేసరికి గంట దాటింది. దీంతో పరిస్థితి విషమించి బాధితుడు మృతి చెందాడు. అదే ఏరియా ఆస్పత్రికి అనుసంధానంగా అంబులెన్స్ ఉంటే రోగిని సకాలంలో తరలించి ఉన్నత వైద్యం అందించిన ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండేది. ప్రైవేటు అంబులెన్స్ల్లో తరలించాలంటే బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ఇల్లెందు నుంచి ఖమ్మానికి తరలిస్తే సుమారు రూ. 4 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు అందుబాటులో లేక, ప్రైవేటు వాహనాలకు ఖర్చు పెట్టలేక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. ఇల్లెందు, మణుగూరు, చర్లలో తప్పనిసరిగా అంబులెన్స్లు కావాలని కలెక్టర్ దృష్టికి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏరియా ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రికి కనీసం 40 నుంచి 60 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఆస్పత్రులకు అంబులెన్స్లు ఉంటే సకాలంలో వైద్యం అందించవచ్చు. సీఎస్ఆర్ ఫండ్తో మంజూరు చేయాలని లేఖ కూడా అందించాం. ఎంపీ ల్యాడ్స్ నిధుల కోసం ఎంపీలకు కూడా సమస్యను వివరించాం. –డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్ఎస్ -
కుడా.. ఏదీ మండలి జాడ?
కొత్తగూడెం వ్యూఅక్టోబర్లో ఉత్తర్వులు.. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2024 అక్టోబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. కుడా ఏర్పాటుతో జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితమే కొత్తగూడెం, పాల్వంచ పూర్తి స్థాయి పట్టణాలుగా రూపాంతరం చెందాయి. అయితే గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రెండు పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. ఈ రెండు మున్సిపాటీలు వేటికవే అన్నట్టుగా ఉండడంతో సమీకృత అభివృద్ధి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు సైతం వేర్వేరుగా ఉండడంతో ప్రతీసారి రోడ్లు, డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, మరమ్మతు వంటి రొటీన్ పనులే జరుగుతున్నాయి. కార్పొరేషన్గా కొత్తగూడెం.. కొత్తగూడెం – పాల్వంచ పట్టణాలను కలుపుతూ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 2024 జూన్ 20న విజ్ఞప్తి చేశారు. దీనిపై అనేక తర్జనభర్జనల అనంతరం గత జనవరి 4న జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగూడెం కార్పొరేషన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత చట్టపరమైన అడ్డంకులు లేకుండా మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేషన్ బిల్లు ఆమోదం పొందింది. కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని నాన్ షెడ్యూల్ గ్రామాలు ఏడింటిని కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రేపో మాపో గెజిట్ కూడా జారీ కానుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో వడివడిగా అడుగులు పడుతున్నా.. కుడా పాలక మండలి విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. నిధులు తెచ్చే ‘ప్రణాళిక’.. కుడాకు పాలకమండలి ఏర్పాటైతే దాని పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక, దానికి అవసరమైన నిధులను సేకరించే పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు పట్టణాల పరిధిలో వందల ఎకరాల భూములు ఉన్నా.. అవి రెవెన్యూవా లేక అటవీ శాఖవా, షెడ్యూల్ ఏరియానా, నాన్ షెడ్యూల్లో సింగరేణి లీజుకు తీసుకున్న భూములా అనేది తేలడం లేదు. ప్రస్తుతం ఉన్న పాలనా విభాగాలు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. అయితే కుడా లాంటి చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటైతే భూముల లెక్కల్లో స్పష్టత వచ్చేందుకు ఆస్కారం ఉంది. పనులు చేపట్టేందుకు అదనంగా ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అందుబాటులోకి వస్తుంది. చట్టపరంగా నిధుల సమీకరణ, పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యమవుతుంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీలు పని చేస్తుండగా.. కుడా ద్వారా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రెండు పట్టణాల ఉమ్మడి అవసరాల ఆధారంగా సరికొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు వీలుంటుంది. పాలకులు లేని కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా ఏర్పాటుచేస్తూ గతేడాది అక్టోబర్లోనే ఉత్తర్వులు పాలక మండలిపై మాత్రం దృష్టి పెట్టని ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని జంట పట్టణాలు చివరి అంకానికి చేరిన కార్పొరేషన్ ఏర్పాటు రూపురేఖలు మారనున్నాయ్.. గత ఏడాది కాలంగా కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల దశ దిశ మార్చే అనేక అంశాలు చోటుచేసుకున్నాయి. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కొత్తగూడెంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా అప్గ్రేడ్ చేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఎక్స్లెన్స్ సెంటర్ను కొత్తగూడెంలో నెలకొల్పేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇల్లెందు – కొత్తగూడెం హైవే (ఎన్హెచ్ 930పీ) పనులు టెండర్ల దశలో ఉండగా కొత్తగూడెం – పాల్వంచకు సంయుక్తంగా బైపాస్ రోడ్డు, ఆటోనగర్, జూపార్కు తదితర ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్తగూడెం – పాల్వంచల అభివృద్ధికి సంయుక్తంగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం నెలకొంది. -
పర్యాటకుల ఆదరణ పొందాలి
● గిరిజన మ్యూజియాన్ని పరిశుభ్రంగా ఉంచాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలం : ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియం పర్యాటకుల ఆదరణ పొందేలా ఉండాలని పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఆయన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులు భారీగా తరలివస్తున్నందున మ్యూజియాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, కళాతృష్ణ ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి, వర్షాకాలాల్లో కళాఖండాలు చెడిపోకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రద్దీ పెరుగుతున్నందున టికెట్ కౌంటర్లను విడివిడిగా ఏర్పాటు చేయాలని, సందర్శకులకు గిరిజన వంటకాలు తాజాగా అందించాలని ఇన్చార్జ్ వీరస్వామిని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేయొద్దని, పర్యాటకులకు మరిచిపోని అనుభూతి కల్పించాలని అన్నారు. అంబేడ్కర్కు ఘన నివాళి.. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీఓ ఘనంగా నివాళులర్పించారు. ఐటీడీఏ యూనిట్ అధికారులతో కలిసి ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులు, మహిళలు, కార్మిక, కర్షకుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీఈ హరీష్, డీఎస్ఓ ప్రభాకర్ రావు, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏసీఎంఓ రమణయ్య, జీసీడిఓ అలివేలు మంగతాయారు, మేనేజర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్చరీ డెవలప్మెంట్ కమిటీలో స్థానం
ఖమ్మం స్పోర్ట్స్: ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ద్వారా దేశవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రాచుర్యం తీసుకురావడం, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేలా ఎనిమిది మందితో కూడిన డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి, ఒలింపిక్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పుట్టా శంకరయ్యకు స్థానం దక్కింది. తెలంగాణ నుంచి ఈయనకు మాత్రమే సభ్యుడిగా స్థానం దక్కగా, కమిటీ చైర్మన్గా ఏఏఐ ఉపాధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ, కన్వీనర్గా సుమంత చంద్ర మహంతి వ్యవహరిస్తారు. సభ్యులుగా శంకరయ్యతో పాటు జంయాంగ్ థ్సెరింగ్ నంజ్యాల్(లఢాఖ్), కె.దేవానంద సింగ్(మణిపూర్)తో పాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు సంజీవ్ సింగ్, పూర్ణిమ మహతో, జివాంజొత్ సింగ్ తేజ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా తీర్చిదిద్దిన శంకరయ్య.. తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. విలువిద్యలో సహజసిద్ధమైన ప్రతిభ కలిగి ఉండే గిరిజన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా కృషి చేశారు. కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్కు వ్యాయామ ఉపాధ్యాయులుగానే కాక భద్రాచలం ఐటీడీఏ క్రీడాధికారిగానూ పనిచేశారు.సభ్యుడిగా పుట్టా శంకరయ్యకు అవకాశ ం -
పత్తి రైతుపై విత్తన పోటు..
● ఈ ఏడాది ఒక్కో ప్యాకెట్పై రూ. 37 పెంపు ● ఆరేళ్లుగా ఏటా పెరుగుతున్న విత్తన ధరలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న దూది రైతులు బూర్గంపాడు: పత్తి రైతుపై ఈ ఏడాది కూడా విత్తన భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో పత్తి విత్తనాల ధరలను పెంచుతూ విత్తన కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 475 గ్రాముల ప్యాకెట్పై ధర రూ.37 పెంచాయి. దీంతో ప్యాకెట్ రేటు రూ.901కు చేరింది. ఆరేళ్లుగా పత్తి విత్తనాల ధరలు ఏటా పెరుగుతున్నాయి. ఈసారి పెరిగిన ధరలతో జిల్లాలోని రైతులపై రూ.2.05 కోట్ల అదనపు భారం పడనుంది. 2.20 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంటగా పత్తికి మొదటిస్థానం దక్కింది. ఎకరం సాగుకు 2 నుంచి 3 ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తుండగా, చాలామంది రైతులు ఆ పద్ధతిలోనే పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎకరాకు 3 నుంచి 4 విత్తన ప్యాకెట్లు అవసరమవుతున్నాయి. విత్తనాలు వేశాక వర్షాలు సరిగా కురకవపోతే మళ్లీ తిరిగి విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో సుమారు 5 లక్షల విత్తనాల ప్యాకెట్లు ప్రతి ఏటా అవసరముంటున్నాయి. వివిధ కంపెనీల పత్తి విత్తనాలను ఆయా డీలర్ల వద్ద కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఒక్కోసారి కొన్ని కంపెనీల విత్తనాలకు ఉన్న డిమాండ్ను బట్టి రెట్టింపు ధరలకు కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితులు రైతులపై మరింత భారం మోపుతున్నాయి. ఐదేళ్లలో రూ.171 పెంపు గడిచిన కొన్నేళ్లుగా పత్తి విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. 2020–21లో ప్యాకెట్ ధర రూ.730 ఉండేది. 2021–22కు రూ.767కు చేరింది. 2022–23లో అది రూ.810కి పెరిగింది. 2023–24లో రూ.853కు, 2024–25లో రూ.864కు చేరింది. ఈ ఏడాది 2025–26లో ప్యాకెట్ ధర.901కు పెరిగింది. ఐదేళ్ల వ్యవధిలో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.171 మేర పెరిగింది. విత్తన ధరలతోపాటు ఎరువులు, పురుగుమందులు, కూలీల రేట్లు ఏటా పెరుగుతుండటంతో పత్తి రైతులపై పెట్టుబడి భారం పెరుగుతోంది. పెరుగుతున్న పెట్టుబడి అనుగుణంగా పత్తి ధరలు పెరగకపోవటం రైతులకు నష్టం కలిగిస్తోంది. గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో పత్తికి మద్దతు ధర దక్కలేదు. దీంతో సీసీఐ రంగంలోకి రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. రైతుల ఆగ్రహం పత్తి విత్తనాల ధరల పెంపుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ప్రభుత్వం విత్తనాల ధరలను పెంచేందుకు అనుమతినివ్వటం తమపై భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు రాయితీలు ఇవ్వకుండా.. ప్రభుత్వాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలను పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వటం సరికాదని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఆరేళ్లలో విత్తన ధరలు పెరిగిన తీరు(రూ.లలో) ఏడాది ధర పెరిగినది 2020-21 730 --- 2021-22 767 37 2022-23 810 43 2023-24 853 43 2024-25 864 11 2025-26 901 37 -
ఓపెన్ బెంచ్ ప్రెస్ పోటీల్లో ప్రతిభ
మణుగూరు టౌన్: ఖమ్మంలో ఆదివారం జరిగిన రెండుజిల్లాల స్థాయి ఓపెన్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో మణుగూరు యువకుడు పర్శిక పాండురాజు ప్రతిభ చూపాడు. గోల్డ్మెడల్ కై వసం చేసుకున్నాడు. ఈ మేరకు జిమ్ ట్రైనర్ నాగరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. పాండురాజు గతంలో కూడా రెండు బంగారు పతకాలు సాధించాడని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన తల్లాడ/ముదిగొండ: పదిహేను రోజుల క్రితం ధాన్యం కోతలు పూర్తిచేసి కల్లాల్లో ఆరబెట్టినా కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు సోమవారం ఖాళీ పురుగు మందుల డబ్బాలతో నిరసన తెలిపారు. తల్లాడ మండలంలోని కిష్టాపురంలో ధాన్యం సిద్ధం చేసినా గన్నీ సంచులు ఇవ్వడం లేదని, వర్షానికి నష్టపోయే ప్రమాదముందని వారు వాపోయారు. అధికారుల తీరు మారకపోతే ఆత్మహత్య చేసుకుంటామని వెల్లడించగా.. అధికారులు తేమ శాతం తగ్గగానే కాంటా వేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే, ముదిగొండ మండలం గోకినేపల్లి రైతులు ఖమ్మం–కోదాడ రహదారిపై ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి మూడు రోజులైనా కాంటా వేయకపోవడంతో అకాల వర్షానికి నష్టపోయామని తెలిపారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల ఆవిష్కరణకూసుమంచి/రఘునాథపాలెం: కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జై భీమ్ బహుజన సంఘం ఆధ్వర్యాన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్రామ్ కాంస్య విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాలను సోమవారం రాజుపేట గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్, జగ్జీవన్రామ్ త్యాగనిరతి, దేశానికి వారు అందించిన సేవలను కొనియాడారు. అలాగే, రఘునాథపా మండలం మంచుకొండలో అంబేడ్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అవిష్కరించారు. ఈకార్యక్రమంలో గుత్తా రవి, భూక్యా లక్ష్మణ్నాయక్, అజ్మీరా వీరునాయక్, మందా సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. తల్లి మందలించిందని ఆత్మహత్య మధిర: వంట పని నేర్చుకోకపోతే ఎలా అని తల్లి మందలించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధిర శ్రీనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. మధిరలోని కోల్డ్స్టోరేజీలో పనిచేసి యాదగిరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఈక్షిత(24) వివాహం జరగగా ఆమె కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఈనెల 16న ఈక్షిత కుమారుడికి అన్నప్రాసన ఉండడంతో వంట పని నేర్చుకోవాలని ఆమె తల్లి మందలించింది. దీంతో క్షణికావేశంలో గదిలోకి వెళ్లిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఏదో పనిపై వెళ్లి ఉంటుందని భావించిన కుటుంబీకులు కాసేపటికి చూడగా తలుపు గడియ వేసినట్లు గమనించారు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే ఈక్షిత మృతి చెందింది. వడదెబ్బతో మేకల కాపరి మృతిఇల్లెందురూరల్ : మండలంలోని బోయితండా గ్రామపంచాయతీ లక్ష్మీనారాయణతండాకు చెందిన మేకల కాపరి బానోత్ హేమ్లా (55) వడదెబ్బతో సోమవారం మృతి చెందాడు. మేకలను మేపేందుకు సోమవారం ఉదయం అడవికి వెళ్లిన హేమ్లా మధ్యాహ్నం ఇంటికి వచ్చాక సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. హేమ్లాకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలికొత్తగూడెంటౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతీ ఒక్కరు ఆప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాల వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అఽధికారి పి.పుల్యయ్య తదితరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి సింగరేణి గనుల్లో నీరు చేరింది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో వరద నీరు నిలవడంతో సోమవారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కిష్టారం ఓపెన్కాస్ట్లో 5వేల టన్నులు, జేవీఆర్ ఓసీలో 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. -
19 తులాల బంగారం రికవరీ
ఇల్లెందు: పోలీసులు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, సొత్తు రికవరీ చేశారు. సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్.చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. పట్టణంలోని సివిల్ లైన్ సత్యనారాయణపురం వెళ్లే రోడ్లో ఉన్న బి.కుమారస్వామి ఇంట్లో ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగింది. 19 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 5 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మూడు పోలీసు బృందాలు నిందితుడికి కోసం గాలింపు చేపట్టాయి. సోమవారం పట్టణంలో బుగ్గవాగు సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువకుడు తారసపడ్డాడు. పోలీసులను గమనించి పారిపోతుండగా పట్టుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. హైదరాబాద్లోని ఉప్పుగూడు ప్రాంతానికి చెందిన రాజ్పుత్ కోరీ రాహుల్ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి సొత్తు రికవరీ చేశారు. అతనిపై గతంలో హైదరాబాద్లోని పలు స్టేషన్లతోపాటు ఇల్లెందు, కొత్తగూడెం టూ టౌన్ ప్రాంతాల్లో ఆరు చోరీ కేసులు ఉన్నాయి. సత్వరమే కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు డీఎస్పీ రివార్డు అందజేశారు. సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు పఠాన్ నాగుల్ మీరా ఖాన్ పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ -
శిశుగృహకు కవల ఆడపిల్లలు
చింతకాని: కవల ఆడ శిశువుల అదృశ్యంపై ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. దత్తత తీసుకున్న వారి నుంచి ఐసీడీఎస్, చైల్డ్లైన్ అధికారులు శిశువులను చేరదీసి ఖమ్మంలోని శిశుగృహకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వే కాలనీకి చెందిన నల్లగాజు మల్లేశ్–ఉమ దంపతులకు గతంలో ఇద్దరు ఆడపిల్లలు ఉండగా గత నెల 31న ఉమ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో వారిని పోసించడం భారంగా భావించిన మల్లేశ్.. ఆస్పత్రిలోనే వేర్వేరు కుటుంబాల వారిని దత్తత ఇచ్చాడు. అయితే, శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేందుకు వారి ఇంటికి వెళ్లిన ఆశ కార్యకర్త, అంగన్వాడీ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించగా ఈనెల 11న అధికారులు మల్లేష్ ఇంటికి అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. పిల్లల్ని పోషించలేని స్థితిలో తమ బంధువులకే దత్తత ఇచ్చామని మల్లేశ్ సమాధానం చెప్పాడు. కానీ నిబంధనలకు విరుద్ధంగా దత్తత ఇవ్వడంతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా సోమవారం నాటికి శిశువులను తీసుకొస్తానని లేఖ రాసి ఇచ్చాడు. ఆ కుటుంబాల నుంచి స్వాధీనం ఆడశిశువులు ఇద్దరిని పిల్లలు లేని తమ దగ్గరి బంధువులకే ఇచ్చామని మల్లేశ్ అధికారులను నమ్మించాడు. ఎట్టి పరిస్థితుల్లో వారిని రప్పించాలని సూచించిన అధికారులు విచారణ చేపట్టగా పిల్లలను ఖమ్మంలోని ఇద్దరు వేర్వేరు దంపతులకు దత్తత ఇచ్చినట్లు తేలింది. ఈక్రమాన డబ్బు చేతులు మారినట్లు ప్రచారం జరిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇక సోమవారం దత్తత తీసుకున్న వారి నుంచి శిశువులను మల్లేశ్ దంపతులు తీసుకురాగా, వారి ఇంటికి ఐసీడీఎస్, చైల్డ్లైన్ అధికారులు వెళ్లి పిల్లలను పోసిస్తారా, తమకు అప్పగిస్తారా అని ప్రశ్నిస్తే తామే పోషిస్తామని సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నందున దంపతులు పోషిస్తారనే నమ్మకం లేకపోవడంతో మల్లేశ్ దంపతులు, శిశువులను ఖమ్మంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. కమిటీ చైర్పర్సన్ కౌన్సెలింగ్ ఇచ్చాక శిశువులను శిశుగృహలో ఉంచాలని నిర్ణయించారు.దత్తత తీసుకున్న వారి నుంచి స్వాధీనం -
మరణంలోనూ వీడని బంధం
నేలకొండపల్లి: పెళ్లినాటి బాసలను ఆయన యాది మరువలేదు. చివరి వరకు పట్టిన చేయి వీడనని ఇచ్చిన మాటను ఆచరించడమే కాక మరణంలోనూ ఆమె వెంటే నడిచాడో భర్త. నేలకొండపల్లి మండలంలోని రామచంద్రాపురానికి చెందిన బూధాటి హనుమరెడ్డి(81) – యశోద(76) దంపతులు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. యశోద ఆదివారం ఇంట్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడగా తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటి నుంచి ఆందోళన చెందుతున్న హనుమరెడ్డి.. యశోద మృతి విషయం తెలియగానే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులను ఆస్పత్రికి తరలించగా గంట వ్యవధిలోనే మృతి చెందాడు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకోగా.. ఒకే ట్రాక్టర్పై మృతదేహాలను ఉంచి అంతిమయాత్ర నిర్వహించాక అంత్యక్రియలు పూర్తిచేశారు. వరకట్న వేధింపులతో ఆత్మహత్యమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడిన నవ్య మృతిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బ్రాహ్మణ బజార్కు చెందిన శ్రీపాద ఉత్తరాచారి పెద్ద కుమార్తె నవ్య(21)కు ఇల్లెందు మండలం ధర్మారం తండాకు చెందిన రవిచంద్రాచారితో గతేడాది డిసెంబర్ 26న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.50 వేల కట్నం ఇచ్చారు. కాగా, రవిచంద్రాచారి, ఆయన తల్లిదండ్రులు తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. పలుమార్లు పంచాయితీ నిర్వహించినా వారి తీరు మారలేదు. దీంతో నవ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. భార్య చనిపోయిన గంట వ్యవధిలోనే భర్త మృతి -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం శివారు సమ్మక్క గద్దెల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి తెల్లూరి ప్రసాద్, రవీందర్, బాబా ఫకృద్దీన్, జోయెల్ కారులో పాల్వంచకు బయలుదేరారు. సమ్మక్క గద్దెల వద్ద ఎదురుగా వచ్చిన లారీ నేరుగా కారును ఢీకొట్టడంతో కారులోని నలుగురు గాయపడగా.. వారిని 108 ద్వారా ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తెల్లూరి ప్రసాద్, రవీందర్కు తీవ్రంగా గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు సిఫార్సు చేశారు. బాబా ఫకృద్దీన్, జోయెల్ చేతి భాగంలో గాయాలయ్యాయి. గడ్డివామి దగ్ధం టేకులపల్లి: మంటలు చెలరేగి గడ్డివామి దగ్ధమైన ఘటన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తతండా(జీ)కు చెందిన రైతు బానోత్ కిషన్ తన పశువుల కోసం సుమారు 250 కట్టల గడ్డివామి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివామిపై నిప్పులు పడటంతో మంటలు చెలరేగి వామి మొత్తం కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం అగ్నిమాపక వాహనం వచ్చి మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా ఆర్పివేశారు. సుమారు రూ.25 వేలు నష్టం వాటిల్లిందని కిషన్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధం అశ్వారావుపేటరూరల్: గాలి దుమారంతో ఓ ఇంట్లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నాలుగు ఇళ్లు కాలిపోయిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలకోని దురదపాడు జీపీ పాలగుంపు గ్రామానికి చెందిన నల్లబెల్లి స్వప్న పూరింట్లో గాలి దుమారంతో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో గాలి దుమారం రావడంతో అదే గ్రామానికి చెందిన మడకం రాము, కొర్సా భద్రమ్మ, గీగా బాబూరావుకు చెంది పూరిళ్లకు మంటలు అంటుకొని పూర్తిగా ఆహుతయ్యాయి. ఆయా ఇళ్లలో ఉన్న ధాన్యం బస్తాలు, జీడిగింజలతోపాటు బియ్యం బస్తాలతోపాటు ఇతర సామగ్రి కాలిపోయయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు బాధితులు వాపోతున్నారు. కాగా, ఘటన జరిగిన గ్రామానికి అగ్ని మాపక వాహనం ఆలస్యంగా చేరుకుందని, దీంతో తీరని నష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. లోన్ పేరుతో డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై కేసు పాల్వంచ: ప్రైవేట్ బ్యాంక్లో లోన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీకి చెందిన భాషబోయిన అశోక్కుమార్కు వద్దని చెప్పినా వినకుండా తిప్పరపు విజయ్ అనే వ్యక్తి రూ.20 లక్షల లోన్ ఇప్పిస్తానని ఒప్పించాడు. 20 రోజుల్లో వస్తుందని, ముందస్తు రూ.3,19 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో అశోక్కుమార్ డబ్బులను గత డిసెంబర్లో ఇచ్చాడు. అయినప్పటికీ లోన్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్ఐ సుమన్ అజయ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ముదిగొండ మండలంలోని పండ్రేగిపల్లి గ్రామానికి చెందిన షేక్ సోహెల్ (25) సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లిలో బంధువుల ఇంటికి బైక్పై వెళ్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున నేలకొండపల్లిలోని ప్రభుత్వ కాలేజీ సమీపంలోకి రాగానే జాతీయ రహదారిపై మరమ్మతుల కోసం ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి.. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ యాజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య బూర్గంపాడు: లైంగిక వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మిర్యాల మమత (28)కు తొమ్మిదేళ్ల కిందట మిర్యాల అశోక్తో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల పాప ఉంది. కొన్ని నెలలుగా అదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే యువకుడు మమతను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో గొడవలు కూడా జరిగాయి. దుర్గాప్రసాద్ వేధింపులు, బెదిరింపులు ఎక్కువ కావటంతో ఆమె రెండు రోజుల కిందట ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శతాధిక వృద్ధురాలికి సన్మానం
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు పొట్ట నర్సమ్మను ఆమె కుటుంబీకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఇటీవల లక్ష్మీనర్సమ్మ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనర్సమ్మ నాలుగు తరాల కుటుంబీకులు ఆమెకు శాలువా కప్పి పూలమాలలు వేసి సత్కరించారు. జిల్లా ‘కుంగ్ఫూ’ కమిటీ ఎన్నిక కొత్తగూడెంటౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుంగ్ఫూ, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఐ.ఆదినారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఎన్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పి.కాశీహుస్సేన్, కోశాధికారిగా బి.కనకరాజు, ఉపాధ్యక్షులుగా ఎస్కే హుస్సేన్ఖాన్, కె.శ్రీనివాస్, బి.మల్లికార్జున్, ఐ.మోహన్రావు, వై.సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులుగా బి.బుచ్చయ్య, ఎం.రాజయ్య, హరిబాబు, ఎస్.సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి బి.సాగర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు లీల శ్రీనివాస్, ఎస్.సతీశ్, ఎం.దామోదర్, బాబు, వి.శ్రీకాంత్, ఎస్.రమేశ్ను ఎన్నుకున్నట్లు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. నేటి నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి అందుబాటులోకి మొదటి యూనిట్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ సేవలు మణుగూరురూరల్: మండలంలోని చిక్కుడుగుంట ప్రాంతంలోని 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)లో మొదటి యూనిట్లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ సేవలు ఆదివారం నుంచి మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. గతేడాది జూన్ 29వ తేదీన జరిగిన అగ్ని ప్రమాదంలో మొదటి యూనిట్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన విషయం విదితమే. పది నెలలుగా 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అంతరాయం ఏర్పడటంతో 2024–25 వార్షిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పవచ్చు. పది నెలల తర్వాత మరమ్మతులు పూర్తవడంతో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం బిగించారు. సోమవారం నుంచి బీటీపీఎస్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుదుత్పత్తి పూర్తిస్థాయిలో జరగనున్నట్లు బీటీపీఎస్ సీఈ బిచ్చన్న తెలిపారు. మంత్రి తుమ్మలను కలిసిన ఏపీ రైతులు దమ్మపేట: ఏపీకి చెందిన పామాయిల్ రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం మండలంలోని గండుగులపల్లి నివాసంలో మంత్రి తుమ్మలను ఏపీ పామాయిల్ రైతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి మాట్లాడారు. ఏపీలో పండిన పామాయిల్ గెలలను అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు గాను హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రంపై పిడుగుపాటు వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిడుగు పడి, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అంగన్వాడీ కేంద్రంపై పిడిగు పడటతో రికార్డులు, పిల్లల ఆట వస్తువులు, భోజన పదార్థాలు కాలి బూడిదయ్యాయి. భారీ వర్షానికి విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పాడింది. -
ఆన్లైన్ అవస్థలు..
కొత్తగూడెంఅర్బన్: నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని గత నెల ప్రారంభించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.4 లక్షల వరకు రుణం అందించనున్నారు. బ్యాంకులతో లింకేజీ అయిన రుణాలు, లింకేజీ లేకుండా మరికొన్ని రుణాలను అందించనున్నారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసేందుకు గానూ సోమవారంతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనున్నది. దీంతో దరఖాస్తులు ఇంకా చేయకుండా అర్హత ఉన్న వారు మీసేవ, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. మూడు రోజులుగా రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన సర్వర్ పూర్తిగా డౌన్ అయింది. కొన్ని సందర్భాల్లో అసలు ఓపెన్ కూడా కావడం లేదు. వివరాలన్నీ నమోదు చేసిన తరువాత సబ్మిట్ చేస్తే అప్రూవ్ రావడానికి ఒక్కో దరఖాస్తుకు గంట నుంచి రెండు గంటలు పడుతోంది. దరఖాస్తు అప్రూవ్ అయితే వివరాలకు సంబంధించి వారి సెల్కు సమాచారం వస్తుంది. అందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో దరఖాస్తుదారులంతా ఎప్పడు మెసేజ్ వస్తుందోనని మీసేవ, ఆన్లైన్ సెంటర్లలో పగలు, రాత్రి తేడా లేకుండా వేచిచూస్తున్నారు. సర్వర్ డౌన్ కావడం, ఒక్క దరఖాస్తుకు గంటల తరబడి సమయం పడుతుండటంతో ఆయా సెంటర్ల నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా చాలామంది రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఇష్టపడడం లేదు. కొన్ని సెంటర్ల వారు ఆన్లైన్ చేయడం లేదని తేల్చిచెబుతుండటంతో ఇతర సెంటర్లకు పరుగులు పెడుతున్న పరిిస్థితి ఉంది. ఒక్క దరఖాస్తు ఆన్లైన్ చేయడానికి సెంటర్ల వారు రూ.100 వసూలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మళ్లీ రాత్రి 11 గంటల తరువాత సర్వర్ వేగంగా పనిచేస్తోందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్వర్ ఇబ్బంది పెట్టడం వల్ల అర్హత కలిగిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్యాలయాల్లో ఇవ్వాల్సిందే.. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సర్వర్ డౌన్ కావడం వల్ల కొందరు సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి అడిగితే.. ఆన్లైన్ కాకపోయినా కూడా వారి దరఖాస్తులను ధ్రువపత్రాలతో కలిపి పట్టణం అయితే మున్సిపాలిటీలు, మండలం అయితే ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచిస్తున్నారు. కానీ, అధికారికంగా ప్రకటనలు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్ చేయకపోతే అసలు దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరనే అనుమానం దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతోంది. అసలు పథకంపై అవగాహన కల్పించడంలో కూడా సంబంధిత అధికారులు విఫలం చెందారని, ప్రభుత్వ లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. సర్వర్ డౌన్ కారణంగా చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, గడువును పెంచి, ఆ సమయంలో పథకంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు. ‘రాజీవ్ యువ వికాసం’దరఖాస్తుకు బారులు సర్వర్ డౌన్తో గంటల తరబడి నిరీక్షణ నేటితో ముగియనున్న గడువు జిల్లాలో వచ్చిన దరఖాస్తులు.. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. రుణాల కోసం వ్యవసాయ రంగాలకు చెందిన వారు అయితే 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు, వ్యవసాయేతర రంగాలకు చెందిన రుణాలకు అయితే 21 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అధికారులు తెలిపారు. అయితే రుణాలకు సంబంధించి ముఖ్యమైన 75 రకాల స్కీంలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే శనివారం వరకు జిల్లాలో ఎస్సీ – 9,746, బీసీ – 16,632, మైనార్టీ – 13,655 దరఖాస్తులు వచ్చినట్లు ఆయా శాఖల అధికారులు వెల్లడించారు. సోమవారం చివరి రోజు కావడంతో దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిలిపివేసిన నిత్యకల్యాణాలను ఆదివారం పునఃప్రారంభించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కాగా వరుస సెలవు దినాలు రావడంతో దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారి మూలమూర్తులను దర్శించుకున్నారు. స్వామి ఆర్జిత సేవలు, నిత్యకల్యాణంలో సైతం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంది. -
హత్యకు ప్రణాళిక.. ఐదుగురు అరెస్ట్
ఖమ్మంఅర్బన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ భర్తను హత్య చేయించేందుకు ఐదుగురు కలిసి ప్రణాళిక రచించిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు రూ.20 లక్షల సుపారీ ఇస్తానని, అందులో అడ్వాన్స్గా రూ.ఐదు లక్షలు ఇచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్టు ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) సీఐ భానుప్రకాష్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండలం సువర్ణపూరానికి చెందిన ఓ వివాహితకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలిసి దంపతుల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలో మహిళ భర్తను చంపేందుకు రామాంజనేయులు ప్రణాళిక రచించాడు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్ను సంప్రదించి హ త్య విషయమై వివరించాడు. వెంకట్ తన స్నేహి తుడు, రౌడీషీటర్ అయిన పగడాల విజయ్కుమార్ అలియాస్ చంటిని పరిచయం చేశాడు. హత్యకు రూ.20 లక్షలు సుపారీగా ఒప్పుకొని, మొదటగా రూ.ఐదు లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 12న ఖమ్మం నగరంలోని ధంసలాపురం వద్ద సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేశారు. మిగతా డబ్బు కోసం రామును సంప్రదిస్తే స్పందించకపోవడంతో ఆమె భర్తను బెదిరించి రూ.1,50,000 నగ దు, బంగారు గొలుసు తీసుకొని వదిలేశారు. కాగా, సదరు వ్యక్తి ఏప్రిల్ 11న ఖమ్మంఅర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నగర ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులు సువర్ణాపురానికి చెందిన పొక్లెయిన్ ఆపరేటర్ కొండూరి రామాంజనేయులు, దంతాల వెంకటనారాయణ (కారుడ్రైవర్, బారుగూడెం, ఖమ్మంరూరల్), పగడాల విజయ్కుమార్ (చంటి – బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), వేముల కృష్ణ (బైక్ మెకానిక్, అగ్రహారంకాలనీ, ఖమ్మం), బుర్రి విజయ్ (డెకరేషన్ వర్కర్, బృందావన్కాలనీ పువ్వాడఅజయ్నగర్, ఖమ్మం) ఆదివారం నగర శివారులోని చెరుకూరి మామిడి తోటలో సమావేశమైనట్లు తెలుసుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కత్తులు, ఒక ఎయిర్ గన్, రూ.90,000 నగదు, 5 సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు. -
మొక్కల రక్షకుడికి కన్నీటి వీడ్కోలు
ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మంరూరల్: మొక్కల రక్షకుడు.. వృక్షాల ప్రేమికుడు వనజీవికి ఆదివారం కన్నీటి వీడ్కోలు పలికారు. పద్మశ్రీ దరిపల్లి రామయ్య పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు కవులు, కళాకారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులతో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వృక్ష సంపదను పెంచేందుకు రామయ్య చేసిన సేవలను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అధికారిక లాంఛనాలతో రామయ్య అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు మొక్కలు నాటుతూ కడసారి వీడ్కోలు పలికారు. ఖమ్మంరూరల్ తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి రామయ్య పాడె మోశారు. ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ సిబ్బందితో కలిసి వైకుంఠథామంలో మొక్కలు నాటి వందనం చేశారు. మొక్కల పెంపకం, రక్షణకు రామయ్య చేపట్టిన ప్రచార కార్యక్రమాల బోర్డులను ఆయన కుటుంబ సభ్యులు ధరించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో వనజీవి అంత్యక్రియలు -
వ్యయప్రయాసలు
స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలేక..భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి దశాబ్దం కావొస్తున్నా జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకన (స్పాట్ వాల్యూయేషన్)కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో మారుమూల ఏజెన్సీ దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఎగ్జామినర్లుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే స్పాట్కు వెళ్లి విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించినా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వీడటంలేదు. ఏజెన్సీ ఉపాధ్యాయుల తిప్పలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 150 ఉపాధ్యాయులు వెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మణగూరు, చర్ల వంటి మారుమూల ప్రాంత ఉపాధ్యాయులు ఖమ్మం వెళ్లి, అక్కడ వారు ఇచ్చే అలవెన్సులతో విధులను నిర్వర్తించడం భారంగా మారుతోంది. వసతి, భోజనం తదితర ఖర్చులకు ప్రభుత్వం అందచేసే రోజువారీ వేతనం సరిపోవటం లేదని ఎగ్జామినర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో స్పాట్ సెంటర్ను ఏర్పాటు చేస్తే లాడ్జి, ఆహార ఖర్చుల ఆదాతో పాటు ఇంటి నుంచి వచ్చి వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూల్యాంకన కేంద్రానికి ప్రత్యేకంగా సెంటర్ కోడ్, అసిస్టెంట్ కమిషనర్, డెవలప్మెంట్ అధికారులు, కావాల్సిన ఇతర వసతులు ఉన్నాయి. అయినా మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన యాద్రాద్రి, సూర్యాపేట, సిరిసిల్ల వంటి జిల్లాల్లో స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారని, కానీ భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కలెక్టర్, డీఈఓ స్పందించి జిల్లాలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఖమ్మంలోనే పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం దశాబ్దం కావొస్తున్నా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయని అధికారులు అలవెన్సులు సరిపోక ఏజెన్సీ ఉపాధ్యాయుల ఇక్కట్లు పదేళ్లు కావొస్తున్నా.. 2014లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. దీంతో ఐటీడీఏలో ఉన్న డీఈఓ పోస్టును జిల్లాకు కేటాయించి జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించారు. పదో తరగతి, ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్ష పేపర్లను నిబంధనల ప్రకారం ఇక్కడే మూల్యాంకనం చేయాలి. జిల్లా ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా జిల్లా కేంద్రంలో స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల పేపర్లు.. రెండింటిని ఇక్కడే మూల్యాంకనం చేయాలి. ఇందులో కేవలం సప్లిమెంటరీ పరీక్షలకు స్పాట్ సెంటర్ను 2017లో నిర్వహించినా అనంతరం మళ్లీ ఖమ్మం మార్చారు. గతంలో ఇంటర్ మీడియట్ పేపర్ల మూల్యాంకనం ఖమ్మం జిల్లాలోనే ఉండగా గతేడాది నుంచి భద్రాద్రి జిల్లా కేంద్రంలోనే నిర్వహిస్తున్నారు.ఎన్నిమార్లు విన్నవించినా... జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో మార్లు విన్నవించాం. అయినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల దూర ప్రాంతాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – ఎస్.విజయ్కుమార్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్త జిల్లా కావడంతో.. మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులు కావాలి. నిపుణులైన సిబ్బంది ఉండాలి. వీటి వల్ల ఆలస్యమైంది. మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. వచ్చే ఏడాదికి అనుమతులు వస్తే జిల్లా కేంద్రంలోనే స్పాట్ సెంటర్ను ఏర్పాటు చేస్తాం. –ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ -
విద్యుత్ అంతరాయాల తగ్గింపునకు చర్యలు
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ సరఫరాలో అంతరాయాల సమయం తగ్గించేందుకు 33 కేవీ, 11 కేవీ సుదూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రేక్డౌన్ సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాల వల్ల లైన్ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా విద్యుత్ అంతరాయం కలిగిన భాగాన్ని ఫాల్ట్ ఇండికేటర్ విభజిస్తుందని పేర్కొన్నారు. దీంతో అంతరాయం ఎక్కడ జరిగిందో వెంటనే విశ్లేషించి అక్కడికే వెళ్లి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. తద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 17–33 కేవీ, 47–11 కేవీ విద్యుత్ ఫీడర్లలో ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లను బిగించేందుకు సాంకేతికంగా 33 కేవీ లైన్లలో 35, 11కేవీ లైన్లలో 122 ప్రదేశాలను గుర్తించామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ -
పడిపోతున్న బియ్యం కొనుగోళ్లు
పాల్వంచరూరల్: నిన్నామొన్నటి వరకు లాభాల పంట పండిన బియ్యం వ్యాపారం డీలా పడుతోంది. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యం ప్రభావంతో కొనుగోళ్లు మందగిస్తున్నాయి. ఈ నెలలో గిరాకీ తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లాలో సుమారు 300 పైనా బియ్యం దుకాణాలు ఉండగా, పాల్వంచలోనే 50కి పైగా బియ్యం దుకాణాలు ఉన్నాయని, అన్నింటా ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వాపురం, అశ్వారావుపేట తదితర పట్టణాల్లో బియ్యం దుకాణాలు ఎక్కువగా ఉండగా, వాటిపై ఆధారపడి సుమారు 600 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్న విషయం విదితమే. ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున అందజేయడంతో లబ్ధిదారులు అందరూ తీసుకుంటున్నారు. పక్షం రోజులుగా తగ్గిన కొనుగోళ్లు ఈ నెల ఆరంభం నుంచి సన్న బియ్యం కొనుగోళ్లు తగ్గాయి. ప్రైవేట్ దుకాణాల్లో కేజీ సన్న బియ్యం కొత్తవి రూ.42కు పైగా విక్రయిస్తున్నారు. పాత బియ్యం కేజీ రూ.50 నుంచి రూ.55 చొప్పున అమ్ముతున్నారు. నూకలు కేజీ రూ.28 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో బియ్యం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని వ్యాపారాలు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు రూ.50 లక్షల వ్యయం కలిగిన 10 టన్నుల బియ్యం విక్రయించేవారమని, పక్షం రోజుల నుంచి క్వింటా బియ్యం కూడా అమ్ముడుపోవడం లేదని పేర్కొంటున్నారు. విక్రయాలపై సన్నబియ్యం పంపిణీ ప్రభావం గిరాకీ తగ్గిందని చెబుతున్న వ్యాపారులు కొనుగోళ్లు తగ్గాయి అనేక సంవత్సరాలుగా బియ్యం వ్యాపారం చేస్తున్నాను. సాధారణంగా రోజుకు 5 నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం విక్రయిస్తా. ఈ నెల 1 నుంచి రోజుకు రెండు క్వింటాలే అమ్ముడవుతున్నాయి. షాపు అద్దె రూ.10వేలు, వర్కర్కు రూ. 10 వేలు, కరెంట్ బిల్లు రూ. వెయ్యి ఎలా చెల్లించాలో అర్థం కావడంలేదు. –వెంకటేశ్వర్లు, బియ్యం వ్యాపారి -
ఆర్టీసీ.. ఆన్లైన్
సత్తుపల్లి టౌన్ : ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక బస్సుల్లో ప్రయాణికులు, కండక్టర్లు టికెట్ల సమయంలో ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలకు తెరపడనుంది. ఖమ్మం రీజియన్లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ఆర్టీసీ డిపోల్లోని రిజర్వేషన్ బస్సుల్లో ఐ–టిమ్స్ను ప్రవేశపెట్టారు. రీజియన్లో 530 బస్సులు ఉండగా.. 40 రాజధాని బస్సులు, 75 సూపర్లగ్జరీ బస్సులు, 10 లహరి బస్సుల్లో తొలివిడతగా డిజిటల్ చెల్లింపు విధానం ప్రారంభమైంది. నూతన సాఫ్ట్వేర్ అనుసంధానంతో.. రిజర్వేషన్ బస్సుల్లో ఉన్న పాత టిమ్ల స్థానంలో ప్రస్తుతం ఛలోయాప్ పేరిట నూతన సాఫ్ట్వేర్ను అనుసంధానం చేసిన కొత్త ఐ–టిమ్ మిషన్(ఇంటర్నెట్ టికెట్ ఇస్యూ యింగ్ మిషన్)లు అందుబాటులోకి వచ్చాయి. క్యూఆర్ కోడ్తో.. ఈ బస్సుల్లో టిమ్ మిషన్లోని క్యూఆర్ కోడ్ను ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి మొబైల్ యాప్లతో స్కానింగ్ చేసి నేరుగా టికెట్ చార్జీలను చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే విధంగా ఆధునిక టిమ్ యంత్రాలను రిజర్వేషన్ బస్సుల్లో ప్రవేశపెట్టారు. త్వరలో రీజియన్లోని ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఈ నగదు రహిత చెల్లింపు విధానం అమలుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది.డిపో ఐ – టిమ్స్ బస్సులు సత్తుపల్లి 22ఖమ్మం 43కొత్తగూడెం 08భద్రాచలం 31మణుగూరు 22మధిర 07 క్యూ ఆర్ కోడ్తో బస్సుల్లో చెల్లింపులు రిజర్వేషన్ బస్సుల్లో అందుబాటులోకి ఐ – టిమ్స్ డిజిటల్ చెల్లింపులతో నగదు లేకున్నా బేఫికర్అన్ని బస్సుల్లో అమలు చేస్తాం డిజిటల్ పేమెంట్లతో ఐ టిమ్ మిషన్లను రిజర్వేషన్ బస్సుల్లో ప్రవేశపెట్టాం. ఇది ప్రయాణీకులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. చిల్లర సమస్య ఉండదు. ఏ సర్వీస్లో ఎన్ని సీట్లు ఉన్నాయో, ప్రతీది రికార్డ్ అవుతుంది. నగదుతో పాటు, నగదు రహిత సేవలను అన్ని బస్సుల్లో అమలు చేస్తాం. – సరిరామ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, ఖమ్మం -
వణికిస్తున్న వరుణుడు
ఉరుములు మెరుపులతో భారీ వర్షం పాల్వంచరూరల్/అశ్వాపురం/గుండాల/చండ్రుగొండ/దుమ్ముగూడెం: పలుచోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అనేక చోట్ల రాళ్లు పడ్డాయి. గాలిదుమారానికి పంటలు దెబ్బతిన్నాయి. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రైతులు పరదాలు కప్పి ఉంచారు. కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో చేతికి వచ్చిన ధాన్యం వర్షానికి తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలిదుమారంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాల్వంచ మండలం సోములగూడెం, జగన్నాథపురం, నాగారం, పాండురంగాపురం, రెడ్డిగూడెం తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో వీధుల్లో వరద ప్రవహించింది. చండ్రుగొండ మండలంలో కోత దశలో ఉన్న మామిడి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలరాలాయి. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో రాళ్ల వర్షం కురిసింది. గాలిదుమారానికి మొక్కజొన్న చేన్లు నేలవాలాయి. గత వర్షాలకు నేలమట్టమైన మొక్కజొన్న చేన్లు ఇప్పుడిప్పుడే కొద్దిగా పైకి లేస్తున్నాయని, మళ్లీ గాలి దుమారంతో పూర్తిగా పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు దుమ్ముగూడెం మండలంలోని శ్రీనగర్ కాలనీ గ్రామానికి చెందిన జిలకర రమేష్ రేకులషెడ్డు ఇల్లు కూలి పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఈదురుగాలులు, వర్షానికి అశ్వాపురం మండలం తుమ్మలచెరువు ఆయకట్టు కింద కోతకు వచ్చిన వరిపొలాలు నేలవాలాయి.బూర్గంపాడు: యాసంగి పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలను వరుణుడు వణికిస్తున్నాడు. పదిరోజులుగా జిల్లాలో ఏదో ప్రాంతంలో గాలి దుమారంతో కూడిన వానలు పడుతున్నాయి. ప్రస్తుతం యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెడుతున్నారు. రోజూ సాయంత్రం వాన పడుతుండటంతో ఆరబోసిన ధాన్యం కుప్ప నూర్పి పరదాలు కప్పి కాపాడుకుంటున్నారు. మళ్లీ ఉదయం ఆరబోసుకుంటున్నారు. పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం గాలి దుమారంతో కూడిన వర్షాలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలుగా తరలిద్దామంటే తేమశాతం ఎక్కువగా ఉందని, అక్కడ కొనుగోళ్లు జరగటం లేదు. దీంతో విసుగు చెంది రైతులు తక్కువ ధరలకే మిల్లర్లకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం గాలి దుమారంతో కూడిన వాన పడింది. పాల్వంచ, గుండాల, కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు తదితర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. అశ్వాపురం మండలంలో కొన్నిచోట్ల వడగాళ్ల వానలు కూడా పడ్డాయి. రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులతో వెళ్లి టార్పాలిన్లు కప్పుకున్నారు. బూర్గంపాడు మార్కెట్యార్డులో ఆరబెట్టిన ధాన్యంపై వర్షంలోనే పరదాలు కప్పుకున్నారు. యార్డులోని సిమెంట్ ప్లాట్ఫామ్లపై వచ్చే వరదను రాశుల కిందకు రాకుండా వరిపొట్టుతో కట్టలు వేసుకున్నారు. జిల్లాలో పది రోజులుగా గాలివానలు ముమ్మరంగా సాగుతున్న వరికోతలు ధాన్యం కాపాడుకునేందుకు అన్నదాతల ఉరుకులు పరుగులు -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు విశేష పూజలు జరిపారు. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైకోర్టు జడ్జి శరత్ను కలిసిన కలెక్టర్ జితేష్బూర్గంపాడు: హైకోర్టు జడ్జి శరత్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. భద్రాచలం వచ్చిన న్యాయమూర్తిని ఐటీసీ గెస్ట్హౌస్లో కలిశారు. జిల్లాలోని పరిస్థితులపై వారు కొద్దిసేపు ముచ్చటించారు. వెంకన్న సన్నిధిలో నూజివీడు జడ్జి పూజలుఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఏపీలోని నూజివీడు స్పెషల్ కోర్డు న్యాయమూర్తి జస్టిస్ వి. కృష్ణమూర్తి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం అందించి ఆశీర్వదించారు. నేటి ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం సెలవు కావడంలో కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించి దరఖాస్తులు అంజేయడానికి కలెక్టేట్కు రావొద్దని కలెక్టర్ సూచించారు. నేటి గిరిజన దర్బార్ రద్దుభద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో ప్రతి సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమాన్ని ప్రభుత్వ సెలవు రోజు కావడంతో రద్దు చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరని, గిరిజనులు గమనించి అర్జీలు సమర్పించేందుకు కార్యాలయానికి రావద్దని పేర్కొన్నారు. పర్యాటకుల జలవిహారంపాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 362 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్లైఫ్ శాఖ రూ.13,285 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,180 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
రైస్ పుల్లింగ్ మిషన్ పేరుతో బురిడీ
బూర్గంపాడు: రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని మోసాలకు పాల్పడుతున్న ముఠాను శనివారం బూర్గంపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రాజేశ్ కథనం ప్రకారం.. శనివారం సిబ్బందితో సారపాకలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా.. అదుపులోకి తీసుకుని విచారించడంతో రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని నమ్మించి పలువురిని మోసగించామని ఒప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో చర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన కొమరం రాజబాబు వద్ద రూ.లక్ష తీసుకున్నారు. అతను రైస్ పుల్లింగ్ మిషన్ అడుగగా మరో రూ.లక్ష కావాలని డిమాండ్ చేయగా.. జనవరి 25న రాజబాబు డబ్బుతో మండలంలోని క్రాస్రోడ్డు వద్దకు వచ్చాడు. ఈ ముఠా రాజబాబును కొట్టి రూ.లక్ష తీసుకుని కారులో పరారైంది. వీరితో పాటు జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ ఉన్నారు. కాగా, భద్రాచలంలో కొందరిని కలిసి రైస్ పుల్లింగ్ మిషన్ అమ్మకానికి ఉందని నమ్మించి మోసగించేందుకు యత్నిస్తున్న ఈ ముఠా సారపాకలో పోలీసులకు పట్టుబడింది. ఈ ముఠాలో పాల్వంచలోని తెలంగాణనగర్కు చెందిన ఆటోడ్రైవర్ దొనకొండ సురేశ్బాబు, భద్రాచలం పట్టణంలోని కొత్తపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ షేక్ అబ్దుల్ రవూఫ్, చర్ల మండలం విజయకాలనీకి చెందిన టైలర్ ఉర్ల శ్రీనివాసరావు ఉన్నారు. జంగారెడ్డిగూడెంనకు చెందిన నారాయణ పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.1.90 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని ఎస్ఐ వెల్లడించారు. పోలీసులు అదుపులో ముగ్గురు వ్యక్తులు -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
పాల్వంచ: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. శనివారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్లో సీఐ సుంకరి రమేశ్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణె జిల్లా, ధౌండ్ తాలూకా, పింపల్గాం గ్రామానికి చెందిన సాగర్ హరిదాస్ దోబ్లే, నీలేశ్, కిషోర్ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ ధరకు గంజాయిని ఒడిశాలోని మల్కన్గిరిలో కొనుగోలు చేసి కారులో అమర్చారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా పుణెకు తరలిస్తుండగా పాల్వంచ వద్ద ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సుంకరి రమేశ్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకటేశ్, విజయ్కుమార్, ఉపేందర్ పట్టుకున్నారు. కారులో ఉన్న 51.27 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.28.80 లక్షలు, అన్ని వస్తువులు కలిపి రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను సీఐ ప్రసాద్కు అప్పగించారు. రూ.28.80 లక్షల గంజాయి, కారు స్వాధీనం -
● బతుకుబండి సాగుతోంది..
పాత బైక్తో ఐస్ క్రీమ్ వ్యాపారం కరకగూడెం: కష్టపడి పనిచేయాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ఓ యువకుడు. సృజనాత్మకతతో పాత ద్విచక్రవాహనం ముందు భాగంలో ఉండే చక్రాన్ని తొలగించి దాని స్థానంలో రెండు చక్రాల ఐస్ క్రీమ్ బండిని అమర్చుకొని ఊరూరు తిరుగుతూ ఉపాధి పొందుతున్నాడు. రంగురంగుల కాగితాలు, బొమ్మలతో బండిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి రోజుకు మంచి ఆదాయం పొందుతున్నాడు. ఈ యువకుడి కృషిని అందరూ అభినందిస్తున్నారు. -
నేడు రాత పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1, సెక్యూరిటీ జమేదార్ టీఎస్ గ్రేడ్–26 పోస్టులకు ఈ నెల 13న సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. కెమిస్ట్–1, ఈ గ్రేడ్–1 పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకోగా, జమేదార్ పోస్టులకు 78 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి యాజమాన్యం హాల్ టికెట్లు పంపిణీ చేసింది. ఈ నెల 13న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఐఎన్టీయూసీ నేతకు వినతి మణుగూరుటౌన్: జేఏంఓల ప్రమోషన్ పాలసీలో మార్పులు చేయాలని కోరుతూ.. ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు శనివారం ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ–1 గ్రేడ్లో ఐదేళ్ల అనుభవం ఉంటేనే జేఎంఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉందని, ఏ–1 గ్రేడ్కు రావడానికి ఉద్యోగులకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు. ఉద్యోగ విరమణ దశలో అర్హత పొందుతున్నారని, ఫలితంగా గత నోటిఫికేషన్లో 87 పోస్టులకు గాను 15 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఎంపికయ్యారన్నారు. సమస్యను గుర్తించి త్వరితగతిన నోటిఫికేషన్ జారీ అయ్యేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్యయాదవ్, జయరాజు, దారా సుకుమార్ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేత కొత్తగూడెంఅర్బన్: నిషేధిత నాటుసారాయికి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా శనివారం కొత్తగూడెం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ జయశ్రీ, ఎస్ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని పెద్దబజార్లో బెల్లం ఉందనే సమాచారంతో ఎకై ్సజ్ ఎస్ఐ శ్రీహరిరావు తన సిబ్బందితో దాడి చేసి, ట్రాలీలో ఉన్న 360 కేజీల బెల్లం, 15 కేజీల స్పటికం పట్టుకున్నారు. ట్రాలీని ఎకై ్సజ్ కార్యాలయానికి తరలించి, బెల్లం కొనుగోలు చేసిన రాంకుమార్, డ్రైవర్ మంగీలాల్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నది పెద్ద వాహనమని, సమాచారం వెల్లడించే సమయంలో చిన్న వాహనం చూపించారనే ఆరోపణలు వచ్చాయి. ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు షురూ.. కొణిజర్ల: మండలంలోని తనికెళ్లలో ఐదు రాష్ట్రాలస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి అటవీ శాఖ చెక్పోస్టు మీదుగా ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న కలపను సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు పరిశీలిస్తుండగా కలప పట్టుబడింది. ఈ మేరకు ట్రాక్టర్ను అటవీ శాఖ రేంజ్ కార్యాలయానికి తరలించగా, కలప విలువ రూ.లక్ష వరకు ఉండొచ్చని తెలిసింది. గుండెపోటుతో యువకుడు మృతి ఇల్లెందు: పట్టణంలోని బుగ్గవాగు ఏరియాకు చెందిన లోదు కార్తీక్సోనూ (24) గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. అయితే, ఆయన అస్వస్థతకు గురికాగానే కుటుంబీకులు, స్నేహితులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమంగా ఉన్నందున కొత్తగూడెం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ కుటుంబీకుల వినతితో వైద్యం చేస్తుండగానే కార్తీక్ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు వైద్యుడిని నిలదీయగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి సీఐ మత్తుల సత్యనారాయణ చేరుకుని నచ్చజెప్పడంతో వెళ్లిపోయారు. క్రికెట్ ఆడుతూ కుప్పకూలి... ఇల్లెందు: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న ఇల్లెందు సబ్జైల్ బస్తీకి చెందిన ఆంటోనీ విమల్ (30) గుండెపోటుతో మృతి చెందారు. మరికొందరు ఉద్యోగులతో కలిసి ఆయన అక్కడ శనివారం క్రికెట్ ఆడుతూనే కుప్పకూలినట్లు తెలిసింది. ఈ విషయమై అందిన సమాచారంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఆడపిల్లలు పుట్టారని అక్రమంగా దత్తత?
చింతకాని: మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు.. మూడో కాన్పులోనూ ఆడపిల్ల అని తెలియగా అబార్షన్ చేయించడమే కాక.. నాలుగో కాన్పులో కవల ఆడ శిశువుల జన్మించడంతో శిశువులను బంధువులకు దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం తెలిసి ఐసీడీఎస్ అధికారులు శిశువుల ఆచూకీపై ఆరా తీస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన నల్లగాజు మల్లేష్ – ఉమ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడో కాన్పులోనూ గర్భంలో ఆడపిల్ల పెరుగుతోందని తెలియగా ఉమ అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చగా గత నెల 31న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో కవల శిశువులను ఆస్పత్రిలోనే ఉమ తన అక్కకు దత్తత ఇచ్చేసి ఇంటికి వచ్చారు. మూడు రోజుల క్రితం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కలిసి ఉమ, శిశువు ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లగా శిశువులు కానరాలేదు. ఏమైందని ఆరా తీయగా పోషించలేకనే బంధువులకు దత్తత ఇచ్చామని బదులిచ్చారు. అనంతరం ఐసీడీఎస్ సీడీపీఓ కమలప్రియ, ఏసీడీపీఓ శివకుమారి, సూపర్వైజర్ పద్మావతి కలిసి మల్లేష్ ఇంటికి వెళ్లగా ఆయన ‘మా పిల్లలు మా ఇష్టం.. ఏమైనా చేసుకుంటాం.. అడగానికి మీరెవరు’ అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. చట్టానికి లోబడి దత్తత ఇవ్వాలని, అలాకాకుండా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉంటున్న ఉమ అక్కకు పిల్లలను దత్తత ఇచ్చామని, సోమవారం వరకు తీసుకొస్తామని, లేనిపక్షంలో ఏ చర్యలైనా తీసుకోవచ్చని లేఖ రాసి ఇచ్చారు. కాగా, ఐసీడీఎస్ అధికారులకు వీడియో కాల్ ద్వారా కవల ఆడ శిశువులను చూపించారు. ఆలస్యంగా బయటపడడంతో అధికారుల విచారణ -
అగ్నిప్రమాదాలతో జాగ్రత్త
రేపటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు ●● జిల్లాలో ఐదు ఫైర్స్టేషన్లు ● ప్రమాదం జరిగితే డయల్–101కు సమాచారం ఇవ్వాలి కొత్తగూడెంటౌన్: వేసవికాలం వస్తే అగ్ని ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు, గుడిసెల్లో పంటలు కోసిన తర్వాత వాటికి నిప్పు పెట్టే విషయంలో అజాగ్రత్తగా ఉంటే నిప్పు రవ్వలు ఎగసిపడి ఇతర ఇళ్లకు అంటుకుని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారోత్సవాలు నిర్వహించి ప్రజలకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని అగ్నిమాపకశాఖ జిల్లా అధికారి మురహరి క్రాంతికుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదాల నుంచి ఎలా బయట పడాలి, ఎలా రక్షించుకోవాలనే విషయాలను ప్రాక్టికల్గా డ్రిల్ చేసి అవగాహన కల్పిస్తారు. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట ఫైర్ స్టేషన్ల పరిధిలో 51 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 28 మంది ఉన్నారు. మరో 23 మంది కొరత ఉంది. 1944లో ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డ్లోని నౌకలో అగ్ని ప్రమాదం సంభవించగా, విధి నిర్వహణలో ఉన్న 66 మంది అగ్నిమాపక సిబ్బంది మరణించారు. వారి జ్ఞాపకార్థం వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మూడేళ్లలో జరిగిన ఘటనలు.. ● 2022లో మొత్తం 351 అగ్ని ప్రమాదాలు సంభవించగా.. రూ.2,62,4000 నష్టం వాటిల్లింది. 62 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2023లో మొత్తం 265 అగ్నిప్రమాదాలు జరగగా రూ.32,19,6000 నష్టం జరిగింది. రూ.15,31,64000 సొత్తును రక్షించారు. 77 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2024లో మొత్తం 232 అగ్నిప్రమాదాలు సంభవించాయి. రూ.07,38,10,000 నష్టం వాటిల్లింది. 66 ఘటనల్లో మనుషులు, పశువులను రక్షించారు. ● 2025లో మార్చి వరకు మొత్తం124 అగ్నిప్రమాదాలు జరిగాయి. రూ.1,12,40,007 నష్టం జరిగింది. 66 ఘటనల్లో మనుషులు, పశువును రక్షించారు. డయల్101కి సమాచారం ఇవ్వాలి ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్లలో 972 ప్రమాదాలు సంభవించగా దాదాపు రూ.13,88,70,007 ఆస్తులకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్నతాధికారులకు అధికారులకు నివేదిస్తాం. ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తక్షణమే డయల్–101కు సమాచారం ఇవ్వాలి. మురహరి క్రాంతికుమార్, డీఎఫ్ఓ ఈ సూత్రాలు పాటించాలి.. అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, దుకాణ సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అపార్డుమెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్మాళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రతి ప్లాట్కు నీరు అందేలా పైపులైన్ను ఏర్పాటు చేయాలి. షాపుల్లో మండే స్వభావం ఉన్న వస్తువులను పెట్టకూడదు ఇంట్లో ఉండే సిలిండర్లకు వేడి తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇళ్లల్లో, షాపుల్లో వెంటిలేషన్ను సరిగ్గా ఉండేలా చూడాలి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. గృహాలు, రైస్మిల్లులు, ఆఫీసులు, దుకాణాల్లో నాణ్యమైన కరెంట్ వైరింగ్ చేయించుకోవాలి. -
పాత ఇనుప దుకాణంలో అగ్నిప్రమాదం
పాల్వంచ: పాత ఇనుమ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని తెలంగాణనగర్ వద్ద గల బీఎల్ నాయుడుకు చెందిన పాత ఇనుప దుకాణం యార్ద్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి సిగరేట్ తాగి పడేయడంతో చెత్తకు అంటుకుని మంటలు చెలరేగాయి. స్క్రాప్నకు వచ్చిన సుమారు పది కార్లకు నిప్పంటుకుని భారీగా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం అందించడంతో ఫైర్ ఆఫీసర్ పుల్లయ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఆయూబ్, ఉదయ్, ప్రతాప్, వెంకటేశ్వర్లు మంటలను ఆర్పివేశారు. కారు ఢీకొని రిటైర్డ్ ఉద్యోగి మృతిపాల్వంచరూరల్: ద్విచక్రవాహనంపై రిటైర్డ్ ఉద్యోగి రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన, భద్రాచలం ఐటీడీఏ ఈఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి రిటైర్డ్ అయిన కటుకూరి నాగభూషణం (63) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఎదురుగా భద్రాచలంవైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగభూషణాన్ని ఖమ్మం తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కోయిల విజయ్కుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. మృతుడికి భార్య పవిత్ర, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెంలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండాల మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఇర్ప కృష్ణ (40) మృతిచెందాడు. ఎల్లాపురం గ్రామంలో శుభకార్యానికి హాజరైన కృష్ణ బైక్పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కొమరారం పోలీసులు కృష్ణను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మధ్యలోనే కృష్ణ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కొమరారం ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు. సివిల్ లైన్లో చోరీ.. ఇల్లెందు: పట్టణంలోని సివిల్లైన్లో పెద్దపల్లి కుమారస్వామికి చెందిన ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు కుమారస్వామి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండటంతో పరిశీలించారు. 18 తులాల బంగారం, రెండు జతల వెండి పట్టీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. -
బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’
భద్రాచలం వద్ద గోదావరిలో వైభవంగా చక్రస్నానంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గత నెల 30న ప్రారంభమైన వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం కమనీయంగా జరిపారు. సుదర్శన చక్రాన్ని, ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర గోదావరి వద్దనున్న పునర్వసు మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు మండపంలో స్నపన తిరుమంజనం, హారతి సమర్పించారు. అనంతరం గోదావరిలో సుదర్శన చక్రానికి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం జరిపారు. సాయంత్రం ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు నిర్వహించారు. యాగశాలలో పుష్పయాగం, పూర్ణాహుతిలతో బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. సాయంత్రం శేష వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ గావించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రామాలయంలో భక్తుల రద్దీ వరుస సెలవుల నేపథ్యంలో శనివారం రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడు రోజుల సెలవులతోపాటు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో హనుమాన్ మాలధారులు భద్రగిరికి తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకోగా, మాలధారులు మాల విరమణ గావించారు. నేటి నుంచి నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడా మండపంలో నిలిపివేసిన నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. స్వామివారి నూతన పర్యంకోత్సవం ఈ నెల 22వ తేదీన జరపనున్నారు. పవళింపు సేవలు కూడా అదే రోజు నుంచి నిర్వహించనున్నారు. ఆదివారం చిత్తనక్షత్రం సందర్భంగా సుదర్శన హోమ పూజలను జరుపుతారు. -
సవాళ్లను స్వీకరించారు
● మైనింగ్ రంగంలో మహిళా ఇంజనీర్లు ● భూగర్భ గనుల్లో మేనేజ్మెంట్ ట్రైనీలు ● సింగరేణిలో 38 మంది అధికారిణులుపోలీస్ చేతిలో లాఠీలా ఈ మహిళల చేతిలో కనిపించే ఊత కర్రను బంటన్ స్టిక్ అంటారు. భూగర్భ గనుల్లోకి వెళ్లినప్పుడు ఈ కర్రతో పైకప్పును కొట్టడం ద్వారా ఆ ప్రదేశం పనికి అనుకూలంగా ఉంది లేనిది గుర్తిస్తారు. అయితే నిన్నామొన్నటి వరకు ఈ స్టిక్ పట్టుకునే హక్కు పురుషులదే. కఠినమైన పరిస్థితులు ఉండే భూగర్భ గనుల్లో ఈ పని చేయలేరంటూ ఈ అవకాశం మహిళలకు ఇవ్వలేదు. అదంతా కాలం చెల్లిన అభిప్రాయమని నిరూపిస్తున్నారు ఈ యంగ్ విమెన్ మైనర్స్. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంనో చాన్స్ దేశంలో బొగ్గు తవ్వకాలకు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం పురుషులతో సమానంగా మహిళలకు గనుల్లో పని చేశారు. పని ప్రదేశాల్లో ఉండే కఠినమైన పరిస్థితులు, మహిళల భద్రత దృష్ట్యా స్వాతంత్య్రం వచ్చాక గనుల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పించడంపై చట్టపరంగా నిషేధించారు. ఆ ప్రభావం సింగరేణిపై కూడా పడింది. దీంతో 2000 ఆరంభం వచ్చే సరికి నర్సులు, డాక్టర్లు, క్లరికల్ పోస్టులు తప్పితే మిగిలిన చోట్ల మహిళలకు అవకాశమే లేకుండా పోయింది. 2017 తర్వాత కారుణ్య నియామకాల ద్వారా మరికొందరికి అవకాశం దక్కినా అవి కూడా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకే పరిమితమయ్యాయి. భిన్నమైన మార్గంలో సింగరేణి బొగ్గు గనులను దృష్టిలో ఉంచుకుని 1970వ దశకంలో కొత్తగూడెంలో మైనింగ్ కాలేజీ ప్రారంభమైంది. దశాబ్దాల పాటు ఈ కాలేజీలో బాలికలకు ప్రవేశం ఇవ్వలేదు. 2013లో తొలిసారిగా ఇంజనీరింగ్ మైనింగ్ బ్రాంచిలో మహిళలకు ప్రవేశం కల్పించారు. తొలి బ్యాచ్లో ఐదుగురు, రెండో బ్యాచ్లో ఏడుగురు చేరారు. అలా చేరిన, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కృష్ణవేణి అందరిలా కాకుండా సవాల్ విసిరుతూ మైనింగ్ రంగంలోకి వచ్చింది. బంధువులు, స్నేహితులు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్ వరకు బ్రాంచి మార్చుకోవాలంటూ సూచించారు. కానీ ఐదుగురు బాలికలు స్థిరంగా నిలబడ్డారు. దీంతో మైనింగ్ కోర్సు మహిళలకు కూడా అనే భావనకు బలం వచ్చింది. ఆ మరుసటి ఏడాది బ్యాచ్లో కొత్తగూడెం పట్టణానికే చెందిన రమ్యశ్రీ చేరింది. చిన్నప్పటి నుంచి సింగరేణి వాతావరణంలో పెరగడంతో ఇందులోనే కెరీర్ ఎంచుకోవాలని నిర్ణయించింది. ఆ తర్వాత బ్యాచ్లో అనుపమ వచ్చి చేరింది. అలా మైనింగ్ కోర్సులో అడ్మిషన్లు తీసుకునే బాలికల సంఖ్య నిలకడగా ఉంటూ వస్తోంది. ఆ ఫలితంగానే కేఎస్ఎం, జేఎన్టీయూ (మంథని)తో పాటు మరో ఐదు ప్రైవేటు కాలేజీలు సైతం మైనింగ్ కోర్సును మహిళలకు ఆఫర్ చేస్తున్నాయి. అడ్డంకులు దాటుకుని.. మహిళలు మైనింగ్ ఇంజనీరింగ్ చదవడమేంటనే మాటలు వింటూనే కోర్సు పూర్తి చేశారు. అప్పటికీ ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో మహిళా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా విమెన్ మైనింగ్ గ్రాడ్యుయేట్లు వెనక్కి తగ్గలేదు. ప్రైవేటు కంపెనీల్లో ఆఫర్లు వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు వెళ్లారు. సాధారణంగా గనుల తవ్వకాలు జరిగే ప్రదేశాలు చాలా వరకు రిమోట్ ఏరియాలుగానే ఉంటాయి. రోడ్డు సౌకర్యం కూడా సరిగా ఉండదు. దుమ్ము ధూళి ఎక్కువ. ఎండా వానలు లెక్క చేయకుండా పని చేయాలి. దీనికి తోడు బయటి రాష్ట్రాల్లో ఉండే భాష, సంస్కృతి, ఆహారపు అలవాట్లు విభిన్నం. అయినా వారు వెరవలేదు. పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే మైనింగ్ ఇండస్ట్రీలో సమర్థంగా పని చేశారు. మైనింగ్ ఫీల్డ్ ఒక్కటే కాదు ఆహారం, సంస్కృతి, కాలుష్యం ఏవీ తమ పట్టుదల ముందు దిగదుడుపే అని నిరూపించారు. సగర్వంగా నిలిచారు గనుల్లో మహిళలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం తొలిసారిగా 2024లో జారీ చేసిన నోటిఫికేషన్లో మేనేజ్మెంట్ ట్రైనీలుగా మహిళలకు సింగరేణి అవకాశం కల్పించింది. దీంతో ఒక్కసారే 38 మంది ఇంజనీర్లు గనుల్లో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. వీరంతా సింగరేణిలోని వివిధ ఏరియాల్లో సమర్థంగా విధులు నిర్వహిస్తూ హమ్ కిసీ సే కమ్ నహీ అంటూ భవిష్యత్ తరాలకు బాటలు వేస్తున్నారు. దృక్పథం మారాలి ఒక అబ్బాయి ఏదైనా పని చేయడంలో విఫలమైతే కేవలం ఆ అబ్బాయి ఒక్కడే విఫలం అయ్యాడు అని అంటారు. అదే ఎవరైనా ఒక అమ్మాయి ఒక పని చేయడంలో తడబడితే చాలు, అమ్మాయిలంతా ఇంతే, ఏ పని చేయలేరంటూ ముద్ర వేస్తారు. ఈ ఆలోచన తీరులో మార్పు రావాలి. – కృష్ణవేణిమొదట్లో వినేవాళ్లు కాదు మేనేజ్మెంట్ ట్రైనీలుగా మా సూచనలు పాటించేందుకు కార్మికులు మొదట్లో సందేహించే వారు. మేము ఎంత విపులంగా చెప్పినా పురుష అధికారుల దగ్గరకు వెళ్లి కన్ఫర్మ్ చేసుకునే వాళ్లు. కానీ త్వరగానే మార్పు వచ్చింది. మహిళా అధికారులకు మద్దతు పెరిగింది. – రమ్యశ్రీ -
మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ● పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ● మణుగూరులో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం బూర్గంపాడు/అశ్వాపురం/మణుగూరుటౌన్/ కరకగూడెం/పినపాక: మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పినపాక నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మణుగూరు మండలం కూనవరంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే విద్య ప్రాముఖ్యతను చాటారని పేర్కొన్నారు. మణుగూరు డిగ్రీ కళాశాల ఆవరణలో రూ.4.33 కోట్లతో నిర్మించనున్న 30 అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రామానుజవరం–గొల్ల కొత్తూరు పీతురు వాగుపై రూ.1.90 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు, పగిడేరు–రామానుజవరం మార్గంలో పగిడేరు వాగుపై రూ.1.50 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరు స్టేజీ నుంచి గ్రామానికి రూ.63 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, జగ్గారంలో జగ్గారం నుంచి కుర్సంవారిగూడెం వరకు రూ.1.92 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. జగ్గారంలో అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ పూజలు చేశారు. బూర్గంపాడు– సోంపల్లి గ్రామాల మధ్య రూ.90 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, బూర్గంపాడులోని గౌతమిపురం వద్ద బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక మండలంలో సుమారు రూ. 4 కోట్లతో నిర్మించునున్న బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. మల్లారం గ్రామంలో చిలకమ్మ దేవాలయ అభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుడు రామనాథానికి ఆర్థికసాయం చేశారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామ బొడ్రాయి వద్ద నుంచి సమీపంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. స్వార్థ రాజకీయాలకు చిరునామా బీజేపీ బీజేపీ స్వార్థ రాజకీయాలకు చిరునామా అని, రాజ్యాంగ వ్యవస్థలను తన స్వార్థానికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు నడుం బిగించాలని, ఏఐసీసీ పిలుపు మేరకు ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్’ కార్యక్రమం ఏడాదిపాటు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, త్వరలోనే నూతన అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందిస్తామని అన్నారు. కాగా గోదావరి వరద ముంపు నుంచి బూర్గంపాడు మండలాన్ని కాపాడాలని, బూర్గంపాడు సబ్ రిజిస్ట్రార్ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని, మద్యం తాగి విధులకు హాజరవుతున్నారని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో మానుకోట ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, తుక్కాని మధుసూదన్రెడ్డి, బేతం రామకృష్ణ, కమటం నరేష్, ఓరుగంటి భిక్షమయ్య, పోలేబోయిన శ్రీవాణి, చందా సంతోష్, బట్టా విజయ్గాంధీ, పీరినాకి నవీన్, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, పోలెబోయిన తిరుపతయ్య, ఎర్ర సురేష్, కాటబోయిన నాగేశ్వరరావు, శివ, సామా శ్రీనివాసరెడ్డి, రవి, అబ్దుల్లా, సర్వేశ్వరరావు సీపీఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి భూ భారతి చట్టం అమలు భూ సమస్యల పరిష్కారానికి ఈనెల 14 నుంచి భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెస్త్నుట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలోనూ, ఇప్పుడూ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే గిరిజన ప్రాంతానికి సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చే జూన్ 2 నుంచి నియోజకవర్గానికి 4, 5 వేల మంది లబ్ధిదారులకు చేయూతనిచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సుమారు 14 నెలల్లోనే పినపాక నియోజకవర్గంలో రూ.30కోట్ల మేర రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కాగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నేతృత్వంలో భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు విజయవంతం చేశారని, శభాష్ రాహుల్ అంటూ అశ్వాపురం మండలం బీజీకొత్తూరు వద్ద ఐటీడీఏ పీఓను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. -
సమ్మర్ క్యాంపులు..
సర్కారు స్కూళ్లలో ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ అధికారులు ● వివిధ రకాల క్రీడల్లో, యోగా శిక్షణకు ఏర్పాట్లు.. ● ప్రైమరీలో రీడింగ్, రైటింగ్ నైపుణ్యం పెంచే చర్యలు ● వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెల 23వ తేదీతో విద్యా సంవత్సరం ముగియనుండగా, 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో ఫైనల్ ఎస్ఏ–2 పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో పాఠశాలల్లోనే సమ్మర్ క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. సమ్మర్ క్యాంపుల్లో గతంలో యోగా శిక్షణ ఇచ్చేవారు. ఈయేడాది అన్ని రకాల క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పాఠశాలలో రూ.20 వేల విలువైన అన్ని రకాల క్రీడా పరికరాలు వచ్చి ఉన్నాయి. క్రీడల నిర్వహణ, శిక్షకుల, ఎలా శిక్షణ ఇవ్వాలి తదితర అంశాలపై ఎంఈఓలు, హెచ్ఎంలతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సమ్మర్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠ్యంశాలు, బోధనలు లేని క్రీడలతో పాటుగా వినోదాత్మక అంశాలను కూడా జోడించి క్యాంపులు నిర్వహించనున్నారు. దీంతో వేసవి సెలవుల్లో కూడా పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడనున్నాయి. విత్తనాల సేకరణకు ప్రత్యేక బహుమతులు ఈ నెల 24 నుంచి వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు సూచించారు. పూలు, పండ్లు, ఆకుకూరలకు సంబంధించిన విత్తనాలను సేకరించి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాక ఆ విత్తనాలను పాఠశాలలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎక్కువగా విత్తనాలు సేకరించిన విద్యార్థులు, పాఠశాలలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందించనున్నారు. సేకరించిన విత్తనాలను ఉపాధ్యాయులు, సిబ్బంది కలిసి అడవుల్లో చల్లే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు.. జిల్లాలో 1,299 ప్రభుత్వ పాఠశాలల్లో 63,399 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ సమ్మర్ క్యాంపులు జరిగే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో విద్యా నైపుణ్యం పెంచేందుకు రీడింగ్, రైటింగ్ నోట్ పుస్తకాలను అందజేయనున్నారు. ఇళ్ల వద్దనే రీడింగ్, రైటింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రైమరీ విద్యార్థులు వారు ఆడేగలిగే క్రీడల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పించనున్నారు. ఇక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, క్యారమ్స్, షటిల్, ఫుట్బాల్, చెస్ వంటి క్రీడలు నిర్వహించనున్నారు. ఎండదెబ్బ తగలకుండా విద్యార్థులకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాల్లో ఉన్న ఎల్ఈడీ టీవీల్లో విద్యార్థులకు ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను సైతం ప్రదర్శించనున్నారు. ఇక ఉపాధి హామీ కార్మికులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టనున్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టనున్నారు. -
కనుల పండువగా..
● ఆకట్టుకున్న సీతారాముల వసంతోత్సవం ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలుభద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరాయి. శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం బ్రహ్మోత్సవాలలో నూతన వధూవరులైన సీతారాములకు వసంతోత్సవం జరపటం ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రంగుల హోళీగా భావించే వసంతోత్సవం కనుల పండువగా జరిపారు. మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను అంతరాలయం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన బేడా మండపంలో నిత్యకల్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అర్చకులు విశ్వక్షేన పూజ, పుణ్యావాచనం తదితర ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం పసుపులోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. తొలుత మూలమూర్తులకు, అనంతరం లక్ష్మీ అమ్మవారికి, ఆండాళ్ అమ్మవారికి, భద్రుని గుడి, ఆంజనేయస్వామి వార్లకు చివరగా ఉత్సవమూర్తులకు వసంతాన్ని చల్లారు. నూతన వధూవరులైన సీత, రామయ్యలను ఎదురెదురుగా ఉంచి జరిపిన వసంతోత్సవ క్రతువు భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వసంతోత్సవ విశిష్టతను వేద పండితులు వివరించారు. భక్తులపై స్వామివారి వసంతాన్ని చల్లి అర్చకులు ఆశీర్వదించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, నవాహ్నిక తిరుకల్యాణ ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. చివరి రోజున చక్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ తదితర కార్యక్రమాలను జరపనున్నారు. ఆదివారం నుంచి స్వామి వారి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. -
ముత్యాలమ్మ గుడిలో కూలిన వందేళ్ల చెట్టు
పాల్వంచ: పట్టణంలోని గాంధీనగర్లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలోని వందేళ్లకు పైబడిన పాల చెట్టు గురువారం రాత్రి కూలింది. రెండు రోజుల కిందట వీచిన గాలికి చెట్టు కొంత వరకు ఒరిగింది. గురువారం మొత్తం కూలి ముత్యాలమ్మ గుడిపై పడటంతో ధ్వసమైంది. పక్కనే ఉన్న రెండు రేకుల ఇళ్లపై కూడా పడటంతో దెబ్బతిన్నాయి. ఇంటి బయట పడుకున్న బాగం సుకన్య, సుగుణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్రావు, రెవెన్యూ ఆర్ఐ తదితరులు సందర్శించారు. పాఠశాలలో తప్పిన ప్రమాదం వంటగది స్లాబ్ పెచ్చులు ఊడి పడి వంటమనిషికి గాయాలు టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలలోని వంట గది స్లాబ్ పెచ్చులు ఊడి వంటచేస్తున్న మహిళపై పడ్డాయి. వంటలపైనా పడటంతో అవి దెబ్బతిన్నాయి. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెచ్చులు ఊడి పడుతున్న సమయంలో అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి వంటమనిషి సరోజ బయటపడింది. కానీ, ఆమె చేతికి గాయమైంది. శిథిలావస్థలో ఉన్న కిచెన్షెడ్కు మరమ్మతులు చేయాలని గత డిసెంబర్ 31న జరిగిన పేరెంట్స్ మీటింగ్లో తీర్మానం చేసి, ఉన్నతాధికారులకు పంపించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎస్పీ ఆకస్మిక తనిఖీ ములకలపల్లి: ములకలపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ రోహిత్రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు అర్ధగంట పాటు పోలీస్ స్టేషన్లో గడిపిన ఎస్పీ.. క్రైం వివరాలు, కేసుల తాలూకూ రికార్డులు పరిశీలించారు. ఈ విషయమై ఎస్ఐ కిన్నెర రాజశేఖర్ను వివరణ కోరగా సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్పీ స్టేషన్ను సందర్శించినట్లు తెలిపారు. ఎస్పీ వెంట పాల్వంచ డీఎస్పీ సతీశ్కుమార్ ఉన్నారు. వేధింపులపై ఏఎస్పీకి ఫిర్యాదు భద్రాచలంటౌన్: చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న ఆశ వర్కర్ను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్న ఘటనపై బాధితురాలు శుక్రవారం ఏఎస్పీ విక్రాంత్కుమార్సింగ్కు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. చర్లలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న పందా రమేశ్ కొంతకాలంగా ఆశ వర్కర్ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో బాధితురాలు అతని భార్య, అత్తలకు విషయం చెప్పింది. దీంతో రమేశ్ అలా ఎందుకు చెప్పావని వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న బాధితురాలిని దుర్భాషలాడుతూ దాడి చేశాడు. చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో తనకు ప్రాణహాని ఉందని, రమేశ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన్నట్లు ఆశ్వ వర్కర్ తెలిపారు. మహిళ అదృశ్యంపై కేసు టేకులపల్లి: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్ఐ సురేశ్ కథం ప్రకారం.. టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన ప్రమీలకు ఇదే గ్రామానికి చెందిన గుమ్మడి సుధాకర్తో కొన్నేళ్ల కిందటే వివాహమైంది. కొంతకాలంగా ప్రమీల తన తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ నెల 1వ తేదీన ఇంట్లో తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వెతికినా దొరక్కపోవడంతో శుక్రవారం బాధితురాలి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. కొనసాగుతున్న అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు తల్లాడ: మండలం కుర్నవల్లిలో నిర్వహిస్తున్న ఐదు రాష్ట్రాలస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం రెండోరోజుకు చేరాయి. వేంకటాచలపతి దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యాన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు జరిగిన మ్యాచ్లో ఏపీలోని వైజాగ్ జట్టుపై తమిళనాడు జట్టు విజయం సాధించింది. శనివారం పోటీలు ముగియనుండగా, విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. దరఖాస్తుదారుల పడిగాపులుచుంచుపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఆన్లైన్ కష్టాలు తప్పడం లేదు. రెండు రోజులుగా సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ తరుచూ మొరాయిస్తోంది. మరోవైపు గడువు మూడు రోజులే మిగిలి ఉంది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. గంటల కొద్దీ మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించగా తాజాగా ఆఫ్లైన్లోనూ అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక నమూనా దరఖాస్తులను జిల్లాకు పంపగా, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంచారు. కానీ ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఆన్లైన్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో మీ సేవ కేంద్రాలు దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. -
జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి
జూలూరుపాడు/చండ్రుగొండ: జిల్లాలోని రైతులకు గోదావరి జలాలు ఇచ్చాక మిగులు నీటిని పక్క జిల్లాకు ఇవ్వాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి, కేరళ రాష్ట్ర ఇన్చార్జి గోలి మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కిసాన్ మోర్చా నాయకులు వినోభానగర్ గ్రామ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కెనాల్ను పరిశీలించారు. మద్దుకూరు గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ నీళ్లను జిల్లాలోని అన్ని చెరువులను నింపాకే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలన్నారు. సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు గోదావరి జలాలు ఇవ్వకుండా సాగర్ నీళ్లు వస్తున్న కాలువకే మళ్లించడం దుర్మార్గమని విమర్శించారు. అకాలవర్షాలు, గాలిదుమారాలకు పంటలు నష్టపోయిన బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు చిలుకూరి రమేష్, చావా కిరణ్ కుమార్, రమేష్, నంబూరి రామలింగేశ్వరరావు, మాదినేని సతీష్, నున్నా రమేష్, సిరిపురపు ప్రసాద్, చంద్రశేఖర్, నల్లమోతు రఘుపతిరావు, జుబ్బురి రమేష్, భోగి కృష్ణ, గుగులోతు రాజేష్, భూక్యా కుమార్, గుగులోతు రాంబాబు పాల్గొన్నారు. -
వాగు.. బాగుపడేనా..?
● మొదలుకాని బుగ్గవాగు సుందరీకరణ పనులు ● గత జనవరిలో జరిగిన శంకుస్థాపన ● రూ.9 కోట్లతో టెండర్ పూర్తి ● కాగితాలకే పరిమితమైన ఒప్పందం ఇల్లెందు: ఇల్లెందు మధ్య నుంచి ప్రవహిస్తున్న బుగ్గవాగు సుందరీకరణ పనులకు గ్రహణం పట్టింది. టెండర్ ప్రక్రియ పూర్తయి ఒప్పందం జరిగినా పనులు మొదలు పెట్టడం లేదు. ఈ ఏడాది జనవరి 22న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. టీయూఎఫ్ఐడీసీ, డీఎంఎఫ్ నిధులు రూ.9 కోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నిధులతో బుగ్గవాగు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే బుగ్గవాగు పూడిక తీయకపోతే నీరు ఇళ్లల్లోకి వస్తోంది. దీంతో బుగ్గవాగు ప్రక్షాళన కోసం రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో వాగు వెంట ఇరువైపులా సుమారు నాలుగు కిలోమీటర్లు రిటైన్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఇరు వైపులా వాకింగ్ ట్రాక్లు వాగులో చెత్తా చెదారం వేయకుండా ఫెన్సింగ్ నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. శంకుస్థాపన జరిగిన జనవరిలో పనులు మొదలై ఉంటే వచ్చే వర్షాకాలం నాటికి అంటే జూన్ – జూలై వరకు పూర్తయ్యే అవకాశం ఉండేది. కానీ, సుందరీకరణ మొదుల కాకపోవటంతో వచ్చే వర్షాకాలాన్ని తలచుకుని పట్టణ ప్రజలు.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం.. పట్టణం మధ్య నుంచి ప్రవహించే బుగ్గవాగు ఇరువైపులా ఆక్రమణలు ఉన్నాయి. ఎంతో మంది వాగులోకి వచ్చి నిర్మాణాలు చేసుకున్నారు. ఇళ్లు, దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వాగులో వదిలేస్తుండటంతో పూడిక పేరుకుపోతోంది. అధిక వర్షాలకు వాగు పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచుతోంది. బుగ్గవాగు మీద రెండు చోట్ల లోలెవల్ కాజ్వేలు ఉన్నాయి. వాగు పొంగితే కాజ్వేల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. చెత్తాచెదారం కాజ్వే ఖానాలకు అడ్డుపడి నీరు పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఒకవైపు బుగ్గవాగు, అలుగు వాగుల వల్ల అటు సత్యనారాయణపురం, ఇటు ఇల్లెందులపాడు ప్రజలకు వరదపోటు తప్పటం లేదు. కాగా, పట్టణం మధ్య నుంచి అంటే హిందూ శ్మశాన వాటిక నుంచి స్టేషన్ బస్తీ చివరి వరకు కిలోమీటర్ దూరం ఈ వాగు ప్రవహిస్తోంది. నంబర్–2 బస్తీ, ఎల్బీఎస్నగర్, స్టేషన్బస్తీలకు ముప్పు ఉంటుంది. సత్యనారాయణపురం 1, 2వ వార్డులకు అలుగు వాగు ఆటంకంగా మారింది. ఈ వాగు మీద బ్రిడ్జి నిర్మాణం ఊసే లేదు. ఏటా వాగు ఉప్పొంగటం వాగు దాటకుండా ఎటు ప్రజలు అటే నిలిచిపోవటం సర్వసాధారణంగా మారింది. గత వర్షాకాలంలో ఓ వ్యక్తి వాగు దాటుతూ బైక్తో సహా కొట్టుకుపోయి కొంత దూరంలో ఒడ్డుకు చేరాడు. సత్యానారాయణపురం వాసులకు పట్టణం నుంచి వెళ్లాలంటే బర్లపెంట రహదారి వైపు బుగ్గవాగు మీద లోలెవర్ కాజ్వే ఉన్నప్పటికీ వాగు పొంగితే ఆటంకంగా మారుతుంది. చొరవ తీసుకోవాలి.. గత జనవరిలో శంకుస్థాపన జరిగినా నేటి వరకు పనులు మొదలు పెట్టలేదు. వచ్చే వర్షాకాలం నాటికి పూడిక తీసే పనులు అయినా పూర్తి కాకపోతే కష్టంగా మారుతుంది. అధికారులు తక్షణం చొరువ తీసుకోవాలి. టెండర్, ఒప్పందం జరిగినా ఎందుకు చేపట్టడం లేదో అంతుపట్టడం లేదు. –దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇప్పటికై నా మొదలు పెట్టాలి.. బుగ్గవాగు ప్రధానంగా 4వ వార్డు గుండా ప్రవహిస్తోంది. వర్షాకాలం వాగు ఉప్పొంగితే ఇళ్లల్లోకి నీరు చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతారు. సుందరీకరణ వేగంగా చేపట్టి వర్షాకాలం నాటికి పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. –సయ్యద్ ఆజమ్, మాజీ కౌన్సిలర్ ఇల్లెందు పాలకవర్గం లేక.. గత జనవరిలో పాలక వర్గం పదవీ కాలం ముగిసింది. పాలక వర్గం లేకపోవటం వల్ల అభివృద్ధి కుంటు పడిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా ఇప్పట్లో ఎన్నికలు పెట్టే స్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపించటం లేదు. ఎన్నికల ఊసే లేకుండా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పట్టణంలో సగభాగం గుండా ప్రవహించే ఈ వాగు ప్రక్షాళన, సుందరీకరణ జరిగితేనే కంటి నిండా నిద్రపోయే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కొత్తగూడెంఅర్బన్: గుర్తు తెలియని వ్యక్తి కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలోని బస్సు షెల్టర్ వద్ద 70 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి స్పృహతప్పి పడిపోయి ఉండగా, మైలారం గ్రామ పంచాయతీ కార్యదర్శి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, మృతుడు మైలారంలో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. సింగరేణి ఉద్యోగి కాజీపేటలో ఆత్మహత్య సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని సెంట్రల్ వర్క్షాపులో టర్నర్గా విధులు నిర్వహిస్తున్న యూ.సంజయ్కుమార్ ఆర్థిక ఇబ్బందులతో కాజీపేటలోని తన అమ్మమ్మ ఇంట్లో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన వర్క్షాపు ఉద్యోగులు, జీఎం దామోదర్, డీజీఎం ప్రకాశ్, ఇంజనీర్ నారాయణ, సూపర్వైజర్లు, సింగరేణి ఉద్యోగులు, యూనియన్ నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. బియ్యం లారీ పట్టివేత అశ్వాపురం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని మండల కేంద్రంలో గౌతమీనగర్ కాలనీ వద్ద గురువారం రాత్రి అశ్వాపురం పోలీసులు పట్టుకున్నారు. బియ్యం మణుగూరు నుంచి పాల్వంచకు లారీ (ఏపీ20టీఏ 3366)లో తరలిస్తుండగా సీఐ అశోక్రెడ్డి వాహనాల తనిఖీల్లో పట్టుకున్నారు. లారీలో సుమారు 100 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. లారీని పోలీస్ స్టేషన్కు తరలించి, అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన లారీడ్రైవర్ శ్రీనుపై కేసు నమోదు చేశామని సీఐ అశోక్రెడ్డి తెలిపారు. -
జమలాపురంలో మాజీ సీజేఐ
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా వారికి ఆలయ ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆతర్వాత వారికి ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించిన అర్చకులు.. శేషవస్త్రాలు, ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ కె.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామికి పూజలు చేసిన జస్టిస్ ఎన్.వీ.రమణ -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
సుజాతనగర్: కుమారుడిని తీసుకొని రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో తండ్రి మృతి చెందగా ఆరేళ్ల కుమారుడికి గాయాలైన ఘటన సుజాతనగర్ సెంటర్లో చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా నుంచి ఎనిమిదేళ్ల కిందట వలస వచ్చిన పొడియం దినేశ్ (39) ములకలపల్లి మండలం ధర్మన్ననగర్లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఆయన సుజాతనగర్ మండలంలోని రాఘవపురంలో తన సోదరుడు గంగయ్య వద్ద ఉన్న కుమారుడు భీమాను తీసుకుని సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న భద్రాచలం డిపో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేశ్ మృతి చెందగా, భీమాకు గాయాలయ్యాయి. కాగా, ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ కోటగిరి శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. దిక్కు లేని స్థితిలో కుటుంబం రోడ్డు ప్రమాదంలో దినేశ్ చనిపోగా, గాయపడిన ఆయన కుమారుడు భీమాను కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ఆయనను ఆరా తీస్తే వివరాలు చెప్పలేకపోగా, తండ్రి మృతి చెందాడనే బాధలో తన గాయాలను మర్చిపోయి చికిత్సకు సహకరించలేదు. దీంతో ఆస్పత్రిలో ఉన్న వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, దినేశ్ చనిపోయిన విషయం తెలిసిన ఆయన భార్య లక్ష్మి, మిగతా పిల్లలతో ఆస్పత్రికి చేరుకుని భీమాను పట్టుకుని రోదించడం కలిచివేసింది. అయితే, వలస వచ్చిన కుటుంబ పెద్ద మృతి చెందడంతో ఆయన భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. ఆయన కుమారుడికి గాయాలు -
గాలిదుమారానికి నేలరాలిన మామిడి
అశ్వారావుపేటరూరల్: అకాల గాలిదుమారం, వర్షం కారణంగా మామిడి, పొగాకు రైతాంగానికి తీరని నష్టం వాటిల్లింది. మండలంలోని వినాయకపురం, మల్లాయిగూడెం, తిరుమలకుంట, మామిళ్లవారిగూడెం, ఆసుపాకతోపాటు పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి సమయంలో వచ్చిన గాలి దుమారం కారణంగా సుమారు 150 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. మరో 50 ఎకరాల్లో మామిడి చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. పసుపులేటి సుబ్బారావుకు చెందిన తోటలో సుమారు 15 టన్నుల మామిడి కాయలు నేలరాలాయి. మల్లాయిగూడెంలో ఉప్పల దుర్గప్రసాద్కు చెందిన 10 ఎకరాల మామిడి తోటలో వందల సంఖ్యలో కాయలు రాలిపోవడంతోపాటు కొమ్మలు విరిగిపడ్డాయి. అశ్వారావుపేటలోని శివయ్యబజార్ వద్ద కొబ్బరి చెట్టు విరిగి, రోడ్డుకు అడ్డంగా పడింది. మండలంలోని చెన్నాపురం –గాండ్లగూడెం మార్గంలో ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, వైర్లు తెగిపోవడంతో పలు గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆయా గ్రామాల్లో తాగునీటి పథకాల బోర్లు పని చేయక గిరిజనులు తాగునీటి కోసం అవస్థ పడ్డారు. -
రజతోత్సవ సభను జయప్రదం చేయండి
భద్రాచలంటౌన్: భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీగా హాజరై బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. స్థానిక రాఘవ నిలయం (రెడ్డి సత్రం)లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై సభ వాల్పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఏప్రిల్ 27న గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామగ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని తెలిపారు. సమావేశంలో పినపాక మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, రాంబాబు, నర్సింహమూర్తి, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, కణితి రాముడు, బుచ్చయ్య, రేసు లక్ష్మి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబందించిన వాల్పోస్టర్లను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ స్థాపించి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపుమేరకు వరంగల్లో ఈ నెల 27న బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, కాపు సీతాలక్ష్మి, బాదావత్ శాంతి, భూక్య సోన, కొట్టి వెంకటేశ్వర్లు, మంతెపూరి రాజుగౌడ్, బత్తుల వీరయ్య పాల్గొన్నారు.