Sangareddy
-
పెండ్లికి చేసిన అప్పులతో మనోవేదనకు గురై..
వర్గల్(గజ్వేల్):పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటన వర్గల్ మండలం గిర్మాపూర్లో చోటు చేసుకుంది. గౌరారం ప్రొబేషనరీ ఎస్ఐ కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్మాపూర్కు చెందిన సాయిల్ల అశోక్, సుశీల(44) దంపతులకు సబిత, కల్పన, కార్తీక్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల కిందట పెద్ద కూతురు వివాహం కోసం కొంత అప్పు చేశారు. ఆ అప్పు విషయంలో సుశీల తరచూ బాధ పడేది. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన ఆమె గుర్తు తెలియని పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రికి తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పురుగు మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి -
ప్రభుత్వ రోడ్డును కబ్జా నుంచి కాపాడండి
మెదక్ కలెక్టరేట్: పంట పొలాలకు వెళ్లే ప్రభుత్వ రోడ్డుతోపాటు చెరువు శిఖం, కుంటలను కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌడిపల్లి మండలం చిన్న గొట్టిముక్ల గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్ఽ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ.. తమ గ్రామ శివారులోని సర్వే నం.292లో అన్ని కులాల వారికి సంబంధించి 95 ఎకరాలు భూమి ఉంది. సర్వే నం.264, 274, 275, 276లో సుమారు 55 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. ఈ భూముల్లో పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ భూముల్లోకి వెళ్లేందుకు తాత ముత్తాతల కాలం నుంచి 3 కిలో మీటర్ల మేర దారి ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రైతుల కోసం పనికి ఆహార పథకం కింద రోడ్డును బాగు చేసినట్లు తెలిపారు. కానీ ఈ దారిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్రెడ్డి, స్థానికులు గడిల సుదర్శన్రావు కలిసి ధ్వంసం చేసి ఆక్రమించకున్నట్లు ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అండతో స్థానికుల ఆక్రమణ కలెక్టరేట్ ఎదుట రైతులు నిరసన -
రాలిన ఆశలు.. నష్టాల్లో రైతులు
అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి పంటలు ● అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడలో 2,991 ఎకరాల్లో సాగు ● మార్కెట్లోనూ ధర అంతంత మాత్రమే ● నష్ట పరిహారం ఇవ్వాలని రైతుల వినతిటన్నుకు రూ.15 వేలు దాటని వైనంకోహెడ(హుస్నాబాద్): ఆరుగాలం శ్రమించిన మామిడి రైతులకు నిరాశే దక్కింది. ఇటీవల కురిసిన గాలివానలతో కోత దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. గాలి తీవ్రతకు చెట్ల కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. దీంతో తీవ్ర స్థాయిలో తోటలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత పెరిగింది. నీటి ఎద్దడితో చిరుకాయ దశలో ఉన్న మామిడి తోటలు సగానికి పైగా నేల రాలడంతో నష్టాల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వర్షాలతో నేలరాలిన మామిడి కాయలను మార్కెట్కు తరలించిన రైతులకు టన్నుకు రూ.15 వేలు ధర అందని పరిస్థితి నెలకొంది. తోటలను ముందస్తుగా మాట్లాడుకున్న పలువురు వ్యాపారులు సైతం చేతులెత్తేశారు. గొట్లమిట్ట, కోహెడ, చెంచల్ చెర్వుపల్లి, తీగలకుంటపల్లి, వరికోలు, బస్వాపూర్, కాచాపూర్, సముద్రాల, శ్రీరాములపల్లి, కూరెల్లా, తంగాళ్లపల్లి, వింజపల్లి తదితర గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారుల వివరాల ప్రకారం 1,350 ఎకరాలు మామిడి సాగు అవుతుంది. ఆకాల వర్షాలు, వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత నిలువలేదు. కాస్తోకుస్తో నిలిచిన మామిడి కాయలు గాలివానకు పూర్తిగా నేలరాలాయి. హుస్నాబాద్ నియోజక వర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో సుమారు 2,991 ఎకరాలు మామిడి సాగు చేస్తున్నారు.పంట నష్టంపై సర్వే నిర్వహిస్తున్న అధికారులుపంట నష్టం వివరాలు సేకరణ ఉద్యానశాఖ అధికారులు ఆకాల వర్షాలతో నష్టపోయిన మామిడి తోటల వివరాలు సేకరించడంలో బిజీబిజీగా ఉన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కోహెడ మండల వ్యాప్తంగా 407 మంది రైతులకు చెందిన 1,255 ఎకరాల్లో 33 శాతం మామిడి దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కాగా 90 శాతం మామిడి దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. వివరాలు పారదర్శంగా నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు
సిద్దిపేటకమాన్: గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట ఏసీపీ మధు, టూటౌన్ సీఐ ఉపేందర్ హెచ్చరించారు. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏసీపీ, సీఐ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్స్తో సిబ్బంది సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా యాంటి నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.సిద్దిపేట ఏసీపీ మధు, టూ టౌన్ సీఐ ఉపేందర్ -
యుద్ధం ఎందుకు ఆపారో మోదీ చెప్పాలి
మంత్రి పొన్నం ప్రభాకర్హుస్నాబాద్: ట్రంప్ ట్విట్టర్తో యుద్ధాన్ని నిలిపివేసి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేస్తుంటే ఎలాంటి చర్చలు లేకుండా ఎందుకు ఆపారో ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం దేశమంతా ఇందిరాగాంధీని జ్ఞాపకం చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి మద్దతుగా ర్యాలీలు చేపట్టామన్నారు. భారత ఆర్మీకి శాసన సభ్యులందరు నెల జీతం ఇచ్చారన్నారు. డామేజ్ని కంట్రోల్ చేసుకునేందుకే త్రివిధ దళాలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ప్రధాని దమ్మున్న వ్యక్తి అయితే యుద్దాన్ని ఎందుకు విరమించారో, జరిగిన నష్టమేమిటో పార్లమెంట్ వేదికగా చర్చకు పిలువాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ ప్రకటన చేసిన నాలుగు గంటల్లోనే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే మీరు ఏమి చేశారని ప్రశ్నించారు. పహల్గామ్ పై చేసిన దాడి పాకిస్తాన్ చేసిందని ఎంఐఎం కూడా ముక్తకంఠంతో ఖండించిందన్నారు. -
వేర్వేరు చోరీల కేసులో ఇద్దరు రిమాండ్
సిద్దిపేటకమాన్: బైక్ల చోరీకి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట ఏసీపీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద గతేడాది మే నెలలో ద్విచక్ర వాహనాన్ని, ఈ ఏడాది జనవరిలో కోటిలింగాల టెంపులు వద్ద, రైతు బజార్ వద్ద, దుబ్బాకలో పార్క్ చేసిన బైక్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, ఎస్ఐ నవత తమ సిబ్బందితో కలిసి సోమవారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (30) పోలీసులను చూసి బైక్ వదిలిపెట్టి పారిపోతుండగా పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి ఇంట్లో భద్రపర్చి తర్వాత ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. వెంటనే రూ.2,55,000 విలువ గల ఐదు బైక్లను స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన సీఐ వాసుదేవరావు, ఎస్ఐ నవత, సిబ్బంది భూమలింగం, శరత్బాబు, శేఖర్, రామకృష్ణను ఏసీపీ అభినందించి, సీపీ చేతుల మీదుగా రివార్డు అందజేస్తామని తెలిపారు. పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ పటాన్చెరు టౌన్: వృద్ధురాలి పుస్తెలతాడు, నగదు ఎత్తుకెళ్లిన కేసులో ఆటో డ్రైవర్ను రిమాండ్ చేసిన ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన భారతి 9న బొల్లారం అల్వాల్లో ఉండే తన ఇంటికి వెళ్లి అక్కడ కిరాయిదారుడు నుంచి రూ.10 వేలు అద్దె తీసుకుంది. తిరిగి అదే రోజు సాయంత్రం కూకట్పల్లి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ వృద్ధురాలిని పలు వీధుల మీదుగా తిప్పి చివరకు అమీన్పూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదున్నర తులాల పుస్తెలతాడు, రూ.10 వేల నగదు తీసుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాను పరిశీలించి ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించారు. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం మాదపురం కాలనీకి చెందిన ముడావత్ చిన్నను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి అతడి వద్ద నుంచి పుస్తెలతాడు, రూ.7వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్కి తరలించారు.సిద్దిపేటలో పార్కు చేసిన బైక్లు దొంగతనం -
ఎకరాకు రూ.50 వేలు ఇవ్వాలి
పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులను ప్రభు త్వం ఆదుకోవాలి. ఇటీవల గాలివానతో మామిడి కాయలు పూర్తిగా నేలరాలాయి. రాలిన మామిడి కాయలను మార్కెట్కు తరలిస్తే.. టన్నుకు రూ.10వేలు కూడా ధర ఇవ్వలేదు. దీంతో తీవ్రంగా నష్టం జరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.50 వేలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. – మ్యాకల రజనీకాంత్రెడ్డి, మామిడి రైతు, తీగలకుంటపల్లి పండ్ల తోటల వివరాలు సేకరిస్తున్నాం. నష్ట పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. చాలా మంది రైతులు ఆన్లైన్లో పంట సాగు నమోదు చేసుకో లేదు. అలాంటి రైతుల వివరాలు కూడా సేకరిస్తున్నాం. అందరికీ నష్ట పరిహారం అందే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. – బాలాజీ, ఉద్యానవన శాఖ అధికారివివరాలు సేకరిస్తున్నాం -
సాంకేతిక విద్య.. బంగారు భవిత
నేడే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 కేంద్రాలు మూడేళ్లలో కోర్సు పూర్తి ● పారిశ్రామిక రంగాల్లో మెరుగైన ఉపాధిజహీరాబాద్ శ్రీసంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలజహీరాబాద్ టౌన్: విద్యార్థుల ఉజ్వల భవితకు సాంకేతిక విద్య తోడ్పనుంది. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన తర్వాత ఏం చదవాలి.. ఎలాంటి కోర్సులు తీసుకోవాలి.. ఏ విద్యాసంస్థల్లో చేరాలంటూ విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు మదన పడుతుంటారు. ఇలాంటి వారికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు ఓ మంచి అవకాశం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలనుకునే వారికి పాలిటెక్నిక్ ఒక వరం లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు సోమవారం (13న) పాలిసెట్(2025–26) పరీక్ష జహీరాబాద్ పట్టణంలోని రెండు కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు జహీరాబాద్ శ్రీ సంగమేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సువర్ణ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉండగా సంగారెడ్డి జిల్లాలో 7 కేంద్రాలు ఉన్నాయి. జహీరాబాద్లో ఆర్ఎల్ఆర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందన్నారు. విద్యార్థులు 30 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. నేరుగా బీటెక్లోకి ప్రవేశం మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేశాక.. పరిశ్రమల్లో వెంటనే ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఉన్నత విద్య కావాలంటే కూడా అందుకు అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తియ్యాక ఈసెట్ రాసి.. నేరుగా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో చేరవచ్చు. మూడేళ్లలో ఇంజనీరింగ్ పూర్తి అవుతుంది. పాలిటెక్నిక్లో కంప్యూటర్స్, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్ ఇంజనీర్, లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్లో కూడా పాలిటెక్నిక్లో చదివే సబ్జెక్టులే ఉంటాయి. పాలిటెక్నిక్ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే సులువుగా సబ్జెక్ట్పై పట్టు వస్తుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే కూడా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధ్యానం ఇస్తాయి.ప్రవేశాలు ఇలా.. పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాయాలి. రాష్ట్ర సాంకేతిక శిక్షణ సంస్థ కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేసి ర్యాంక్ ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు డిప్లొమా కోర్సుల్లో సెమిస్టర్ ప్రకారం శిక్షణ ఇస్తారు. -
యూరియా వినియోగం తగ్గించాలి : శాస్త్రవేత్త శోభ
హవేళిఘణాపూర్(మెదక్): రైతులు గతంలో మాదిరిగా ఎరువు పేడ, గొర్రె ఎరువు లాంటి వినియోగం తగ్గినందున వాటికి బదులుగా మినుము, జనుము, జిలుగ విత్తనాలను వేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాల రైతులకు అవగాహన కల్పించారు. మోతాదుకు మించి యూరి యా వాడకం వల్ల చీడపీడలు సోకి రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులు దుక్కులు దున్ని పచ్చిరొట్టె, జిలుగు, మినుము చల్లి పార పెట్టినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు చేయా లని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్సింగ్, ఏడీఏ విజయనిర్మల, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీ మృతి జహీరాబాద్ టౌన్: పని చేస్తున్న ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని రాయిపల్లి(డి) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కూ లీల కథనం మేరకు.. మండలంలోని రాయిపల్లి(డి) గ్రామానికి చెందిన ఎర్రోల కమలమ్మ(65)తోటి కూలీలతో కలిసి ఉదయం ఉపాధి పనులకు వెళ్లింది. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై కింద పడిపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్, కూలీలు వెంటనే జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ లభ్యం చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం నర్సంపల్లి అటవీప్రాంతంలో ఆదివారం బయటపడ్డ గుర్తు తెలియని మృతుడి ఆచూకీ లభ్యమైంది. ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండలం చాగళ్ల గ్రామానికి చెందిన తుల్లూరు వెంకయ్య(58) చేగుంట మండల కేంద్రంలో ఉండే తన కుమారుడి ఇంట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాడు. మానసిక పరిస్థితి బాగాలేని అతడు మార్చి 23న ఇంటి నుంచి కన్పించకుండా పోయాడు. అప్పటి నుంచి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆదివారం అటవీ ప్రాంతంలో మృతదేహమై కనిపించాడు. కుటుంబీకులను పిలిపించి చూయించగా మృతదేహాన్ని గుర్తించారు. మృతిపై ఎలాంటి అనుమానంలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మందుబాబులకు జరిమాన సిద్దిపేటకమాన్: మద్యం తాగి పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. సిద్దిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో తమ సిబ్బందితో కలిసి వారం రోజుల కిందట నిర్వహించిన వాహన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని సోమవారం సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.34,500 జరిమాన విధించినట్లు తెలిపారు. పటాన్చెరులో 27 మంది పటాన్చెరు టౌన్: పటాన్ చెరు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంకై న్ డ్రైవ్లో 27 మంది మద్యం తాగి పట్టుబడినట్లు ట్రాఫిక్ సీఐ లాలూ నాయక్ తెలిపారు. వీరిని సోమవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పర్చగా 9 మందికి రూ.1,500, 17 మందికి రూ.1,000 చొప్పున, మరో వ్యక్తికి రూ. 2 వేలు జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి మిరుదొడ్డి(దుబ్బాక): కారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ మహిళా కూలీలు గోప దేవవ్వ, బ్యాగరి చంద్రవ్వ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పీ.శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం మిరుదొడ్డిలో ఆయన మాట్లాడుతూ అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డి పేటలో ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న మహిళలను కారు ఢీకొట్టడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు అంత్యక్రియల నిమిత్తం రూ. 50 వేల చొప్పున కలెక్టర్ తన అత్యవసర నిధుల నుంచి చెల్లించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 2 లక్షల బీమాను రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. సిద్దిపేట–మెదక్ జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల వద్ద తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. -
50 బస్తాలు గోల్మాల్
పాపన్నపేట(మెదక్): కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్మాల్ జరిగినట్లు పాపన్నపేట కౌలు రైతు బైండ్ల భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట పెద్ద హరిజన వాడ వద్ద ఐకేపీ సభ్యుల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన కౌలు రైతు బైండ్ల భూమయ్య, బట్టి భారతి, ప్రభాకర్, నదరి నారాయణ, చోటు, కుర్మ కిషన్కు చెందిన 766 బస్తాలతో లారీ లోడ్ చేశామన్నాడు. అందులో తనవి 391 బస్తాలు ఉన్నాయని, 389 బస్తాల వరకు లెక్క కట్టి డ్వాక్రా గ్రూపు సభ్యురాలు సంచిపై సంఖ్య రాసిందన్నారు. అనంతరం రెండు సంచులు తెచ్చి తూకం చేసి లెక్క రాయించానన్నారు. శనివారం ఉదయం ట్రక్ షీట్ లేకుండానే లారీ లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ రైస్ మిల్లుకు వెళ్లిందన్నారు. ఆదివారం ఐకేపీ సభ్యులు తనకు చెందిన 50 ధాన్యం బస్తాలు తక్కువగా వచ్చినట్లు సమాచారం ఇచ్చారని వాపోయాడు. సుమారు 20 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా వచ్చిందంటున్నారని, దీంతో సుమారు రూ.47 వేల నష్టం వస్తుందన్నారు. ట్రక్ షీట్ లేకుండానే లారీ వెళ్లింది ఈ విషయమై కమ్యూనిటీ కో ఆర్డినేటర్ శివరాణిని వివరణ కోరగా.. అప్పటికే చీకటి కావడంతో కమిటీ మెంబర్లు లారీ పూర్తి స్థాయిలో లోడ్ కాక ముందే ఇంటికెళ్లారని అన్నారు. శనివారం పొద్దున కేంద్రం వద్దకు వచ్చే సరికి లారీ లోడ్ చేసుకొని ట్రక్ షీట్ లేకుండానే వెళ్లి పోయిందన్నారు. ట్రక్ షీట్పై కమిటీ మెంబర్ల సంతకాలు ఉంటాయన్నారు. అనంతరం 50 సంచులు తక్కువగా వచ్చినట్లు చెప్పారన్నారు. హమాలీలు కూడా క్వింటాల్కు రూ.40 తీసుకుంటున్నందున వారి వద్ద కూడా లారీలో ఎన్ని బస్తాలు వెళ్లిన లెక్క ఉండాలన్నారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నామని తెలిపారు. సుమారు రూ.47 వేల వరకు నష్టం న్యాయం చేయాలంటూ కౌలు రైతు ఆవేదన -
నేడు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో ఈనెల 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ మల్లేశయ్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిపో పరిధిలోని ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలతోపాటు మరింత మెరుగైన సేవలు అందించడానికి సూచనలు, సలహాలను ఇవ్వడానికి 9063417161 నంబరుకు ఫోన్చేసి వివరించాలని సూచించారు. జీతంపై అవగాహన ఉండాలిఎస్పీ పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు సిబ్బంది పోలీసు జీతం ప్యాకేజీ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. గతేడాది డిసెంబర్ 31న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన హోంగార్డు మశ్చేందర్ కుటుంబానికి మంజూరైన చెక్కును బ్యాంకు అధికారులతో కలసి ఎస్పీ చేతుల మీదుగా అందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినందుకు రూ.30 లక్షలు, ఇద్దరి పిల్లల చదువు నిమిత్తం రూ.4లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి కల్యాణి, ఆర్ ఐ డానియల్, బ్యాంక్ మేనేజర్ రాజేందర్ తదితరులున్నారు. ఎస్టీ గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్కంగ్టి(నారాయణఖేడ్): గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని గురుకుల ప్రతిభా కళాశాల, కల్వంచలోని శాంతినగర్ భాగ్యలత కళాశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన బాలురకు, 16వ తేదీన బాలికలు తమకు సంబంధించిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, స్పోర్ట్స్, పీహెచ్సీ సర్టిఫికెట్లు, మూడు కలర్ ఫొటోలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. కొనుగోళ్లు వేగవంతండీఆర్డీఓ పీడీ జ్యోతి వట్పల్లి(అందోల్): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా డీఆర్డీఓ పీడీ జ్యోతి సూచించారు. కేరూర్లో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడగా హమాలీలు సమయానికి రాకపోవడంతో కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందని తెలిపారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. తూకం చేసిన వెంటనే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. లోక్అదాలత్పై అవగాహన కల్పించండినారాయణఖేడ్: లోక్అదాలత్పై కక్షిదారులకు అవగాహన కల్పించి పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకునేలా చూడాలని ఖేడ్ జూనియర్ సివిల్జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పోలీసు అధికారులకు సూచించారు. కోర్టులోని డివిజన్ పరిధి పోలీసు అధికారులతో సోమవారం లోక్అదాలత్పై నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. వచ్చేనెల 14న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. డీఎస్పీ వెంకట్రెడ్డి, డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వర్తించే పోలీసులు పాల్గొన్నారు. -
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను అధికారులకు చెప్పుకున్నారు. కాగా, ప్రజావాణిలో 73 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ...ప్రజా సమస్యలు పెండింగ్లో ఉంచకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, డీఆర్ఓ పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు. నా పేరుపై భూమి మార్చండి నా భర్త పేరుపై సర్వే నం.101.ఆలో 3.14ఎకరాలు ఉన్న వ్యవసాయ భూమిని నా పేరు మీదికి మార్చాలి. నా భర్త 19 డిసెంబర్ 2020లో మృతి చెందాడు. నా భర్త పేరుపై ఉన్న భూమిని నా పేరు పైకి మార్చాలని దరఖాస్తు చేసుకున్న. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. అధికారులు చర్యలు తీసుకొని పేరు పైకి భూమిని మార్చాలి. –తుల్జమ్మ, గ్రా.శేకాపూర్, మం. జహీరాబాద్ -
విద్యా ప్రమాణాలపై నజర్
ఉపాధ్యాయులకు శిక్షణ ● నేటి నుంచి నెలాఖరు వరకు ● మూడు విడతల్లో ట్రైనింగ్ ● జిల్లాలో 3,630 మందినెలాఖరు వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగా కటెంట్ ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ స్కిల్స్, లెర్నింగ్ అవుట్ కమ్స్ వంటి విషయాలపై ఉపాధ్యాయులకు శిక్షణనిస్తారు. ఉదయం 9.30గంటల నుంచి శిక్షణ ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణలో ఒకటవ తరగతి నుంచి టెన్త్ వరకు గల పాఠ్యపుస్తకాల నిర్మాణ క్రమాన్ని అర్థం చేసుకోవడం. నిరంతర సమగ్ర మూల్యాకరణం ఫార్మేటీవ్ అసెస్మెంట్ పరీక్షల నిర్వహణ, అంశాలవారీగా విద్యా ప్రమాణాలపై అవగాహన, బోధనా వ్యూహాల పెంపు, బోధన అభ్యసన ప్రక్రియలను సమర్థవంతంగా తరగతి గదిలో అమలు, ప్రాజెక్టు వర్క్ల నిర్వహణ, బోధనలో అభ్యసన పరికరాల వినియోగంపై అవగాహన వంటి అంశాలపై శిక్షణనిస్తారు. ఏ ఒక్క ఉపాధ్యాయులకు శిక్షణలో మినహాయింపు లేదు. సర్కారీ బడుల్లో కొంతమంది విద్యార్థులు చదవడం, రాయడం వంటివి కూడా చేయకపోతుండటాన్ని ఇటీవల పలు సర్వేలు వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే విద్యా ప్రమాణాల పెంపుపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. విద్యార్థుల లోపాలను సరిచేసేందుకు ముందుగా ఉపాధ్యాయులకే తర్ఫీదునివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు శిక్షణ తరగతులను నిర్వహించనుంది. ఈ శిక్షణ తరగతులతోనైనా ఈసారి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాల స్థాయికి చేరుకుంటారని సర్కారు ఆశిస్తోంది. నారాయణఖేడ్: విద్యాప్రమాణాలు పెంపొందించడం లక్ష్యంగా ఉపాధ్యాయుల శిక్షణ తరగతులకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి జిల్లావ్యాప్తంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా ఎస్జీటీలకు మండల కేంద్రాలతోపాటు, స్కూల్ అసిస్టెంట్లకు జిల్లా కేంద్రంలో ఈ శిక్షణ తరగతులు ఉండనున్నాయి. ఇదివరకే ఎంపిక చేసిన జిల్లా రిసోర్స్పర్సన్లకు (డీఆర్పీ) రాష్ట్రస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. పడిపోతున్న ప్రమాణాలను గుర్తించి... కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోతున్న విషయాన్ని అందిన సర్వేల ప్రకారం విద్యాశాఖ గుర్తించింది. విద్యార్థి చదవడం, రాయడంలో కనీస ప్రమాణాలు కనిపించడంలేదని గమనించారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు ముందుగా టీచర్లలో మార్పు తేవాలని భావించింది. విద్యార్థుల స్థాయిని గుర్తించడం, వెనుకబడిన వారికి అర్థమయ్యేలా బోధన చేయడం, మారుతున్న బోధన విధానాలను అనుసరించడం, సిలబస్లో మార్పులను అవగతం చేసుకోవడంతోపాటు సాంకేతిక విద్యావిధానాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర తదితర పలు రాష్ట్రాల్లో విద్యాబోధనల్లో సరికొత్త మెళకువలను అనుసరిస్తున్నారు. అదేస్థాయిలో టీచర్లలో బోధనా పటిమను పెంచేలా శిక్షణ ఇవ్వడం ద్వారా ఫలితాలు సాధించగలమని విద్యాశాఖ భావిస్తోంది. శిక్షణకు ఏర్పాట్లు జిల్లాలో 3,630మంది ఉపాధ్యాయులకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి 17 వరకు మొదటి విడత, 20 నుంచి 24వరకు రెండో విడత, 27 నుంచి 31వరకు మూడో విడత శిక్షణనివ్వనున్నారు. ఈ శిక్షణకు సబ్జెక్టుల వారీగా రిసోర్స్పర్సన్లను ఎంపిక చేశారు. వీరు క్షేత్రస్థాయిలో సబ్జెక్టుల వారీగా ఆయా ఎంపిక చేసిన అంశాలపై శిక్షణనిస్తారు. ఇలా శిక్షణ...శిక్షణకు ఏర్పాట్లు పూర్తి.. జిల్లాలో ఈనెల 13 నుంచి ఈనెలాఖరు వరకు ఉపాధ్యాయ శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నాం. ఎస్జీటీలకు మండల స్థాయిలో, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలకు జిల్లా స్థాయిలో శిక్షణ ఉంటుంది. నిర్ణయించిన అంశాల వారీగా శిక్షణ కొనసాగుతుంది. ఉపాధ్యాయుల విధిగా శిక్షణకు హాజరు కావాలి. – వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, సంగారెడ్డి -
సర్వేయర్ల కొరతకు చెక్
భూ సర్వే పరిష్కారానికి చర్యలు ● త్వరలో రానున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ● ఈనెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ శిక్షణ ఫీజుల వివరాలు ఓసీ అభ్యర్థులు రూ. 10,000 బీసీ అభ్యర్థులు రూ. 5,000 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2,500 సంగారెడ్డి జోన్: జిల్లాలో భూ సర్వే సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలు మండలాల్లో సర్వేయర్ల కొరత తీవ్రస్థాయిలో ఉండటంతో భూ సర్వే సమస్యలు పేరుకుపోతున్నాయి. దీంతో లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అర్హతతో పాటు ఆసక్తి కలిగి ఉన్న వారిని ఎంపిక చేసి శిక్షణ అనంతరం లైసెన్స్లు జారీ చేయనున్నారు. పరిష్కారానికి నోచుకోని భూ సర్వే సమస్యలు గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి చట్టంతో వివిధ రకాల భూ సమస్యలు అధికమయ్యాయి. అందులోభాగంగా భూమి, సర్వే నంబర్ మిస్సింగ్తోపాటు వాస్తవంగా ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ, తక్కువగా నమోదై ఉండటం, ఒకరిపేరుతో కాకుండా మరొకరిపేరుతో ఆన్లైన్లో చూపించటంతో పాటు అనేకరకాల సమస్యలు నెలకొన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రధానంగా సర్వేయర్లు అవసరం. జిల్లాలో చాలాచోట్ల ఇన్చార్జిలుగా వ్యవహరించడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉండటంతో భూ సర్వే సమస్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సర్వేయర్ల కొరత తీరుస్తూ ప్రతీ మండలానికి ఒక సర్వేయర్ ఉండాలి. అయితే జిల్లాలో మొత్తం 28 మండలాలకు గాను 15 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. 1,67,948 సర్వే నంబర్లు, సుమారు 8 లక్షల ఎకరాల భూ విస్తీర్ణం కలిగి ఉంది. ఆయా మండలాల్లో సుమారు నాలుగువేలకు పైగా సర్వే కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ లైసెన్స్ సర్వేయర్ల నియామకం కోసం అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 17 వరకు మీసేవ కేంద్రాల్లో రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్లో గణిత శాస్త్రం ఒక సబ్జెక్టు కలిగి ఉండి 60% మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఐటిఐ డ్రాఫ్ట్మెన్(సివిల్), డిప్లమో సివిల్, బీటెక్ సివిల్ లేదా ఇతర సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. 60 మంది ఎంపికకు కసరత్తు జిల్లాలో 60 మంది లైసెన్స్ సర్వేయర్ల ఎంపికకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్హతలను బట్టి ఎంపిక చేసిన వారికి 50 రోజులపాటు శిక్షణనివ్వనున్నారు. అందులో ఉత్తీర్ణులైన వారికి 42 రోజులపాటు క్షేత్రస్థాయిలో సర్వేయర్ కింద శిక్షణనిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్రస్థాయిలో నిర్వహించే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి భూమి సమాచార నిర్వహణ విభాగం నుంచి లైసెన్స్ సర్వేయర్గా ఉత్తర్వులు జారీ చేస్తారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి లైసెన్స్ సర్వేయర్ కోసం ఆసక్తి ఉండి అర్హులైన వారు ఈ నెల 17 వరకు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికై న వారికి నిబంధనల మేరకు శిక్షణ అందించి లైసెన్సులు జారీ చేస్తారు. –ఐనేష్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, సంగారెడ్డి -
పట్లోళ్ల కుంట ఆక్రమణపై పరిశీలన
వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామంలో పట్లోళ్లకుంట శిఖం భూమి ఆక్రమణపై ఈ నెల 8న ‘సాక్షి’దినపత్రికలో ‘కబ్జా కోర ల్లో పట్లోళ్ల కుంట’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు. సోమవారం డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్, ఇరిగేషన్ ఏఈ నిషిత గ్రామానికి వెళ్లి కుంటను పరిశీలించారు. కుంట పరిధిలో పంట వేసిన వారిని పిలిచి వివరాలు అడిగారు. రెండు రోజుల్లో సర్వే చేసి కుంట శిఖం భూమి ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నదనే విషయాన్ని గుర్తిస్తామని అధికారులు తెలిపారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
న్యాల్కల్(జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. న్యాల్కల్లో ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామంలో బుద్ధ విహార్ను ప్రారంభించడంతోపాటుగా గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో నడుస్తూ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. న్యాల్కల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఎంపీ తెలిపారు. ఇళ్లు కట్టుకుంటున్న వారికి ఇటీవల రూ.1లక్ష చొప్పున అందించడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రేజింతల్ గ్రామశివారులో గల శ్రీసిద్ధివినాయక ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ బుద్దిష్టు సొసైటీ సభ్యులు దశరథ్, సుభాష్, బక్కప్ప, రాజ్కుమార్, నర్సింలు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ గౌడ్, సమతా సైనిక్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్, జిల్లా అధ్యక్షుడు కరణం రవికుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎంపీ సురేశ్కుమార్ షెట్కార్ -
రోడ్ల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్రావుసంగారెడ్డి టౌన్/సంగారెడ్డి జోన్: కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహులకు మద్దతు ఇస్తోందని ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో జిన్నారం మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తను సోమవారం ఎంపీ పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ రహదారి 65 విస్తరణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనలో అరెస్ట్ అయిన వారి పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారుల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు. రహదారుల విస్తరణతో అభివద్ధికి బాటలు పడతాయన్నారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు: బల్దియా పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని..నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని ఆయన అధికారులను ఆదేశించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రపురం, భారతినగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు డివిజన్ల పరిధిలో శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. -
వృక్షాలు నేలకొరిగి.. తీగలు తెగిపడి
ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం వాతావరణంలో మార్పులేర్పడి బలమైన గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మాచనూర్, కుప్పానగర్తో పాటు పలు గ్రామాల మధ్య పలుచోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఎస్సై నరేశ్ సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని నేలకొరిగిన వృక్షాలను జేసీబీ సహాయంతో తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు.ఝరాసంగం మండలంలో భారీ వర్షం -
ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు గడువు పెంపు
పటాన్చెరు టౌన్: మహాత్మ జ్యోతి బాపూలే బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 17 వరకు గడువు పొడిగించినట్లు పటాన్చెరు మండలం ముత్తంగి ప్రిన్సిపాల్ నవనీత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కల్పనకు కాంస్య పతకంమునిపల్లి(అందోల్): తమిళనాడులోని తిరుమ లైలో ఈనెల 9 నుంచి 12 వరకు జరి గిన హెచ్ఎఫ్ఐ హ్యాండ్బాల్ 40వ జాతీయ చాంపియన్షిప్ పోటీలో బుదేరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని బి.కల్పన కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి సోమ వారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘తక్కువ నీటితో పంటలు పండించాలి’పటాన్చెరు టౌన్: రైతులు తక్కువ నీటితో పంటలు పండించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో మండల వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి సోమవారం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ లక్ష్మిప్రసన్న, డాక్టర్ స్పందన పాల్గొని రైతులకు సూచనలు చేశారు. -
భారీ వాహనం బోల్తా
కంది(సంగారెడ్డి): కంది మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై భారీ వాహనం బోల్తా పడింది. శనివారం రాత్రి నాందేడ్ అకోలా వైపు నుంచి ముంబై వైపు వెళ్తున్న భారీ వాహనం మామిడిపల్లి చౌరస్తా వద్ద బ్రిడ్జి దిగుతున్న క్రమంలో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడిన సమయంలో వెనక నుంచి ఇతర వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయమై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందలేదని ఎస్సై రవీందర్ తెలిపారు. -
ఆడుకుంటూ ఇనుప చువ్వలకు తగిలి
విద్యుదాఘాతంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో బా లుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని లింగ్సాన్పల్లి తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన చిలికి, మోహన్ పెద్ద కుమారుడు రీతు(10) నాల్గో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఆడుతూ స్లాబ్ పైకి ఎక్కి ఇనుప చువ్వలకు తగిలాడు. అప్పటికే వైరు తేలి ఉండటంతో కరెంటు షాక్ కొట్టి పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్ఐ సత్యనారాయణను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వాటర్ హీటర్ షాక్తో.. పాపన్నపేట(మెదక్): వాటర్ హీటర్ షాక్ కొట్టి మహిళ మృతి చెందిన ఘటన పాపన్నపేటలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన బెస్త భాగ్య, భూపతి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. ఉదయం చేపలు పట్టడానికి భూపతి వెళ్లగా, పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న భాగ్య (36) స్నానం చేయడానికి బకెట్ నీటిలో వాటర్ హీటర్ పెట్టింది. కరెంట్ ఆఫ్ చేయకుండా నీరు వేడి అయ్యాయా లేదా అని బకెట్లో చేయి పెట్టి చూడగా షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. వడదెబ్బతో అడ్డా కూలీ తూప్రాన్ : వడదెబ్బతో అడ్డా కూలీ మృతి చెందిన ఘటన పట్టణ కేంద్రంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ శివానందం కథనం మేరకు.. మాసాయిపేట మండలం పోతాన్పల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య(44) అడ్డా కూలీగా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగా తూప్రాన్లో అడ్డా మీదికి శనివారం ఉదయం ఇంటి నుంచి వచ్చాడు. రాత్రి మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా రోడ్డు పక్కన పడి ఉన్నాడు. పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులు గుర్తించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న భార్య లక్ష్మీ, కుమారులు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బ కారణంగా మృతి చెందాడని వైద్యులు తెలుపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
చిలప్చెడ్(నర్సాపూర్): వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిలప్చెడ్ మండలం బద్య్రా తండాలో జరిగింది. గొర్రెల యజమా ని కడావత్ లక్ష్మణ్ కథనం మేరకు.. శనివారం జీవాలను మేపుకొచ్చి పాకలోకి పంపించాం. ఆదివారం ఉదయం పాక దగ్గరకి వెళ్లి చూడగా నాలుగు గొర్రెలు మృతి చెంది కనిపించాయి. గొర్రెలపై కుక్కలు దాడి చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. గొర్రెల మృతితో నష్టం జరిగిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పిడుగుపాటుతో పాడి గేదె మద్దూరు(హుస్నాబాద్): పిడుగుపాటుతో పాడి గేదె మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మానేపల్లి రామచంద్ర తన వ్యవసాయ బావి వద్ద శనివారం రాత్రి గేదెను కట్టేసి ఇంటికొచ్చాడు. ఉదయం వెళ్లి చూసేసరికి పిడుగుపాటుతో గేదె మృతి చెందింది. రూ.65 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. -
అభ్యుదయ రైతుగా గుర్తింపు
కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన నాయిని లక్ష్మి, భర్త రామక్రిష్ణాగౌడ్, ఇద్దరు పిల్లలతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంది. మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయ కుటుంబం కావడంతో భార్యాభర్తలు సాగు చేస్తున్నారు. కాగా లక్ష్మి భిన్నంగా ఆలోచించి సాంప్రదాయ సాగుకు ఆధునికత, కొత్తదనం జోడించింది. వరి పంటతోపాటు పంటమార్పు చేస్తూ కూరగాయలు, బంతిపూలు, కంది పంట సాగు చేసింది. మినికిట్స్ సాగు సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, సంధ్య సూచనలతో వరి పంటలో 5 కిలోల ఫౌండేషన్ విత్తన మినికిట్స్ సాగు చేశారు. ఇందులో ఆర్ఎన్ఆర్ 21278, 31479, 15048 (షుగర్లెస్), కేఎన్ఎం 12368, డబ్ల్యూజీఎల్ 28369, ఆర్డీఆర్ 1260, కేఉపీఎస్ 625 రకం వరి పంటను సాగు చేసి వచ్చిన ధాన్యాన్ని తోటి రైతులకు విత్తనాలుగా అమ్మారు. దీనికితోడు వరిలో దేశివాలి రకం కుచ్ పటారియా, చిరూర్కి, చిట్టిముత్యాలు, కాలబత్తి(నల్లవడ్లు) సాగు చేశారు. పంటమార్పు కోసం : వరి పంటలో మార్పుకోసం కూరగాయలు టమాటా, వంకాయ, కాకరతోపాటు బంతిపూలు, కంది సాగు చేశారు. దీంతోపాటు పది గుంటల్లో తొమ్మిది రకాల కూరగాయల పంట ఇంటి అవసరాల కోసం సాగు చేశారు. కూరగాయలు, వరి పంటలో ఒక ఎకరం సేంద్రియ పద్ధతిలో సాగు చేసినట్లు తెలిపారు. మండలంలోని తునికి వద్ద గల కేవీకే శాస్త్రవేత్తలు ఆవును ఇవ్వగా వారి సూచనలతో ఆవును పెంచుతూ దాని పేడ, మూత్రంతో జీవాంమృతం, బీజాంమృతం ఎరువు తయారీ చీడపీడల నివారణకు వివిధ రకాల ఆకుల కషాయాలు తయారు చేసి వినియోగించింది. ఆర్ఈఏసీ సభ్యురాలిగా లక్ష్మి ఎంపిక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆర్ఈఏసీ (రీసెర్చ్ అండ్ ఎక్సటెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్) సభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు రైతులను ఎంపిక చేయగా అందులో మహిళా రైతుగా నాయిని లక్ష్మిని ఎంపిక చేశారు. వైస్ చాన్స్లర్ అల్దాస్ జానయ్య లక్ష్మిని అభినందించారు. రెండేళ్లపాటు సభ్యురాలిగా కొనసాగనుండగా సాగుపై సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆర్ఈఏసీ సమావేశంలో రైతులకు అందుబాటులో ఉండేలా నర్సాపూర్లో విత్తన గోదాం, టింబర్ గోదాం నిర్మించాలని సూచించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారంతో.. భర్త రామక్రిష్ణాగౌడ్తోపాటు కుంటుంబ సభ్యులు సహకారంతో సాగు చేస్తున్నా. సాగులో మినికిట్స్, పంట మార్పిడి, కూరగాయలు సాగు చేశా. ప్రస్తుతం వరి పంట కోత పూర్తికాగా కాకరకాయ, టమాటా, వంకాయ పంట ఉంది. దీంతోపాటు ఇంటి పంటగా పలు రకాల ఆకు కూరలు ఉన్నాయి. సాగులో గుర్తింపు వచ్చి ఆర్ఈఏసీ సభ్యురాలిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. – నాయిని లక్ష్మి, ఆర్ఈఏసీ సభ్యురాలు మినికిట్స్ సాగుతోపాటు పంట మార్పు చేసి సాగు చేయడంతో సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రేవేత్తలు డిసెంబర్ 2024లో పీజేటీఏయూ వజ్రోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు అభ్యుదయ రైతులను ఎంపిక చేశారు. అందులో కంచన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు లక్ష్మి ఎంపికై ంది. దీంతో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ సహాయ సంచాలకు ఉమారెడ్డి ప్రశంసాపత్రం, మెమోంటో అందజేసి సన్మానించారు. -
నిర్మాణానికి రూ.కోట్లు.. తీరని పాట్లు
హుస్నాబాద్: స్థానిక చిరు వ్యాపారస్తుల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ నిరుపయోగంగా మారింది. దీంతో రైతులు పండించిన తాము పండించిన కూరగాయాలను పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తా, బస్టాండ్ ఏరియా, అంబేడ్కర్ చౌరస్తాలో రోడ్లపైన ఎండకు ఎండుతూ, వానకు నానుతూ అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. రూ.3 కోట్లతో నిర్మాణం రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం పట్టణంలోని శివాజీనగర్లో రూ.3 కోట్ల వ్యయంతో రైతు బజార్ను నిర్మించింది. జనవరి 5, 2025న మంత్రి పొన్నం ప్రభాకర్ భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. కానీ అధికారుల మధ్య సమన్వయం లేక ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. మున్సిపాలిటీకి చెందిన స్థలంలో వ్యవసాయ మార్కెట్ యార్డు తమ నిధులతో రైతు బజార్ భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రైతు బజార్ కోసం 6 షెటర్లు నిర్మించారు. పై రెండు అంతస్తుల్లో సువిశాలంగా ఫంక్షన్ హాల్ నిర్మించారు. రైతు బజార్, ఫంక్షన్ హాల్ ద్వారా వచ్చే ఆదాయమంతా వ్యవసాయ మార్కెట్కే చెందుతుంది. రోడ్లపై కూరగాయలు అమ్ముతున్న రైతులు, చిరు వ్యాపారులను రైతు బజార్కు రప్పించే అధికారం మున్సిపల్ అధికారులకు ఉంటుంది. కానీ తమకు ఆదాయం లేదని రైతు బజార్కు తమకు ఎలాంటి సంబంధం లేనట్లుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి రోడ్లపైనే విక్రయాలు వివిధ మండలాల రైతులు తాము పండించిన కూరగాయలు అమ్ముకునేందుకు నిత్యం హుస్నాబాద్కు వస్తుంటారు. పట్టణంలో ఇంత వరకు కూరగాయల మార్కెట్ గానీ, రైతు బజార్ గానీ లేదు. దీంతో కొన్నేళ్ల నుంచి రైతులు పండించిన పంటలను రోడ్ల పైనే అమ్మకాలు కొనసాగిస్తున్నారు. రైతు బజార్ వినియోగంలోకి వస్తే తాజా కూరగాయలు, ఇతరాత్ర పంట ఉత్పత్తులు ప్రజలకు తక్కువ ధరలకే లభించనున్నాయి. అలాగే, రోడ్ల పైనే కూరగాయలు అమ్మడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. గతంలో పోలీస్లు రోడ్లపై కూరగాయలు అమ్మొద్దని తరాజులను తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. రైతు బజార్ను నిర్మించిన వ్యవసాయ మార్కెట్ అధికారులు, పాలకవర్గం పట్టించుకోకపోవడం వల్లనే రైతు బజార్ అలంకారప్రాయంగా మారిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిరుపయోగంగా హుస్నాబాద్ రైతు బజార్ స్థలం ఒకరిది.. నిర్మాణం మరొకరిది అధికారుల మధ్య లోపంతో తెరుచుకోని భవనం రోడ్ల వెంటే కూరగాయల అమ్మకాలు ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు పది రోజుల్లో అందుబాటులోకి తెస్తాం రైతు బజార్లో టాయిలెట్లు, లైటింగ్ సిస్టమ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడూ పనులను పర్యవేక్షిస్తున్నాం. పది రోజుల్లో పనులు పూర్తి చేసి రైతుల ముంగిటకు రైతు బజార్ను తెస్తాం. అన్ని సౌకర్యాలతో రైతు బజార్ను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – కంది తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, హుస్నాబాద్ -
గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్
పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పటాన్చెరు ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ పరమేశ్వర్ గౌడ్ కథనం మేరకు.. పటాన్చెరు శివారు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఆదివారం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా రెండు బైకుల్లో 1600 గ్రాముల గంజాయిని తీసుకెళ్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారు సంగారెడ్డికి చెందిన తునికి ఫణీంద్ర, వికారాబాద్కు చెందిన వికాస్, పటాన్చెరు మండలం క్యాసారం చెందిన సిరిపురం సంపత్, హైదరాబాద్ లాలాపేట్కు చెందిన ధనరాజ్, బొల్లారానికి చెందిన ఆంజనేయులు మహబూబ్నగర్కి చెందిన చాకలి బాలరాజుగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి, ఐదు సెల్ ఫోన్లు, రెండు బైక్లను సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతరలో సునీతారెడ్డి పూజలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రాయిలాపూర్లో జరుగుతున్న శ్రీమల్లికార్జునస్వామి (మల్లన్న) జాతరలో ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాత, నిర్వాహకులు శామీర్పేట నర్సింగారావు దంపతుల ఆధ్వర్యంలో దేవతామూర్తులకు ఒగ్గు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో నాగ్సాన్పల్లి మాజీ సర్పంచ్ ఎల్లం, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సార రామాగౌడ్, మాజీ ఎంపీటీసీ స్వప్న కిషోర్ గౌడ్, మొగులాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టొద్దు బైరి నరేశ్ను అడ్డుకున్న గ్రామస్తులు గజ్వేల్రూరల్: నాసికత్వం పేరుతో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టొద్దని మండల పరిధిలోని బెజుగామ గ్రామస్తులు, గ్రామ యువత పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం(ఎంఎన్ఎస్) వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు బైరి నరేశ్ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ యువత మాట్లాడుతూ.. దేవుళ్లను నమ్మవద్దంటూ ప్రజల్లో విద్వేశాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ తమల్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. బైరి నరేశ్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా మారిపోయానని, ఎవరినీ ఇబ్బందులకు గురి చేసేందుకు రాలేదని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుళ్లినస్థితిలో మృతదేహం గుర్తింపు చిన్నశంకరంపేట(మెదక్): కుళ్లిస్థితిలో మృతదేహం లభ్యమైన ఘటన నార్సింగి మండలం నర్సంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపల్లి గ్రామానికి చెందిన జెగ్గరి సత్యం మరికొందరు రైతులు కలిసి ఆదివారం అడవిలో తునికి ఆకును తెంపుతున్న క్రమంలో గుట్టరాళ్ల మధ్య మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీస్లకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో బండరాళ్ల మధ్య మృతదేహం ఉండటంతో ఇన్ని రోజులు ఎవరూ గమనించలేదని తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపారు. రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్కు సిద్దిపేట వేదిక ఏపీఐ వైస్ చైర్మన్ డాక్టర్ గణేశ్ వెనిశెట్టి సిద్దిపేటకమాన్: జనరల్ ఫిజీషియన్ వైద్యుల రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్కు సిద్దిపేట వేదిక కావడం తమకు గర్వకారణమని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) వైస్ చైర్మన్ డాక్టర్ గణేశ్ వెనిశెట్టి అన్నారు. సిద్దిపేట ఐఏంఏ హాల్లో జనరల్ ఫిజీషియన్ వైద్యుల రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని 200 మంది ప్రముఖ జనరల్ ఫిజీషియన్లు పాల్గొన్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స అందించాలి. సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవడం, చికిత్సలో నూతన టెక్నాలజీ వినియోగం అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ పెంటాచారి, జనరల్ సెక్రటరీ డాక్టర్ క్రాంతికుమార్, డాక్టర్ గణేశ్, డాక్టర్ ఫణిందర్ తదితరులు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీ: ఒకరు మృతి
పాపన్నపేట(మెదక్): రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పాపన్నపేట మండలం కుర్తివాడ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. కుర్తివాడ గ్రామానికి చెందిన కర్రెల శేఖర్(60) నిత్యం హనుమన్ ఆలయం వద్ద పరిసరాలు శుభ్రం చేస్తుంటాడు. ఆదివారం టీవీఎస్ మోపెడ్పై కుర్తివాడ నుంచి పాపన్నపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిన్పూర్ గ్రామం నుంచి మెదక్ వైపు వెళ్తున్న బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శేఖర్కు, మరో బైక్పై ఉన్న కిష్టయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. కిష్టయ్యను మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్పై నుంచి పడి యువకుడు చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కర్నాల్పల్లి శివారులో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడి బంధువుల కథనం మేరకు.. రామాయంపేట మండలం దంతపల్లి గ్రామానికి చెందిన కేసరి ప్రవీణ్ (25) గ్రామంలో వాటర్ మెన్గా పని చేస్తున్నాడు. బంధువులకు సంబంధించిన ఓ వేడుక కోసం కర్నాల్పల్లి ఎల్లమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. బైక్పై చేగుంట వైపునకు వెళ్తున్న ప్రవీణ్ వాహనం అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. -
హక్కుల కోసం పోరాడేది ‘సీపీఐ’
బెజ్జంకి(సిద్దిపేట): కార్మికుల, కూలీల హక్కుల సాధన కోసం పోరాడేది సీపీఐ పార్టీయేనని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి అన్నారు. బెజ్జంకిలో సీపీఐ మండల 13వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల మృతి చెందిన సీపీఐ నాయకులకు, పహల్గామ్ మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పా టించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీలాంటి అనేక చట్టాలను అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించామన్నారు. కేంద్రం కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తూ పేదలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, తదితర సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఇవ్వాలని సూచించారు. దేశమంతా ముక్త కంఠంతో పార్టీలకతీతంగా ఆపరేషన్ సిందూర్కు అండగా ఉంటుందన్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా 20న ఏఐటీయూసీ నిర్వహించే సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్రెడ్డి, శంకర్, మండల కార్యదర్శి రూపేశ్, మధు, మహేశ్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి -
సంగారెడ్డి రోడ్లకు మహర్దశ
● మంజూరైన నిధులు ● త్వరలో శంకుస్థాపనలు సంగారెడ్డి : సంగారెడ్డి నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. సంగారెడ్డి పట్టణంలోని 4 రోడ్లకు నిధులు మంజూరయ్యాయి. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ విభాగం, హెచ్ఎండీఏల నుంచి మొత్తంగా సంగారెడ్డి రోడ్లకు రూ.83.94కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలోని ఐటీఐ నుంచి గొల్లగూడెం వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం, నటరాజ్ థియేటర్ నుంచి కల్వకుంట మీదుగా ఐఐటీ వరకు 80 ఫీట్ల రోడ్ల నిర్మాణం, రుక్మిణి థియేటర్ నుంచి చింతలపల్లి కిష్టయ్య గూడెం, రాజంపేట నుంచి డీఎస్పీ కార్యాలయం మీదుగా మల్కాపూర్ చింతల వరకు మరో రోడ్డును 80 ఫీట్ల రోడ్డుగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పట్టణంలో రద్దీగా ఉండే బైపాస్ రోడ్డును సెంటర్ లైటింగ్స్ డివైడర్ ఏర్పాటు కోసం రూ.12 కోట్లతో నేషనల్ హైవే అథారిటీకి అప్పగించి టెండర్ ప్రక్రియలో ఉంది. అలాగే సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి రైతు వేదిక పక్క నుంచి రూ.4 కోట్లతో బీటీ రోడ్డును కలివేముల నుంచి ఓడీఎఫ్ రోడ్డుకు అనుసంధానం చేసే మరో రోడ్డుకు నిధులు మంజూరైన సంగతి తెలిసిందే. ఇక పట్టణంలోని రాజీవ్ పార్క్ అభివృద్ధి కోసం రూ.12 కోట్లతోపాటు ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్,హెచ్ఎండీఏల నుంచి విడివిడిగా కూడా నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే ఈ పనులకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం గత పదేళ్లలో చేయని అభివద్ధిని ప్రస్తుతం చేపడుతున్నాం. రాబోయే మూడేళ్లలో సంగారెడ్డి ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. – నిర్మలారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ -
సీ్త్రనిధి.. వడ్డీ ఏదీ?
ఐదేళ్లుగా పెండింగ్ ● మహిళా సంఘాల ఎదురుచూపు ● అధికారుల్లో స్పష్టత కరువువట్పల్లి(అందోల్): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం వారికి స్వల్ప వడ్డీకి రుణాలు అందజేస్తోంది. బ్యాంకు లింకేజీతో పాటు సీ్త్రనిధి వంటివి మంజూరు చేస్తోంది. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లిస్తోంది. అయితే 2019 నుంచి వడ్డీ అందడం లేదని సీ్త్రనిధి లబ్ధిదారులు పేర్కొంటున్నారు. వడ్డీ కోసం ఎదురుచూపు.. జిల్లాలో 19,508 స్వయం సహాయక, 697 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. వీటిలో 365 సంఘాల్లోని సుమారు 2,10,391 మంది సభ్యులు సీ్త్రనిధి రుణాలు తీసుకొని వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి ప్రభుత్వం 2012 నుంచి సీ్త్రనిధి రుణాలను మంజూరు చేస్తోంది. ఒక్కో సభ్యురాలికి వ్యక్తిగత రుణం రూ.40వేల నుంచి రూ.3లక్షల వరకు అందిస్తోంది. వాయిదాలు సక్రమంగా చెల్లించిన వారికి వడ్డీ తిరిగి చెల్లించాల్సి ఉండగా నాలుగేళ్లు దాటినా ఆ ఊసే లేదని ఆయా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించి కేవలం నాలుగు నెలలకు సంబంధించిన వడ్డీ విడుదల చేసింది. సీ్త్రనిధికి సంబంధించిన వడ్డీని మాత్రం పెండింగ్లో పెట్టింది. త్వరగా వడ్డీ డబ్బులు తిరిగి చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు.మంజూరవగానే సభ్యుల ఖాతాల్లో జమ సీ్త్రనిధికి సంబంధించి రుణాలు సక్రమంగా చెల్లించిన ఆయా సంఘాల సభ్యులకు వడ్డీ చెల్లింపు ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే నేరుగా సభ్యుల ఖాతాల్లో జమవుతాయి. – శ్రీనాథ్, సీ్త్రనిధి సంస్థ రీజినల్ మేనేజర్ -
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని కేరూర్, బిజిలీపూర్, ఖాదిరాబాద్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కానీ ధాన్యం కొనుగోళ్లు మాత్రం చేయలేదు. దీంతో ఈ నెల 11న ‘సాక్షి’దినపత్రికలో ‘24 రోజులైనా గింజ కొనలే’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం తూకం వేయకపోవడానికి కారణాలను తెలుసుకుని వెంటనే కొనుగోళ్లు జరిపించాలని మండల ఐకేపీ ఏపీఎం చంద్రశేఖర్ను ఆదేశించారు. దీంతో ఆయన అక్కడికి చేరుకుని రైతులతో కలిసి స్థానికంగా ఉన్న కూలీలతో మాట్లాడి కొనుగోళ్లు జరిపించారు. ఎట్టకేలకు ఇరవై రోజులకుపైగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూసిన రైతులు కొనుగోళ్లు జరపడం పట్ల ‘సాక్షి’కి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఈఏపీసెట్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల సత్తా
జిన్నారం (పటాన్చెరు): తెలంగాణ ఇంజనీరింగ్,అగ్రిల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో జిన్నారం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన 10మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వెంకటనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్.మహేశ్ అనే విద్యార్థి 67.82 మార్కులతో రాష్ట్రస్థాయిలో 8,518 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు. 692 ర్యాంక్ సాధించిన హారిక జహీరాబాద్ టౌన్: తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలో కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన జి.హారిక్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. పోతిరెడ్డిపల్లికి చెందిన గాండ్ల శ్రీనివాస్రెడ్డి కుమార్తె హారికకు తెలంగాణ స్టేట్ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 95% మార్కులు వచ్చాయి. అత్యుత్తమ ప్రతభ చూపి 692 ర్యాంక్ సాధించింది. మంచి ర్యాంక్ సాధించడంతో ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైన్యానికి మద్దతుగాసంఘీభావ ర్యాలీసదాశివపేట రూరల్(సంగారెడ్డి): దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న దేశ సైనికుల ధైర్యసాహసాలను బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ కొనియాడారు. దేశ సైనికులకు సంఘీభావంగా ఆదివారం మండలంలోని ఆత్మకూర్లో గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో గల బసవేశ్వర విగ్రహం వద్ద జాతీయగీతంతో మానవహారాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ...దేశం కోసం వీరోచితంగా పోరాడుతున్న వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. యుద్ధంలో మృతి చెందిన అమరజవాన్లకు, ఉగ్రవాదుల చేతుల్లో మృతి చెందిన టూరిస్టులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో యువకులు సుభాష్, శ్రీనివాస్,సిద్ధప్ప, మోహన్ సింగ్, శ్రవణ్ పాల్గొన్నారు. ఎఫ్ఆర్ఎస్లో 16 నుంచి మామిడి పండ్ల ప్రదర్శనసంగారెడ్డి: సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానం (ఎఫ్ఆర్ఎస్)లో ఈ నెల 16,17 తేదీల్లో మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎఫ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మామిడితోటల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మెరుగైన ఫలితాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్తలు హాజరవుతారని, జిల్లాలోని రైతులు పాల్గొని పండ్ల తోటల పెంపకం గురించి తెలుకోవాలని కోరారు. సైన్యానికి మద్దతుగా నిలుద్దాంఎంపీ రఘునందన్రావు దుబ్బాక: ఆపరేషన్ సిందూర్తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్తో మన సైనికులు పాక్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్–పాక్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. దేశరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ విరామం లేకుండా పనిచేస్తున్నారన్నారు. దేశరక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి మనమంతా అండగా ఉందామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుభాష్రెడ్డి, ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
బట్టీలుపెట్టి.. పన్నులు ఎగ్గొట్టి
● పన్ను కట్టని వ్యాపారులు ● గ్రామ పంచాయతీల ఆదాయానికి గండి ● ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు ● నిబంధనలున్నా పట్టించుకోని వైనంమండల శివారులో వెలసిన ఇటుక బట్టిపటాన్చెరు టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణంలో, మండల పరిధిలోని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ఇటుకతో చేస్తున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకుని మండలంలో ఆయా గ్రామ పంచాయతీల్లో వ్యాపారులు ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లా నెలకొల్పారు. ప్రతీ ఏడాది రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతున్నా వీటి నిర్వాహకులు ఆయా పంచాయతీలకు ఎటువంటి పన్ను కట్టడం లేదు. వ్యాపారంలో 2% పన్ను చెల్లించాలని నిబంధన ఉన్నా సదరు వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పటాన్చెరు మండల పరిధిలోని రామేశ్వరంబండ, ఇంద్రేశం, ఐనోల్, చిన్న కంజర్ల గ్రామాలతో పాటు నియోజకవర్గ పరిధిలో ఆయా గ్రామాల్లో ఇటుక బట్టీలు పుట్టగొడుగుల్లాగా వెలిశాయి. ఆయా గ్రామ పంచయతీ శివారుల్లో సుమారు పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయి. ప్రతీ బట్టీలోనూ ఇటుకలను కాల్చి వాటి క్వాలిటీని బట్టి ఒక్కొక్కటి రూ.7 నుంచి రూ.11 చొప్పున మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఒక యాజమాని కనీసం వేసవి సీజన్లో 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఇటుకలను విక్రయిస్తారు. వీటి ద్వారా లక్షల్లో వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. వీటి యాజమానులు పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదు. ఇందుకు కారణం విక్రయ సమయంలో ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడమేనని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన రెండు శాతం పన్నులు చెల్లించడం లేదు. పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం గ్రామంలో జరిగే విక్రయాల్లో 2 శాతం పంచయతీ ఖాతాల్లో కచ్చితంగా జమ చేయల్సి ఉంటుంది. కానీ వ్యాపారికి నేరుగా కొనుగోలుదారులు డబ్బులు చెల్లించడంతో పంచాయతీ ఆదాయానికి భారీ గండి పడుతుంది. పంచాయతీల అనుమతి తీసుకోవాలనే నిబంధనలున్నా వాటిని పట్టుంచుకోవడం లేదు. ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు ఇటుక బట్టీలుగా పచ్చని పొలాలు భూ–పరిరక్షణ చట్టం 123/12 పేర్కొన్నట్లుగా వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే ఇటుక బట్టీలను నిర్వహించాలి. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పచ్చని పంటలు పండే భూముల్లో ఇటుక బట్టీలను తయారు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బట్టీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనుమతి తప్పనిసరి మండల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలకు గ్రామ పంచాయతీల నుండి ట్రేడ్ అనుమతి తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో విచారణ చేపడుతాం. విచారణ చేపట్టిన తరువాత ట్రేడ్ అనుమతులు లేకుండా నడిపే ఇటుక బట్టీల యజమాన్యులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం. హరిశంకర్ గౌడ్, మండల పంచాయతీ అధికారి -
దేవుడా... ఎన్నాళ్లీ వెతలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో కేటగిరీల వారీగా దేవాలయాలు గ్రేడ్ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట 6(ఎ) 2 4 7 6(బి) 3 3 6 6(సి) 2 5 3 6(డి) 0 1 0 మొత్తం 7 13 16తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ దేవాలయాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఆయా దేవాలయాలకు రెగ్యులర్ ఈఓలు లేకపోవడంతో ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఫలితంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఇన్చార్జి లుగా వ్యవహరిస్తున్న ఆలయ అధికారులకు సైతం పలు రకాల ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నేళ్లుగా ఆలయాల్లో అధికారుల నియామకం చేపట్టడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 36ప్రముఖ దేవాలయాలున్నాయి. అదేవిధంగా ధూప దీప నైవేద్యం పథకం ద్వారా గుర్తింపు పొందినవి 939 దేవాలయాలున్నాయి. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి నాలుగు కేటగిరీల వారీగా విభజించారు. 6(ఏ) కేటగిరీలో 13, 6(బి) కేటగిరీలో 12, 6(సి) కేటగిరీలో 10, 6(డి) కేటగిరీలో 1 చొప్పున ఆలయాలున్నాయి. సంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లాలో ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయం, రుద్రారం గణేశ్గడ్డ, బొంతపల్లి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రేశ్వర ఆలయం, మెదక్లోని ఏడుపాయల శ్రీ దుర్గ భవాని ఆలయం, సిద్దిపేటలోని శ్రీ కోటిలింగాల ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయంతో తదితర ఆలయాలున్నాయి. ఒక్కో అధికారికి పదికి పైగా బాధ్యతలు ఉమ్మడి మెదక్ జిల్లాలో 36 ఈఓ పోస్టులు మంజూరు ఉండగా కేవలం 6 పోస్టులు మాత్రమే భర్తీ ఉన్నాయి. ఒక్కో ఈఓ కు సుమారు 10 కి పైగా ఆలయాలకు అధికారులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అధికారులకు అదనపు బాధ్యతలు ఉండటంతో ఆలయ అభివృద్ధి జరగకపోవటంతోపాటు భక్తుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆలయాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాల్సి ఉన్న తమ పరిధిలో ఉన్న ఆలయాల సందర్శనకు మాత్రమే సమయం సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. దూరాభారం... నిర్వహణ భారం అదనపు బాధ్యతలతో ఆలయ అధికారులకు బాధ్యతలు, నిర్వహణ భారంగా మారాయి. అధికారులకు కేటాయించిన ఆలయాలు కొన్ని కిలోమీటర్ల మేర దూరం ఉండటంతో అధికారులకు దూరాభారంతోపాటు సమయం వృథా అవుతోంది. ఆలయాలకు కోర్టు తగాదాలు ఉండటంతో అక్కడికి హాజరు అవుతుండటంతో ఆలయ అధికారులకు ఆలయ నిర్వహణ భారంగా మారింది. నియామకం కానీ రెగ్యులర్ అధికారులు ఆలయ అధికారులే కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారికి సైతం ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు ఏడుపాయల దుర్గ భవాని ఆలయ ఈ ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుమారు పదేళ్ల నుంచి దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులు భర్తీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు. ఇటీవల గ్రూప్–2 ఫలితాలు విడుదల కావడంతో వాటి ద్వారా నియామకం చేపట్టే అవకాశాలున్నాయని సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పూర్తిస్థాయిలో భర్తీ చేసి భక్తుల సమస్యలతోపాటు ఆలయ అభివృద్ధి కృషి చేయాల్సిన అవసరం ఉంది. భక్తులకు తప్పని ఇబ్బందులు... ఆయా జిల్లాలోని ఆలయాలకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అంతేకాకుండా ప్రతీ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మౌలిక వసతులు, సౌకర్యాలు లేక పలు ఆలయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. -
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్ పటాన్చెరు టౌన్: అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్ పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డికి ఇటీవలే శ్రమశక్తి అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని టీజీఐఐసీ భవన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్, టీఐసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి హాజరై మాట్లాడారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న నరసింహారెడ్డి సేవల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డు అందజేయం ఆనందగా ఉందన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నరసింహారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, హెచ్ఎంఎస్ జాతీయ కార్యదర్శి సుదర్శన్ రావ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయిలు, ప్రసాద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
పాలీసెట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి టౌన్: పాలీసెట్ 2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకి దేవి తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం ఆమె పరిశీలించారు. ఈనెల 13న నిర్వహించే పరీక్షకు జిల్లాలో 2784 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డిలో 7 సెంటర్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిరవధిక సమ్మె తప్పదు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.రాజయ్య పటాన్చెరు టౌన్: లేబర్ కోడ్లపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరవధిక సమ్మె తప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలోని అగర్వాల్ పరిశ్రమలో కార్మికులతో కలసి శనివారం సమ్మె పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...లేబర్కోడ్లు వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారడం తప్పదన్నారు. రైతులు ఉద్యమించినట్లుగా కార్మికులు కూడా పోరాడాలని, దానికి అందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు రామకృష్ణ, సత్యనారాయణ, రవీంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కిందకు తోసి... నిలువునా దోచుకునివృద్ధురాలి మెడలో పుస్తెలతాడు, నగదు ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ పటాన్చెరు టౌన్: వృద్ధురాలి ఐదున్నర తులాల పుస్తెలతాడు, రూ .10 వేల నగదు ఆటోడ్రైవర్ ఎత్తుకెళ్లిన ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన సుబ్రమణ్య భారతి(74) ఈనెల 9న అమీన్పూర్ కనకదుర్గ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని, అనంతరం స్వస్థలం అయిన అల్వాల్లో తన ఇంట్లో అద్దెకు ఉండే వారి దగ్గర నుంచి రూ.10 వేలు అద్దె వసూలు చేసుకుని తిరిగి కూకట్పల్లి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ మెయిన్ రోడ్డు మీదుగాకాకుండా గల్లీలో నుంచి వెళ్దామని చెప్పి, షాపూర్ మీదుగా మళ్లించి అమీన్పూర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆటో ఆపి భారతిని కిందకు తోసి, ఆమె మెడలో ఉన్న ఐదున్నర తులాల బంగారు పుస్తెలతాడు, రూ.10 వేల నగదు లాక్కొని పారిపోయాడు. దీంతో బాధితురాలు జరిగిన ఘటనను శనివారం అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కలశ ప్రతిష్ట మహోత్సవం ములుగు(గజ్వేల్): మండలంలోని పాత మామిడ్యాల మెట్టు చింత వద్ద రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యవసాయ క్షేత్రంలో కొలువైన ఆభయాంజనేయస్వామి ఆలయ శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఆలయంలో రేణుకాచౌదరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు అభిషేకాలు, పూజగర్త సంస్కారం, కుంబాభిషేకం, పూర్ణాహుతి మార్జనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నదానం చేశారు. -
భవన నిర్మాణాలకు భూములివ్వండి
● తాత్కాలిక భవనాల్లోనే పీఎస్ల నిర్వహణ ● ఇబ్బందులు పడుతున్న పోలీసు సిబ్బంది, స్థానికులురామచంద్రాపురం(పటాన్చెరు): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్స్టేషన్ భవనాలను నిర్మించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలో అనేక పోలీస్స్టేషన్లు తాత్కాలిక భవనాల్లో ఉండటమే ఇందుకు నిదర్శనం. కొన్ని పోలీస్ స్టేషన్లకు భూములు లేక, సొంత భవనాలు లేకపోవడంతో అరకొర వసతులతోనే వాటిని నిర్వహిస్తున్నారు. దీంతో అటు పోలీసు సిబ్బంది, ఇటు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా నిత్యం విధులు నిర్వర్తించే పోలీసులకు పోలీస్ స్టేషన్ల భవనాల కోసం భూమిని కేటాయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అరకొర వసతులు.. తాత్కాలిక భవనాల్లోనే ఈ ప్రాంతాలలో అనేక పోలీస్స్టేషన్లను అరకొర వసతులతో తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. రామచంద్రాపురం పోలీస్స్టేషన్ను పూర్వకాలంలో బెల్ యాజమాన్యం నిర్మించిన భవనంలోను, కొల్లూరు పోలీస్స్టేషన్ ఉస్మాన్నగర్లోని మహిళాభవనంలో నిర్వహిస్తున్నారు. ఇక బానూర్ పోలీస్స్టేషన్ను బీడీఎల్ యాజమాన్యం కేటాయించిన భవనంలో, పటాన్చెరు పీఎస్ను ఓ పురాతన భవనంలో ఏర్పాటు చేశారు. అమీన్పూర్ పోలీస్స్టేషన్ను ఓ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో, గుమ్మడిదల, బొల్లారం పోలీస్ స్టేషన్లను, తాత్కాలిక భవనాల్లోను, జిన్నారం పోలీస్ స్టేషన్ను ఓ పాతభవనంలో నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా... ఈ ప్రాంతంలో అనేక కాలనీలు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని గత పాలకులు పలు పోలీస్స్టేషన్ ఏర్పాటు చేశారు. కానీ, అందుకనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించలేదు. దీంతో పోలీసులకు, ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. భూములు కేటాయించండి పటాన్చెరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. దానికనుగుణంగా పాలకులు వివిధ శాఖల భవనాల కోసం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేసి ఆధునిక భవనాలను నిర్మిస్తున్నారు. కానీ, పోలీస్స్టేషన్లకు భూములను కేటాయిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప దానిని ఆచరణలో పెట్టడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని పీఎస్ నూతన భవనాల నిర్మాణం కు భూములను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. ఇబ్బందులు తప్పడం లేదు.. పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను పార్కింగ్ చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఎక్కువ మంది వస్తే రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి నెలకుంటోంది. వాహనాలను సైతం రోడ్లపైనే పార్కింగ్ చేసుకోవాల్సిన దుస్థితి. ఆధునీకరించాలి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్స్టేషన్లను అభివృద్ధి చేయాలి. అందుకు ప్రభుత్వం భూమలను కేటాయించి ఆధునిక పోలీస్స్టేషన్ భవనాలను నిర్మించాలి. –ఈశ్వరగారి రమణ, తెల్లాపూర్ నైబర్హూడ్ అసోసియేషన్ అధ్యక్షుడునిర్లక్ష్యం ఎందుకు..? శాశ్వత పోలీస్స్టేషన్ భవనాల నిర్మాణం కోసం భూములను కేటాయించడంలో పాలకులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారనే ప్రశ్న అటు పోలీసుల్లోనూ ఇటు ప్రజలను వేధిస్తోంది. గతంలో రామచంద్రాపురం పోలీస్స్టేషన్ కోసం మూసివేసిన శ్రీనివాస్ థియేటర్ పక్కన స్థలాన్ని గత పాలకులు, కొల్లూర్, గుమ్మడిదల, పటాన్చెరు పోలీస్స్టేషన్ల కోసం భూములను స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కానీ ఇప్పటికీ ఆ భూములను పోలీస్టేషన్ల కోసం కేటాయించలేదు. -
24 రోజులైనా గింజ కొనలే
మబ్బులు కమ్ముతుండటంతో రైతుల్లో ఆందోళనవట్పల్లి(అందోల్): యాసంగి సీజన్లో వరి పండించడం కన్నా ధాన్యాన్ని అమ్ముకోవడానికే రైతులు కష్టపడాల్సి వస్తోంది. మండల పరిధిలోని బిజలీపూర్, కేరూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనుగోళ్లను మాత్రం మరిచిపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగానే రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించి 15 రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టారు. వ్యవసాయాధికారులు కూడా వచ్చి ధాన్యం తేమ శాతాన్ని పరీక్షించినప్పటికీ కొనుగోళ్ల ప్రక్రియ మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పది రోజులుగా మబ్బులు కమ్ముకుంటుండటంతో వర్షం పడితే ధాన్యం తడిచిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు వెంటనే కూలీలను రప్పించి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఐకేపీ సీసీ జనార్ధన్ను వివరణ కోరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభానికి ముందే బిహార్ హమాలీలను మాట్లాడగా వారు వారం రోజులుగా వస్తున్నామని చెప్పి మోసం చేస్తుండటంతో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించలేదని వివరణ ఇచ్చారు. వేరే హమాలీలను రపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఒకటి రెండు రోజుల్లోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
సుఖ శాంతులతో ఉండాలి
మెథడిస్ట్ జాతరలో ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్: ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే మాణిక్ రావు ఆకాంక్షించారు. జహీరాబాద్ పట్టణంలోని గార్డెన్నగర్లో శనివారం నుంచి ప్రారంభమైన మెథడిస్ట్ 95వ జాతర ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాణిక్రావును, డీసీఎంస్ చైర్మన్ ఎం.శివకుమార్లను నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మూడు రోజుల పాటు జరగనున్న జాతర ఉత్సవాలను సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట డీఎస్ సుకుమార్, సరీన్జాన్, రవికుమార్ ఉన్నారు. -
ఎక్కడ చూసినా చెత్తా చెదారమే
మా కాలనీలో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తోంది. ఖాళీ స్థలలో విచ్చలవిడిగా చెత్త పారబోస్తుండటంతో ఈగలు, దోమలు ఎక్కువయ్యాయి. పందులు కూడా చెత్తలో దొర్లుతూ మురికి కూపంగా చేస్తున్నాయి. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలి. ప్రభు, నారాయణరెడ్డి కాలనీ చర్యలు తీసుకుంటాం సంగారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థపై ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. చెత్త వేసినవారిపై ఫిర్యాదు చేయండి. వార్డు జవాన్లు, మున్సిపల్ కార్మికులు వచ్చి చెత్తను తొలగిస్తారు. –ప్రసాద్ చౌహన్, మున్సిపల్ కమిషనర్ -
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
● పట్టణంలో కరువైన అధికారుల నిఘా ● విచ్చలవిడిగా చెత్త పారబోత ● రోగాల బారిన ప్రజలు సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో సంగారెడ్డిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణంలో 38 వార్డులగాను ఏ ఒక్క వార్డులో పారిశుద్ధ్య సమస్య మెరుగు పడటం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని శాంతినగర్ బస్సు డిపో, కల్వకుంట, బాబానగర్, మర్క్స్నగర్ ,నారాయణరెడ్డి కాలనీ, కింది బజార్, రామ్నగర్, ఓల్డ్ బస్టాండ్ తదితరప్రాంతాల్లో పారిశుద్ధ్యం బాగోలేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యరా్థ్లను కాలనీలోనే పారవేస్తున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోయడంతో ఈగలు, దోమలు అధికమై అనారోగ్యాలపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాబానగర్లో పారిశుద్ధ్య వ్యవస్థను బాగు చేయాలని కోరుతున్నారు. -
నేరస్తుల్ని విధిగా శిక్షించాలి
సంగారెడ్డి జోన్: నేరం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కోర్టు డ్యూటీ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... తప్పు చేసిన వారెవరూ చట్టం నుంచి తప్పించుకోవడానికి వీల్లేదన్నారు. న్యాయస్థానం ముందు నిందితులకు శిక్ష పడినప్పుడే, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని చెప్పారు. ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడానికి వీలున్న కేసులలో రాజీ కుదుర్చుకునేలా చూడాలని సూచించారు. అనంతరం షీటీం బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పరితోశ్ మాట్లాడుతూ...పాఠశాలలు, కళాశాలు, బస్ స్టాండ్ తదితర రద్దీ ప్రాంతాలలో షీటీంలు నిఘా ఉంచాలన్నారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన జిల్లా షీటీం నంబర్ 8712656772కు కాల్ చేసి గానీ, వాట్సాప్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.శ్రీనివాస్రావ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, కోర్ట్ లైజనింగ్ అధికారి సత్యనారాయణ, డీసీఆర్బీ సిబ్బంది, కోర్ట్ డ్యూటీ అధికారులు తదితరులున్నారు.ఎస్పీ పరితోశ్ పంకజ్ -
జొన్న, ఆలు రైతులకు నిరాశ
● ఈసారి కూడా పెరగని పంట రుణాల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ● వరికి నామమాత్రంగా రూ.వెయ్యి పెంపు ● పెరిగిన సాగు వ్యయానికి తగ్గట్టు పెంచలేదంటున్న రైతులు ● జిల్లా బ్యాంకులకు అందిన ఆదేశాలు సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పంట రుణాల మంజూరులో కీలకమైన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విషయంలో జొన్న, సోయాబీన్ వంటి పంటలు సాగు చేసే రైతులకు ఈసారి నిరాశే ఎదురవుతోంది. వరి, మొక్కజొన్న వంటి పంటల సాగుకు ఇచ్చే పంట రుణాల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను ఈ ఏడాది స్వల్పంగా పెంచినప్పటికీ...జొన్న, సోయా, ఆలు వంటి పంటలు సాగు చేసే రైతులకు మాత్రం పెంచలేదు. ఈ ఏడాది కూడా అంతేమొత్తంలో... గత ఆర్థిక ఏడాది 2024–25లో జొన్నకు బ్యాంకర్లు ఎకరానికి రూ.19 వేలు ఇచ్చే వారు. ఈసారి కూడా అంతే మొత్తంలో పంట రుణం ఇవ్వనున్నారు. అలాగే సోయా రైతులకు గత ఆర్థిక ఏడాదిలో ఇచ్చి న మాదిరిగానే ఈసారి కూడా ఎకరానికి రూ.30 వేల చొప్పున రుణం ఇవ్వనున్నారు. ఉద్యానవన పంటల్లో ఒకటైన ఆలుగడ్డను కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ పంటకు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరగలేదు. ఎకరాకు రూ.50 వేలకే పరిమితం చేశారు. ఈ ఖరీఫ్, రబీ సీజన్లలో ఆయా పంటల సాగు చేసే రైతులకు బ్యాంకర్లు ఇచ్చే పంట రుణాలకు సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేస్తూ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నుంచి జిల్లాలోని బ్యాంకులకు ఆదేశాలందాయి. సాగు వ్యయం పెరిగిన జొన్న, సోయా పంటలు అన్ని పంటల మాదిరిగానే జొన్న, సోయా పంటల కూడా సాగు వ్యయం భారీగా పెరిగింది. కూలీల ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలు ప్రతి ఏటా పెరుగుతూనే వస్తున్నాయి. ఆలు గడ్డకు విత్తన భారమే అధికంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆలు విత్తనాలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈ పంటల పెట్టుబడి గణనీయంగా పెరుగుతోంది. కానీ, ఈ పెట్టుబడికి తగ్గట్టుగా పంట రుణానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచకపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఉద్యాన వన పంటలకు... ఉద్యానవన పంటల సాగుకు జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా అల్లంను సాగు కూడా ఉంటుంది. ఈ అల్లం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరాకు రూ.67 వేల నుంచి రూ.71వేలకు పెరిగింది. అయితే అల్లంకు విత్తన ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ విత్తనాల కోసం రైతులు రూ.వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మామిడి పంటకు ఎకరాకు రూ.44 వేల నుంచి రూ.47 వేలకు పెరిగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను నామమాత్రంగా పెంచడం పట్ల రైతు సంఘాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల పెట్టుబడులకు తగ్గట్టుగా ఈ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.వరికి రూ. వెయ్యి పెంపు జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పరిశీలిస్తే...వరి సాగుకు ఎకరానికి ఇచ్చే పంట రుణం రూ.వెయి మాత్రమే పెరిగింది. 2024–25లో ఈ పంటకు ఎకరానికి రూ. 45 వేలు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 46 వేలకు పెంచారు. నామమాత్రంగా ఈ పెంపు ఉండటం పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. మొక్కజొన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ రూ.28,000ల నుంచి రూ. 30,000లకు పెరిగింది. పత్తికి రూ. 46,000 నుంచి రూ. 48,000లకు పెంచారు. కందికి రూ.21 వేల నుంచి రూ. 22 వేలకు పెరిగింది. -
అమ్మ ప్రేమే గొప్పది
కాంగ్రెస్ నేత నీలం మధు ముదిరాజ్ పటాన్చెరు: సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, మనల్ని కనిపెంచిన మాతృమూర్తే మనకు కనిపించే దైవమని కాంగ్రెస్ నేత నీలం మధుముదిరాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం వ్యవస్థాపకులు ఎం.రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ఆవరణలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి నీలం మధు హాజరై మాట్లాడారు. జీవితంలో మరిచిపోలేని పాత్ర పోషించిన మన అమ్మకు ప్రత్యేకంగా గౌరవం ఇచ్చే రోజే అంతర్జాతీయ మాతృ దినోత్సవమన్నారు. అమ్మ ముఖంలో సంతోషం ఉండేలా చూసుకుంటే కొంతైనా అమ్మ రుణం తీరుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. కండరాల క్షీణత వ్యాధి బాధితుల సంఘానికి ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాతృమూర్తులు, దివ్యాంగులు, సంగారెడ్డి డీఆర్డీఏ ఏపీడీ జంగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
ఖేడ్ సుందరీకరణకు రూ.1.28 కోట్లు
నారాయణఖేడ్: నారాయణఖేడ్ పట్టణ సుందరీకరణకు రూ.1.28కోట్లను సీడీఎంఏ నిధులు మంజూరు చేసింది. దీంతో పట్టణాన్ని సుందరీకరించి పూర్తి పట్టణ రూపురేఖలు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలో కాలనీల రహదారుల అభివృద్ధితోపాటు చౌరస్తాలను అత్యంత సుందరీకరణగా తీర్చిదిద్ది పూర్తి పట్టణ రూపురేఖలు వచ్చేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. పన్ను నిధులతోనే.... ఖేడ్ మున్సిపాలిటీలో గతేడాదికి సంబంధించి వందశాతం ఇంటి పన్ను వసూలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా అంశాల్లో రాష్ట్రస్థాయి అవార్డును దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో పది మున్సిపాలిటీలు అవార్డుకు ఎంపిక కాగా అందులో ఖేడ్ మున్సిపాలిటీ ఒకటిగా నిలిచింది. ఈ నిధులతో పట్టణంలో ప్రధాన చౌరస్తాలను అభివృద్ధి పరచడంతోపాటు సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. సుందరీకరణ చేపట్టే చౌరస్తాలివే... పట్టణంలో ప్రధానంగా రాజీవ్చౌక్, బసవేశ్వర చౌక్, గాంధీచౌక్, అంబేడ్కర్చౌక్, సేవాలాల్, శివాజీ చౌరస్తాలున్నాయి. ఈ చౌరస్తాల చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి గ్రీనరీ, ఫౌంటెయిన్ నిర్మించనున్నారు. ఒక ప్రక్కగా ఉన్న రాజీవ్చౌక్ను సెంటర్లోకి మార్చి వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలో ప్రధాన చౌరస్తా కావడంతో దీని చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి గ్రీనరీ, ఫౌంటెయిన్, రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గాంధీచౌక్ను సైతం సెంటర్లోకి మార్చనున్నారు. వీటితోపాటు బసవేశ్వర చౌక్, అంబేడ్కర్ చౌక్, సేవాలాల్ చౌక్లను సుందరంగా ఏర్పాటు చేయనున్నారు. త్వరలో పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్నారు. రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు ఇప్పటికే రూ.20 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో పట్టణంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులు చేపట్టారు. ఆయా పాత, కొత్త కాలనీల్లో ఈ రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అవసరం మేరకు ఆయా పనులను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.చౌరస్తాల అభివృద్ధి పనులకు ఏర్పాట్లుచౌరస్తాల నుసుందరీకరిస్తాంపట్టణంలోని ప్రధాన చౌరస్తాలను సుందరీకరిస్తాం. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ల కృషి వల్ల పట్టణంలో రూ.20కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల పనులు జోరుగా చేపట్టాం. ప్రధాన చౌరస్తాలను సీడీఎంఏ నిధులతో సర్కిల్, గ్రీనరీ, ఫౌంటెయిన్లతో ఏర్పాటు చేస్తాం. అవసరమైన చౌరస్తాలను సెంటర్లో మార్చి అభివృద్ధి చేపడతాం. –జగ్జీవన్, మున్సిపల్ కమిషనర్, నారాయణఖేడ్ -
40 ఏళ్లుగా అన్నీ తానై..
పటాన్చెరు టౌన్: దివ్యాంగులైన ఇద్దరు కుమారులను 40 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఓ మాతృమూర్తి. లేచింది మొదలు వారి సేవలోనే జీవితం గడుపుతోంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం రోడ్డులో వృద్ధురాలైన చంద్రకళ నివిస్తోంది. భర్త మడపతి చంద్రయ్య 2009 లో మృతి చెందాడు. నలుగురు కుమారులు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కొడుకు రాజశేఖర్, కూతురు భాగ్యలక్ష్మి బాగానే ఉన్నారు. మిగతా నలుగురిలో కూతురు ఉమరాణి పుట్టుకతోనే మూగ. మిగతా ముగ్గురు కుమారులు సిద్ధప్ప, మహేశ్వర్, రవికుమార్లకు చిన్నప్పుడే కాళ్లు, చేతులు పడిపోయాయి. మాటలు రాని ఉషారాణి సైతం ప్రస్తుతం తల్లి మీదే ఆధారపడింది. మూడేళ్ల క్రితం రెండో కుమారుడైన మహేశ్వర్ మృతి చెందాడు. ఉన్న ఇద్దరు కుమారులకు, కూతురుకు ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకు సేవలు చేస్తూ కాలం గడుపుతోంది వృద్ధురాలు.పెన్షనే ఆధారం.. అయితే వీరి జీవనాధారం.. తల్లి తోపాటు ఇద్దరు కుమారులకు వచ్చే పెన్షన్ మొత్తం రూ.10 వేల తోనే నెల మొత్తం గడపాల్సి వస్తోంది. అప్పుడప్పుడు దాతలు వచ్చి నిత్యావసర సరుకులు ఇచ్చి వెళ్తారని ఆ తల్లి తెలిపారు. తమ తల్లి 40 ఏళ్లకు పైగా తమను చూసుకుంటుందని, చిన్నపిల్లలను చూసుకునే విధంగా రోజూ స్నానం చేయించి, భోజనం తినిపించి ప్రేమగా చూసుకునే తల్లి దొరకడం అదృష్టంగా భావిస్తున్నామని కుమారులు సిద్దప్ప, రవికుమారులు అంటున్నారు. -
బిక్కుబిక్కుమంటూ గడిపాం..
సాక్షి, న్యూఢిల్లీ/సంగారెడ్డి క్రైం: ‘భీకరమైన శబ్దాలు, మెరుపుల్లా డ్రోన్లు, ఆకాశం వైపు చూస్తే చాలు.. గుండె ఆగేంత భయం. భారత్–పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడిపాము’అని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ పరిస్థితుల నుంచి తాము సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన 51 మంది, తెలంగాణకు చెందిన 17 మంది విద్యార్థులు సురక్షితంగా ఢిల్లీలోని ఉమ్మడి భవన్కు చేరుకున్నారు. ఇక్కడ రెండు రాష్ట్రాల అధికారులు విద్యార్థులకు వేర్వేరుగా బస, భోజన ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా విద్యార్థులను విమానాలు, రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపారు. వీరిలో కొందరు విద్యార్థులను ‘సాక్షి’ పలకరించగా.. ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించారు. ఓ పక్క భయం..ఇంకో పక్క రైల్వే దోపిడీ రెండు రాత్రులు డ్రోన్లు, కాల్పుల శబ్దాలతో గజగజలాడాము. యుద్ధ ప్రాంతం నుంచి తప్పించుకుని ఢిల్లీ చేరుకోవడానికి పంజాబ్లోని పగ్వరా రైల్వే స్టేషన్కు వచ్చాం. అక్కడ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కాము. అయితే ఖాళీ లేకపోవడంతో వాష్రూమ్ బయట నిలబడ్డాం. టీసీ మమ్మల్ని తర్వాతి స్టేషన్ లుధియానాలో దించేశారు.రిజర్వేషన్ ఉన్నా ఏసీ కోచ్లో ఉన్నాం అనే కారణంతో ఐదుగురు నుంచి టీసీ రూ.4,500 వసూలు చేశారు. తర్వాత వచ్చి న ఇంటర్ సిటీ ఎక్కితే దానిలో రిజర్వేషన్ లేదు.. అని వాళ్లు మరో రూ.200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. ఓ పక్క యుద్ధ ప్రాంతం నుంచి బయటపడ్డామనుకుంటే, ఇంకో పక్క రైల్వే దోపిడీతో మోసపోయాం. –ఎస్.మధువర్షిత, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ హాస్టల్ చుట్టూ.. డ్రోన్లు పదుల సంఖ్యలో పాకిస్తాన్ డ్రోన్లు మా యూనివర్సిటీలోని హాస్టల్ చుట్టూ తిరిగాయి. ఆ శబ్దాలకు చెవులు గింగురుమనడమే కాదు, ఏం జరుగుతుందోనని భయపడిపోయా. ఉదయం రైల్వేస్టేషన్కు వచ్చేందుకు బస్సు దగ్గరకు వెళుతుండగా అప్పుడు కూడా మాపై నుంచి డ్రోన్లు వెళ్లాయి. –సీహెచ్ భానుకిరణ్, బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్డ్రోన్ల శబ్దాలకు భయం వేసింది 8వ తేదీ రాత్రి చదువుకుంటున్నాం. ఒక్కసారిగా పైనుంచి భారీ శబ్దాలు.. అవి ఏమిటో మొదట మాకు అర్థం కాలేదు. హాస్టల్ యాజమాన్యం మా అందరినీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ రూమ్లో కూర్చోబెట్టింది. అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ డ్రోన్ల శబ్దాలు ఆగిపోవడంతో పడుకోవడానికి రూమ్లలోకి వెళ్లాము. పడుకున్న రెండు గంటల్లోనే మళ్లీ భీకరమైన శబ్దాలు వినిపించాయి. ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా హాస్టల్ రూమ్లలో గడిపాం. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డాం. –ఎస్.జీవన జ్యోతి, ఐఐటీ జగతి (జమ్మూ)ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మేము చదువుకునే యూనివర్సిటీ సమీపంలో శుక్రవారం రాత్రంతా బాంబుల శబ్దం రావడంతో ఏమి జరుగుతుందోనని భయం భయంగా గడిపాం. గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. యుద్ధం గురించి తెలుసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాం. పంజాబ్ ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు బయలుదేరాం. – రంజిత్రెడ్డి, (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ ఒక్కసారిగా భయంకర శబ్దాలు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వర్సిటీ సమీపంలో ఒక్కసారిగా భయంకర శబ్దాలు రావడంతో భయం వేసింది. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో యుద్ధం జరుగుతోందని అర్థమైంది. సోషల్ మీడియా మాకు అందుబాటులో లేదు. –కూచ వెంకట బాలాజీ (సంగారెడ్డి), బీటెక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ -
దోస్త్ను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట ఎడ్యుకేషన్: డిగ్రీలో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులకు దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ తోడ్పాడుతుందని, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అన్నారు. శుక్రవారం కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (అటానమస్) కళాశాల 1956 లో ప్రారంభమై ఎంతోమంది విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిందన్నారు. కళాశాల, న్యాక్ ఏ+గ్రేడ్ కలిగి ఉండి, ఐఎస్ఓ గుర్తింపు పొంది స్వయం ప్రతిపత్తి కలిగిన ఏకైక కళాశాల అన్నారు. అన్ని వసతులతో కూడిన ల్యాబ్స్, పీహెచ్డీ, నెట్, సెట్లు పూర్తి చేసిన అనుభవం గల అధ్యాపకులతో విద్యా బోధన ఉంటుందని దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా కళాశాలను ఎంచుకోవా లన్నారు. అడ్మిషన్ ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే కళాశాలలోని దోస్త్ జిల్లా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, డాక్టర్ గోపాల సుదర్శనం, దోస్త్ కో ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్, డాక్టర్ శ్రీధర్, మధుసూదన్ రెడ్డి, గురుమూర్తి, దోస్త్ టెక్నికల్ అసిస్టెంట్ మహేశ్, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత -
కొమురవెల్లి దేవాలయం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం. సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మల్లన్న పట్నం, బోనాలు చేయడం ప్రసిద్ధి. అనంతరం స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అలాగే సిద్దిపేట పట్టణంలో కోటి లింగాల దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం సైతం సందర్శించొచ్చు. బోటింగ్.. చెరువులో బోటింగ్ను సైతం అందుబాటులో ఉంచారు. స్పీడ్ బోట్, సాధారణ బోట్లు ఉన్నాయి. స్పీడ్ బోట్లో నలుగురు ప్రయాణించే విధంగా, సాధారణ బోట్ 20 నుంచి 30 మంది వరకు ప్రయాణించవచ్చు. స్పీడ్ బోట్ అయితే నలుగురికి కలిపి రూ.350, అదే సాధారణ బోట్ అయితే ఒక్కరికి రూ.50 వసూలు చేస్తున్నారు.వాటర్ షో.. చెరువులో వాటర్ షోను ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు రాత్రి 7, 8 గంటలకు ఇలా రెండు వాటర్ షోలు జరుగనున్నాయి. పాటలతో జలదృశ్యం ఆవిష్కృతం అవుతుంది. కలర్ కలర్ లైట్లతో వాటర్ డ్యాన్స్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షోను కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. జిగేల్... జిగేల్ నెక్లెస్ రోడ్ కోమటి చెరువు పై ఏర్పాటు చేసిన రూబీ నెక్లెస్ రోడ్డు పట్టణానికి మణిహారంగా నిలుస్తోంది. పచ్చదనం.. జిగేల్.. జిగేల్మనే విద్యుత్ కాంతులు ఎంతగానే ఆకర్షిస్తున్నాయి. వాకింగ్, సైక్లింగ్కు అనువుగా ఉండేందుకు సింథటిక్ ట్రాక్ను నిర్మించారు. రాత్రి సమయంలో ఒక వైపు విద్యుత్ కాంతులు.. మరో వైపు మానసిక ప్రశాంతత కోసం మ్యూజిక్ను ఏర్పాటు చేశారు. రూబీ నెక్లెస్ రోడ్ షూటింగ్ స్పాట్గా నిలుస్తోంది. ప్రీ వెడ్డింగ్, ప్రైవేట్ సాంగ్స్ చిత్రీకరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. గ్లో గార్డెన్ కోమటి చెరువు సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్లో గార్డెన్ మిరుమిట్లు గొలిపే అందాలతో ఆకర్షిస్తోంది. దేశంలోనే మొట్టమొదట గుజరాత్లోని సర్ధార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఈ గ్లో గార్డెన్ను ఏర్పాటు చేశారు. అనంతరం సిద్దిపేటలోనే ఏర్పాటు చేయడం విశేషం. మెరిసే జంతువు, పక్షులు, చెట్ల బొమ్మలు ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఫాగ్ పాయింట్లోకి వెళ్తే మంచు కురిసే ప్రాంతానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. డ్యాన్సింగ్ ఫ్లోర్లో చిన్నారులు డ్యాన్స్లు వేస్తుంటారు. డైనో పార్క్.. కోమటి చెరువుకు పక్కనే 1.5 ఎకరాల విస్తీర్ణంలో డైనో పార్క్ను ఏర్పాటు చేశారు. డైనో పార్క్ అంటే ఏదో ఎగ్జిబిషన్లా బొమ్మలు, 3డీ యానిమేషన్ స్క్రీన్లు కాదు. అమెరికా, సింగపూర్లలోని యూనివర్సల్ వరల్డ్ స్టూడియోలో ఉన్న డైనో పార్క్ తరహాలో సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఈ పార్క్ను కొండలు, గుహాల మాదిరిగా నిర్మించారు. గుహాలో ఓపెన్ ట్రైన్ను ఏర్పాటు చేశారు. ట్రైన్లో వెళ్తుంటే డైనోసార్ల అరుపులు, మీదకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఒక్కసారిగా డైనోసార్లు మీదపడినట్లు, భీకరంగా అరవడం లాంటివి సౌండ్లు ఏర్పాటు చేశారు. దీనికి ఒక్కరికి రూ.50లు టికెట్ వసూలు చేస్తున్నారు. స్కై సైక్లింగ్.. మీరు సాహస యాత్రలు చేయాలనుకుంటే అద్భుతమైన యాక్టివిటీ కోమటి చెరువులో ఉంది. ఇక్కడ స్కై సైక్లింగ్ను ఏర్పాటు చేశారు. గాలిలో రోప్ సాయంతో సైకిల్ చేసే విన్యాసం చూపరులను గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఒక్కరికి రూ.50 రుసుంవసూలు చేస్తున్నారు. కోమటి చెరువుసిద్దిపేట పట్టణంలో కోమటి చెరువు కోటి అందాలతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో కోమటి చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పర్యాటక ప్రాంతమైన కోమటి చెరువు ఉంది. చెరువు వద్ద మున్సిపాలిటీ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేశారు. ఈ చెరువుపై నిర్మించిన తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారుగా 200 మీటర్ల దూరం ఉంటుంది. చెరువు మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. దీనిపై ఒకేసారి 200 మంది నడిచే విధంగా తీర్చిదిద్దారు. వంతెనకు కలర్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో ఆకర్శిస్తోంది. దీని రుసుము రూ.10 వసూలు చేస్తున్నారు. -
విజ్ఞాన కేంద్రం.. కళల నిలయం
జహీరాబాద్ టౌన్: వేసవి సెలవులు పిల్లలకు ఆనందాన్ని పంచే అద్భుత క్షణాలు. ఈ సెలవులను ఆడుతూ.. పాడుతూ సద్వినియోగం చేసుకునేలా జహీరాబాద్ శ్రామిక విజ్ఞాన కేంద్రం, మన లైబ్రరీ నిర్వాహకులు కృషి చేస్తున్నారు. కొన్నేళ్ల నుంచి వేసవి సెలవుల్లో ఉచితంగా శిక్షణ తరగతులను నిర్వహిస్తూ పలు అంశాల్లో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వృది్ధ్ చేసుకునేందుకు కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నెల చివరి వారంలో ప్రారంభమైన శిక్షణ శిబిరాలు మే మూడో వారం వరకు కొనసాగనున్నాయి. శిక్షణలో ముఖ్యమైనవి యూకేజీ నుంచి టెన్త్ల కోసం శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఇందులో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్, గణిత నైపుణ్యం, పెయింటింగ్, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైయిటింగ్, మట్టితో బొమ్మల తయారీ, ఫిజిల్స్ పరిష్కారం, పేపర్తో కళాకృతులు తయారీ తదితర అంశాలపై నిపుణులు నేర్పిస్తున్నారు. పెరిగిన శిక్షణ కేంద్రాలు వేసవి శిక్షణ శిబిరం కొన్నేళ్ల కిందట పట్టణంలో మాత్రమే నిర్వహించే వారు. గ్రామీణ ప్రాంత పిల్లల పట్టణానికి రాలేకపోతున్నారని. ఈ సారి గ్రామల్లో కూడా శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో 3, ఎన్జీవోస్ కాలనీ, మాణిక్ ప్రభు వీధి, నాగన్పల్లి, అల్గోల్, కుప్పానగర్, బర్దిపూర్, రంజోల్, పిప్పడ్పల్లిలోఒకటి చొప్పున పస్తాపూర్లో రెండు శిబిరాలు నడుస్తున్నాయి. వేసవి శిబిరాలకు మంచి స్పందన వస్తుంది. ప్రతీ సెంటర్ పదుల సంఖ్యలో పిల్లలు వస్తుండగా శిక్షకులు వారికి పలు విషయాలను ఆడుతూ పాడుతూ నేర్పిస్తున్నారు. పిచరాగడి గ్రామంలోని శిబిరంలో పిల్లలువిద్యార్థులకు ఉచిత వేసవి శిబిరాలు జహీరాబాద్ శ్రామిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహణ పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మల తయారీ వంటి వాటిల్లో తర్ఫీదు సద్వినియోగం చేసుకోవాలి వేసవిలో పిల్లలు సెల్ఫోన్కే పరిమితం కావడం, ఎండల్లో తిరగడం వంటివి చేస్తుంటారు. విద్యతో పాటు కళలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, కాబట్టి కొన్నేళ్లుగా ఉచితంగా వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాం. ప్రతీ సంవత్సరం నిర్వహించే శిబిరాలకు మంచి స్పందన వస్తుంది. ఈ సారి శిక్షణ కేంద్రాలను కూడా పెంచాం. తల్లిదండ్రులు వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. –డాక్టర్, శివబాబు, శ్రామిక విజ్ఞాన వేదిక కార్యదర్శి, జహీరాబాద్ -
వేగవంతమైన అభివృద్ధికి ప్రణాళిక
ములుగు(గజ్వేల్) : రాష్ట్రంలో ఉద్యాన సాగు చేసిన రైతులు స్థిరమైన, వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ములుగు ఉద్యానవర్సిటీ వేదికగా రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు, ఆదర్శరైతులు, ఎఫ్పీఓ నాయకులు, వ్యవసాయ, వ్యాపార సంస్థలు, ఎగుమతిదారులు, ఇన్ఫుట్ సరఫరాదారులు, పరిశోధన నిపుణులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పరిశ్రమ భాగస్వామ్యా లు, ఆవిష్కరణ, ఆధారిత సాగు, వాతావరణ స్థితిస్థాపక పంట ప్రణాళికను సులభతరం చేయడంలో విశ్వవిద్యాలయం నిబద్ధతను కొనియాడారు. మార్కెట్ పోకడలు, పంట వైవిద్యీకరణ వ్యూహాలు, ఎఫ్పీఓల ద్వారా సామర్థ్య నిర్మాణం, ఖచ్చితమైన వ్యవసాయం కోసం సాంకేతిక ఏకీకరణ, పంటల తర్వాత నిర్వహణ ఎగుమతి, ప్రాసెసింగ్ పరిష్కారాలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు భగవాన్, చీనా నాయ క్, లక్ష్మీ నారాయణ, సురేశ్ కుమార్, రాజశేఖర్, వీణాజోషి, సతీష్, తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న వీసీ రాజిరెడ్డి ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్లర్ రాజిరెడ్డి పలు సంస్థలతో ప్రత్యేక సమావేశం -
శుభకార్యానికి వస్తూ..
● టీవీఎస్ మోపెడ్ అదుపుతప్పి.. ● అక్కడికక్కడే వృద్ధుడు మృతి వర్గల్(గజ్వేల్): బంధువుల ఇంట్లో శుభకార్యానికి వస్తూ టీవీఎస్ మోపెడ్ అదుపుతప్పి కింద పడిపోయి వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వర్గల్ మండలం మాదారం–గిర్మాపూర్ గ్రామాల మధ్యలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. మెదక్ జిల్లా దొంతి గ్రామానికి చెందిన దేవోల్ల పోచయ్య(70) టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ వాహనంపై వర్గల్ మండలం గిర్మాపూర్లో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు వస్తున్నాడు. మాదారం–గిర్మాపూర్ మధ్య మలుపులో వాహనం అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యానికి బానిసై ఉద్యోగి .. బెజ్జంకి(సిద్దిపేట) : మద్యానికి బానిసై ఉద్యోగి మృతి చెందిన ఘటన బెజ్జంకిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రానికి చెందిన న్యాత మల్లేశం(50) అక్కడే ఎంఆర్ఓ కార్యాలయంలో రికార్డు అసిసెంట్గా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి బెజ్జంకిలో నివసిస్తున్నాడు. మల్లేశం కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి మద్యం తాగి బైక్పై ఇంటికొచ్చాడు. లోపలికి వస్తూనే మత్తులో కిందపడి అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికి వాంతులు, విరోచనాలు చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నుట్లు ఏఎస్ఐ శంకర్రావు తెలిపారు. -
పశుగ్రాసం వృథాకు చెక్
హార్వెస్టర్తో వరి కోతలు ● అనంతరం గడ్డిని కట్టలు కట్టే బేలర్ యంత్రం ● కట్టకు రూ.30 నుంచి 35 వసూలు దుబ్బాకటౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతు సైతం యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాడు. హార్వెస్టర్తో కోసిన వరి పొలాల్లో గడ్డి తక్కువగా రావడంతో పాటు పొలంలో పడి వృథా అవుతుంది. దీంతో రైతులు ఆ గడ్డిని కాల్చేస్తున్నారు. డైరీ ఫామ్ నిర్వాహకులకు, పాల వ్యాపారంపై ఆధార పడుతున్న రైతులకు పశుగ్రాసం కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురు రైతులు బేలర్ యంత్రాలతో గడ్డిని కట్టలు కట్టి తెచ్చుకుంటున్నారు. గడ్డిని అమ్ముతూ పశుగ్రాసం కొరత తీర్చుకుంటున్నారు. ఒక్కో కట్టకు రూ.30 నుంచి 35 వరి గడ్డి కట్టే బేలర్ యంత్రాలు ట్రాక్టర్కు అనుసంధానం చేయబడి ఉంటాయి. హార్వెస్టర్ కోసినప్పుడు పొలమంతా పడిన గడ్డిని బేలర్ యంత్రం కట్టలు కడుతుంది. ఎకరం పొలంలోని గడ్డిని గంటలోపే 40 నుంచి 50 కట్టలు కడుతుంది. ఒక్కో కట్టకు రూ.30 నుంచి 35 తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గేదెలను పెంచే రైతులు పొలంలోని గడ్డిని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముందుగా రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి యంత్రంతో కట్టలు కట్టిస్తున్నారు. కాల్చడానికి వెనుకడుగు గడ్డికి సైతం డబ్బులు వస్తుండటంతో రైతులు గడ్డిని కాల్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వానా కాలం సీజన్ వరి పంట కోసేంత వరకు ఎండు గడ్డి దొరకని పరిస్థితి ఇక ఉండదు. కాబట్టి పశుగ్రాసాన్ని 3, 4 నెలలు వచ్చేలా పాడి రైతులు నిల్వ చేస్తుంటారు. ప్రస్తుతం వేసవి కావడంతో మేత లెక్కన ఒక్కో పాడి పశువు ఒక కట్ట మేస్తుంది. ఎకరానికి రూ. 2 నుంచి రూ.3 వేల వరకు గడ్డి కోసం ఖర్చు చేస్తున్నారు. దీంతో గడ్డికి డిమాండ్ ఏర్పడుతుంది. -
పోలీసులకే చుక్కలు చూపించాడు
● ఆరు నెలలుగా అనవసరంగా 77 సార్లు డయల్ 100కి కాల్ ● విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు కల్హేర్(నారాయణఖేడ్): పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పెద్దముబారక్పూర్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ డీ.వెంకట్రెడ్డి కథనం ప్రకారం.. పెద్దముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ మద్యానికి బానిసయ్యాడు. రోజుకో పేరు, ఊరు పేరు మార్చుకుంటూ సాయంత్రం కాగానే డయల్ 100కు కాల్ చేయడం మొదలు పెట్టాడు. భార్య తప్పిపోయింది.. పెట్రోల్ పోసుకుంటున్నా.. మందు తాగి చనిపోతున్నా.. అంటూ రోజుకో మాట చెబుతూ డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు వెళ్తే ఎవరూ ఉండేది కాదు. ఆరు నెలలుగా రోజూ పోలీసులకు చుక్కలు చూపించాడు. విసిగిపోయిన పోలీసులు డయల్ 100కు ఎవరూ కాల్ చేస్తున్నారనే కోణంలో విచారణ చేపట్టారు. సంబంధిత వ్యక్తి ఎవరని గుర్తించారు. ఎట్టకేలకు సురేశ్ను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎవరైనా డయల్ 100కు అనవసరంగా కాల్ చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకట్రెడ్డి హెచ్చరించారు. -
కవిత్వానికి సమాజమే పునాది
సిద్దిపేటకమాన్: కవిత్వానికి సమాజమే పునాది అని కవి వేణుగోపాల్ అని అన్నారు. మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవి కిషన్ కవిత్వం పుస్తకాలు పేగు తెగిన పాట, వడిసెల ఆవిష్కరణ సభ నిర్వహించారు. మరసం అధ్యక్షుడు రంగాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కవి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కవిత్వానికి సామాజిక నేపథ్యమే పునాదిగా రచనలు చేస్తే ఆ రచన సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వ్యక్తిగతమైన సాహిత్యం ఎక్కువ కాలం నిలబడేది కాదన్నారు. కవిత్వం మనిషిని మరింత ఉన్నతీకరించడానికి, సమాజంలో మానవ సంబంధాలను పెంపొందించడానికి ఉపయోగపడాలని అన్నారు. కార్యక్రమంలో యాదగిరి, అశోక్, నందిని సిదారెడ్డి, దేశపతి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కవి వేణుగోపాల్ -
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేట కమాన్: యువత, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీపీ అనురాధ సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. తాత్కాలిక ఆనందం కోసం కుటుంబాలను దూరం చేసుకోవద్దన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలన్నారు. మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ 87126 67100కు సమాచారం తెలపాలని సూచించారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు పటాన్చెరు టౌన్: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎకై ్సజ్ సీఐ పరమేశ్వర గౌడ్ కథనం మేరకు.. అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఇసుక బావి వద్ద శుక్రవారం ఓ బహిరంగ ప్రదేశంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం అందింది. పటాన్చెరు ఎకై ్సజ్ అధికారులు వెళ్లి చూడగా రామచంద్రపురానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ వేరే వ్యక్తికి గంజాయి విక్రయిస్తున్నాడు. వెంటనే అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 260 గ్రాముల గంజాయిని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు సీఐ తెలిపారు. మూడు చోట్ల 3.315 కిలోలు స్వాధీనం సంగారెడ్డి జోన్: సంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మూడు చోట్ల 3.315 కేజీల గంజాయి పట్టుకొని కేసులు నమోదు చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్కు చెందిన సందీప్ వద్ద నిల్వ ఉన్న 1.500 కేజీల గంజాయి, స్కూటీ, సెల్ ఫోన్, బీరంకొండకు చెందిన సాయికుమార్, శ్రీకాంత్ వద్ద నిల్వ ఉన్న 1.200 కేజీల గంజారయి, బైకు, రెండు సెల్ ఫోన్లు పట్టుకున్నామన్నారు. అలాగే మరో వ్యక్తి వద్ద 615 గ్రాముల గంజాయి, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి సంగారెడ్డి పోలీసులకు గంజాయితోపాటు అప్పగించామన్నారు. దాడుల్లో సీఐలు వీణారెడ్డి, బీ.గాంధీ, ఎస్ఐలు అనిల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మద్యం మత్తులో చెరువులో దూకి ఆత్మహత్య కౌడిపల్లి(నర్సాపూర్): చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మహమ్మద్నగర్లో చోటు చేసుకుంది. శుక్రవారం ఎస్ఐ రంజిత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య తన చిన్నకూతురు బాలమణిని కౌడిపల్లికి చెందిన చాకలి శేఖర్(40)కి ఇచ్చి వివాహం చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. గతేడాది కాలంగా శేఖర్ మద్యానికి బానిసై ఏ పని చేయకుండా తిరుగుతుండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి శేఖర్ మధ్యం సేవించి రావడంతో మళ్లీ గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు కన్నారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జిన్నారం (పటాన్చెరు): ఓ ప్రైవేట్ క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసిన ఘటన మండలంలోని వావిలాల గ్రామంలో చోటుచేసుకుంది. అధికారుల కథనం మేరకు.. విశ్వనీయ సమాచారం మేరకు పటాన్చెరు డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఆధ్వర్యంలో శుక్రవారం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ క్లినిక్ పై దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గడువు ముగిసిన 25 రకాల మందులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.10 వేల వరకు ఉంటుంది. ఎలాంటి అర్హత లేకుండా క్లినిక్ ను నిర్వాహకుడు సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిన్నారం, బొల్లారం కంట్రోల్ ఇన్ స్పెక్టర్లు శ్రీకాంత్, ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నిలువ నీడలేదు.. నీళ్లూ లేవు
హత్నూర (సంగారెడ్డి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తాగు నీళ్లు లేవు. ఎండలు దంచుతున్న కూలీలకు కనీసం నీడ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఉపాధి కూలీలు నీళ్లు లేక నీడ లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారులు ఉపాధి కూలీలకు పని వద్ద తాగునీటితోపాటు నీడను ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. హత్నూర మండలంలో 38 గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో 13 వేలమంది ఉపాధి హామీ పథకం కూలీలు పేర్లు నమోదు చేసుకోగా ఎండవేడికి తట్టుకోలేక ప్రస్తుతం 2,500 నుంచి 3000 మంది ఉపాధి కూలీలు మాత్రమే గ్రామాలలో పనిచేస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో సుమారు 60మంది కూలీలు మాత్రమే పనికి వస్తున్నారు. టెంట్లు ఎక్కడ? ఉపాధి హామీ పనుల వద్ద కూలీల కోసం తాగునీరు ఏర్పాటు చేయాలి. కూలీలకు కొంత సమయం సేద తీరేందుకు టెంట్లను ఏర్పాటు చేసి నీడ కల్పించాలి. కానీ, ఎక్కడ కూడా తాగునీరు టెంట్లు ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుటుంబ పోషణ భారమై తప్పని పరిస్థితుల్లో ఉపాధి కూలీలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని కూలీలు వాపోతున్నారు. ఎండల తీవ్రతను తట్టుకోలేక ఉపాధి కూలీలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికై నా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు తాగునీటి సౌకర్యంతోపాటు నీడను ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ఉపాధి కూలీలు అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఉపాధి కూలీల అవస్థలు పట్టించుకోని అధికారులు ఎండ తీవ్రతకు అల్లాడుతున్న కూలీలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం ఉపాధి హామీ పథకం పనిచేసే వద్ద కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నాం. నీళ్లు ఏర్పాటు చేస్తే ఎండకు వేడిగా అయిపోతున్నాయి అందుకే పెట్టడం లేదు. రోజు ఒక దగ్గర పనిచేస్తున్నారు. అందుకోసమే టెంట్లు ఏర్పాటు చేయలేదు. – ప్రవీణ్ కుమార్, ఏపీఓ -
భూ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ క్రాంతి వల్లూరు కొండాపూర్(సంగారెడ్డి): భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కొండాపూర్ మండల పరిధిలోని గొల్లపల్లిలో శుక్రవారం నిర్వహించిన భూభారతి సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతులు సమర్పించిన దరఖాస్తులో భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృతి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు. అంతకు ముందు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గొల్లపల్లిలోని పీఏసీఎస్లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్తో టు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పంట రుణం
రూ.3,404 కోట్లుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ఈ ఖరీఫ్, రబీ పంట సీజన్లలో రైతులకు రూ.3,404 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తం 2.93 లక్షల మందికి ఈ రుణాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు 2025–26 ఆర్థిక ఏడాదికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఇటీవల ఖరారైంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కూడా ఈ ప్రణాళికకు ఆమోదముద్ర వేసింది. గత ఆర్థిక ఏడాదికంటే ఈసారి సుమారు 14.5% అధికంగా రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, వ్యవసాయ టర్మ్లోన్ల, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చే రుణాలు రుణాలు ఇలా అన్నీ కలిపితే మొత్తం 3.13 లక్షల మంది రైతులకు రూ.6,721.87 కోట్ల వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణాలు ఇవ్వలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 88 శాతమే రుణాలు.. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో రూ.3,328.19 కోట్లు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ బ్యాంకర్లు కేవలం రూ.2,942 కోట్లు మాత్రమే పంట రుణాలను ఇచ్చారు. అంటే నిర్దేశిత లక్ష్యంలో కేవలం 88.41% మాత్రమే ఈ రుణాలను ఇవ్వగలిగారు. ఈసారి ఈ రుణ లక్ష్యాన్ని 14.5% పెంచినప్పటికీ...బ్యాంకులు ఏ మేరకు రుణాలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో మరో నెల రోజుల్లో ఖరీఫ్ పంటల సీజను ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి కోసం డబ్బుల అవసరం ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు వెంటనే ఈ రుణ మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తే రైతులకు సకాలంలో పెట్టుబడులకు డబ్బులు అందుతాయనే అభిప్రాయం అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. త్వరలో డీసీసీ సమావేశం.. డీసీసీ (డిస్టిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ) త్వరలో సమావేశం నిర్వహించి ఖరారైన ఈ వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించనున్నారు. ఈ మేరకు త్వరలో ఈ కమిటీ సమావేశం నిర్వహించాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, కో ఆపరేటివ్ రంగంలోని బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనున్నారు. ఈసారి 2.93 లక్షల మంది రైతులకు ఇవ్వాలని నిర్ణయం గతేడాదికంటే 14.5% అధికంగా లక్ష్యం ఖరారైన 2025–26 వార్షికరుణ ప్రణాళిక త్వరలో డీసీసీ సమావేశంలో ప్రకటనరైతులకు ప్రభుత్వం తీపి కబురునందించనుంది. ఈసారి వారికి పంటరుణాలకు గతేడాదికంటే 14.5% అధికంగా ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే డీసీసీ సమావేశంలో ఇందుకు సంబంధించి ప్రకటించనున్నారు. త్వరలో ప్రకటించనున్న నిర్ణయంతో జిల్లాలో 2.93 లక్షల మంది రైతులకు పంట రుణాలు అందనున్నాయి. మరి బ్యాంకర్లు రుణాల మంజూరులో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.గృహ రుణాలకు మాత్రం భిన్నంగా.. రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించే బ్యాంకర్లు గృహ రుణాలకు మాత్రం గతేడాది విరివిగా మంజూరు చేశారు. ఈ హౌసింగ్ లోన్లకు నిర్దేశించిన లక్ష్యం కంటే రెట్టింపు స్థాయిలో ఈ రుణాలిచ్చారు. పంట రుణాల విషయంలో నిర్దేశించిన లక్ష్యంలో 88% మాత్రమే రుణాలిస్తే..ఈ హౌసింగ్ రుణాలు మాత్రం ఏకంగా 207% రుణాలిచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈసారైనా బ్యాంకర్లు కొర్రీలు పెట్టకుండా అన్నదాతలకు పంట రుణాలు సకాలంలో మంజూరు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ప్రభుత్వం మినీఅంగన్వాడీ టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్ చేస్తూ వేతనాన్ని రూ.7,800 నుంచి రూ.13,650లకు పెంచిన నేపథ్యంలో శుక్రవారం ఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డితోపాటు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ...పిల్లల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు దోహదపడాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త విద్యాసంవత్సరం నుంచి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించనున్నందున టీచర్లు పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని జూకల్ శివారులో నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను సంజీవరెడ్డి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేసి మిగిలిన శానిటరీ, విద్యుత్ వైరింగ్, తాగునీటి వసతి పనులను పూర్తిచేయాలని గుత్తేదార్లను ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారంశంకర్, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం
ఉపాధి పనికి వెళ్తే తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇంటినుంచి తీసుకెళ్లిన నీళ్లు సరిపోవడం లేదు. ఎండలకు దాహం వేస్తోంది. తాగుదామంటే గుక్కెడు నీళ్లు కూడా లేవు. ఏమి చేయలేకపోతున్నాం. – మాచునూరి లక్ష్మి, నస్తీపూర్నీడ కూడా కల్పించడం లేదు మండుటెండలో పనిచేస్తున్నాం. కనీసం తాగునీటిని ఏర్పాటు చేయలేదు. పని మధ్యలో నీడకు ఉందామంటే టెంటు కూడా వేయలేదు. ఇప్పటికై నా అధికారులు నీళ్లు నీడను కల్పించాలి. – గిరికల లత -
వృద్ధుల పట్ల ప్రత్యేకశ్రద్ధ వహించాలి
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పటాన్చెరు టౌన్: వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. అమీన్పూర్లోని ది నెస్ట్ వృద్ధాశ్రమాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...వృద్ధుల బాగోగులను మనమే చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. న్యాయపరమైన విషయంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ది నెస్ట్ ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాపై అవగాహన కల్పించాలిఏఎస్పీ సంజీవరావు సంగారెడ్డి : స్కూల్స్, కళాశాలలకు వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో పిల్లలు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లకు ప్రభావితమై సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలేర్పడి పిల్లలు దారితప్పే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వారికి సోషల్ మీడియాపట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. వీలైతే పిల్లలకు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్పించాలని కోరారు. సమస్యలపై ప్రత్యేక దృష్టిజెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న కల్హేర్(నారాయణఖేడ్): సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ స్వప్న అధికారులను ఆదేశించారు. కల్హేర్ మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. ఎంపీడీఓలు రమేశ్బాబు, సంగ్రామ్, ఎంపీఓ శ్రీనివాస్, సిబ్బంది పరమేశం, షాకీర్, సాగర్ పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కృషి సీఐటీయూ రాజయ్య పటాన్చెరు టౌన్: ప్రజలు,కార్మిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గంతోపాటు అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య పిలుపునిచ్చారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో గల వాగ్వాల్స్, పటాన్చెరు పట్టణంలోని అస్సాం కార్బన్ పరిశ్రమలలో కార్మికుల జనరల్బాడీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య హాజరై మాట్లాడారు. ఈనెల 20 దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె విజయవంతానికి పరిశ్రమలు స్వచ్ఛందంగా బంద్పాటించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, శ్రీనివాస్గౌడ్, జగదీశ్వర్, రాజేశ్వర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. రూ.18 లక్షల పరిహారం అందజేత పటాన్చెరు పట్టణంలోని అగర్వాల్ రబ్బర్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ కార్మికునికి నష్టపరిహారం కింద పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన రూ.18 లక్షల డీడీని రాజయ్య కార్మికుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ...కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు యజమానులు మానవీయ దృక్పథంతో ఆలోచించి కార్మికుల ను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమ యజమాన్యం కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. -
వడ్ల కొనుగోళ్లలో జాప్యం
● రైతుల పడిగాపులు ● మ్యాచర్ రాలేదని ఇబ్బందులుపెడుతున్న సిబ్బంది ● ఖేడ్ పీఏసీఎస్ దుస్థితి నారాయణఖేడ్: వరి కొనుగోలు కేంద్రాల్లో సక్ర మంగా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నారాయణఖేడ్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ర్యాలమడుగు, నిజాంపేట్లలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ర్యాలమడుగు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చిన రైతులు ఎండలో వేచి ఉన్నా తూకం మాత్రం వేయడంలేదు. తేమశాతం తెలిపే మ్యాచర్ రాలేదంటూ పీఏసీఎస్ సీఈవో కొర్రీలు పెడుతూ తూకం వేయకపోవడంతో రైతులు తమ వడ్లను ఎండలోనే ఆరబెట్టుకుంటున్నారు. కొన్నింటికి మ్యాచర్ వచ్చినా తూకం చేపట్టకపోవడంతో వరి కుప్పలపై బస్తాలను కప్పి ఉంచుతున్నారు. వర్షం పడితే తమ ధాన్యం తడిచిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడవసతి లాంటివి చేపట్టలేదు. అదనంగా తూకం వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. బ్లాక్ లిస్టులో ఉన్న సొసైటీకి కేంద్రాలు.. నాలుగేళ్ల క్రితం కందుల కొనుగోళ్లలో ఖేడ్ పీఏసీఎస్ సొసైటీ అక్రమాలకు పాల్పడింది. రైతుల పేర వ్యాపారుల కందులు కొనుగోలు చేశారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పట్నుంచీ ఈ సొసైటీని బ్లాక్ లిస్టులో పెట్టారు. మార్క్ఫెడ్ అధికారులు ఈ సొసైటీకి కందులు, పెసర్లు, జొన్నల కొనుగోళ్లకు అనుమతివ్వరు. కానీ వరి కొనుగోళ్లకు అనుమతించి ఏకంగా రెండు కేంద్రాలను కట్టబెట్టారు. నిజాంపేట్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రం ఉండగా అదనంగా కేంద్రాన్ని ఇవ్వడంపట్ల విమర్శలు వస్తున్నాయి. మ్యాచర్ వస్తేనే తూకం మ్యాచర్ రాకపోవడతో తూకం వేయడంలేదు. ఏఈవో వచ్చి మ్యాచర్చూసి చెప్పాకనే తూకం వేస్తాం. బ్లాక్లిస్టులో ఉన్నందునే మార్క్ఫెడ్ ద్వారా కంది, పెసర, మినుము, జొన్నల కేంద్రాలు తమకు ఇవ్వడంలేదు. వరి ధాన్యం సివిల్సప్లై కావడంతో ఇచ్చారు. – జగన్నాథం, పీఏసీఎస్ సీఈవో -
● స్పెషల్ డ్రైవ్కు ఎకై ్సజ్శాఖ సన్నద్ధం ● జిల్లాలో అన్ని సర్కిళ్లలో దాడులు ● బృందాల ఏర్పాటులో నిమగ్నం
గంజాయి, డ్రగ్స్ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం క్షేత్రస్థాయి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ప్రత్యేక డ్రైవ్లో అధికారుల పనితీరును ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో 8వ తేదీ నుంచి 14వ తేదీవరకు ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ బృందాల్లో జిల్లా, డివిజినల్ స్థాయి అధికారులు ఇద్దరితోపాటు సదరు స్టేషన్లోని ఇద్దరు అధికారులు, కానిస్టేబుళ్లు ఉండనున్నారు. వీరు తమకు ఉన్న సమాచారం మేరకు అనుమానిత వ్యక్తులు, ప్రదేశాలపై దాడులు చేపడతారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా తయారీ, రవాణా చేపట్టేవారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాలున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట స్టేషన్ల పరిధిలో గంజాయి సాగు, రవాణా జరిగే అవకాశాలున్నాయి. గతంలో గంజాయి సాగుకు ఈ సర్కిళ్లు పెట్టింది పేరుగా నిలిచాయి. కోట్లాది రూపాయిల గంజాయిని ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు పలుమార్లు దాడులు చేసి ధ్వసం చేశారు. కేసులు పెట్టి నిందితులకు శిక్షలు పడేలా చేయడం, ఎకై ్సజ్ అధికారుల నిఘా పెరగడంతో గంజాయి సాగు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. వీటికి తోడు కల్లులో మత్తుకోసం కలిపేందుకు అల్ఫ్రాజోలం, డైజోఫామ్ రవాణా, దిగుమతుల కేసులు కూడా నమోదయ్యాయి. ఇక్కడ జోరుగా అల్ఫ్రాజోలం తయారీ... పటాన్చెరు, సంగారెడ్డి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలోని జిన్నారం, బొంతపల్లి, ఐడీఏ బొల్లారం, ఇస్నాపూర్, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాల్లో మూతబడ్డ పరిశ్రమల్లో మత్తు పదార్థాలు తయారీ ఘటనలు వెలుగు చూడటంతో ఎకై ్సజ్ శాఖ ఇక్కడ ప్రత్యేక నిఘా పెట్టనుంది.ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కోసం టీంలను ఏర్పాటు చేస్తున్నాం. గంజాయి సాగు, రవాణాలపై నిఘా పెట్టి దాడులు చేస్తున్నాం. స్పెషల్డ్రైవ్లో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రజలు గంజాయి సాగు, రవాణా, అల్ఫ్రాజోలం, డైజోఫాంలపై రహస్యంగా సమాచారం అందిస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. – నవీన్చంద్ర, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) సంగారెడ్డియువతకు ప్రాణాంతకంగా మారిన మాదకద్రవ్యాల వినియోగం, దాని నిరోధంపై ఎకై ్స జ్ శాఖ ఉక్కుపాదం మోపనుంది. మాదకద్రవ్యాల తయారీ, సాగు, రవాణాను సమూలంగా నిర్మూలించాలన్న లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్లకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే ఈ డ్రైవ్లను జిల్లాలోనూ కొనసాగించేందుకు ఎకై ్సజ్ శాఖ సన్నద్ధమైంది. నారాయణఖేడ్: -
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
● ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ్రెడ్డి నివాసంపై దాడిని ఖండించిన జర్నలిస్టులు ● ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన నిరసనలు ● కలెక్టర్కు వినతిపత్రంసాక్షిప్రతినిధి, సంగారెడ్డి : ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డి నివాసంపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దాడిని నిరసిస్తూ గురువారం ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా పలు చోట్ల జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఏపీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పలు యూనియన్ల నాయకులు, వివిధ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు పాల్గొని..ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజే యూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎడిటర్ నివాసంలోకి చొరబడటం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకుని పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే జర్నలిస్టులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి దండు ప్రభు మాట్లాడుతూ...ఎడిటర్ నివాసంపై దాడి చేయడం పత్రికల గొంతునొక్కడమే అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు సిద్దిక్, టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు టి.డేవిడ్, జర్నలిస్టు నాయకులు ఇస్లావత్ శ్రీనివాస్, నాగరాజు, శివస్వామి, భీంరాజు, సుధీర్గౌడ్, భీంరావు, హరి, సంతోష్, సందీప్, సాక్షి బ్యూరోఇన్చార్జి పి.బాలప్రసాద్, ఫొటోగ్రాఫర్ శివప్రసాద్, ఆర్సీ ఇన్చార్జి రాజశేఖర్, రిపోర్టర్లు రామలింగు బాలయ్య, ప్రశాంత్గౌడ్, నవాజ్, సాక్షి టీవీ కెమెరా జర్నలిస్టు నవీన్ పాల్గొన్నారు. -
106 కేజీల గంజాయి పట్టివేత
నలుగురు అరెస్టు పటాన్చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీసీఎస్, పటాన్చెరు పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద పటాన్చెరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా...రెండు కార్లలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని ఎనకపల్లి గ్రామం, పత్తు తాండకు చెందిన రాథోడ్ బీర్బల్, రాథోడ్ సురేష్, రాథోడ్ మారుతి, రాథోడ్ ప్రకాశ్ను అదుపులోకి తీసుకోవడంతోపాటు కార్లను సీజ్ చేశారు. ఈ గంజాయిని విజయవాడ నుంచి మహారాష్ట్రకు తరలిస్తునట్లు విచారణలో వెల్లడైంది. పట్టుకున్న గంజాయి 106 కేజీలు ఉండగా...దీని విలువ రూ.26.70లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.నెలలోగా టాయిలెట్స్ నిర్మించాలి: కలెక్టర్ క్రాంతి సంగారెడ్డి జోన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో నెలలోగా టాయిలెట్స్ నిర్మించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి వల్లూరు మాట్లాడుతూ...40 మంది అబ్బాయిలకు ఒక టాయిలెట్, 30 అమ్మాయిలకు ఒకటి టాయిలెట్ లెక్కన విద్యార్థుల సంఖ్య ప్రకారం నిర్మించాలన్నారు. గురుకుల విద్యా సంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని, మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలన్నారు. వివిధ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అధికారులు పాఠశాలకు వచ్చినపుడు ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పీసీఈవో జానకీరెడ్డి పంచాయతీ అధికారి సాయిబాబా, పీడీ డీఆర్డీఏ జ్యోతి, డీఎంహెచ్ఓ గాయత్రీదేవి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్కు అవార్డు సంగారెడ్డి: స్వయం సహాయక సభ్యులకు 2024 –25 సంవత్సరంలో బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో మెదక్ డీసీసీబీ బ్యాంక్ రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. అత్యుత్తమ సేవలందించినందుకుగాను డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డికి గురువారం మంత్రి సీతక్క ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ ఇలా మొదటిస్థానంలో నిలిచి అవార్డును అందుకోవడం ఐదవసారి అని తెలిపారు. జోగిపేట మార్కెట్కు రూ.5.69 కోట్ల ఆదాయంమార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి జోగిపేట(అందోల్): జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీకి 2024–25 ఆర్థిక ఏడాదికిగాను రూ.5.69 కోట్ల ఆదాయం లభించింది. ఈ మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అందరి సహకారంతో మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి ఆదాయాన్ని పొందగలిగామని పేర్కొన్నారు. జోగిపేట మార్కెట్ యార్డు, దేవునూర్ రైతు వేదికలో పీఏసీఎస్ల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నారాయణఖేడ్, రాయికోడ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. -
సంగారెడ్డికి రూ.28కోట్ల హెచ్ఎండీఏ నిధులు
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణాభివృద్ధికి హైదరాబాద్ మహనగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి బైపాస్రోడ్డును 4 లైన్లుగా విస్తరణ కోసం రూ.12 కోట్లు, రాజీవ్పార్కు అభివృద్ధికి రూ.12 కోట్లు, శిల్ప వెంచర్ రోడ్డుకు రూ.4.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులకు సంబంధించి గురువారం ఆర్అండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ...కొండాపూర్ (మల్లేపల్లి)–హరిదాస్పూర్ వరకు డబుల్లైన్ రోడ్డు విస్తరణ, తంగేడుపల్లి–మల్లారెడ్డిపేట్ రోడ్డు వెడల్పుకు రోడ్లు భవనాల శాఖ నుంచి, కొండాపూర్–సదాశివపేట్, కలివేముల–మక్త అల్లూరు గ్రామం రోడ్డుకు పంచాయతీరాజ్శాఖ నుంచి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంత్ కిషన్, జూలకంటి ఆంజనేయులు, కూన సంతోష్తోపాటు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం తనిఖీహత్నూర(సంగారెడ్డి): తుర మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
కబ్జానా..కూల్చేయ్..!
దడపుట్టిస్తున్న తహసీల్దార్ పటాన్చెరు: అమీన్పూర్ తహసీల్దార్ ఎన్.వెంకటస్వామి పనితీరు స్థానికులను ఆకట్టుకుంటుంది. ఆయన మనూర్ నుంచి బదిలీపై అమీన్పూర్కు వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కాపాడారు. ఇంతకుముందు ఇక్కడ పని చేసిన తహసీల్దార్ల అలసత్వం వల్ల అనేక ప్రభుత్వ భూములు కబ్జాదారుల పరమయ్యాయి. కోర్టు వివాదాల పరిధిలో ఉన్న భూముల్లో క్రయవిక్రయాలు జరిగాయి. పట్టణంలోని సర్వే నెంబర్ 343, 993లో అక్రమణలు కొనసాగాయి. అయితే తాజాగా వచ్చిన తహసీల్దార్ వెంకటస్వామి మాత్రం స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే క్షేత్రస్థాయిలో జేసీబీతో ప్రత్యక్షమవుతుండటం స్థానికులను ఆకట్టుకుంటోంది. వచ్చినప్పట్నుంచీ ఇప్పటివరకు... వెంటకస్వామి ఇక్కడకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కిష్టారెడ్డిపేటలోని సర్వేనంబర్ 164లో 30గుంటల భూమిని కాపాడారు. అక్కడ పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్కు నివేదించారు. సర్వే నంబర్ 343లో ఆక్రమణలను తొలగించారు. అక్కడ ఎక్స్ సర్వీస్మెన్లకు భూమి అసైన్ అయ్యిందని చెప్తూ సర్వే నంబర్ 343లో తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జాలకు తెగబడిన వారి ఆటలు సాగనివ్వలేదు. సర్వేనంబర్ 455లో సమ్మక్క సారక్క గుడి పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే వాటిని జేసీబీతో కూల్చి వేయించారు. సర్వే నంబర్ 993లో వెలసిన కబ్జాలను పోలీసులను వెంటేసుకుని వచ్చి వాటిని తొలగించారు. సుల్తాన్పూర్ సర్వేనంబర్ 30లో కూడా కబ్జా నిర్మాణాలను కూల్చివేశారు. కబ్జాలకు పాల్పడిన నలుగురిపై కేసులు నమోదు చేశారు. తాజాగా గురువారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్లో సర్వే నంబర్ 381లో ప్రభుత్వ భూమిలో 12 అక్రమ నిర్మాణాలు, నాలుగు బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చేశారు. గజం కూడా కబ్జాకు గురికాకూడదు ఎక్కడ కబ్జాలు జరగుతున్నాయని తెలిసినా వెంటనే వాటిని కూల్చివేస్తాం. ఒక గజం కూడ కబ్జాకు అనుమతించేది లేదు. ఉన్నని రోజులు అక్రమాలను అడ్డుకుంటాం. రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గను. – వెంకటస్వామి, తహసీల్దార్, అమీన్పూర్ -
ఉపాధి పని వేళల్లో మార్పు
సంగారెడ్డి జోన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే వేసవి నేపథ్యంలో ఎండలు దంచికొడుతుండటంతో కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వారి పనివేళల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కూలీలకు ఉపశమనం కలగనుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే... వేసవి కాలంలో ఎండ తీవ్రత, వడదెబ్బ సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉపా ధి పనులు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పనులు చేసుకునే విధంగా సౌకర్యం కల్పించింది. ఉపాధిలో రోజు కూలి రూ. 307లను నిర్దేశించింది. కేవలం ఉదయం సమయంలో పనులు ఉండటంతో మండే ఎండలకు ఉక్కపోతకు గురై పూర్తిస్థాయిలో పనులు చేసేవారు కాదు. దీంతో దినసరి కూలి తక్కువగా వచ్చేది. ఉపాధి హామీ కూలీలకు సంబంధిత అధికారులు వేసవిలో ఎండలు అధికమవుతున్న తరుణంలో రక్షణ పొందుతూ పనులు చేసుకోవాలని, అవసరమైతే సాయంత్రం సమయంలో పనులు చేసుకునే సౌకర్యం కల్పించిందని అవగాహన కల్పిస్తున్నారు. పెరుగుతున్న కూలీలు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీలో పనివేళల్లో వెసులుబాటులో కల్పించడంతో రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 36 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలోని పని ప్రదేశాలు కూలీలతో సందడిగా కనిపిస్తోంది. ఉపాధి హామీలో ప్రస్తుత 2025–26 ఆర్థిక ఏడాదిలో 39.96లక్షల పని దినాలు కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించి, పనులు సాగిస్తున్నారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తారు. పనుల వేళల్లో మార్పులు తీసుకురావడంతో తమకు పూర్తిస్థాయిలో కూలి అందుతుందని కూలీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహణ నిర్దేశిత కూలి అందించేందుకు చర్యలు పెరుగుతున్న ఎండల దృష్ట్యా మార్పులు కూలీలకు ఇబ్బందులుకలగకుండా చర్యలు సద్వినియోగం చేసుకోవాలి ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలి. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రతీ కూలికి నిర్దేశించిన డబ్బులు అందేవిధంగా పనులు చేపట్టేందుకు వీలు కల్పించింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి పనులు కల్పిస్తాం. – జ్యోతి, డీఆర్డీఓ, సంగారెడ్డి -
జొన్నలు కొనుగోలు చేయాలి
కల్హేర్(నారాయణఖేడ్): జొన్నలు కొనుగోలు చేయాలని మండలంలోని మార్డిలో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. కల్హేర్, మార్డి, బీబీపేట్, కృష్ణాపూర్లో జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో దాదాపు రెండు నెలలుగా ఇంట్లోనే నిల్వ ఉంచుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చేందర్ మాట్లాడుతూ...రైతులు పండించిన జొన్నలను కుప్పలుగా పోసి రాత్రి, పగలు కాపాడుకుంటున్నార న్నారు. ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి చొరవ తీసుకుని జొన్నల కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, నాయకులు కుమ్మరి శ్రీనివాస్, నర్సింలు, విఠల్రెడ్డి పాల్గొన్నారు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణ ● నామమాత్రంగా కేసులు జహీరాబాద్ టౌన్: పైన ఫొటోలో ఉన్న ఇసుక లారీలు హద్నూర్ పోలీసు స్టేషన్ ముందు కనిపించాయి. న్యాల్కల్ మండలం గుండా కర్ణాటకలోకి అక్రమంగా తరలివెళ్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు. ఇలా ప్రతీరోజు యథేచ్ఛగా ఇసుక లారీలు ఆ రాష్ట్రానికి తరలివెళ్తున్నాయి. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సి అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడూ నామమాత్రంగా కేసులు నమోదుచేసి జరిమానాలతో సరిపెడుతున్నారు. అధికారుల, అక్రమార్కుల తీరుతో సహజ సంపదైన ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోవడంతోపాటుగా ప్రభుత్వ ఆదాయానికీ భారీగా గండిపడుతోంది. ఇక లారీల్లో అధికలోడు కారణంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అడ్డూ అదుపులేకుండా... ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. సరిహద్దు రాష్ట్రాల వద్ద ఈ దందా జోరుగా సాగుతోంది. కర్ణాటకలో ఇసుకకు డిమాండ్ ఉండటంతో యథేచ్ఛగా సరిహద్దులు దాటుతోంది. న్యాల్కల్ మండలం సరిహద్దులో ఉన్న గ్రామాల పేరున వే బిల్ ఇతర అనుమతులు తీసుకుని అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుకు సుమారు 12 కిలోమీటర్ దూరంలో ఉన్న బీదర్ పట్టణంలో తెలంగాణ ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం నుంచి ఇక్కడ అనుమతులు తీసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా ప్రతీరోజు వందల సంఖ్యలో ఇసుక లారీలు సరిహద్దులు దాటిపోతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఆదాయాని గండి పడుతుంది. ముంగి ఆదిలక్ష్మి మందిరం నుంచి రాంతీర్థం,గుంజెట్టి మీదుగా సరిహద్దు వరకు గల రోడ్డు లారీలు తిరగడంతో దెబ్బతిని అధ్వాన్నంగా తయారయ్యాయి. పది లారీలు పట్టుకున్న పోలీసులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కర్ణాటకలోని బీదర్ పట్టణానికి వెళ్తున్న పది ఇసుక లారీలను హద్నూర్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. మరో ఘటనలో హుసెళ్లి వద్ద హద్నూర్ పోలీసులు తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని లారీలను పట్టుకుని సీజ్ చేశారు. ఇసుక లారీ సీజ్మునిపల్లి(అందోల్): ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిసున్న లారీని బుదేరా పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం మండలంలోని కంకోల్ టోల్ ప్లాజా సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై వివిధ వాహనాలు తనిఖీ నిర్వహించారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా సంగారెడ్డి నుంచి బీదర్కు లారీలో అక్రమంగా ఇసుక తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే లారీని బుదేరా పోలీస్ స్టేషన్కు తరలించి లారీ యజమాని మహమ్మద్ ఇమ్రాన్, లారీ డ్రైవర్ సయ్యద్ మసియోద్ధిన్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తనిఖీలు తప్పనిసరి... ఇసుక లారీ డ్రైవర్లు తప్పనిసరిగా వే బిల్తోపాటు అన్ని అనుమతులకు సంబంధించిన పత్రాలను కలిగిఉండాలి. అనుమతి పత్రాలు లేని లారీలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కర్ణాటకకు ఇసుక తరలిస్తున్న లారీలపై నిఘా పెట్టాం. – రాంరెడ్డి, ఆర్డీఓ, జహీరాబాద్ -
వృద్ధురాలు అదృశ్యం
మెదక్ మున్సిపాలిటీ: వృద్ధురాలు అదృశ్యమైన ఘటన మెదక్ పట్టణంలో గురువారం వెలుగులోకి వచ్చింది. సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. పట్టణంలోని జంబికుంట వీధికి చెందిన తొనిగండ్ల లక్ష్మమ్మ(68)మతిస్థిమితం సరిగా లేదు. ఆమె ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకి లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 57913, 87126 57878 కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. గజ్వేల్లో యువతి.. గజ్వేల్రూరల్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన గజ్వేల్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన పంచాల మాధవి గురువారం ఉదయం ఇంట్లో నుంచి షాపు వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హల్దీ ప్రాజెక్ట్లో వ్యక్తి గల్లంతు
వెల్దుర్తి(తూప్రాన్): చేపలు పట్టడానికి హల్దీ ప్రాజెక్ట్లోకి దిగిన యువకుడు నీటమునిగి గల్లంతయ్యాడు. ఈ విషాదకర ఘటన మాసాయిపేట మండలం హకింపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చెర్లపల్లి పంచాయతీ పరిధి వర్దవాని చెరువుతండాకు చెందిన ఎలక్ట్రీషియన్ రాజు వద్ద అదే తండాకు చెందిన కేతావత్ గోపాల్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇరువురు హకీంపేట శివారులోని హల్దీ ప్రాజెక్ట్లో చేపలు పట్టడానికి గురువారం ఉదయం వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో గోపాల్ ప్రమాదశాత్తు నీటమునిగి గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న రాజు విషయాన్ని కుటుంబసభ్యులు, పోలీసులకు చేరవేశాడు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సహకారంతో ప్రాజెక్ట్లో సాయంత్రం వరకు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా గోపాల్ గల్లంతుపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోపాల్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి వెల్దుర్తి(తూప్రాన్): ఇంటి ఆరుబయట కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అందుగులపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దున్న శేఖాగౌడ్(61) బుధవారం ఉదయం ఇంటి వరండాలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి స్ఫృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. గుర్తు తెలియని వ్యక్తి.. నర్సాపూర్ రూరల్: గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నర్సాపూర్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై లింగం కథనం మేరకు.. నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఈనెల 6న గుర్తు తెలియని వ్యక్తి స్ఫృహ తప్పి పడిపోయి ఉన్నట్లు ఆర్టీసీ కంట్రోలర్ సాన సత్యనారాయణ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే రోజు ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా గురువారం మృతి చెందాడు. మృతుడి కుడి చేతిపై పచ్చబొట్టు, ఒంటిపై స్కై బ్లూ వైట్ కలర్ చొక్కా, ఆలివ్ కలర్ పాయింట్ ఉంది. మద్యానికి బానిసై కిందపడి.. జహీరాబాద్ టౌన్: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం.. పట్టణంలోని విద్యుత్ కాలనీకి చెందిన ప్రకాష్ (35) మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 4న తాగిన మత్తులో అదుపుతప్పి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. బావిలో పడిన వ్యక్తి సురక్షితం కాపాడిన ఫైర్ సిబ్బంది హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని మోడల్ స్కూల్ ఎదుట ఉన్న బావిలో గురువారం జక్కనపల్లి బుచ్చయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ ఆధ్వర్యంలో సిబ్బంది బావిలోకి నిచ్చెన వేసి బుచ్చయ్యను కాపాడారు. కాపాడిన వారిలో సిబ్బంది రాంచందర్, నరసింహ, శ్రీనివాస్, ఎల్.శ్రీనివాస్ ఉన్నారు. -
బాల్య వివాహాలు జరగకుండా చర్యలు
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో భరోసా కేంద్రం ఆధ్వర్యంలో పొక్సో, లైంగిక దాడుల కేసులపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు జరిగే లైంగిక దాడులను పోక్సో కేసులుగా పరిగణిస్తారని తెలిపారు. గ్రామాల్లో గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి కేసులపై అవగాహన కల్పించి, నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, భరోసా కోఆర్డినేటర్ దేవలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశాలకు వేళాయె..
కేజీబీవీల్లో ప్రవేశాలు షురూ ● ఆంగ్ల మాధ్యమంలో బోధన ● ఆరో తరగతి అడ్మిషన్లు ప్రారంభం ● జిల్లాలో 22 పాఠశాలలు దుబ్బాకటౌన్: పేద, వెనుకబడిన, మధ్యలో బడి మానేసిన బాలికలకు విద్యనందించేందుకు కేంద్ర ప్రభుత్వం కస్తుర్భాగాంధీ బాలికల విద్యాలయాలను (కేజీబీవీ) ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు లేని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థినులకు ఉన్నత చదువులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి మండల కేంద్రంలో వీటిని ప్రారంభించింది. విద్యార్థులలో నైపుణ్యాలను మెరుగుపరిచి భవిష్యత్కు బాటలు వేస్తున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కస్తూర్భా పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏప్రిల్ 24 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆరో తరగతిలో.. జిల్లాలో మొత్తం 22 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి తరగతిలో 40 మంది చొప్పున విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏమైనా ఖాళీలు ఉంటే ప్రవేశాలు కల్పిస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన విద్యార్థినులకు అన్ని రకాల వసతులు, మెనూ ప్రకారం ఆహారం, నాణ్యమైన విద్య, ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు వసతితో కూడిన విద్య అందిస్తుండటంతో ఈ పాఠశాలలు నిరుపేద కుటుంబాల బాలికలకు ఎంతో ఆసరగా నిలుస్తున్నాయి. పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతోపాటు నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తున్నారు. భవిష్యత్లో విద్యార్థులకు ఉపాఽధి అవకాశాలు పొందేలా కుట్లు, అల్లికలతో పాటు ఇతర అంఽశాలను నేర్పిస్తున్నారు. వివిధ రకాల వృత్తి విద్య కోర్సులు సైతం అమలు చేస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి నాణ్యతతో కూడిన విద్య, వసతి గృహం అందుబాటులో ఉన్నందున గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్లో విద్యార్థినులకు ఉపాధి కల్పించేలా వృత్తి విద్య కోర్సులు, కుట్లు ,అల్లికలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ వారికి భవిష్యత్లో ఉపాధి అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – స్వాతి, దుబ్బాక కేజీబీవీ పాఠశాల, ప్రత్యేక అధికారిదరఖాస్తు ఇలా..కస్తూర్భా విద్యాలయాల్లో ప్రవేశాలకు మొదట తల్లిదండ్రులు లేని విద్యార్థినులకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. తర్వాత మిగిలిన విద్యార్థినులకు ప్రవేశాల కోసం నమోదు చేసుకుంటున్నారు. ప్రవేశాలకు విద్యార్థులు 5వ తరగతి వరకు చదువుకున్న బోనోపైడ్, టీసీ, ఆధార్కార్డు జిరాక్స్, ఫొటోలు జత చేయాలి. -
ఏఐతో పంట తెగుళ్ల గుర్తింపు
ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్లర్ ములుగు(గజ్వేల్): కృత్రిమ మేథ(ఏఐ), రోబోటిక్స్, డ్రోన్ల ఏకీకరణ ద్వారా పంట దిగుబడి, తెగుళ్లు, వ్యాధుల అంచనా వేయవచ్చని ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు ములుగు ఉద్యాన వర్సిటీలో గురువారం హైదరాబాద్కు చెందిన మారుత్ డ్రోన్స్ సంస్థతో ఉద్యాన పంటలపై పరిశోధన, అభివృద్ధి, శిక్షణలో సహకారం పెంపొందించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యానవన ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుతున్నదని తెలిపారు. డ్రోన్ ఆధారిత సాంకేతికత సామర్థ్యాన్ని ఉపయోగించి పంట పర్యవేక్షణ, తెగులు, వ్యాధుల అంచనా స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగు పరచడం లక్ష్యంగా పెట్టుకున్నదని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ఆరు ప్రధాన ఉద్యాన పంటలు మిర్చి , పసుపు, టమోటా, వంకాయ, ఆయిల్పామ్, మామిడి పరిశోధన శిక్షణ కార్యక్రమాలు సాంకేతిక అభివృద్ధిపై సంయుక్తంగా పనిచేస్తాయన్నారు. కార్యక్రమంలో మారుత్ డ్రోన్ కో ఫౌండర్ ప్రేమ్ కుమార్, ఉద్యానవర్సిటీ అధికారులు భగవాన్, చీనా నాయక్, లక్ష్మినారాయణ, సురేశ్కుమార్, శ్రీనివాసన్, వీణాజ్యోతి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు బలవన్మరణం
ఉమ్మడి జిల్లాలో అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేటకమాన్: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన పెద్దెల్లి తానేష్ (40) జీవనోపాధి నిమిత్తం సిద్దిపేటకు వచ్చి హనుమాన్నగర్లో అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. తానేష్కు ఎటువంటి ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై కుటుంబ పోషణ భారమైంది. అప్పులు చేసి తీర్చే మార్గం లేక గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పురుగుల మందు తాగి..హవేళిఘణాపూర్(మెదక్): ఆర్థిక ఇబ్బందులతో సతమతమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ రాజు కథనం ప్రకారం... మండల పరిధిలోని పల్ల సావిత్రి, యాదగిరి ప్రథమ కుమారుడు మనోహర్(23) కిరాణం కొట్టుపెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. దీంతో కుటుంబ పోషణతో పాటు వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పులు పేరుకుపోయాయి. దీంతో ఎలా తీర్చాలని మనస్తాపానికి గురై బుధవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని తన తమ్ముడు దుర్గాప్రసాద్కు తెలుపగా వెంటనే మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి గాంధీ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
జగదేవ్పూర్(గజ్వేల్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ బాణోతు రాజన్న నాయక్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కళాశాలలో చేరాలని సూచించారు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హచ్ఈసీ, ఒకేషనల్ ఈటీ (ఎలక్ట్రికల్ టెక్నీషియన్)తో పాటు ఈ యేడాది నూతనంగా ఎంఈసీ తెలుగు, ఇంగ్లిష్ మీడియంతో పాటు ఒకేషనల్లో ఎంపీహెచ్డబ్ల్యూ(పారా మెడికల్ కోర్స్)లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
● లిఫ్టు అడిగి వెనుక కూర్చున్న వ్యక్తి మృతి ● ముగ్గురికి తీవ్ర గాయాలు నారాయణఖేడ్ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం నాగాపూర్ గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. ఖేడ్ ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి వివరాల ప్రకారం.. సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన సురేష్ ఖేడ్ మండలం అబ్బెంద క్లస్టర్ ఏఈఓగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాగాపూర్ గ్రామంలో తన విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై నాగాపూర్ తండాకు చెందిన బిక్యానాయక్తో కలిసి ఖేడ్కు వస్తున్నాడు. కంగ్టి వైపు నుంచి ఖేడ్ మండలం సీతారాంతండాకు చెందిన కాశీరాం తన కుమారుడైన చందుతో కలిసి ద్విచక్రవాహనంపై ఖేడ్ వైపు వస్తున్నారు. నాగాపూర్ దాటాక సురేష్ ద్విచక్రవాహనాన్ని కాశీరాం వెనుకనుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లగా బిక్యానాయక్(65) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడ్డ సురేష్(35), కాశీరాం(35), చందు (5)లను మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లిఫ్ట్ అడిగి ప్రాణాలు కోల్పోయి.. నాగాపూర్ నుంచి ద్విచక్రవాహనంపై ఖేడ్కు వస్తున్న ఏఈఓ సురేష్ను బిక్యానాయక్ లిఫ్టు అడిగి అతడి వాహనంపై వెనుకకూర్చుని వస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బిక్యానాయక్కు భార్య అనిశాబాయితోపాటు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. కాగా కూతుళ్ల వివాహాలు జరిగాయి. అతడి మృతితో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. -
పవన్ కల్యాణ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా: ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశా రు. మంగళవారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా ఆధ్వర్యంలో ఎస్.ఐ కాశీనాథ్కు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వందశాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కల్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్లాం శాంతి, ప్రేమకు సంబంధించిన మతమన్నారు. ముస్లింల గుర్తింపు అయిన టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ప్లను పవన్ కల్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
విచక్షణ రహిత జర్నలిజాన్ని ప్రోత్సహించొద్దు
సీనియర్ సంపాదకులు కే. శ్రీనివాస్ములుగు(గజ్వేల్) : సోషల్ మీడియాలో జవాబుదారీతనం లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, రాజకీయ నాయకులు విచక్షణ రహిత జర్నలిజాన్ని ప్రోత్సహించొద్దని సీనియర్ సంపాదకులు, రచయిత కే. శ్రీనివాస్ పేర్కొన్నారు. గజ్వేల్ ప్రెస్క్లబ్ 25 ఏళ్ల వేడుకల(రజతోత్సవాలు) సందర్భంగా ములుగులోని ఓ ఫంక్షన్ హాల్లో ‘జర్నలిజం గతం, వర్తమానం, భవిష్యత్’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కే.విరాహత్ అలీతో కలిసి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గతంలో ప్రింట్ జర్నలిజంలో వడపోత ప్రక్రియ ఉండేదని, ప్రస్తుతం ఎవరికి నచ్చినట్లు వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ మాట్లాడుతూ.. అక్షరజ్ఞానం లేనివారు, అల్లరి మూకలు మీడియా పేరు చప్పుకొని ఇష్టారీతిన బ్లాక్ మైలింగ్కు పాల్పడుతున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి వారికి ప్రజా కోర్టులోనే గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ఎల్లం, టీ. నర్సింలు, జగదీశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ విజయమోహన్, తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు గేదెలు మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు పాడి గేదెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మెట్పల్లిలో సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బొస్సే చంద్రం రోజు మాదిరిగా పాడి గేదెలను వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఇంటికొచ్చాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లగా రెండు గేదెలు మృతి చెంది ఉన్నాయి. విషయం తెలుసుకున్న పశువైద్యురాలు మంజుల అక్కడకు చేరుకొని పరిశీలించి పిడుగుపా టుతోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. సుమా రు రూ.లక్ష విలువైన పాడి గేదెలు మృతి చెందడంతో రైతు బోరున విలపించాడు. మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. విద్యుదాఘాతంతో మేకలు.. తొగుట(దుబ్బాక): విద్యుదాఘాతంతో మేకలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని లింగంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. తొగుట మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల రమేశ్ మేకలను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగా ఉదయం మేతకు తీసుకెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికొస్తున్నాడు. లింగంపేట శివారులో పటేల్ చెరువు వద్ద ఆదివారం ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ స్తంభాలకు కరెంట్ సరఫరా అవుతుంది. నీరు తాగేందుకు చెరువులోకి వెళ్తున్న క్రమంలో వైర్లకు తగిలి మూడు మేకలు మృతి చెందాయి. వాటి విలువ రూ.60 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం రామచంద్రాపురం(పటాన్చెరు): గ్రామస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతీయేటా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ అన్నారు. మంగళవారం తెల్లాపూర్ గద్దర్ సర్కిల్ వద్ద అమృత, సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ప్రతీయేటా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే కబడ్డీ పోటీల్లో 31 జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఇందులో మొదటి విజేతకు రూ.99,999, రెండో బహు మతి రూ.55,555, మూడో బహుమతి రూ. 33,333 నగదు అందించనున్నట్లు తెలిపారు. పెట్టుబడి పేరుతో వ్యాపారి మోసం రూ.1.74 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు దుబ్బాక : పెట్టిన పెట్టుబడికి తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు వస్తాయంటూ సైబర్ మోసగాళ్లు చెప్పిన మాటలు నమ్మి ఓ వ్యాపారి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం మేరకు.. దుబ్బాక పట్టణానికి చెందిన మహమ్మద్ సలాం అనే వ్యాపారి సెల్ఫోన్కు గతేడాది అక్టోబర్లో అమీలియా అనే గ్రూపునకు సంబంధించి లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు వస్తాయన్న వివరాలు ఉన్నాయి. సలాం దానిలో ఉన్న స్కానర్కు మొదట రూ.30 వేలు పంపగా వెంటనే రూ.60 వేలు వచ్చాయి. మరోసారి మళ్లీ రూ.30 వేలు పంపగా అలాగే వచ్చాయి. దీంతో అత్యాశతో రూ.1,74,999 ను ఆ లింక్లోని స్కానర్కు విడతల వారీగా పంపాడు. అప్పటి నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మోసపోయాయని గుర్తించాడు. ఈ విషయాన్ని బాధితుడు 1930 కి కాల్చేసి ఫిర్యాదు చేయడంతో రూ.7 వేలు ఫ్రీజ్ చేశారు. బాధితు డి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమో దు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అధిక దిగుబడులు సాధించాలి
సీడీసీ చైర్మన్ రాంరెడ్డి సదాశివపేట రూరల్(సంగారెడ్డి): వ్యవసాయరంగంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని సీడీసీ చైర్మన్ రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఆత్మకూర్ రైతువేదికలో జరిగిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రయానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులను వినియోగించాలన్నారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు అందించడం మన అందరి బాధ్యత అన్నారు. పంట మార్పిడిని పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందాలని సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు విజయ్కుమార్, విజయలక్ష్మి, గణపతి షుగర్ పరిశ్రమ జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్, ఏఓ రమేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్ధన్న, మాజీ సర్పంచ్ గంగన్న, నాయకులు పాల్గొన్నారు. -
పశువైద్యం.. దైవాదీనం!
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల పట్టణంలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. పట్టణ కేంద్రంలో పశువులకు వైద్యం అందించే పశు వైద్యశాలను కొన్నేళ్ల కిందట కూల్చి వేశారు. అనంతరం కొద్దిరోజులు స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో ఆస్పత్రి నిర్వహించారు. అనంతరం సిద్దిపేట జనగామ ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి మార్చారు. చేర్యాల మండల వ్యాప్తంగా ఒక్కటే.. పట్టణ కేంద్రంతోపాటు మండల పరిధిలోని గ్రామాల్లో గేదెలు 2,935, ఆవులు, ఎడ్లు 1,347, మేకలు 9,865, గొర్రెలు 25,354 ఉన్నాయి. ఉమ్మడి చేర్యాల మండల పశు వైద్యశాల గతంలో మర్రిముస్త్యాలలో ఉండేది. రైతులు పశు వైద్య సేవల నిమిత్తం అక్కడికి వెళ్లేవారు. 2016లో జరిగిన జిల్లా విభజన సమయంలో చేర్యాల మండలం కొమురవెల్లి, చేర్యాల రెండుగా విభజించబడింది. ఈ క్రమంలో చేర్యాల మండల పశు వైద్యశాలను ఆకునూరులో ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడ ఎలాంటి భవనం లేకపోవడంతో ఏర్పాటు చేయలేదు. మర్రిముస్త్యాల గ్రామం కొమురవెల్లి మండల పరిధిలోకి వెళ్లడంతో అక్కడి రైతులు పశువులకు వైద్యం అందించడానికి మర్రిముస్త్యాలకు వస్తున్నారు. చేర్యాల మండల వ్యాప్తంగా ఒక్కటే పశు వైద్యశాల ఉండటంతో ఇక్కడి రైతులు కూడా మర్రిముస్త్యాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే మండల పరిధిలోని ఆకునూరు, పట్టణ కేంద్రంలోని పశు వైద్యశాలకు సొంత భవనాలు నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. నిధులున్నా ఆగిన భవనం ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేర్యాలలోని స్థానిక అంగడి బజారులో ఉన్న పశు వైద్యశాల భవనాన్ని కూల్చి వేశారు. అప్పటి ప్రభుత్వం కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, స్థలం సేకరణ కూడా చేసింది. కొన్ని అనివార్య కారణాలతో భవన నిర్మాణం చేయలేదు. దీంతో వైద్య అధికారులు చేసేది ఏమి లేక వేర్వేరు భవనాల్లో ఆస్పత్రి నడిపిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. చేర్యాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో కొనసాగిస్తున్నారు. ఆకునూరుకు సంబంధించి కనీసం అద్దె భవనం కూడా దొరక్క ఏర్పాటు చేయలేదు. మూగజీవాలకు అందని వైద్యం రెండు మండలాలకు ఒకటే ఆస్పత్రి సొంత భవనాలు కరువు చేర్యాల పట్టణ కేంద్రంలో బడిలో కొనసాగింపు ఆకునూరు ఆస్పత్రికి భవనం లేక నోచుకోని ఏర్పాటు భవనాలు నిర్మించాలని కోరుతున్న రైతులు -
ఫలితాల్లో రోల్ మోడల్
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందన్న నానుడి నిజం చేస్తున్నారు టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు. విద్యాబోధనలో మెళకువలు పాటిస్తూ.. ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపడుతూ విద్యావ్యవస్థలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్న తలంపుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్ మంచి ఫలితాలను సాధిస్తూ శభాష్ అనిపించుకుంటుంది. –టేక్మాల్(మెదక్)జిల్లాలో 7 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయగా ఒక్కో పాఠశాలకు సుమారుగా 820 మంది విద్యార్థులు విద్యాబోధన చేస్తున్నారు. ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లంలోనే విద్యా బోధన నిర్వహిస్తున్నారు. జిల్లా అన్ని ప్రభుత్వ, మోడల్ స్కూల్ కంటే టేక్మాల్లోని మోడల్ స్కూల్లో మంచి ఫలితాలను సాధిస్తూ జిల్లాలోనే టాప్లో నిలుస్తున్నారు. ఉత్తమ ఫలితాల్లో ఫస్ట్.. ● క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ పాఠశాలలో పదవ తరగతి ప్రారంభమైన 2016 నుంచి పదవ తరగతిలో ఈ ఏడాది వరకు 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ● ఈసారి పదవ తరగతిలో శ్రీజ 577 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, కార్తీక్ 572 మార్కులను సాధించి రెండో స్థానంలో నిలిచాడు. సుమారు 44 మందికి విద్యార్థులు 500లకి పైగా మార్కులు సాధించారు. ● ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత సాధించగా పాఠశాలకు చెందిన పూజ అనే విద్యార్థి 960 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. ● పాఠశాలలో నేషనల్ మిన్స్ మెరిట్ స్కాలర్షిప్కు పదులకొద్ది విద్యార్థులు ఎంపికవుతున్నారు. ● ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో మోడల్ స్కూల్ అన్నింటి కంటే ఆదర్శంగా నిలుస్తోంది. ● ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో సైతం పట్టు సాధించి ఉన్నత విద్యకు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతున్నారు. ఇంటర్లో దరఖాస్తుల ఆహ్వానం ● 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇంట ర్మీడియట్ ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ● ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో మొత్తంగా 150 సీట్లు అందుబాటులో ఉండగా పదవ తరగతి వచ్చిన మార్కుల మెరిట్ లిస్టు ప్రకారం విద్యార్థులకు ఇంటర్మీడియట్లో అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మోడల్ స్కూల్లో ఎంపీసీ 40, బైపీసీ 40, సీఈసీ 40, ఎంఈసీ 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ● మొదటి సంవత్సరం ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 20వ తేదీ వరకు గడువు కావడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మోడల్ స్కూల్లో 100 మంది విద్యార్థినులకు ఉచిత వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. పదేళ్లుగా పదిలో 100 శాతం ఉత్తీర్ణత ఆటల్లోనూ రాణిస్తున్న విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్న టేక్మాల్ మోడల్ స్కూల్ ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లంలోనే విద్యా బోధన 20 వరకు ఇంటర్లో దరఖాస్తులకు అవకాశం సమష్టి కృషితో ఫలితాలు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యాబోధన నిర్వహిస్తున్నాం. పదేళ్లుగా పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నాం. ఇంటర్మీడియట్లో సైతం మంచి ఫలితాలు సాధిస్తున్నాం. పాఠశాలలోని ఉపాధ్యాయుల అందరి సమష్టి కృషితో ప్రతీ ఏడాది మంచి ఫలితాలను సాధిస్తున్నాం. చదువుతోపాటు విద్యార్థులు ఆటల్లో తమ ప్రతిభను కనబర్చి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ కార్యక్రమం నిర్వహిస్తాం. – సుంకరి సాయిలు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టేక్మాల్ ఆటల్లోనూ అదుర్స్.. చదువుతోపాటూ పాఠశాలల్లోని విద్యార్థులు సాంసృతిక కార్యక్రమాల్లోనూ, ఆటల్లోనూ తమ ప్రతిభ కనభరుస్తున్నారు. మండల స్థాయిని మొదలుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. యోగాలో తమకు దీటుగా ఎవరూ లేరంటూ జాతీయ స్థాయిలో బహుమతులు పొంది అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. వసతులు అంతత మాత్రమే ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడిన విద్యా భోదన ఉండటంతో పాఠశాలల్లో చేరేందుకు డిమాండ్ ఉంది. -
అనారోగ్యం తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య
హుస్నాబాద్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. హనుమాన్ నగర్కు చెందిన గొర్ల శ్రీనివాస్ (40)కు భార్య లక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒక అమ్మాయికి వివాహం జరిగింది. శ్రీనివాస్ కొద్ది రోజులు గా కిడ్నీ వ్యాధితోపాటు అనారోగ్య సమస్యల తో బాధ పడుతున్నాడు. భార్య కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అనారోగ్య సమస్యలతో వేగలేక మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది.. గజ్వేల్రూరల్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. రాయపోల్ మండలం తిమ్మకపల్లికి చెందిన కామోజీ ఆంజనేయులు(45)కు నవనీతతో 14 ఏళ్ల కిందట వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెయింటర్గా పని చేస్తున్న ఆంజనేయులు గజ్వేల్ పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. మద్యానికి బానిసై భార్యతో తరచూ గొడవ పడుతుండటంతో పిల్లలను తీసుకొని తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే మృతుడి కుటుంబ సభ్యులకు విషయం చెప్పాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు 4న ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
సిద్దిపేటకమాన్: యూనిఫామ్ వేసుకున్న ప్రతీ ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యమని యూనిఫామ్లో ఉన్న వారిని పది మంది గమనిస్తూ ఉంటారని అది తెలుసుకొని బాధ్యతగా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో హోంగార్డు సిబ్బందికి దర్బార్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హోంగార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమే అన్నారు. హోంగార్డుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ పీఎస్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహించారని ఇక ముందు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, కార్తీక్, విష్ణుప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దిపేట సీపీ అనురాధ హోంగార్డు సిబ్బందితో ‘దర్బార్’ -
ముగ్గురి పైకి దూసుకెళ్లిన కారు
మహిళ మృతి, మరో ఇద్దరికి గాయాలు చిన్నశంకరంపేట(మెదక్): వల్లభాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ముగ్గు రిపైకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. నార్సింగి పరిధిలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోచమ్మల మారవ్వ(58), రామయ్యతోపాటు చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన దశరథం పని మీద రామాయంపేటకు వెళ్లి తిరిగి ఇంటికొస్తున్నారు. వల్లభాపూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా కామారెడ్డి వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యా యి. స్థానికులు క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ తరలిస్తుండగా మారవ్వ మృతి చెందింది. నార్సింగి పోలీస్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
చేర్యాల(సిద్దిపేట): ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలిపారు. మంగళవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎల్.శ్రీను వివరాలు వెల్లడించారు. పట్టణ పరిధి లోని చెరువు సమీపంలో కొందరు వ్యక్తులు ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం అందింది. సిద్దిపేట టాస్క్ఫోర్స్, చేర్యాల పోలీసులు వెళ్లి దాడి చేసి కమల్ల శ్రీనివాస్, కూరపాటి శివప్రసాద్, నర్ర చంద్రబాబు, ఎల్ల నవీన్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.76,400 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీ నం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మరికొంత మంది పారిపోయారని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. సమావేశంలో చేర్యాల ప్రొబిషనరీ ఎస్ఐ సమత, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పలహారానికి ప్రభుత్వ భూములు
● పథకం ప్రకారం సర్కారు భూములకు ఎసరు ● కబ్జాదారులకు వంతపాడుతున్న అధికారులు ● అమీన్పూర్ మున్సిపల్ అధికారుల అవినీతి బాగోతాల కథలెన్నో పటాన్ చెరు: అమీన్పూర్లో దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా సర్కారు భూమి ఉంది. ఆ భూమిని కాజేసేందుకు కొన్నేళ్లుగా కబ్జాకోరులు ఎత్తులు వేస్తూనే ఉన్నారు. రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిపోయిన వీరు తాజాగా అధికారులతో కలసి మరింత జోరుగా ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నారు. ఈ కొత్త నాటకానికి సూత్రధారులు పాత్ర ధారుల తోడై కోట్లాది రూపాయల అవినీతికి తెర లేపారు. పట్టా భూమిలోని ప్లాట్లకు అనుమతులు తీసుకుని సర్కారు భూముల్లో పాగా వేసే ఎత్తుకు అమీన్పూర్ మున్సిపల్ అధికారులు వంత పాడుతున్నారు. కబ్జాకు గురైన సర్కార్ భూమి సర్వే నంబర్ 993లో మున్సిపల్ అధికారులు అనుమతివ్వడంతో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వెయ్యి గజాల భూమిలో మున్సిపల్ అనుమతులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ వ్యవహారంపై అమీన్పూర్ తాజా మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, తాజా మాజీ కౌన్సిలర్ రమేశ్ ఇటీవల వ్యవహారంపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రతీ చోటా ఇదే తీరు... అమీన్పూర్ పట్టణంలో ఇది ఒకటే కాకుండా ప్రతీచోట ఈ పద్ధతిలోనే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. పట్టా భూముల్లోనే ప్లాట్లను చూపుతూ ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం తమకే సంబంధం లేదని అనుమతులిచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని టౌన్ ప్లానింగ్ అధికారులు వాదిస్తున్నారు. తమ కంప్యూటర్ సిస్టం ప్రకారం అనుమతికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనలు మేరకున్న వాటికే అనుమతులు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ దరఖాస్తుదారులు ఇచ్చే మామూళ్లకు తలవంచి మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా అడ్డగోలు అనుమతులిస్తున్నారని స్థానిక తాజా మాజీ కౌన్సిలర్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తోటలో ప్లాట్లు సర్వే నంబర్ 1118లో ఇటీవల రెండు ఇళ్లకు అనుమతులిచ్చారు. వాస్తవానికి ఇది ఓ మామిడి తోట. ఆ తోటకు ఎలాంటి రోడ్డు లేదు. డ్రైనేజీ నిర్మించలేదు. లే అవుట్ వేయలేదు. ఆ భూమి కోర్టు పరిధిలో ఉందని ఇతర అనేక ఆరోపణలున్నాయి. కానీ అధికారులు మాత్రం అక్రమ పద్ధతిలో ప్లాట్లు వేసేందుకు అనుమతులు జారీ చేశారు. నర్రెగూడెంలో.. అమీన్పూర్ పరిధిలోని నర్రెగూడెంలో ప్రభుత్వ భూమిలో నాలుగు ఇళ్లకు అనుమతులు జారీచేశారు. ఒక తాజా మాజీ బీఆర్ఎస్ కౌన్సిలర్ పైరవీ చేసి అనుమతులను పొందారు. అలాగే 1056 సర్వేనంబర్లో ప్రభుత్వ భూమిలో వివాదాస్పద వాల నారాయణరావు ప్లాట్లకు అనుమతులు జారీ చేశారు. అక్కడ ఇసుకబావికి చెందిన ఒక తాజా మాజీ కౌన్సిలర్ భర్త కాల్వ భూమిలో ఓ తాత్కాలిక షెడ్డు వేశారు. సస్పెండ్ చేయాలి అమీన్పూర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతోంది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. అనుమతులు లేకుండా తాత్కాలిక షెడ్లను వేస్తున్నా పట్టించుకోవడం లేదు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో పంచాయతీ అనుమతులతో బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ అధికారుల అవినీతి కారణంగా అమీన్పూర్ పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అవినీతి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి ఇష్టానుసారం అనుమతులు ఇస్తున్నారు. వారిని సస్పెండ్ చేయాలి. –నాయిని నరసింహారెడ్డి సీఐటీయూ జిల్లా నాయకుడునిబంధనల మేరకే అనుమతులు నిబంధనల మేరకే అనుమతులను జారీ చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం లేదు. అన్నింటిపై చర్యలు తీసుకుంటాం. –పవన్, టౌన్ ప్లానింగ్ అధికారి, అమీన్పూర్ -
రుణాల మంజూరులో తెరపైకి సిబిల్ స్కోర్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రాజీవ్ యువ వికాసం పథకం అమలులో సిబిల్ స్కోర్ అంశం తెరపైకి వస్తోంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాల మంజూరు విషయంలో లబ్ధిదారుల సిబిల్ స్కొర్ను పరిగణలోకి తీసుకుంటే చాలామంది దరఖాస్తుదారులకు ఈ పథకం యూనిట్లు మంజూరయ్యే అవకాశాలు ఉండటం లేదు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా నిరుపేదలే. దీంతో బ్యాంకులు సిబిల్ స్కోర్ కారణంగా ఈ రుణాలు దక్కక ఈ పథకం ద్వారా లబ్ధిపొందడం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ రుణాల మంజూరులో బ్యాంకర్లు మానవీయ కోణంలో వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియఈ పథకం కోసం జిల్లాలోని యువత నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కేటగిరీల కింద మొత్తం 49,559 దరఖాస్తులు వచ్చాయి. ఎంపీ డీఓలు ఆయా మండలాల స్థాయిలో దరఖాస్తులను ఆన్లైన్లో పరిశీలించి అర్హులైన వారి దరఖాస్తులను సంబంధిత బ్యాంకులకు ఫార్వర్డ్ చేస్తారు. ఇలా ఆయా బ్యాంకులకు వచ్చిన దరఖాస్తుదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. రుణం మంజూరులో సిబిల్ స్కోర్ కీలకంగా మారుతుంది.ఆ యూనిట్లకు బ్యాంకు రుణాలు...ఈ పథకం కింద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వ్యయం ఉన్న యూనిట్లకు బ్యాంకులు 30% మొత్తాన్ని రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వ్యయం ఉన్న యూనిట్లకు రూ.20 శాతం మొత్తాన్ని, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు యూనిట్ కాస్ట్ ఉన్న లబ్ధిదారులకు బ్యాంకులు పది శాతం రుణం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రుణం ఇవ్వాలంటే సిబిల్ స్కోర్ పాటించడం తప్పనిసరని బ్యాంకు మేనేజర్లు పేర్కొంటున్నారు.మానవీయ కోణంలో రుణాలివ్వాలిరాజీవ్యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాల విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని బ్యాంకర్లకు చెబుతున్నాము. ఈ పథకం కింద రుణాలు పొందే వారంతా నిరుపేదలే ఉంటారు. వారికి చేయూతనందిస్తే వారు స్వయం ఉపాధి పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.–రామాచారి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీఎస్ఎల్బీసీ లేఖ రాస్తాంవివిధ రకాల రుణ మంజూరులో బ్యాంకులు తప్పనిసరిగా రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పాటించాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఇచ్చే రుణాలకు సంబంధించి సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకోవద్దనే గైడ్లైన్స్ ఏమీ మాకు రాలేదు. ఈ విషయంలో ఎస్ఎల్బీసీకి రాసి స్పష్టత తీసుకుంటాము.–బి.నర్సింగ్రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, సంగారెడ్డిడీసీసీ సమావేశంలో చర్చఈ పథకాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు ఇటీవల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల ప్రతినిధులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా రుణాలు మంజూరు చేయాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా ఈ సిబిల్ స్కోర్ అంశంపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. -
కొనుగోలు కేంద్రాల తనిఖీ
జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీలోని కొత్తపల్లి, కానుకుంట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ డీపీఎం జయశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. కేంద్రాల వద్ద జరుగుతున్న కొనుగోళ్లను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కొత్తపల్లిలో 26 మంది రైతులు, 2,460లకుపైగా బస్తాలు, 984.80 క్వింటాళ్లు ధాన్యం నమోదు కాగా కానుకుంటలో 24 మంది రైతులు, 2,016 బస్తాలు, 842.80 క్వింటాళ్లు కొనుగోలు చేశారని తెలిపారు. కేంద్రం వద్ద రైతులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
నిత్య నైవేద్యానికి ఆర్థిక సాయం
● ధూప, దీప నైవేద్యానికి దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం ● ఈ నెల 24 వరకు స్వీకరణ ● ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 939 ఆలయాలు ఎంపిక ● ఎంపికై న ఆలయానికి రూ.10 వేలు సంగారెడ్డి జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే పురాతన ఆలయాలతోపాటు నూతనంగా నిర్మించిన ఆలయాలలో నిత్య పూజా కార్యక్రమాలు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. అందులోభాగంగానే కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ అమలు చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. నిత్య పూజాది,నైవేద్య కార్యక్రమాలు జరగాలని.. గ్రామాలలోని ప్రతి ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలుతోపాటు నైవేద్య సమర్పణ జరగాలని ప్రధాన ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డా.రాజశేఖర్ రెడ్డి 2007లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో ఈ పథకం కింద రూ.2,500 మంజూరు చేసేవారు. అనంతరం ఏర్పాటైన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10వేలకు పెంచింది. డీడీఎస్ పథకంలో ఎంపికై న ఆలయానికి లభించే రూ.10 వేలలో రూ.4వేలు ధూప, దీప నైవేద్యానికి, రూ.6వేలు ఆలయంలో పూజలు చేసే అర్చకుడికి గౌరవ వేతనంగా అందిస్తున్నారు. ధూప, దీప, నైవేద్య పథకానికి సుమారు మూడేళ్ల తర్వాత ఆలయాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 939 ఆలయాలను ఈ పథకానికి ఎంపిక చేశారు. 43 సెక్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డీడీఎన్ పథకానికి దేవాదాయ ధర్మదాయ శాఖ చట్టం ప్రకారం 43సెక్షన్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలని నిబంధన ఉంది. అదేవిధంగా పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో విధులు నిర్వహించకుండా ఉండాలి. ముఖ్యంగా పురాతన ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఆలయం ఎటువంటి ఆస్తులతో పాటు ఆదాయాలు కలిగి ఉండకూడదని నిబంధన ఉంది. నిర్దేశిత సమయంలో దరఖాస్తు చేసుకుని, దేవాదాయ ధర్మదాయ సహాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అందించాలి. ఆలయాల ఎంపికకు కమిటీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ (దేవాదాయశాఖ), తహసీల్దార్తోపాటు ప్రముఖ పూజారి ఉండనున్నారు. వీరి విచారణ అనంతరం రెండవ దశలో మరో ప్రత్యేక కమిటీ పరిశీలించనున్నారు. ఉమ్మడి మెదక్లో ధూప, దీప నైవేద్యం పథకానికి ఇప్పటివరకు మంజూరైన ఆలయాలు దశ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మొదటి 43 31 144 రెండవ 43 91 142 మూడవ 93 181 171 మొత్తం 179 303 457అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆలయానికి ఎలాంటి ఆదాయాలు, ఆస్తులు లేకుండా ఉండి, రిజిస్టర్ అయి తప్పనిసరిగా ఉండాలి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. –చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ ధర్మదాయ శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా -
దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలి
జహీరాబాద్ టౌన్: దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు కొనింటి నర్సింలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో శారీరక దివ్యాంగుల రోస్టర్ను మార్చాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ప్రత్యేకంగా దివ్యాంగులకు కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు, ప్రత్యేక విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కల్గిన వారికి రూ.25 వేల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న హైదరాబాద్లోని వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వెల్లడించారు. ‘రైల్వేను ప్రైవేటీకరించొద్దు’జహీరాబాద్ టౌన్: రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీయూ నాయకులు మంగళవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడుతూ...కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరిస్తోందన్నారు. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి రైల్వేను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జహీరాబాద్ స్టేషన్లో చేపడుతున్న అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బక్కన్న, లక్ష్మణ్, గుండప్ప, మొగులయ్యలు పాల్గొన్నారు. నీటి ఎద్దడి లేకుండా చూడాలిజిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా సంగారెడ్డి జోన్: గ్రామాలలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి పంచాయతీ కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎక్కడా నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎక్కడైనా బోరుబావుల మోటార్లు చెడిపోయినా, పైప్ లీక్ అయినా వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యంజహీరాబాద్ టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవనంలో మంగళవారం నిర్వహించిన కార్మిక సంఘం సమావేశంలో రాంచందర్ పాల్గొని మాట్లాడారు. ఉపాధిహామీ పథకాన్ని పటిష్టపరిచేందుకు రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. రోజు కూలీ రూ.600 ఇవ్వాలని, రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, సంవత్సరంలో 200 పనిదినాలు కల్పించాలన్నారు. కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల సంఘం నాయకులు తుల్జరాం, సంజీవ్ కుమార్, ఇస్మాయిల్ పాల్గొన్నారు. సమ్మెను జయప్రదం చేయండిజిన్నారం (పటాన్చెరు): బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేట్ శక్తులకు అప్పగించే మోదీ సర్కార్ కుట్రలను తిప్పి కొట్టాలని మే 20 నిర్వహించే దేశవ్యాప్త జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బొల్లారంలో అఖిలపక్ష నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్మిక చట్టాలు కోడ్లను ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు కొల్కూరి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సీఐటీయూ కార్యవర్గ సభ్యుడు రాజయ్య, స్థానిక కార్మిక నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రానివి ప్రజావ్యతిరేక విధానాలు
● కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్ ● 20న దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు సంగారెడ్డి రూరల్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, అది ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకునేందుకు ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో సంఘం జిల్లా కార్యదర్శి పి.అశోక్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాలతో 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు. మే 20న దేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు చేపట్టే సమ్మెకు సంఘీభావంగా సామాజిక తరగతులు దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
తహసీల్దార్ కార్యాలయానికి తాళం
అద్దె చెల్లించడం లేదని యజమాని ఆగ్రహంకల్హేర్(నారాయణఖేడ్): అద్దె డబ్బులు చెల్లించడంలేదని సదరు భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు. సిర్గాపూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఘటన జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో సిర్గాపూర్ మండలంగా ఏర్పాటు చేయగా అప్పట్లో అధికారులు ప్రైవేట్ భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్వహించారు. అదే భవనంలో దాదాపు ఎనిమిదేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం అద్దె డబ్బులు చెల్లించడం లేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి రూ. 5 లక్షల వరకు అద్దె డబ్బులు చెల్లించాలి. దీంతో భవన యజమాని నర్సమ్మ అద్దె డబ్బులు చెల్లించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లిన నర్సమ్మ అధికారులను బయటికి పంపించి తాళం వేసింది. సాయంత్రం కార్యాలయం పని వేళలు ముగిశాయని చెబుతూ తహసీల్దార్ నజీంఖాన్, సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాళం వేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని నజీంఖాన్ తెలిపారు. గతంలోనూ అద్దె డబ్బులు చెల్లించడంలేదని తాళం వేసిన ఘటన జరిగింది. తహసీల్దార్ కార్యాలయానికి తరుచుగా తాళం వేయడంతో మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఎరువుల వినియోగం తగ్గించాలి
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం జిన్నారం (పటాన్చెరు): యూరియా వాడకం తగ్గించడం వల్ల సాగు ఖర్చు తగ్గించుకోవచ్చని అలాగే రసాయనాలు, ఎరువులను తగ్గించడం వల్ల నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త సుమాలిని, కాంగ్రెస్ నేత రాములు నాయక్ పేర్కొన్నారు. గుమ్మడిదల మండలంలోని అన్నారం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు సలహాలను అందించారు. విత్తినప్పటి నుంచి పంట కోసే వరకు విత్తనాలకు సంబంధించి రశీదులు భద్రపరుచుకోవాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి మేలైన వంగడాల గురించి వివరించారు. నత్తనయ్యపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శోభా మాట్లాడుతూ... చిరుధాన్యాలు సాగు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పచ్చిరొట్టె ఎరువుల పంటలైన జనుము, జీలుగ ఆవశ్యకతను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, వైస్ చైర్మన్ దయాకర్రెడ్డి, డైరెక్టర్ జయశంకర్ గౌడ్, దయాకర్రెడ్డి, వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నల్లవల్లిలో.... గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు హేమలత జానకి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు పంటల సాగు పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ ప్రణవి, వ్యవసాయ విద్యార్థులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
కొండాపూర్ (సంగారెడ్డి): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అవమానంగా భావించిన భర్త, తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచి్చన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి విగతజీవిగా కనిపించాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన సుభాష్.. భార్య మంజుల, కుమారుడు మరియన్ (13), కూతురు ఆరాధ్య (9)తో కలిసి మల్కాపూర్లోని సా యినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుభాష్ సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య మంజుల ప్రవర్తనలో మార్పు రావడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంజుల 5 రోజుల కిందట ఎవరికీ చెప్ప కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భావించిన సుభాష్ అవమానభారం భరించలేకపోయాడని, దీంతో పిల్లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. సుమారు 5 రోజుల కిందటే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలం వద్ద 4 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. -
హామీలు అమలు చేయాలి
జహీరాబాద్ టౌన్: మండలంలోని బూచినెల్లి భూ బాధితులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి.రాంచందర్ మాట్లాడుతూ బూచినెల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కనే కోట్ల విలువైన పేదల భూములను ప్రభుత్వం పరిశ్రమల కోసం తీసుకుందన్నారు. పరిహారం కింద ఎకరాకు రూ.15 లక్షలు, 120 గజాల ఇంటి స్థలం, రైతుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగం, కాలుష్యంలేని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఎకరాకు రూ. 3,50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని హామీలు అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఎకరాకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. లేకుంటే అందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయం అధికారి వంశీ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో బూచినెల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట భూ బాధితుల నిరసన -
వివాహితను కాపాడిన షీ టీమ్ బృందం
అత్తింటి వేధింపులతో ఆత్మహత్యాయత్నంనర్సాపూర్ రూరల్: చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న వివాహితను షీ టీమ్ బృందం సభ్యులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల జ్యోతి కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక సోమవారం నర్సాపూర్ రాయ రావు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు బయలుదేరింది. చెరువు ప్రాంతంలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న షీ టీమ్ బృందం సభ్యులు దేవదాస్, స్వామి సకాలంలో స్పందించారు. వెంటనే వెళ్లి జ్యోతిని కాపాడి నర్సాపూర్ పోలీస్స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. జ్యోతి భర్త లింగం, అత్త, మరిదితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా వేధింపులకు గురి చేస్తున్నారని పలుమార్లు పంచాయితీ పెట్టినా మారకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఏడేళ్ల కిందట పిచ్చకుంట్ల గ్రామానికి చెందిన లింగంతో వివాహం జరిగిందని, ప్రస్తుతం ఇద్దరు కుమారులు కూడా ఉన్నట్లు చెప్పింది. తల్లిదండ్రులు నర్సాపూర్ లో నివాసం ఉంటారని పేర్కొంది. -
రెడ్ల చెరువు వద్ద ప్రియాంక ఫోన్లో మాట్లాడుతూ..
పాపన్నపేట(మెదక్): చెరువులో దూకి యువ తి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన మండల పరిధిలోని మల్లంపేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మల్లంపేట గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య, శామల దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. మల్లయ్య కరోనా సమయంలో చనిపోయాడు. తల్లి ఇద్దరు ఆడపిల్లల వివాహాలు చేసింది. బతుకు భారం కావడంతో శ్యామల చిన్న కూతురు ప్రియాంక(20)తో కలిసి హైదరాబాద్కి వలస పోయి జీవిస్తుంది. ఇటీవల రెండు నెలల కిందట తల్లీబిడ్డలు స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ప్రియాంక ఫోన్లో మాట్లాడుతూ రెడ్ల చెరువు వద్దకు వెళ్లి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. -
అమ్మానాన్నల కల సాకారం
తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా సాహితీ నంగనూరు(సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రానికి చెందిన మల్యాల సాహితీ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే.. 26 ఏళ్ల వయస్సులోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఉద్యోగం సాధించింది. సాహితీ సిద్దిపేట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి, హైదరాబాద్లో ఇంటర్ చదివింది. బెంగుళూరులోని రెవా యూనివర్సిటీలో 2017–22 వరకు బీబీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసింది. 2022–24 వరకు హైదరాబాద్లోని పడాల రామిరెడ్డి లా కళాశాలలో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేయగా అంతలోనే జూనియర్ సివిల్ జడ్జి నియామకాలకు నోటిఫికేషన్ వచ్చింది. జూన్ 2024లో ప్రిలిమ్స్, నవంబర్లో జరిగిన మెయిన్స్లో అర్హత సాధించింది. ఏప్రిల్ 2025లో ఇంటర్వ్యూలు అయ్యాయి. అదే నెల 30న జూనియర్ సివిల్ జడ్జి నియామకాలకు సంబంధించి ఫలితాలు విడుదల కాగా మల్యాల సాహితీ ఎంపికై ంది. జడ్జిగా ఎంపిక కావాలని పట్టుదలతో సాహితీ 10 నెలల పాటు కష్టపడింది. ప్రతి రోజూ 8 నుంచి రాత్రి 10 గంటల పాటు ఇంటి దగ్గరనే సన్నద్ధమైంది. పుస్తకాల నుంచి తానే సొంతంగా స్టడీ మెటీరియల్ను సిద్ధం చేసుకుంది. -
నాణ్యమైన మందులు అందించాలి
గజ్వేల్రూరల్: మెడికల్ దుకాణాలకు వచ్చే ప్రజలకు నాణ్యమైన మందులు అందించి వారి మన్ననలు పొందాలని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, మెదక్ జిల్లా అధ్యక్షుడు తొడుపునూరి రాజు పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం గజ్వేల్ ఏరియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దేవదాసు, ఉపాధ్యక్షుడిగా సంతోష్, జనరల్ సెక్రటరీగా యాదగిరి, రాజుగౌడ్లతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అదే విధంగా సీడీఏ జిల్లా జనరల్ సెక్రటరీగా వేముల వెంకటేశ్వర్రావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడంతోపాటు వారి మన్ననలను పొందాలని సూచించారు. రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా డీసీఏ సభ్యులు పాల్గొన్నారు. -
దళిత యువకుడిపై దాడి అమానుషం
సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీలు చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వేచరేణి శివారు ఎల్లదాసునగర్కు చెందిన బేడ బుడిగ జంగం దళిత యువకుడిపై బీజేపీ మతోన్మాద ఆర్ఎస్ఎస్, హిందుత్వ బజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సోమవారం ఎల్లదాసునగర్కు వెళ్లి బాధితుడితో మాట్లాడి కొత్త దుస్తులు అందించారు. అనంతరం అక్కడి నుంచి పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. సీపీఎం నాయకులు శశిధర్, సత్తిరెడ్డి, వెంకట్మావో, బాల్ నర్సయ్య, యాదగిరి, రవికుమార్, ప్రశాంత్, శారద, రాజు, నాగరాజు, శ్రీహరి, ప్రభాకర్, మల్లేశం, అశోక్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో.. దళిత యువకుడిపై దాడిని నిరసిస్తూ సీపీఐ నాయకులు పట్టణ కేంద్రంలో రాస్తారోకో చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ మాట్లాడుతూ.. దళిత యువకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు భూమయ్య, యాదగిరి, భాస్కర్రెడ్డి, నర్సింహా చారి, నర్సయ్య, ఎల్లయ్య, బాపురాజు, సత్తయ్య, రాజు, సీతారామ య్య, యాదయ్య, నర్సింహులు, యాదవ్వ, ఇస్తారి, లచ్చయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునికతను అందిపుచ్చుకోండి
● సేంద్రియం, పంట మార్పిడితోనేఅధిక దిగుబడులు ● మోతాదుకు మించి రసాయనమందులు వాడొద్దు ● ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ న్యాల్కల్(జహీరాబాద్): ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటలు పండిస్తే ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చునని బసంత్పూర్ ప్రొఫెసర్, జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ అన్నారు. ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’కార్యక్రమంలో సోమవారం మండల పరిధిలోని మామిడ్గి గ్రామంలో పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్కుమార్ మాట్లాడుతూ అధిక శాతం రైతులు ఇంకా పాత విధానంలోనే పంటలు పండిస్తూ సరైన దిగుబడులు రాక నష్టపోతున్నారని చెప్పారు. అధిక దిగుబడులు సాధించాలనే తపనతో రసాయన మందులు, పురుగు మందులు మోతాదుకు మించి వాడుతున్నారని, ఫలితంగా లాభాలకంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. పంట మార్పిడి తప్పకుండా చేయాలన్నారు. నీటిని వృథా చేయకుండా అవరానికి అనుగుణంగా వాడుకోవాలన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేసుకొని వాటికి సంబంధించిన రశీదును తప్పకుండా తీసుకోవాలని సూచించారు. అలా చేయడం వల్ల నకిలీ విత్తనాలు అని తేలితే పరిహారం పొందవచ్చునన్నారు. పంటల సాగు విధానాలపై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు అందు బాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల శాస్త్రవేత్త చరిత్ కుమార్తో పాటు అనీల్కుమార్, అవినాష్వర్మ, రమేష్ పాటిల్, రైతులు పాల్గొన్నారు. -
అసైన్డ్ భూములు కబ్జా
హద్దులు ఏర్పాటు చేయాలి మా ఎస్సీలకు వైదేరు కుంట కింద 2.20 ఎకరాలను ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. కొద్ది రోజులు కుంట నీరుతో పంటలు సాగు చేసిన కరువుతో తూములు కూలిపోవడంతో నీటి కాల్వలు, అలుగును ధ్వంసం చేయడంతో మాకు నీళ్లు లేకుండా పోయాయి. కుంట కట్టను ధ్వంసం చేసి మా భూమిని ఆక్రమించే రైతులపై చర్యలు తీసుకోవాలి. – మేదిని వెంకటస్వామి, గాంధీనగర్ కుంట కట్ట గొలుసు వరకు బఫర్ జోనే.. చెరువు, కుంట కట్టల కింద గొలుసు వరకు బంఫర్ జోన్ భూములే ఉంటాయి. వీటిని ఎవరు చదును చేయరాదు, ఆక్రమించరాదు. వైదేరు కుంట కట్ట ధ్వంసం చేసిన విషయం విచారణ జరిపి వాహనాలను స్వాధీనం చేసుకొని రైతు పై కేసు నమోదు చేయిస్తాం. శిఖం, నీటి కాల్వలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్, ఏఈ ఇరిగేషన్● మీర్జాపూర్, తోటపల్లి శివారు సరిహద్దులో రైతుల ఆక్రమణలు ● కుంట కట్టలు ధ్వంసం, నీటి కాల్వలు పూడ్చివేతలు ● పూడికతీత పనులు చేపడితేనే మేలుహుస్నాబాద్రూరల్: ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సమీప రైతులు ఆక్రమణలకు పాల్పడుతూ ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల భూములకు సాగు నీరు సౌకర్యం లేకపోవడంతో పంటలు వేయక బీడు వారడంతో ఇదే ఇదునుగా భావించిన రైతులు హద్దు రాళ్లు జరిపి ఆక్రమిస్తున్నారు. కరువుతో సాగుకు దూరం తోటపల్లి రెవెన్యూ పరిధిలో వైదేరు కుంట దగ్గర పేదలకు 2.20 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. ఒకప్పుడు కుంట తూము పారకంతో పంటలు పండించిన రైతులు కరువుతో కుంటలు ఎండిపోవడంతో సాగు చేయలేకపోతున్నారు. పేదలకు ఇచ్చిన భూమిలో చెట్లను అమ్ముకోవడం, గెట్టు జరిపి భూమి కలుపుకోవడం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూ సర్వే చేసి పేదల భూములకు హద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కుంట కట్టలు ధ్వంసం.. హుస్నాబాద్ మండలంలో చిన్న నీటి వనరులను అభివృద్ధి చేయడానికి గొలుసు కట్టు కుంటలు, చెరువులను నిర్మించారు. ఇవి పూడికతో నిండిపోవడంతో గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా పూడిక పనులు చేయించి చెరువు, కుంటలకు పూర్వ వైభవం తీసుకొచ్చి ంది. చిన్న నీటి కుంటలను సమీప రైతులు కట్టలను ధ్వంసం చేసి బఫర్ జోన్ గొలుసు భూమిని ఆక్రమిస్తున్నారు. శుక్రవారం మీర్జాపూర్, తోటపల్లి శివారు సరిహద్దు లోని వైదేరు కుంట కట్టను ఓ రైతు ధ్వంసం చేసి చదును చేయడంతో పొరుగు రైతులు అడ్డుకొని ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు జేసీబీ, డోజర్ తాళాలు తీసుకొని వెళ్లిపోయారు. తోటపల్లిలో మాసాని కుంట, ఎర్ర కుంట, వట్టే కుంట, మీర్జాపూర్లోని మంచీళ్ల కుంట శిఖం భూములను రైతులు ఆక్రమించి చదును చేస్తున్నారు. 20 చెరువులు, కుంటలకు ఒక ఏఈని ఇరిగేషన్ అధికారులు నియమించినా అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడంతో పర్యవేక్షణ లేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు. -
రెగ్యులర్ ఈవో కలేనా!
ఇన్చార్జీలతోనే ఏడుపాయల ఆలయం ● ఇటీవల రంగారెడ్డి జిల్లాకు ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ బదిలీ ● అయినా తప్పని ఉమ్మడి మెదక్ జిల్లా అదనపు బాధ్యతలు ● తలకు మించిన భారంతో సతమతం ● రెగ్యులర్ ఈవో లేక భక్తులకు వసతులు కరువు పాపన్నపేట(మెదక్): తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల ఆలయానికి రెగ్యులర్ ఈవో నియా మకం కలగానే మిగిలిపోతుంది. మెదక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్, ఏడుపాయల ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ను నాలుగు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో రెండు జిల్లాల అదనపు కమిషనర్గా.. ఏడుపాయల ఇన్చార్జి ఈవోగా బహుముఖ బాధ్యతలు నిర్వహించలేక.. తలకు మించిన భారంతో సతమత మవుతున్నారు. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయలకు రెగ్యులర్ ఈవో లేక భక్తులు అవస్థల పాలవుతున్నారు. రెండు జిల్లాల ఆలయాల బాధ్యతలు మెదక్ ఉమ్మడి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ రెండేళ్ల కిందట ఏడుపాయల ఇన్చార్జి ఈవోగా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెండు బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. నాలుగు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇక్కడి నుంచి బదిలీ అయినా పాత పోస్టులు కూడా అలానే ఉంచడంతో పని భారం ఎక్కువైంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట మూడు జిల్లాల్లో కలిసి గుర్తింపు పొందిన 36 పెద్ద దేవాలయాలతోపాటు, చిన్నాచితక సుమారు 3 వేల ఆలయాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 6 వేల దేవాలయాల వరకు ఉంటాయని తెలుస్తుంది. వీటన్నింటికీ అసిస్టెంట్ కమిషనర్గా చంద్రశేఖర్ బాధ్యతలు నిర్వర్తించాలంటే తలకు మించిన భారమే అవుతుంది. రూ.లక్షల్లో ఆదాయం ఉన్నా.. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఏడుపాయల. 6ఏ టెంపుల్గా గుర్తింపు పొందిన వన దుర్గమ్మ ఆలయం దర్శించుకోవడానికి యేటా సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారు. సుమారు రూ.15 కోట్ల ఆదాయం ఉంటుంది. ఆది, మంగళ, శుక్ర వారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి జాతరకు సుమారు 12 లక్షల భక్తులు వస్తారు. ఇంతటి ప్రాధాన్యత గల దేవాలయానికి రెగ్యులర్ ఈవో లేకపోవడం దురదృష్టకరమని భక్తులు వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే నాథుడే లేడని అంటున్నారు. ఏళ్ల కొద్దీ ఇన్చార్జీలతో పాలన 2023లో ఈవో సార శ్రీనివాస్ బదిలీ అయిన తర్వాత మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ వినోద్ రెడ్డి, క్రిష్ణ ప్రసాద్ వచ్చారు. అప్పట్లో నెల లోపు ముగ్గురు ఈవోలు మారారు. అనంతరం వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఇన్చార్జి ఈవోగా కొనసాగుతూ ఇటీవల రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. అయినా ఆయనకే ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. బహుముఖ విధులు నిర్వరిస్తున్న ఆయన ఏడుపాయలకు పూర్తిగా న్యాయం చేయలేక పోతున్నారని భక్తులు వాపోతున్నారు. గతంలో ఎంతో మంది గ్రేడ్–2 ఈవోలు ఏడుపాయల ఈవోలుగా పని చేశారు. ఈ క్రమంలో గ్రేడ్–2 స్థాయి ఈవోనైనా నియమించి తమ ఇబ్బందులు తీర్చి ఏడుపాయల అభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నారు. -
నెలలో భూ సమస్యలు పరిష్కారం
కలెక్టర్ క్రాంతి కొండాపూర్(సంగారెడ్డి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ క్రాంతి అన్నారు. సోమవారం కొండాపూర్ మండలం తొగర్ పల్లి, అలియాబాద్ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద కొండాపూర్ మండలాన్ని ఎంపిక చేశామన్నారు. భూ సమస్యలు లేని మండలంగా కొండాపూర్ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సులు అనంతరం నెలలోపు భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వలన భూ సమస్యలు ఏర్పడ్డాయని టీజీ ఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి విమర్శించారు. దీంతో రైతులు కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే వారన్నారు. ఈ సదస్సులో ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
సాగు అంశాలపై అవగాహన కల్పించడానికే..
● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం ● వ్యవసాయ కమిషన్ సభ్యుడు రాములు నాయక్ రామాయంపేట(మెదక్): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు అందించడానికి వీలుగా ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ కమిషన్ సభ్యుడు రాములు నాయక్ పేర్కొన్నారు. మండలంలోని రాయిలాపూర్ రైతువేదికలో సోమవా రం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్నకారు, సన్నకారు రైతుల లభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని, రక్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలు గుర్తించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కమిషన్ కృషి చేస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న పరిశోధన ఫలితాలను రైతులకు వివరించి వారికి చైతన్యపర్చడానికి అవగాహన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ మా ట్లాడుతూ.. రైతులకు సాంకేతిక సలాహాలను అందిస్తే పెట్టుబడులు తగ్గడంతోపాటు అధిక ఆదా యం పొందే అవకాశం ఉందన్నారు. 13వ తేదీ వరకు కొనసాగే అవగాహన శిబిరాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభారాణి, రామాయంపేట వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రాజ్నారాయణ, డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాల బస్సు ప్రారంభం
సంగారెడ్డి జోన్: సమాజంలో మార్పునకు బాలికలు విద్యావంతులుగా ఎదగాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తోషిబా పరిశ్రమ సీఎస్ఆర్ నిధుల ద్వారా జోగిపేట ఆందోల్లోని ప్రభుత్వ నర్సి ంగ్ కళాశాలకు మంజూరైన బస్సును మంత్రి దామోదర, కలెక్టర్ వల్లూరు క్రాంతి, విద్యా ర్థులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజావాణికి 55 అర్జీలుసంగారెడ్డి జోన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేటు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్జీలను స్వీకరించారు. సమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు ప్రజలు వివరించారు. ఎన్నిసార్లు అధికారుల దగ్గరకు వెళ్లినా సమస్యలు పరిష్కారం కావటం లేదని తమ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, 55 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. డీఆర్ఓ పద్మజరాణి, అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ ధ్యేయంస్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వెంకటాపూర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ను జాతీయ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమన్నారు. ఈ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు శ్రీనివాస్, కృష్ణ, హరి, ప్రేమానందం,రామ్ గౌడ్, కుమార్, పోచన్న, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు ఎస్పీ పరితోష్ పంకజ్ జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తగు సూచనలు సలహాలు అందించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాల విషయంలో సీఐ నయీముద్దీన్తో మా ట్లాడారు. ప్రమాదాలు జరగకుండా చర్య లు తీసుకోవాలని సూచించారు. జిన్నారం ట్రైనీ ఎస్ఐ చైతన్య కుమార్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించండికేంద్రమంత్రి గడ్కరీకి ఐఎన్టీయూసీ వినతి పటాన్చెరు టౌన్: ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ పరిశ్రమలకు వర్క్ఆర్డర్లను పెంచి కార్మికులకు జీవనో పాధి కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షు లు నరసింహారెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్తో కలిసి సోమవారం కేంద్రమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాల ని కోరారు. ఆర్టికల్ 15 (5) ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసి విద్యార్దులకు రిజర్వేషన్లు కల్పించాలని జహిరాబాద్, సంగారెడ్డి పటాన్చెరు , నియోజకవర్గాలలో సుమారు నాలుగు లక్షల మంది కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం అంతంత మాత్రమే అని సొంత భవనాలను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. అలాగే 28 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు.బస్సును ప్రారంభిస్తున్న మంత్రి దామోదర, చిత్రంలో కలెక్టర్, విద్యార్థులు -
ఇందిరమ్మ ఇదేం కిరికిరి?
ప్రహసనంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ●● పెరిగిన రాజకీయ జోక్యంతో అర్హులకు చోటు ప్రశ్నార్థకం ● నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు ● జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదానికి సిద్ధమవుతున్న ప్రతిపాదనలు లబ్దిదారుల ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాలుగా రూపొందించారు. ఇంటి స్థలం ఉండి.. అన్ని అర్హతలు ఉన్న వారికి ఎల్–1లో చేర్చారు. ఇలా ఎల్–1 జాబితాలో ఉన్న వారికే లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రస్తుతం ఈ జాబితాలను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ జాబితాతో ప్రమేయం లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ లబ్ధిదారుల జాబితాల తయారీ కొలిక్కి వచ్చిందని, మంజూరు కోసం త్వరలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపుతామని సంబంధిత శాఖల అధికారులు పేర్కొంటున్నారు.సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా తయారైంది. ఇందులో రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అర్హులైన నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడం ప్రశ్నార్థకంగా మారింది. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాలకు 17,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించిన విషయం విదితమే. ఇలా స్వీకరించిన దరఖాస్తుల వెరిఫికేషన్ చేసి అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ యాప్లో అప్లోడ్ చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అర్హులైన నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక కావడం ప్రశ్నార్థకంగా తయారైంది. స్థానికంగా ఉండే నాయకులు, చోటా మోటా నాయకులు తమకు అనుకూలమైన వారి పేర్లను అర్హుల జాబితాలో చేర్చాలని పట్టు బడుతుండటంతో ఈ జాబితా రూపకల్పన అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఇందిరమ్మ కమిటీల కిరికిరి ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ఈ కమిటీల విషయంలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ ఇందిరమ్మ కమిటీల విషయంలో మంత్రి దామోదర ముందే పార్టీ జిల్లా ఇన్చార్జిగా నియమించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నాయకులు తమ అనుచరులకే ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయిస్తున్నారని, .. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా చాలా చోట్ల వారి పెత్తనం నడుస్తోందని వేదికపై ఉన్న నేతలను ప్రశ్నించారు. ఇందుకు ఇందిరమ్మ కమిటీలదే ఉదాహరణ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇటు అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.ఇన్చార్జి మంత్రి ఆమోదం కోసం.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సూచించిన వారే లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట్ల ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు సూచించిన వారి పేర్లు జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయి. -
భూసర్వేనా.. సర్సర్లే..!
సర్వేయర్ల కొరత.. తీరని భూముల కొలత ● పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలు ● హద్దు రాళ్లు లేకపోవడమే ప్రధాన సమస్య ● పెండింగ్లో 4 వేలకు పైగా దరఖాస్తులు జిల్లాలో మొత్తం సర్వే నంబర్లు 1,67,948 మొత్తం భూమి 8లక్షల ఎకరాలకు పైనే.. మండల సర్వే కొరకు 4070.. జిల్లా సర్వే కొరకు పెండింగ్ దరఖాస్తులు 400 సంగారెడ్డి జోన్: జిల్లాలో సర్వేయర్ల కొరత కారణంగా భూ సర్వేల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా.. పెండింగ్లోనే ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన భూ ప్రక్షాళన ఫలితంగా జారీ చేసిన కొత్త పట్టా పాసు పుస్తకాలలో భూమి వాస్తవానికి భిన్నంగా ఉండటంతో బాధితులు సర్వే కొరకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ఎనిమిది మంది సర్వేయర్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉన్నారు. మండలానికి ఒకరు చొప్పున 28 మంది సర్వేయర్లకు గాను 15 మంది మాత్రమే ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సర్వేయర్ ఇన్స్పెక్టర్ పోస్టులు సైతం ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవారికి అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో సర్వే పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. ● పెండింగ్లో దరఖాస్తులు జిల్లాలో 28 మండలాలకు గాను 760 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాలలో 1,67,948 సర్వే నంబర్లు, సుమారు 8 లక్షలకు పైగా ఎకరాల భూమి ఉంది. 96,195 టీ పన్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా సర్వే నంబర్లలో గత కొన్ని సంవత్సరాలు క్రితం సర్వే చేయగా ప్రస్తుతం హద్దులు చెరిగిపోయి, భూములు వివాదాస్పదంగా మారాయి. జిల్లాలో మొత్తం 4,470 దరఖాస్తులలో మండల సర్వేకు 4070, జిల్లా స్థాయి సర్వేకు 400 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ● సర్వేయర్ల కొరకు నిరీక్షణ తమ భూములు సర్వే చేసేందుకు అధికారుల కొరకు ఎదురుచూపులు తప్పడం లేదు. మండల స్థాయిలో సర్వే చేసుకునేందుకు రూ.295, జిల్లాస్థాయిలో రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించి నెలలు తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. సర్వే చేసేముందు సరిహద్దు యజమానులకు నోటీసులు అందించాల్సి ఉంటుంది. గతంలో వీఆర్ఓ నోటీసులు అందించేవారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో అందించడంలో జాప్యం జరుగుతోంది. ● ప్రభుత్వ పనుల్లో అధికారులు బిజీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో సర్వేయర్లు బిజీగా ఉన్నారు. భూ సేకరణ, భూ కేటాయింపు, సర్వేలు తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో ప్రస్తుతం నిమ్జ్, ఎన్.హెచ్ 65, టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, ట్రిపుల్ ఆర్ తదితర పనుల్లో ఉన్నారు. -
జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు మద్దూరు యువకుడు
మద్దూరు(హుస్నాబాద్): సౌత్జోన్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ టోర్నమెంట్కు మండల కేంద్రానికి చెందిన బేజాడి కార్తీక్ గౌతమ్రెడ్డి ఎంపికై నట్లు మెదక్ జిల్లా హ్యాండ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్బాబు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ సెలక్షన్ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. 9 నుంచి 12 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే టోర్నమెంట్ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డిని సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందుకూరి ఉపేందర్గుప్తా, దామెర మల్లేశం, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ టేక్మాల్(మెదక్): తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని సంగ్యాతండా పంచాయతీ పరిధిలోని కడిలాబాయి తండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తండాకు చెందిన కున్సోత్ మోహన్ కుటుంబ సభ్యులు ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికొచ్చే సరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలోని తులం బంగారం, 35 తులాల వెండి, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు, బైకు ఢీ : ఒకరు మృతి పెద్దశంకరంపేట(మెదక్): కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన పెద్దశంకరంపేట శివారులో చోటు చేసుకుంది. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ట్రైనీ ఎస్ఐ అరవింద్ కథనం మేరకు.. భీమన్నపల్లి మురళీ క్రిష్ణ(32), అంజన్నగారి హరీశ్ పెద్దశంకరంపేట వైపు నుంచి మల్కాపూర్ వైపు బైక్పై వెళ్తున్నారు. మార్గమధ్యలో రేగోడ్ వైపు నుంచి పేట వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో మురళీక్రిష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. హరీశ్కు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళలు అదృశ్యం ఇంటి నుంచి వెళ్లి.. శివ్వంపేట(నర్సాపూర్) : ఇంటి నుంచి వెళ్లి మహిళ అదృశ్యమైంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం మేరకు.. మండల పరిధి పోతులబోగూడ గ్రామానికి చెందిన బత్తులు లక్ష్మీ (58) గత నెల 24న పాంబండలో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లింది. రెండు రోజుల ద్వారా ఇంటికొస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు గ్రామానికి వెళ్లిపోయారు. 26న కుటుంబ సభ్యులు పాంబండలో ఉన్న బంధువులకు లక్ష్మీ గురించి ఫోన్ చేయగా ఉదయమే పోతులబోగూడకి బయలుదేరిందని చెప్పారు. ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. లక్ష్మీ కుమారుడు నాగులు సోమవారం ఇచ్చిణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో.. గజ్వేల్రూరల్: కుటుంబ కలహాలతో వివాహిత అదృశ్యమైన ఘటన సోమవారం చోటు చేసు కుంది. పోలీసుల కథనం మేరకు.. గజ్వేల్కు చెందిన జర్రు శారద భర్త చనిపోవడంతో ఏడాది కిందట ప్రమోద్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. శారద కోసం తల్లిదండ్రులు తెలిసిన చోట వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పంటల ప్రణాళిక సిద్ధం
● 2.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా ● ఈ సారి పెరగనున్న సన్నాల సాగు ● 1,43,817.81 హెక్టార్లలో పత్తి పంట ● 59,424.7 హెక్టార్లలో వరినారాయణఖేడ్: వానాకాలం సీజన్లో జిల్లాలో 2,98,718.22 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల సాగుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇందులో 1,43,817.81 హెక్టార్లలో పత్తిపంట సాగు జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదే విధంగా రెండో ప్రధాన పంటగా 59,424.7 హెక్టార్లలో వరి సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఇక కంది 32,044.53 హెక్టార్లు, సోయాబీన్ 29,817.81హెక్టార్లు, పెసర 5,749.39 హెక్టార్లు, మినుము 3,465.59 హెక్టార్లు, చెరుకు 7,957.09 హెక్టార్లు, మొక్కజొన్న 3,441.3, జొన్న 237.25, హార్టికల్చర్లో 9,898.79 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని లెక్కకట్టింది. వీటితో పాటు కొర్రలు, రాగులు, సామలు, స్వీట్కార్న్, ఎర్ర జొన్నలు, ప్యారాగ్రాస్, ఉలువలు, వేరుశనగ, ఆవాలు, సామలు, గడ్డినువ్వులు, పొద్దుతిరుగుడు, హనుములు, బొబ్బర్లు తదితర పంటలను తక్కువ మోతాదులో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. జిల్లా మొత్తంలో ఈ వానాకాలంలో 2,98,718.22 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు జరిగే అవకాశం ఉందని లెక్కగట్టింది. అవసరం మేరకు విత్తనాలు.. రైతుల సాగు అవసరం మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో విత్తనాల కొరత లేకుండా ఉండేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. పచ్చిరొట్ట విత్తనాలైన జనుము 6,500 క్వింటాళ్లు, జీలుగ 4,500 క్వింటాళ్లు కలిపి 11వేల క్వింటాళ్ల మేర విత్తనాలు అవసరం అని ప్రతిపాదనలు పంపించారు. ఈ సారి వరిలో సన్నాల సాగు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా సరిపడా విత్తనాలు సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ విత్తనాల బెడద ఉండకుండా కూడా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫసల్ బీమా అమలుకు కసరత్తు.. ఈ సీజన్ నుంచి ఫసల్ బీమా అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రైతు వాటా ఎంత మేర ఖరారు చేయాలని, లేదా ప్రీమియంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం చెరిసగం భరించే విధంగా విధి విధానాలు ఖరారు ఉండనున్నట్లు తెలుస్తోంది. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్పామ్, టమాట, బత్తాయి పంటలకు బీమా వర్తింప జేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడుల్లో నష్టం జరిగిన పక్షంలో దిగుబడి ఆధారిత బీమా ద్వారా రైతుకు పరిహారం అందనుంది. కాగా రైతులు వేసవి దుక్కులను సిద్ధం చేస్తున్నారు. ఆయా పంటల దిగుబడులు పూర్తి కావడంతో వేసవి దుక్కులు దున్నుకుంటున్నారు. -
టైరు పేలి కారు బోల్తా
టేక్మాల్(మెదక్): అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి శివారులోని 161 హైవేపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వైపు కారు వేగంగా వెళ్తుండగా టైరు పగిలింది. దీంతో డివైడర్ అవతలి వైపునకి వెళ్లి రోడ్డుపై బోల్తా పడింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనం పూర్తిగా దెబ్బంతి. హైవే సిబ్బంది రోడ్డుపై నుంచి కారును తొలగించారు. బోల్తా పడిన బైక్ టేక్మాల్ మండలంలోని కాద్లూర్ శివారులో అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మెదక్ వైపు నుంచి బొడ్మట్పల్లి వైపునకు బైక్పై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అతివేగంగా, అజాగ్రత్తగా రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. వ్యక్తికి తలకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
తల్లి తప్పుదోవ.. తండ్రి రాసిన మరణ శాసనం
సంగారెడ్డి, సాక్షి: కొండాపూర్ మండలం మల్కపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్థాపంతో సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను బలవన్మరణానికి పాల్పడ్డారని తొలుత అంతా భావించారు. అయితే ఆమె వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమైందని తేలింది ఇప్పుడు.సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్లో నివాసం ఉండేవాడు. అతని భార్య మంజుల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త ఎంత మంచి చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ మధ్య ఓరోజు గొడవ ముదిరి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన సుభాష్.. తన ఇద్దరు పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘డబ్బు ఆశ చూపించి నా భార్యను వాడుకున్నారు. ఎంత మంచి చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. అందుకే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాం..’’ అంటూ సుభాష్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భూ భారతిపై గ్రామ సభలు
కొండాపూర్(సంగారెడ్డి): రైతులకు సంబంధించి ఎలాంటి భూ సమస్యలైనా తక్షణమే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ భూ భారతి చట్టంపై ఇది వరకే ప్రతీ మండలానికి ఒక దగ్గర జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మండల వ్యాప్తంగా 24 రెవెన్యూ గ్రామాలకు గానూ 36,611 ఎకరాల భూమి ఉంది. 15 వేల మంది పట్టాదారులు న్నారు. మండలంలో ధరణి సమస్యలు నేటికీ 330 వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ గ్రామ సభల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా కొండాపూర్ భూ భారతి చట్టాన్ని అమలు చేయడం కోసం ముందుగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా నేటి నుంచి 19వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన రోజుకు రెండు గ్రామాల చొప్పున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామసభలను నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల ద్వారా ఫిర్యాదులను స్వీకరించేందుకు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేయనున్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే రైతులు పట్టాదారు పాత పాసుబుక్తో పాటు, కొత్త పాసుబుక్, రిజిస్టర్ డాక్యుమెంట్, కోర్టు ఉత్తర్వులు, ఆధార్ కార్డుతో పాటు భూమికి సంబంధించిన ఇతర పత్రాలు ఏవైనా ఉంటే జిరాక్స్ పత్రాలతో రావాలి. ఈ గ్రామ సభలకు జిల్లా, మండల రెవెన్యూ అధికారులు గ్రామాలకు సంబంధించిన సమగ్ర రెవెన్యూ రికార్డులతో హాజరుకానున్నారు. ఆర్డీఓ పర్యటన : భూ భారతి చట్టం అమలులో భాగంగా ఆదివారం గ్రామ సభలు ఏర్పాటు చేయనున్న అలియాబాద్, తొగర్పల్లిలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారులకు గ్రామసభ ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ఏ గ్రామంలో ఎప్పుడు.. గ్రామ సభలు 5వ తేదీన అలియాబాద్, తొగర్పల్లి, 6న గారకుర్తి, గిర్మాపూర్, 7న చెర్ల గోపులారం, హరిదాస్పూర్, 8న తేర్పోల్, మాచెపల్లి, 9న గడి మల్కాపూర్, గొల్లపల్లి, 12న మునిదేవునిపల్లి, గుంతపల్లిలో నిర్వహించనున్నారు. అలాగే 13న కోనాపూర్, గంగారం, 14న మన్సాన్పల్లి, మాందాపూర్, 15న సైదాపూర్, మారేపల్లి, 16న కొండాపూర్, అనంతసాగర్, 17న కుతుబ్షాహీపేట, మల్లెపల్లి, 19న మల్కాపూర్లలో రెవెన్యూ గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. నేటి నుంచి 19 వరకు నిర్వహణ తహసీల్దార్ అధ్యక్షతన రోజుకు రెండు గ్రామాల్లో.. పైలెట్ ప్రాజెక్టుగా కొండాపూర్ -
సేవకు మించిన తృప్తి లేదు
రాజరాజేశ్వరీ రైస్మిల్ నిర్వాహకుడు బచ్చు జగదీశ్హవేళిఘణాపూర్(మెదక్): ఎండకాలంలో వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన ప్రజలకు దాహార్తి తీర్చడానికి మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ రాజరాజేశ్వరీ రైస్మిల్ నిర్వాహకులు బచ్చు జగదీశ్ 12 ఏళ్లుగా సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు. తన వంతుగా 2012 నుంచి ఇప్పటి వరకు అంబలి కేంద్రంను కొనసాగిస్తున్నారు. రైస్మిల్ వద్ద తన తాత పుల్లయ్య జ్ఞాపకార్థం అంబలి కేంద్రం ఏర్పాటు చేసి వారికి నిత్యం కూలీలతో అంబలి తయారు చేయిస్తున్నారు. అంబలి కేంద్రంకు నిత్యం దాదాపు వంద వరకు మంది వచ్చి అంబలి సేవిస్తుంటారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని నిర్వాహకులు బచ్చు జగదీశ్ అన్నారు. నిత్యం దాదాపు 100మందికి పైగా సరిపోను అంబలి తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. -
భర్త వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
చిన్నశంకరంపేట(మెదక్): భర్త వేధింపులు తాళలేక నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి, తహసీల్దార్ మన్నన్ ఆదివారం విచారణ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం ఆగ్రహరం గ్రామానికి వట్టెపు రాజయ్య కుమారుడు మహేశ్తో వెల్దుర్తి మండలం షేరిలాకు చెందిన సాయిలు కూతురు పూజ(20)కి ఫిబ్రవరి 2న వివాహం జరిగింది. పెళ్లైన మూడు నెలల్లోనే భర్త వేధింపులు తట్టుకోలేక పూజ శనివారం ఆత్మహత్యకు పాల్పడగా, మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. శనివారం రాత్రి నుంచి రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్తో పాటు నార్సింగి, నిజాంపేట, వెల్దుర్తి, మెదక్, చేగుంట పోలీస్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పూజ భర్త మహేశ్, మామ రాజయ్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం డీఎస్పీ, తహసీల్దార్ మన్నన్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబీకులకు న్యాయం చేస్తామని డీఎస్పీ తెలిపారు. భారీ బందోబస్తు మధ్య పంచనామ తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, తహసీల్దార్ మన్నన్ విచారణ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి
వర్గల్(గజ్వేల్): ఎదురెదుగా రెండు బైక్లు ఢీకొనడంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు . ఈ ఘటన వర్గల్ మండలం గౌరారం శివారులో ఆదివారం చోటు చేసుకుంది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి కథనం మేరకు.. కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లా సిర్సి గ్రామానికి చెందిన సిద్ధ అమర్(26) కావేరి సీడ్స్ కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న ప్రిన్స్(20)తో కలిసి రోజు మాదిరిగా ఆదివారం బైక్పై కంపెనీ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో మర్కూక్ వైపు నుంచి గౌరారం వైపు వస్తున్న స్పోర్ట్స్ బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అమర్, ప్రిన్స్కి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్కు చెందిన స్పోర్ట్స్ బైకిస్టు పోతూరి రజిత్వర్మ, వెనుక కూర్చున దాసరి దినేశ్కుమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అమర్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం ప్రిన్స్ని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడు అమర్ తండ్రి కంటెప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ను ఢీకొట్టిన ఆటో : ముగ్గురికి గాయాలుహవేళిఘణాపూర్(మెదక్): బైక్ను ఆటో ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలం పాతూర్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన మైలి అశోక్, భార్య లక్ష్మి, మనుమరాలు హారిక కలిసి బైక్పై మెదక్కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని ఆటో ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్లు మృతులు బీదర్ జిల్లా వాసులు -
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంబలి
చలివేంద్రం నిర్వహిస్తున్న చీలమల్లన్న మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని మాతా బోరంచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదేళ్లుగా అంబలి వితరణ గావిస్తున్నారు. ప్రతీ ఏడాది వేసవి కాలంలో ఏప్రిల్, మే రెండు నెలలపాటు ఎండలు అధికంగా ఉంటాయి. పట్టణానికి వివిధ పనులపై వచ్చే ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి వితరణ గావిస్తుంటారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 1200 మందికి అంబలి వితరణ చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఈరంటి సత్యనారాయణ తెలిపారు. ప్రతీ మంగళవారం మెదక్లోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిలో అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని తెలిపారు. సదాశివపేట(సంగారెడ్డి): మాజీ కౌన్సిలర్లు చీల స్వరూప, చీల మల్లన్న ఆధ్వర్యంలో అన్న చీల బస్వరాజ్ జ్ఞాపకార్థం 15 ఏళ్లుగా పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద చలివేంద్రంతోపాటు అంబలి కేంద్రం ప్రారంభించి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ 250 లీటర్ల వరకు అంబలి తయారు చేసి 1,000 మంది వరకు పంపిణీ చేస్తున్నారు. తన అన్న జ్ఞాపకార్థం ఏదో ఒక రూపంలో సేవ చేయాలని ప్రతీ వేసవి ప్రారంభంలో చలివేంద్రం, అంబలి కేంద్రం ప్రారంభించామని మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న తెలిపారు. ప్రతీ నెలా 30,000 వేల మంది వరకు అంబలి పంపిణీ చేస్తామన్నారు. -
పెళ్లి వేడుకకు వచ్చి బాలుడు మృతి
వరి కోత మిషన్ వెనక్కి తీస్తుండగా ఢీకొట్టడంతో ప్రమాదం లారీ ఢీకొని జీఎంఆర్ కూలీ చేగుంట(తూప్రాన్): లారీ ఢీకొని జీఎంఆర్ సంస్థలో రోడ్డు పనులు చేస్తున్న కూలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేట శివారులోని బంగారమ్మ గుడి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పోతాన్పల్లి గ్రామానికి చెందిన తలారి అశోక్(30) జీఎంఆర్ సంస్థలో జాతీయ రహదారిపై కూలీ పనులు చేస్తుంటాడు. ఆదివారం అశోక్ పని చేసేందుకు వచ్చి మాసాయిపేట శివారులో బంగారమ్మ గుడి వద్ద రోడ్డు పనులు చేస్తుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోతాన్పల్లి గ్రామస్తులు మృతుడి బంధువులు ఘటనా స్థలం వద్ద రాస్తారోకో నిర్వహించారు. జీఎంఆర్ ప్రతినిధులు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తూప్రాన్, వెల్దుర్తి, చేగుంట పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన కారులను శాంతింపజేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు.చేగుంట(తూప్రాన్): పెళ్లి వేడుకల కోసం వరి కోత యంత్రం కిందపడి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన హర్షిత్(6) తల్లిదండ్రులతో కలిసి చేగుంట మండలం ఇబ్రహీంపూర్కు తన మేనమామ రాజు వివాహానికి వచ్చారు. మూడు రోజుల కిందట వివాహ వేడుకలు పూర్తి కాగా హర్షిత్ ఆడుకుంటున్న క్రమంలో వరి కోత యంత్రం వెనుకకు తీస్తున్న క్రమంలో హర్షిత్ను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు బాలుడి బంధువులు ఆగ్రహించి హర్షిత్ మృతదేహాన్ని వరికోత యంత్రం యజమాని ఇంటి ఎదుట వేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులను సముదాయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. అదుపుతప్పి బైక్పై నుంచి పడి హవేళిఘణాపూర్(మెదక్): బైక్పై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని గాజిరెడ్డిపల్లి మలుపు వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నతిమితండాకు చెందిన రమేశ్(40) భార్య స్వరూపతో కలిసి మెదక్ మండలం శివ్వాయిపల్లి తండా బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వస్తున్నారు. శనివారం సాయంత్రం గాజిరెడ్డిపల్లి మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను గమనించి తప్పించబోయి అదుపుతప్పి కిందపడిపోయారు. రమేశ్కు తీవ్ర గాయాలు కాగా మెదక్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య స్వరూపకు ఎలాంటి గాయాలు కాలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేకులు వేసేందుకు వెళ్లి కిందపడటంతో.. చేగుంట(తూప్రాన్): రేకులు వేసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘట న వడియారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వడియారం గ్రామానికి చెందిన గూని నాగరాజు(28) రేకుల షెడ్లను నిర్మిస్తుంటాడు. చేగుంటలోని శంకర్గౌడ్ ఇంటి దాబాపై రేకులు వేస్తున్నాడు. పాత రేకులను తీస్తున్న క్రమంలో గోడపై నుంచి కిందపడి నాగరాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మేడ్చల్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ న్యాల్కల్(జహీరాబాద్): విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని హుస్సేన్ నగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. హద్నూర్ ఎస్ఐ చల్లా రాజశేఖర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వడగావ్ సిద్దమ్మ రోజు మాదిరిగానే ఉదయం స్నానం ముగించుకొని బయటికొచ్చి రేకుల షెడ్డు వద్ద గల ఇనుప రాడును పట్టుకుంది. అప్పటికే రాడుకు విద్యుత్ తీగ తగిలి కరెంట్ సరఫరా అవుతుండటంతో సిద్దమ్మ విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సమీపంలో గల బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. -
పిడుగుపాటుకు ఎడ్లు మృతి
చిన్నకోడూరు(సిద్దిపేట): పిడుగు పాటుకు రెండు ఎడ్లు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కిష్టాపూర్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చక్రాల బాల్రాజు రోజు మాదిరిగా ఎడ్లను వ్యవసాయ పొలం వద్ద కట్టేశాడు. సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షంతోపాటు ఎడ్ల సమీపంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 80 వేల విలువైన జీవాలు మృతి చెందడంతో రైతు బాల్రాజు బోరున విలపించాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. కార్మికుడికి గాయాలు హత్నూర(సంగారెడ్డి): పరిశ్రమలో విధులు ని ర్వహిస్తుండగా కెమికల్స్ చేతి పైబడి కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హత్నూర మండలం గుండ్ల మాచూనూర్ గ్రామంలో చోటు చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సమీర్ కొంతకాలంగా గుండ్ల మాచూనూర్ గ్రామ శివారులోని కోవాలంట్ లాబోరేటరీ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగా శనివారం పరిశ్రమ లో విధులకు వెళ్లాడు. ఈ క్రమంలో చేతి పై కెమికల్స్ పడగా గాయాలు అయ్యాయి. కాంట్రాక్టర్ గానీ పరిశ్రమ యాజమాన్యం ఎలాంటి చికిత్స చేయించలేదని, అవసరమైన వైద్య చికిత్సలు చేయించాలని బాధితుడు కోరుతున్నాడు. యువతి అదృశ్యం సంగారెడ్డి క్రైమ్: యువతి అదృశ్యమైన ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రమేశ్ కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలం ఎల్లమ్మ కుచ్చ గ్రామానికి చెందిన ఉబిది శివాజీ, సాయవ్వ దంపతులు రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం పట్టణంలోని ఇందిరా కాలనీకి వచ్చి ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె ఉబిది ఇందు (15) పుట్టుకతో మతి స్థిమితం కోల్పోయింది. 3న సాయంత్రం ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు కార్లపై కట్టెల లోడ్ లారీ బోల్తా ● పలువురికి స్వల్ప గాయాలు ● క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే హరీశ్ రావు కొండాపూర్(సంగారెడ్డి): మండల పరిధిలోని మల్కాపూర్ 65వ జాతీయ రహదారిపై ఆదివారం కట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్లు ధ్వంసం కాగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇదే సమయంలో అటువైపు నుంచి ఎమ్మెల్యే హరీశ్రావు జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్నారు. ఘటనను చూసి తన వాహనాన్ని ఆపారు. పాక్షికంగా ధ్వంసమైన కారులో నుంచి స్థానికులు, సిబ్బంది సాయంతో గాయపడిన వారిని సురక్షితంగా బయటకు తీసి తన వాహనంలోనే చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. -
పెళ్లికి తెచ్చిన బంగారం, నగదు చోరీ
శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో పట్టపగలే దొంగతనంశివ్వంపేట: పట్టపగలే ఇంట్లో దొంగలు చొరబడి బంగారంతోపాటు నగదు అపహరించుకుపోయిన ఘటన మండలంలోని పిల్లుట్లలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి, బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నాయిని యాదమ్మ కుమారుడు వంశీ వివాహం నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన యువతితో 15న జరగాల్సి ఉంది. అప్పుచేసి వివాహం కోసం తెచ్చిన 4 తులాల బంగారం, కొంత నగదు తెచ్చి బీరువాలో దాచి పెట్టారు. వివాహానికి సంబంధించి విషయాలు మాట్లాడుకోవడానికి చిన్నచింతకుంట గ్రామంలో పెళ్లి కూతురు ఇంటికి భోజనానికి ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా రెండు బీరువాలు తెరిచి ఉన్నాయి. వాటిలో దాచిన 4 తులాల బంగారం, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి క్లూస్ టీంతో కలిసి పోలీసులు చేరుకొని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నేరం అంగీకరించినట్లు తెలిసింది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వర్గల్(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. వారం రోజుల కిందట ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా హుస్నాబాద్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని వర్గల్ మండలం తున్కిమక్తకు చెందిన చాకలి కనకయ్య(36) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా ఆదివారం అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య సుజాత, పదేళ్లలోపు శాన్వికా, హన్వికా కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరా జు పాల్గొని మృతుడి కుటుంబీకులను ఓదార్చి రూ.15 వేల ఆర్థికసాయం అందజేశారు. -
మున్నూరు కాపుల సంక్షేమానికి కృషి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపటాన్చెరు: మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పట్టణ మున్నూరు కాపు సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వారి వారి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహకారం అందించాలని సూచించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆడపిల్లల పెండ్లికి, మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, భిక్షపతి, సంఘం నూతన అధ్యక్షుడు భోజయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
ప్రతి రైతుకూ గుర్తింపు కార్డు
● జిల్లాలో నేటి నుంచి ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ● 40 రోజుల పాటు ఆన్లైన్లో నమోదు ● 3.26 లక్షల అన్నదాతలకు కార్డులు ● పైలెట్ ప్రాజెక్టు కిందమొగుడంపల్లి గ్రామం ఎంపిక ● ప్రత్యేక యాప్ ద్వారా నమోదు ప్రక్రియ కేంద్రం ఇచ్చే పథకాలకు ఇదే ఆధారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఫార్మర్ రిజిస్ట్రీపైనే ఆధారపడి ఉంటాయి. వ్యవసాయ సంబంధిత పరికరాలను అందజేయడం, పీఎం కిసాన్ తదితర పథకాలకు సాగుదారుల సంఖ్య ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రతి పనికి ఈ కార్డు తీసుకెళితే సరిపోతుంది. ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాలకు ఎంపిక చేసిన ప్రాంతాలకు జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హాజరవుతారు. రైతులకు సలహాలు, సూచనలు అందజేసి పంటల సాగు, దిగుబడులు సాధించడంపై అవగాహన కల్పిస్తారు. ఏఈఓలు ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లు నమోదు చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతుల నుంచి వివరాలు తీసుకుంటారు. లేని వారి వివరాలు తర్వాత సేకరిస్తాం. – శివప్రసాద్,వ్యవసాయ శాఖ అధికారి, సంగారెడ్డి జిల్లాజహీరాబాద్: నేటి నుంచి జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతుకు 11 అంకెల కార్డును కేటాయించనున్నారు. ఏప్రిల్లో పైలెట్ ప్రాజెక్టు కింద మొగుడంపల్లి రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి రైతుల పేర్లను నమోదు చేశారు. మొగుడంపల్లితో పాటు 9 తండాలను చేర్చారు. 4,123 మంది రైతులు ఉండగా, ఇందులో 1,100 మంది రైతుల పేర్లు నమోదు చేశారు. సోమవారం నుంచి నమోదు ప్రక్రియను జూన్ 13వ తేదీ వరకు కొనసాగించనున్నారు. రైతు వేదికల్లో ఏఈఓలు ప్రత్యేక యాప్ ద్వారా రైతుల పేర్లను నమోదు చేస్తారు. రైతు వేదికలు లేని చోట గ్రామ పంచాయతీ భవనాలు, మున్సిపాలిటీల్లోని వార్డు కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేసి షెడ్యూల్ ప్రకారం ఏఈఓలు వెళ్లి నమోదు చేపడతారు. జిల్లాలో 7.50 లక్షల ఎకరాల నికర సాగు భూమి ఉండగా, 3.26 లక్షల మంది రైతులున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా నమోదు రైతుల వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక యాప్ ద్వారా ఆధార్ కార్డు మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో సాగుదారుల సంఖ్యను ఇవ్వనున్నారు. పీఎం కిసాన్, క్రాప్ లోన్, పంటల బీమా, యాంత్రీకరణ పరికరాలతో పాటు తదితర పథకాలను సాగుదారుల సంఖ్య ఆధారంగా అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు అందే పథకాలు అమలు చేసేందుకు ఇది ఉపయోగపడనుంది. బ్యాంకు రుణాల కోసం సాగుదారుల సంఖ్య కార్డును తీసుకెళితే సరిపోతుంది. ధాన్యం కొనుగోళ్లకు సైతం ఇదే కార్డును వర్తింపజేయనున్నారు. తగిన సమాచారంతో నమోదుకు వెళ్లాలి సాగుదారుల సంఖ్య కార్డు నమోదుకు తగిన సమాచారంతో వెళ్లాలి. నమోదు కేంద్రానికి ఆధార్కార్డు లింకు ఉన్న ఫోన్ నంబర్, ఆధార్కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తీసుకెళ్లాలి. వ్యవసాయ సిబ్బంది ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తారు. అనంతరం రైతు సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని సిబ్బందికి చెబితే 11 అంకెల ప్రత్యేక గుర్తింపుకార్డు సంఖ్యను కేటాయిస్తారు. -
అకాల వర్షం.. రైతుకు నష్టం
జిన్నారం(పటాన్చెరు)/మునిపల్లి(అందోల్)/ రామచంద్రాపురం(పటాన్చెరు)/హత్నూర(సంగారెడ్డి): జిల్లాలో కొన్ని చోట్ల ఆదివారం ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. హత్నూర మండలం సిరిపురం గ్రామంలో వరి దెబ్బతిన్నది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయిందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల, పోలక్పల్లి, వావిలాల గ్రామాల్లో కూడా పడింది. దీంతో 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మునిపల్లి మండలంలో ఇండ్ల మధ్య విద్యుత్ తీగల కింద ఉన్న చెట్ల కొమ్మలు తీగలకు తగలడంతో షాక్ వస్తుందేమోనని ఇండ్ల యజమానులు ఆందోళన చెందారు. రామచంద్రాపురం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. -
కాంగ్రెస్ సమావేశం
ఇందిరమ్మ కమిటీల్లో బీఆర్ఎస్ నేతల ఆధిపత్యమేంటని నిలదీత ● పార్టీ పరిశీలకుడిని అడ్డుకున్నపటాన్చెరు కాంగ్రెస్ నాయకులు ● మంత్రి దామోదర ఎదుటే నిలదీసిన శ్రేణులు ● కాంగ్రెస్ జిల్లా ముఖ్య నేతలసమావేశం రసాభాససాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు.. అంతర్గత పోరు మరోమారు రచ్చకెక్కింది. మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ పరిశీలకులుగా జిల్లాకు వచ్చిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సమక్షంలోనే ఆ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం నేతలు రచ్చ రచ్చ చేశారు. సమావేశం వేదిక వద్దకు దూసుకొచ్చి.. రామ్మోహన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ముఖ్యనాయకులు సముదాయించినా నాయకులు పట్టించుకోలేదు. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్లో ఆ పార్టీ జిల్లా ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యా ప్తంగా ఐదు నియోజకవర్గాల నుంచి ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడుతుండగా నాయకులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో గూడెం పెత్తనంపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రామ్మోహన్రెడ్డి వివరిస్తున్న క్రమంలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పెత్తనం ఏంటని రామ్మోహన్ను ప్రశ్నించారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో కీలకమైన ఈ కమిటీలోఅసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గంలో ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల మాటే చెల్లుబాటు అవుతోందని, ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నేతలను నిలదీశారు. రామ్మోహన్రెడ్డి ఎంత వారించినా వినలేదు. పోలీసులు సైతం నిలువరించే ప్రయత్నం చేశారు. వేదికపై ఉన్న ఎంపీ సురేష్షెట్కార్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కలుగచేసుకుని సముదాయించడంతో కొంత మేర శాంతించారు. స్వేచ్ఛే కాంగ్రెస్కు బలం.. బలహీనత : మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీకి స్వేచ్ఛే బలం, బలహీనత అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు.. నాయకుడు లేడు అన్నారు. పార్టీలో వర్గ విభేదాలు ఉండటం సహజమేనన్నారు. కానీ సమన్వయం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో, తాలుకా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో.. సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే నాయకులకు బలమని, వారి కృషితోనే నాయకుల గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నారు. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు. వారిని కాపాడుకుంటామని చెప్పారు. సమావేశంలో వేదికపై ఉన్న నాయకులను నిలదీస్తున్న పటాన్చెరు నియోజకవర్గం కార్యకర్తలు గూడెం ఫొటోపై మరో నేత ఫొటో అతికించి.. ఈ సమావేశంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సమావేశం వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్యనేతల ఫొటోలను ఏర్పాటు చేశారు. ఇందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఫొటో కూడా ఉంది. ఈ ఫొటో ఏర్పాటు చేయడంపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఫ్లెక్సీపై మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఫొటోను అతికించారు. సమావేశం జరుగుతున్న హోటల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోనూ గూడెం మహిపాల్రెడ్డి ఫొటోపై మరోనాయకుడి ఫొటోను అతికించడం చర్చనీయాంశంగా మారింది.సేఫ్టీ కోసం గూడెంను తీసుకున్నాం : ఎంపీ సురేష్ షెట్కార్ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బెదిరింపులకు దిగారని, ప్రభుత్వం సేఫ్టీ కోసమే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నామని తెలిపారు. ఇది అధిష్టానం నిర్ణయమని, ఎవరూ వ్యతిరేకంగా వెళ్లవద్దని సూచించారు. తన ఎంపీ నియోజకవర్గం బాన్సువాడలోనూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నానని అన్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని చెప్పారు. ఇలాంటి నియోజకవర్గాల్లో రెండు వర్గాలకు సమ న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందిరమ్మ కమిటీలతో పాటు, ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ ఇరు వర్గాలకు న్యాయం చేసేలా ముఖ్యనాయకులు చొరవ చూపాలన్నారు. -
ఖేడ్ డిపోకు మరో పది బస్సులు
ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోకు త్వరలో మరో పది కొత్త బస్సులు రానున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ నుంచి కంకోల్ వరకు నూతన బస్సు సర్వీసును ఆదివారం మనూరు మండలంలోని బోరంచ నల్లపోచమ్మ ఆలయం వద్ద ఎమ్మెల్యే పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ను మరో పది బస్సులు కావాలని కోరగా కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. కరస్గుత్తి నుంచి డోవూర్, మనూర్ల మీదుగా సికింద్రాబాద్కు , జహీరాబాద్, బీదర్ రూట్లలో, జహీరాబాద్ నైట్హాల్ట్ బస్సును పునరుద్ధరించాలన్నారు. కంగ్టి, తడ్కల్ మీదుగా హైదరాబాద్కు బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లన్న, డీఎం మల్లేశయ్య, పూజారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పాలీసెట్అభ్యర్థులకు ఉచిత శిక్షణ
నారాయణఖేడ్: పాలిటెక్నిక్లో ప్రవేశాల కోసం పాలీసెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఖేడ్ మండలం జూకల్ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. ఉన్నత విద్యతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణతోపాటు అవసరమైన మెటీరియల్ను ఉచితంగా అందజేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు కళాశాలలో లేదా 95055 04211 నంబర్లో సంప్రదించాలని సూచించారు.నేడు సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నారాయణఖేడ్: సీపీఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశం సోమవారం ఖేడ్లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ ఖేడ్ డివిజన్ కార్యదర్శి ఆనంద్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమావేశానికి ఎమ్మెల్సీ నేలకంటి సత్యం, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింహ, జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలొద్దీన్తో పాటు ముఖ్య నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. నాయకులు చిరంజీవి, దత్తురెడ్డి, అశోక్, సతీశ్, ప్రేమ్ కుమార్, సంగమేశ్వర్, నర్సింహులు పాల్గొన్నారు. పేదల పక్షాన పోరాటం చేయాలి సీపీఎం జాతీయ కార్యదర్శి డి.రాజా జహీరాబాద్ టౌన్: పేదల పక్షాన పోరాటాలు చేయాలని, ఇళ్లు లేని వారికి స్థలాలు ఇప్పించడానికి ఉద్యమాలు చేయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి డి.రాజా పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి గుల్బర్గాకు ఆయన వెళ్తుండగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్, జహీరాబాద్ డివిజన్ కార్యదర్శి నర్సిహులు తదితరులు హుగ్గెల్లి చౌరస్తాలో స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాజా కొంచెం సేపు పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ రాజ్య సభ్యుడు అజిజ్ పాషా ఉన్నారు. నాగిరెడ్డిపల్లి గ్రామాభివృద్ధికి కృషి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు జహీరాబాద్: నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు అన్నారు. ఆదివారం కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన దుర్గాభవానీ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, జహీరాబాద్, సంగారెడ్డి ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజూశ్రీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, పీఏసీఎస్ చైర్మన్ స్రవంతిరెడ్డి, ఆయా మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింహులు, నారాయణ, వెంకటేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
ప్రశాంతంగా నీట్ పరీక్ష నేషనల్ ఎలిజిబుల్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జిల్లాలోని 7 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 3,222 మంది అభ్యర్థులు హాజరు కాగా 98 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు పరీక్షా కేంద్రాలను ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. పరీక్షను పురస్కరించుకొని పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జోన్ ● 98మంది గైర్హాజరు ● పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీన్యూస్రీల్ -
లేబర్ కోడ్ తెస్తే తిరుగుబాటు తప్పదు
సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య పటాన్చెరు టౌన్: లేబర్ కోడ్ తీసుకొస్తే తిరుగుబాటు తప్పదని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజయ్య హెచ్చరించారు. శనివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రామిక భవన్లో జరిగిన పార్లే ఆగ్రో పరిశ్రమ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్లు వస్తే బానిసలుగా మారడం తప్పదన్నారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్, రాజశేఖర్ సుజిత్, సుధాకర్, శ్రీకాంత్, కిరణ్, రాములు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం మాతోనే సాధ్యంఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి పటాన్చెరు టౌన్: కార్మికుల సమస్యల పరిష్కారం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. శనివారం ఐఎన్టీయూసీ 78వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఐఎన్టీయూసీ మూడు కోట్ల 30 లక్షల మంది కార్మికులు సభ్యత్వం ఉన్న అతిపెద్ద కార్మిక సంఘమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక పక్షపాతి అని, వారికి కార్మిక వర్గం అండగా ఉంటుందన్నారు. కార్మిక నాయకులు విజయ్, రాజశేఖర్ రెడ్డి, కుమార్, ప్రదీప్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. అధిక సాంద్రతతో అధిక దిగుబడులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ ఝరాసంగం(జహీరాబాద్): అధిక సాంద్రత విధానంతో పంటలు అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన ఝరాసంగం రైతు వేదికలో అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పత్తి సాగులో తాజా మార్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ ఎకరా విస్తీర్ణంలో ఎక్కువ విత్తనాలు వేసి తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుందన్నారు. బయోచార్ ఎరువులో అధిక పోషకాలు నీటిని నిలిపే సామర్థ్యం పెంచుతుందన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్, అరణ్య సంస్థ ప్రతినిధి పద్మ, నూజివీడు సీడ్స్ ప్రతినిధి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఖైదీలకు ఉచితన్యాయ సేవలు అందిస్తాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సంగారెడ్డి టౌన్: జైలులోని ఖైదీలకు సరైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. శనివారం కందిలోని సెంట్రల్ జైలును ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైదీలకు సరైన వసతులు కల్పించాలని, సమయానికి బెయిల్, ములాఖత్ అందించాలన్నారు. ఖైదీల కోసం కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం జైలు అధికారులతో, ఖైదీలతో మాట్లాడారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను పరిశీలించారు. -
లంపిస్కిన్ కలకలం
జీర్లపల్లిలో లేగదూడ మృతి ఝరాసంగం(జహీ రాబాద్): పశువుల్లో ప్రాణాంతక వ్యాధి లంపిస్కిన్ మండలంలో కలకలం రేపింది. జీర్లపల్లిలో శుక్రవారం రాత్రి లేగదూడ మృతి చెందింది. వివరాల ఇలా.. గ్రామానికి చెందిన శ్రీశైలం తన లేగదూడ శరీరంపై దద్దుర్లు, మెడ కింది వాపు, కాళ్ళువాపు లక్షణాలు కనిపించడంతో పశువైద్యుల ను సంప్రదించారు. చికిత్స ప్రారంభించడంతో దూ డ మృతి చెందింది. దీంతో గ్రామంలోని పశుపోష కులు ఆందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన పోషకుడి వద్ద ఉన్న మరో దానికి లక్షణాలు ఉ న్నా యని తెలిపారు. దీంతో పశువైద్య శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామంలో ప్రత్యేక వైద్య శిబి రం నిర్వహించి తెల్లజాతి పశువులకు టీకాలు వేశారు. -
కాంగ్రెస్లో ‘మార్కెట్’ రగడ
● ఎటూ తేలని ఖేడ్, పటాన్చెరుఏఎంసీల పాలకవర్గాలు నియామకం ● నేతల మధ్య ఆధిపత్య పోరుకారణమంటున్న పార్టీ వర్గాలు ● పీసీసీ వద్దకు పటాన్చెరు‘మార్కెట్’ పంచాయితీ ● ఎంపీ, ఎమ్మెల్యేలు చర్చించుకుంటేనే ‘ఖేడ్’ కమిటీపై స్పష్టత ● సర్కారు వచ్చి 16 నెలలైనాతేలని పంచాయితీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అధికార కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీల పాలకవర్గాల రగడ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకాలు జరిగినప్పటికీ నారాయణఖేడ్, పటాన్చెరు మార్కెట్ కమిటీల పాలకవర్గం ఖరారు కావడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఈ పాలకవర్గాలు ఎటూ తేలడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో మొత్తం ఎనిమిది మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, వట్పల్లి, జోగిపేట, రాయ్కోడ్ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు నియామకం జరిగి ఆరు నెలలు గడుస్తోంది. కానీ, నారాయణఖేడ్, పటాన్చెరు కమిటీల పంచాయితీ మాత్రం ఎటూ తేలడం లేదు. గూడెం ప్రతిపాదించి రెండు నెలలైనా.. పటాన్చెరు మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల పదవులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కొందరు నాయకుల పేర్లను ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రతిపాదిత లేఖను ఫిబ్రవరిలోనే అధికారులకు అందజేశారు. ఆ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న కా టా శ్రీనివాస్గౌడ్ అభ్యంతరం తెలపడంతో గూడెం ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. రెండు నెలలుగా ఈ పంచాయితీ ఎటూ తేలడం లేదు. ఈ చైర్మన్, సభ్యుల పదవులను తన వర్గీయులకు ఇచ్చేందుకు గూడెం మహిపాల్రెడ్డి ప్రతిపాదించగా, కాటా శ్రీనివాస్గౌడ్ తన అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో గత ఆరు నెలలుగా ఈ పదవులు భర్తీ కావడం లేదు. పీసీసీకి మార్కెట్ కమిటీ పంచాయితీ పటాన్చెరు మార్కెట్ కమిటీ నియామకాల క్లిష్టంగా మారడంతో ఈ పంచాయితీ పీసీసీ వద్దకు వెళ్లింది. ముఖ్యనేతలే ఈ పంచాయితీని తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఆరు నెలలుగా ఈ పదవులు భర్తీ కావడం లేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ‘ఖేడ్’లో సమన్వయం కుదిరితేనే.. నారాయణఖేడ్ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవులను కూడా తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు అక్కడి ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి తన అనుచరులకు ఈ పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నించగా, స్థానికంగా ఉండే జహీరాబాద్ ఎంపీ సురేష్షెట్కార్ కూడా తన వర్గీయులకు ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో ఈ మార్కెట్ పంచాయితీ కూడా ఇంకా ఎటూ తేలడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కుదిరితేనే ఈ పదవులు తేలే అవకాశాలు ఉన్నట్లు హస్తం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో జహీరాబాద్లోనూ లొల్లే.. జహీరాబాద్ మార్కెట్ కమిటీ నియామకం గతంలోనే పూర్తయిన విషయం విదితమే. ఈ కమిటీ చైర్మన్ పదవిని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్ తన కుమారుడిని నియమించుకున్నారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు అప్పట్లో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తమకు ప్రభుత్వం వచ్చాక పదవులు దక్కుతాయనుకుంటే తమకు నిరాశే ఎదురైందని స్థానిక సీనియర్ నాయ కులు ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక టర్మే దగ్గర పడుతుండే... ఆయా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల్లో ఈ మార్కెట్ చైర్మన్లు, సభ్యుల పోస్టులు ముఖ్యమైనవి. సాధారణంగా ఈ పోస్టుల పదవీకాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి 16 నెలలు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు నారాయణఖేడ్, పటాన్చెరు మార్కెట్ కమిటీల పోస్టులు ఎటూ తేలకపోవడంతో ఆ పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఈ పదవులను నియమించి ఉంటే ఒక టర్మే దగ్గర పడేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మెడికల్ షాపు ఎదుట సొంత ఖర్చుతో..
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణానికి చెందిన రతన్ సరడా ఒక్కడే ఆరేళ్ల నుంచి చలి వేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని భవానీ మందిరం రోడ్డులో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రాంతానికి వచ్చిన వారికి మంచి నీళ్లు అందించాలన్న ఉద్దేశ్యంతో తన మెడికల్ షాపు ఎదుట చలివేంద్రం ఏర్పాటు చేసి కూలింగ్ మినరల్ వాటర్ అందిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్లుగా ప్రతీ ఆదివారం నగర సంకీర్తన నిర్వహిస్తున్నామని, అందుకని ఈ సంవత్సరం చలివేంద్రాన్ని నగర సంకీర్తన పేరు పెట్టామన్నారు. పరిస్థితుల బట్టి అవసరం మేరకు కూలింగ్ వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. -
జేఎస్ఆర్ ఔదార్యం.. చలివేంద్రం
ప్రతీ నెలా రూ.15 లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటు హుస్నాబాద్: వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి. జేఎస్ఆర్ అన్న పేరిట 5 ఏళ్లుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాడు. హుస్నాబాద్ పట్టణంతోపాటుగా అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండల కేంద్రాలతోపాటుగా పెద్ద గ్రామాల్లో మొత్తం 19 చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతీ చలివేంద్ర కేంద్రంలో వాటర్ ఫ్రిడ్జిని ఏర్పాటు చేసి ప్రజలకు కూల్ వాటర్ను అందిస్తున్నాడు. 24 గంటల పాటు కూల్ వాటర్ను అందుబాటులో ఉంచుతున్నారు. కరెంటు బిల్లు, వర్కర్లు, చలివేంద్రాల నిర్వాహణ దాదాపు ప్రతి నెలా రూ.15 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. -
మహిళా కళాశాలలో సమస్యలు ఉండొద్దు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి: మహిళా డిగ్రీ కళాశాలలోని సమస్యలను పరిష్కరించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో అదనపు వసతి గదులతో పాటు మూడు వందల మంది విద్యార్థినులకు సరిపోయేలా కిచెన్, డైనింగ్ గదులు మూడు అంతస్తుల్లో ఏర్పాటు అయ్యేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మినీ ఆడిటోరియం, హాస్టల్ భవనం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల ప్రాథమిక పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో కావాల్సిన అన్ని మరమ్మతులు వెంటనే పూర్తిచేయాలని కోరారు. ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డీఈ రాజు, ఏఈలు రాజ మల్లయ్య, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
ఆరేళ్లుగా బస్టాండ్ వద్ద ఏర్పాటు
సీఐటీయూ ఆధ్వర్యంలో చలివేంద్రం దుబ్బాక: దుబ్బాక పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా అంబలి కేంద్రంతోపాటు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డు బర్ల భాస్కర్ ప్రత్యేక కృషితో మార్చిలో బస్టాండ్ వద్ద చలి వేంద్రంను ఏర్పాటు చేసి ప్రతి రోజూ వెయ్యిమందికి పైగా చల్లటి మినరల్ వాటర్ అందిస్తు దాహార్తి తీరుస్తున్నారు. ఆరేళ్లుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా భాస్కర్ సాక్షితో తెలిపారు. మండుటెండలో ఎక్కడో సుదూరప్రాంతాలకు చెందిన వారు ఈ చలివేంద్రంలో చల్లని నీరు తాగి దాహార్తి తీర్చుకోవడం చూస్తుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. -
పర్యావరణ ఇంజినీర్ తొలగింపు
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్విరాల్మెంట్ ఇంజినీర్గా పని చేస్తున్న దిలీప్రెడ్డిని తొలగిస్తూ మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ సిద్దిపేట, గ్రీన్ సిద్దిపేట లక్ష్యంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మున్సిపాలిటీలో పర్యావరణ ఇంజినీర్గా దిలీప్ రెడ్డి నియామకం అయ్యా రు. కొంతకాలంగా విధులపట్ల నిర్లక్ష్యం, పలు ఆరోపణలు, కౌన్సిల్ తీర్మానం నేపథ్యంలో అతడిని తొలగిస్తూ, అందుకు సంబంధించి సురక్ష ఏజెన్సీతో చేసుకున్న దిలీప్ నియామకం రద్దు చేస్తున్నట్టు వారికి లేఖ రాశారు. మట్టి టిప్పర్లు పట్టివేతముగ్గురిపై కేసు నమోదు, రూ.15 వేలు జరిమానా వట్పల్లి(అందోల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ వాహనాలను వట్పల్లి పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. జోగిపేట సీఐ అనిల్కుమార్ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి గుట్టుగా వట్పల్లి గ్రామ శివారులో నుంచి కొందరు టిప్పర్ వాహనాల ద్వారా రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఫంక్షన్ హాలు నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్ వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ శ్రీనివాస్కు సమాచారం అందించి వారి సమక్షంలో వాహనాలకు ఒక్కొక్కదానికి రూ.5 వేల చొప్పున మూడింటికి రూ.15 వేలు జరిమానాలు విధించారు. టిప్పర్ వాహనాల డ్రైవర్లు జాన్సన్, మహ్మద్ మోసిన్, జీ.మల్లేశంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య రెండు నెలల కిందటే వివాహం చిన్నశంకరంపేట(మెదక్): వివాహమైన రెండు నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వట్టెపు రాజయ్య కుమారుడు మహేశ్కు రెండు నెలల కిందట వెల్దుర్తి మండలం షేరిలా గ్రామానికి చెందిన పూజను ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలోనే యువతి అత్తింట్లో ఉ రేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు యువతి తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఆగ్రహానికి గురైన యువతి బంధువులు అత్తింటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. అత్తింటి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్ తమ సిబ్బందితో వచ్చి యువతి బంధువులను సముదాయించారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించారు. -
ఆన్లైన్ మోసాలపై అవగాహన
ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశం సంగారెడ్డి జోన్: ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, మోసాలు, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్పై జిల్లా ప్రజలలకు, విద్యాసంస్థలలో అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. శనివారం జిల్లా తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటల్ అరెస్టు పేరుతో ఆన్లైన్లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ చేయరని స్పష్టం చేశారు. డిజిటల్ అరెస్టులు ఉండవు, ఫిజికల్ అరెస్టు మాత్రమే ఉంటుందన్నారు. వాణిజ్య పరంగా 20 కిలోల బరువు కలిగిన గంజాయిని అక్రమ రవాణా చేసిన స్మగ్లర్ల ఆస్తులను కోర్టుకు అటాచ్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ, మద్యం తాగి వాహనాలను నడిపే వాహన దారీలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీలు సత్యయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
18 ఏళ్లుగా డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ ఆధ్వర్యంలో..
తూప్రాన్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని డ్రైవర్, ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. ఉగాది పండుగ రోజున పచ్చడితో ప్రారంభించి మృగశిర వరకు కొనసాగిస్తామన్నారు. నిత్యం నాలుగు డ్రమ్ముల మినరల్ నీటిని (2 వేల లీటర్లు) ప్రజలు తాగుతారన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం చాలా సంతోషంగా ఉందని, అందరం కలిసి ప్రజల కోసం ఓ మంచి పని చేస్తున్నామన్న ఆనందం కలుగుతుందన్నారు. -
మద్యం మత్తులో పోలీసులపై దాడి
ఐదుగురు యువకులపై కేసుశివ్వంపేట(నర్సాపూర్): మద్యం మత్తులో యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శివ్వంపేట పోలీసులు తూప్రాన్– నర్సాపూర్ హైవే పై పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో శనివారం సాయంత్రం డ్రంకై న్ డ్రైవ్లో భాగంగా వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు బైక్లపై ఐదుగురు యువకులు హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో శివ్వంపేట వైపునకు వస్తుండగా పోలీసులు ఆపారు. మా బైక్లనే ఆపుతారా అని ఆ యువకులు పోలీసులను దూషిస్తూ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులను పోలీస్స్టేషన్కు తరలించినప్పటికీ అక్కడ కూడా పోలీసులను దూషిస్తూ హల్చల్ చేశారు. పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుకర్రెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు బిజ్లిపూర్ గ్రామ శివారులో ఉన్న శ్రీవాస్ లైప్ సైన్స్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గోమారం గ్రామానికి చెందిన ఎండీ రషీద్, గుంటూరు ప్రాంతానికి చెందిన బానావాత్ సైదానాయక్, బుక్య భీమానాయక్, గగ్లోత్ గోపినాయక్, బనావాత్ నందునాయక్ గా గుర్తించినట్లు చెప్పారు. -
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు
● మండు వేసవిలో ప్రజల దాహాన్ని తీరుస్తున్న నిర్వాహకులు ● బస్టాండ్లు, రోడ్లు, ప్రధాన చౌరస్తాలు, రైతు బజార్లు, తదితర చోట్ల ఏర్పాటు ● స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నిర్వహణ ● కుటుంబీకుల జ్ఞాపకార్థం, ప్రజాసేవకై మరికొందరు ● రూ.లక్షలు ఖర్చు పెట్టి మినరల్ వాటర్ అందజేత మానవ సేవయే మాధవ సేవ అన్నారు పెద్దలు. మనిషి తన సంపాదనలో కొంతైనా మానవ సేవకు ఖర్చు పెడితే.. ఇంతకంటే గొప్ప సంతృప్తి ఏముంటుంది. అన్నదానం, నేత్రదానం, అవయదానం, నీటిదానం ఇలా అనేక రూపాల్లో ప్రజలకు సేవ చేస్తారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు అనేక మంది నీటి దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆస్పత్రులు, బస్టాండ్లు, రైతు బజార్లు, మార్కెట్లు, పాఠశాలల, షాపులు తదితర ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తమ కుటుంబీకుల జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లాలో అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా చాలా ఏళ్ల నుంచి ప్రజల దాహార్తిని తీరుస్తున్న చలివేంద్రాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -
భయంతో వంతెనపై నుంచి దూకి వ్యక్తి మృతి
పెద్దశంకరంపేట(మెదక్): వంతెనపై నుంచి దూకడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దశంకరంపేట పెద్ద చెరువు వంతెనపై చోటు చేసుకుంది. పేట శిక్షణా ఎస్ఐ అరవింద్ కథనం మేరకు.. అల్లాదుర్గం మండలం రాంపురం గ్రామానికి చెందిన బేగరి అనూప్ (30)కు భార్య, కూతురు ఉన్నారు. అనూప్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి పెద్దశంకరంపేట నుంచి రాంపురం వైపు బైక్పై వెళ్తున్నాడు. అతడి ముందు బైక్పై చిల్వర గ్రామానికి చెందిన రాములు వెళ్తున్నాడు. వేగంగా వచ్చిన అనూప్ రాములు వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఢీకొట్టినందుకు తనను ఏమైనా అంటారేమో అని భయంతో అనూప్ వంతెన పక్కన రహదారి ఉందనుకొని చీకట్లో దూకేశాడు. ఈ క్రమంలో కిందపడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి చేగుంట(తూప్రాన్): గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్ శేర్ పంజాబీ దాబా సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి కథనం మేరకు.. రాజస్థా న్ రాష్ట్రం అజ్మీర్ జిల్లా కౌడా గ్రామానికి చెందిన ప్రహల్లాద బగ్రియా(39) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. లారీని పంజాబీ దాబా వద్ద పార్కింగ్ చేసి రోడ్డు దాటుతున్న క్రమంలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపుకు వెళ్తున్న గుర్తు తెలియని కారు ఢీకొనగా ప్రహల్లాదకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం ఢీకొని మహిళ జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. జహీరాబాద్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సత్వార్ గ్రామానికి చెంది న మేతరి కమలమ్మ(55) శుక్రవారం పట్టణంలోని లిక్కర్ కోర్టు సమీపంలో కాలినడకన వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. బైక్ ఢీకొన్న ప్రమాదంలో రైతు.. కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చిన్న ఘనాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన నాగం శ్రీనివాస్ (45) వరిగుంతం గ్రామ శివారులోని తన పొలం సమీపంలో గల రోడ్డు పక్కన ధాన్యాన్ని ఆరబెట్టాడు. బుధవారం సాయంత్రం ధాన్యం కుప్పల వద్ద టార్పాలిన్లను సరి చేస్తున్నాడు. ఇదే సమయంలో మెదక్ వైపు నుంచి బైక్ పై వస్తున్న ఓ వ్యక్తి శ్రీనివాస్ను ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతుడికి భార్య అనిత, కుమారుడు ఉన్నారు.స్నానానికి వెళ్లి యువకుడు జిన్నారం (పటాన్చెరు): స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, బాధితుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా బిక్కనూరుకు చెందిన మిరియాల శివ, అతడి తమ్ముడు ప్రసాద్ (20) రెండేళ్లుగా బొంతపల్లి గ్రామంలో చెత్తడబ్బాలు ఏరుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. 1న కటింగ్ చేయించుకుంటానని వెళ్లి రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. శనివారం ఉదయం 8 గంటలకు గ్రామ శివారులోని అల్కా చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఒడ్డున ప్రసాద్ మృతదేహాన్ని గుర్తించారు. స్నానం చేసేందుకు బట్టలు మెట్లపై పెట్టి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడని తమ్ముడి మరణంలో ఎలాంటి అనుమానం లేదని పోలీసులకు తెలిపారు. -
ప్రజల దాహం తీర్చాలన్న ఉద్దేశంతోనే..
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: వేసవిలో పనుల నిమిత్తం గ్రామాల నుంచి నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్కు వచ్చే ప్రజల దాహం తీర్చాలన్న లక్ష్యంతోనే చలివేంద్రం నిర్వహిస్తున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. తన భర్త దివంగత వాకిటి లక్ష్మారెడ్డి స్మారకార్థం వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు 20 ఏళ్ల నుంచి స్థానిక చౌరస్తాలో వేసవి సీజన్లో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మూడు నెలలపాటు రోజుకు సుమారు 200 నుంచి 250 లీటర్ల చల్లటి నీళ్లు అందుబాటులో ఉంచుతామన్నారు. తన భర్త స్మారకార్థం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి పేద ప్రజల దాహం తీర్చడం సంతోషాన్నిస్తుందని తెలిపారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
పటాన్చెరు/రామచంద్రాపురం(పటాన్చెరు): అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధం కొమ్ము కృష్ణ బృందావన్ కాలనీలో 20 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన నూతన రిజర్వాయర్ను, అలాగే.. ఉస్మాన్నగర్లో భగీరథ తాగునీటి రిజర్వాయర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన కాలనీలకు సైతం తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ నేపథ్యంలోనే బంధంకొమ్ములో రూ.10 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల పైపులైన్ సామర్థ్యంతో 30 వేల మంది జనాభాకు మంచి నీటిన అందించేందుకు రిజర్వాయర్ నిర్మించామని చెప్పారు. అలాగే.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.30కోట్లతో రిజర్వాయర్ను నిర్మించామని, త్వరలో 55 కాలనీలకు సురక్షితమైన తాగునీటి అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రెండు రిజర్వాయర్లను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, డీజీఎం చంద్రశేఖర్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్ పాల్గొన్నారు. త్వరలో రెండు రిజర్వాయర్లు ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి -
నీట్ పరీక్షకు సర్వం సిద్ధం
● హాజరు కానున్న 3,320 మంది అభ్యర్థులు ● కలెక్టర్ క్రాంతి వెల్లడిసంగారెడ్డి జోన్: నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ క్రాంతి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరగనుందని చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,320 మంది పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. పరీక్ష హాలులోకి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు ఉంటాయన్నారు. పకడ్బందీగా రెవెన్యూ సదస్సులు భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో మూడు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు ఇతర సమస్యలపై కూడా ఒక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజారాణి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ పాల్గొన్నారు. -
రోజూ 300 నుంచి 350 లీటర్లు
దుబ్బాకలో సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం దుబ్బాక: పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సివిల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతీయేటా వేసవికాలంలో చలి వేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నారు. ప్రతిరోజూ 300 నుంచి 350 లీటర్ల చల్లని మినరల్ వాటర్ను అందిస్తూ 1,000 నుంచి 1,200 మందికి నీటిని అందిస్తున్నామని సివిల్ క్లబ్ అధ్యక్షుడు ఎర్రగుంట ప్రసాద్ సాక్షికి తెలిపారు. తమ వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందిస్తున్నామన్నారు. తమ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సైతం దీనికి ప్రత్యేకంగా సహకరిస్తున్నారని తెలిపారు.