Lifestyle
-
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
ఆ యూనిఫాం నచ్చి చెఫ్గా మారా..! ఏకంగా 72 పోటీల్లో..94 పతకాలు..
పాఠశాలలో విద్యాభ్యాసం పొందుతున్న సమయంలో ఓ చెఫ్ వీడియోకు, అతని డ్రెస్ కోడ్కు ఆకర్షితురాలైన ఆ విద్యార్థిని చెఫ్గా మారాలని సంకల్పించుకుంది. అంతటితో ఆగకుండా ఆ దిశగా అడుగులు వేస్తూ మాస్టర్ చెఫ్గా పలువురి మన్ననలు పొందుతోంది. అనేక వంటల పోటీల్లో పతకాలను సొంతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకుని బేకరీ విభాగంలో రాణిస్తోంది. ఆమే మేడ్చల్కు చెందిన మహిళా చెఫ్ దివ్యసారిక. తాను చెఫ్గా మారి స్థిరపడడం సరికాదని భావించి పాకశాస్త్ర ప్రావీణ్యంతో అద్యాపకురాలిగా తనలాంటి ఎంతో మందిని చెఫ్స్గా మలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కొత్త మల్లయ్యపాలేనికి చెందిన దివ్యసారిక ఇంటర్ వరకూ అక్కడే చదువుకుంది. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం పలు రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారి వీడియోలను ప్రదర్శించింది. అందులో భాగంగా ఆ్రస్టేలియాకు చెందిన ఫేమస్ చెఫ్ థామస్ వీడియో, అతని యూనీఫాంకు ఆకర్షితురాలైంది దివ్యసారిక. అప్పుడే చెఫ్గా మారాలని నిర్ణయించుకుంది. మొదట ఇంట్లో వంటలు చేయడం ప్రారంభించింది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఆలోచనను తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తనకు ఇష్టమైన రంగంలో వెళ్తానంటూ పట్టుబట్టి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ మూడేళ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ కోర్సు పూర్తిచేసింది. చివరి సంవత్సరంలో హోటల్ హెచ్ఐసీసీలో అప్రెంటీస్లో చేరి అనంతరం అక్కడే చెఫ్గా చేరింది. తదనంతరం నోవోటెల్లో రెండున్నరేళ్ల పాటు చెఫ్గా చేసింది. 72 పోటీల్లో.. 94 పతకాలు.. బేకరీ విభాగంలో చెఫ్గా రాణిస్తున్న దివ్యసారిక ఇప్పటి వరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 72 పోటీల్లో పాల్గొంది. మొదట విద్యార్థి దశలో 2013లో ఆంధ్రా కలినరీ చెఫ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.42 వేలు ఖర్చు చేసి పొటీలో పాల్గొంది. నిర్భయ గర్ల్చైల్డ్, మథర్ థీమ్తో చెఫ్గా తనదైన ముద్రతో మొదటి గొల్డ్మెడల్ సాధించింది. దీంతో పతకం రుచి చూసిన చెఫ్ దివ్య అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, మారీషియస్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని 4 గొల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 32 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్తో పాటు నగదు పురస్కారాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నట్లు దివ్యసారిక తెలిపింది. లక్షల జీతం వదిలి.. మహిళా చెఫ్గా రాణిస్తున్న దివ్య ప్రముఖ హోటళ్లలో, విదేశాల్లో చెఫ్గా విధులు నిర్వహిస్తే రూ.లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నా.. తాను నేర్చుకున్నది నలుగురికీ బోధించాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటి వరకూ 300 మంది విద్యార్థులను చెఫ్లుగా తీర్చిదిద్దానని, వారిలో కొందరు విదేశాల్లో చెఫ్స్గా స్థిరపడ్డారని తెలిపారు. రుచికరమైన ఆహారం అందించేందుకు.. చెఫ్స్గా మహిళలు రాణించాలనేదే నా కోరిక.. నా ప్రేరణతో మరికొందరు ఈ రంగంలో స్థిరపడాలి. ప్రజలకు నాణ్యామైన రుచికరమైన ఆహారం అందించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా ద్వారా ఈ రంగంలో స్థిరపడిన వారు చిరకాలం నన్ను గుర్తుంచుకుంటారు.. అదే నాకు ఆనందాన్నిస్తుంది.(చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!) -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!
ప్రతి మనిషికీ ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో కానీ, నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధరణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో ఓ వాటర్ బాటిల్తో నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాలా 130 నుంచి 160 రూపాయలట. అంటే ఆ బ్రాండ్ ఒక లీటర్ నీరు సుమారు రూ.500. నిజంగా హైదరాబాద్లో వందలు, వేలు ఖర్చు చేసి ఒక లీటర్ నీటిని కొంటున్నారా.. అంటే? ఔననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు.. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20లు. ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా స్పార్లి్కంగ్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది. వాటర్ బాటిళ్ల అమ్మకం ఐఎస్ఐ మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి సహజ వనరైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు, సామాజిక వేత్తలు నినదిస్తున్నారు. కానీ హైదరాబాద్ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టి మరీ తాగున్నారనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్ వాటర్బాటిల్ ధర 40 నుంచి 80 ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్ మిక్సింగ్ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్ హోటళ్లలో 250 నుంచి 300 మి.లీ వాటర్బాటిల్ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్ మినరల్ వాటర్ అని, నేచురల్లీ ఆల్కలైన్ వాటర్ అనీ విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్లీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అంటూ లీటర్కు సుమారు వెయ్యిరూపాయల వరకూ ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో జరిగే బిజినెస్ మీటింగ్స్, ఫంక్షన్స్లో ఈ తరహా వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతే కాదు.. సాధారణంగా లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తుండటం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుండి సేకరించిన వోస్ ఆర్టేసియన్ వాటర్ (12 బాటిళ్ల ప్యాక్ సుమారుగా 6,600), ఆరావల్లి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ అల్కలైన్ వాటర్, క్రికెటర్ కోహ్లీ తాగే ఎమియన్ వంటి ఖరీదైన బ్రాండ్స్ నగరంలో లభిస్తుండటం విశేషం. వజ్రాల బాటిల్స్లో తాగే నీరు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్ 90 ఏ20 డైమండ్ ఎడిషన్ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్ లగ్జరీ కలెక్షన్ డైమండ్ ఎడిషన్ బాటిల్ ధర రూ.65 లక్షల వరకూ ఉంది. ఈ బాటిల్లో 600 జీ/వీఎస్ తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్ ఉంటుంది. ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ధర రూ.44 లక్షలకు పైమాటే. ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్ స్ప్రింగ్స్–ఐస్లాండ్ హిమ నదీ నుంచి సేకరించిన ఈ నీటిని 750 మి.లీ పరిమాణంలో 24–క్యారెట్ల బంగారు బాటిల్లో అందిస్తారు. దక్షిణ కాలిఫోరి్నయాలోని పలోమర్ పర్వతం నుంచి సేకరించే బ్లింగ్ హెచ్20 ధర 2 లక్షల వరకూ ఉంది. నెవాస్ గ్లో–ఇన్–ది–డార్క్ బాటిల్ వాటర్ మాగ్నమ్ ధర దాదాపు రూ.1.32 లక్షలు. వంద శాతం సహజమట..! వందలు వేలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఈ నీరు వంద శాతం సహజ నీరు, ఫ్రాన్స్లోని ఏవియన్–లెస్–బెయిన్స్ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదని నిర్థారించినవి. విరాట్ కోహ్లీ ప్రతి యేటా సుమారు రూ.4.3 లక్షల వరకూ ఈ నీటి కోసం వెచ్చిస్తాడని సమాచారం. (చదవండి: 'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ..అనుబంధాలకు ప్రతీక..!) -
'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ.. అనుబంధాలకు ప్రతీక..!
ప్రపంచంలో ప్రతి అనుబంధం ప్రత్యేకమైనది. అయితే, కొన్ని బంధాలు మన హృదయంలో శాశ్వత స్థానం ఏర్పరచుకుంటాయి. అలాంటి ఓ అపురూపమైన బంధం – సోదర సోదరీమణుల అనుబంధం. ఈ బంధాన్ని గౌరవించేందుకు, జరుపుకునేందుకు ప్రతి ఏప్రిల్ 10న మనం "సిబ్లింగ్ డే" ను నిర్వహిస్తాం. ఇది కేవలం ఒక ఇంటర్నేషనల్ సెలబ్రేషన్ కాదు, మన వ్యక్తిత్వ వికాసం, మన భావోద్వేగ పరిణతిలో తోబుట్టువుల పాత్రను గుర్తించి గౌరవించాల్సిన రోజు.మన భారతీయ కుటుంబ వ్యవస్థలో సోదర సోదరీమణుల బంధానికి గౌరవప్రదమైన స్థానం ఉంది. జీవితంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే మొదటి బంధం అమ్మానాన్నలతో అయితే, రెండోది తోబుట్టువులతో ఉన్న అనుబంధం. సోదర బంధం అనేది కేవలం కుటుంబ సంబంధం మాత్రమే కాదు, అది మన మానసిక అభివృద్ధిలో ఒక మూల స్థంభం. తోబుట్టువు అంటే కేవలం మనతో పుట్టిన వ్యక్తి కాదు, మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపించే వ్యక్తి.సోదర సంబంధాల మానసిక ప్రభావంఇతరులతో సురక్షితమైన అనుబంధం ఏర్పరచుకోవడం (secure attachment) మానసిక నిర్మాణంలో చాలా ముఖ్యమైన అంశం. అది తల్లిదండ్రులతో ప్రారంభమైతే, తోబుట్టువులు దాన్ని స్థిరపరుస్తారు. బాల్యంలో తోబుట్టువులతో ఉన్న అనుబంధం జీవితంలో బలహీనతల్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.ఒక తమ్ముడు అన్న బాటలో నడుస్తాడు, ఒక అక్క చెల్లెల్ని అల్లారుముద్దుగా పెంచుతుంది. ఈ అనుబంధం conflicting emotionsను సహజసిద్ధంగా ఎదుర్కొనటానికి ఒక విస్తృత ప్రయోగశాలలా మారుతుంది. అదే జీవితానికి సరిపడా సంస్కారాన్ని అందించే తొలి వేదిక.అనుబంధాల తొలి కిరణాలుబాల్యం అనేది మనసు మీద మొదటి ముద్ర వేసే దశ. ఈ దశలో తోబుట్టువులతో కలసి గడిపిన క్షణాలు – మన జీవితానికి పునాదిలా ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ చేతినుంచి తొలి ముద్ద కోసం పోటీ పడిన సంఘటనలు, అమ్మానాన్నను ఫేవరెట్ అనిపించుకునే కుతూహలాలు, కలిసి తినడం, ఆడటం, తిరగడం – ఇవన్నీ కలిసి మనలో భావోద్వేగ నిబంధనలు (emotional rules) రూపుదిద్దుకుంటాయి. తోబుట్టువులు మనకు పాఠశాలలో చదవని పాఠాలు నేర్పుతారు. సహనం, సహకారం, పోటీ, సమన్వయం, పంచుకోవడంలాంటివి సహజసిద్ధంగా నేర్పుతారు. ఈ విలువలే ఎమోషనల్ హెల్త్ కు మూలం.సైకాలజీ దృష్టిలో, ఇది Social Referencing Phase. పిల్లలు తోబుట్టువుల ద్వారా – ఎలా స్పందించాలి? ఎలా సహనం వహించాలి? ఎలా స్పందన కనబర్చాలి? అనే మౌలిక విలువలు నేర్చుకుంటారు.విభేదాలు – మనస్సు ఎదిగే అవకాశాలువాస్తవానికి, తోబుట్టువుల మధ్య విభేదాలు లేకపోవడం అసాధ్యం. బాల్యంలో తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, అలుగుతాం, మాట్లాడకుండా ఉండిపోతాం. కానీ ఆ విభేదాల్ని ఎలా నిర్వహించామన్నదే మన భావోద్వేగ సామర్థ్యాన్ని (emotional intelligence) నిర్ధారిస్తుంది. మంచి సోదర బంధం ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎదురయ్యే ఘర్షణలను సులువుగా నిర్వహించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని అధ్యయనాలు చెప్తున్నాయి.ముఖ్యంగా కౌమారంలో, అంటే టీనేజ్ లో వ్యక్తిత్వం విస్తరించటం మొదలవుతుంది. ఈ సమయంలో siblings మనకు ఒకరిపై ప్రేమ, ఒకరిపై అసూయ, ఒకరిపై గౌరవం, మరొకరిపై స్వార్థం అనే విరుద్ధ భావాల్ని అనుభవించే అవకాశం ఇస్తారు. ఇది complex emotions ని సరిగా అర్థం చేసుకునే దశ. ఇదే emotional literacy కు శిక్షణ అందించే వేదిక.అనుబంధాల పునర్నిర్మాణంవృద్ధాప్యానికి దగ్గరయ్యే దశలో – siblings మనసులోని మాటను పంచుకునే ఆత్మీయులుగా మారిపోతారు. తల్లిదండ్రులు మిగలకపోయినా, తోబుట్టువులే మనకు మిగిలే స్నేహితులు. జీవితపు అనుభవాలు, భిన్న దారుల్లో నడిచిన ప్రయాణాలు వేరువేరైనా, చివరకు చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనమే మనల్ని మళ్ళీ కలిపేస్తుంది. సైకాలజీ పరంగా ఇది Emotional Reconnection Phase. ఇది మన attachment history ని తిరిగి సవరించే అవకాశం. గతంలో జరిగిన దోషాలను అంగీకరించి, ప్రేమతో మళ్ళీ కలిసే బంధాన్ని పునఃస్థాపించుకోవచ్చు.ఈ రోజు ఏం చేయాలి? ఇప్పుడు జీవితాలన్నీ వేగంగా మారుతున్నాయి. ఉద్యోగాలు, వ్యక్తిగత బాధ్యతలు, టెక్నాలజీ వల్ల కొందరిలో మానవ సంబంధాలు పెళుసుబారాయి. అనేకమంది తోబుట్టువులతో విభేదాల వల్ల దూరమైపోయి గిల్ట్ (guilt), శూన్యత (emptiness), లేదా మానసిక వ్యథను అనుభవిస్తూ ఉంటారనేది సైకాలజిస్ట్ గా నేను గమనించిన విషయం. అలాంటివారు ఈ రోజును భావోద్వేగం పునరాగమనానికి (emotional reconciliation) అవకాశంగా వినియోగించుకోవాలి. అందుకే ఈరోజు... • మీ సోదరుడికి / సోదరికి ఒక ఆత్మీయ సందేశం పంపండి.• చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేయండి.• సంబంధం తెగిపోయి ఉంటే, పునఃసంధానానికి ప్రయత్నించండి.• మీ బిడ్డల్లోనూ సోదర బంధం పట్ల గౌరవం పెరగాలంటే – మీరు మీ సోదర సంబంధాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వాళ్లు గమనిస్తుంటారని తెలుసుకుని మసలుకోండి.ఒక చెల్లెలి ప్రేమకు ప్రపంచ నివాళిక్లౌడియా ఎవర్ట్, న్యూయార్క్కి చెందిన మహిళ, తన సోదరి లిజా మరియు సోదరుడు అలాన్ను చిన్న వయసులోనే కోల్పోయారు. ఆ కోల్పోయిన బంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి ఏప్రిల్ 10 (లిజా పుట్టిన రోజు)ను సిబ్లింగ్ డేగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 1995లో Sibling Day Foundation ను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఈ భావనను వ్యాపింపజేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ రోజును ఒక ప్రేమ సూచికగా, బంధాలను గుర్తచేసుకునే రోజుగా పాటిస్తోంది. సైకాలజిస్ట్ విశేష్+91 8019 000066www.psyvisesh.com -
ఏసీ లేకున్నా ఎంత హాయి!
వేసవి వచ్చిందంటే చాలు... ఫ్యాన్ నాన్ స్టాప్గా తిరగాల్సిందే. ఏసీ ఎప్పుడూ పని చేయాల్సిందే. కరెంట్ బిల్లు భారం సంగతి ఎలా ఉన్నా... ఏసీల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బెంగళూరుకు చెందిన వారణాసి సత్యప్రకాష్ ‘వారణాసి హౌజ్’ను సృష్టించాడు. ఏసీ అవసరం లేకుండానే ఈ ఇల్లు చల్లగా ఉంటుంది. ఇంటి నిర్మాణం విషయానికి వస్తే... హీట్ ట్రాపింగ్ సిమెంట్ గోడలకు బదులుగా బోలు మట్టి బ్లాకులను ఎంచుకున్నాడు. ఇవి ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రిస్తాయి. వేసవిలో ఇంటిని చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఫ్రెంచ్ కిటికీల వల్ల తగినంత వెంటిలేషన్ ఉంటుంది. ఇంటి రూపకల్పనలో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, భూగర్భ జలాలను రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపల కొలను, నీటి ప్రవాహాలు, బావి ఉన్నాయి. కారు షెడ్కు దగ్గరలో అందమైన పూలతోట... వర్షపు నీటిని భద్రపరిచే ఏర్పాటు కూడా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ కూలింగ్ అవసరం లేకుండా రెడ్ ఆక్సైడ్ ఫ్లోర్స్, పైన్ వుడ్ ఇంటీరియర్స్, నేచురల్ చిమ్నీ... మొదలైనవి కనిపిస్తాయి.‘క్రాస్ వెంటిలేషన్, డిస్ప్లేస్మెంట్ వెంటిలేషన్ సూత్రాలను మిళితం చేసి ఇంటికి రూపకల్పన చేశాం’ అంటున్నాడు సత్యప్రకాష్. (చదవండి: మామయ్య ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!) -
మామయ్య ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!
మా మామయ్యకు 65 ఏళ్లు. ఆయనకు బీపీ, షుగర్ చాలా కాలంగా ఉన్నాయి. సంవత్సరం క్రితం పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని చెప్పారు. ఇక్కడే నరాల డాక్టర్కి చూపిస్తున్నాం. కొన్ని రోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. మా అత్త గారిని విపరీతంగా అనుమానిస్తున్నారు. ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వస్తే వాళ్ళకి, మా అత్తగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. అలాగే రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోకుండా మధ్యలో లేచి బయటకు, ఇంట్లోకి తిరుగుతున్నారు. మాకు ఎవరికీ కనపడని మనుషులు ఆయనకు కనపడుతున్నారు. ఈమధ్య అనుమానం నా మీద కూడా మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళని బయటకు వెళ్ళనీయట్లేదు. మా ఆయనకి చెప్తే వాళ్ళ నాన్నను మందలించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రవర్తనతో, మాటలతో మాకు నరకం కనిపిస్తోంది. – భానుప్రియ, మదనపల్లెమీరు రాసిన దాన్ని బట్టి మీ మామ గారికి గతంలో ఎప్పుడూ మానసిక సమస్యలు లేవు, బీపీ, షుగర్ మాత్రమే ఉన్నాయి, ఈ మధ్యే పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని తెలుస్తోంది. మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం స్థాయి తగ్గినప్పుడు పార్కిన్సన్ జబ్బు, అదే డోపమైన్ పెరిగినపుడు ‘సైకోసిస్’ జబ్బు వస్తుంది. పార్కిన్సన్ జబ్బులో డోపమైన్ రసాయనం స్థాయి తగ్గడం వల్ల చేతులు వణకడం, నిదానంగా నడవడం, శరీరంలో కదలికలు తగ్గడం లాంటివి జరుగుతాయి. మందులు వాడినపుడు డోపమైన్ లెవల్స్ పెరిగి వారిలో ఈ లక్షణాలు మెరుగవుతాయి. ఐతే ఇలా మందులు వాడే వారిలో కొందరికి అనుమానాలు, భ్రాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనపడతాయి. దీనికి ప్రధాన కారణం డోపమైన్ లెవెల్స్ అవసరానికి మించి పెరగడం. మీ మామ గారి విషయంలో జరిగింది కూడా ఇదే! కనుక ముందు మీ న్యూరాలజిస్ట్ని కలిసి మందులు తగ్గిస్తారో లేదా మారుస్తారో కనుక్కోండి. అలా కుదరని పక్షంలో సైకోసిస్ లక్షణాలు తగ్గడం కోసం కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉండి ‘యాంటీ సైకోటిక్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా మందులు వాడినప్పుడు పార్కిన్సన్ జబ్బు లక్షణాలు కొంత పెరగవచ్చు కూడా! అందుకే హాస్పిటల్లో డాక్టరు పర్యవేక్షణలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవడం మంచిది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కావాలని ఇదంతా చేయడం లేదని గ్రహించండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని మానసిక వైద్యున్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) (చదవండి: 'ట్విన్టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!) -
'ట్విన్టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేలా చదవడం అత్యంత అరుదు. ఎక్కడోగానీ అలా జరగదు. ఒకవేళ్ల ఇద్దరూ మంచి ప్రతిభావంతులైనా కూడా ఒకేలా మార్కులు సాధించడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి. కానీ ఈ ట్విన్స్ ఇద్దరూ ఒకేలా మార్కులు సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. తమ పుట్టుకే కాదు..ప్రతిభలో కూడా ఒకేలా సత్తాచాటుతామని అంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అంతేకాదండోయ్ పది నుంచి ఎంబీబీఎస్ వరకు దాదాపు ఒకేలా మార్కులు సాధించడం విశేషం.ఆ కవలలే రహిన్, రిబాలు. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగారు ఇద్దరు. తమ కుటుంబంలోని తొలి వైద్యులు కూడా వీరే. తమ మామ ఈ రంగంలోకి రావడానికి ఆదర్శం అని చెబుతున్నారు ఇద్దరు. వీరిద్దరూ వడోదరలోని GMERS మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇద్దరూ ఫైనల్ ఎగ్జామ్స్లో ఒకేలా 66.8% స్కోర్ సాధించి అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఆ కాలేజ్ హాస్టల్ గదిలో ఒకే రూమ్లో కలిసి చదువుకున్నారు. తామిద్దరికి ఎంబీబీఎస్ సీటు వేర్వేరు కాలేజీల్లో వచ్చినా..2019లో గోత్రిలోని వైద్య కళాశాలలోనే ఇద్దరం జాయిన్ అయ్యాం అని చెబుతున్నారు ఇద్దరూ. తమ ఇంటికి చేరువలోనే ఆ కాలేజ్ ఉంటుందన్నారు. అలాగే నగరానికి వచ్చి ఒంటరిగా చదవడం కూడా ఇదే మొదటిసారని కూడా చెప్పారు. తమ తల్లి, తాతా, మామల ప్రోద్భలంతో ఈ ఘన విజయాన్ని సాధించామని చెబుతున్నారు. ఇక రిబా, రహిన్లు తమ అమ్మ కలను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇక వారిద్దరి విద్యా నేపథ్యం చూసినా..చాలా ఆశ్యర్యం కలిగిస్తుంది. పదిలో రిబా 99%, రహిన్ 98.5%తో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్లో ఒకరు 98.2%, మరొకరు 97.3% కాగా, NEET-UGలో ఇరువురు 97%, 97.7% మార్కులు సాధించారు. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇతర మెరిట్ ఆధారిత ఆర్థిక సహాయం ద్వారా ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా చదువుకున్నారు ఇద్దరు.ఇక రహిన్ ప్రసూతి అండ్ గైనకాలజీ వంటి సర్జికల్ బ్రాంచ్లో, రిబా ఇంటర్నల్ మెడిసిన్లోనూ కొనసాగాలనుకుంటున్నారు. అంతేగాదు ఇద్దరు అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారు. తామిద్దరం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చామని చెబుతున్నారు. తమ కెరీర్ జర్నీ చాలా అద్భుతంగా సాగింది..అదే సక్సెస్ని ప్రతి విషయంలోనూ కొనసాగిస్తామంటున్నారు ఈ ట్విన్ సిస్టర్స్.(చదవండి: మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..) -
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
భారతదేశంలో ఇష్టమైన చిరుతిండి అనగానే చెప్పేది పానీపూరి. ఇదంటే పెద్దలే కాదు.. చిన్న పిల్లలకు యవతకు ఎంత ఇష్టమో తెలిసిందే. మంచి స్ట్రీట్ ఫుడ్గా మహా ఫేమస్. అలాంటి ఈ వంటకం ప్రస్తుతం ఆరోగ్య పరంగా మంచిది కాదని తినొద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం అపరిశుభ్రంగా తయారు చేయడమే. అందుకు గతంలో ఎన్నో సంఘటనలు సాక్ష్యంగా నిలిచాయి. అంతేగాదు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కొన్ని రాష్ట్రాల్లో ఈ చిరుతిండి అమ్మకాలను నిషేధించారు కూడా. ముఖ్యంగా ఈ పానీపూరీలో వినయోగించే మసాలా నీరు కోసం కలుషితమైన నీటిని వినియోగించడంతోనే అసలు చిక్కు అంతా వచ్చిపడుతోంది. ప్రస్తుతం ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..ఈ వంటకం అసలు ఎలా వచ్చిందో..? దీన్ని ఎవరూ తయారు చేశారో తెలిస్తే విస్తుపోతారు. మరీ ఆ కథేంటో చూద్దామా..!పానీ పూరి పురాతన భారతదేశంలో 16 మహాజనపదాల కాలంలో ఉద్భవించిందని చెబుతున్నారు పాకశాస్త్ర నిపుణులు. మొదట్లో స్వీట్ రూపంలో వచ్చి.. ఇలా మసాలతో తయారు చేయడం జరిగిందనేది వాదన. బిహార్ దీని జన్మస్థలంగా చెబుతుంటారు. అంతేగాదు దీనికి మహాభారతం కనెక్షన్ కూడా ఉందంట. ద్రౌపది పాండవులను వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చినప్పుడూ.. ఆమె పాక నైపుణ్యంపై పరీక్ష పెట్టిందట కుంతీదేవి. ఆమెకు తగినంత పూరీ పిండి, కొన్ని బంగాళ దుంపలు, మసాలా దినుసులు ఇచ్చి.. తన కుటుంబానికి సరిపడా రుచికరమైన వంటకం చేయాలని చెప్పింది కుంతీదేవి. అయితే ఆమె ఇచ్చిన పిండి తన భర్తలు ఐదుగురు, అత్తకు సరిపడేలా చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే భీముడి ఎంత తింటాడో తెలియంది కాదు. మరి ఆ కొద్ది మొత్తం పిండితో ఎలా అని ఆలోచించి ద్రౌపది చిన్న చిన్న పూరీలలా గట్టిగా వచ్చేలా చేసిందట. సహజంగా నీళ్లుతాగితే కడుపు నిండిపోతుంది. ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కుదరదు. ఎలాగో గట్టిగా కరకరలాడే ఈ పూరీలను తినాంటే.. మాములు కూరతో సాధ్యం కాదు. అదే నీళ్ల మాదిరి రసం లాంటి దానితో తింటే..కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందరికీ సరిపెట్టొచ్చు అని భావించి ఆమె మసాలాలన్నింటిని కలపి చక్కటి పలుచటి రసంలా తయారు చేసిందట. ఆ తర్వాత ఈ పూరీల మధ్యలో చిల్లుపెట్టి ఈ మసాలా నీటిని పోసి సర్వ్ చేసి అందరికి వచ్చేలా చేసిపెట్టిందట ద్రౌపది. ఆమె తెలివికి అబ్బురపడి నా కోడలు చాలా తెలివైనదని తెగ మురిసిపోయిందట కుంతీదేవి. ఈ కథ నిజమా? కాదా? అనేందుకు సరైన ఆధారాలు లేకపోయినా..పరిస్థితులు సవ్యంగా లేనప్పుడూ ఇంట్లో ఉన్నవాటితో రుచికరంగా అందరికీ సరిపడేలా వంట చేయడం ఎలాగో తెలియజెబుతోంది. పైగా కాబోయే కోడళ్లకు ఇంటిని ఎలా చక్కబెట్టాలో తెలియజేస్తుంది. చివరగా పానీపూరీ మాత్రం స్ట్రీట్ సెంటర్లలో కాకుండా ఇంట్లోనే ఈజీగానే చేసుకునే పలు విధానాలు వచ్చేశాయి. అవి తెలుసుకుని హాయిగా నచ్చిన ఫుడ్ ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉందాం..!. ఇంటి వంటే ఆరోగ్యం అని విశ్వసిద్దాం.(చదవండి: అందాల పోటీలో 'సీపీఆర్' స్కిల్ టెస్ట్..! భారత్ 72వ మిస్ వరల్డ్లో..) -
అందాల పోటీలో 'సీపీఆర్' స్కిల్ టెస్ట్..!
అందాల పోటీలు అనగానే ఏముంటాయి. వారి ఫిట్నెస్, విలక్షణమైన ఫ్యాషన్ వంటి పోటీలు నిర్వహిస్తారు. చివరగా వారిలో దాతృత్వం గుణాలు కొద్దిమొత్తంలోనైనా ఉన్నాయా..?. వారి దృష్టిలో అందం అంటే భౌతికమైనదే అనే తరహాలో ముఖాముఖి పరీక్షలు ఉంటాయి. కానీ అందానికి కూడా ఓ పర్పస్ ఉండాలంటూ వినూత్నంగా నిర్వహించేలా సరికొత్త పోటీకి తెరతీసింది ప్రపంచ సుందరీగా టైటిల్ని గెలుచుకున్నా మిల్లా మాగీ. ప్రతిసారిలా ఓ మూసధోరణిలో పోటీలు కాకుండా గొప్ప స్కిల్తో కూడిన పోటీ ఉండాలంటోంది. అందానికి కూడా ఓ అర్థం, పరమార్థం ఉండాలంటోంది. కేవలం కళ్లప్పగించి చూస్తుండిపోయేలా.. వావ్! అని ఆశ్యర్యచకితులని చేసేది అందం కానే కాదంటోదామె. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..మిస్వరల్డ్ ఇంగ్లాండ్ పోటీలో ఈ సరికొత్త రౌండ్ కాంపిటీషన్ని కండక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇది మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ టైటిల్ హోల్డర్ మిల్లా మాగీ ఆలోచన నుంచి వచ్చిందట. పోటీలను అధునికరించేలా ప్రభావవంతమైన నైపుణ్యాలు కూడా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ సీపీఆర్ స్కిల్ని ప్రవేశ పెట్టారు. అందాల పోటీల్లో సాధారణంగా ఉండే అన్ని రౌండ్ల పోటీలు ఉంటాయి. అయితే చివరి రౌండ్లో పోటీదారులకు మాత్రం సీపీఆర్ స్కిల్టెస్ట్ నిర్వహిస్తారు. అంతేగాదు మిస్ ఇంగ్లాండ్ పోటీలో సెమీ ఫైనల్కు చేరుకున్న పోటీదారులంతా ఇంగ్లాండ్ అంతటా నగరాల్లో సిపిఆర్ ఎలా చేయాలో పిల్లలకు బోంధించే కార్యక్రమాల్లో పాల్గొన్సాల్సి ఉంటుంది. ఫైనల్కి చేరుకున్న సుందరీమణులకు స్విమ్ రౌండ్లో ఈ సీపీఆర్ టెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన భారత్లోని హైదరాబాద్లో జరగనున్న 72వ మిస్ వరల్డ్పోటీల్లో కూడా ఈ రౌండ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు మిల్లా మాగీ ఇన్స్టాగ్రాంలో పేర్కొంది. మాగీ దీన్ని తన బ్యూటీ విత్ పర్పస్ అనే ప్రాజెక్ట్లో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ ఎందుకంటే..మిల్లా మాగీ తన తాతలు, తండ్రులను ఈ సీపీఆర్ స్కిల్ తెలియకే కాపాడుకోలేకపోయారట. తమ కుటుంబంలో ఎవ్వరికీ దీనిపై అంత అవగాహన గానీ నిర్వహించడం గానీ తెలియకపోవడంతో అంతటి విషాదాన్ని చవిచూడాల్సి రావడంతో ఇలా ప్రాజెక్టు చేపట్టి మరీ అవగాహన కల్పిస్తోందామె. ఒక రకంగా పోటీదారులంతా ఈ కాంపిటీషన్ కోసం అయినా..సీపీఆర్ స్కిల్ గురించి తెలుసుకుంటారు. ఎలా చేయాలో ఆన్లైన్ సెషన్లు లేదా వ్యక్తిగత వైద్య నిపుణులను సంప్రదించి నేర్చుకునే యత్నం చేస్తారంటోందిఈ బ్యూటీ క్వీన్.ఇక మాగీ ఇంగ్లాండ్లోని పాఠశాలల్లో సిపిఆర్ శిక్షణను తప్పనిసరి చేయాలంటూ పోరాటం చేస్తోంది. "గో విత్ సిపిఆర్" అనే నినాదంతో ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తుల రక్షించడం ఎలా అనేదానిపై విద్యార్థులకు అవగామన కల్పిస్తోంది. ఈ నినాదం ఓ రేంజ్లో ఊపందుకుంది. ఎంతలా అంటే.. ప్రిన్స్ విలియం సైతం ఆమెకు మద్దతు తెలిపారు. తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ ఇన్ ఇండియా పోటీ డైరెక్టర్ ఎంజీ బిస్లీ కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఓ లేఖను కూడా పంపారు. పైగా ఆమె వల్లే తాను ఈ సీపీఆర్ చేయడం నేర్చుకున్నాని అన్నారు. ఆమె ప్రాజెక్టు వైవిధ్యాన్ని తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీదారులకు తెలియజేస్తానన్నారు. ప్రాణాలను రక్షించే ఈ నైపుణ్యం ఎంత గొప్పదో తెలియజేసే.. స్విమ్పోటీకి వారంతా ముందుకొచ్చేలా చేస్తానన్నారు. అంతేగాదు ఈ ఏడాది అందాల పోటీల్లో ఇదే హైలెట్గా ఉంటుందని అన్నారు బీస్లీ. చివరగా మాగీ మాట్లాడుతూ.. అందానికి ఒక ప్రయోజనం ఉండాలని చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంతలా అందర్నీ హత్తుకునేలా ఊపందుకోవడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని అంటోందామె. View this post on Instagram A post shared by Milla Magee (@milla.magee__) (చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..) -
ఫ్రూట్స్తో.. బీకేర్ఫుల్..!
వేసవి సీజన్ వచ్చిందో లేదో అప్పుడే మార్కెట్లో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయి. మామిడి పండ్లేనా.. సీజనల్ స్పెషల్ వాటర్మెలన్, మరోవైపు ద్రాక్ష, ఆల్ సీజనల్ ఫేవరెట్ అరటి ఇలా అన్నిరకాల పండ్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆరోగ్యం కోసం ఇష్టంగా కొనుగోలు చేసే పండ్లు ప్రమాదకర రసాయనాలను ఇంట్లోకి.. మన ఒంట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ సీజన్లో మాత్రమే దొరికే మామిడి పండ్లు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి నగరవాసులది. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రతి ఏడాది మరింత పెరుగుతూనే ఉండటం నగర జీవన శైలిని ఆందోళనకు గురిచేస్తోంది. సహజసిద్ధంగా విటమిన్లు, ప్రోటీన్లు తదితర పోషకాలను అందించే ఫలాలే ప్రజల అనారోగ్యానికి కారకాలుగా మారుతున్న నేపథ్యంలో అసలు మంచి పండ్లను ఎలా గుర్తించాలి అనే అంశంపై ఆరా తీస్తున్నారు నగరవాసులు. వేసవిలో పండ్లను ఎక్కువ ఆస్వాదించడానికి చాలా కారణాలున్నాయి. ఈ సీజన్లో మాత్రమే లభించే పండ్లు ఎక్కువగా అందుబాటులో ఉండటం, వేసవి తాపానికి డీహైడ్రేషన్ నుంచి సంరక్షించుకోవడానికి పళ్ల రసాలను తాగుతుంటారు. దీన్ని అదనుగా భావించి, మార్కెట్ డిమాండ్కు సరిపడా సరఫరా అందించడమే లక్ష్యంగా కొందరు వ్యాపారులు ప్రమాదకర పంథాను ఎంచుకుంటున్నారు. సహజసిద్ధంగా పండ్లను మగ్గించడానికి బదులు కృత్రిమ పద్ధతిలో రసాయనాలను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్షియం కార్బైడ్ వంటి విషపూరిత రసాయనాలను పండ్లు మగ్గించడానికి వాడుతున్నారు. ఈ పదార్థం అనారోగ్యాలకు కారణమని, దీంతో పండ్లను మగ్గించవద్దని గతంలోనే హైకోర్టు నిషేధించింది. అయినప్పటికీ మార్కెట్ అవసరాల కోసం కొందరు వ్యాపారులు ఈ రసాయనాలను వాడుతూనే ఉన్నారు. ఓ వైపు నగరంలో పరిశుభ్రత లేకుండా కత ఆహారాన్ని అందిస్తున్న రెస్టారెంట్లతోనే భయపడుతున్న సిటీజనులను ఈ పండ్ల పరిస్థితి మరింత భయపెడుతోంది. దీన్ని నివారించడానికే నగరాల్లో ఫుడ్ సేఫ్టీ విభాగం పలు నిబంధనలు అమలు చేస్తోంది. అనుమతి మేరకు ఇథిలిన్ ఛాంబర్స్ వినియోగించేలా సూచనలిచ్చింది. ఈ ఛాంబర్స్లో 72 గంటల్లో కాయలు పండ్లుగా మారే విధానంలో హార్మోన్లు సమపాళ్లలో ఉంటాయి. వీటితో పాటు ఇథోపాన్ అనే షాచెట్స్తో పండ్లను మగ్గించడానికి అనుమతి ఉంది. ఈ మధ్య కాలంలో సహజసిద్ధంగా పండించిన పండ్లను ఎలా గుర్తు పట్టాలనే అంశాలపై నగరవాసులు ఆరా తీస్తున్నారు. కొందరైతే గూగుల్, యూట్యూబ్లో ఏఐని అడుగుతున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సహజపద్ధతిలో వండిన ఫలాలు కమ్మని, తియ్యటి వాసనతో ఉంటాయని నిపుణులు, ఆర్గానిక్ రైతులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ పండ్లపై నల్లటి మచ్చలు కనిపిస్తాయని, అన్నిసార్లు అందంగా ఉన్న పండ్లే ఆరోగ్యకరమైనవని అనుకోవద్దని సూచిస్తున్నారు. ఫలాలను తెంపిన కాడ తాజాగా కాకుండా వాడిపోయనట్టు, సహజసిద్ధంగా పండించడం వల్ల ఈ పండ్లపై కాసింత గడ్డిపొట్టు, సన్నని బూజు కనిపిస్తాయి.తీవ్ర అనారోగ్య సమస్యలు ముఖ్యంగా హైదరాబాద్ నగర కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాలతో సతమతమవుతున్న నగరవాసులకు కృత్రిమంగా పండ్లను మగ్గించడానికి వినియోగించే కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదక రసాయనాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. యువతకు కూడా ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా హృదయం, కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రిప్పెనింగ్ రసాయనాలు ఫలాలపై తొక్క మాత్రమే పండేలా చేస్తాయి. ఫలితంగా పండ్ల లోపలి గుజ్జు్జ పూర్తిగా పండకుండానే మార్కెట్లోకి అమ్మకానికి వస్తుంటాయి. వీటిని తినడం వల్ల వాంతులు, నీరసం, చర్మ సమస్యలు, విపరీతమైన దాహం, నోటిలో నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. చిన్నపిల్లలు, గర్భిణులకు ఈ పండ్లు మరింత ప్రమాదకరం. కాల్షియం కార్బైడ్ ఉత్పత్తి చేసే ఎసిటలీన్ మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీసి జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుందని పరిశోధనలు స్పష్టం చేశాయి. సహజంగా మగ్గించిన పండ్లను గుర్తుపట్టాలంటే.. ఒక బకెట్లో నీరు నింపి అందులో మార్కెట్లో కొన్న పండ్లను వేస్తే.. సహజంగా పండించిన ఫలాలు నీటి అడుగు భాగానికి చేరుకుంటాయి. ప్రమాదక రసాయనాలతో మగ్గించినవి మాత్రం నీటిపైకి తేలుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు వ్యాపారులు వేడి చేసిన కాల్షియం కార్బైడ్ నీళ్లలో పండ్లను ఉడకబెట్టి కృత్రిమంగా మగ్గిస్తుంటారు. ఇలాంటి విధానాల్లో పండ్లు వాటి ఆకారాన్ని కోల్పోయి గుండ్రంగా మారుతాయి. అంతేకాకుండా రసాయనాలతో పండించినవి తాజాగా, చర్మం నిగనిగలాడుతూ కనిపిస్తాయి. ఈ ఫలాలు వాటి సహజమైన రుచిని చాలా వరకు కోల్పోతాయి. ఈ ఫలాలపై ఆకుపచ్చ, బ్రౌన్ కలర్లో మచ్చలను గుర్తించవచ్చు. ఈ మధ్య కాలంలో పలువురు రైతులు సహజసిద్ధంగా పండ్లను పండించి, వాటిని పెద్ద పెద్ద వాహనాల్లో భారీ స్థాయిలో నగరానికి తరలించి అమ్ముతున్నారు. (చదవండి: Coconut Fiber Matress: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..) -
చిన్న పిల్లలను విడువని కేన్సర్ భూతం..!
కేన్సర్..కేన్సర్..కేన్సర్ ఈ మాట వింటుంటేనే గుండెలు గుభేలమంటున్నాయి. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఈ మహమ్మారిపై చర్చిస్తున్నారు. గతంలో వందల్లో ఒకరికో..ఇద్దరికో కేన్సర్ సోకేది. ప్రస్తుతం ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. మారుతున్న జీవన శైలి, తినే ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జన్యుపరమైన లోపాలు. ఇవన్నీ కేన్సర్ భూతం వికటాట్టహాసానికి దారితీస్తున్నాయి. గత మూడు దశాబ్దాలలో కేన్సర్ బాధితుల సంఖ్య 79 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల నుంచి వయసు మీరిన వారి వరకు అందరిని ఈ భూతం కబలిస్తోంది, ఆ మూడు ఆసుపత్రుల్లో..నగరంలోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, ఎంఎన్జే ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం సగటున ప్రతి లక్ష మందిలో 3,865 మంది కేన్సర్ బాధితులు ఉన్నారు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్, పేగు, జీర్ణశయ, కాలేయ వంటివి దాదాపు వందుకు పైగా కేన్సర్ రకాలు ఉన్నాయి. పురుషుల్లో నోటి కేన్సర్, మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రాం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో 53,565 మందికి కేన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తునా్నరు. ఇందులో పురుషులు 24,857 మంది, మహిళలు 28,708 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.మహిళలల్లో ముప్పు ఎక్కువమహిళల్లో ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. ఎన్సీఆర్పీ నివేదికల ప్రకారం ప్రతి లక్ష మంది మహిళల్లో 2,151 మంది మహిళలు కేన్సర్ బాధితలుగా ఉన్నారు. అదే సమయంలో పురుషులు 1,714 మంది వ్యాధి భారినపడుతున్నారు. బాధితుల్లో అత్యధికంగా 35.5 శాతం మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్కు గురవుతున్నారు. పురుషుల్లో నోటి కేన్సర్ 13.3 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ 10.9 శాతం మంది బాధపడుతున్నారు. 14 ఏళ్ల లోపు వయసు గల మిలియన్ మంది పిల్లల్లో ఏడాదికి సరాసరిన 94 మంది కేన్సర్ బారినపడుతున్నారు. ఇందులో అబ్బాయిలు 55 మంది ఉండగా, ఆడపిల్లలు 39 మంది ఉంటున్నారు.పొగాకుతో ప్రాణ గండం..కేన్సర్ బాధితుల్లో పొగాకు వాడకం వల్ల వ్యాధికి సోకిన వారు పురుషుల్లో 42 శాతం మంది ఉండగా అందులో నోటి కేన్సర్ 31 శాతం మంది, నాలుక 19 శాతం మంది, ఊపిరి తిత్తుల 26 శాతం ప్రధానంగా ఉన్నాయి. మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు పీల్చడం వల్ల కేన్సర్ వస్తుందని నిర్ధారించారు. ఇందులో 30 శాతం మంది ఊపిరితిత్తులు, 22 శాతం మంది నోరు, 17 శాతం మంది నాలుక కేన్సర్తో బాధపడుతున్నారు.కేన్సర్ రావడానికి కారణాలుశారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఊబకాయం కలిగి ఉండడం, రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగిపోవడం, ఉప్పు అధికంగా ఉండే అహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడకం, మద్యం సేవించడం, వారసత్వంగా కూడా కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. రేడియేషన్ ప్రభావం, పర్యావరణ కాలుష్యం కూడా కేన్సర్లకు దారితీస్తున్నాయి.అందుబాటులో అత్యాధునిక చికిత్సలు..కేన్సర్కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు (సీఎక్స్ఆర్, యూఎస్జీ, సీటీ, ఎమ్మారై, పీఈటి), బయాప్సీలు వంటి పరీక్షలతో కేన్సర్లను గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చు.పిల్లల్లో జెనిటిక్, పర్యావరణం, తినే ఆహారం, డీఎన్ఏ డిస్టర్బ్ కావడం వలన కేన్సర్ వస్తుంది. బ్లడ్, కిడ్నీ, లివర్, కన్ను, ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. పెద్దల్లో వెంట్రుక, గోరు తప్ప మిగతా అన్ని శరీర బాగాల్లోనూ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మం కందిపోవడం, మచ్చలు రావడం, జ్వరం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, హెమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతులో బ్లీడింగ్ ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్ మొదటి రెండు దశల్లో ఉంటే 80 శాతం పైగా బాధితులకు నయం అవుతుంది.--స్నేహ సాగర్, మెడికల్ అంకాలజిస్టు, జీవీకే హెల్త్ హబ్(చదవండి: వెయిట్లాస్కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్గేట్స్ ఏమన్నారంటే..) -
వెయిట్లాస్కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
ఆరోగ్యపరంగా భారంగా మారిన సమస్య అధిక బరువు(ఊబకాయం). ఇదే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటానికి ప్రధాన కారణమని పదే పదే హెచ్చరిస్తున్నారు నిపుణులు. చెప్పాలంటే ఇదే సర్వత్రా హాట్టాపిక్గా మారింది. ఎందుకంటే బరువు తగ్గడం అంత ఈజీకాదు. పైగా ప్రస్తుత ప్రజల జీవన విధానం..అందుకు తగ్గట్టుగా ఉన్న ఒత్తిడులు, ఆందోళనలు వెరసీ బాడీపై ధ్యాస పెట్టే ఛాన్సే లేదు. అందువల్లే ఇది జఠిలమైన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం "బరువు తగ్గించుకుందాం..ఆరోగ్యంగా ఉందా" అని పిలుపునిస్తూ అవగాహన కల్పించే యత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ కోవలోకి ప్రపంచ కుభేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కూడా చేరారు. ఏం చేస్తే బరువు తగ్గగలరు అనే అంశం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!.ఎంటర్ప్రెన్యూర్ రాజ్ షమానీ పాడ్కాస్ట్, ఫిగరింగ్ అవుట్లో బరువు తగ్గడం అనే అంశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. "ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. డబ్బుతో పరిష్కరించ లేని సమస్య ఇది. నేను ప్రధాని మోదీని కలసినప్పుడూ ఈ విషయం గురించే చర్చించాం. యోగా ఆధారిత ఆసనాలతో ఎలా తగ్గించుకోవచ్చో చెప్పారు మోదీ. కానీ ఆ దిశగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం లేదని, ఇంకా ఏ దేశం కూడా పూర్తి స్థాయిలో మార్పుకి సిద్ధపడలేకపోతోందని చెప్పారాయన. అయితే నేను జీవశైలిలో మార్పులను విశ్వసించనప్పటకీ....వైద్య ఆవిష్కరణలే కీలకపాత్ర పోషిస్తాయని ప్రగాఢంగా నమ్ముతా. ప్రస్తుతానికి మధుమేహం కోసం అభివృద్ధి చేసిన మందులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్న బాధితుల్లో ఓ ఆశను రేకెత్తిస్తోంది. ఈ జీఎల్పీ-1 అనే మధుమేహ మందులు ఈ సమస్యకు కొంతమేర శాస్త్రీయ పరిష్కారాన్ని అందించాయి. త్వరలో అందరికి అందుబాటులోకి వచ్చేలా చౌక ధరలలో లభించనున్నాయి. "అని అన్నారు బిల్గేట్స్. కాగా, ఈ డయాబెటిక్ మందులు ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో, జెప్బౌండ్ వంటివి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయి, తినాలనే కోరికను నివారిస్తాయనేది పరిశోధుకుల వాదన. ఇక GLP-1 అనేది మన శరీరంలో జీర్ణక్రియ, ఆకలి నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మందులు ఆకలని నిర్వహించడంలో చాలా బాగా హెల్పవుతాయని అంటున్నారు నిపుణులుఏదీఏమైనా జీవనశైలే ముఖ్యమైనది..వైద్య ఆవిష్కరణల కంటే దీర్ఘకాలిక బరువు నియంత్రణలో ప్రధానమైనది జీవనశైలేనని నొక్కి చెబుతున్నారు నిపుణులు. అయితే అందరూ లైఫ్స్టైల్ అనగానే భయపడిపోతున్నారని చెప్పారు. శరీరాన్ని మొత్త కష్టపెట్టకపోయినా..కనీసం కొద్దిపాటి కదలికలకు చోటు ఇస్తే మంచిదంటున్నారు. దీంతోపాటు కొద్దిపాటి ఆరోగ్య చిట్కాలు..పాటించాలి. నమలి నమిలి నెమ్మదిగా తినడం..శరీరానికి వేడి కలిగించేపదార్థాలు తీసుకోవడం.. తదితరాల ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు నిపుణులు. చివగా మోదీ, బిల్గేట్స్ ఇరువురు ఊబకాయం అనేది కేవలం వైద్యపరమైన సమస్య కాదని, వాళ్ల వాళ్ల సంస్కృతి ఆచారాలతో ముడిపడి ఉన్న లోతైన సమస్యగా అభివర్ణించారు. అయితే దీన్నుంచి బయటపడాలంటే మాత్రం రోజువారీ దినచర్య బ్రషింగ్లా జీవనశైలిలో మార్పులు కూడా భాగమైతేనే బరువు తగ్గడం సాధ్యమని నొక్కి చెప్పారు ఇరువురు. View this post on Instagram A post shared by Figuring Out with Raj Shamani (@figuringout.co) (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..) -
శిలా నిశ్శబ్దం..! శిధిలమైనా..కళతో ప్రాణం పోశారు..
తెలంగాణ వారసత్వ సంపద, సాంస్కృతిక వైభవం, కళలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కళాయజ్ఞ బృందం, టార్చ్ సంస్థ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. గత చరిత్ర వైభవాన్ని, విశిష్టతను తెలియజెప్పే మాధ్యమాలుగా ఎన్నో పుస్తకాలు, ఆడియో, వీడియో, గ్రంథాలు ఇలా అనేక రూపాల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడి నేలపై ఘన చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్యపు విశిష్టత, కళా సాంస్కృతిక వైభవం, ఈ కట్టడాలు, శిల్పాలపైనే ప్రతిబింబించి ఉంది. కానీ మన చరిత్రలో భాగమైన పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరి వాటి వాస్తవ రూపాలను, కళను కోల్పోనివి ఎన్నో ఉన్నాయి. ఆ శిల్ప కళ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది, వాటి సంరక్షణ, పరిరక్షణ ఎంత వరకూ అవసరం అనే నేపథ్యంలో కళాయజ్ఞ బృందం, టార్చ్ సంస్థ ఆధ్వర్యంలో శిథిలమైన పురాతన కట్డడాలు, ఆలయాలు ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టేలా లైవ్ స్కెచింగ్, పెయింటింగ్స్ గీశారు. ఈ ప్రాజెక్టులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా 50 మంది కళాత్మక నైపుణ్యం కలిగిన సభ్యులు కాకతీయుల అద్భుత కట్టడాల పరిస్థిని లైవ్స్కెచింగ్, పెయింటింగ్ ద్వారా ఈ తరానికి తెలియజేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జనవరి నెల్లో పెద్దపల్లి జిల్లా మంథనిలోని చెంద్రవెళ్లి దేవాలయాలు, ఘనపురం కోటగుళ్లు, రామప్ప దేవాలయాలకు టార్చ్ కళాయజ్ఞలో భాగంగా కళాత్మక రూపాన్ని అందించారు. శిథిలావస్థలో ఉన్న ఇక్కడి సాంస్కృతిక కళా వైభవానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. కొందరు ఆర్టిస్టులు ఈ కళాసంపద శిథిలం కాకముందు ఎలా ఉండేదో అని ఊహాజనిత చాత్రాలను సైతం గీశారు. ఈ చిత్రాలను ‘శిలా నిశ్శబ్దం’ పేరుతో ఈ నెల 12 నుంచి 14 వరకూ మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రయత్నానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. చరిత్రకు సాక్ష్యాలుగా.. కళా సంపద పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేలా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కళాకారులు వినూత్న పంథాను ఎంచుకున్నారు. కళా వైభవమున్న ఆ ఆలయాల వద్దకే వెళ్లి ధ్వంసమైన ఈ నిర్జీవ కళలను వారి కళాత్మక రేఖలతో ఈ తరానికి చేరువ చేశారు. అంతేకాకుండా ఈ కళా ప్రయోగాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో పోలిస్తే కాకతీయులకు సంబంధించి తెలియని ఘన చరిత్రే ఎక్కువ. ఈ మేరకు అన్వేషణ కొనసాగిస్తున్న కళాయజ్ఞ–టార్చ్ బృందం తమ పరిశోధనలో వెలుగులోకి వచ్చిన సమాచారాన్ని భద్రపరిచి ముందుతరాలకు అందిస్తుంది. కోలి్పయింది ఎంతైనా.. మిగిలుంది ఈ తరానికి ఘనమైనవారసత్వ సంపదే. దానిని భవిష్యత్ తరాలకు మరింత భద్రంగా అందించాల్సిన భాధ్యత అందరిపైనా ఉంటుంది. దశాబ్దాల క్రితమే వైభవంగా.. అద్భుతమైన వారసత్వ కళా సంపదకు నెలవు ఈ తెలంగాణ నేల. ఎన్ని దండయాత్రలు జరిగినా ఇప్పటికీ సగర్వంగా అప్పటి కళా వైభవాన్ని ప్రదర్శిస్తున్నాయి ఆ రూపాలు. కానీ సంరక్షణ, భద్రత లేకపోవడంతో శిథిలావస్థలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఒక కళాకారుని దృష్టి, కళాత్మక కోణం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మేమంతా కలిసి ఈ ప్రాజెక్ట్ చేపట్టి, ఆ చిత్రాలను ‘శిలా నిశ్శబ్దం’గా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నాం. ప్రస్తుతం విదేశాలు గొప్పగా ఉన్నాయని చర్చించుకుంటాం.. కానీ శతాబ్దాల క్రితమే మన నేల యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా ఉందనే సత్యాన్ని మన శిల్పకళ చెబుతోంది. ఆ ఆనవాళ్లను కాపాడుకుందాం. – శేషబ్రహ్మం, ప్రముఖ చిత్ర కళాకారులు (చదవండి: Cleanest City: మరో ఇండోర్లా.. భాగ్యనగరం కాగలదా..?) -
మరో ఇండోర్లా.. భాగ్యనగరం కాగలదా..?
ఆ నగరం.. ఒకప్పుడు చెత్త కుప్పలతో నిండి ఉండేది, విచ్చలవిడిగా పందులు, కుక్కలు తిరుగుతుండేవి.. వాటి విసర్జన కుప్పలు ఈగల సమూహాలతో వీధులు నిండిపోయేవి.. ఇలాంటి అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల మధ్య నుంచి.. తనను తాను మార్చుకుంటూ.. కొత్తగా మలుచుకుంటూ ఇప్పుడు అత్యంత పరిశుభ్ర నగరంగా అవతరించింది ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా.. ఇండోర్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఈ స్థానంలో మన హైదరాబాద్ నగరం కూడా చోటు దక్కించుకోగలదా? దేశంలోని 471 పట్టణాలు, నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరం అనే అవార్డును ఎనిమిది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం గెలుస్తూనే ఉంది. ఇదే ఇండోర్ నగరం 2017కి ముందు, పరిశుభ్రత ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉంది. దీనికి కారణాలేమిటి? మన ఇండియాలోనే ఉన్నామా? ‘మనం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పుడు, రోడ్డు చూడగానే భారతదేశంలో లేమేమో అనిపిస్తుంది, అంత పరిశుభ్రంగా ఉంటుంది అని నగరం నుంచి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం తరచూ ఇండోర్కు రాకపోకలు సాగించే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నితీష్ అంటున్నారు. మన నగరంలో పలు కుటుంబాలు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. కానీ ముందు తలుపు నుంచి కొన్ని అడుగుల దూరంలో చెత్త కుప్పలుగా పోగుబడి ఉంటుంది. ‘ఆ కుప్ప ప్రాంతం వేరొకరి బాధ్యతగా భావిస్తారు. దీంతో తమ పరిశుభ్రమైన ఇంటికి దుర్వాసనతో కూడిన ఆ చెత్త కుప్ప మీదుగా వెళ్లడంలో ఎవరూ ఎటువంటి ఇబ్బందీ పడరు’ అయితే ఇండోర్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఇండోర్ ‘విజయ’విశేషాలు.. క్లీన్ టూ విన్.. పేవ్మెంట్లు, రోడ్ డివైడర్లు రీసైకిల్ చేసిన నీటి గొట్టాలను కలిగి ఉంటాయి. అక్కడి చెత్త వ్యాన్లు ఇండోర్ నంబర్ వన్గా మారింది అనే జింగిల్ను పదే పదే ప్లే చేస్తుంటాయి. ఆ శబ్దం తమను సమీపిస్తుండగానే జనం తమ ఇళ్లలో నుంచి తమ చెత్త బుట్టలతో బయటపడతారు. అతి చిన్న సందులో ఉండే వేలాది విభిన్న రంగుల డబ్బాల నుంచి వ్యర్థాలను తొలగించి, శుద్ధి చేసే విధానం అమలు చేసేందుకు దాదాపు 850 మంది పారిశుధ్య సిబ్బంది సైన్యం తరహాలో సిద్ధంగా ఉంటుంది. ఇవీ కీలకాంశాలు.. జీపీఎస్ ట్రాకింగ్ ఉపయోగించి, ఓ ప్రత్యేక బృందం చెత్త వ్యాన్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, వారు తమ పనిని నిర్ధేశించిన విధంగా చేస్తున్నారో లేదో సునిశితంగా పరిశీలిస్తారు. గృహస్థుల వ్యర్థాలను తడి, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, నాన్ప్లాస్టిక్, బయోమెడికల్, ప్రమాదకర పదార్థాలుగా విభజన జరుగుతుంది. వ్యర్థాలను ఇంధనంగా, కంపోస్టుగా మార్చి రైతులకు ఎరువుగా విక్రయిస్తున్నారు. చాలా రెస్టారెంట్లు మొబైల్ కంపోస్టింగ్ వ్యాన్లను రెస్టారెంట్స్ బయట ఉంచుతాయి. పండ్లు, కూరగాయల మార్కెట్లో వివిధ రకాల వ్యర్థాల కోసం వేర్వేరు డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. అక్కడ ఒక యంత్రం కూడా ఉంది. ఇది వ్యర్థాలను సిటీ బస్సుల కోసం వాడే, అలాగే వంటకు ఉపయోగించే ఇంధనంగా మారుస్తుంది. తమ నగరం పరిశుభ్రత పరంగా దేశంలోనే నెంబర్ వన్ అనే టైటిల్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఒక ఇంధనంగా మారింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని పాఠశాల విద్యార్థులు ప్రతి రోజూ ప్రతిజ్ఞ చేస్తారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త వేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానాలు విధించడం లాంటి కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరిశుభ్రత పోటీలను నిర్వహిస్తున్నారు. మతపరమైన గ్రంథాలను ఆధారం చేసుకుని, పరిశుభ్రత అవసరాన్ని తలకెక్కించడానికి, మత పెద్దలను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేశారు. హోలీ వంటి పండుగల సందర్భంగా, వీధులు, భవనాలు రంగులతో తడిసినప్పుడు, అదనపు వాహనాలు నీటి ట్యాంకర్లు నగరాన్ని శుభ్రం చేయడానికి శరవేగంగా బయటకు వస్తాయి. ప్రజలు ప్రభుత్వాలు తలచుకుంటే ఇండోర్ విజయాన్ని మన నగరంలో కూడా పునరావృతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘స్వచ్ఛందంగా ముందుకొచ్చే ప్రజానీకం, దృఢమైన చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఉంటే తరతరాలుగా వస్తున్న కొన్ని ‘చెత్త’ అలవాట్లు మారతాయి’ అంటున్నారాయన. (చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..) -
65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?
సాధారణంగా పెద్దవయసులోని వారు పడిపోయారనీ, బాత్రూమ్లో జారిపడ్డారనీ... లాంటి మాటలుతరచూ వినవస్తూ ఉంటాయి. దాదాపు 65 ఏళ్లు దాటిన చాలామంది ఇలా పడిపోతుంటారనే న్యూస్ వింటుండటం మామూలే. పెద్దవారు ఇలా పడిపోతుండటం వల్ల ఒక్కోసారి ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), తలకు గాయాలు (హెడ్ ఇంజరీస్) కావడం లాంటి అనర్థాలెన్నో జరుగుతుంటాయి. వీటిల్లో బాత్రూముల్లో జారిపోవడం మినహాయించి మిగతాచోట్ల పడిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. పెద్దవాళ్లు అలా ఎందుకు పడిపోతుంటారో, అందుకు రకరకాల కారణాలేమిటో, వాళ్లు అలాపడిపోవడాన్నినివారించడమెలాగో చూద్దాం. ప్రస్తుతం మనదేశంలో 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ల సంఖ్య 15 కోట్లు. అంటే మొత్తం జనాభా అయిన 140 కోట్లలో దాదాపు 10.5% మంది పెద్దవాళ్లే. వీళ్లలో దాదాపు 60 నుంచి 70 ఏళ్ల వాళ్లలో 25–30 శాతం మంది పడిపోతూ ఉండగా... 70 నుంచి 80 ఏళ్ల మధ్యవాళ్లలో పడిపోయే వారి శాతం 35%గా ఉంది. మామూలుగా పదిమందిలో ఆరుగురు ఇండ్లలోనే పడుతుంటారు. పడిపోవడం మెల్లగానే పడిపోయినట్లు కనిపించినా ఆ పడటం తాలూకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఉదాహరణకు అలా పడినప్పుడు మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘సబ్డ్యూరల్ హిమటోమా’ అంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఇక తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిపోయి మంచానికే పరిమితం కావడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అప్పుడప్పుడూ పెద్దవారే కాదు... కొందరు మధ్యవయస్కులూ పడిపోవడం ఇటీవల సాధారణంగా జరుగుతోంది. ఇలా పడిపోడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలివే... కొందరు పెద్ద వయసువారిలో వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ల పాదాల్లో స్పర్శ కొంతమేర తగ్గవచ్చు. దాంతో తాము పడి΄ోతున్నామనే సంగతి కూడా వాళ్లకు తెలియకుండానే వాళ్లు పడిపోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రతతో పాటు మజిల్ మాస్ కూడా క్రమంగా తగ్గుతూ పోతుంది. దాంతో కండరాల్లోని శక్తి కూడా క్షీణించడంతో పడిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలోనూ కొన్ని మార్పులు రావడం కారణంగా పడిపోవడాలు జరగవచ్చు. పెరుగుతున్న వయసుకు తగ్గట్లు చూపు మందగించడం, వినికిడి శక్తి కూడా క్షీణించడం వంటి అంశాలు కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు కావచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో నిటారుగా నిలబడి ఉండే శక్తి తగ్గుతుంది. వయసు పెరిగిన పెద్దవాళ్లు పడిపోకుండా ఉండటానికి ప్రకృతి ఆ వృద్ధుల్ని కాస్త ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. పడి΄ోయేవాళ్లలో ఇలాంటివాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు గుండె / మెదడు / శరీరంలోని ఇతర అవయవాలు లేదా వివిధ వ్యవస్థల్లోని ఆరోగ్య సమస్యలు నయం కావడం కోసం వాళ్లు వాడే మందుల కారణంగా కూడా వాళ్లు తూలిపడిపోయే ప్రమాదమూ ఉంటుంది. కొన్నిసార్లు నరాలకు సంబంధించిన కారణాలతోనూ పడిపోయే అవకాశాలుంటాయి. ఒక్కోసారి కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే పెద్దవయసు వారు మాట్లాడుతూ నడవకూడదు. నడుస్తూ మాట్లాడకూడదు. వృద్ధాప్యంలో పడిపోవడానికి కారణమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యలుపోష్చరల్ హై΄ోటెన్షన్ (లో బీపీ) : అకస్మాత్తుగా బీపీ తగ్గిపోయే కండిషన్ ఇది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా శరీరంలోని ద్రవాలూ లేదా ఖనిజ లవణాల మోతాదులు తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. అలాగే కొందరిలో ఏదైనా మందు/ఔషధం తీసుకోగానే ఇలా జరగడానికి అవకాశముంది. ఒక్కోసారి పెద్దవాళ్లు తాము కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు అకస్మాత్తుగా బీపీ పడిపోవచ్చు. ఇలాంటప్పుడు బీపీ 20 హెచ్జీ/ఎంఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు చేరాల్సిన రక్తం మోతాదులు కాస్తా అకస్మాత్తుగా తగ్గడం వల్ల పడిపోవచ్చు. కొందరు నిలబడి మూత్రవిసర్జన చేసేవాళ్లలో ఆ సమయంలోనూ లేదా కొందరిలో అకస్మాత్తుగా దగ్గు రావడం వల్ల కూడా ఒక్కోసారి బీపీ హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. సింకోప్ : కొందరు అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతూ, చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ముఖంలో రక్తపు చుక్కలేనట్లుగా పాలిపోతారు. శరీరమంతా చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. దాంతో ఉన్నవారు ఉన్నట్టుగా అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి వాళ్లలో కొందరు ఒక్కోసారి తమ మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా అకస్మాత్తుగా కళ్లు తిరుగుతూ పడిపోవడాన్ని ‘సింకోప్’ అంటారు. మానసికంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మనకు అంతగా ఇష్టం లేని దృష్యాలనూ / అంశాలనూ చూసినప్పుడు (ఎవరైనా గాయపడటం లేదా రక్తస్రావం అవుతుండటం, ఇంకెవరైనా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటం వంటి తమకు ఆమోదం కాని అన్ప్లెజెంట్ విజువల్ స్టిములై కారణంగా) ఇలా జరగవచ్చు. వర్టిగో : ఒక్కోసారి కొందరిలో కళ్లు తిరిగినట్లుగా అయి΄ోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్ స్టెమ్లో ఉన్న వ్యాధుల కారణంగా ఇలా జరగడానికి అవకాశాలెక్కువ. ఫిట్స్ : ఒక్కోసారి కొందరిలో ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) : ఒక్కోసారి కొందరిలో తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ కండిషన్ను వైద్య పరిభాషలో ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ అంటారు. అకస్మాత్తుగా పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు. పార్కిన్సన్ డిసీజ్ : ఈ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లలో వణుకు కారణంగా శరీరానికి సరైన బ్యాలెన్స్ లేకపోవడంతో పడిపోవడం జరుగుతుంది. వీళ్లలో శరీరం కదలికలు నెమ్మదించడం వల్ల కూడా వారు పడిపోయే ప్రమాదముంటుంది. వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయినప్పుడు. దేహంలో సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాలూ లేదా చక్కెర మోతాదులు తగ్గిపోయినప్పుడు. చాలా అరుదుగా మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్ వంటి అంశాలు కూడా పడిపోడానికి కారణాలు కావచ్చు. అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించండి ఇలా...పడిపోవడానికి సరైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే... పడుకున్నవారు / కూర్చున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడి΄ోవడం జరుగుతున్నా అలా ఉన్నపళంగా లేవడం సరికాదు. పడుకున్న వారు తాము పక్క నుంచి లేస్తున్నప్పుడు మొదట మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ... ఆ తర్వాత లేచి కూర్చుని... అప్పుడు మెల్లగా నిల్చోవాలి. కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిలబడాలి. ఆరోగ్య కారణాల వల్ల ఇలా పడిపోయే మెడికల్ హిస్టరీ ఉన్నవారు అందుకు కారణాన్ని తెలుసుకోడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా. అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలుంటే అవేమిటో తెలుసుకుని, తగిన చికిత్స తీసుకోవాలి. ఉపకరణాలు వాడటం : అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమయ్యే ఉపకరణాలు... అంటే చేతికర్ర (వాకింగ్ స్టిక్) / వాకర్ / కళ్లజోడు వంటివి దూరంగా పెట్టుకోకుండా, ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కాస్తంత పెద్ద వయసు మహిళలు హైహీల్స్ తొడగడం సరికాదు. తమకు సురక్షితంగా ఉండే ఫ్లాట్ హీల్ పాదరక్షలు వాడాలి. కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం చాలా రకాల పడి΄ోవడాలను (ఫాల్స్ను) నివారిస్తాయి.ఇతరత్రా మరికొన్ని మార్గాలివి... చాలా సార్లు పడిపోవడం అన్నది ఇండ్లలోనే జరుగుతుంటుంది. అందువల్ల ఇంటివాతావరణాన్ని పెద్దవారికి ఫ్రెండ్లీగా మార్చడం చాలా మేలు చేస్తుంది. పడకుండా నివారిస్తుంది. ఇందుకు చేయాల్సిన కొన్ని పనులు... నాన్స్టిక్ మ్యాట్స్ వాడటం. ఫ్రిక్షన్ బాగా ఉంటే ఫ్లోరింగ్ వేయించడం. కాలుజారనివ్వని కార్పెట్స్ పరవడం. గదిలో మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవడం. టాయిలెట్స్, బాత్రూమ్స్లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్రూమ్ బయట కాలుజారనివ్వని మ్యాట్స్ వాడటం మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎక్కకుండా ఉండటం...వంటి జాగ్రత్తలతో పెద్దవారు పడిపోయే ప్రమాదాలను నివారించవచ్చు.పడిపోయే అవకాశాలు ఎవరిలో ఎక్కువ... చిన్న చిన్న అడుగులు వేస్తూ, రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు.చికిత్స ఫాల్ క్లినిక్స్ : ఇటీవల చాలా ఆసుపత్రుల్లో ‘ఫాల్ క్లినిక్స్’ ప్రారంభిస్తున్నారు. వీటిలో పడి΄ోయిన వాళ్లకు ఇవ్వాల్సిన చికిత్స అందిస్తుంటారు. పడిపోయాక తలకు దెబ్బతగిలినప్పుడు తక్షణం న్యూరో సర్జన్ చేత చికిత్సలు అందించాల్సిన అవసరముంటుంది. ఫ్రాక్చర్స్ వంటివి అయితే ఆర్థో నిపుణులతో చికిత్స అందించాల్సి ఉంటుంది. -
నైట్షిఫ్టుల్లో పనిచేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
ఇటీవల చాలామంది నైట్ డ్యూటీలు చేస్తున్నారు. గతంలో కేవలం కొద్దిమంది స్థానంలో ఇటీవల అమెరికా టైమ్కు తగ్గట్లుగా పనిచేయాల్సి రావడంతో రాత్రిళ్లు పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతిరోజూ పగలు పనిచేసి, రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్ షిఫ్ట్లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. లేక΄ోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలెక్కువ. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులేమిటో చూద్దాం. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారికి సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఉదాహరణకు అవి... ఛాతీలో మంట, అజీర్ణం, మలబద్ధకం, ఆకలి తగ్గడం వంటి గాస్ట్రోఇంటస్టినల్ సమస్యతో పాటు రక్త΄ోటు, గుండెజబ్బులు, యాంగై్జటీ, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి వంటివి రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారిలో కాస్తంత ఎక్కువగా కనిపించవచ్చు.బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ..నైట్ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లలో బరువు పెరిగి స్థూలకాయం (ఒబేసిటీ) వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇందుకు కారణాలు ఏమిటంటే... సాధారణంగా పగటి డ్యూటీలు చేసేవారు రాత్రంతా నిద్ర΄ోవడం వల్ల మళ్లీ ఉదయం వరకు భోజనం తీసుకోరు. కానీ రాత్రి డ్యూటీలు చేసేవారు రాత్రంతా మెలకువతో ఉండాల్సి రావడంతో మధ్య మధ్య ఆకలేస్తూ ఉంటుంది. దాంతో రాత్రివేళ్లలోనూ తినాల్సి వస్తుంటుంది. సాధారణంగా ఇలా రాత్రి వేళల్లో తినే ఆహారం కాస్తా మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసేవారు తీసుకునే అసమతౌల్య ఆహారపు అలవాట్ల (అన్ బ్యాలెన్స్డ్ డయటరీ ΄ాటర్న్) కారణంగా ఒకపక్క కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం, మరో పక్క శారీరక శ్రమ లేక΄ోవడంతో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆ ఒబేసిటీ కారణంగా వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులు (హెల్త్ రిస్క్లు) ఎక్కువే. అలాంటి ముప్పు రాకూడదంటే ఆహారపరంగా పాటించాల్సి సూచనలివి... రాత్రివేళల్లో ఉద్యోగాలు / పనులు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారికి వచ్చేందుకు అవకాశమున్న చాలా రకాల ఆరోగ్య సమస్యలనూ, ఇతరత్రా ముప్పుల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అందుకు అనువైన ఆహారపు అలవాట్లు ఇవి... æ నైట్షిఫ్టుల్లో పనిచేయడానికి వెళ్లేవారు... డ్యూటీకి వెళ్లే ముందర భోజనం చేసి వెళ్తుంటారు. వాళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ ఉండాలి. చిన్న పరిమాణంలో తీసుకునే ఆహారాలు జీర్ణం కావడం తేలిక. దాంతో చాలారకాల గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు తేలిగ్గా నివారితమవుతాయి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉండాలి. పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆఫీసుల్లోని వెండింగ్ మెషిన్, కాఫెటేరియా వద్ద లభ్యమయ్యే ఆహారపదార్థాలకు సాధ్యమైనంతగా దూరంగా ఉండటమే మేలు. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే (హోమ్ మేడ్ ఫుడ్ను) తీసుకోవడమే మంచిది. ఒకవేళ కాఫెటేరియా ఫుడ్నే తీసుకోవాల్సి వస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... తాజా పండ్లు, సలాడ్స్, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే ఉదాహరణకు...పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోవడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్) వంటి ఆహారాలను వీలైనంతవరకు తీసుకోక΄ోవడమే మేలు. రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (అంటే... క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్, పాస్తా, పిజ్జాలు, కూల్డ్రింక్స్) వంటి వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. రాత్రివేళ పనిచేస్తుండేవారు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి కాసంత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్ ముప్పు ఉంటుంది. కాబట్టి నైట్ షిఫ్ట్లో తరచూ నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. నైట్ షిప్టుల్లో పనిచేసేవారు కాఫీ, టీ లు చాలా ఎక్కువగా తాగుతుంటారు. నిద్రరాకుండా ఉండటానికీ అలాగే బ్రేక్ సమయాల్లో ఇలా టీ, కాఫీలు తాగడం చాలా సాధారణం. అయితే వాటికి వీలైనంతగా తగ్గించాలి. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడల్లా నీళ్లు తాగుతుండటం మేలు. రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు వ్యాయామాలకు దూరంగా ఉంటారు. రాత్రంతా డ్యూటీ చేయడంతో పొద్దున్నే ఇంటికెళ్లగానే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇక రాత్రి డ్యూటీకి వచ్చే తొందరలో వ్యాయామాలను వదిలేస్తుండటం కద్దు. అయితే ఇలాంటివాళ్లంతా తమ వర్క్షెడ్యూల్కు అనుగుణంగా రోజులోని ఏదో ఒక సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రాత్రి షిఫ్టుల్లో పని సమయంలో వారిని ఉత్సాహంగా ఉంచడానికి ఈ వ్యాయామం తోడ్పడుతుంది. పైగా వ్యాయామపు ఉత్సాహం వల్ల రాత్రి పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ఈ వ్యాయామాల వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే రాత్రి డ్యూటీల కారణంగా బరువు పెరగడమూ జరగదు. ఇదే వ్యాయామం రాత్రిపనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని (స్ట్రెస్ను) నివారిస్తుంది. దాంతో అధిక రక్తపోటు (హైబీపీ), డిస్లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి ముప్పులూ నివారితమవుతాయి. (చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..) -
ఎవరీ సోమాదాస్..? కోర్టులు ఆమె పోరాటాన్ని గౌరవించి మరీ..!
‘నేను బాగుంటే చాలు’ అనుకునే ఈ రోజుల్లో నలుగురి కోసం పోరాటానికి దిగడం మామూలు విషయం కాదు.పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామకంలో అవక తవకలున్నాయని 25,752 ఉద్యోగాలని తొలగించింది సుప్రీంకోర్టు – ఒక్క ఉద్యోగం తప్ప. ఆ ఉద్యోగం సోమా దాస్ది. ఈ బెంగాలీ టీచర్ తనకు ఉద్యోగం రానందుకు పోరాడింది. ఉద్యోగం రాని వాళ్ల కోసం పోరాడింది. ఈలోపు కేన్సర్ వస్తే దానిపై పోరాడింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాటాన్ని గౌరవించి ఉద్యోగాన్ని నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఈ తీర్పు వల్ల కూడా ఎందరో రోడ్డున పడతారని పోరాటానికి సిద్ధమైంది సోమాదాస్. ఇలా ఎవరున్నారని?‘మళ్లీ కొత్త ఓరాటం చేయాలేమో’ అంది సోమా దాస్.మొన్నటి ఏప్రిల్ 3వ తేదీకి ముందు, తర్వాత ఆమె జీవితం ఒకేలా ఉంది. ఎందుకంటే ఆమె ఉద్యోగం పోలేదు. కాని ఆమెతోపాటు ఉద్యోగంలో చేరిన వారంతా సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తు తెలియని స్థితిలో పడ్డారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇలా వెలువడటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. నియామకాల్లో ప్రతిభ చూపి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినవారు ఉన్నారు. వారి లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకు ఆ లిస్టు ఇచ్చి వారి ఉద్యోగాలను కాపాడాల్సింది’ అందామె. ఈ గొడవ 2016 నుంచి మొదలైంది. వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్యు.బి.ఎస్.ఎస్.సి.) 2016లో భారీగా పరీక్షలు నిర్వహించి స్కూల్, కాలేజీ స్థాయిలో చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు చేసింది. 25,725 మంది ఉద్యోగులు చేరారు. అయితే ఆనాటి నుంచి గొడవలు మొదలయ్యాయి. దొడ్డిదారిన చాలామంది ఉద్యోగాల్లో చేరారంటూ అర్హులైనవారు రోడ్డెక్కారు. నిరసనలు చేశారు. వారిలో సోమాదాస్ ముందు వరుసలో ఉంది. ‘నా పేరు మెరిట్ లిస్ట్లో ఉంది. కాని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నా బదులు ఎవరో దొంగ పద్ధతిలో చేరారు’ అని ఆమె కోల్కతా హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు నడుస్తుండగానే విపరీతంగా నిరసన ప్రదర్శనల్లో ముందు వరుసలో కనిపించింది. రోజుల తరబడి నిరాహార దీక్షల్లో కూచోవడం వల్ల ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో ఆమెకు కేన్సర్ వచ్చింది. అయినా సరే కేన్సర్తో పోరాడుతూనే తన కోసం, సాటి వారి కోసం పోరాటం చేసింది. ఇది కోల్కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్ దృష్టికి వచ్చి ఆయన ఆమెను కోర్టుకు పిలిపించారు. ‘ఇంకొక ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వానికి చెబుతాను. చేస్తావా?’ అని అడిగారు. ‘టీచర్ కావడం నా జీవిత లక్ష్యం’ అని కరాఖండీగా చెప్పింది సోమాదాస్. దాంతో 2022లో ఆమెకు బెంగాలి భాషను బోధించే టీచరుగా ఉద్యోగం వేయించారు జడ్జి. కాని అదే జడ్జి 2024, ఏప్రిల్ 12న మొత్తం నియామకాలు చెల్లవు అని తీర్పు చెప్పారు. కాని ఒక్క సోమాదాస్ ఉద్యోగం మాత్రం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళితే న్యాయమూర్తులు దేబాంశు, మహమ్మద్ షబ్బార్ కూడా ‘నియామకాలు చెల్లవు. సోమాదాస్ ఉద్యోగం ఉంటుంది’ అని తీర్పు చెప్పారు. కేసు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయమూర్తులు సంజీవ్ఖన్నా, సంజయ్ కుమార్లు తీర్పు చెప్తూ ‘ఉద్యోగాలు చెల్లవు. కాని సోమాదాస్ ఉద్యోగం కొనసాగుతుంది’ అన్నారు.ఇంతమంది న్యాయమూర్తులు సోమాదాస్కు వెన్నంటి నిలిచి ఆమె ఉద్యోగం కాపాడటం చాలా అరుదు. దానికి కారణం సోమాదాస్ నిరుపేద కుటుంబం నుంచి రావడం, న్యాయం కోసం వెరవక పోరాడటం, ఆమె అర్హతలన్నీ సరిగ్గా ఉండటం, కేన్సర్ వచ్చినా దానిపై పోరాడుతూ ఉద్యోగం కోసం పోరాటాన్ని కొనసాగించడం.దీనిని బట్టి పోరాటం చేసే వారికి... న్యాయం కోసం ఎలుగెత్తే వారికి గౌరవం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ పని చేయడానికి చాలామంది వెరుస్తూ ఉంటారు. ‘నా ఉద్యోగం ఉందని సంతోషంగా ఏమీ లేను. ఇన్నాళ్లలో ఎంతోమంది ఈ ఉద్యోగాల వల్ల స్థిరపడ్డారు. ఇప్పుడు వారి ఉద్యోగాలు పోతే కుటుంబాలను ఎలా నడుపుతారు. వారి న్యాయం కోసం ఏదైనా చేయాలి’ అంది సోమా దాస్. నిజమే. దాదాపు ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలంటే దొడ్డిదారిన చేరిన వాళ్ల కంటే నిజమైన అర్హతలతో చేరినవారు కుదేలవుతారు. ‘త్వరలో ఏదో ఒక దారి దొరుకుతుంది. మేం పోరాడతాం’ అంటోంది సోమాదాస్.కొందరు అలా ఉంటారు మరి. -
సచిన్ మెచ్చిన గుమ్మడికాయ చికెన్ కర్రీ..! ఉబ్బితబ్బిబైన మాస్టర్ చెఫ్
మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులను కలిసినా..వారికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దొరికినా..ఎంతో ఖుషీగా ఫీలవుతాం. అలాంటిది మనం కలలో కూడా కలిసే అవకాశం లేని ఓ ప్రముఖ సెలబ్రిటీ లేదా క్రికెట్స్టార్ లాంటి వాళ్లైతే ఇక ఆ మధుర క్షణాలు జన్మలో మర్చిపోం. మళ్లీ మళ్లీ ఆ క్షణాలు కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అలాంటి అరుదైన అనుభవమే ఈ మాస్టర్ చెఫ్కి ఎదురైంది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ని కలిసే అవకాశం రావడమే కాదు, అతనికి తన ప్రాంతం వంటకాలను రుచి చూపించే ఛాన్స్కొట్టేసింది. అసలు తాను ఇలాంటి ఓ అద్భుతం జరుగుతుందని ఎన్నడు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతోందామె. ఆ చెఫ్ మేఘాలయకి చెందిన నంబీ మారక్. ఆమె మాస్టర్ చెఫ్ రన్నరప్ కూడా. ఆమె షిల్లాంగ్లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్లను చూస్తూ పెరింగింది. అలాంటి ఆమెకు అనుకోని అవకాశం వరంలా వచ్చిపడింది. తనెంతో ఇష్టపడే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తమ రాష్ట్రాన్ని పర్యటించడానికి రావడం ఓ ఆశ్చర్యం అయితే..ఆయనకు స్వయంగా తన చేతి వంటే రుచిచూపించడం మరో విశేషం. చెఫ్ నంబీ సచిన్కి తన ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిధ్యం అందించింది. తన క్రికెట్ హీరోకి వండిపెట్టే ఛాన్స్ దొరికిందన్న సంబరంతో..ఎంతో శ్రద్ధపెట్టి మరీ వెజ్, నాన్వెజ్ వంటకాలను తయారు చేసింది. అవన్నీ ఇంటి వంటను మరిపించేలా రుచికరంగా సర్వ్ చేసింది. ఆ రెసిపీలలో.. వెటెపా (అరటి ఆకులలో ఉడికించిన మృదువైన చేప), కపా అండ్ గారో, గుమ్మడికాయ చికెన్(డూ'ఓ గోమిండా)..పితా అనే స్టిక్కీ రైస్ తదితరాలను అమిత ఇష్టంగా ఆరగించాడు సచిన్. వాటిన్నింటిలో సచిన్ మనసును మెప్పించని వంటకం మాత్రం గుమ్మడికాయ చికెన్ కర్రీనే కావడం విశేషం. ఇక చివరగా చెఫ్ నంబీ మాట్లాడుతూ.."గారో వంటకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు. ఇవి మా ప్రాంతంలోని ఒక్కో ఇంటి సంప్రదాయానికి సంబంధించిన ప్రసిద్ధ వంటకాలు. ఈ రెసిపీలని నిప్పుల మీద ఎంతో శ్రమ కోర్చి వండుతారు. అలాంటి అపురూపమైన వంటకాలను నా కిష్టమైన క్రికెటర్ సచిన్కి వండిపెట్టడం ఓ కలలా ఉంది. నిజంగా ఇది ఓ ట్రోఫీ గెలిచిన దానికంటే ఎక్కువ. "అని ఆనందపారవశ్యంతో తడిసిముద్దవుతోంది చెఫ్ నంబీ.(చదవండి: World Health Day: వ్యాధులకు చెక్పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!) -
వ్యాధులకు చెక్పెట్టి.. ఆరోగ్యంగా జీవిద్దాం ఇలా..!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్టే.. ప్రస్తుత జీవన శైలితో ప్రపంచ ఆరోగ్యం తిరోగమన బాట పడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రోగాలు పెరుగుతున్నాయని, ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లోనే గుర్తించింది. తొలిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటమే దీని ముఖ్యఉద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల దగ్గరకు పరిగెట్టడం కంటే ముందు జాగ్రత్త చర్యలతో ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎన్సీడీ–3.0 ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించేందుకు గత ఏడాది నవంబరులో ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0) కార్యక్రమం పేరుతో స్క్రీనింగ్ పరీక్షలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్తోపాటు, పలు రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే వైద్యం అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. 8,75,977 మందికి స్క్రీనింగ్ పరీక్షలు గుంటూరు జిల్లాలో 18 ఏళ్లు దాటిన జనాభా 17,50,399 మంది ఉన్నారు. వీరిలో 8,75,977 మందికి వైద్యసిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. వీరిలో మధుమేహం అనుమానితులు 23,103 మంది ఉండగా, 4,438 మందికి మధుమేహం ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే షుగర్తో 1,17,609 మంది చికిత్స పొందుతున్నారు. బీపీ అనుమానిత బాధితులు 23,294 మంది ఉండగా, 4,635 మందికి బీపీ ఉన్నట్లు నిర్ధారౖణెంది. ఇప్పటికే బీపీతో 1,33,419 మంది చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ అనుమానిత కేసులు 94 ఉండగా, క్యాన్సర్ ఉన్నట్టు ఆరుగురికి నిర్ధారౖణెంది. క్యాన్సర్ రోగులను గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. గుండె ప్రధానం శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. లబ్డబ్మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండెకోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు.బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి... శరీరంలో వచ్చే అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి, ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు.ఆరునెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, రక్తం కారటం, ఆకలిలేకపోటం, వాంతులు కావడం వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్ధం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, ఘగర్లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామక్రిష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు(చదవండి: రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్! బిల్గేట్స్ బెస్ట్ పేరెంటింగ్ పాఠం) -
Bill Gates : రాజ వంశం కాదు..సంపదలో వారసత్వానికి నో ఛాన్స్!
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని ఎంతో తాపత్రయంతో సంపాదిస్తుంటారు. కోట్లకొద్దీ ఆస్తులను కూడబెడుతుంటారు. ఒకవేళ పిల్లలకు చదువు అబ్బకపోయినా..ఏ చీకు చింతా లేకుండా దర్జాగా కూర్చుని తినాలనుకుంటారు. చాలామటుకు ధనవంతులైన తల్లిదండ్రులు ఇలానే ఆలోచిస్తుంటారు. కూర్చొని తింటే కొండలైనా కరిపోతాయనే పెద్దల నానుడిలా వారసత్వ సంపద, ఆస్తులు ఏరోజుకైనా కరిగిపోక మానవు. అవేమి వారికి బతికే స్థైర్యానివ్వవు. కేవలం వాళ్ల కాళ్లమీద నిలబడి బతకగలిగే సామర్థ్యమే..పిల్లలకు శ్రీరామ రక్ష అనేది జగమెరిగిన సత్యం. ఆ సిద్ధాంతాన్నే విశ్వసిస్తానంటున్నారు ప్రపంచ కుభేరులలో ఒకరైన, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. అంతేగాదు ఇదేం రాజులనాటి కాలం కాదు..ప్రతిదీ వారసత్వంగా తీసుకోవడానికి అని ప్రశ్నిస్తున్నారాయన. పిల్లల్ని ప్రయోజకులుగా చేయండి చాలు అంటున్నారు బిల్గేట్స్. అదెలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇటీవల 'ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ' పాడ్కాస్ట్లో పిల్లల పెంపకం, వారి అభ్యున్నతికి సంబంధించి అమూల్యమైన విషయాలను షేర్ చేసుకున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులు సృష్టించిన సంపదను వారసత్వంగా పొందడం కంటే స్వయంగా సక్సెస్ అవ్వడానికి మొగ్గు చూపేలా చేయాలి. అదే వారి అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. పిల్లలు ఉన్నత స్థానంలో ఉంచడటం కాదు..ఉన్నతంగా ఆలోచించేలా పెంచాలి. తాతలు, తండ్రుల ఆస్తులు వారసత్వంగా పొందడం కాదు..వాళ్ల ఐడెంటిటీతో బతికి.. స్వయంగా సంపాదించేలా ఎదగనివ్వాలంటున్నారు. పిల్లలను ప్రయోజకులగా తీర్చిదిద్దడం అంటే ఇదేనని నొక్కి చెప్పారు. అంతేగాదు బిల్గేట్స్ తన ముగ్గురు పిల్లలు కూడా తన సంపదలో కేవలం ఒక్క శాతం ఆస్తికి మాత్రమే అర్హులని అన్నారు. సంపన్న కుటుంబాలు తమ పిల్లల ఎదుగుదల కోసం స్వయంకృషికే పెద్దపీటవేయాలన్నారు. వారికి మంచి చదువు, వసతులను అందిస్తే చాలు..పైకి రావాల్సిన బాధ్యత వారిదేనని చెప్పారు. అలా చేస్తేనే డబ్బు విలువ, కష్టం గొప్పదనం తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. తల్లిదండ్రులుగా మన పిల్లలపై మనకు అపారమైన ప్రేమ ఉంటుదనేది కాదనలేని సత్యం. కానీ ఆ ప్రేమ వారి ఎదుగుదలను కుంటుపడేలా చేయకూడదు. తమ పిల్లలు మంచి ప్రయోజకులు అయ్యి..సమున్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. వారు ఎదిగేందుకు అవకాశాలివ్వండే తప్ప ప్రతీది మనమే అమర్చిపెట్టేయకూడదని హితవు పలకారు. అలాగే వాళ్లకు ఇది తమతల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి.. తమది కాదనే భావన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి ఆశించడం అనే రోగం బారినపడకుండా పెంచాలని చెప్పారు. ఇక బిల్గేట్సకి తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్తో రోరీ గేట్స్, జెన్నిఫర్ గేట్స్ నాసర్, ఫోబ్ గేట్స్ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఆయన రూ. 13 లక్షల కోట్ల సంపాదనలో కేవలం ఒక్కశాతం మాత్రమే తన పిలల్లకు వాటా ఉంటుందని అన్నారు. తన పిల్లలు తండ్రికి ఉన్నంత సంపదను కలిగి ఉండకపోయినా.. ప్రపంచ జనాభాలో ఒక శాతం మంది ధనవంతుల సరసన ఉంటారన్నారు. తన మిగతా సంపాదనంతా ఫౌండేషన్కి వెళ్లిపోతుందని, అర్హులైన వాళ్లకు దక్కుతుందన్నారు. ఇలా బిల్గేట్స్లా వారసత్వ సంపదను అందించకూడదన్న జాబితాలో ఆపిల్ కంపెనీకి చెందిన దివంగత స్టీవ్ జాబ్స్, అమెజాన్ కంపెనీకి చెందిన జెఫ్ బెజోస్ వంటి అనేక మంది ప్రముఖ టెక్ దిగ్గజాలు ఉన్నారు. వారంతా కూడా వారసత్వ సంపదను సృష్టించడం పట్ల మక్కువ చూపలేదు..తమ పిల్లలు తమ ఐడెంటిటీతో ఎదగాలని భావించారు. నిజంగా ఇది ప్రతి తల్లదండ్రులు తెలుసుకోవాల్సిన గొప్ప పేరెంటింగ్ పాఠం కదూ..! (చదవండి: Weight loss Surgery: బరువు తగ్గాలని సర్జరీ చేయించుకుంది..పాపం ఆ మహిళ..!) -
177- 95 కిలోలకు!.. బరువు తగ్గడమే శాపమైంది.. చివరికి పాపం ఆమె..!
బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది. కానీ వర్కౌట్లు, డైట్లతో కష్టపడటం కంటే సులువుగా, త్వరితగతిన తగ్గిపోవడమే నచ్చుతోంది చాలామందికి. అందుకే వారంతా సర్జరీల బాట పడతున్నారు. అయితే ఆధుని వైద్య విధానం ఎంతలా అభివృద్ది చెంది..నిమిషాల్లో శరీరం స్లిమ్గా అయిపోయే కొంగొత్త వైద్య విధానాలు వచ్చినప్పటికీ.. అవన్నీ ప్రమాదకరమే అని నిపుణుల పదే పదే హెచ్చరిస్తూన్నారు. కానీ నాజుగ్గా అయిపోవాలన్న ఇంటెన్షన్తో వాటన్నింటిని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయన్నది అనవసరం అన్నట్లుగా..బరువు తగ్గే సర్జరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. పాపం అలానే చేసి ఓ మహిళ భారీ మూల్యమే చెల్లించుకుంది. తిరిగి మాములు మనిషి కావడానికి ఎంత నరకయాతన అనుభవించిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఏం జరిగిందంటే..యూకేకికి చెందిన 42 ఏళ్ల డేనియల్ పీబుల్స్ అనే మహిళ బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో 2023లో గ్యాస్ట్రిక్ స్లీవ్ అనే శస్త్ర చికిత్స చేయించుకోవాలనుకుంది. అయితే ఆ దేశ జాతీయ ఆరోగ్య సంస్థలు అందుకోసం ఏడేళ్లు నిరీక్షించాలని చెప్పాయి. బాబోయే అన్నేళ్లు వెయిట్ చేయడం ఏంటని.. టర్కీ వెళ్లి మరీ బరువు తగ్గించుకునే గ్యాస్ట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకుంది. నిజానికి ఆమె 177 కిలోల ఊబకాయం సమస్యతో బాధపడుతుంది. ఆమె తన బిడ్డకు పుట్టబోయే చిన్నారితో హాయిగా గడపాలంటే ఇంత భారీ కాయం పనికిరాదని భావించి ఈ శస్త్రచికిత్సకు రెడీ అయ్యింది. అనుకున్నట్లుగా ఈ సర్జరీతో ఆమె ఏకంగా 95 కిలోల బరువు గణనీయంగా తగ్గిపోయింది. డేనియల్ ఆనందానికి అవధులే లేకుండా పోయింది. సదరు టర్కీ ఆస్పత్రి యజమాన్యాన్ని కూడా ప్రశంసలతో ముచ్చెత్తింది. అంతా బాగానే ఉందనుకునేలోపే..రోజులు గడుస్తున్న కొద్దీ డేనియల్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తడం ప్రారంభమైంది. అది చివరకి బెడ్మీద నుంచి కాలు దించడానికే భయపడేంత పరిస్థితికి చేరుకుంది. అలా ఒకరోజు మెడ నుంచి కింద శరీరం అంతా చచ్చుబడిపోయి పక్షవాతం బారినపడింది. ఇక ఆమె తిరిగి నడవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. బరువు తగ్గానన్నా.. ఆనందం ఆవిరైపోయి..బతుకే భారంగా మారిందనే.. బాధతో విలవిలలాడింది. అసలు తనకు ఈ సమస్య ఎందుకు వచ్చిందో అని వైద్యులను ప్రశ్నించగా..ఈ బరువు తగ్గే సర్జరీ కారణంగా నరాల పనితీరుకి సంబంధించిన విటమిన్ లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. నరాల పనితీరు మెరుగవ్వడం అనేది అంత ఈజీ కాదు..అందువల్ల మళ్లీ తాను యథావిధిగా నడవడం అనేది సాధ్యమా..? అనేది చెప్పడం కష్టమని అన్నారు వైద్యులు. దాంతో ముందు తాను ఈ స్థితి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలే తప్పా..కుంగిపోకూడదని ఫిక్స్ అయ్యింది. ముందుగా నిపుణులైన వైద్యుల సమక్షంలో ఇంటెన్సివ్ చికిత్స తీసుకుంది. చివరకు ఆమె నరాల పనితీరు మెరుగై తిరిగి నడవగలిగేలా కింద ఉన్న ప్రతి అవయవంలో స్పర్శను తిరిగి పొందింది. చూస్తుండగానే..కొద్దిరోజుల్లోనే పూర్తిగా ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడింది. బరువు తగ్గాలనుకుంటే..అందుకు ఇంత మనోబాధను చెల్లించుకుంటానని కలలో కూడా ఊహించలేదని వాపోయింది డేనియల్.ఈ సర్జరీలు ఇంత ప్రమాదకరమా?గ్యాస్ట్రిక్ స్లీవ్ శస్త్రచికిత్స: దీనిని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కూడా అంటారు. ఇది బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్స (బారియాట్రిక్ సర్జరీ). ఈ శస్త్రచికిత్సలో కడుపును చిన్న అరటిపండు ఆకారంలోకి కుదించి.. ఆహారం తీసుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తారు. ఫలితంగా ఆయా వ్యక్తులు బరువు తగ్గడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో అప్పుడు పోషకాహార లోపం ఎదురవుతుంది. ఇది కాస్తా.. శరీరానికి తగినంతగా విటమిన్లు తీసుకోకపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా నరాల పనితీరుకు అవసరమై బీ విటమిన్ లోపం ఏర్పడి పలు ఆరోగ్య సమస్యల బారినపడటం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు.అక్కడైతే ఖర్చు తక్కువ.. విదేశాల్లో తక్కువ ధరలో ఊబకాయం శస్త్రచికిత్స చేయించుకోవచ్చని..చాలామంది అక్కడకు వెళ్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్ లాంటి దేశాల్లో ఇంకా చౌక. అంతేగాదు అక్కడ బ్రిటన్ వాసులు కూడా ఈ సర్జరీ చేయించుకుని పలు అనారోగ్య సమస్యల బారిన పడటం లేదా మరణించడం జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది ఈ శస్త్ర చికిత్స కోసమే సుమారు 5 వేల మందికి పైగా వ్యక్తులు విదేశాలకు వెళ్తున్నారని గణాంకాలు చెబుతున్నాయ్. తస్మాత్ జాగ్రత్త..!. ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు తగ్గి..ఆరోగ్యంగా ఉందాం..!.(చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?) -
ఆర్ట్ ఫెస్ట్.. అదిరేట్టు.. !
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కళాకారులతో, ఔస్తాహికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి అత్తాపూర్లోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్ వేదికగా నడుస్తున్న ఫెస్ట్లో 200 మందికి పైగా ప్రముఖ కళా కారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన కళారూపాలను ప్రదర్శించారు. ఇందులో 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండీషన్డ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు భాగస్వామ్యమవుతున్న ఈ ఆర్ట్ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఎంఎఫ్ హుస్సేన్ వారసత్వానికి నివాళి.. ప్రఖ్యాత భారతీయ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మేనల్లుడు ఫిదా హుస్సేన్ ఎక్స్క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఫెస్ట్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికగా తన మామతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. భారతదేశం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎంఎఫ్ హుస్సేన్ కళను పదిలపరచడంలో ప్రత్యేక బాధ్యతను తీసుకున్నట్లు వెల్లడించారు. 2006 నుంచి 2011 వరకూ ఎంఎఫ్ హుస్సేన్ బహిష్కరణ సమయంలో అతను దుబాయ్, ఖతార్లో తనతో నివసించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన సృజనాత్మకతను తాను పరిరక్షించానని, ఇందులో భాగం 2017లో హుస్సేన్ సెరిగ్రాఫ్లను భారతదేశానికి తిరిగి ఇచ్చే పనిని చేపట్టానని, ఇది తమ కళా వారసత్వానికి నిదర్శనమని అన్నారు. అనంతరం ముంబై, బరోడాలో ఎంఎఫ్ హుస్సేన్ కళను ప్రదర్శించడం, సమకాలీన కళాకారులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఎక్స్క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించానని తెలిపారు. సృజనాత్మకతలో తత్వ శాస్త్రం.. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన అంజలి ప్రభాకర్ సృజనాత్మకత ఇండియన్ ఆర్టి ఫెస్ట్లో విశేషంగా ఆకట్టుకుంది. జీవితంలోని వివిధ కోణాలను, తత్వశాస్త్రంపై ఆమెకున్న లోతైన అవగాహనను చిత్రాల ద్వారా ప్రదర్శించారు. విజయం, ప్రేమ, ఆధ్యాత్మికతతో పాటు జీవితంలోని అనేక ఆచరణాత్మక అంశాలను అంజలి చిత్రీకరించారు. పెయింటింగ్లో నైపుణ్యం, 3డీ మ్యూరల్ ఆర్ట్, మధుబని పెయింటింగ్, క్రిస్టల్ రెసిన్, సెఫోరిక్స్, అబ్స్ట్రాక్ట్ వంటి కళల్లో తన సృజనాత్మకతను ఈ ఫెస్ట్లో ప్రదర్శించారు.భారత్తో పాటు విదేశాల్లో తాను సోలో, గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో పాల్గొన్నానని, తాను రాసిన పుస్తకం ‘ట్యూన్స్ ఆఫ్ లైఫ్’ విడుదలైందని, ప్రస్తుతం ‘మహిళల మానసిక ఆరోగ్యంలో ఆర్ట్ థెరపీ ప్రభావాన్ని అన్వేషించడం’ అనే అంశంపై పీహెచ్డీ ఎంట్రీని చేస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లుగా అంజలి ఇన్నోవేటివ్ ఆర్ట్ శిక్షకురాలిగా కృషి చేస్తున్నానని అన్నారు. 2017లో ఇండోర్ మిరాజ్ నేషనల్ ఆర్ట్ ఫెస్ట్, బోపాల్ ‘ఆర్ట్ ఆల్కెమీ’, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ (ఆష్మి ఇనీషియేటివ్ గాంధీ ఆర్ట్ గ్యాలరీ) వంటి ప్రదర్శనలో తన చిత్రాలకు ప్రశంసలు లభించినట్లు తెలిపారు. (చదవండి: ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!) -
ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!
ఇంట్లో వంటలు చేస్తూ.. అదే చేత్తో ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లు పరిమితంగా కేటరింగ్ సేవలు కూడా అందించే హోమ్ చెఫ్స్ అనేది ఇప్పుడు పాత చరిత్ర. స్టార్ హోటల్స్ అధిపతులతో మీటింగ్లూ, బడా రెస్టారెంట్లలో ఈటింగ్లూ వెరసి పాపులర్ హోమ్చెఫ్స్ జాబితాలో లిస్టింగ్లూ కామన్గా మారుతోంది.. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రకావచ్చు.. ట్రెండ్ కావచ్చు.. మొత్తానికి ఇంటి రుచులకు కేరాఫ అడ్రస్గా నిలుస్తున్నారు హోమ్ చెఫ్స్.. హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్ ఫుడ్ ఫెస్టివల్స్లో హోమ్ చెఫ్లు ఎక్కువగా పాల్గొంటున్నారు. ప్రత్యేకమైన శైలితో భోజనప్రియులకు కొత్త అనుభవాలు పంచుతున్నారు. హోమ్ చెఫ్స్ కూడా వింత రుచులను వండి వడ్డిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ ప్రత్యేకతలను అచ్చంగా అదే విధంగా అందించడం వీరితోనే సాధ్యమవుతుండడంతో నగరంలోని దాదాపు ప్రతి స్టార్ హోటల్, టాప్ క్లాస్ రెస్టారెంట్ వీరి సేవలను వినియోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. లోకల్.. రుచులుఇటీవల సోమాజిగూడలోని ఆక్వా, ది పార్క్లో జరిగిన ‘బోనాలు ఫెస్ట్’ దప్పళం, (మేక ఆఫల్) మేక తల కూర వంటి వంటకాలతో తెలంగాణ అచ్చమైన రుచులను ప్రదర్శించింది అంటే కారణం దానికి సారథ్యం వహించింది ఓ హోమ్ చెఫ్. అదే విధంగా రాయలసీమ రుచుల పండుగకు గానీ, గోదావరి ఘుమఘుమలు వడ్డించాలన్నా గానీ.. నగరంలోని హోమ్ చెఫ్స్కు జై కొట్టాల్సిందే అంటున్నాయి రెస్టారెంట్స్. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ ఏకంగా ఏడుగురు హోమ్ చెఫ్స్తో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి సందడి సృష్టించింది. ఈ ఫెస్టివల్లో ఆర్కిటెక్ట్ అయిన మీరా, ప్రీ స్కూల్ యజమాని అయిన స్ఫూర్తి, నిజామీ వంటకాలను ఇంటి నుంచే అందించే షహీన్, మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న శ్రియ.. ఇలా భిన్న రంగాలకు చెందిన మహిళలు పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ రుచుల పండుగకు సారధ్యం వహించారు. ఇతర నగరాల నుంచి.. ఇంటి వంటకు, ఇంతి వంటకు రెస్టారెంట్స్ పెద్ద పీట వేయడం అనేది స్థానిక మహిళల వరకే పరిమితం కాలేదు. పలు నగరాల నుంచి కూడా హోమ్ చెఫ్స్ నగరానికి తరలి వచ్చేందుకు ఇది దోహదం చేస్తోంది. ఇటీవలే నాగా క్యూలినరీ ట్రయల్స్: గోవా నుంచి హోమ్ చెఫ్ అలిస్టైర్ లెథోర్న్ వచ్చిది పార్క్లో నాగా వంటకాలను ప్రదర్శించారు. ఫ్యూజన్ ఫుడ్తో పాటు క్లాసిక్ నాగా వంటకాలను అందించారు. (చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?)అమ్మతో ఆరంభం.. అత్తమ్మతో నైపుణ్యం.. నగరంలోని మారియట్ హోటల్ వేదికగా గత నెల్లో బొహ్రా క్యుజిన్ను నగరవాసులకు రుచి చూపించారు అలిఫియా అమ్రేలివాలా. తన భర్త అజీజ్తో సహా వచ్చి కొన్ని రోజుల పాటు నగరానికి గెస్ట్గా ఉండి.. తమ వెరైటీ వంటకాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘చిన్నప్పటి నుంచి వంట చేయడం ఇష్టం, అమ్మ దగ్గర కొంత నేర్చుకున్నా, పెళ్లి తర్వాత, మా అత్తగారి నుంచి మరిన్ని నైపుణ్యాలను అలవర్చుకున్నా.., నా భర్త అజీజ్ కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, నేను ఇంటి పరిసరాల్లోనే క్యాటరింగ్ ప్రారంభించా. కాలక్రమంలో నా భర్త కూడా సహకారం అందిస్తుండడంతో మా మెనూ విస్తరించాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్ట్లు నిర్వహించి, పలు నగరాల నుంచి ఆహ్వానాలు వస్తుండడంతో పూణె, హైదరాబాద్లోనూ ఫుడ్ ఫెస్ట్లను ఏర్పాటు చేశాం. హైదరాబాదీలు మా వంటకాలను రుచి చూసి, వావ్ ఇవి వెరైటీగా బాగున్నాయి అంటూ కొనియాడడం మాకు ఎంతో సంతృప్తిని అందించింది. – అలియా, హోమ్ చెఫ్, ముంబై (చదవండి: Golden Chariot Tour: ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా..జస్ట్ ఒకే రైలుబండిలో..!) -
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
ఎవరైనా సరే తమ ఇంటి లోపలికి అడుగు పెడితే అలంకారానికి ముగ్ధులైపోవాలని కోరుకుంటారు. ఇంటి గుమ్మం ఆహ్వానం పలికేలా ఎంత అందంగా అలంకరించుకోవచ్చో చూద్దాం..భారతీయ హస్త కళలు లేదా ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్స్తో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ గుమ్మం ముందు వేలాడదీస్తే తక్షణమే ప్రవేశ ద్వారం అలంకరణ కళాత్మకంగా మారిపోతుంది. అంతేకాదు, మనదైన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతుంది. గణేశుడు లేదా బుద్ధుని విగ్రహాలు గుమ్మం దగ్గర ఉంచడంతో ప్రవేశ ద్వారానికి ఆధ్యాత్మికత అలంకారంగా మారిపోతుంది. అంతేకాదు, ఈ విగ్రహాలు ప్రశాంతతను కలిగిస్తాయి.మొక్కలు లేదా చిన్న నీటి సౌకర్యంతో మీ ప్రవేశ ద్వారంలోకి ప్రకృతిని తీసుకువచ్చి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. తక్కువ కాంతిపడినా ఏపుగా పెరిగే ఇండోర్ మొక్కలను ఇందుకు ఎంచుకోవాలి.చిన్నా పెద్ద గంటలున్న హ్యాంగింగ్ను వేలాడదీయడం వల్ల తలుపు తెరిచినప్పుడల్లా గంటలు శ్రావ్యంగా మోగుతూ, మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. గంటలు ప్రతికూల శక్తిని దూరం చేసి ఇంటికి సానుకూలతను తీసుకువస్తాయని మనలో చాలామందికి నమ్మకం.బంతిపూలు లేదా మల్లెపూలు వంటి తాజా పువ్వులు మీ ప్రవేశ ద్వారానికి సువాసనను, అందాన్ని ఇనుమడింపజేస్తాయి. వాటిని కుండీలో అలంకరించినా, దండగా అల్లి ద్వారానికి వేలాడదీసినా చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటాయి.డిజైన్లలో ఉన్న కుండలు, టెర్రకోట శిల్పాలు.. వంటి సాంçస్కృతిక కళాఖండాలతో ప్రవేశ ద్వారానికి ప్రత్యేకమైన అందాన్ని తీసుకురావచ్చు. (చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే చెట్లు..! ఎక్కడంటే..?) -
Exams Fear: ఈ టెక్నిక్స్తో ఎగ్జామ్ ఫియర్ మాయం
మీరు పరీక్ష హాలులో కూర్చున్నారు. ప్రశ్నపత్రం చేతిలో ఉంది, కానీ ఒక్క పదం కూడా గుర్తుకు రావడం లేదు! గుండె వేగంగా కొట్టుకుంటోంది, చెమటలు పట్టాయి, కాళ్లు చేతులు వణుకుతున్నాయి. ఏదైనా ప్రశ్నకు సమాధానం రాయాలని ప్రయత్నిస్తే, మెదడంతా ఖాళీగా మారిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మీకు ఎప్పుడైనా ఎదురైందా? దీన్నే ‘పెర్ఫార్మెన్స్ ఆంగై్జటీ’ అంటారు. మన మెదడులో ‘అమిగ్డాలా’ అనే చిన్న భాగం ఉంది. ఇది ప్రమాదాన్ని గుర్తించి మనల్ని ‘ఫ్లైట్ అండ్ ఫైట్’ మోడ్లోకి నెడుతుంది. పరీక్షల ముందు మనలో భయాన్ని, ఆందోళనను తీసుకొచ్చేది ఇదే! వాస్తవానికి పరీక్ష అనేది ప్రమాదం కాదు కదా. కానీ మన బ్రెయిన్ దీన్ని ఒక పోటీగా లేదా ముప్పుగా గుర్తిస్తే ఒత్తిడి పెరుగుతుంది. అయితే, ఇదే మెదడును సరైన మార్గంలో ప్రోగ్రామ్ చేసుకుంటే, పరీక్ష భయాన్ని ఓడించగలం! అందుకోసం కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్ తెలుసుకుందాం.1విజువలైజేషన్ టెక్నిక్విజువలైజేషన్ అనేది ఓ శక్తిమంతమైన వ్యాయామం. పరీక్ష హాలులో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే, ముందే మిమ్మల్ని మీరు అక్కడ చూసుకోవడం ప్రారంభించండి. మీరు ప్రశాంతంగా ఉండి సమాధానాలు సరిగ్గా రాస్తున్నట్లు రోజుకు 5 నిమిషాల పాటు ఊహించండి. ఇది మీ మెదడును సానుకూలత వైపు మళ్లిస్తుంది. ఇది చేయడం చాలా సులువు.కళ్లు మూసుకుని గాలి నెమ్మదిగా లోపలికి, బయటకు తీసుకోవాలి.మీకు నచ్చిన ప్రశాంతమైన ప్రదేశాన్ని ఊహించండి.మీరు ప్రశాంతంగా పరీక్ష రాస్తున్నట్లు ఊహించండి.ఈ టెక్నిక్ను ప్రఖ్యాత క్రీడాకారులు, బిజినెస్ లీడర్లు కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే మన మెదడుకు ఊహకు, నిజానికీ తేడా తెలియదు. మనం ఊహించిన దాన్ని నిజమైందిగా గుర్తిస్తుంది! అలా మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తుంది.2‘సూపర్హీరో పోజ్’ టెక్నిక్పరీక్ష ముందు 2 నిమిషాల పాటు ‘సూపర్ హీరో’ పోజ్లో నిలబడటం ద్వారా, భయం తగ్గించుకోవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలు నిరూపించాయి. ఇది చేయడం కూడా చాలా సింపుల్.మిమ్మల్ని మీరు ఓ సూపర్ హీరోలా ఊహించుకోండి.రెండు చేతులను నడుముపై ఉంచండి.వెన్నెముకను నిటారుగా ఉంచండి.రెండు కాళ్లను కొంచెం దూరంగా ఉంచి తలెత్తి నిలబడండి.ధైర్యంగా చూస్తూ చిరునవ్వు నవ్వండి.ఇలా కేవలం రెండే రెండు నిమిషాలు నిలబడితే భయాన్ని కలిగించే హార్మోన్ కార్టిసోల్ స్థాయిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచే హార్మోన్ టెస్టోస్టిరాన్ను పెంచుతుంది. పరీక్ష హాలులో ప్రవేశించే ముందు ఈ టెక్నిక్ ట్రై చేయండి. సూపర్ హీరోలా ఎగ్జామ్ రాసేయండి. చెవులకు మసాజ్.. మెదడుకు యాక్టివేషన్పరీక్షకు 5 నిమిషాల ముందు చెవులపై మసాజ్ చేయడం మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ‘బ్రెయిన్ జిమ్’ పరిశోధన చెబుతోంది. చెవులకూ మెదడుకూ సంబంధం ఏమిటని తర్కించకుండా ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసేయండి. ∙రెండు చెవులను మెత్తగా పట్టుకుని, పైకి, కిందికి, సైడ్కి తీయండి.రెండు చేతుల గోళ్లతో చెవుల వెనుక భాగాన్ని గీరండి.చెవులపై గుండ్రంగా మసాజ్ చేయండి.ఇలా చేయడం మెదడులో సిగ్నల్ ప్రాసెసింగ్ ఫాస్ట్ చేయడానికి సహాయపడుతుంది. పరీక్ష ముందు చెవులకు మసాజ్ చేస్తే, మెదడుకు స్ట్రెయిన్ తగ్గుతుంది, మతిమరుపు ఉండదు.యాంకరింగ్ టెక్నిక్యాంకరింగ్ టెక్నిక్మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక చిన్న సిగ్నల్ సృష్టించండి. ఉదాహరణకు, రెండు వేళ్లను కలిపి సున్నా ముద్రను (ఓకే సింబల్) చేయండి, లేదా గట్టిగా అరచేతిని మెల్లగా నొక్కండి. ప్రతిసారి దీన్ని చేస్తే, మీ మెదడు దానిని ప్రశాంతతతో అనుసంధానం చేసుకుంటుంది. పరీక్ష హాలులో ఒత్తిడి పెరిగినప్పుడు ఇదే ముద్రను ఉపయోగిస్తే, మీ మెదడు తక్షణమే కూల్ మోడ్లోకి వస్తుంది.పరీక్ష అనేది ఒక మానసిక ఆట మాత్రమే! మీ మెదడును సరైన పద్ధతిలో ప్రోగ్రామ్ చేసుకుంటే, మీరు విజేతగా నిలుస్తారు. ఈ టెక్నిక్స్ ఫాలో అయ్యి మీ పరీక్ష భయాన్ని క్షణాల్లో హ్యాండిల్ చేయండి!.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?) -
ప్రెగ్నెన్సీ టైంలో అన్ని మార్పులా..? అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?
నాకు ఇప్పుడు నాల్గవ నెల. నడుము, పొత్తి కడుపు, వెన్నులో చాలా నొప్పి ఉంటోంది. ఇది మామూలే అని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? – లక్ష్మీ, తిరుపతి. ప్రెగ్నెన్సీలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. బేబీని మొయ్యటం అనేది చాలా పెద్ద బాధ్యత. ఇలాంటి సమయంలో ఎంత సంతోషంగా ఉంటుందో, శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులను తట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఓపిక చాలా అవసరం. మొదట్లో ఎలాంటి నొప్పి, అసౌకర్యం ఉండకపోవచ్చు. శారీరకంగానూ బాగానే ఉంటుంది. కాని, హార్మోన్లు సహజంగా హెచ్చుగా ఉన్నందున అలసత్వం, నీరసం, ముభావంగా ఉండటం, తలనొప్పి, వికారం ఉంటాయి. రొమ్ముల్లో నొప్పి కొంచెం ఉండొచ్చు. రెండో త్రైమాసికంలో అంటే నాలుగు నుంచి ఏడవ నెల వరకు చాలా కొత్త మార్పులు ఉంటాయి. బేబీ పెరుగుతున్నప్పుడు లోపల ఒత్తిడి, స్ట్రెచింగ్ తెలుస్తుంది. శరీరంలో వాపు వస్తుంది. నొప్పిగా ఉంటుంది. సైడ్స్లో రౌండ్ లిగమెంట్స్ బాగా స్ట్రెచ్ అయి నొప్పిగా అనిపించవచ్చు. మూడో త్రైమాసికంలో బేబీ బరువు రెండు నుంచి మూడు కిలోల మధ్య ఉంటుంది. కాబట్టి, ఆ బరువు కాళ్ల మీద, పొత్తి కడుపు, నడుము, వీపు భాగంలో పడుతుంది. కీళ్ల నొప్పులు ఉంటాయి. ఉబ్బసం, మలబద్ధకం, ఆయాసం రావచ్చు. ఎక్కువ నడవలేక పోతారు. యూరిన్ అర్జెన్సీ ఉండటం, చర్మం నల్లబడటం, రొమ్ముల్లో నొప్పి, చిగుళ్లలో రక్తం రావటం, తల తిరగటం ఇవన్నీ సహజమైన మార్పులుగానే చెప్తాం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఏది సహజమైన సమస్య అని తెలిస్తే, అసలైన సమస్య, నొప్పిని త్వరగా గుర్తించి, సత్వర చికిత్స తీసుకోవచ్చు. డాక్టర్ను వెంటనే సంప్రదించవచ్చు. చాలామందికి నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. చివరి మూడు నెలల్లో ఆందోళన, ఆలోచనలు, భయాలు పెరుగుతాయి. ఇలా కాకుండా ధ్యానం, యోగా సాయంత్రం వేళల్లో చేస్తే శరీరం రిలాక్స్ అవుతుంది. నిద్రపోయే ముందు షవర్ బాత్ చెయ్యటం, వేడి పాలు తీసుకోవటం, సంగీతం వినటం, గదిని డిమ్గా ఉంచడంలాంటివి సహాయం చేస్తాయి. నిద్ర మాత్రలు అసలు వాడకూడదు. కొంతమందికి హెమరాయిడ్స్ ఎక్కువ అయి మలబద్ధకం, మూత్రవిసర్జన సమయంలో రక్తం రావటం, నొప్పి ఉండవచ్చు. అందుకు సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఒత్తిడితో మూత్రవిసర్జన చెయ్యకూడదు. భేది మందులతో సులభంగా అయ్యేట్టు మందులు వాడాలి. లూజు, కాటన్ ఇన్నర్ వెయిర్ వేసుకోవాలి. ఒక పక్కకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. కోల్డ్ ప్యాక్స్ను ఉపయోగించవచ్చు. యూరిన్ కూడా ఎక్కువ రావటం, లీక్ అవటం సహజంగా చూస్తాం. కేగెల్ వ్యాయామాలు చెయ్యాలి. బ్లాడర్ ట్రైనింగ్ అలవాటు చేసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని చెక్ చెయ్యాలి. ఫ్లూయిడ్స్ మూడు నుంచి నాలుగు గంటలు తీసుకోవాలి. వెజైనల్ డిశ్చార్జ్ కూడా కామన్. దురదలు, మంటలు, దుర్వాసన లేకపోతే అది నార్మల్. ఒకసారి డాక్టర్తో పరీక్షించుకోవాలి. అప్పుడే ఉమ్మనీరు సంచి పగిలిపోవటం వారు గుర్తిస్తారు. బ్రాక్ట్సన్ కిక్స్ అనే కాంట్రాక్షన్స్ ఏడవనెల నుంచి కొన్ని సెకండ్లు వచ్చి పోతుంటాయి. అవి లేబర్ పెయిన్స్ కాదు. ఒక పక్కకు తిరిగి పడుకోవడం, రిలాక్సింగ్ వ్యాయామాలు చెయ్యటంతో ఈ నొప్పి తగ్గుతుంది. ఇవి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇవి ప్రెగ్నెన్సీలో మామూలే. వేరికోస్ వీన్స్కి కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి. కాళ్లు, అరికాళ్లను ఎత్తులో పెట్టుకొని ఆఫీసు పని చేసుకోవాలి. చాలా వాపు వస్తే, బీపీ ఎక్కువ ఏమైనా అయిందా అని డాక్టర్ని సంప్రదించాలి. చర్మంలో మార్పులు, స్ట్రెచ్ మార్క్స్ని నిరోధించలేము. మాయిశ్చరైజ్ క్రీమ్స్ కొంత వరకు పనిచేస్తాయి. పొట్టపైన, రొమ్ములు, తొడలపైన పూసుకోవాలి. అలసట, నీరసం అనేది చాలా సాధారణంగా వచ్చే సమస్య. కాని, రక్తహీనతలో కూడా ఇది ఉంటుంది. అందుకే మీకు ఇలా ఉన్నప్పుడు ఐరన్, బీ12, ఫోలిక్ యాసిడ్ మందులు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా అని చెక్ చేసుకోండి. పికా అంటే బ్లడ్ లెవల్స్ తక్కువ ఉన్నప్పుడు బియ్యం, పేపర్ తినాలనిపిస్తుంది. ఇది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సరిపడా నిద్ర ఉందా అని చెక్ చేసుకోండి, వ్యాయామం చెయ్యండి. తలనొప్పికి ఐస్ ప్యాక్స్ వాడొచ్చు. 10 నుంచి 12 గ్లాసుల నీరు రోజు తీసుకోవటం మంచిది. పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి సేఫ్గా వాడొచ్చు. వికారం, వాంతులకు మెత్తని ఆహార పదార్థాలు, అరటిపండు, అన్నం, బ్రెడ్ లాంటివి తీసుకోవాలి. కాల్చిన బంగాళదుంపలు, ఉడకబెట్టిన మొక్కజొన్న తీసుకోవాలి. మసాలాలు, నూనె పదార్థాలు, వేపుళ్లు తినకూడదు. నాన్ కాఫినేటెడ్ డ్రింక్స్ తీసుకోవాలి. సిప్స్లాగా నీళ్లు తీసుకోవాలి. పండ్ల రసాలు తాగొచ్చు, అల్లం టీ తాగొచ్చు. కాఫీ, టీ మానెయ్యాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. రెండు నుంచి మూడు గంటలకి ఒకసారి కొంచెం ఆహారం తీసుకోవాలి. మాంసాహారంలో డీన్ మీట్, హై ప్రోటీన్వి తీసుకోవాలి. ప్రతిరోజు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. రొమ్ముల్లో మార్పులు ప్రెగ్నెన్సీలో సాధారణంగానే వస్తాయి. సైజ్ పెరగటం, డార్క్ కావటం, నొప్పి ఉండటం ఇవన్నీ మామూలే. కొంతమందికి ఐదవ నెల నుంచే కొలోస్ట్రమ్ లీక్ కావచ్చు. మంచి సపోర్ట్ ఇన్నర్ వేర్ వేసుకోవాలి. కాటన్వి వాడాలి. కాటన్ టవల్తో లీక్ అవుతున్న ఫ్లూయిడ్స్ని తుడవాలి. ప్రెస్ చెయ్యకూడదు. వేడి కాపడం పెట్టుకోవచ్చు. పొట్ట పక్కన గుచ్చినట్లుగా నొప్పులు రావచ్చు. పొట్ట పెరిగే కొద్దీ లిగ్మెంట్ స్ట్రెచ్తో ఈ నొప్పి వస్తుంది. నడుము లేదా గ్రోయిన్ ఏరియాలో కూడా వస్తుంది. కాళ్ల నొప్పులు కూడా ఉంటాయి. రాత్రిళ్లు ఈ నొప్పి ఎక్కువ ఉంటుంది. హీట్ థెరపీ లేదా బ్యాక్ మసాజ్ దీనికి పనిచేస్తుంది. రబ్బర్ దిండు, లేదా మెటర్నిటీ బెల్ట్ కూడా వాడొచ్చు. వదులైన దుస్తులు ధరించాలి. కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవాలి. డాక్టర్ భావన కాసు,గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: ఈ జెల్ సాక్స్తో పాదాలు ఇట్టే కోమలంగా మారతాయ్..!) -
కేన్సర్తో పోరాడటంలో బీట్రూట్ హెల్ప్ అవుతుందా..?
బీట్రూట్కు ఎరుపు రంగును ఇచ్చే బిటాలెయిన్స్ అనే పోషకం చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. అది ఫ్రీరాడికల్స్ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్–సీ కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ కావడంతో ఇది కూడా కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. అంతేకాదు... కొలాజెన్ ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుండటంతో చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఆ కొలాజెన్ సహాయపడుతుంది. బీట్రూట్ జ్యూస్ తీసుకునేవారికి అలసిపోకుండా చాలాసేపు పనిచేయగల స్టామినా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే... వ్యాయామం చేస్తూ బీట్రూట్ను క్రమం తప్పకుండా తీసుకునేవారు అనేక రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందుతారు. అలాగే బీట్రూట్ బీటాలైన్ పిగ్మెంట్ల కారణంగా కణితి కణాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్ కేన్సర్ కణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ రసంలోని నైట్రేట్లు గుండెపనితీరుని మెరుగ్గా ఉంచుతుంది(చదవండి: జుట్టుని మింగేసే మందులివే..) -
మందుల వల్ల కూడా జుట్టు ఊడిపోవచ్చు..!
జుట్టు ఊడిపోతున్నప్పుడు జింక్ వంటి పోషకాల లోపం ఏదైనా ఉందేమో చూసుకోవడంతోపాటు ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం మనం వాడే మందులు మనకు సరిపడక జుట్టును రాల్చేస్తున్నాయేమో కూడా చూడాలి. అలా కొన్ని రకాల మందులు సరిపడకపోవడం లేదా వాటి దుష్ప్రభావాల వల్ల కూడా కొందరిలో జుట్టు రాలిపోతుంది. అలా జట్టును రాలేలా చేసే మందులేమిటో తెలుసుకోండి. జుట్టు రాలేలా చేసే కొన్ని రకాల మందులేమిటో, అవి ఎందుకు వాడుతుంటారో తెలుసుకుందాం. జుట్టు రాల్చే మందులివే... ఇక్కడ పేర్కొన్న ఈ మందులన్నీ జుట్టును రాలిపోయేలా తప్పక చేస్తాయని కాదు. కానీ కొందరిలో అవి సరిపడక΄ోవడం వల్ల ప్రతికూలంగా పనిచేసి జుట్టును రాల్చేందుకు కారణమవుతుంటాయి.వాటిలో ప్రధానమైన కొన్ని మందులివి... ఇన్ఫెక్షన్లకు వాడే కొన్ని యాంటీబయాటిక్స్ యాంటీ ఫంగల్ మందులు మొటిమలకు వాడే కొన్ని మందులు కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మందులు యాంటీకొలెస్ట్రాల్ మందులు రక్తాన్ని పలచబార్చేవి ఇమ్యునోసప్రెసెంట్స్ మూర్ఛ చికిత్సలో వాడే మందులు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీలో వాడే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, పురుషులకు వాడే టెస్టోస్టెరాన్, యాండ్రోజెన్ వంటి హార్మోన్లు ఇంటర్ఫెరాన్స్ వేగంగా మూడ్స్ మారి΄ోతున్నప్పుడు నియంత్రణకు వాడే మూడ్ స్టెబిలైజేషన్ మందులునొప్పినివారణకు వాడే ఎన్ఎస్ఏఐడీ తరహా మందులు స్టెరాయిడ్స్... వీటితోపాటు వీటన్నింటిలోకీ కీమోథెరపీకి వాడే మందులు జుట్టును రాలేలా చేయడంలో ముఖ్య పాత్రపోషిస్తాయి.వెంట్రుక దశలు ఈ మందులు వెంట్రుక జీవితచక్రంలోని వివిధ దశల్లోకి జొరబడి అవి జుట్టును రాలేలా చేస్తాయి. ఏయే మందులు ఏయే దశల్లో జొరబడి జుట్టు రాలుస్తాయో తెలుసుకోవడంతోపాటు ఆ దశలేమిటో చూద్దాం. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలు ఉంటాయి. టిలోజెన్ : మొత్తం జుట్టులో 10–15 శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. ఈ దశ సాధారణంగా 100 రోజుల ΄ాటు కొనసాగుతుంది. అయితే కనుబొమలు, కనురెప్పలు, బాహుమూలాల్లో ఉండే వెంట్రుకల్లో ఈ దశ మరింత దీర్ఘకాలం ఉంటుంది. ఈ దశలోనే వెంట్రుక తన పూర్తిస్థాయి పొడవులో ఉంటుంది. ఈ దశలో ఉన్నప్పుడు రోమాన్ని పీకితే... వెంట్రుక కింద గసగసాల్లాంటి గుండ్రటి, తెల్లటి భాగం కనిపిస్తుంది. కెటాజన్ : మొత్తం జుట్టులో కనీసం మూడు శాతం ఎప్పుడూ ఈ దశలోనే ఉంటుంది. వెంట్రుక పెరుగుదల లో ఇదో సంధి దశ. ఈ దశ 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. ఈ దశలో వెంట్రుక నిద్రాణంగా ఉండి, రోమాల పెరుగుదల ఏమాత్రం ఉండదు. అనాజెన్ : వెంట్రుక పెరుగుదల దశలన్నింటిలోనూ అనాజెన్ అనేది చురుకైనది. ఈ దశలో వెంట్రుక మూలంలో కణవిభజన వేగంగా జరుగుతుంటుంది. కింద రోమాంకురంలో కొత్త కణాలు పెరుగుతున్న కొద్దీ పాత కణాలు ముందుకు వెళ్తుంటాయి.ఫలితంగా కింది నుంచి వేగంగా వెంట్రుక పై వైపునకు పెరుగుతూ ΄ోతుంది. (అందుకే జుట్టుకు రంగు వేసుకునేవారిని చూసినప్పడు జుట్టు కింది భాగంలోని వెంట్రుకలు రంగులేకుండా కనిపిస్తుండటానికి కారణమిదే). ఈ దశలో ప్రతి 28 రోజులకు వెంట్రుక ఒక సెంటీమీటరు పొడవు పెరుగుతుంది. అలా కొంత పొడవు పెరిగి ఆగి΄ోతుంది. తల మీద ఉన్న వెంట్రుకలు రెండు నుంచి ఆరేళ్ల పాటు పెరుగుతాయి. బాహుమూలాల్లో, కాళ్లపైనా, కనుబొమలు, కనురెప్పపై ఉండే వెంట్రుకల్లో పెరుగుదల వ్యవధి 30–45 రోజులు మాత్రమే ఉండి, ఆ తర్వాత ఆ పెరుగుదల ఆగి΄ోతుంది. ఈ కారణం వల్లనే ఈ వెంట్రుకలు మాడుపై ఉండే వెంట్రుకలంత పొడవు పెరగవు. మన ఆరోగ్య సమస్యల కోసం వాడే మందులు జుట్టు పెరుగుదలలో ఉండే అనాజెన్, కెటాజెన్, టిలోజెన్ దశలను ప్రభావితం చేస్తాయి. దాంతో జుట్టు పెరుగుదలలో మార్పు వస్తుంది. ఫలితంగా టిలోజెన్ ఎఫ్లూవియమ్, అనాజెన్ ఎఫ్లూవియమ్ అనే రెండు రకాల మార్పులు వచ్చి అవి జుట్టు రాలేలా చేస్తాయి. టిలోజెన్ ఎఫ్లూవియమ్ : ఏదైనా ఆరోగ్య సమస్య కోసం మందులు వాడటం మొదలుపెట్టగానే వాటి ప్రభావంతో 2 నుంచి 4 నెలల్లో హెయిర్ ఫాలికిల్ విశ్రాంతి దశలోకి వెళ్తుంది. అంతేకాదు... ఒక్కోసారి మనకు ఉన్న వ్యాధి కూడా టిలోజెన్ ఎఫ్లూవియమ్ను కలిగించవచ్చు. అనాజెన్ ఎఫ్లూవియమ్ : ఈ దశలో వెంట్రుకలు తమ పెరుగుదల దశలోనే రాలి΄ోతుంటాయి. మందు వాడటం మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ఇది కనిపిస్తుంది. ఉదాహరణకు కీమోథెరపీ తీసుకునేవారిలో అనాజెన్ ఎఫ్లూవియమ్ వల్లనే జుట్టురాలిపోతుంది. ఈ మందులు కేవలం తల మీది జుట్టే కాకుండా కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోయేలా చేస్తాయి. మందుల వల్లనే జుట్టు రాలుతుంటే... సాధారణంగా మందులు మానేయగానే మళ్లీ వచ్చేందుకు అవకాశమెక్కువ ఒక మందుతో జుట్టు రాలుతుంటే దానికి ప్రత్యామ్నాయ మందులు వాడటం జుట్టు రాలడాన్ని అరికట్టే మందులనూ వాడటం (డాక్టర్ సలహా మేరకు మాత్రమే)కీమోథెరపీ ఇచ్చే సమయంలో హైపోథెర్మియా అనే ప్రక్రియను ఉపయోగించడం ద్వారా. ఈ ప్రక్రియలో కీమోథెరపీ ఇచ్చే ముందర... ఇచ్చిన అరగంట తర్వాత మాడుపై ఐస్తో రుద్దుతారు. ఫలితంగా కీమోథెరపీలో ఇచ్చిన మందు ఫాలికిల్లోకి అంతగా ప్రవేశించదు. ఇది జుట్టు రాలడాన్ని చాలావరకు నివారిస్తుంది. అయితే ఈ ఫలితం అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. బాధితులకు ఉన్న క్యాన్సర్ ఏమిటన్నదాని మీద ఈ హైపోథెర్మియా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఆ ప్రక్రియను ఉపయోగించే ముందర ఒకసారి చికిత్స చేస్తున్న ఆంకాలజిస్ట్ సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికైనా తాము వాడుతున్న మందుల వల్ల జుట్టు రాలుతోందనిపిస్తే ఆ విషయాన్ని తమ డాక్టర్కు తెలపాలి. అప్పుడు వాళ్లు తగిన ప్రత్యామ్నాయాలను సూచిస్తారు.(చదవండి: సమ్మర్లో ఎయిర్ కూలర్స్, ఏసీలే వాడేస్తున్నారా..?) -
సమ్మర్లో ఎయిర్ కూలర్స్, ఏసీలు వాడేస్తున్నారా..?
ఎండలు బాగా ముదిరాయి. స్థోమత ఉన్నవారు ఎయిర్ కండిషనర్స్నూ, అంతగా స్థోమత లేనివారు ఎయిర్ కూలర్స్నూ వాడుతుంటారు. ఏసీల కారణంగా గదిలో ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో మెయింటెయిన్ అవుతుండటంతో టు అందులోని కొన్ని ఫిల్టర్లు చాలా చాలా చిన్నగా, అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) బారి నుంచీ కాపాడతాయి. శబ్దకాలుష్యాన్నీ నివారించి... చెవి, ఇతరత్రా సమస్యలు రాకుండా చూస్తాయి. కానీ వాటివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అలాగే ఎయిర్ కూలర్స్లో, లీజియొన్నెల్లా అనే బ్యాక్టీరియా పెరిగి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’కు గురయ్యే ముప్పు ఉంటుంది. ఏసీలూ, కూలర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలూ, అవి రాకుండా నివారించే జాగ్రత్తలను తెలుసుకుందాం. ఎయిర్ కండిషన్డ్ రూమ్లో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి... తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ చాలాసేపు ఏసీలో గడపడం వల్ల ఆ చల్లదనం మూలాన కొందరిలో ఒళ్లునొప్పులు, తలనొప్పితోపాటు తీవ్రమైన నీరసం, నిస్సత్తువగా అనిపించవచ్చు. శ్వాస సమస్యలు : గదిలోని ఏసీగానీ లేదా కారులోని ఏసీగానీ చాలాసేపు ఆన్లో ఉండటం, దాంతో గది లేదా కార్ డోర్స్ / గ్లాసెస్ ఎప్పుడూ మూసేసే ఉండటంతో అక్కడి సూక్ష్మజీవులతో పక్కనే ఉన్న ఇతరులకు ఆ సమస్యలు వ్యాపించవచ్చు. కొందరిలో ఆస్తమానూ, పిల్లికూతలనూ ప్రేరేపించవచ్చు. అందువల్ల... ఏసీ గదిలోగానీ లేదా ఏసీ ఆన్ చేసి ఉన్న కారులోగానీ అదేపనిగా చాలాసేపు ఉండటం అంత మంచిది కాదు. తేలిగ్గా వడదెబ్బకు గురికావడం : ఎప్పుడూ ఏసీలో ఉండేవారు దానికి అలవాటైపోయి తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. చర్మం పొడిబారడం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గి, చర్మం పొడిబారుతుంది. ఫలితంగా దురదలు వచ్చే అవకాశాలెక్కువ. వీళ్లు చర్మంపై మాయిశ్చరైజర్ను రాసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు : ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారికి అంతగా దాహంగా అనిపించకపోవడంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో ఇలాంటివాళ్లలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలెక్కువ. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యురైటిస్ (నరాల చివరలు మొద్దుబారినట్లుగా అయిపోయి స్పర్శ అంతగా తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవాళ్లలో ఆ సమస్యలు కాస్త తీవ్రమవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండటం ఏసీలోని ఫిల్టర్స్ను సబ్బుతో కడిగినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే బిగించడం ఎప్పుడూ ఏసీలో ఉండేవారు సాయంత్రాలూ లేదా రాత్రిపూట స్వాభావికమైన చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఏసీ సరిపడక ఏవైనా ఆరోగ్యసమస్యలు వస్తే ఏసీని వాడకపోవడం లేదా గది చల్లబడే వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసుకుని ఫ్యాన్ వేసుకోవడం. వాటర్ కూలర్తో వచ్చే నిమోనియా నివారణ ఇలా... కిందటేడాది వాటర్ కూలర్ వాడాక దాన్ని మూల పెట్టేసి ఉంచి, ఇప్పుడు ఎండలు ముదరగానే వాడటానికి తీసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గతంలో మిగిలి ఉన్న నీళ్లలో లీజియోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు.దాంతో ‘లీజియోన్నేరిస్ డిసీజ్’ అనే ఒక రకం నిమోనియా వచ్చే అవకాశముంది. దీన్నే ‘వాటర్కూలర్ నిమోనియా’ అని కూడా అంటారు. చాలాకాలం వాడని కూలర్స్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్మైట్స్ ఉండి, నేరుగా ఆన్ చేస్తే అది ఆస్తమా బాధితుల్లో సమస్యను ట్రిగర్ చేయవచ్చు. మామూలు వ్యక్తులకు సైతం దగ్గు, ఆయాసం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే బయటకు తీయగానే వాటర్కూలర్ అడుగున ఏమాత్రం చెమ్మలేకుండా చేసేందుకు ఆరుబయట ఆన్ చేసి పెట్టి దాదాపు గంటసేపు అలాగే ఉంచాలి. అడుగున ఒక్క చుక్క నీళ్లు లేకుండా డ్రైగా అయిపోయాకే వాటర్ కూలర్ వాడటం మొదలుపెట్టాలి.(చదవండి: ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..) -
శ్వాస మరింత మెరుగ్గా! సింపుల్ అండ్ హెల్దీ యోగ!
శరీరం, మనస్సును సమన్వయం చేయడంలో శ్వాస కీలక పాత్ర పోషిస్తుంది. యోగా ద్వారా శ్వాసలోని లోపాలు, ఒత్తిడి, నిరాశ లను అదుపు చేయవచ్చు. మానసిక స్థిర త్వాన్ని మెరుగ పరచుకోవచ్చు.శ్వాస వ్యాయామాలు...ఉజ్జయి శ్వాసను సముద్ర శ్వాస పద్ధతితో పోల్చుతారు. ముక్కు ద్వారా దీర్ఘంగా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదలడం. దీనిని సాధారణంగా అష్టాంగ, విన్యాస తరగతులలో ఉపయోగిస్తారు. మూడుభాగాల శ్వాసగా పిలిచే ఈ పద్ధతిలో బొడ్డు, ఛాతీ, దిగువ వీపును గాలితో నింపి, ఆపై రివర్స్ క్రమంలో ఉచ్ఛ్వాసం చేయడం జరుగుతుంది. ఇది విశ్రాంతిని, ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మెరుగైన దృష్టిని ప్రోత్సహిస్తుంది.నాలుకను గొట్టం మాదిరి ముడిచి, వంకరగా ఉంచుతూ నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం, ఆపై ముక్కు ద్వారా ఊపిరి పీల్చడాన్ని సితాలి శ్వాస అంటారు. భ్రమరి శ్వాస ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది. చూపుడు వేలును ముక్కుపైన ఉంచాలి. ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు తేనెటీగ లాగా హమ్ చేయాలి.చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో కపాలభాతి శ్వాసను ‘బ్రెయిన్ మెరిసే శ్వాస’ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న, శక్తివంతమైన ఉచ్ఛ్వాసాలపై దృష్టి పెడుతుంది. దీర్ఘంగా శ్వాస పీల్చుకుని, ఆపై ముక్కు ద్వారా 15–30 సార్లు గాలిని వదలాలి. చదవండి: మొన్ననే ఎంగేజ్మెంట్, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంనాడి శోధన శ్వాసను ‘ప్రత్యామ్నాయ నాసికా ప్రాణాయామం’ అని కూడా అంటారు. ఒక ముక్కు రంధ్రాన్ని మూసి, మరొకదాని ద్వారా శ్వాస తీసుకొని, వదలాలి. ఈ వివిధ యోగా శ్వాస పద్ధతులను సాధన చేయడం వల్ల శారీరక, మానసిక శ్రేయస్సు బాగా పెరుగుతుంది. -
నాడు కన్నతండ్రే వద్దనుకుని విసిరేశాడు.. కట్చేస్తే ఆ చిన్నారే నేడు ఇలా..!
నేటికి కూతురు అనంగానే భారంగానే భావిస్తున్నారు పలువురు. విద్యావంతులైన వాళ్లు సైతం ఇదేతీరులో ప్రవర్తించడం బాధకరం. సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతున్న 'ఆడపిల్ల' అనే వివక్ష విషయంలో మాత్రం మార్పు అంతంత మాత్రమే అనేది పలువురు సామజికవేత్తల వాదన. ఇలాంటి భావంతోనే ఓ తండ్రి నెలల పసికందు అని చూడకుండా కిటికిలోంచి విసిరేశాడు. సమయానికి పొరుగింటివాళ్లు స్పందించి కాపాడిన ఆ ప్రాణం..నేడు కనివినీ ఊహించని రీతిలో సంగీత విద్వాంసురాలిగా రాణించడమే కాదు రికార్డులు సృష్టిస్తోంది. ఆ అమ్మాయే నియాతి చెట్రాన్ష్. ఆమెకు కేవలం నెలల వయసులో ఆమె తండ్రి కర్కశంగా కూతురు కుటుంబానికి భారమని కిటికీలోంచి విసిరేశాడు. ఆ దుశ్చర్యకు ఆ చిన్నారి తల్లిప్రాణం తట్టుకోలేకపోయింది. తక్షణమే ఆ తల్లి కట్టుకున్న భర్తను వద్దనుకుని అన్నీతానై పెంచాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది. తాను ఈ ప్రపంచం తీరు మార్చలేకపోవచ్చు కానీ తన కుమార్తెను మాత్రం కాపాడుకోగలను అనుకుంది. ఇక అలా ఆమె తన కూతురు నియాతికి అన్నీతానై ప్రేమగా పెంచుకుంటోంది. ఇక నియాతికి పెరిగేకొద్దీ సంగీతం పట్ల మక్కువ ఏర్పడటం మొదలైంది. ఆ ఇష్టమే ఆమెను జస్ట్ 12 ఏళ్లకే 42 వాయిద్యాలను వాయించే రేంజ్కి తీసుకొచ్చింది. ఆ ప్రతిభ ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా అనతి కాలంలోనే ఆమె పేరు, టాలెంట్ అందరికి తెలియడం మొదలైంది. దాంతో ఆ చిన్నారి తల్లి ఉద్యోగాన్ని వదిలి.. ఫ్రీలాన్స్ర్గా పనిచేస్తూ.. కుమార్తె అభిరుచిని కొనసాగించడంలో సహాయపడింది. ఆమె తల్లి ప్రోత్సహాంతో నియాతి జాతీయ అంతర్జాతీ సవేదికలపై ప్రదర్శనలు ఇస్తూ..రికార్డుల సృష్టించడం మొదలుపెట్టింది. అంతేగాదు కేవలం 65 సెకన్లలో 15 వాయిద్యాలపై మన జాతీయ గీతాన్ని వాయించి, ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లలో స్థానం సంపాదించింది. ఇవేగాక 13 నిమిషాలకు పైగా కళ్ళకు గంతలు కట్టుకుని శివ తాండవమ్ను కూడా ప్రదర్శించింది.ఎలా ఈ రంగాన్ని ఎంచుకుందంటే..నియాతి ఆరునెలల వయసులో తల్లి ఇచ్చిన బొమ్మ కీబోర్డ్ను చాలా ఆసక్తికరంగా వాయించే ప్రయత్నం చేసేది. అంతేగాదు వంటగదిలోని పాత్రలను ఒక లయబద్ధంగా కొట్టేది. అలా ఐదేళ్లు వచ్చేసరికి లండన్లోని ట్రినిటీ కాలేజీలో గ్రేడెడ్ పియానో పరీక్షలు రాసింది. ఉకులేలే, ఫ్లూట్, తబలా వంటి 16 విభిన్న వాయిద్యాలను వాయించడం నేర్చుకుంది. పైగా నియాతి తన తల్లే తనకు గొప్ప రోల్మోడల్ అని ఆమె అందించిన ప్రోత్సాహంతో పేరుప్రఖ్యాతలు తీసుకురావడం తన కర్తవ్యమని సగర్వంగా చెబుతోంది. నిశబ్దంగా ఉసురు తీయాలనుకున్న వారికి మనసుకు హత్తకునే మ్యూజిక్తో సమాధానమిస్తానంటోంది. (చదవండి: View this post on Instagram A post shared by The Better India (@thebetterindia)(చదవండి: రూ. 8 లక్షలు విలువ చేసే స్నాక్బ్రాండ్! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..) -
స్మార్ట్గా చెడగొడుతున్నాయ్..!
ఇప్పుడంతా గూగుల్ తల్లి మాయ.. తాజాగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్తపుంతలు తొక్కుతున్న స్థితిలో మనం ఉన్నాం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా మన చేతిలో ఉంటోంది. సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, యువత వీటి ప్రభావానికిలోనై బానిసలవుతున్నారు. ఇప్పుడుగనుక తల్లిదండ్రులు మేల్కొనకపోతే భవిష్యత్లో పిల్లలు చెడుదారులు పట్టే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఒక వీడియోను ఓపెన్ చేస్తే చాలు ముందు వచ్చేది యాడ్స్. ఆ యాడ్స్ కూడా ఆశ్లీలంగా ఉంటాయి. ఆసక్తి కలిగించేలా థంబ్ నెయిల్ టైటిళ్లు ఉంటాయి. ఉదాహరణకు.. లవ్, ఫ్యాషన్, సెక్స్ గురించి మాట్లాడుకోవడం లేదా తెలుసుకోవడంలో తప్పేముంది. వెంటనే ఈ యాప్ డౌన్లోన్ చేసుకోండని ఒక యాడ్. మీకు గార్ల్ ఫ్రెండ్.. బాయ్ఫ్రెండ్ లేదని బాధపడుతున్నారా... ఒంటరిగా ఫీలవుతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి.. ఇది మరో యాడ్. దారుణంగా థంబ్ నెయిల్యూట్యూబ్ వీడియోలో థంబ్ నెయిల్ టైటిల్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. వయస్సులో ఉన్నవాళ్లు ఈ వీడియోను ఒంటరిగా చూడండి. చిన్నపిల్లలకు దూరంగా ఉండి ఈ ఆడియోను వినండి. పెళ్లిలో శృంగారం పాత్ర ఎంటీ? ఇలా రకరకాలుగా పిల్లలను ఆకర్షించే విధంగా టైటిళ్లు పెడుతున్నారు. అవి చూసిన పిల్లలు తెలిసీ తెలియక ఈ వీడియో ఎంటి ఇలా ఉంది డాడీ అని ఒకరు. శృంగారం అంటే ఎంటీ మమ్మి ఒక పాప.. ఈ వీడియోలో చిన్న చిన్న బట్టలు వేసుకున్నారెంటమ్మా అని మరొకరి ప్రశ్న. ఇలా తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నా పిల్లల అల్లరిని తట్టుకోలేక స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు. గతంలో వీడియో గేమ్స్కు ఎక్కువగా పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని గేమ్లు డౌన్లోన్ చేయడం లేదు. అయితే నేరుగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు ఓపెన్ చేసి వీడియో చూస్తుండు అని తల్లిదండ్రులు చెప్పి వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ ఆ వీడియో చూస్తూ ఉన్న సమయంలో మధ్య మధ్యలో ఆశ్లీల యాడ్స్ వస్తున్నాయి. వాటిని చూసిన పిల్లల ఆలోచనా సరళి మారిపోతోంది. యూట్యూబ్లో తల్లిదండ్రులు ఏ విధమైన వీడియో చూస్తున్నారో ఆ అంశాలకు అనుగుణంగానే ఆ తర్వాత వచ్చే వీడియోలు డిస్ప్లే అవుతుంటాయి. తండ్రి లేక తల్లి ఎలాంటి వీడియో చూస్తున్నారో అదే ఫోన్ పిల్లలు చూస్తుంటే అలాంటివే తిరిగి మీకు ముందుగా ఓపెన్ అవుతుంటాయి. యూట్యూబ్లోనే స్క్రోలింగ్ వీడియో చూసి ఏ వీడియోకి అయితే లైక్ కొడతామో అలాంటి రిలేటెడ్ వీడియోలే తిరిగి వస్తుంటాయి. ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు వస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఫోన్ పిల్లలకు ఇస్తున్నారంటే మీరు ఎలాంటి వీడియో చూస్తున్నారో వారికి కూడా అర్థమవుతుంది. వాటినే పిల్లలు చూసేలా మీరే పరోక్షంగా కారణం అవుతున్నారు. గమనించకపోతే అంతే సంగతులు.. ఇది ఇలా ఉంటే ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హోమ్ వర్క్ ఇస్తున్నారు. ఇంటి వద్ద వర్క్ చేసేటప్పుడు అర్థం కాకపోతే తల్లిదండ్రులను అడగండి లేదా రేపు స్కూల్కు వచ్చిన తర్వాత ఆ వర్క్ చేయండని ఉపాధ్యాయులు చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయులు ఆ ప్రశ్న అర్థం కాకపోతే గూగుల్లో కొట్టండి లేదా యుట్యూబ్లో చూడండని చెప్తున్నారు. ఇళ్లకు వచ్చిన పిల్లలు మా సార్ ఫోన్లో చూసి ఈ లెక్కలు చేయమన్నాడని తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఇక ఫోన్ వాళ్ల చేతికి పోతుంది. ఆ విద్యార్థి లెక్కలు చేస్తున్నాడా... ఇకేమైనా చూస్తున్నాడా అనేది ఆ తల్లిదండ్రులకు అర్థం కాదు. ఇలా ఓ తండ్రి కుమారుడికి ఫోన్ ఇస్తే లెక్కలకు బదులు ఏమి చూస్తున్నాడో గమనించాడు. తరువాత ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి మీరు పిల్లలకు ఫోన్లు చూసి వర్క్ చేయమని చెప్పడం ఏమిటని ప్రశ్నించాడు. కానీ ఇలా అందరు పేరెంట్స్ అడగలేరు కదా. స్మార్ట్ ఫోన్లతో నష్టమే.. స్మార్ట్ ఫోన్లతో ఎంత మేలు ఉందో... అంతే చెడు కూడా ఉందని మానసిక వైద్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఫోన్లు లేని విద్యార్థులు ఉండడం లేదు. పదో తరగతికి వచ్చారంటే ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇంటర్మీడియట్ చదివే పిల్లలను కాలేజీలకు ఫోన్లు తీసుకురావద్దన్నా వినడం లేదు. కందుకూరులోని కళాశాల సంక్షేమ హాస్టళ్లలోని అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఈ ఫోన్ల వల్ల ఏ విద్యార్థి కూడా సమయానికి నిద్ర పోవడం లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో వీడియోలు ఓపెన్ చేసి చూస్తుంటే ఎప్పుడు ఆపుతారో కూడా తెలియని పరిస్థితి. దీని వల్లనే గాఢ నిద్ర లేక మానసికంగా యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రీడా మైదానాల్లో ఉండాల్సిన విద్యార్థులు ఫోన్లు పట్టుకొని చెట్ల కింద, రూమ్లలో ఉండిపోతున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి ఆధునిక ప్రపంచంలో సామాజిక మాధ్యమాల అవసరం ఉన్నప్పటికీ.. వాటి వినియోగంలో పరిపక్వతను, విజ్ఞతను పాటించాల్సిన అవసరం ఉంది. సామాజిక మధ్యమాలు, మొబైల్ గేమ్స్కు బదులు పిల్లలు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. మొబైల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. చిన్న పిల్లలు అల్లరి చేస్తున్నారని మీ ఫోన్ పిల్లలకు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ పి.పాపారావు, ఆల్ ఇండియా సైకలాజికల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్మార్ట్ఫోన్లతో అనర్థాలు స్మార్ట్ఫోన్ల వల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కళాశాలల్లో ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడే విద్యార్థులు కూడా వేల రూపాయల మొబైల్స్ వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ తరగతులు ఉంటాయి. కానీ ఎంత వరకు ఉపయోగించాలో అంతే ఉపయోగించాలి. అది కాస్తా వీరే కార్యకలాపాలకు దారి తీస్తున్నాయి. కళాశాలలకు ఫోన్లు తీసుకురావడం నిషేధించేందుకు ప్రయత్నించాలి. – డాక్టర్ ఎం.రవికుమార్, టీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ (చదవండి: రూ. 8 లక్షలు కోట్లు విలువ చేసే స్నాక్బ్రాండ్..! ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..) -
88 ఏళ్ల నాటి స్నాక్ బ్రాండ్..ఏకంగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్..!
సరదాగా సాయంత్రం కాసిన్న వేరుశెనగపప్పులో, మరమరాలు తింటుంటే ఆ మజానే వేరు. అందులోనూ మన భారతీయులకు చిరుతిండి అంటే మహా ఇష్టం. ఎన్ని చిరుతిండి బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చినా..తన హవా చాటుతూ దూసుకుపోతున్న బ్రాండ్ ఏదంటే..ఠక్కున చెప్పేది హల్దిరామ్. నిన్న మొన్నటిది కాదు..ఏకంగా 88 ఏళ్ల నుంచి అశేష ప్రజల ఆధరణతో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనిపించుకున్న స్నాక్ ఐటెం ఇది. మార్కెట్లో దీని టర్నోవర్ వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. అలాంటి మన భారతీయ చిరుతిండి పెట్టుబడిదారుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే..విస్తుపోతారు. నిజమేనా అని నోరెళ్ల బెడతారు. అంతలా అందరి మనసును దోచుకున్న ఈ చిరుతిండి కథకమామీషు ఏంటో చూద్దామా..!.ప్రసిద్ధి చెందిన ఐకానిక్ స్నాకింగ్ బ్రాండ్లలో ఒకటిగా పేరుగాంచింది హల్దిరామ్ భుజియా చిరుతిండి. ప్రస్తుతం ఈ బ్రాండ్ దాదాపు వంద రకాల స్నాక్లను అందిస్తోంది. అందరూ మెచ్చిన రకం చిరుతిండి మాత్రం హల్దిరామ్ భుజియానే. దీనికి భారతదేశం అంతటానే గాదు విదేశాల్లో సైతం ఐకానిక్ బ్రాండ్గా ఉంది. ఈ బ్రాండ్ యజమాని తన అత్త నుంచి ఈ భుజియా రెసిపీని తెలుసుకున్నాడట. అయితే ప్రజాదరణ పొందడం కోస అత్త ట్రిక్ని ఉపయోగించేవాడట. దీనికి ఎఫ్ఎంసీజీ బ్రాండ్ ఆల్ఫా వేవ్లో రూ. 5600 కోట్ల వాటా ఉంది. అంతేగాదు దీనికి టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ పెట్టుబడిదారుడిగా మారడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ హల్దిరామ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదండోయ్ ఈ విషయాన్ని స్వయంగా హల్దిరామ్ బ్రాండ్ ప్రతినిధే ఖరారు చేశారు. ప్రస్తుతం ఈబ్రాండ్ స్వీట్లు వంటి వాటిని కూడా అందించడంతో దీని విలువ ఏకంగా రూ. 8 లక్షల కోట్లకు చేరుకుందని అంచనా. మొదలైందిలా..మెగాబ్రాండ్గా అవతరించిన ఈ హల్దీరామ్ ప్రస్థానం 1937లో జరిగింది. రాజస్థాన్లోని బికనీర్లో ఒక చిన్న స్వీట్లు, స్నాక్స్ దుకాణంగా ప్రారంభమైంది. ఆ దుకాణం యజమాని గంగా బిషన్ అగర్వాల్ని చుట్టపక్కల వాళ్లు ఆప్యాయంగా హల్దిరామ్ జీ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయనే ఈ హల్దిరామ్ బ్రాండ్ వ్యవస్థాపకుడు. ఆ తర్వాత కోలకతా, నాగపూర్, ఢిల్లీకి విస్తరించి..ఘన విజయాన్ని అందుకుంది. ఆబ్రాండ్ వ్యవస్థాపకుడు గగన్ బిషన్ అగర్వాల్ దూరదృష్టి, అంకితభావం, కృషిల కారణంగా చిరుతిండి సామ్రాజ్యంలో రాణిగా పేరుతెచ్చుకుంది. 1980ల ప్రాంతంలో హల్దిరామ్ పెద్ద మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు సాంప్రదాయ వంటకాలకు ఆధునిక తయారీ పద్ధతులను జోడించి రుచికరంగా తయారుచేయడంతో ఈబ్రాండ్ అతడి ఇంటి పేరుగా మారిపోయింది. ఇది పాపడ్లు నుంచి రెడీ టు ఈట్ మీల్స్, నామ్కీన్ల వరకు మార్కెట్లలో తన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించిన తర్వాత భారత్ తోపాటు విదేశాలలో కూడా గణనీయమైన ఉనికిని సంపాదించగలిగింది. అలాగే ఔత్సాహిక వ్యవస్థాపకులుకు ఓవ్యాపారాన్ని కాలనుగుణ మార్పులతో ఎలా ముందుకు తీసుకువెళ్లాలో చాటిచెప్పి..స్ఫూర్తిగా నిలిచాడు.(చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?) -
అమ్మకు.. 'కోతల' వేదన!
మంచి ముహూర్తానికే బిడ్డ పుట్టాలన్న గర్భిణి బంధువుల ఒత్తిడి.. వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రసవ నొప్పులు భరించలేకపోవడం.. కడుపుకోసి బిడ్డను తీసేస్తే పని అయిపోతుందిలే అన్న కొంతమంది వైద్యుల ధోరణి.. ప్రసవ కేసులతోనే కాసులు కూడబెట్టుకోవాలన్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో అమ్మ కడుపుపై కత్తిగాట్లు పడుతున్నాయి. సాధారణ ప్రసవాల స్థానంలో శస్త్ర చికిత్సలు అధికంగా జరుగుతున్నాయి. అమ్మను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మార్చుతున్నాయి. జీవితాంతం వేదనకు గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మకు కడుపుకోత తప్పడం లేదు. కాన్పుకు వెళ్తే.. అవసరమున్నా, లేకున్నా సిజేరియన్ పేరుతో వైద్యులు ‘సుఖప్రసవం’ చేసేస్తున్నారు. దీంతో చిన్న వయస్సులోనే ‘అమ్మ’లు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొద్దిరోజులుగా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ అనే తేడాలేకుండా సాధారణ ప్రసవాలు చేయడమే మానేశారు. కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2023–24లో జిల్లాలో మొత్తం 10,417 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 2,746 ప్రసవాలు శస్త్ర చికిత్సలు ద్వారా చేసినవే కావడం గమనార్హం. 2024–25లో 2,839 సిజేరియన్లు చేశారు. సిజేరియన్లకే ప్రాధాన్యం జిల్లాలో ఏటా సగటున 10 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన వారిలో దాదాపు 60 శాతం వరకు గిరిజనులు, పేదలే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు 44, ప్రైవేట్ ఆస్పత్రులు 20 వరకు ఉన్నాయి. దాదాపు అన్నిచోట్లా గర్భిణులకు ‘కడుపు కోత’లతో వేదన తప్పడం లేదు. అవసరం లేని సందర్భంలో సిజేరియన్లు చేయవద్దని పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికీ.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో హైరిస్క్, ఆరోగ్య సమస్యల పేరుతో గర్భిణులను తరచూ పెద్దాస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్లకు పంపుతున్నారు. అక్కడ శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. చాలా పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ప్రసవాలకు వెళ్తే.. పెద్దాస్పత్రులు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో 108 వాహనాల్లోనే మార్గమధ్యంలో ప్రసవాలు జరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో 251 ప్రసవాలు 108 వాహనాల్లోనే కావడం గమనార్హం. మరోవైపు జిల్లా ఆస్పత్రికి గర్భిణుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 10 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ప్రైవేటుకు వెళ్తే.. కాసుల బేరమే... జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుకు వెళ్తే ప్యాకేజీ మాట్లాడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా వరకు యాజమాన్యాలు గర్భిణులను సిజేరియన్లకు సంసిద్ధం చేస్తున్నాయి. ఉమ్మనీరు తక్కువ ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. తల్లీబిడ్డల ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని.. ఇలా ఏదో కారణం చెప్పి గర్భిణి కడుపు కోసి.. డెలివరీ చేస్తున్నారు. మరికొంత మంది గర్భిణులు ముహూర్తాలు, ఇతర కారణాలతో వారు కోరుకున్న సమయానికి సిజేరియన్తో డెలివరీ చేయించుకుంటున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చేస్తున్న ప్రకటనలు అక్కడి వరకే పరిమితమవుతున్నాయి. సంపాదనే లక్ష్యంగా గర్భిణుల ప్రాణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు చెందిన కొందరు వైద్యులు అక్కడకు వచ్చిన గర్భిణులకు ఏదో కారణం చెప్పి.. తమ సొంత ఆస్పత్రుల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడం గమనార్హం. (చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని నివారించాలంటే..?) -
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్ని లీడ్ చేస్తే బెటర్ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్ సీక్రెట్ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్ మీల్ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు. నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు. డైట్ ఎలా ఉంటుందంటే..రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్బ్రెడ్.ఎర్రటి గోధమ జోవర్ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె. చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.(చదవండి: అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..) -
అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..!
తాతగారు తన మనవళ్లు, మనవరాళ్లను దగ్గర కూర్చోబెట్టుకొని సరదాగా ముచ్చటించేవాడు. చందమామ కథలు చెప్పేవాడు. హాయిగా నవ్వించేవాడు.ఇప్పటి దృశ్యం.....తాతయ్య ఎప్పుడూ ఒంటరిగానే కనిపిస్తాడు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు. పిల్లలు హోంవర్క్ అనే ప్రపంచం నుంచి ఎప్పుడోగానీ బయటికి రారు. బయటికి వచ్చినా తాతయ్యతో పొడి పొడి మాటలే ఉంటాయి. ఈ నేపథ్యంలో అలనాటి బంగారు కాలాన్ని గుర్తుకు తెచ్చే వీడియో నెటిజనులలో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. 96 ఏళ్ల తాతయ్య తన ముని మనవరాలితో ఆడుకుంటున్న వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. చిన్నారి నవ్యతో బొమ్మలాట ఆడుకుంటున్నప్పుడు తాతయ్య కనులలో కోటి పండగల కళ కనిపించింది. ఈ వీడియో క్లిప్ను చూస్తూ చాలామంది తమ బాల్యంలోకి వెళ్లి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను గుర్తు తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Navya Patel (Pihu) (@navyapatel_02) (చదవండి: రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!) -
ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..!
వేసవిలో చర్మ సంరక్షణ, మేకప్ గురించి కొంత ఆందోళన సహజం. ఎండకు చర్మం కమిలిపోవడం, మేకప్ చెదిరిపోవడం సహజంగా జరుగుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా...ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు సన్స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే ఎస్పిఎఫ్ ఉన్న మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాలి. దీనివల్ల చర్మానికి రక్షణ లభిస్తుంది.బయటకు వెళ్లినప్పుడు పట్టిన చెమటను తుడవడానికి టిష్యూ పేపర్ను ఉపయోగించాలి. చెమట పట్టిన చోట టిష్యూ పేపర్ను అద్దితే, త్వరగా పీల్చుకుంటుంది. దీని వల్ల మేకప్ చెదిరి΄ోకుండా ఉంటుంది.మేకప్ తొలగించిన తర్వాత చర్మం విశ్రాంతి పొందడానికి హైడ్రేటింగ్ షీట్ మాస్క్ను ఉపయోగించవచ్చు. జిడ్డు పోవడానికి కీర, దోస రసం, అలొవెరా జెల్ మాస్క్లా వాడి, ఐదు నిమిషాల్లో చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మం తాజాగా మారుతుంది.చెమట వల్ల చర్మంపై దద్దుర్లు వస్తుంటాయి. సబ్బులకు బదులు బాడీ, ఫేస్ వాష్లతో శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల చర్మంపై గల సూక్ష్మ రంధ్రాలు సహజ నూనెలు కోల్పోవు.ఈ కాలం త్వరగా అలసట వచ్చేస్తుంటుంది. అందుకని, రోజూ పడుకునేముందు కళ్ల కింద అవకాడో లేదా అలొవెరా క్రీమ్ లేదా ఫిష్ ఆయిల్తో మృదువుగా వేలి కొనలతో అప్లై చేయాలి. లేదంటే ఐ క్రీమ్ వాడచ్చు. వారంలో రెండు సార్లు పాదాలను స్క్రబ్ చేసి, ఫుట్ క్రీమ్ను ఉపయోగించాలి. సంతోషి సౌందర్య నిపుణురాలు(చదవండి: సమ్మర్ ఫ్యాషన్: ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్..) -
ప్లస్ సైజ్..ప్లస్ స్టైల్..
సరైన ఫిటింగ్తో డ్రెస్సింగ్ ఉంటేనే బాగుంటుంది అనేది చాలామందిలో ఉండే ఆలోచన. ప్రస్తుత రోజుల్లో ఎంత వదులైన డ్రెస్ వేసుకుంటే అంత స్టైలిష్గా ఉంటాం అనేది అసాధారణ ఆలోచనగా మారింది. ట్యునిక్స్, కుర్తీస్, షర్ట్స్, టాప్స్, ప్రాక్స్.. ఏ మోడల్ డ్రెస్ అయినా వదులుగా ఉండటం వల్ల ఈ వేసవికి తగినట్టు సౌకర్యంగానూ, స్టైలిష్గానూ ఉంటుంది. ప్లస్ సైజ్ డ్రెస్సుల్లో ప్లస్ స్టైల్ మార్కులూ కొట్టేయవచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ల డ్రెస్సులు వేసుకొని, వాటిలో మునిగినొతున్నట్టు కనిపించినా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి ఆనందాన్ని ఈ సీజన్లో ఓవర్సైజ్డ్ డ్రెస్సులు ధరించి పొందవచ్చు. చూపరుల నుంచి ‘ఎంత స్టైలిష్గా ఉన్నారు...’ అనే కితాబులూ దవచ్చు. పూర్తిగా శరీరం అంతా కప్పేసినట్టుగా ఉన్నా ఈవెంట్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. స్లిమ్గా ఉన్నవారు కూడా ఈ సీజన్లో ప్లస్ సైజ్ డ్రెస్సులు వేసుకొని హాయిగా తిరిగేయవచ్చు. ఈ స్టైల్ని ఎవరికి వారు వినూత్నంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. వదులైన ట్యునిక్స్ ధరించినప్పుడు నడుము దగ్గర బెల్ట్తో ఓ స్టైల్ని, ముడి వేసి మరో స్టైల్ని సృష్టించవచ్చు. జీన్స్కి టాప్గా ఉపయోగించే వదులైన షర్ట్స్ ధరించినప్పుడు పూర్తిగా టక్ చేసి లేదా సగం టక్ చేసి స్టైలిష్గా కనిపించవచ్చు. స్ట్రీట్ స్టైల్ను పోలి ఉండే ఈ డ్రెస్సింగ్లో లేయర్డ్ ఔట్ఫిట్స్ను కూడా ధరించవచ్చు. ఒక ప్రింటెడ్ ట్యునిక్ వేస్తే, దాని మీదకు ట్రాన్స్పరెంట్ ప్లెయిన్ మరో ట్యునిక్ను వేసుకోవచ్చు. లేయర్డ్ లోనూ లూజ్ టాప్స్నే ఎంచుకోవాలి. ఈ తరహా ఔట్ఫిట్స్తోనే స్టైల్ను క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఇతరత్రా హంగులేవీ అక్కర్లేదు. సింపుల్ వెస్ట్రన్ జ్యువెలరీ, లూజ్ అండ్ బన్ కేశాలంకరణ్, పాదరక్షల విషయంలో ఫ్లాట్స్ ధరిస్తే చాలు. సీజన్కి తగిన సౌకర్యవంతమైన స్టైల్లో మెరిసిపోవచ్చు. వదులుగా ఉంటాయి కాబట్టి సిల్క్, కాటన్, షిఫాన్, ఆర్గంజా... ఏ ఫ్యాబ్రిక్ అయినా ఎంచుకోవచ్చు. టాప్ టు బాటమ్ ప్లెయిన్, ప్రింట్స్ కూడా బాగుంటాయి. (చదవండి: -
ప్రపంచ సమస్యలను-ఆర్ట్ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!
ఎన్నో రకాల రెస్టారెంట్ వంటకాలు చూసుంటారు. కానీ ఇలాంటి వంటకాల తీరుని మాత్రం అస్సలు ?చూసుండరు. ఆర్డర్ చేస్తే ఎప్పుడొస్తుందా.. ? అని గంటలతరబడి వెయిట్ చేయాలి. తీరా ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాకా..తినడం మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ రెస్టారెంట్ వడ్డించే తీరు. వంటకాలు లిస్ట్ పెద్దదే..ఆ డెజర్ట్లు వడ్డించే తీరు ఊహకు దొరకదు..ప్రశంసకు అందదు అన్నట్లుగా ఉంటాయి ఆ వంటకాలు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..కోపెన్హాగన్లోని రెఫ్షాలియోన్ జిల్లాలో ఉన్న ఆల్కెమిస్ట్ అనే రెస్టారెంట్లో ఇలా చిత్రమైన రీతీలో వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ రెండు మిచెలిన్ స్టార్లను దక్కించుకుంది. అక్కడ భోజనం ఓ గొప్ప విషయాన్ని బోధిస్తాయి. అందుకోసం అయినా అక్కడకు వెళ్లి తీరాల్సిందే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వంటకాన్ని.. పాకకళకు థియేటర్ అండ్ మల్టీమీడియా ఆర్ట్తో మిళితం చేసి.. కస్టమర్లకు సర్వ్ చేస్తుంది. వడ్డించే ప్రతి వంటకం..ఆహార కొరత, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి ప్రపంచ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా క్రియేటివిటీగా అందిస్తారు. అంతేకాదండోయ్ మెనూలో మొత్తం 40 రకాల వంటకాలను అందిస్తుంది. ఆర్డర్ కోసం గంటల తరబడి వెయిట్ చేయక తప్పదు. పైగా ధరలు కూడా కళ్లు చెదిరిపోయే రేంజ్లో ఉంటాయి. ఈ హోటల్లో తినాలంటే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి..ఆర్డర్ కోసం ఎలాంటి వాళ్లైనా.. తప్పక వెయిట్ చేయాల్సిందే. అక్కడ తింటే సుమారు రూ. 60 వేలు పైనే ఖర్చు అవుతుందట. అత్యంత డిమాండ్ ఉన్న ఈ రెస్టారెంట్లో వంటకాలకు సంబధించిన వీడియోని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ నెట్టిట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గతేడాది ఆ రెస్టారెంట్లో అందించిన వంటకాలు కనిపిస్తాయి. తినదగిన సీతాకోక చిలుకల రూపంలో డిజర్ట్ చూస్తే ప్రోటీన్ వనరులుగా కీటకాలును తినొచ్చు అని హైలెట్ చేస్తుంది. ఇంకా పచ్చి జెల్లీ ఫిష్, తినదగిన ప్లాస్టిక్లో చుట్టబడిన చేప (సముద్ర కాలుష్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో), సోర్ క్రీంతో చదును చేయబడిన కోడి తల, పాడైనట్లు కనిపించే చీజ్, బోనులో కోడి పాదాలు (ఇది వ్యవసాయం పరిస్థితిని వివరించడం కోసం), పంది, జింక రక్తంలతో చేసిన స్వీట్(రక్తదానం ప్రాముఖ్యత కోసం)..ఇలా ప్రతి వంటకం ఒక్కో ప్రపంచ సమస్యను వివరించేలా అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రెజెంట్ చేశారు. వాటిని చూస్తే మతిపోవడం ఖాయం అనేలా ఉంటాయి. నెటిజన్లు మాత్రం మరీ ఇంత లగ్జరీయస్ గానా..! అని, మరికొందరూ..ఆహారం రూపంలో ప్రపంచ సమస్యలను హైలెట్ చేసేలా కళను కూడా జోడించడం అంటే మాటలు కాదు అని సదరు రెస్టారెంట్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Tiff (@greenonionbun)(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..) -
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఉరుకుల పరుగుల జీనవ విధానంలో అందరూ తమ కెరీర్ లక్ష్యాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే జీవిత పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తలకు మించిన పనిభారానికి తోడు పోటీ వాతావరణానికి తగ్గట్లు దూసుకుపోవాలన్న ఒత్తడి కలగలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నాయి. కొందరూ నిద్రను కూడా త్యాగం చేస్తూ ఎక్కువ గంటల కంప్యూటర్ స్క్రీన్లపైనే పనిచేస్తుంటారు. పాపం ఇలానే చేసి ఓ సీఈవో ఎంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వుతారు. అంతేగాదు ఆరోగ్యం విషయంలో నాలాగా అంతా అయిపోయాక ఇప్పుడే తెల్లారిందన్నట్లుగా మేల్కోవద్దు అంటూ హితువు పలుకుతున్నారు.బెంగళూరుకి చెందిన డేజీఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ మిశ్రా లింక్డ్ఇన్లో తాను ఎదుర్కొన్న విషాదకర ఆరోగ్య పరిస్థితిని గురించి షేర్ చేసుకున్నారు. అతను తన ల్యాప్టాప్లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒక విధమైన ఆయాసంతో కూడిన వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైంది. ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుంగా జరిగిన ఈ హఠాత్పరిణామం కారణంగా మిశ్రా ఆస్పత్రిపాలయ్యారు. వైద్యులు అతడిని ఐసీయూకి తరలించి సత్వరమే చికిత్స అందించారు. అప్పుడే ఆయన రక్తపోటు అనుహ్యంగా 230కి పెరిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు సైతం అమిత్ మిశ్రా పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంతలా రక్తపోటు ఎందుకు పెరిగిపోయిందని తెలియక వైద్యులు కూడా కాస్త గందరగోళానికి గురయ్యారని పోస్ట్లో తెలిపారు మిశ్రా. "అయితే దీనంతటికీ కారణం.. పనికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. విషయాన్ని విస్మరించడమే. పనే ముఖ్యం అనుకుంటాం. కానీ అది చేయాలంటే ముందు మన ఆరోగ్యం అంతే ముఖ్యం అని అనుకోం. ఆఖరికి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోం. బాగానే ఉన్నామనే ధీమాతో ఉండిపోతాం. ప్లీజ్ మిత్రమా..ఈ పోస్ట్ని గనుక చదువుతుంటే మనం శరీరం చెప్పేది వినండి..దాని బాధను గుర్తించండి." అని పోస్ట్లో రాసుకొచ్చారు మిశ్రా. నెటిజన్లు ఆ పోస్ట్కి స్పందిస్తూ..వృత్తిపరమైన జీవితం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమ అనుభవాలనే షేర్ చేయడమే గాక మిశ్రా త్వరితగతిన కోలుకోవాలని పోస్టులు పెట్టారు.(చదవండి: 40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?) -
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు. వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.ఆ ఆహారాలు ఏంటంటే..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.(చదవండి: పొట్ట ఫ్లాట్గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
నా పేరు జి.సుధీర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల (ఫిబ్రవరి 2025), మా హెడ్ నాకు వేరే బ్రాంచ్కు బదిలీ చేశారు. కానీ నేనూ ఆ రోజు నుండి డ్యూటీ కి వెళ్ళడం లేదు. నా రాజీనామా కూడా ఇవ్వలేదు. నా చివరి జీతం (ఫిబ్రవరి నెల) పొందడానికి, పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం నేను ఏమి చేయాలి? దీనిపై లీగల్గా ప్రోసీడ్ అవ్వాలంటే ఎలా? సలహా ఇవ్వగలరు.– జి. సుధీర్, హైదరాబాద్.ప్రైవేటు స్కూలు అయినప్పటికీ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పొందడం అనేది మీ హక్కు. ప్రైవేటు స్కూళ్లకు గ్రాట్యుటీ చట్టం వర్తించదు అంటూ పలు స్కూళ్ల యాజమాన్యాలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించింది. కాబట్టి మీరు కూడా గ్రాట్యుటీకి అర్హులు. అయితే గ్రాట్యుటీ పొందాలి అంటే మీరు కనీసం ఐదు సంవత్సరాలు (లేదా 4 సంవత్సరాల 7 నెలల కన్నా ఎక్కువ) సదరు సంస్థలో పనిచేసే ఉండాలి. అలా పని చేసి ఉంటే మీకు గ్రాట్యుటీ చట్టం నిర్ణయించిన కాల్కులేషన్ (జీతము 15 రోజులు X పనిచేసిన వ్యవధి / 26) ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుంది. మీరు పనిచేసిన స్కూలు వారికి లిఖితపూర్వకంగా రాజీనామా చేసి, మీకు రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఒక దరఖాస్తు కూడా జత చేయండి. వారు పరిష్కరించని పక్షంలో హైదరాబాదులోని గ్రాట్యుటీ కమిషనర్ /లేబర్ కమిషనర్ను సంప్రదించి ఒక దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. అలాగే పి.ఎఫ్ కూడా ఇవ్వకపోతే, పీ.ఎఫ్. కమిషనర్ వద్ద దరఖాస్తు/ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మీరు పని చేసిన స్కూలు వారికి నోటీసులు పంపించి వారి పక్షం కూడా విన్న తర్వాత మీకు రావలసిన బకాయిలు చెల్లించవలసినదిగా సదరు కమిషనర్లు ఆదేశాలు జారీ చేస్తారు. రెండు విభాగాల నుంచి కూడా మీకు సరైన ఉపశమనం లభిస్తుంది. న్యాయం జరుగుతుంది. ముందు మీరు స్కూల్కు రాజీనామా లేఖను అందజేయండి.– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!) -
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్ క్లియర్! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!కేవలం ప్యాకింగ్లో తేడా వల్ల పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్ టాక్స్ అంటున్నారు. ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారట. కేవలం పింక్ ప్యాక్లో ఉన్నందున రేజర్ బ్లేడ్స్ మీద 29 శాతం, బాడీ వాష్ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట. ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజూందార్ షా కూడా స్పందించారు. ‘పింక్ టాక్స్ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. పింక్ టాక్స్ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్ట్లో దావా వేయొచ్చు. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9— Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 (చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?) -
డియర్ పేరెంట్స్.. పిల్లలకు మార్కులే జీవితం కాదు..!
‘డియర్ పేరెంట్స్.. ఇది పరీక్షల సమయం! మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ ఆందోళనగా ఉండుంటారు.. వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారో.. వందకు వంద మార్కులు తెచ్చుకుంటారో లేదో.. ఇంజినీరింగ్, మెడిసిన్కి ఎలిజిబుల్గా నిలబడతారో లేదో అని! రేపు పరీక్షలు రాయబోయే పిల్లల్లో ఒక మ్యుజీషియన్ ఉండొచ్చు.. వాడు కెమిస్ట్రీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక అథ్లెట్ ఉండొచ్చు.. ఆ అమ్మాయికి ఫిజిక్స్ కన్నా ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యం కావచ్చు. ఆర్టిస్ట్ ఉండొచ్చు.. ఆ స్టూడెంట్కి మ్యాథ్స్ని అర్థంచేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఆంట్రప్రెన్యూర్స్ ఉండొచ్చు.. వాళ్లకు హిస్టరీ, ఇంగ్లిష్ లిటరేచర్తో పనిలేకపోవచ్చు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా సంతోషం. ఒకవేళ తెచ్చుకోకపోతే.. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. ‘పర్లేదు..మళ్లీ పరీక్ష రాసుకోవచ్చులే’ అంటూ అనునయించండి. ఆ ప్రేమతో వాళ్ల కలలను సాకారం చేసుకుంటారు. ఆ ధైర్యంతో వాళ్లు జీవితాన్ని గెలుస్తారు. ప్రపంచంలో కేవలం డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే సంతోషంగా ఉంటారనే మైండ్సెట్ను మార్చుకోండి. మార్కులను కాకుండా పిల్లలను ప్రేమించండి.’ ఇది ఒక ప్రిన్సిపల్ పేరెంట్స్కి రాసిన ఉత్తరం. -
భాషలోనూ వివక్ష ఎందుకు?
భాషకు రెండువైపులా పదును ఉంటుంది! అందుకే దాన్ని జెండర్ ఈక్వాలిటీతో న్యూట్రల్ చేద్దాం! చాలారోజుల కిందట ... ‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డుపాత్రలతో కుస్తీ పడుతున్నారు’ అంటూ తన ప్రొడక్ట్ అయిన అంట్లు తోమే సబ్బు గురించి ఒక యాడ్ ఇచ్చింది ప్రాక్టర్ అండ్ గాంబుల్ సంస్థ. వెంటనే ఆ కంపెనీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది.. ‘భోజనం అందరికీ కావాలి, అంట్లతో కుస్తీ మాత్రం ఆడవాళ్లే పట్టాలి. మగవాళ్లెందుకు అంట్లు తోమకూడదు? దయచేసి మీ యాడ్లో అమెరికాలోని ఆడవాళ్లు అని తీసేసి అమెరికా ప్రజలు అని మార్చండి?’ అని! ప్రాక్టర్ అండ్ గాంబుల్ తన తప్పు తెలుసుకుని ‘అమెరికా ప్రజలు’ అని మార్చుకుంది. ఆ ఉత్తరం రాసిన అమ్మాయెవరో కాదు.. మీడియా పర్సనాలిటీ, బ్రిటిష్ రాచకుటుంబం కోడలు మెఘన్ మార్కల్. ఈ మధ్య.. ‘మా సోషల్ బుక్లో ఒకచోట ‘మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్?’ అని ఉంది. విమెన్ అని ఎందుకు లేదు? వాళ్లకు చేతకాదనా? మ్యాన్ లేదా ఉమన్ అనే బదులు ప్రజలు అనొచ్చు కదా? అబ్రహం లింకన్ కూడా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నాడు. ప్రజలంతా సమానమే అనుంటే బాగుండేది కదమ్మా!’ నిండా పదేళ్లు లేని ఓ చిన్నారి ఆలోచన! సవరించుకోవాలి.. పై రెండు ఉదాహరణల్లోని విషయం.. భాషకూ జెండర్ ఈక్వాలిటీ ఉండాలనే! కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక పెంపకంతోనే మొదలవ్వాలని ఎలా అనుకుంటున్నామో.. భాష విషయంలోనూ అలాగే అనుకోవాలి. పనికి సామర్థ్యం, నిర్దేశిత అర్హతలు ప్రామాణికమవుతాయి కానీ స్త్రీ, పురుష జెండర్లు కావు కదా! ఆడవాళ్లు అల్లికలకే పరిమితమై పొవట్లేదు.. అంతరిక్షానికీ వెళ్తున్నారు. అందుకే తదనుగుణంగా భాషను సవరించుకోవాలి. వాళ్లూ మినహాయింపు కారు.. జెండర్ స్పృహ ఉన్న రచయితలు, దర్శకులూ వాస్తవికత, రానెస్ పేరుతో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరచే తిట్లన్నిటినీ రచనల్లో, సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అదేమంటే ‘దాన్నెందుకు జెండర్ కోణంలోంచి చూస్తారు? కోపానికో.. ఆవేశానికో ఎక్స్ప్రెషన్గా చూడాలి కానీ’ అంటూ బదులిస్తున్నారు. అలా స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే మాటలను భావోద్వేగ వ్యక్తీకరణగా భాషలో సర్దేసి.. దాన్నో సాధారణ విషయంగా మన మెదళ్లకు తర్ఫీదునిచ్చిందీ పితృస్వామ్యమే! కానీ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచనను మార్చుకోవలసిన .. ఆ భాషను సరిదిద్దుకోవలసిన అవసరాన్ని గ్రహించాలి. పనులు, వృత్తులకున్న పేర్ల నుంచే ఇది మొదలవ్వాలి. ఈ కసరత్తు వల్ల లైంగిక పరిభాష, స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే భావోద్వేగ వ్యక్తీకరణలూ నెమ్మదిగా మెదళ్ల నుంచి డిలీట్ అవుతాయి.దస్తావేజులు.. పాఠ్యపుస్తకాల్లోనూ.. ఈ విషయంలో పాశ్చాత్యదేశాల్లో కృషి జరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్లో! ఎయిర్ హోస్టెస్ని ఫ్లయిట్ అటెండెంట్గా, మ్యాన్.. ఉమన్ అనే పదాలను పర్సన్గా, బాలుడు.. బాలికను చైల్డ్గా, వెయిటర్.. వెయిట్రస్ను సర్వర్గా, యాక్టర్.. యాక్ట్రెస్ను పెర్ఫార్మర్గా.. ఇంకా ఫైర్ఫైటర్, పోలీస్ ఆఫీసర్ వంటి ఎన్నో జెండర్ న్యూట్రల్ పదాలను ఉపయోగిస్తున్నారు.ఇంకో అడుగుముందుకేసి జెండర్ను కేవలం స్త్రీ, పురుషులకే పరిమితం చేయకుండా మిగిలిన ఐడెంటీలనూ కలుపుకుంటూ అతడు, ఆమెకు బదులు They అనే పదాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు. స్కాండినేవియన్ దేశాలు సహా జర్మనీ, పోర్చుగల్, నెదర్లండ్స్ లాంటి యూరోపియన్ దేశాలైతే అధికారిక వ్యవహారాలు, దస్తావేజులు, పాఠ్యపుస్తకాల్లోనూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ను ప్రోత్సహిస్తున్నాయి. చట్టాలు కూడా ప్రగతిశీల దేశాలు కొన్ని లింగ వివక్షను రూపుమాపేందుకు థర్డ్ జెండర్నీ కలుపుకుంటూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్ను ్ర΄ోత్సహించే చట్టాలనూ తెచ్చుకున్నాయి. ఆ జాబితాలో అమెరికా (ట్రంప్ వచ్చాక మార్పు వచ్చి ఉండొచ్చు), కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలున్నాయి. ఇదివరకు స్త్రీకి చదువు లేదు. ఇంటిపట్టునే ఉండేది కాబట్టి ఆ పనులు ఆడవాళ్లకే పరిమితమై వాటి పరిభాష అంతా స్త్రీ లింగంలోనే స్థిరపడింది. ఇప్పుడు మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారు. వాళ్ల పనికి గుర్తింపు, గౌరవ మర్యాదలు కావాలి. ఆ ప్రయత్నంలో తొలి అడుగు భాషదే. స్త్రీ, పురుష సమానత్వ ప్రయాణంలోని ప్రతి మార్పునూ గమనిస్తూ తదనుగుణంగా భాషను దిద్దుకోవాలి. భాషకూ జెండర్కూ సంబంధం ఉంది భాషకు, జెండర్కు ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్రం, సాంస్కృతిక సిద్ధాంతాలు, భాషాశాస్త్రం, స్త్రీవాద కోణాల నుంచి చూడవచ్చు. విశ్లేషించవచ్చు. దీనిపై 1970ల నుంచే పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. నిత్యజీవితంలో భాషను జెండర్ను నిర్దేశిస్తూ కాక, జెండర్ న్యూట్రల్గా వాడడానికి అవకాశం ఉందా అన్నది ఇటీవల మనదేశంలోనూ జరుగుతున్న చర్చ. పనిగట్టుకుని స్త్రీ అని చెప్పాలా లేక ఆ హోదా, ఆ పదవి, ఆ స్థానం మాత్రమే చెప్పి, అందులో ఉన్నది స్త్రీ అయినా, పురుషుడైనా సమానమేనని ధ్వనించేలా పదప్రయోగం ఉండాలా అన్నది దీని సారాంశం. ఫలితంగా తెలుగులో అధ్యక్షుడు, అధ్యక్షురాలు అనకుండా ‘అధ్యక్షులు’ అని, మేనేజింగ్ డైరెక్టర్ని కార్యనిర్వహణాధికారి అంటే చాలనే అవగాహనకు వచ్చేశాం. మంత్రి, ఆచార్య, గురువు అనే పదాలనూ ఇద్దరికీ వాడుతున్నాం. చెప్పొచ్చేదేంటంటే భాషకూ జెండర్కూ సంబంధం ఉంది. స్త్రీలు మొరటుగా మాట్లాడినా, బూతులు వాడినా వెంటనే గగ్గోలవుతుంది. పురుషుడి దుర్భాషలను సహజంగా తీసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఇవన్నీ స్త్రీవాద విమర్శలో చర్చించాల్సిన విషయాలు. – సి. మృణాళిని, రచయిత అనాగరికులుగా పరిగణిస్తారు.. మా ఫినిష్ భాష స్వతహాగా జెండర్ న్యూట్రల్ భాష. స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే సర్వనామం ఉంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరికీ ఒకేరకమైన సంబోధన ఉంటుంది. తెలుగులో స్త్రీకి ఇది, అది అనే పదాలున్నట్టు మా భాషలో లేవు. అందుకే స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచే మాటలు ఉండవు. ఎప్పుడైనా ఎవరినోటి నుంచైనా అలాంటి ఇంగ్లిష్ మాటలు వినిపిస్తే వాళ్లను అనాగరికులుగా పరిగణిస్తారు. – ముచ్చర్ల రైతా ప్రదీప్, ఆంట్రప్రెన్యూర్ (తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో ఉంటున్న ఫిన్లండ్ వనిత)– సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: కాంతివంతమైన కళ్లకోసం...) -
కాంతివంతమైన కళ్లకోసం...
అందాన్ని ఇనుమడింప చేసేది ముఖంలోని కలువరేకుల్లాంటి కళ్లే. ఆ కళ్లే అకర్షణీయంగా కనిపిస్తే ఆ అందమే వేరు. అందుకోసం చాలమంది మగువలు తపిస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికి ప్రతి క్రీమ్లు, ఐ డ్రాప్స్ వాడుతుంటారు. వాటన్నింటికి మన ఇంట్లో దొరికే సహజమైన వాటితో కళ్లను కాంతిమంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా..!.కీరా, బంగాళదుంప రెండిటినీ జ్యూస్ చేసి, కాటన్ను గుండ్రంగా చేసుకుని ఆ జ్యూస్లోవుుంచి కళ్లపై పెట్టుకోవాలి. 15–20 నిమిషాల తర్వాత కాటన్ తీసేసి నీటితో కడిగేయాలి. తర్వాత బేబీ ఆయిల్ని కంటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా చేస్తే అలసిన కళ్ళు తిరిగి కాంతివంతంగా వూరతాయి.కనురెప్పలు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునే వుుందు క్యాస్టర్ ఆయిల్ని అప్లై చేయాలి. రెప్పలు రాలి΄ోకుండా దృఢంగా అవుతాయి. కొబ్బరినూనెను వుధ్యవేలితో తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా వుసాజ్ చేయాలి. ఇలా క్రవుం తప్పకుండా చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు ΄ోతాయి. కంటి కింద చర్మం ఉబ్బెత్తుగా అవ#తుంటే... బంగాళదుంపను గుండ్రంగా కోసి ఒక క్లాత్లో చుట్టి 15 నివుుషాల పాటు కళ్ళపైన పెట్టుకోవాలి. నీటిలో కొంచె ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగా వూరి, మెరుస్తాయి. టొమాటో రసం, నివ్మురసం రెండిటినీ సమపాళల్లో కలిపి కంటి చుట్టూ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చన్నీటితో ఓసారి, వేడినీటితో ఒకసారి కళ్ళను కడగాలి. (చదవండి: జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!) -
జస్ట్ చిల్లీసాస్తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్మెంట్లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్ పేరే బ్రాండ్ నేమ్గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్ని రూపొందించాడంటే..పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్వెజ్ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అతడి ప్రస్థానం మొదలైందిలా..1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్ మిరపకాయలతో సాస్ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు. అయితే ఇంతలో సైగాన్లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు. సాస్ వ్యాపారం ఆవిర్భావం..బోస్టన్లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్సాస్ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్ క్యాపిటల నిధులు లేవు, మార్కెటింగ్ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు. తన ప్రొడక్ట్కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్క్యాప్ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్మార్క్గా క్రియేట్ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్మెంట్ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్ అత్యంత హాట్గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు. అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్లోని చైనాటౌన్, రోజ్మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్ అని పేరు పెట్టాడు.అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్చిల్లీ బాటిల్పై లేబుల్ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్. ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్ ట్రాన్. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!) -
పొట్ట ఫ్లాట్గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత..
బానపొట్ట ఉంటే ఎలాంటి ఫ్యాషన్ వేర్లను ధరించలేం. ఆడవాళ్లు అయితే సంప్రదాయ వస్త్రాలైన చీర వంటి వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతారు. ఇక మగవాళ్లు జీన్స్, పంచె వంటి ట్రెడిషనల్ వేర్లను ధరించినప్పుడూ స్పష్టంగా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. అబ్బా ఈ పొట్ట కరిగిపోయి చక్కగా ఫ్లాట్గా ఉంటే బాగుండును అని అనుకోని వారే లేరు. ఎందుకంటే పెద్దవాళ్లే కాదు చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్యనే అధికంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు సింపుల్గా ఇలా చెక్పెట్టేయండి అంటూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రీతికా శ్రీనివాసన్ ఇన్స్టాగ్రాం వేదికగా చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..!.ఫ్లాట్ స్టమక్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. జిమ్, వర్కౌట్లంటూ పలు వ్యాయామాలు చేసేస్తుంటారు. అయినా పొట్ట ఫ్లాట్గా అవ్వడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడే తీసుకునే ఆహారాలపై ఫోకస్ పెట్టాలంటున్నారు ప్రీతికా. ఎలాంటి ఆహారాలు ఏ సమయాల్లో తీసుకుంటే మంచిది అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ ఆహార స్ప్రుహ మిమ్మల్ని అనారోగ్య సమస్యల నుంచే గాక బానపొట్టను నివారిస్తుందని చెబుతున్నారామె. అదెలోగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.రాత్రిపూట మనం తీసుకునే ఆహారాలే బానపొట్టకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు పగటిపూట తీసుకోవడమే మంచిదట. మరికొన్ని రాత్రి సమయాల్లో నివారిస్తే ఈ సమస్య తగ్గుముఖం పట్టడమే గాక పొట్ట వచ్చే అవకాశం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే..నివారించాల్సిన ఆహారాలు..పొట్ట ఫ్లాట్గా ఉండాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత ఆరు ఆహారాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. అవేంటంటే..చక్కెర కలిగిన ఆహారాలు కేకులు, కుకీలు, చాక్లెట్లు సాయంత్రం ఆరు తర్వాత పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వు నిల్వకు దారితీస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మొదట్లో కష్టంగా అనిపించినా.. రాను రాను అదొక అలవాటుగా మారుతుందట. అలాగే భారీ ప్రోటీన్లు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైనప్పటికీ ఎర్రమాంసం, కూరలు వంటి భారీ ఆహారాలు రాత్రి సమయంలో జీర్ణం కావడం కాస్త కష్టం. ఫలితంగా నిద్ర లేమి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. బదులుగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, వంటి తేలికపాటి ప్రోటీన్లు తీసుకోండి. కార్బోనేటెడ్ పానీయాలు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. పొట్ట ఫ్లాట్గా ఉండాలనుకుంటే సాయంత్రం ఆరు తర్వాత దీన్ని పూర్తిగా నివారించండి అని సూచిస్తున్నారు. ఆఖరికి సోడాలు, బీర్లు, బిస్లరీ వాటర్ తదితరాలను కూడా నిషేధించండి. ఇవి పొట్ట ఉబ్బరం,గ్యాస్, కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయట. ఇక సాయంత్రం ఆరు తర్వాత పాల ఉత్పత్తులను నివారించండి. ఇవి కడుపుపై చాలా భారాన్ని మోపుతాయట. ఇవి అరగడానికి సమయం ఎక్కువగా తీసుకోవడమే గాక జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్లు వంటి వాటిని రాత్రిపూట నివారించండి. వాటిని హాయిగా పగటిపూట తినండి గానీ సాయంత్రం తీసుకోవద్దు. తెల్లబియ్యం, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, బ్రెడ్లు వంటివాటికి కూడా దూరంగా ఉండండి. వీటివల్ల ఇన్సులిన్ స్పైక్స్, బొడ్డు కొవ్వు పెరిగేందుకు దారితీస్తుంది. చివరగా డీప్-ఫ్రైడ్ ఫుడ్స్.. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, కచోరీలు, సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఈ ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. జీవక్రియను నెమ్మదిస్తాయి. పైగా శరీరంలో అధిక కొవ్వు నిల్వకు దారితీస్తాయి. పైన చెప్పిన ఈ ఆరు ఆహారాలను డైట్లో నివారించడం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. అంతేగాదు బానపొట్ట సమస్య తగ్గడమే గాక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. View this post on Instagram A post shared by LogaPritika Srinivasan (@fitmom.club) (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
యువతలో జోష్ నింపుతున్న క్రియేటర్ మీట్స్
సృజనాత్మక శక్తి కలిగిన క్రియేటర్లకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారుతోంది. పలువురు యువతీ యువకులు సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. అత్యధిక ఫాలోవర్లను, వ్యూస్ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్న సిటీ డిజిటల్ స్టార్స్ను సొంతం చేసుకునేందుకు, మరింత మందిని తమవైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హైదరాబాద్ నగరంపై దృష్టి సారించాయి. విభిన్న రకాల ఈవెంట్లతో నగర యువతను ఊపేస్తున్నాయి. ఈ యాప్స్ ఉపయోగించేవారిలో అత్యధికులు టీనేజర్లు, అందులో యువతులు ఉండడంతో ఈ ఆన్లైన్ యాప్స్ వారి కోసం నగరంలో పలు ఆఫ్లైన్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాయి. క్రియేటర్లకు అవగాహన, మార్గదర్శకత్వం అందించడంతో పాటు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ మరింత రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఫాలోయింగ్, లైక్స్, వ్యూస్ ఉపయోగించుకుంటూ ప్రకటనలు పొందడం, మానిటైజేషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపైనా అవగాహన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ తొలి ప్రాధాన్యత.. దేశవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల క్రియేటర్లను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ వేదిక స్నాప్చాట్ తన తొలి స్నాప్చాట్ క్రియేటర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆలివ్ బిస్ట్రో రెస్టారెంట్లో గత బుధవారం నిర్వహించింది. క్రియేటర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పాటు ఆదాయం ఆర్జించే అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహించినట్టు స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్, సాకేత్ ఝా సౌరభ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు తోడ్పడేందుకు నగరానికి చెందిన క్రియేటివ్ మీడియా సంస్థలు, తమడ మీడియా, చాయ్ బిస్కెట్, సిల్లీ మాంక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకంగా క్రియేటర్ డే సృష్టి.. అంతర్జాతీయ స్థాయిలో క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా క్రియేటర్స్ డే కూడా నిర్వహిస్తున్నారు. మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టా ముంబయి, బెంగళూర్ సహా హైదరాబాద్లో నూ క్రియేటర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాయి. దీంతో పాటే ఔత్సాహిక యువత కోసం ఈ యాప్స్ గతేడాదిలో క్రియేటర్స్ ల్యాబ్ను కూడా అందుబాటులోకి తెచ్చాయి. నటి రష్మిక మందన్న, హీరో నానితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఈవెంట్స్లో పాల్గొంటుండడంతో వీటికి యువత నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరాన్ని క్రియేటర్స్ హబ్గా చూడడం తథ్యం అనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవడం బాగుంది.. ‘యూ ట్యూబ్, ఇన్స్టా ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది, లక్షలాది మందితో కనెక్ట్ అవ్వొచ్చు’ అని చెప్పారు యాంకర్ లాస్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది లాస్య.. ప్రత్యేకంగా ఇలాగే చేయాలనే ముందస్తు ప్లాన్స్ లేకుండా అప్పటికప్పుడు చేసే సరదా బిట్స్ కూడా వీక్షకాదరణ పొందే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టీవీకి, సినిమాకీ కొంత దూరంగా ఉన్నా, దీని ద్వారా ఆ లోటు తీరుతోంది. అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే వెండితెరపై మెరిసేందుకు సిద్ధమే. నా భర్త మంజునాథ్తో కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఈ సోషల్ మీడియాలో క్రియేటర్స్గా రాణించాలంటే ఎప్పటికప్పుడు మన స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ, కొత్త కొత్త పోకడలు అందిపుచ్చుకుంటూ ఉండడం అవసరం. దీనికి ఈ యాప్స్ నిర్వహిస్తున్న ఆఫ్లైన్ ఈవెంట్స్ బాగా ఉపకరిస్తున్నాయి. ఈ కారణంగానే మేము స్నాప్ చాట్ ఏర్పాటు చేసిన క్రియేటర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాం. – మంజునాథ్ లాస్య (యాంకర్) (చదవండి: పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?) -
పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్ఫోన్. ఈ మధ్యకాలంలో సెల్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్తోనే కాలక్షేపం చేస్తున్న వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ అని పిలుస్తున్నారు. అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్ సిటిజన్స్ 1–3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న సమస్యలు.. అతిగా ఫోన్ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్ ఏర్పడుతోంది. ఒత్తిడి తగ్గించాలివేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్ థంబ్’ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్ స్టాండ్స్ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం. – డాక్టర్ బి.చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్డోర్స్లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్డోర్స్లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్బర్న్స్: రేడియేషన్లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!) -
55 కిలోల వెయిట్ లాస్ : నిర్మాతకు రామ్ భార్య స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ బుల్లి తెర నటుడు రామ్ కపూర్ 55 కిలోల బరువు తగ్గడం నెట్టింట విస్తృత చర్చకు, ఊహాగానాలకు దారితీసింది. ఓజెంపిక్ లేదా సర్జరీ వంటి షార్ట్కట్ల ద్వారా అంత బరువు తగ్గాడనే అరోపణలను తీవ్రంగా ఖండించిన నటుడు కష్టపడి , అంకితభావంతో 140 కిలోల బరువును 55 కిలోలు తగ్గి 85 కిలోలకు తగ్గించుకున్నట్టు వెల్లడించాడు. దీనిపై రామ్కు అనేక ప్రశంసలు లభించాయి కూడా. అయితే రామ్కు పేరు తీసుకొచ్చిన టీవీ షో ‘బడే అచ్చే లగ్తే హై’ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం సంచనల వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఏక్తాకు కౌంటర్గా రామ్ భార్య గౌతమి కపూర్ ఒక వీడియోను పో స్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎంచుకోవాలా లేదా మౌంజారో, ఓజెంపిక్ తీసుకోవాలా, లేదా మౌనంగా ఉండాలా.. బడేహీ అచ్చే లగ్తేహై అంటూ ఒక పోస్ట్ పెట్టింది. పరోక్షంగా రామ్ కపూర్ వెయిట్ లాస్ జర్నీని ఏక్తా కపూర్ ఎగతాళి చేసింది. దీనిపై స్పందించిన గౌతమి వీడియోను విడుదల చేసింది. ఏక్తా కపూర్ తరహాలోనే కౌంటర్ "నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలా? నేను మౌంజారో తీసుకోవాలా?నేను ఓజెంపిక్ తీసుకోవాలా లేదా పైన పేర్కొన్నవన్నీ తీసుకోవాలా? లేదా నా నోరు మూసుకోవాలా? క్యుంకి హుమే బడే నహీ చోటే హే అచ్చే లగ్తే హై..' అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే ఎవరికి నచ్చినది వార్ని చేయనివ్వాలి. జీవించాలి, జీవించనివ్వాలి, ఎందుకంటే లైఫ్లో అతి ముఖ్యమైనవి ఆరోగ్యం, ఆనందం, శాంతి అంటూ గౌతమి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చివరగా నీ జీవితం నువ్వు చూస్కో అంటూ చురకలంటించింది. దీంతో భర్తకు సపోర్ట్గా నిలిచిన గౌతమిని అభిమానులు ప్రశంసించారు. View this post on Instagram A post shared by Gautami Kapoor (@gautamikapoor) ఏక్తా టీవీ సీరియల్ షో, బడే అచ్చే లగ్తే హై సీరియల్లో లీడ్ రోల్లో నటించిన రామ్కు, ఏక్తాకపూర్కు మధ్య ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. బడే అచ్చే లగ్తే హై షోలో గురించి ఒక ఇంటర్వ్యూ లో రామ్ వ్యాఖ్యల నేపథ్యంలో వారువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ సీరియల్లో సాక్షి తన్వర్ పాత్రకు మధ్య తనకు సన్నిహిత సన్నివేశాన్ని రాసినది ఏక్తా కపూర్ అని, టీఆర్పీ రేటింగ్ కోసం అలాంటి సీన్లు పెట్టడాన్ని తాను ముందుగానే వ్యతిరేకించానని రామ్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఏక్తా కపూర్ పరోక్షంగా 'నోరు మూసుకో’ రామ్పై అంటూ మండిపడింది. ప్రొఫెషనల్ యాక్టర్ కాదని, అతనివి 'తప్పుడు' వ్యాఖ్యలని, తాను నోరు విప్పితే అసలు నిజం బయటపడుతుందని, కాన మౌనమే బెటర్ అని సమాధానమిచ్చింది. ఆ తరువాత అతని వెయిట్లాస్ జర్నీపై కూడా ఏక్తా వ్యంగ్య బాణాలు విసిరిన సంగతి తెలిసిందే. -
కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్కి చేరుస్తాయంటే ఇదే..!
కష్టాలనగానే భయపడిపోతుంటాం. ఎందుకంటే ఆ సమయం ఎవ్వరైన చెప్పుకోలేని వేదన అనుభవిస్తారు. దాటుకుని రావడం అంత ఈజీ కూడా కాదు. పదేపదే వెంటాడే ఛీత్కారాలు, అవమానాలు తట్టుకుంటూ లక్ష్యంపై ఫోకస్ పెట్టడం కష్టమే అయినా సాధ్యం కానీ విషయం అయితే కాదు. అలా భావించిన వాళ్లే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని కనివినీ ఎరుగని సక్సస్ని అందుకుంటారు. పైగా తనని కష్టపెట్టిన వాళ్లే చేతులెత్తి సలాం కొట్టే స్థాయికి చేరుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 23 ఏళ్ల ఊర్మిళ. ఆమె కథ ప్రతిఒక్కరికీ ఓ కనువిప్పు, సక్సెస్కి చిరునామాగా చెప్పొచ్చు. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఊర్మిళ పాబుల్ ఐదవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగింది. ఎన్నో అవహేళనలు, కష్టాలు ఎదుర్కొంది. తన తల్లే ఒంటరిగా తనని, సోదరుడుని చదివిస్తోందన్న విషయాన్ని ఏ క్షణాంలోననూ మరువలేదు. అదే ఆమె ఎదుగదలకు బూస్టప్గా తీసుకుంది. పడుతున్న ప్రతి కష్టాన్ని తన లక్ష్యాన్ని గుర్తు చేసేవిగా భావించింది. ఆ సానూకూల దృక్పథం, అచంచలమైన పట్టుదల, దీక్షలే ఆమెను స్కేట్బోర్డింగ్లో ఛాంపియన్గా మార్చింది. పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేలా చేసింది. ఆ క్రీడలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే రేంజ్కి ఎదిగింది. అలా ఆమె 36వ జాతీయ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకోవడమే గాక UAEలోని షార్జాలో జరిగిన ప్రపంచ స్కేట్బోర్డింగ్ ఛాంపియన్షిప్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. ఈ విజయాన్నీ ఆమెను ఒలింపిక్ అర్హతకు హెల్ప్ అవుతాయి కూడా. ప్రస్తుతం ఆమె స్నోబోర్డింగ్లో శిక్షణ తీసుకుని మరీ. గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాదే స్నోబోర్డింగ్ క్రీడలో శిక్షణ తీసుకుని పోటీలోకి దిగినా.. విజయ ఢంకా మోగించి ప్రపంచమే సతన వైపుతిరిగి చూసేలా చేసింది ఊర్మిళ. 'దటీజ్ ఊర్మిళ' అనుపించుకుంది. అంతేగాదు వ్యక్తిగత కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకువచ్చే సోపానాలని చాటిచెప్పింది. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!) -
నా పిల్లలు భారత్లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్గా అమెరికన్ తల్లి పోస్ట్
అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్ డ్రీమ్. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎన్నో పాట్లుపడుతున్నారు. మనం ఇంతలా ప్రయాస పడుతుంటే ఓ అమెరికన్ అమ్మ మాత్రం సింపుల్గా అసలైన ఆనందం భారత్లోనే ఉందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. అంతేకాదండోయ్ సంపాదన పరంగా అమెరికా బెస్ట్ ఏమో కానీ సంతోషం మాత్రం భారత్లోనే దొరకుతుందని దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఆ తల్లి. అదెలాగో ఆమె మాటల్లోనే విందామా..! గత నాలుగు సంత్సరాలు ఢిల్లీలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ తన పిల్లలు యునైటెడ్ స్టేట్స్ వద్దని భారత్లోనే ఎందుకు పెంచాలనుకుంటుందో షేర్ చేసుకుంది. స్కైఫిష్ డెవలప్మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన క్రిస్టెన్ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పిల్లలు భారతదేశంలోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారని విశ్వసిస్తున్నా అంటూ ఓ వీడియోను ఇన్స్టాలో షేర్ చేవారు. అదెలాగో కూడా సవివరంగా వెల్లడించింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్లోనే గడిస్తేనే ఎందుకు మంచిదో.. ఎనిమిది కారణాలను వివరించారామె. అవేంటంటే.. భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం: భారతదేశంలో నివశిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల సామజిక నైపుణ్యాలు మెరగవ్వడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో తెలుస్తుంది. స్ట్రాంగ్ రిలేషన్స్: భారతీయుల కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుంది. ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది. అందువల్ల వాళ్లు ఈ వాతావరణంలో పెరిగితే గనుక అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటారు.కృతజ్ఞత, సద్దుకుపోవడం: సంపద, పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా బతకడం, సర్దుకుపోవడం వంటివి తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల మద్య వాళ్లు కృతజ్ఞుడుగా ఉండటం, అవతలి వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తెలుసుకుంటారు. గ్లోబల్ నెట్వర్క్ కనెక్షన్: అంతేగాదు ఇక్కడ పెరిగితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు స్నేహితులవుతారు. ఇది వారికి ప్రపంచ నెట్వర్క్ను నిర్మించడంలో సహయపడతుంది. ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్కు నిర్మించుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇలా ఆ ఆమెరికన్ తల్లి క్రిస్టెన్ ఫిషర్ ఇక్కడే తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్లు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతానంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేగాదు అమెరికాను వ్యక్తిత్వం కలిగిన దేశంగా, సామాజికంగా ఒంటరిగా ఉన్న దేశంగా అభివర్ణించింది. అయితే భారతదేశం అందర్నీ స్వాగతిస్తూ సంబంధాలను నెరుపుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది.పైగా ఒకరికొకరు సహాయ చేసుకోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అందువ్లల తన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే దినదినాభివృద్ధి చెందుతారని నమ్మకంగా చెప్పారు క్రిస్టిన్. కాగా, ఆమె గతేడాది అమెరికాని వీడుతూ భారత్లోనే ఎందుకు నివశించాలనుకుంటుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారామె. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: స్ట్రోక్ బారినపడిన జెరోధా సీఈవో నితిన్ కామత్..ఏకంగా 14 నెలలు..!) -
గూగుల్ లోకల్ గైడ్.. ఏకంగా 18 వేలకు పైగా పోటోలు, 287 ప్రాంతాలు..!
ప్రపంచంలోని ఏ ప్రదేశం, ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారం తెలుసుకోవాలన్నా.. కేరాఫ్ అడ్రస్ ‘గూగుల్ మ్యాప్స్’. ఈ వేదికలో ప్రాధాన్యత, విశిష్టత తెలుసుకున్నాకే ఆ ప్రదేశానికి వెళ్లాలా వద్దా అని ప్లాన్ చేసుకుంటారు. గూగుల్ లోకల్ గైడ్స్ విభిన్న ప్రదేశాలు సందర్శించి ఈ ఆన్లైన్ వేదికలో ఫొటోలు పోస్ట్ చేస్తారు. ఇలా ఎక్కువ ఫొటోలు ట్యాగ్ చేసిన అతికొద్ది మందిలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన కావలి చంద్రకాంత్ కూడా ఒకరు. 2017 నుంచి ఇప్పటి వరకూ ఆయన షేర్ చేసిన వేల ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం. టాప్ గూగుల్ లోకల్ గైడ్గా తన ప్రయత్నాన్ని గూగుల్ సంస్థ కూడా ప్రత్యేకంగా అభినందించడం మరో విశేషం. ఇప్పటి వరకూ గూగుల్ మ్యాప్స్కు తాను అందించిన వేల ఫొటోలు కేవలం తన మొబైల్ ఫోన్లో మాత్రమే తీశానని మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తన గూగుల్ ప్రయాణాన్ని, ఆయన చెబుతున్న ఫొటోల కథలు తయన మాటల్లోనే.. నాకు ఫొటోలు తీయడమంటే చాలా ఇష్టం. నా హాబీ మరొకరికి ఏదో విధంగా ఉపయోగపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి ఈ గూగుల్ మ్యాప్స్ కాంట్రిబ్యూషన్ మొదలైంది. ఇలా ఇప్పటి వరకూ గూగుల్ మ్యాప్స్లో 22 వేల ఫొటోలను ట్యాగ్ చేశాను. ఇందులో 18,888 కు పైగా ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఓపెన్ ఫ్లాట్ ఫాం.. ఎవరైనా ఫొటోలు వినియోగించుకోవచ్చు. గూగుల్ లోకల్ గైడ్గా వాడుకోవచ్చు. అంతేకాదు ఇదే వేదికలో 382కు పైగా వీడియోలు కూడా పొందుపరిచాను. ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు గూగుల్ మ్యాప్స్లో వాటి విశిష్టతను, ప్రాధాన్యతను తెలియజేసే 257 పైగా సమీక్షలు రాశాను. మొదటిసారి మ్యాప్స్లో.. గతంలో హైదరాబాద్లోని మూసీ నది వరదల్లో చిక్కుకున్న 150 మంది వారి ప్రాణాలను కాపాడిన చింత చెట్టు (ఉస్మానియా ఆస్పత్రి ప్రక్కన ఉన్న చింత చెట్టు)ను మొదటి సారి గూగుల్ మ్యాప్లో చేర్చాను. ఇలా హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 287 పైగా ప్రదేశాలను మొదటిసారి నేనే గూగుల్ మ్యాప్స్కు పరిచయం చేశాను. నా ఫొటోలు శాశ్వతం.. నగరంలోని జేఎల్ఎల్ అనే మల్టీ నేషనల్ కంపెనీలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తున్నాను. వీకెండ్స్, ప్రత్యేక సెలవులు, ఖాళీ సమయాల్లో ఈ ఫొటోలు తీస్తుంటాను. బీటెక్, పీజీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. ప్రకృతి, వారసత్వ కట్టడాలు, నగరంలోని మల్టీనేషనల్ కంపెనీలు, రాష్ట్రంలోని చారిత్రాత్మక అంశాలు–కట్టడాలు, అత్యుత్తమ ప్రాజెక్టులు, అరుదైన విషయాలు–వింతలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఇలా పలు అంశాలను ఫొటోలుగా బంధిస్తుంటాను. నగరంలోని అమేజాన్, అంజాన్, గూగుల్ మొదలు టీ హబ్ వరకూ అన్ని కంపెనీలకు సంబంధించిన ఫొటోలు ప్రత్యేకంగా తీసి గూగుల్ మ్యాప్స్లో షేర్ చేశాను. 2015 నుంచి ఫొటోలు తీస్తున్నాను.. కానీ నాకు ఇప్పటి వరకూ కెమెరా లేదు. నా మొబైల్ ఫోన్లో మాత్రమే ఫొటోలు తీస్తాను. ఇప్పటి వరకూ సుమారు 50 వేల ఫొటోలు తీశాను. గూగుల్ మ్యాప్స్లో ప్రస్తుతం మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. గతంలో 25 కోట్ల వ్యూస్ వచి్చనప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించారు. మా స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పెద్ద మునగల్ చేడ్ గ్రామం. మా ఊరిలోని స్కూల్ శిథిలావస్థలో ఉంటే.. వాటిని ఫొటోలుగా తీసి గ్రామ పెద్దలు, సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లగా.. వారి స్పందనతో నూతన స్కూల్ నిర్మించారు. ఈ సందర్భంగా నా మొదటి ఫొటో ఎగ్జిబిషన్ ఈ ప్రారంభోత్సవంలో పెట్టాను. మండలంలోని అడ్డాకల్లోని అన్ని గ్రామాలకు సంబంధించిన సమగ్ర అంశాలతో ఒక ప్రాజెక్టు ఫొటోగ్రఫీ జియో ట్యాగింగ్లో నిక్షిప్తం చేశాను. ఈ ప్రపంచంలో నేను శాశ్వతం కాదు.. కానీ నా ఫొటోలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది. లోకల్ గైడ్స్ కనెక్ట్లో బెస్ట్ ఫొటో.. ఇలా గూగుల్కు ఫొటోలు అనుసంధానం చేసే వారిని 1 నుంచి 10 వరకూ టాప్ లెవల్స్లో గుర్తిస్తారు. ఇందులో నేను టాప్ 10 స్థానికి చేరుకున్నాను. ఇలాంటి వారందరి కోసం గూగుల్ ఆధ్వర్యంలో సాన్ఫ్రాన్సిస్కో నగరంలో గూగుల్ లోకల్ గైడ్స్ కనెక్ట్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని 2019లో హైదరాబాద్ నగర కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమంలో టాప్ లోకల్ గైడ్గా నన్ను కూడా ఆహా్వనించడం, ఈ వేదికపై కొండాపూర్ జాలన్లోని నేను తీసిన నాగ శివాలయం ఫొటో బెస్ట్ ఫొటోగ్రాఫ్గా ఎంపిక చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. గతంలో జరిగిన గూగుల్ లోకల్ గైడ్స్ ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఈ వేదికలో మార్పులు, చేర్పులకు సంబంధించిన సూచనల అంశంలో భాగస్వామ్యం పంచుకున్నాను. ఇతర రాష్ట్రాల సమాచారం.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహరాష్ట్ర వంటి ప్రాంతాల్లోని ఫొటోలు గూగుల్లో ట్యాగ్ చేశాను. గూగుల్లోనే కాదు నేను తీసిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలా విభిన్న ప్రాంతాలు తిరిగి గూగుల్కు ఫొటోలను అందించిన ప్రదేశాలు, కట్టడాలు తదితర అంశాలకు సంబంధించి 1,272పైగా రేటింగ్స్, వాటికి సంబంధించి వ్యూయర్స్ అడిగిన 1,419 పైగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. (చదవండి: నగలు నా ఫేవరెట్ కలెక్షన్..: సూపర్స్టార్ మహేష్ తనయ సితార) -
అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాల ట్రిప్కి వెళ్లొద్దాం ఇలా..!
మే నెల 15వ తేదీ నుంచి సరస్వతి నదికి పుష్కరాలు. పుణ్యస్నానానికి ముందు ఏమైనా చూడగలిగితే బావుణ్ను.పుష్కరస్నానానికి ముందు ఐఆర్సీటీసీ వీటన్నింటినీ చూపిస్తోంది. పురి... బీచ్లో పట్నాయక్ సైకత శిల్పాలు... ఆలయంలో జగన్నాథుడు.కోణార్క్... బోద్గయ... సారనాథ్ ఈ టూర్లో చూసే వరల్డ్ హెరిటేజ్ సైట్లు. కాశీ విశ్వనాథుడు... విశాలాక్షి... అన్నపూర్ణలు గంగాసరయుల్లో హారతులు. అయోధ్య బాలరాముడు... హనుమంతుడు... కైక బహుమతి కనక్భవన్. ఈ ప్రయాణంలో... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశాకి వెళ్తాం. నాలుగో రోజుకు బీహార్లో అడుగుపెడతాం. ఐదవ రోజు ఉత్తరప్రదేశ్కి చేరుతాం. ఎనిమిదవ రోజు త్రివేణి సంగమంలో అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కరస్నానం. మొదటి రోజు..ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్లో మొదలై బోన్గిర్, జన్గాన్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ టూర్ ప్యాకేజ్లో పర్యాటకులు తమకు అనువైన స్టేషన్లో రైలెక్కవచ్చు. అలాగే దిగేటప్పుడు కూడా తమకు అనువైన స్టేషన్లో దిగవచ్చు. ఏ స్టేషన్లో రైలెక్కి, ఏ స్టేషన్లో దిగినా ప్యాకేజ్ ధరల్లో మార్పు ఉండదు.రెండోరోజుఉదయం తొమ్మిది గంటలకు పురి పట్టణం సమీపంలోని మల్తీపత్పూర్ స్టేషన్కి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన పూరీకి వెళ్లాలి. హోటల్లో చెక్ ఇన్ అయి రిఫ్రెష్మెంట్, లంచ్ తర్వాత జగన్నాథ ఆలయం దర్శనం. రాత్రి బస పూరీలో. ఇది పూరీ కాదు... పురి, అంటే పురం, జగన్నాథపురం అనే ఉద్దేశంలో జగన్నాతపురిగా వ్యవహారంలోకి వచ్చిన పేరు ఇది. ఇస్లాం దాడుల్లో 18 సార్లు ధ్వంసమైన ఆలయం ఇది. గజపతుల రాజ్యం. రాజ్యాలు, రాజరికాలు ΄ోయినప్పటికీ గజపతుల రాజవంశీయులు ఇప్పటికీ ఆలయంలో సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తోంది. పురి అనగానే జగన్నాథుడితోపాటు గుర్తు వచ్చే మరో పేరు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్. పురి బీచ్లో పట్నాయక్ చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలను చూడాలి. గోల్డెన్ బీచ్, చంద్రభాగ బీచ్లు అందంగా ఉంటాయి. మూడోరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కోణార్క్కు ప్రయాణం. ఆలయ వీక్షణం తరవాత మల్తీపత్పూర్ స్టేషన్కి చేరి రైలెక్కాలి. రైలు భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఆద్రా మీదుగా గయకు సాగిపోతుంది. చేతిలో పది రూపాయల నోటుుంటే... కోణార్క్ సూర్యదేవాలయాన్ని ఒకసారి చూసుకోండి. అసలైన సూర్యదేవాలయాన్ని ఆ తర్వాత చూడండి. కళింగ ఆర్కిటెక్చర్లో ఉన్న కదలని రథం యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ ఆలయం వంద అడుగుల ఎత్తున్న రథం ఆకారంలో ఉంటుంది. 13వ శతాబ్దంలో తూర్పు కళింగ గంగరాజు మొదటి నరసింగదేవ కట్టిన దేవాలయం ఇది. యూరప్ నుంచి వచ్చే నావికులు ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అన్నారు. పురిలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అన్నారు. బంగాళాఖాతంలో ప్రయాణిస్తున్న నౌకలకు ఈ ఆలయ శిఖరాలు పెద్ద ల్యాండ్మార్క్లు. నాల్గోరోజుఉదయం తొమ్మిదిన్నరకు గయకు చేరుతుంది. రైలు దిగి బో«ద్గయకు వెళ్లి హోటల్ గదికి వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత విష్ణుపాద ఆలయదర్శనం. రాత్రి బస బోద్ గయలోనే. బోద్గయ కూడా యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది బౌద్ధులకు పవిత్రమైన క్షేత్రం. బుద్ధుడిని హిందూ దశావతారాల్లో భాగంగా గౌరవించడంతో హిందువులకు కూడా ఈ ప్రదేశం గొప్ప యాత్రాస్థలమైంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందని చెప్పే ప్రదేశం ఇది. గయకు సమీపంలో (15 కి.మీలు) ఉండడంతో బుద్ధగయ, బో«ద్గయగా వ్యవహారంలోకి వచ్చింది. విష్ణుపాద ఆలయం గయలో ఉంది. ఈ ఆలయంలో 40 సెంటీమీటర్ల పొడవుగా ఒక అడుగు ఉంటుంది. దాని చుట్టూ షట్భుజి ఆకారంలో పాలరాతి నిర్మాణం ఉంటుంది. దాని చుట్టూ కూర్చుని పాదానికి పూజలు చేస్తారు. ఇక్కడ పూజారుల దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త పడాలి. భక్తులను దబాయిస్తుంటారు. నిర్వహణ సరిగ్గా ఉండదు, పరిశుభ్రత తక్కువ. పూజారులు తొలిచూపులోనే ఉత్తరాది– దక్షిణాది మనుషులను గుర్తించగలుగుతారు. దక్షిణాది వారి పట్ల వివక్ష స్పష్టంగా వారి కళ్లలో కనిపిస్తుంది. ఆలయ గోపురం నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించడానికి ప్రశాంతంగా సమయం కేటాయించాలి. ఐదోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి ఎనిమిది గంటలకు గయ స్టేషన్కు చేరి రైలెక్కాలి. రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు వారణాసికి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన సారనాథ్కు వెళ్లాలి. రాత్రి బస అక్కడే. సారనాథ్... ఇది బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత ఐదుగురు శిష్యులకు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం. ఇక్కడి స్థూపాన్ని థమేక్ స్థూప అంటారు. ఇది కూడా యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. మన అధికారిక చిహ్నం అశోకుడి ధర్మచక్రం కూడా ఉంది. టిబెట్ బౌద్ధులు కట్టిన బౌద్ధమఠం కూడా ఉంది. ప్రశాంతంగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఆరోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత కాశీ (వారణాసి)కి ప్రయాణం. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల దర్శనం. సాయంత్రం గంగా హారతి తర్వాత రాత్రి బస వారణాసిలో. వారణాసిలో అడుగు పెట్టక ముందే మనోఫలకం మీద విశ్వనాథుడి రూపం మెదలుతుంది. కాశీ లైవ్ దర్శనం పేరుతో వెలువడిన వీడియోలను మన మైండ్ రీమైండ్ చేసుకుంటుంది. కొత్తగా కట్టిన ఆలయం నిర్మాణపరంగా ఒక అద్భుతం. విశ్వనాథుడి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నప్పుడు పరిశీలనగా ఆలయ ప్రాంగణమంతా పరికించి చూస్తే ఇనుప కంచె వేసిన తెల్లటి నిర్మాణం కనిపిస్తుంది. అదే అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తున్న జ్ఞానవాపి. అక్కడి నంది విగ్రహం విశ్వనాథ ఆలయంలోని శివలింగానికి అభిముఖంగా ఉంటుంది. ఆ తర్వాత విశాలాక్షి, అన్నపూర్ణ, వారాహి, కాలభైరవ ఆలయాలను దర్శించుకుని గంగానదిలో పడవ విహారం చేయాలి. మణికర్ణికా ఘాట్, దశాశ్వమేథ ఘాట్ల వంటి అనేక ఘాట్లను సందర్శించి, గంగాహారతిని చూస్తే కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఉదయం పూట తాజా మీగడలో చక్కెర వేసి అమ్ముతారు. చాలా రుచిగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత బనారస్ కిళ్లీ వేసుకుని బనారస్ చీరలు, చుడీదార్లు కొనుక్కుంటే మనసు సంతృప్తి చెందుతుంది. సారనాథ్లో టైమ్ దొరికితే దుస్తుల షాపింగ్ అక్కడే చేయవచ్చు. సారనాథ్లో వీవర్స్ సొసైటీ మగ్గాలు, ప్రభుత్వ ఆథరైజ్డ్ దుకాణాలున్నాయి. ఏడోరోజుఉదయం వారణాసిలో గది చెక్ అవుట్ చేసి ఏడు గంటలకు రైలెక్కాలి. అయోధ్యకు ప్రయాణం. మధ్యాహ్నం 12.30కు అయోధ్యధామ్ స్టేషన్కు చేరుతుంది. రామజన్మభూమి, హనుమాన్గరి దర్శనం తర్వాత సాయంత్రం సరయు నదిలో హారతిని వీక్షణం. రాత్రి భోజనం తర్వాత అయోధ్యధామ్ స్టేషన్కు చేరి రైలెక్కాలి. ప్రయాణం ప్రయాగ్రాజ్కి సాగుతుంది.గంగా తీరం నుంచి సరయు తీరానికి చేరి అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి బాల రాముడి రూపం త్వరగా రమ్మని పిలుస్తూ ఉంటుంది. విశాలమైన బాలరాముడి ఆలయాన్ని చూసిన తరవాత అయోధ్యలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం హనుమాన్ గరి, ఆ తర్వాత కనక్ భవన్. సీతారాములకు వారి వివాహ సందర్భంగా కైకేయి ఇచ్చిన బహుమతిగా చెబుతారు. అయోధ్యలో నాగేశ్వరనాథ్ఆలయాన్ని రాముడి కుమారుడు కుశుడు నిర్మించాడని చెబుతారు. సరయు నదిలో హారతి కూడా గంగాహారతిని తలపిస్తూ కనువిందు చేస్తుంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటుతాయి.ఎనిమిదో రోజుతెల్లవారు జామున 4.30 గంటలకు రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిండం ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. ప్రయాగ్రాజ్ (అలహాబాద్) మనకు త్రివేణి సంగమస్థలిగానే గుర్తొస్తుంది. కుంభమేళా పూర్తి చేసుకుని నగరం సాధారణ స్థితికి చేరేలోపే సరస్వతి పుష్కరాల ఉత్సాహం మొదలైంది. త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు స్పష్టంగా కనిపిస్తాయి. గంగ నీరు బురద మట్టి కలిసినట్లు గోధూళి వేళను తలపిస్తుంది. యమున నీరు మన కృష్ణానది నీటిలాగ కారుమేఘాన్ని తలపిస్తుంది. పడవలో నది విహారం చేస్తూ రెండు నదుల నీటిని బాటిళ్లలో నింపుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని కావడంతో ఆ నీటిని వర్ణించడం సాధ్యం కాదు. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.తొమ్మిదో రోజుతెల్లవారు జామున 4.30 గంటలకు రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిండం ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. ప్రయాగ్రాజ్ (అలహాబాద్) మనకు త్రివేణి సంగమస్థలిగానే గుర్తొస్తుంది. కుంభమేళా పూర్తి చేసుకుని నగరం సాధారణ స్థితికి చేరేలోపే సరస్వతి పుష్కరాల ఉత్సాహం మొదలైంది. త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు స్పష్టంగా కనిపిస్తాయి. గంగ నీరు బురద మట్టి కలిసినట్లు గోధూళి వేళను తలపిస్తుంది. యమున నీరు మన కృష్ణానది నీటిలాగ కారుమేఘాన్ని తలపిస్తుంది. పడవలో నది విహారం చేస్తూ రెండు నదుల నీటిని బాటిళ్లలో నింపుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని కావడంతో ఆ నీటిని వర్ణించడం సాధ్యం కాదు. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.ఇర ఈ టూర్ మే నెల 8వ తేదీన మొదలవుతుంది. పుష్కరాలు మొదలయ్యే 15 తేదీ నాటికి ప్రయాగ్రాజ్కి తీసుకువెళ్తుంది. అంటే సరస్వతి నదికి పుష్కరాలు మొదలైన తొలిరోజే పుష్కర స్నానం ఆచరించే అవకాశం కలుగుతుంది. పుష్కరాలు మే నెల 26వ తేదీతో ముగుస్తాయి.ప్యాకేజీ వివరాలివి: అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్ర (సరస్వతి పుష్కరాల స్పెషల్) ఇది 9 రాత్రులు, 10 రోజుల యాత్ర. పురి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లు కవర్ అవుతాయి. ఐఆర్సీటీసి నిర్వహిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ పేరు ‘అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (సరస్వతి పుష్కరాలు స్పెషల్), కోడ్ ఎస్సీజెడ్బీజీ 41 ఇందులో ఎకానమీ (స్లీపర్ క్లాస్), స్టాండర్డ్ (3 ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) కేటగిరీలుంటాయి. ఎకానమీలో ఒక్కొక్కరికి సుమారు 17 వేలు, స్టాండర్డ్లో 27 వేలు, కంఫర్ట్లో 35వేల రూపాయలు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్సైట్ని సందర్శించండి. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG41(చదవండి: -
రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.షీర్ కుర్మా..కావల్సినవి: పాలు – అర లీటర్ (3 కప్పులు); నెయ్యి – టేబుల్స్పూన్; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ – టేబుల్ స్పూన్; రోజ్వాటర్ – టీ స్పూన్తయారీ విధానం: సేవియాన్ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.కచ్చీబిర్యానీ..కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)తయారీ విధానం:బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. (చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్) -
వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్
రోజంతా బండెడు చాకిరీ చేసే భార్యకు ఇంటి పనిలో భర్త చేసే చిన్నపాటి సాయం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. లేచింది మొదలు పడుకునే వరకు అలుపెరుగని ఆమె శ్రమకు వారంలో ఒక్కరోజైనా విరామం అవసరం. ఆదివారం (Sunday) భర్త ఇంటి పనులు చక్కబెడుతూ ఆమెను మురిపిస్తే వారి సంసార బంధం మరింత బలపడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.సాక్షి, భీమవరం: తెల్లారి లేచింది మొదలు ఆడవాళ్ల చేతులు పనులకు ముడిపడతాయి. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, భర్త, పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు సిద్ధం చేసి పెట్టడం. అవి పూర్తయ్యేలోగా లంచ్ బాక్స్లు ప్యాకింగ్. ఇలా.. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు క్షణక్షణం ఉరుకులు పరుగుల జీవితం. భర్తను ఉద్యోగానికి, పిల్లల్ని బడికి సాగనంపాక బండెడు గిన్నులు తోముకుని, ఇంటిల్లపాదివి మాసిన దుస్తులు ఉతుక్కుని, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని.. హమ్మయ్యా అనుకునేసరికి టైం 11 అయిపోతుంది. చాలామంది గృహిణులు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేసేది అప్పుడే. సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏదో పనిలో ఈదుతూనే ఉంటారు. పిల్లలతో హోం వర్క్ చేయించి రాత్రి అందరూ పడుకున్నాక ఉదయానికి అన్నీ సర్దుకుని అలసిసొలసి అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. కుటుంబానికి చేదోడుగా.. భర్త, పిల్లల్ని సాగనంపి కుటుంబ పోషణకు చేదోడుగా ఉద్యోగాలు, పనులు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిపై పనిభారం మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో తొలి మేలుకొలుపు భార్యదే. రాత్రి బాగా పొద్దిపోయాక నిద్రపోయేది ఆమెనే. పనుల సుడిగుండంలో తనను తాను మరిచిపోయి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమం కోరే వ్యక్తి ఇల్లాలు. అలాంటి అర్ధాంగికి ఉపశమనం (Relief) కలిగించేలా వారాంతాలు, ముఖ్యంగా ఆదివారం ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ద్వారా గృహిణుల మానసిక, శారీరక స్థితులు మ రింత దృఢమవుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. గృహ సంబంధ బాధ్యతలు పంచుకోవడం మేలని, ఈ దిశగా అందరూ ముందుండాలని అంటున్నారు. ఏమేం చేయాలంటే.. →ఉదయం లేవగానే గదులను తుడవడం, దుమ్ములు దులిపి ఇంటిని శుభ్రం చేయడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, మొక్కలకు నీరు పెట్టడం. గిన్నెలు తోమడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఐరెన్ చేయడం → పిల్లలు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి వారికి స్నానాలు చేయించడం, హోంవర్క్లో సాయం చేయడం, వారితో కలిసి సరాదాగా ఆడుకోవడం వంటివి భర్తలు చేస్తుండాలి.ప్రయోజనాలెన్నో.. → ఇంటిపనిలో చేదోడువాదోడుగా ఉండే భర్తని ఇల్లాలు చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని నిపుణులు అంటున్నారు. భర్త తనను ఎంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు, అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఆదివారం వర్క్ షేరింగ్తో ఆ ఇంట హ్యాపీనెస్ (Happiness) లోడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. → ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి వలన ఆమె శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది.→ ఇంటి పనులు త్వరగా పూర్తయితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు సమయం పెరుగుతుంది. → సెలవురోజున పని అయ్యాక ఇల్లాలని సరదాగా బయటకు తీసుకువెళ్లడం వలన వారికి రీఫ్రెష్ అయిన భావన కలిగి వారమంతా ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. → ఇల్లాలు భర్త నుంచి కొంత సమయం కోరుకుంటుంది. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని భావిస్తుంది. ప్రేమగా వారి పనుల్లో పాలుపంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది. → ఇంటి పని మహిళలే చేయాలన్న భావన నుంచి బయటపడొచ్చు. చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ఏం నేర్పిస్తున్నారు?భార్యకు విశ్రాంతి అవసరం భార్యకు ఒక్కరోజు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం. పని ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం కలుగుతుంది. వారిని పట్టించుకోనట్టు ఉంటేనే ఆడవారికి అలకలు, కోపాలు వస్తాయి. భర్త ఇంటి పనుల్లో కలుగజేసుకుని భార్యకు చేసే సాయం వారి బంధానికి మరింత బలమవుతుంది. కౌన్సెలింగ్లో భార్యాభర్తలకు ఈ విషయాన్ని చెబుతుంటాం. – చల్లా భారతిదేవి, సైకియాట్రిస్ట్, పాలకొల్లు ఆయనకు సెలవొస్తే..మా వారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. ఆదివారం, సెలవు రోజుల్లో ఇంటి వద్ద వంట పని, ఇంటి పనుల్లో సాయం చేస్తుంటారు. నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉందని సంతోషం, సంతృప్తి కలుగుతుంటాయి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి నా భర్త సహకారమే కారణం. – అంబటి అరుణ సూర్యకుమారి, గృహిణి, నరసాపురం తప్పనిసరిగా సహకరించాలి ఇంటి, వంట పనుల్లో భార్యకు తప్పనిసరిగా సహకరించాలి. నేను వ్యాపారరీత్యా ఆరు రోజులు షాపులో ఉన్నా ఆదివారం తప్పనిసరిగా ఇంటి పనుల్లో నా భార్య లక్ష్మీకుమారికి సహాయపడతాను. ఇతర రోజుల్లోనూ ఇతర పనుల్లో సహాయం చేస్తా. భా ర్యలకు సాయం చేయడం బాధ్యతగా భావించాలి తప్ప నామోషిగా ఫీల్ కాకూడదు. – కారుమూరి నర్సింహమూర్తి (బాబు), భీమవరం ఇంటి పనుల్లో సాయపడతాను నేను ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడిని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటి కోసం కష్టపడే నా సతీమణి కోసం ఆదివారం ఇంటి పనుల్లో సాయపడతాను. అప్పుడు తెలుస్తుంది ఇంటిని చక్కబెట్టేందుకు ఆవిడ ఎంత కష్టపడుతుందోనని. పొద్దస్తమాను పనిచేసే మహిళలకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం. – పొద్దోకు గజేంద్ర గడ్కర్, ఉపాధ్యాయుడు, రాయకుదురు -
50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్..!
పిల్లలూ... ఇక్కడ మీరు టేబుల్ మీద చూస్తున్నది ఏమిటో తెలుసా? ఏనుగు. కాని ఏనుగు కాదు. పూర్వకాలపు ఏనుగు. ఐస్ఏజ్ కాలం నాటిది. ఇప్పటి ఏనుగులా కాక ఒంటి నించి రోమాలతో ఉండేది. దానిని ‘మమొత్’ అంటారు. డైనోసార్లలాగానే ఇది కూడా భారీ ఆకారంతో ఉండేది. దీనికి పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. కాని డైనోసార్లలాగానే 4000 ఏళ్ల క్రితం మమొత్లు కూడా అంతరించి పోయాయి. దానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు కాని ఏదైనా మహమ్మారి కావచ్చని శాస్త్రవేత్తల ఊహ. అయితే వీటి కళేబరాలు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది రష్యాలోని ‘ఎకుషియా’ అనే చోట మంచు పొరల కింద దొరికిన పిల్ల మమొత్ కళేబరం. ఇది పిల్ల ఏనుగే అయినా దీని బరువు 180 కిలోలు ఉంది. ఇది 50 వేల ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఆ కళేబరానికి ‘నెక్రోప్సీ’ చేస్తున్న ఫొటోలు ఇవి. మనిషి మృతదేహాన్ని కోసి పరీక్ష చేస్తే ‘అటాప్సీ’. జంతువులను కోసి పరీక్ష చేస్తే ‘నెక్రోప్సీ’. ఈ పరీక్షల వల్ల మమొత్లకు సంబంధించిన మరిన్ని జీవన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. (చదవండి: 'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..) -
'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..
జర్నలిస్టు అంటే ఎవరు? ప్రపంచానికి వార్తలు అందించేవాడు. ప్రజలకు కీడు చేసే విషయాలను తెలిపి చైతన్యపరిచేవాడు. ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగట్టేవాడు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేసే యుద్ధాలలో ఎంత విధ్వంసం జరుగుతుందో చూపేవాడు. జర్నలిస్టులు కొందరు ఆఫీసులో కూచుని పని చేస్తే మరికొందరు ఫీల్డులో ఉంటారు. ఆ ఫీల్టు యుద్ధ క్షేత్రమైతే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తారు.ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాపై యుద్ధదాడులు చేస్తోంది. ఇది టీవీల్లో మీరూ చూసి ఉంటారు. ఇజ్రాయిల్– గాజా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో గాజాకు చెందిన 12 ఏళ్ల సుమయ్యా జర్నలిస్టు అవతారం ఎత్తింది. స్థానికంగా జరుగుతున్న అంశాల గురించి రిపోర్ట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.‘షిరీన్ అబూ’ అనే మహిళా జర్నలిస్టు కొంతకాలంగా గాజాపై జరుగుతున్న దాడుల గురించి అల్ జజీరా అనే ఛానెల్లో రిపోర్టింగ్ చేస్తూ ఉండేది. అయితే ఆమె మరణించింది. క్షేత్రస్థాయిలో ఆమె చెప్పే వార్తలు వింటూ ఉన్న సుమయ్యాకు ఆమె మరణం తీరని బాధను మిగిల్చింది. ఆమె ఆపిన పనని తాను పూర్తి చేయాలని భావించింది. వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ముందుగా వారు భయపడ్డారు. అప్పటికే వందమంది దాకా జర్నలిస్టులు యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రాణాలు వదిలారు. అంత అనుభవం ఉన్నవారికే అలా జరిగినప్పుడు తమ కూతురు యుద్ధరంగంలో ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అయితే సుమయ్యా వారికి ధైర్యం చెప్పింది. స్థానికంగా జరుగుతున్న విషయాలను ప్రపంచానికి చూపించడం తన బాధ్యత అని వారికి వివరించింది. వారి అనుమతితో జర్నలిస్టుగా మారింది. అల్ జజీరా ఛానెల్లో అతి చిన్న జర్నలిస్టుగా మారింది. గాజాపై జరుగుతున్న దాడులు, అక్కడి ప్రజల స్థితిగతుల్ని ప్రపంచానికి వివరించింది. ఏమాత్రం బెరుకు లేకుండా తను చెప్పే విషయాలు అందర్నీ ఆలోచింపజేశాయి. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆగిపోవాలని, అంతా శాంతి నెలకొనాలని అంటోంది. అదే తన లక్ష్యమని, అందుకే ఈ రంగంలోకి వచ్చానని వివరిస్తోంది. తన ధైర్యానికి, ఆలోచనలకీ అందరూ శెభాష్ అంటున్నారు. (చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. వారికి ఏం నేర్పిస్తున్నారు?) -
పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి విలువలతో బతుకుతారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి బ్యాగుల్ని, వస్తువుల్ని చక్కగా సర్దుకునే అలవాటు నేర్పించాలి. చక్కగా సర్దుకోవడం నేర్చుకుంటే వారి వస్తువుల్ని ఎక్కడ పెట్టారో అన్న క్లారిటీ వారికి ఉంటుంది. మార్నింగ్ స్కూల్ వెళ్లే టైమ్లో హడావిడి పడుకుండా తమ వస్తువుల్ని సులభంగా కనుగొంటారు. అంతేకాకుండా వారి పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో దూర్రప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండాల్సినప్పుడు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు, వారి వస్తువులను సరైన స్థలంలో పెట్టేలా వారికి నేర్పండి.కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం...పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం గురించి చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి యూనిఫామ్ తీసివేయమని చెప్పండి. ఆ తర్వాత చేతులు, ముఖం వాష్ చేసుకోమని వారికి చెప్పండి. ఈ అలవాటు నేర్చుకోవడం వల్ల పరిశుభ్రత ఎంతో కీలకమని తెలుసుకుంటారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.సమయాన్ని తెలివిగా ఉపయోగించడం...పిల్లలకు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అలవాటును నేర్పించండి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్ వారికి ఎంతగానో సాయపడుతుంది. సకాలంలో వారి పనులు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, చదువు, హోం వర్క్ వంటి పనులు చేయడం నేర్పించండి. దానికి తగ్గ టైమ్ టేబుల్ వేసి దాని ఫాలో అయ్యేలా ప్లాన్ చేయండి. దీంతో.. వారు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.చదువు, హోం వర్క్...స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆటల తర్వాత స్నానం చేసేలా ప్రోత్సహించండి. ఆ తర్వాత హోం వర్క్, చదువుకు టైం కేటాయించేలా వారికి అలవాటు చేయండి. ఆటలతోపాటు చదువు ప్రాముఖ్యత వారికి తెలపండి. సబ్జెక్ట్ల్లో ఏమైనా డౌట్లు ఉంటే దగ్గరుండి హెల్ప్ చేయండి. హోం వర్క్ పెండింగ్ పెట్టకుండా పూర్తిగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయండి. ఈ అలవాటు వల్ల వారు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారు. (చదవండి: వృథాని జీరో చేద్దాం..వేస్ట్ని రీయూజ్ చేసేద్దాం..! ది బెస్ట్గా..) -
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
పూర్ణాలు..కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.పరమాన్నం..కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ.మామిడికాయ పులిహోరకావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. (చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు) -
వృథాని జీరో చేసేలా..ది బెస్ట్గా రీయూజ్ చేద్దాం ఇలా.!
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ... మార్చి నెల 30వ తేదీని జీరో వేస్ట్ డే గా గుర్తిస్తూ 2022, డిసెంబర్ 14వ తేదీన ఒక తీర్మానాన్ని చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి మార్చి నెల 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా గుర్తిస్తూ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఈ ఏడాది ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ రంగాల వృథా మీద దృష్టి పెట్టింది. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వాయు, నీటి కాలుష్యాలతోపాటు వస్త్రాల అవశేషాలు కూడా ప్రధానమైనవి. క్లాత్తో డ్రస్ కుట్టిన తర్వాత వచ్చే మిగులు నదులు, కాలువల్లోకి చేరి నీటిలో, నీటి అడుగుల మట్టిలో నిలిచి΄ోతోంది. కొంతకాలానికి ఆ వస్త్రానికి అద్దిన రసాయన రంగులు నేలలో, నీటలో ఇంకుతాయి. ఇలా వేస్ట్ క్లాత్ కారణంగా కెమికల్ పొల్యూషన్ నీటిని, మట్టిని కూడా కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో ఉత్పత్పి 2015నాటికి రెండింతలైంది. ఏడాదికి 92 మిలియన్ టన్నుల టెక్స్టైల్ వేస్ట్ లెక్క తేలుతోంది. ఇది కాలువలు, నదుల్లోకి వెళ్తోంది. దీనిని అరికట్టడం కోసమే యూఎన్ఓ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఈ ఏడాది ఫ్యాషన్ ఇండస్ట్రీ వేస్ట్ మీద దృష్టి పెట్టింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగాలను జీరో వేస్ట్ దిశగా నడిపించడానికి మార్గాలను అన్వేషించాలంటోంది యూఎన్ఓ. హైదరాబాద్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న సుదీప కందుల ట్రిపుల్ ఆర్ (రీ యూజ్, రీ సైకిల్, రీ పెయిర్) అనే యూఎన్ఓ థీమ్ను రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది!సుదీప కందుల... ఆలన బొటీక్ పేరుతో చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ ప్రారంభించి మూడు దశాబ్దాలవుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బొటీక్ కల్చర్ మొదలైన తొలినాళ్ల నుంచి బొటీక్ నడుపుతున్నారామె. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించే సుదీప, ఆమె ఉద్యోగులు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి మార్కెట్కెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్ను వెంట తీసుకువెళ్తారు. బొటీక్లో ఉత్పన్నమయ్యే వేస్ట్ క్లాత్ను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలనెంచుకున్నారు సుదీప. చిన్న ముక్కలతో నవజాత శిశువులకు, ఏడాది లోపు పిల్లలు ధరించడానికి వీలుగా కుట్టించి ఆర్ఫనేజ్కు ఇచ్చారు. అలా కుదరని వాటిని నగరంలోని ఒక ఎన్జీవోకి ఇస్తుంటారు. ఆ ఎన్జీవోలో అల్పాదాయ వర్గాల మహిళలకు ఆ క్లాత్తో చిన్న చిన్న పోట్లీ బ్యాగ్లు, పర్సులు తయారు చేసుకుంటారు. అలా కూడా పనికి రాని సన్నగా పొడవుగా రిబ్బన్ ముక్కల్లాంటి క్లాత్ని ఒక స్కూల్కి ఇస్తే వాళ్లు పిల్లల చేత డోర్మ్యాట్ మేకింగ్ వంటి క్రాఫ్ట్ ప్రాక్టీస్కి ఉపయోగిస్తున్నారు. ఇక ఎందుకూ పనికిరావనిపించే ముక్కలను ఒక కవర్లో జమ చేసి ఆ బొటీక్లో పని చేసే వాళ్లు దిండులో స్టఫింగ్గా నింపుకుంటారు. వ్యర్థాన్ని అర్థవంతంగా మారుస్తున్న సుదీప తన బొటీక్లో చిన్న ముక్క కూడా నేలపాలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు.ఉత్పత్తి– కొనుగోలు పెరిగాయిమనం కొంతకాలం వాడి ఇక పనికిరావని పారేస్తున్న వస్తువులు నిజానికి పనికిరానివి కాదు, వాటిని మరొక రకంగా మలుచుకుని ఉపయోగించుకోవడం మనకు చేతకాక΄ోవడమే. రీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. నాచురల్ ఫైబర్తో వస్త్రాలు తయారుచేసినన్ని రోజులు వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మ్యాన్మేడ్ ఫైబర్ ప్రవేశించిన తర్వాత ఎదురవుతున్న సమస్యలివన్నీ. నిజానికి వ్యర్థాల ఉత్పత్తి మనదేశంలోకంటే యూఎస్, యూరప్దేశాల్లో చాలా ఎక్కువ. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం, అవసరానికి మించి కొనడం రెండూ పెరిగాయి.షాపింగ్ వ్యసనంఈ తరానికి షాపింగ్ ఒక వ్యసనంగా మారింది. యూఎస్, యూరప్ల నుంచి వాడిన దుస్తులు మూడవ ప్రపంచదేశాలకు డంప్ అవుతున్నాయి. అరేబియా షిప్పుల్లో గుజరాత్ తీరం నుంచి దేశంలోకి వస్తుంటాయవి. మన దగ్గర తయారయ్యే పాలియెస్టర్ వస్త్రాలకు తోడు ఆయాఖండాల నుంచి వచ్చిపడుతున్న దుస్తులు కూడా కలిసి డంప్ పెరిగిపోతోంది. పాలియెస్టర్ వస్త్రాలను ఫైబర్గా మార్చి కొత్త దుస్తులు తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి మైక్రోప్లాస్టిక్గా మారి తిరిగి మన మీదనే దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పారేస్తున్న దుస్తులతో కాలువలు నిండిపోతున్నాయి.– డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణ నిపుణులు జీరో వేస్ట్తో ద బెస్ట్ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్తో ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టన్నుల చెత్త జమవుతోంది. ఇది పెరుగుతూ భూగ్రహాన్ని ముంచేసినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రమాదాన్ని మన దేశంలో ముందుగా గ్రహించి అప్రమత్తమైన పప్రాంతం ఢిల్లీ, మాల్వీయ నగర్లోని నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ. రీయూజ్, రీసైకిల్ను ఫాలో అవుతూ జీరో వేస్ట్తో పర్యావరణప్రియమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.దాదాపు ఏడేళ్ల కిందట... ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాల్వీయనగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక వర్క్షాప్ నిర్వహించింది. అందులో పాల్గొన్న నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు ఆ వర్క్షాప్లో చెప్పినవి, చూపించినవి తమ కాలనీలో అమలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ 250 ఇళ్లున్నాయి. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో వివరించి, కొన్నాళ్లపాటు పర్యవేక్షించారు సొసైటీ సెక్రటరీ, కంటివైద్యులు డాక్టర్ రూబీ మఖీజా. తతిమా సభ్యుల సహాయసహకారాలతో తడిచెత్తతో కాలనీలోనే కంపోస్ట్ తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ ఎరువుతో కిచెన్, బాల్కనీ, రూఫ్ గార్డెన్స్ను ప్రోత్సహించారు. ఒక షెడ్డు లాంటిదీ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లో పాతపుస్తకాలు, దుస్తులు, ఆటబొమ్మలు, ఉపయోగంలో లేని వస్తువుల కోసం. ఆ కాలనీలో ఎవరికైనా ఏ వస్తువైనా అవసరం ఉంటే ముందు ఈ షెడ్డుకొచ్చి చూసి, అందులో తమకు కావలసింది లేకపోతేనే కొత్తది కొనుక్కోవాలి. అలా కాలనీ వాసులు తీసుకున్నవి పోనూ మిగిలినవి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు అవసరమైన వాళ్లకు పంచేందుకు! ఈ కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్. గుడ్డ సంచులనే వాడుతారు. నీటి వృథా, ఆదానూ సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి వారానికోసారి క్యాంప్ పెడతారు. అందులో పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. వీళ్లో బ్రాడ్కాస్ట్ సిస్టమ్నూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ కాలనీలో జరిగే పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలను వీడియోలుగా తీసి వాటిని సాయంకాలం ప్రసారం చేస్తారు. ఈ ప్రయత్నాలతో జీరో వేస్ట్లో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది నవజీవన్ విహార్. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..) -
'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..
పూర్వకాలంలో పౌరాణిక కథలను ఇలా తోలుబొమ్మలాటలతోనే చెప్పేవారు. అప్పట్లో టీవీలు, రేడియోలు అందుబాటులో లేని కాలంలో ఇవి ఎక్కువగా ఉండేవి. ప్రస్తుత తరానికి మన టీవీల పుణ్యమా అని పంచతంత్ర వంటి ధారావాహికల కారణంగా వాటి గురించి తెలుసుకుంటున్నారు. చెప్పాలంటే చిన్నారులు ఇష్టంగా చూసే కార్టూన్ ఛానెల్స్ మాదిరిగా ఆ రోజుల్లో తోలుబొమ్మలాటలుండేవి. ఇప్పుడు కృత్రిమ మేథాదే హవా అనుకోకండి. ఎందుకంటే ఇప్పడు పాతదిగా అనిపించినా ఒకప్పుడది కొత్తది. దీనిక ప్రస్తుతం ఆదరణ పెరుగి ట్రెండ్గా మారుతోంది. స్కూల్క్, కోన్ని కల్చరల్ కార్యక్రమాలు జరిగే చోట ఈ కళా ప్రదర్శనకు అవకాశం ఇస్తున్నారంటే మన పూర్వకాలంనాటి కళలకు ప్రాముఖ్యత ఉందనే కదా అంటుంటారు అనురూప రాయ్. ఆమె వలనే ఈకళ సజీవంగా ఉందని చెప్పొచ్చు. ఎవరామె..? ఆమె ఎలా ఈ రంగంలోకి వచ్చింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.ఢిల్లీకి చెందిన అనురూప రాయ్ ఆరేళ్ల వయసు నుంచే ఈ తోలుబొమ్మలాట అంటే మహాఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ తోలుబొమ్మలను కొనుక్కుని మరీ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఇష్టం ఆమె వయసుతోపాటు పెరిగిందే గానీ తగ్గలేదు. ఒకప్పుడూ 80లలో బాగా ట్రెండ్గా ఉండే ఈ తోలుబొమ్మలాటని సజీవంగా ఉంచాలని ఆరాటపడింది. విద్యాపరంగా ఇలాంటి తోలుబొమ్మల కళారంగం ఎంచుకుంటావా అని విమర్శలు వచ్చినా ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిందామె. అందరూ ఫిల్మ్ స్కూల్స్లో జాయిన్ అయితే అనురూప తోలుబొమ్మలాటకు సంబంధించిన కళారంగ సంస్థల్లో జాయిన్ అయ్యింది. అలా ఆ రంగం గురించి కూలంకషంగా నేర్చుకుని ఆ విద్యకే కాదు ఆ కళకే ప్రాణం పోసిందామె. ఆ కళను సజీవంగా ఉంచేలా "కథక్కథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్"ని స్థాపించి కళాకారులను ఒక వద్దకు తీసుకొచ్చి ప్రదర్శనలిస్తున్నారామె. ఈ ప్రదర్శనకు మొదటి విమర్శకులు పిలలేలని అంటారామె. ఎందుకంటే కథ నచ్చకపోతే మధ్యలోంచి వెళ్లిపోతారు కాబట్టి నచ్చేలా చక్కటి కథనే ఎంచుకుని ప్రదర్శనలిస్తామన్నారు. ఈ ట్రస్ట్ ప్రదర్శనలు ఇవ్వని విరామ సమయాల్లో ప్రదర్శనకు సంబంధించిన పరిశోధనతో పాటు, ప్రేక్షకులను పెంచుకోవడం వంటి వాటిపై దృష్టిసారిస్తారు. అలాగే పండుగలు, సమావేశాలకు వెళ్లడం, సమాజం వెలుపల ఉన్న వ్యక్తులతో మాట్లాడి ప్రేక్షకాదరణ పొందేలా ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తారని చెప్పారు అనురూప.ఈ ట్రస్ట్కి అంతర్జాతీయ ఉత్సవాలు, గ్యాలరీలు, మ్యూజియంల ప్రదర్శనల ద్వారా నిధులు ఉత్పత్తి అవుతాయి. వారి స్టూడియో ఢిల్లీలోని బాదర్పూర్ సరిహద్దులో ఉంది. ఇది నగరానికి, ఒక గ్రామానికి మధ్య ఉంటుంది. అందుకే అనురూప కిటికీలు తెరిచి తమ ప్రదర్శన కోసం రిహార్సల్ చేస్తుంటారట. కనీసం అలా అయినా గ్రామంలోని పిల్లలకు అదేంటో తెలుసుకునే వీలు ఉంటుందనే చిన్న ఆశ అంటారామె.కథలకే కాదు అలా కూడా..ఈ తోలు బొమ్మలాట అనగానే కేవలం పంచతంత్ర వంటి కథలనే కాదు. సామాజిక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తారట. అలా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సామాజిక సేవ గురించి ప్రజలకు తెలియజేస్తుంది. అంతేగాదు ఇటీవల అనురూప తన బృందంతో మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో రుతు కార్యక్రమంపై అవగాహన కల్పించే అద్భుత ప్రదర్శన ఇచ్చింది. తోలుబొమ్మలాటతో ఇలాంటి సామాజికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శించొచ్చని చూపించింది. ఆమె కృషి పలితంగా న్యూఢిల్లీలో కొద్దోగొప్పో తోలుబొమ్మలాట కళాకారులు ఉండటం విశేషం. అంతేగాదు రాజాధానిలో ఈ తోలుబొమ్మల విద్యను నేర్చుకునే పాఠశాల కూడా ఉందట. ఇందులో జైపూర్, పూణే, మధురై, బర్ధమాన్ తదితరప్రాంతాలకు చెందని విద్యార్థులు ఉన్నారు. వాళ్లంతా ఈ కళను నేర్చుకుని సొంతంగా సంస్థను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు తన సంస్థే త్వరలో అంతర్జాతీయ తోలుబొమ్మల చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చలనచిత్రోత్సవంకి మించి ఎక్కువ ప్రదర్శనలిస్తారట. వాటిలో తమిళనాడుకి సంబంధించిన షాడో తోలుబొమ్మలాట ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. ఇంకో విశేషం ఏంటంటే అనురూప గ్రామన్నే రాజధానికి తీసుకొచ్చేలా తన తోలుబొమ్మలాటతో గ్రామీణ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఇది సాయంత్రం నుంచి మొదలై తెల్లవారుజాము వరకు ఉంటుందని చెబుతున్నారామె. ఆ కార్యక్రమం వచ్చేనెల ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగునుందని చెప్పారు అనురూప రాయ్. కనుమరుగైపోతున్న కళను ఎంచుకోవడమే సాహసం, పైగా దానికి ఊపిరి పోసి సజీవంగా ఉండేలా చేయడం అంటే మాటలు కాదుకదా..!.(చదవండి: -
ది బెస్ట్ మాంసాహార రెసిపీగా భారతీయ వంటకం కీమా..!
ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్. ఎప్పటిలానే బెస్ట్ స్వీట్స్, కర్రీల జాబితాను ఇచ్చినట్లుగానే ఈసారి బెస్ట్ మాంసాహార రెసిపీ జాబితాను విడుదల చేసింది. మొత్తం 100 ఉత్తమ మాంసాహార వంటకాలను విడుదల చేయగా అందులో మన భారతీయ వంటకం కీమా నాల్గోస్థానంలో నిలవడం విశేషం. ఈ కీమాని సమోసాలు, బ్రెడ్లు, పరాఠాలు వంటి వాటిల్లో నొంచుకుని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఇది మేక లేదా కోడి మాంసాన్ని చాలా చిన్నగా కట్ చేస్తారు. దాంతో చేసే వంటకమే ఈ కీమా రెసిపీ. అయితే దీన్ని ఉడికించడం సులభం, రుచిగానూ ఉంటుంది. ఇక ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాలో టర్కీకి చెందిన టైర్ కోఫ్టేసి అగ్రస్థానంలో నిలిచింది. తదుపరిస్థానాల్లో సెర్బియా నుంచి లెస్కోవాకి రోస్టిల్జ్ , టర్కీకి చెందిన అదానా కెబాప్, బారత్ నుంచి కీమా ట్రావ్నిక్, బోస్నియా నుంచి ట్రావ్నిక్కి సెవాపి, అజర్బైజాన్ నుంచి గురు ఖింగల్, ఇటలీ నుంచి పోల్పెట్ బోస్నియా మొదలైనవి చోటు దక్కించుకున్నాయి. కాగా, ఈ కీమా వంటకాలను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయ, ఉల్లిపయాలు, నెయ్యి, గరం మసాల, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో రుచికరంగా తయారు చేస్తారు. సాధారణంగా పచ్చి బఠానీలు ఉపయోగించి చేస్తుంటారు చెఫ్లు. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అతడు 95% దృష్టిని కోల్పోయాడు అయినా..! వైరల్గా ఆనంద్ మహీంద్రా పోస్ట్) -
పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు. అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్కుమార్ దాబీ విల్పవర్కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా. అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతడు తనకు సడెన్గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague. You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025 (చదవండి: 'విల్పవర్' అంటే ఇది..ఏకంగా వీల్చైర్తో బంగీ జంప్..! వీడియో వైరల్) -
వేసవిలో డీ హైడ్రేషన్ కట్టడికి కొబ్బరి నీరే తప్పనిసరా..?
సమ్మర్ వచ్చేస్తుందంటేనే భయం వేస్తుంది. ఉక్కపోతాలు, సూర్యుడి భగభగలు తలుచుకుంటే వామ్మో..! అనిపిస్తుంది. ఆఖరికి వండిన ఏ వంటకాలు నిల్వ ఉండవు. మధ్యాహ్నా 12 దాటితే బయటకు అగుపెట్టే ఛాన్సే లేదన్నంత వేడి సెగలు. ఎంత నీడ పట్టున కూర్చొన్న ఆ ఎండల వేడికి ఒకటే దాహం, నోరంతా పెడుచుకట్టుకుపోయినట్లు ఉంటుంది. దాంతో చాలావరకు కొబ్బరి బొండాలు, చెరుకురసం వంటివి వాటితో హైడ్రేటెడ్గా ఉండేలా చేసుకుంటారు. అయితే చెరుకురసంలో ఉండే అధిక చక్కెరల దృష్ట్యా కొబ్బరి నీళ్ల వైపుకే మొగ్గు చూపుతారు. అందులోనూ వేసవి అని అటు కొబ్బరి కాయల వ్యాపారలు అదును చూసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఎండల భయంతో విధిలేక అంత ధర వెచ్చించి మరీ కొని తాగేస్తుంటారు. అయితే అదేం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. సమ్మర్లో కొబ్బరి బొండాలు తప్పనిసరి ఏం కాదని తేల్చి చెబుతున్నారు. వాటికి బదులుగా తక్కువ ఖర్చులో డీహైడ్రేషన్కి చెక్పెట్టొచ్చని చెబుతున్నారు అదెలాగో చూద్దామా..!.ఆరోగ్య స్పుహ ఎక్కువై సోషల్ మీడియాలోనూ, పేపర్లోనూ కొబ్బరి నీరుకి మించిన దివ్యౌషధం లేదంటూ ఊదరగొట్టుస్తున్నారు. నిజానికి కొబ్బరి నీరేమి సర్వరోగ నివారిణి కాదంటున్నారు వైద్యులు. ఇది హైడ్రేషన్గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అది సమంజసమే అయినా..మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పడు ప్రత్యామ్నాయంగా తరుచుగా నీరు తాగితే చాలు. పోనీ వేడికి తాళ్లలేకపోతున్నాం అనుకుంటే అరటిపండ్లు, నీళ్లు తాగినా డీహైడ్రేషన్కి గురవ్వరని చెబుతున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్ల సమృద్ధి కారణంగా..చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అది చాలా తప్పు ఆ సమస్యకు మూల కారణం తెలుసుకునేలా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని చెప్పడం సరైనది కాదంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయి కానీ అది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నొక్కి చెప్పారు నిపుణులు. కేవలం వడదెబ్బ తగ్గినప్పుడు ఈ కొబ్బరినీరు తక్షణమే శక్తిని ఇచ్చి, ఎలక్ట్రోలైట్లతో బాడీని భర్తీ చేస్తుంది. త్వరితగతిన కోలుకునేలా చేస్తుందన్నారు. లేత కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన రిఫ్రెషింగ్ అమృతం!. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఇది, తక్కువ కేలరీలు, అధిక పొటాషియం, విటమిన్ బీ, సీలు కలిగిన హైడ్రేటింగ్ పానీయం. రీహైడ్రేషన్, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మంచి ఆరోగ్యకరమై ఎనర్జీ ఇచ్చేందుకు తీసుకోవాలే తప్ప. అది తీసుకుంటేనే హైడ్రేటెడ్గా ఉంటామనేది అపోహేనని తేల్చి చెప్పారు. అలాగే దీన్నీ హైడ్రేషన్కి సంబంధించిన ప్రాథమిక వనరుగా తీసుకోకూడదు. ఆ సమస్యలు ఉత్ఫన్నమైనప్పుడూ..అథ్లెట్లకు లేదా వేడి వాతావరణంలో పనిచేసేవారికి కొబ్బరినీటిలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తీసుకోమని వైద్యులు సూచిస్తారే తప్ప, ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, చల్లటి నీరు తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ ఇది అన్నీ ఆరోగ్య సమస్యలకు అద్భుత నివారిణీ మాత్రం కాదని చెప్పారు. ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీటికి బదులుగా దీన్ని సూచించడం జరుగుతుందని వివరించారు. కాబట్టి సరసమైన ధరల్లో కొబ్బరి బొండాలు దొరికితే హయిగా కొనుక్కుని ఆస్వాదించండి లేదంటే హైడ్రేషన్ కోసం తక్కువ ధరలోనే ప్రత్యామ్నాయులు ఉన్నాయనే విషయం గ్రహించండి అని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: జెన్ జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!) -
సెహ్రీ..తెల్లవారే ముందు వంటకాల విందు..!
మతాలకతీతంగా ప్రతి నగరవాసి సంప్రదాయ ఆహార సంస్కృతిలో మమేకమైపోయే సమయం రంజాన్. పాతబస్తీని అంతగా పట్టించుకోని ఐటీ నిపుణులు సైతం అసలు సిసలు హైదరాబాద్ అనుభవం కోసం ఓల్డ్ సిటీకి రౌండ్స్ కొట్టే సీజన్ ఇది. ఓ రకంగా దీన్ని లోకల్ టూరిజం అని పేర్కొనవచ్చు. రంజాన్ సీజన్లో ఈ లోకల్ టూరిస్టులు ఆస్వాదించే వాటిలో హలీమ్, ఇఫ్తార్లు మాత్రమే కాదు సెహ్రీ కూడా ఒకటి. రోజూ రకరకాల కారణాలతో.. రంజాన్ సమయంలో నగరం సెహ్రీ ప్రత్యేక మెనూల కోసం మేల్కొంటోంది. ఇది ముస్లింలు తమ రోజాను (ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేసే ఉపవాసం) పునఃప్రారంభించే ముందుగా.. సూర్యోదయానికి ముందు తినే ఉదయపు భోజనం. అయితే ఈ సమయం సాధారణంగా ముస్లిమేతరులు ఎవరికీ అనుభవంలో లేని తెల్లవారుజామున ఆస్వాదించే వైవిధ్యభరిత అనుభూతి. సమయం మాత్రమే కాదు ఆ సమయానికి రెస్టారెంట్స్ వడ్డించే వంటకాలు కూడా ప్రత్యేక అనుభూతే. వైవిధ్యభరిత అనుభూతి.. సెహ్రీ కోసం బయటకు వెళ్లడం సంప్రదాయ పద్ధతి కానప్పటికీ, లేట్నైట్ షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు, వంటగదిలోకి అడుగు పెట్టకుండానే రంజాన్ సమయంలో రిలాక్స్డ్ ఫుడ్ని ఇష్టపడే వారూ పెరగడం వల్ల కొత్తగా సెహ్రీ ఇంటి బయట ఊపందుకుంటోంది. రెస్టారెంట్లలో సెహ్రీ భోజనం సాధారణంగా తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. సిసలైన సిటీ రుచుల సెహ్రీ.. సాధారణ బిర్యానీ లేదా హలీమ్లా కాకుండా, సెహ్రీలో కిచిడీ ఖట్టా–ఖీమా, నిహారీ విత్ నాన్, దమ్ కా కీమా కబాబ్లతో సహా అనేక రకాల సంప్రదాయ వంటకాలు సెహ్రీలో వడ్డిస్తారు. వీటిని రెస్టారెంట్లు ఈ సమయంలో ప్రత్యేకంగా అందిస్తాయి. కబాబ్లు వగైరా కూడా ఇందులో ఉన్నాయి, కానీ పూర్తిగా కొత్త మెనూను ఈ సందర్భంగా చాలా మంది రుచి చూస్తారు. సిటీలోని అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్సైడ్ కేఫ్స్ సైతం ప్రత్యేక సెహ్రీ మెనూ ప్లేటర్ను అందిస్తున్నాయి. ఈ ప్లేటర్లు లేదా కాంబోలు కనీసం నలుగురికి సరిపోయేంత పెద్దవిగా ఉండడం విశేషం. ఎక్కువగా ఈ సెహ్రీ కాంబోల్లో కబాబ్లు, రోటీలు, అన్నం, పప్పులతో పాటు మాంసాహార స్టార్టర్ల మిశ్రమం ఉంటుంది. దీంతో పాటు వివిధ రకాల కబాబ్లు, నయాబ్ హోటల్లో పాపులర్ డిష్ ఓ ఆఫాల్ ఫ్రై, రోటీ పే బోటీ, కబాబ్స్తో రోగ్ని రోటీ వంటివి సెహ్రీ స్పెషల్స్గా పేరొందాయి. ఎక్కడెక్కడ రుచి చూడొచ్చు అంటే.. ఓల్డ్ సిటీ, టోలిచౌకి, విమానాశ్రయ రహదారి (అరామ్ఘర్) వంటి ప్రాంతాల్లోని రెస్టారెంట్లు సెహ్రీ మెనులను అందిస్తాయి. అలాగే –టోలిచౌకి వంటి ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఆహార దుకాణాలు కనిపిస్తాయి. పాతబస్తీలోని నయాబ్ హోటల్ వంటి కొన్ని రెస్టారెంట్లు తమ సెహ్రీ మెనులను ఉదయం 1 గంట నుంచే అందిస్తాయి. అపరిమిత సెహ్రీ బఫేలను అందించేవి కూడా ఉన్నాయి. ‘గత సంవత్సరం ఇంటి బయట ‘సెహ్రీ’ కోసం అనేక మంది ఆసక్తిని కనబరిచారు, అందువల్ల మేం అనేక కొత్త రుచులను జోడించాం. ఉదయం 1 నుంచి 5 గంటల వరకూ స్పెషల్ మెనూలు అందిస్తున్నాం’ అని చార్మినార్ సమీపంలోని హోటల్ నయాబ్కు చెందిన జునైద్ అంటున్నారు. కొత్త మెనూలో ‘ఆచారి’ మటన్/చికెన్, నయాబ్ స్పెషల్ చికెన్, ‘కిచ్డీకి’, ‘దమ్ కా ఖీమా’ వంటి రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సెహ్రీ నగర నిజానికి ఒక భారీ ఆకర్షణగా మారుతోంది. మేం మా ‘సెహ్రీ’ మెనులో మటన్ ‘తహరీ’ అనే ప్రత్యేక వంటకం అందిస్తున్నాం’ అని లకడికాపూల్లోని పెషావర్ రెస్టారెంట్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ మోయిద్ చెబుతున్నారు. (చదవండి: జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!) -
జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!
జెన్–జడ్ అనగానే ‘డైనమిక్ నేచర్’ అంటారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. జెన్–జడ్ ఉద్యోగులు సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జెన్–జడ్లో ప్రొఫెషనలిజం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు...క్వాయిట్ క్విట్టింగ్యువ ఉద్యోగులకు సంబంధించి నిశ్శబ్ద నిష్క్రమణ (క్వాయిట్ క్విట్టింగ్) భారతీయ పరిశ్రమలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పరిశ్రమ నిర్వాహకులలో ఆందోళనను పెంచుతుంది. ‘ఉద్యోగం అంటే కాలేజికి ఎక్స్టెన్షన్ కాదు. ప్రొఫెషనలిజం అవసరమని చాలామందికి అర్థం కావడం లేదు. వివిధ రంగాల డైనమిక్స్పై కూడా అవగాహన కొరవడింది. ప్రతి రంగానికి ఒకే రకమైన పని అవసరాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. జెన్–జడ్ ఉద్యోగుల ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు టీమ్లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ.జెన్ జడ్ అలా కాదు...పాత తరం ఉద్యోగులు, జెన్–జడ్ ఉద్యోగులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘మౌనమే మంచిది’ అన్నట్లుగా ఉండేవాళ్లు. జెన్–జడ్ అలా కాదు...తమ అసమ్మతిని బహిరంగంగా చెప్పడానికి వెనకాడడం లేదు. పని ప్రమాణాలు, అవసరాల విషయంలో యువతరానికి, పాతతరానికి ఎంతో తేడా ఉంది. ‘పని మాత్రమే జీవితం అని యువతరం అనుకోవడం లేదు. పనికి మించిన జీవితం ఉందనే విషయం వారికి తెలుసు. అయితే దీన్ని పాతతరం అంగీకరించం కష్టం’ అంటుంది దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ దివిజా బాసిన్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన దివిజకు 2.6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘హార్డ్ వర్క్’ను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంటారు ఆమె. అయితే ఇది చిత్రానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు యువతలోని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.స్కిల్ గ్యాప్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ బాడీ నాస్కామ్ నివేదిక ప్రకారం టెక్ రంగంలో ఆరు లక్షల మంది నిపుణుల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న ‘స్కిల్ గ్యాప్’ సమస్యకు సులువైన పరిష్కార మార్గాలు లేకపోయినప్పటికీ యువత కార్పొరేట్ వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్క్స్పై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. రిక్రూట్మెంట్కు వచ్చే కంపెనీలు విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్కు సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని దిల్లీకి చెందిన ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ హెడ్ చెప్పారు.కష్టమే సుమీ!అమెరికాకు చెందిన రెజ్యూమ్బిల్డర్.కామ్ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది మేనేజర్లు, బిజినెస్ లీడర్లు జెన్ జడ్తో పనిచేయడం కష్టమని చెప్పారు. స్కిల్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. నేషనల్ ఎంప్లాయిబిలిటీ రిపోర్ట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రకారం 80 శాతం మంది భారతీయ ఇంజనీర్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం తప్ప కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు. (చదవండి: -
అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!
అందంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందనేది అందరూ అంగీకరించాల్సిందే. యవ్వనంగా కనిపించాలనే తాపత్రయంతోనే జీవనం నాణ్యంగా గడపడానికీ ప్రయత్నించాలి. అందుకు బ్యూటీ చికిత్సలకు ఎక్కువ ఖర్చు పెట్టనవసరం లేదు. నేటి రోజుల్లో కాలుష్యం, సమతుల ఆహార లోపం, స్ట్రెస్ .. వీటన్నింటి ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకని సమస్య ఎక్కడ ఉన్నదో దానిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.చాలా మంది ఎదుర్కొనేవి... యవ్వనంలో ఉన్నవాళైతే యాక్నె, మంగు మచ్చలు, కాస్మొటిక్స్ వాడకం వల్ల ఏర్పడే మచ్చల సమస్య ఉంటుంది. వీటికి ఇంట్లోనే సొంత చికిత్సలు తీసుకోవడం వల్ల మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. మొటిమలకు వెల్లుల్లి, టూత్పేస్ట్ వంటివి వాడుతుంటారు. మంగు మచ్చలకు తమకు తామే స్టెరాయిడ్స్ వాడుతుంటారు. ఇక శిరోజాల విషయంలో అయితే ఐరనింగ్, స్ట్రెయిటనింగ్, స్టయిలింగ్.. వంటి హెయిర్స్టైల్స్ ఎక్కువైపోయాయి. వీటివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు ఊడిపోవడం పెరుగుతుంది.బట్టల వల్ల అలెర్జీటైట్గా ఉండే బట్టలు వేసుకుంటుంటారు. ఫ్యాబ్రిక్ వల్ల దురద సమస్యలు వస్తుంటాయి. అవి, నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలో మిగతా వారికీ ఆ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. పులిపిర్లు ప్రైవేట్ పార్ట్స్లో వస్తుంటాయి. వాటినీ నిర్లక్ష్యం చేస్తుంటారు. కాస్మొటిక్ ప్రయోగాలు అయితే చెప్పలేం. అవి తమ చర్మానికి సరిపడతాయో లేదో కూడా చూడరు. దీని వల్ల చర్మం రంగు మారుతుంది.ఫేషియల్స్ఫేషియల్స్ చేయించుకుంటుంటారు. ఫ్రూట్ ఫేషియల్స్ సాధారణ కాంతికి పనిచేస్తాయి. హైడ్రా ఫేషియల్, డెర్మాఫేషియల్స్, కెమికల్పీల్.. వంటి ఫేషియల్స్ నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. హెయిర్కి, స్కిన్కి పీఆర్పీ చేయించుకుంటారు. ఇవి చేయించుకున్నంత మాత్రాన అంతా బాగయిపోదు. సరైన మెయింటెనెన్స్ అవసరం.చెయిన్లతో మెడపై నలుపుఆడవాళ్లలో చాలా వరకు మెడపైన నల్లగా అవుతుంది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, శుభ్రత పాటించకపోవడం, అధిక బరువు వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అండర్ ఆర్మ్స్ డార్క్గా ఉన్నప్పుడు నిపుణుల సూచనలు తీసుకోవాలి. అధికబరువుకు లైపోసక్షన్ వంటివి చికిత్సలు తీసుకుంటారు. బరువు తగ్గినప్పుడు ఎలాంటి ఫిట్నెస్ సూచనలు పాటించాలో కూడా నిపుణుల సూచనలు తీసుకోవాలి.స్ట్రెచ్ మార్క్స్మహిళలకు ప్రసవం తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పెద్ద సమస్య. ప్రసవం తర్వాత మూడవ నెల వరకు క్రీములు వాడుతూ ఉండాలి. అన్ని డెలివరీలు పూర్తయ్యాక స్ట్రెచ్ మార్క్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరో సమస్య పాదాల పగుళ్లు. క్రీమ్ వాడితే దాని మీద దుమ్ము పేరుకుంటుంది. అందుకని, రాత్రి పడుకునేముందు పీదాలను శుభ్రం చేసి, క్రీమ్ రాసి, సాక్సులు ధరించాలి.డిటర్జెంట్స్ వల్ల ఎగ్జిమా!చేతులకు ఎగ్జిమా వస్తుంది. డిటర్జ్ంట్స్ వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అందుకని ఇంటి క్లీనింగ్లో చేతులకు గ్లౌజ్స్ మోచేతుల వరకు ఉండేవి మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించాలి.పర్మనెంట్స్ చేయించుకుంటున్నారా..!బ్యూటీ చికిత్సలలో పర్మనెంట్ మెథడ్స్కి ఇటీవల డిమాండ్ పెరిగింది. వాటిలో బొటాక్స్, ఫిల్లర్స్, స్కిన్ బూస్టర్స్, లిప్ కరెక్షన్, స్కిన్ టైటెనింగ్, గ్లోయింగ్ కోసం తీసుకునే ఇంజక్షన్స్.. ఈ కాస్మొటిక్స్ చికిత్సలన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. రెగ్యులర్ మేకప్ చేసుకునేవారు కాస్మొటిక్స్ తమ చర్మతత్త్వానికి సరిపడేవి ఎంచుకోవాలి. తిరిగి శుభ్రం చేసుకోవడంలోనూ జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: Ram Charan: రోజుకో వర్కవుట్.. ఆదివారం చీటింగ్! ఆ రూల్ మాత్రం తప్పడు!) -
ఆఫీసులో అమ్మ... ఇంట్లో బిడ్డ
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.విజయవంతమైన మార్పుప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎంచుకోవచ్చు.సానుకూల ప్రభావాలు → ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు. → హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.మెరుగైన సమయ నిర్వహణ → పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. → పిల్లలు టైమ్టేబుల్కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. → కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. హద్దులు అవసరంపని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. –ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులుఅమ్మా, నువ్వే నా హీరో..నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది. ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం. – దివ్యా మిట్టల్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్ప్లాన్లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్ఛేంజర్ మూవీ వరకు అదే లుక్తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్గా యాక్టివ్గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్లు, సీటెడ్ మెషిన్ ప్రెస్ల నుంచి మిలిటరీ పుషప్లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్లకు దూరంగా ఉంటారట రామ్చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి
ఇటీవల ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ తెగ నెట్టింట ఫిట్నెస్ మంత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. పాపం కొందరు ఫాలో అయ్యి వర్కౌట్ అవ్వాక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజగా ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన విభిన్నమైన వెల్నెస్ రోటీన్ని నెట్టింట షేర్ చేశాడు. అది చూసి నెటిజన్లు బాబోయ్ మరీ ఇంత మంచి అలవాట్లా..అని విస్తుపోతున్నారు. నో ఛాన్స్ అదంతా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరీ అంత విచ్రితంగా అనిపించినా.. అతడి వెల్నెస్ రొటీన్ ఏంటో చూద్దామా..!.29 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్తన తీవ్రైమన ఆరోగ్య స్ప్రుహ కారణంగా నెట్టింట వైరల్గా మారాడు. అతడి ఫిట్నెస్ మంత్ర చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడి స్ట్రిట్ ఫిట్నెస్ రొటీన్ ఎలా ఉంటుందంటే..అత్యంత క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అతడిది. హాల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ఉదయం 3:52 ప్రారంభమైమార్నింగ్ 9.30 గంటలకు ముగుస్తుంది. హాల్ నిద్రపోయేటప్పుడు తన నోటికి మౌత్ట్యాప్ వేసుకుంటాడు. ఇది గురకను నివారస్తుందనేది అతడి నమ్మకం. ఆ తర్వాత 7.30 నుంచి 8.30 గంటల వరకు స్విమ్మింగ్ పూల్లో గడిని తదనంతరం బ్రేక్ఫాస్ట్గా అరటిపళ్లు తీసుకుంటాడు.ఆ తర్వాత అదే అరటిపండు తొక్కలను ముఖానికి రుద్దుకుంటాడు. ఆ తర్వాతమ బ్రాండెడ్ మినరల్ వాటర్, గిలకొట్టన పచ్చిగుడ్లు, అవకాడో టోస్ట్ వంటివి అతడి ఆహారాలు. ఈ వెరైటీ దినచర్యకు గానూ హాల్ నెట్టింట వైరల్గా మారాడు. ఇది సాధ్యమయ్యేది కాదనేది నెటిజన్ల వాదన. అంతేగాదు సోషల్ మీడియాలో బ్రో బిజీ లైప్ ఇవన్నీ కష్టం అని కామెంట్ చేస్తూ పోస్టుల పెడుతున్నారుహాల్ అనుసరించే కొన్ని మంచి వెల్నెస్ ట్రెండ్లు..మౌత్ ట్యాపింగ్మౌత్ ట్యాపింగ్ అనేది రాత్రిపూట నోటిని మూసి ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక టేప్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రసిద్ధ వెల్నెస్ ట్రెండ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకునేలా చేస్తుంది. అలాగే పీల్చే గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా అలర్జీ కారకాలు, శిధిలాలు లేదా విషపదార్థాలు ఊపిరితిత్తులకు చేరక మునుపే ఫిల్టర్ అవుతాయి. అంతేగాదు తేలికపాటి స్లీప్ అప్నియా ఉంటే మౌత్ ట్యాపింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖాన్ని ఐస్ వాటర్లో ముంచడం..చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి హర్మోన్ స్థాయిని తగ్గిస్తుందట. నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీరు రక్త నాళాలను ఇరుకుగా చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగుని అందించడంలో హెల్ప్ అవుతుందట. అంతేగాదు ఈ మంచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి మొటిమల రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. అదే సమయంలో వాపు వంటివి దరిచేరనీయదు అని చెబుతున్నారు నిపుణులు.చర్మంపై అరటి తొక్క ప్రభావంఅరటిపండ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియంల శక్తివంతమైన వనరు. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల మాయిశ్చరైజర్గా పనిచేసి చర్మాని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. గీతలు లేకుండా చేస్తుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు చర్మ నిపుణులుమార్నింగ్ వ్యాయామంఉదయం వ్యాయామం ప్రత్యేకమైన జీవక్రియ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసే సమయంలో శరీరం జీవక్రియ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఉదయం వ్యాయామాలు కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్ టాలరెన్స్ను మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అంతేగాదు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కూడా. అలాగే బాడీని ఫిట్గా ఉంచడమే కాకుండా మంచి నిద్రను, మెరుగైన ఏకాగ్రత అందిస్తుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: చిరాకుగా ఉన్నా..చిద్విలాసంగా ఉన్నా..చిరుతిండికే ఓటు..!) -
స్నాప్చాట్ క్రియేటర్ కనెక్ట్ ప్రోగ్రామ్! జెన్ జెడ్ స్టోరీ టెల్లర్స్కి అవకాశల వెల్లువ..
భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లను శక్తిమంతం చేసేలా హైదరాబాద్లో తొలి స్నాప్చాట్ క్రియేటర్ కనెక్ట్ను ప్రారంభించింది. ఇది లోకల్ టాలెంట్ని ప్రోత్సహించడమే గాక పరిశ్రమ సహకారాలతో కంటెంట్ క్రియేటర్ల తమ డిజిటల్ కథలను మరింత మెరుగుపరుచుకునేలా చేస్తుంది. అందులో భాగంగా స్నాప్ చాట్ హైదరాబాద్లోని ప్రముఖ క్రియేటర్ ఏజేన్సీలు టమాడా మీడియా, చాయ్బిస్కెట్ - ముటినీ, NRGY+, సిల్లీ మాంక్స్, వాక్డ్ అవుట్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు మద్దతు లబించడమే గాక తదుపరి తరం ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఒక వేదిక అవుతుంది కూడా. Savvy on Snap వంటి కంటెంట్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్ల ద్వారా, భాగస్వాములు తమ Snapchat కమ్యూనిటీలకు ఉత్తమ పాప్ సంస్కృతిని తీసుకురావడంలో సహాయపడటానికి అవసరమైన స్నాప్ కన్సల్టింగ్ మద్దతు తోపాటు తగు వనరులను అందిస్తుంది. అంతేగాదు ఈ ప్లాట్ఫాం కంటెంట్క్రియేటర్లు లాభాలు ఆర్జించేలా రివార్డ్ ప్రోగ్రామ్లను కూడా అందిస్తోంది. ఇక్కడ క్రియేటర్లు తమ కథను ప్రేక్షకులను నిమగ్నం చేసేలా నిర్మించడం అనేది కీలకం. అదే వారికి ఆదాయాలను తెచ్చిపెడుతుంది. ఈ మేరకు స్నాప్ ఇంక్ డాట్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్ మాట్లాడుతూ..ఈ హైదరాబాద్ కంటెంట్ క్రియేటర్లకు నిలయం. ఇక్కడ మా మొట్టమొదటి Snapchat క్రియేటర్ కనెక్ట్ IPని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది జెన్ జెడ్ క్రియేటర్లు, వినియోగదారులకు కేంద్రంగా మారుతుంది. ట్రెండ్కి తగ్గ దృశ్యామన కళ పట్టుకోవడం, కుటుంబల లేదా స్నేమితుల అంతర్గత ఇతి వృత్తంగా ఉన్నవి తదతరాలకు Snapchat పెద్దపీట వేస్తుంది. పాప్ సంస్కృతిలో ఇది సరికొత్త మార్పుకి సంకేతమవుతుంద. భారతదేశం అంతటా ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఈ స్నాప్చాట్ వేదికపై భాగస్వామ్యం అవుతారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను తామందిస్తామని చెప్పారు సాకేత్ ఝా సౌరభ్.స్నాప్చాట్లో నేచురల్ స్టార్ అరంగేట్రంటాలీవుడ్ హీరో నాని ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత సందడి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తన మూవీ HIT: ది థర్డ్ కేస్ స్నాప్చాట్లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. అంతేగాదు స్నాప్చాట్ ఈ చిత్రం కోసం కొత్త మూవీ లెన్స్ను కూడా ప్రారంభించింది. ఈ ఇంటరాక్టివ్ AR లెన్స్ అభిమానులను యాక్షన్కు దగ్గరగా తీసుకువస్తుంది, పైగా సినీ ప్రపంచంలోకి అడుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది. ఇక హీరో నాని మాట్లాడుతూ..కథ చెప్పడం ఎల్లప్పుడూ కనెక్ట్వ్గానే ఉంటుంది. యువ క్రియేటర్లు కథలు ఎలా చెబుతారు, తాజా ట్రెండ్ ఎలా ఉంటుంది తదితారాలు హైదరాబాద్ క్రియేటర్ కమ్యూనిటీతో తీసుకురావాలన్నా ఆలోచన బాగుంది. ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మరింత అద్బుతంగా ఉంది. అంతేగాదు స్నాప్చాట్ ప్లాట్ఫామ్ క్రియేటర్లకు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తున్నాయని అన్నారు.చివరగా ఈ కార్యక్రమం నయని పావని, శ్వేత నాయుడు, నైనికా అనసురు, ప్రణవి, అనుష రత్నం వంటి 50 మందికి పైగా అగ్ర సృష్టికర్తలను టాలెంట్ ఏజెన్సీలు, బ్రాండ్లు, పరిశ్రమ భాగస్వాములు పాల్గన్నారు. నిపుణుల నేతృత్వంలోని చర్చలలో భాగంగా, తమడ మీడియా నుంచి రాహుల్ తమడ క్రియేటర్ అనుభవాలు, వృద్ధి స్నాప్చాట్లో విజయంపై అనుభవాలను పంచుకున్నారు. అయితే చాయ్బిస్కెట్ నుంచి అనురాగ్ స్నాప్లో చిత్రాల భాగస్వామ్యం గురించి నొక్కి చెప్పారు. అందుకు సంబంధించిన కీలక ఉదాహరణలు, విజయగాథలను హైలైట్ చేశారు. స్నాప్చాట్ సాధనాలు - లెన్సులు, స్పాట్లైట్, స్టోరీస్ - క్రియేటర్ల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మెరుగుపరచి, ప్రేక్షకులను ఎలా నిమగ్నమయ్యేలా చేస్తాయో ఈ కార్యక్రమానికి హజరైనవారికి వివరించారు నిర్వాహకులు.(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్ సెలబ్రేషన్..ఓ బిడ్డకు తల్లి అయితే తిప్పలు తప్పవు..!) -
ఎంత పెద్ద స్టార్ అయినా ఓ బిడ్డకు తల్లి అయితే ఇంతేగా..!: ప్రియాంక చోప్రా
పిల్లలను నిద్రపుచ్చడానికి తల్లులు పడే పాట్లు ఇన్నీ అన్నీ కావు. అల్లరి బిడ్డ నిద్రలోకి జారుకుంటే ఆ తల్లి ఆనందం ఇంతా అంతా కాదయా! ఇలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా ఈసారి తన సరికొత్త పోస్ట్లో స్వాతంత్య్ర వేడుకల గురించి మాట్లాడింది!. నిద్రిస్తున్న తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ప్రియాంక. ‘మీ సూపర్ యాక్టివ్ బేబీ నిద్రపోతుంటే’ అని ప్రియాంక ఈ వీడియోను పరిచయం చేసింది. దీంతోపాటు లాఫింగ్ ఇమోజీని కూడా షేర్ చేసింది. కొన్ని సెకన్ల తరువాత టామ్, జెర్రీ డ్యాన్స్ చేస్తుండగా బ్యాక్గ్రౌండ్లో పాట వినిపిస్తుంది. ఈ వీడియోకు ‘ఆజాదీ’ అనే కాప్షన్ ఇచ్చింది. కూతురు అల్లరి చేయకుండా హాయిగా నిద్రపోవడమే... తనకు స్వాతంత్య్ర వేడుక!.(చదవండి: 'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణవివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై.. ) -
కాశ్మీర్ అందాలతో.. హాయిదరాబాద్
ఎండలు మండుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. ఈ సమయంలో మైనస్ డిగ్రీల్లో గడ్డకట్టే చల్లని ప్రదేశం కోసం ఎదురుచూస్తున్నారా..? ఉపశమనం కోసం హిమగిరుల్లో సేదతీరాలని కోరుకుంటున్నారా.. సిమ్లా పొగ మంచులో విహరించాలని, డార్జిలింగ్ గడ్డకట్టిన మంచుపై స్కేటింగ్ చేయాలని ఆశిస్తున్నారా.. అయితే మీకోసం నగరంలో స్నో థీమ్తో వింటర్ థ్రిల్లింగ్ ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి.కాశ్మీర్ మంచు కొండల అనుభూతిని కొండాపూర్లోని ఓ మాల్తో పాటు లోయర్ ట్యాంక్బండ్లోని ఓ ప్రాంతంలో సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వానిరి ఆకట్టుకోవడానికి వింటర్ థ్రిల్లింగ్ వినోద కేంద్రాల్లో ప్రత్యేకించి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, చదువు, పనిఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మైనస్ డిగ్రీల్లో సేదతీరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. స్నో ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందు చలిని తట్టుకునే జర్కినీ, బూట్లు, చేతి గ్లౌజ్లు నిర్వాహకులు అందిస్తారు. విశాలమైన మంచు గదిలోకి వెళ్లగానే కశీ్మర్, సిమ్లా, డార్జిలింగ్ తదతర ప్రదేశాలు గుర్తుకొస్తాయి. మంచు కొండలు ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవచ్చు. ఇక్కడే తక్కువ ఖర్చుతో ఆ అనుభూతి పొందవచ్చు. మండు వేసవిలో గడ్డకట్టిన స్నో, పొగ మంచుపై కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారుహిమాలయాల్లో ఉన్నామన్న ఫీల్ ఉంది. చాలాబాగా నచ్చింది. గడ్డకట్టిన ఐస్, పొగమంచు, వివిధ రకాల థీమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మేం మొత్తం ఐదుగురం వచ్చాం. మా కంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. – దీప, షేక్పేట్, హైదరాబాద్బాగా నచ్చింది ..మాది విశాఖపట్నం. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి గతంలో ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం ఎంతగానో నచ్చింది. మరో రావాలనిపించింది. పాఠశాలలకు సెలవులు కావడంతో మళ్లీ మా అక్క నేను వచ్చాం. మంచులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. – హనీష్, రిథిమ, విశాఖపట్నంమంచు క్రీడలు.. విశాలమైన అతిశీతల గదుల్లో మంచు క్రీడలు అందుబాటులో ఉంటాయి. టోబోగానింగ్, స్నో స్లెడ్డింగ్, స్నో రాక్ క్లైమింగ్, స్నో డాన్స్, ఫ్లోర్లో డాన్స్ వంటివి ప్లాన్ చేసుకోవచ్చు. మంచు ప్యాలెస్లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నల్ల సీల్స్తో కూడిన ఓక్ చెట్లు, ధ్రువ ఎలుగుబంట్లు, పెంగి్వన్లు, ఇగ్లూలు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నో మచ్ ఫన్, గేమ్స్తో గొప్ప జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ ధరలు ఉంటాయి. -
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్లో పెట్టారు శారద. ఆ పోస్ట్పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
సాంస్కృతిక నగరిలో.. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో పాటు విభిన్న కళలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ ఆనవాయితీ ఈనాటిది కాదు. నిజాం కాలం నుంచే వినూత్న, విదేశీ కళలకూ ప్రసిద్ధిగాంచింది. ఇందులో భాగంగానే నగర వేదికగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి విభిన్న నగరాల నుంచి ప్రముఖ ఆర్టిస్టులు ఈ కళా ఉత్సవంలో తమ కళలను ప్రదర్శించనున్నారు. 2011 నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో నిర్వహించే ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండో ఎడిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ ఫెస్టివల్తో పాటు ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ‘ది ఎటర్నల్ కాన్వాస్ – 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్’ ప్రదర్శన హైలైట్గా నిలువనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు పాల్గోనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు దాదాపు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన పెయింటింగ్స్, శిల్పాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ రేతిబౌలి (మెహదీపట్నం) పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 68 దగ్గరున్న కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకూ 11:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకూ కొనసాగుతుంది. ప్రముఖ కళాకారుల ప్రదర్శన.. ప్రముఖ కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, క్రిషేన్ ఖన్నా, శక్తి బర్మన్, సీమా కోహ్లీ, పరేశ్ మెయితీ, యూసుఫ్ అరక్కల్, ఎస్ జి వాసుదేవ్, అంజోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టి వైకుంఠం, చింతల జగదీశ్, గిగి సర్కారియా, ఎంవి రమణా రెడ్డి, లక్ష్మణ్ ఏలె, అశోక్ భౌమిక్, గురుదాస్ షెనాయ్, జతిన్ దాస్, పి జ్ఞాన, రమేశ్ గోర్జాల తదితర ప్రముఖ కళాకారుల కళారూపాలు ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. వైవిధ్యమైన కళావేదిక.. కళాకారులు తమ నెట్వర్క్ మరింతగా పెంచుకోడానికి, భిన్న రంగాలకు చెందిన ప్రేక్షకుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చక్కటి వేదిక. తమ ఇళ్లను చక్కని సృజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరే నగర యువతకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ చక్కని వేదికగా నిలుస్తుంది. చదవండి: స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరంయువ, మిడ్–కెరీర్ కళాకారులు తమ కళాకృతులను పలువురు దిగ్గజ కళాకారులతో పాటు ప్రదర్శించడానికి ‘వన్–స్టాప్ ఆర్ట్ షాప్’గా ఈ వేదిక నిలుస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి ఆర్ట్స్బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ సెలెస్టే, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, స్నేహా ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వంటి సంస్థలు తమ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. – రాజేంద్ర, డైరెక్టర్ –ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ -
చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు ..!
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్లో పేర్కొన్న ప్రకారం చూస్తే.. మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు. ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు. ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు. -
'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణ వివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై..
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్టాపిక్గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు. శారద మురళీధరన్ పోస్ట్లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్నిఅలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.రంగు తక్కువ అనేభావం మాయం..సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు.కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కీలక పాత్రల్లో పనిచేశారు.(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్) -
ఉషా వాన్స్ నటి దీపికా పదుకొణె స్టైల్ని రీక్రియేట్ చేశారా..?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్ బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్ గురించి చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్లో జరిగిన తప్పిదం ఏంటంటే..డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉషా వాన్స్ని ప్రశంసిస్తూనే పోస్ట్ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్ చేసి ఉన్న జేడీ వాన్స్ ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్గా మార్ఫింగ్ చేసిన ఫోటోని ఎలా పోస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్ ఫోటో అనే కాదు. Usha Vance is a brilliant and accomplished attorney known for her intelligence, grace, and support for her husband, J.D. Vance. Her beauty is matched by her poise and dedication, making her an inspiring figure. pic.twitter.com/Wm56FK0uCq— Ivanka Trump 🇺🇲 🦅 News (@IvankaNews_) March 23, 2025ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్గ్రీన్ స్టైల్ అది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్ వేర్ని మార్ఫింగ్ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్ ఫోటో అని క్లియర్గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్ పెట్టాలి అని కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్లో పెరుగుతున్న క్రేజ్) -
భారత్ గోలీ సోడాకు విదేశాల్లో ఫుల్ డిమాండ్..!
ఒకప్పుడు మనదేశంలో సంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీసోడా చూస్తుండగానే కనుమరుగైంది. పెప్సీ, మజా, కోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ మని శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్తో ప్రజల మన్నలను అందుకున్న పానీయం ఇది. 80,90లలో దీనిదే హవా. అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెగ్గుచుకుని తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వెరేలెవెల్లో ఉంది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దామా..!.మన భారత సంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాజిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని, కామర్స్ మంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు. దాని వినూత్న రీక్రీయేషనే అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉందట. అంతేగాదు ఈ గోలిసోడా మార్కెట్కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్మ్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. మన భారతీయులు సైతం ఈ గోలీసోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయలును కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్తో వచ్చే టప్ మనే పేలుడు శబ్దం.. మనల్ని ప్రేమగా గుర్తుంచుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు మళ్లీ ఇలా రీబ్రాండింగ్ అంర్జాతీయ మార్కెట్ని ఆకర్షించి ఆధునాత ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒకరంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పోటీపడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్ ఈ సోడా మన దేశంలో కూడా మళ్లీ ఇదివరకటి రోజుల్లా అమ్ముడైలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ..ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్న ఆర్యోక్తి గుర్తోస్తోంది కదూ..!.Bharat's very own GOLI POP SODA returns to wow tastebuds worldwide! 🇮🇳Kudos to @APEDADOC for promoting the revival of the traditional Indian Goli Soda.📖 https://t.co/Ask6n6YCCl pic.twitter.com/T7XZmc1xmc— Piyush Goyal (@PiyushGoyal) March 25, 2025(చదవండి: పెళ్లి సంగతి తర్వాత..కౌన్సిలింగ్ ఇప్పించండి..! ) -
పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్ ఇప్పించండి..!
మా అక్క తన విడాకుల అనంతరం మాతోనే ఉంటున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి వయసు 29 సంవత్సరాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. 2023వ సంవత్సరంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘‘నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది’’ కానీ ఆ అబ్బాయి వివరాలు ఇవ్వలేదు. మేమే ఎలాగోలా అతని ఫోన్ నెంబర్ తెలుసుకుని అబ్బాయిని సంప్రదించగా తనకు జాబ్ వచ్చిన తరువాత మాత్రమే తమ ప్రేమ విషయం ఇంట్లో చె΄్తాను అన్నాడు. తన కుటుంబ వివరాలు కూడా మాకు ఇవ్వలేదు. వారిది వైజాగ్ అని మాత్రమే తెలుసు. అమ్మాయిని వేరే సంబంధం చేసుకోమంటే మా మాట వినటం లేదు. ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెము. అయినా లాభం లేదు. ఇటీవలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ట్లు తెలిసింది కానీ, తర్వాత నుంచి మా మేనకోడలితో కూడా మాట్లాడడం మానేశాడు. మా అక్కకి ఆ అబ్బాయితో సంబంధం ఇష్టం లేదు. పరిష్కారం చూపగలరు.– విజయ, హైదరాబాద్మీ మేనకోడలు ఒక మేజర్. చట్టప్రకారం తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి – ఎవరితో కలిసి బతకాలి, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటాన్ని చట్టం అంగీకరించదు.అది తల్లిదండ్రులైనా సరే! ఏమి చేసినా ఆ అమ్మాయి అంగీకారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయికి ఇంక ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది. బహుశా మీ అమ్మాయి ఈ విషయం జీర్ణించుకున్నట్లు లేదు. తనకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. మీ అమ్మాయి అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనడానికి గల కారణం ఏమిటో ప్రేమగా మాట్లాడి తనకి ధైర్యాన్ని ఇస్తూ కనుక్కోండి. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నట్లైతే సరేం అలా కాదు ఏదైనా వేరే కోణం ఉందేమో తెలుసుకోండి. శారీరక సుఖం కోసం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతూ కోరిక తీరినాక మోసపూరితంగా వదిలేస్తే, అందుకు తగిన శిక్షలు భారతీయ న్యాయ సంహితలో వున్నాయి. కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ సమయంలో మీరు తనపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదు. మీరు కలిగించే ధైర్యం–నమ్మకం తనకు చాలా అవసరం. కాబట్టి పెళ్ళి సంగతులు కాసేపు పక్కనబెట్టి ముందు తన మానసిక పరిస్థితి, తనకు ఏం కావాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కౌన్సెలింగ్ ఇప్పించండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)(చదవండి: యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్) -
పేదోళ్ల వకీలమ్మ
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్కు చైర్పర్సన్ గా సరళ మహేందర్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆటల్లో మెరిసేలా...గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్సామాజిక సేవే... విలువైన సంపదన్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్రెడ్డి -
లేడీ బౌన్సర్స్కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్కు వచ్చే అతిథుల కోసం ఎయిర్పోర్ట్కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్డోర్ షూటింగ్లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు. -
మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్ -
యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్..
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్ భట్ ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్ఫేర్, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్ భట్ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బాలీవుడ్లో మంచి పేరుగాంచిన రాజ్ మూవీ సీరిస్ దర్శకుడు విక్రమ్ భట్ తాను టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.ఆ వ్యాధి ఏంటంటే..విక్రమ్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్ అన్నారు. ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకు వస్తుందంటే..రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్గా చెప్పాలంటే కదలికలే ఉండవు. చికిత్స:అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. మైయోసిటిస్కి పూర్తి భిన్నం..ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?) -
'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్. (చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్స్టాలో షేర్ చేసింది.సియోల్లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్పర్ట్ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్లోని బృందావన్కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..) -
'విద్యార్థి భవన్ బెన్నే దోసె': యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..
కొన్ని రెస్టారెంట్ ఏళ్లనాటివి అయినా.. అక్కడ అందించే రుచే వేరు అనిపిస్తుంది. ఎన్నో కొంగొత్త హైరేంజ్ రెస్టారెంట్లు వచ్చినా..! ఏళ్ల నాటి మధురస్మృతులకు నిలయమైన ఆ పాత రెస్టారెంట్లకే ఎక్కువ ప్రజాదరణ ఉంటుంది. ఎన్ని హంగు ఆర్భాటలతో ఐదు నక్షత్రాలలాంటి హోటల్స్ వచ్చినా.. వాటి క్రేజ్ తగ్గదు. కేవలం సామాన్యులే కాదు ప్రముఖులు, సెలబిట్రీలు సైతం అలనాటి రెస్టారెంట్ పాక రుచికే మొగ్గుచూపుతారు. వాటి టేస్ట్కి ఫిదా అంటూ కితాబిస్తారు కూడా. అలాంటి ప్రఖ్యాతిగాంచిన రెస్టారెంటే ఈ బెంగళూరుకి చెందిన 'విద్యార్థి భవన్'. ఈ రెస్టారెంట్ అందించే విభిన్న దోసె, వాటిని మెచ్చిన ప్రముఖులు గురించి ఈ కథనంలో సవివరంగా తెలుసుకుందామా..!. బెంగళూరు వాసులు ఇష్టపడే 1943ల నాటి రెస్టారెంట్ ఈ 'విద్యార్థి భవన్'. ఇది ఐకానిక్ బెన్నే దోసెలకు ఫేమస్. ఇక్కడ చేసే బెన్నే దోసెల రుచే వెరేలెవెల్. గాంధీనగర్లోని గల్లో ఉండే ఈ ఐకానిక్ రెస్టారెంట్ స్థానికులు, పర్యాటకులకు నోరూరించే రుచులతో మైమరిపిస్తోంది. ఎవ్వరైనా బెన్నే దోస తినాలంటే అక్కడకే వెళ్లాలనేంతగా పేరు తెచ్చుకుంది ఈ రెస్టారెంట్. నిత్యం రద్దీగా క్యూలైన్లు కట్టి ఉంటారు జనాలు ఆ రెస్టారెంట్ వద్ద. అంతేగాదు అక్కడ యాజమాన్యం 50% అడ్వాన్స్డ్ బుకింగ్ సీటింగ్కి ప్రాద్యాన్యత ఇస్తుందంటే..ఆ రెస్టారెంట్ ఎంత బిజీగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముందుగా బుక్ చేసుకోకపోతే వారాంతల్లో వెళ్లక పోవడమే బెటర్.ఈ రెస్టారెంట్ చరిత్ర..ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ రెస్టారెంట్లో బెన్నే దోసెలు, ఫిల్టర్ కాఫీలను ఆస్వాదించడానికి వచ్చే కస్టమర్లే ఎక్కువట. ఇక్కడ ఉండే సిబ్బంది కూడా విలక్షణంగా ఉంటారు. ఎందుకంటే ఒకేసారి ఎనిమిది ప్లేట్ల బెన్నెదోసెలను సర్వ్ చేస్తుంటారు. ఆ విధానం చూస్తే..కచ్చితం కళ్లు బైర్లుకమ్ముతాయి. దీన్ని 1943-1944 ప్రారంభంలో వెంకటరామ ఉడల్ నగరం వెలుపల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అదీగాక ఆ టైంలో రెస్టారెంట్లకు చివర్లో భవన్ అని పెట్టేవారట. అలా దీనికి విద్యార్థి భవన్ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ రెస్టారెంట్ సమీపంలో ఉంటే ఆచార్య పబ్లిక్ స్కూల్, నేషనల్ కాలేజ్ తదితర సమీప పాఠశాల విద్యార్థులకు బోజనం అందుబాటులో ఉండేలా దీన్ని ఏర్పాటు చేశారు. అదీగాక ఆ రెస్టారెంట్ ఉన్న ప్రాంతం విద్యాసంస్థలకు నిలయం కావడంతో అనాతికాలంలోనే మంచి ఫేమస్ అయిపోయింది. అంతేగాదు ఇక్కడకు వచ్చే కస్టమర్లలో ఎక్కువ మంది ప్రముఖుల, సెలబ్రిటీలు, రచయితలేనట.ఈ దోసెను మెచ్చిన అతిరథులు..ముఖ్యంగా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్, చెఫ్ సంజీవ్ కపూర్, స్టార్బక్స్ సహ వ్యవస్థాపకుడు జెవ్ సీగల్, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి వంటి ఎందరో ఈ రెస్టారెంట్ బెన్నే దోసకు అభిమానులట. అంతేగాదు ఈ రెస్టారెంట్ అనగానే ఠక్కున గుర్తువచ్చేది బెన్నేదోసనే అట. అందువల్ల ఆ హోటల్ సిగ్నేచర్ డిష్గా ఆ వంటకం మారిపోవడం విశేషం. ఇక్కడ ఆ దోస తోపాటు ఇడ్లీలు, కేసరి బాత్ లేదా రవా బాత్, మేడు వడ వంటి విభిపకప అల్పాహారాలను కూడా సర్వ్ చేస్తారు. అంతేగాదు అక్కడ టిఫిన్ ముగించి చివరగా ఫిల్టర్ కాఫీని ఆస్వాదించకుండా వెళ్లరట. అంతలా ప్రజాదారణ పొందిన ఈ ఐకానిక్ విద్యార్థి భవన్ రెస్టారెంట్ రుచిని మీరు కూడా ఓ పట్టు పట్టేయండి మరీ..!.(చదవండి: work life Balance: అలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..! టెకీ సలహ వైరల్) -
అలా చేస్తే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..!
ఇటీవల "వర్క్ లైఫ్ బ్యాలెన్స్" తెగ చర్చనీయాంశంగా మారింది. వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే మన భారత్ మరింత అభివృద్ధి చెందడానికి అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏ ముహర్తానా అన్నారో గానీ అప్పటి నుంచి వర్క్లైఫ్ బ్యాలెన్స్ తెరపైకి వచ్చేంది. అందరూ ఇక పనికే అంకితమైతే వ్యక్తిగత జీవితం, బాంధవ్యాల పరిస్థితి ఏంటీ...?. ఆ తరువాత జీవిత చరమాంకలో ఎవ్వరూ మనతో ఉండరు అంటూ రకరకాలు మాటలు లెవెనెత్తారు నెట్టింట నెటిజన్లు. సరిగ్గా ఈ సమయంలో ఓ బెంగళూరు టెకీ ఇలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సులభంగా మెయింటైన్ చేయొచ్చు అంటూ ఓ సలహా సూచించాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్గా మారి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అతడు చెప్పిన సలహా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గానీ కానీ కాస్త ఆలోచింపచేసేలా ఉందంటున్నారు నెటిజన్లు. మరీ అదెంటో చూసేద్దామా..!.బెంగళూరు టెకీ హర్షిత్ మహావర్ లింక్డ్ ఇన్ పోస్ట్లో పని జీవిత సమతుల్య సాధించడానికి ఇలా చేయండి అంటూ ఓ ఉచిత సలహ ఇచ్చాడు. అదేంటంటే..మీ సహోద్యోగినే పెళ్లాడండి సింపుల్గా. అంతే ఇక ఎన్నో ప్రయోజనాలు పొందుతారంటూ జాబితా చిట్టా చెప్పుకొచ్చాడు. క్యాబ్లపై డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నుంచి పనిచేసిన అనుభూతే ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్లో అనుక్షణం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది కదా..!. కాబట్టి ఆఫీస్లో ఉన్నాం అనిపించదు. ఏ మాత్రం విరామం దొరికినా..కాసేపు మీ శ్రీమతి లేదా శ్రీవారితో ముచ్చటించొచ్చు. ఇక తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడూ ఏదో ఊరు నుంచి వెళ్తున్నట్లుగా జాలీగా గడపండి. మీ భాగస్వామితో గడపలేదన్న భాధ కూడా ఉండదు. అటు వర్కు హయిగా చేసుకోవచ్చు..ఇటు భార్యతోనూ హ్యాపీగా స్పెండ్ చెయ్యొచ్చు. ఇలా చేస్తే కుటుంబాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఉండదు. రెండింటికి న్యాయం చేసినవారు అవుతారంటూ రాసుకొచ్చాడు లింక్డ్ఇన్ పోస్ట్లో హర్షిత్. అయితే నెటిజన్లు ఇదేదో బాగుందే..!.. ట్రై చేస్తా అని కొందరు, సహోద్యోగిని పెళ్లిచేసుకోవడం అనేది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు అని మరికొందరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఊపిరి సలపని ఒత్తిడులు..ఆగిపోతున్న ఖాకీల గుండెలు..!) -
విధుల ఒత్తిడి.. వ్యాధుల ముట్టడి..!
ఓ వైపు శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి.. మరోవైపు ఆకతాయిలు పెచ్చు మీరుతున్నారు. ఇంకోవైపు గంజాయి బ్యాచ్ల ఆగడాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ పోలీసులే కావాలి. కానీ సరిపోయేంత సంఖ్యలో ఖాకీలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో లేరు. ఫలితంగా ఉన్న వారిపైనే ఒత్తిడి పడుతోంది. ఊపిరి సలపనంత పనితో వారి గుండెపై భారం పడుతోంది. తీవ్ర నిద్రలేమి, సరైన సమయానికి భోజనం లేక 30 ఏళ్లు దాటిన పోలీసులకు సైతం బీపీ, మధుమేహం వస్తున్నాయి. చాలా మందికి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు కూడా దెబ్బతింటున్నాయి. 50 ఏళ్లు దాటిన వారితో పాటు 35 ఏళ్లలోపు వారు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకోలేక, కుటుంబ సభ్యులతో ఈ కష్టం పంచుకోలేక చాలా మంది తమలో తామే కుమిలిపోతున్నారు. సిబ్బంది.. ఇబ్బంది జిల్లాలో 38 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నవాళ్లలో 20 శాతం మందిని దేవాలయాలు, రాజకీయ సమావేశాలు, పోలీస్ పికెటింగ్, విద్యార్థుల పరీక్షలు వంటి బందోబ స్తు కార్యక్రమాలకు పంపుతుంటారు. ఒక్కో స్టేషన్లో 50 నుంచి 70 మంది ఉండాల్సి ఉన్నా పట్టుమని 20 మందైనా ఉండడం లేదు. ఈలోగా స్టేషన్లలో పెండెన్సీ కేసులు, కొత్త కేసులు, కొత్త చట్టాలు, కొత్త యాప్లు, సంకల్పాలు, అవగాహనలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల కొరత వేధిస్తోంది. మరో 500 మంది సిబ్బంది ఉంటే తప్ప ఉన్న వారి ఆరోగ్యం బాగు పడేట్లు కనిపించడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ.. 50 ఏళ్లు దాటిన వారిని సైతం సుదూర (విజయవాడ)బందోబస్తులకు పంపిస్తుండటం ఇబ్బందిగా ఉంటుంది. టీఏ, డీఏలు, సరెండర్లీవ్లు కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో పదిమంది వెళ్లాల్సిన స్థానంలో వందమందినైనా అక్కడి వాళ్లు అడుగుతుండటం, సొంత డబ్బులతోనే సిబ్బంది వెళ్తుండటం జీతాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. స్టేషన్లలో పోలీసు వాహనాల కొరత ఉండటంతో సొంత వాహనాలకు పెట్రోల్ పోసి పరిసర ప్రాంతాల విధుల్లో తిరగాల్సి వస్తోందని చాలామంది వాపోతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని జెమ్స్ లో ఇటీవల పోలీసులకు నిర్వహించిన మెడికల్ క్యాంపులో 103మందికి పైగా సిబ్బందికి గుండెకు సంబంధించిన యాంజియోగ్రామ్, స్టంట్స్ అవసరమని వైద్యులు నిర్ధారించారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.వీరి పరిస్థితే హెచ్చరిక.. జనవరిలో నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో యువకుడైన నాగరాజు అనే హోంగార్డు గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య, చిన్న పిల్లలున్నారు. జిల్లా కలెక్టరేట్ ట్రెజరీ విభాగంలో చెస్ట్ గార్డుగా ఉన్న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ సవర జోక్యో గుండెపోటుతో మరణించాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన వరుసగా మూడురోజులు విధుల్లో ఉన్నారు. మందస హెడ్కానిస్టేబుల్ గవరయ్య (59) గుండెపోటుతోనే మరణించారు. నగరంలోనే కిడ్నీలు ఫెయిల్ అయి ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార బందోబస్తు విధులకు వెళ్లిన 57 ఏళ్ల ఆబోతుల లక్ష్మయ్య ఎండల వేడిమి తట్టుకోలేక స్ట్రోక్ వచ్చి విజయవాడలోనే మృతిచెందాడు. ఈయనది పోలాకి మండలం పల్లిపేట. సోంపేట ఎస్ఐ రవివర్మకు ఇటీవలే రెండోసారి స్ట్రోక్ వచ్చింది. తొలిసారి ఒక స్టంట్, ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరమన్నారు. ప్రస్తుతానికి లీవ్లో ఉన్నారు. కాశీబుగ్గ కానిస్టేబుల్కు హార్ట్ ప్రాబ్లెం ఉండటంతో స్టంట్ వేయించుకున్నారు. సోంపేటలో ఓ కానిస్టేబుల్కు ఇదే పరిస్థితి ఉంది. డే బై డే నైట్ డ్యూటీలతో సిక్.. గతంలో నైట్ బీట్ డ్యూటీల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఉండేవారు. ఎస్ఐలు, సీఐలు రౌండ్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 ఏళ్లు నిండి రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఏఎస్ఐలు నుంచి హెడ్కానిస్టేబుళ్లు కూడా డే బై డే నైట్ బీట్లకు వెళ్లాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎస్ఐ–2లు వెళ్తున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు వరకు ఉండటమే కాక గంట గంటకూ లైవ్ లొకేషన్, రెండు ఫొటోలు పంపాల్సిందే. మళ్లీ ఉదయాన్నే రోల్కాల్ 8గంటలతో డ్యూటీ మొదలు. 7:45 కల్లా సిద్ధంగా ఉండాలి. సెట్కాన్ఫరెన్సు (ఎస్ఐ, ఆపై ర్యాంకు) అయితే 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5కి రోల్ కాల్, 7:30 నుంచి సెట్ కాన్ఫరెన్సు.. కొన్నిమార్లు జూమ్ కాన్ఫరెన్సులు.. సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ ఉంటాయి. (చదవండి: -
వండర్స్ ఆఫ్ వయనాడ్: కొండ కోనల్లో పడవ ప్రయాణం..!
పాత రాతియుగాన్ని చదువుకున్నాం... శిలాయుగాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ కాలంలో ఏమేమి ఉన్నాయి? బ్రహ్మ కట్టిన తిరునెల్లి ఆలయం ఉంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాటిని చూడాలంటే... అరక్కల్... అంబల్వాయల్ మ్యూజియాలకు కళ్లప్పగించాలి. ఎడక్కల్ గుహల్లో ఎనిమిదివేల ఏళ్ల నాటి బొమ్మలను తాకి చూడాలి. మోడరన్ హిస్టరీ చెప్పిన పాఠాలకు ఆనవాళ్లుగా... ఏమేమి ఉన్నాయి? డచ్ కట్టడాలు... పోర్చుగీసు నిర్మాణాలు... బ్రిటిష్ కాలపు టెలిఫోన్లు. వాటిని చూడాలంటే ఏం చేయాలి?... వయనాడుకు ప్రయాణమవ్వాలి. ఎరుపెక్కిన కళ్లతో కప్పడ్ బీచ్లో వాస్కోడిగామా స్మారకాన్ని చూడాలి. గాంధీజీ జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించిన కాల్పెట్టలో బస చేయాలి. ఫారెస్ట్కు అర్థవంతమైన నిర్వచనం చెప్తున్న కురువద్వీపంలో అడుగుపెట్టాలి. పూకోద్ సరస్సులో కలువల మధ్య పడవ ప్రయాణం చేయాలి. భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని గౌరవిస్తూ ముందుకుసాగాలి. ‘వండర్స్ ఆఫ్ వయనాడ్’ ఐఆర్సీటీసీ ప్యాకేజ్ సిద్ధంగా ఉంది.సెలవులు వస్తున్నాయి... కేరళలో పర్యటనకు ప్లాన్ చేసుకోండి.మొదటి రోజు..ఉదయం ఆరుగంటల సమయంలో 12789 నంబరు కాచిగూడ–మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.రెండోరోజుఉదయం ఆరు గంటల సమయంలో రైలు కన్నూరుకు చేరుతుంది. రైలు దిగి రైల్వే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన హోటల్కు చేరుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఉపహారం తిన్న తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. ఏంజిలో ఫోర్ట్, అరక్కల్ మ్యూజియం చూసుకున్న తర్వాత ప్రయాణం వయనాడు వైపు సాగుతుంది. దారిలో అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ వయనాడు, కాల్పెట్టలోని హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి. రాత్రి బస అక్కడే.ఇక్కడికి గాంధీజీ వచ్చాడు!కన్నూర్ కోట (సెయింట్ ఏంజిలో ఫోర్ట్) పోర్చుగీసు, డచ్వాళ్ల పాలన సాగించిన ప్రదేశం. అరక్కల్ మ్యూజియం కన్నూరు సిటీకి మూడు కిలోమీటర్ల దూరాన ఉంది. అరక్కల్ రాజవంశం నివసించిన ప్యాలెస్ అది. వాళ్లు ఉపయోగించిన ఫర్నిచర్ డిజైన్లు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్గా సంపన్నవర్గాల ఇళ్లలో కనిపిస్తున్నాయి. బ్రిటిష్పాలన కాలంనాటి టెలిఫోన్ కూడా ఉంది. రాత్రి బస చేస్తున్న కాల్పెట్ట అందమైన హిల్స్టేషన్. దట్టమైన అటవీ ప్రదేశం కూడా. కేరళలో భారత జాతీయోద్యమం పురుడుపోసుకున్న ప్రదేశం ఇది. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తినింపడానికి గాంధీజీ 1934లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. మూడోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత సైట్ సీయింగ్కి బయలుదేరాలి. కురువ ద్వీప్, తిరునెల్లి ఆలయం, బాణాసుర సాగర్ డ్యామ్ చూసుకుని హోటల్కి చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.బ్రహ్మ కట్టిన ఆలయంకురువద్వీపంలో విహారం మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు ఉంటుంది. కబిని నది ఉపనదుల ప్రవాహం మధ్యలో ఏర్పడిన వెయ్యి ఎకరాల దీవి ఇది. పచ్చదనాన్ని పుష్పగుచ్ఛంగా ఒకచోట రాశి΄ోసినట్లుంటుంది. ఇక్కడ అరుదైన పక్షులు కనిపిస్తాయి. తిరునెల్లి ఆలయం ఓ విశిష్టత. దీని గురించి చారిత్రక ఆధారాలేవీ దొరకట్లేదు. పౌరాణిక ఆధారాల ప్రకారం వేదవ్యాసుడు రాసిన పురాణాల్లో విష్ణువు కోసం బ్రహ్మ భూమ్మీద నిర్మించిన ఆలయం అని తెలుస్తోంది. లొకేషన్ సెలెక్ట్ చేయడానికి బ్రహ్మదేవుడు తన వాహనం హంస మీద భూమండలం అంతా పర్యటిస్తూ ఈ ప్రదేశాన్ని చూసి ముచ్చటపడ్డాడని, ఇక్కడే ఆలయాన్ని నిర్మించాడని, ఈ కొండకు బ్రహ్మగిరి అనే పేరు రావడానికి కారణం అదేనని చెబుతారు. ఆలయాన్ని నిర్మించే వరకు తనతో తెచ్చిన విగ్రహాన్ని ఉసిరి చెట్టులో దాచడంతో ఈ ఆలయానికి నెల్లి అనే పేరుతో తిరునెల్లి ఆలయం అనే పేరు వచ్చింది. పది–పదకొండు శతాబ్దాల్లో చేరరాజు భాస్కర రవివర్మ పాలించిన నాటికే ఇది గొప్ప యాత్రాస్థలంగా ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రాచీన కాలం నాటి గ్రామాల ఆనవాళ్లను కూడా చూడవచ్చు. ఆ తర్వాత చూడాల్సిన బాణాసుర సాగర్ డ్యామ్ రెండువేల అడుగుల పొడవుతో దేశంలోనే అతి పెద్ద ఎర్త్డ్యామ్. జల విద్యుత్ తయారీ కేంద్రాన్ని కూడా చూడవచ్చు. నాల్గోరోజుబ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంబలవాయల్ హెరిటేజ్ మ్యూజియం, సూచిపారా జలపాతం, ఎడక్కల్ గుహలు, పూకోద్ సరస్సులో విహారం తర్వాత తిరిగి హోటల్కు చేరాలి. ఆ రాత్రి బస కూడా కాల్పెట్టలోనే.రాతియుగాన్ని చూసొద్దామా!ఇది వయనాడ్ హెరిటేజ్ మ్యూజియం, అంబలవాయల్ అనే ప్రదేశంలో ఉండడంతో ఆ పేరు వచ్చింది. ఇందులో రాతియుగం నాటి పదునైన రాతి ఆయుధాలు, 14 నుంచి 16వ శతాబ్దం నాటి శిల్పాలు, మృణ్మయపాత్రలు, టెర్రకోట శిల్పాలు ఉంటాయి. ఇక ఎడక్కల్ గుహలు కాల్పెట్టకు 25 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. వీటి వింత ఏమిటంటే... ఇవి నేలమీద విస్తరించిన గుహలు కావు. ఎవరూ పనిగట్టుకుని తొలిచినవీ కాదు. దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహల్లో కనిపించే బొమ్మలు క్రీస్తు పూర్వం ఆరువేల ఏళ్ల నాటివని అంచనా. ఈ రోజు చివరగా పూకోద్ సరస్సులో పడవ విహారంతో సేదదీరడమే. ఈ సరస్సు దాదాపు ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో కొండల మీద ఏడెనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది. వర్షపునీరు కొండ కోనల నుంచి ఇక్కడికి చేరుతుంది. సరస్సు నిండిన తర్వాత నీరు కిందకు ప్రవహించి పనమారమ్ నదిగా మారుతుంది. ఈ నది కబిని నదిలో కలుస్తుంది. ఈ సరస్సులో కలువలు విరివిగా ఉంటాయి. అందుకే దీనికి పూలతీరం అనే అర్థంలో పూకోద్ అనే పేరు వచ్చింది. ఐదోరోజుఉదయం బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. ప్రయాణం కోళికోద్ వైపు సాగుతుంది. దారిలో కప్పడ్ బీచ్ విహారం. సాయంత్రం ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఉంటుంది. షాపింగ్ తర్వాత కోళికోద్ రైల్వే స్టేషన్కి వెళ్లి రైలెక్కాలి. 12790 నంబరు మంగళూరు సెంట్రల్ – కాచిగూడ ఎక్స్ప్రెస్ రాత్రి 11.35 నిమిషాలకు బయలు దేరుతుంది. 24 గంటల తర్వాత ఆరవ రోజు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుతుంది.వాస్కోడిగామా అడుగుపెట్టాడు!కప్పడ్ బీచ్ అంటే ΄ోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మన దేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించి మన నేల మీద పాదం మోపిన ప్రదేశం. ఇది 1498లో జరిగింది. భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ 1934లో కాల్పెట్టలో అడుగుపెట్టడానికి కారణమైన సంఘటన అన్నమాట. కష్టంగా అయినా నిష్టూరంగా అయినా ఈ ప్రదేశాన్ని చూడాల్సిందే, వదిలేయడానికి వీల్లేదు. గుడ్లు పెట్టి పిల్లలను పొదగడానికి ఇక్కడికి వచ్చే తాబేళ్లను చూడడానికైనా కప్పడ్ బీచ్ని కవర్ చేయాలి. అలాగే సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతంగా సముద్రతీరాన గడపడానికి ఇది మంచి ప్రదేశం. ఇక చివరగా కోళికోద్ పట్టణంలోని ఎస్ఎమ్ స్ట్రీట్లో షాపింగ్ కోసం సమయం ఇస్తారు. వాహనం దిగి మార్కెట్ అంతటా కాలి నడకన తిరగాలి. ఏం కొన్నా కొనక΄ోయినా కోళికోద్ హల్వా తప్పకుండా రుచి చూడాలి. బంధువులు, స్నేహితుల కోసం ఇంటికి తెచ్చుకోవాలి. దీంతో ఈ టూర్ తీపి జ్ఞాపకపు రుచి కలకాలం గుర్తుంటుంది.వండర్స్ ఆఫ్ వయనాడ్ (ఎస్హెచ్ఆర్ 098) ప్యాకేజ్లో...ఇవి ఉంటాయిస్టాండర్డ్ ప్యాకేజ్లో స్లీపర్ క్లాస్లో ప్రయాణం. కంఫర్ట్ ప్యాకేజ్లో థర్డ్ ఏసీలో ప్రయాణం. రైలు దిగిన తరవాత లోకల్ జర్నీ ఏసీ వాహనంలో ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. టోల్ ఫీజ్, పార్కింగ్ ఫీజులు ప్యాకేజ్లోనే. రాత్రి బస చేసిన హోటల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది.ఇవి వర్తించవుమధ్యాహ్నం, రాత్రి భోజనాలు. రైలు ప్రయాణంలో భోజనాలు, సైట్ సీయింగ్ ప్రదేశాల ఎంట్రీ టికెట్ చార్జ్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి రిక్రియేషనల్ టికెట్ ఫీజులు, గైడ్ చార్జ్లు, ఇతర సర్వీసులు పర్యాటకులే భరించాలి. కొన్ని ప్రైవేట్ టూర్ ప్యాకేజ్లు ట్రీ హౌస్లో రాత్రి బస ఏర్పాటు చేస్తున్నాయి.వండర్స్ ఆఫ్ వయనాడ్ టికెట్ ధరలిలాసింగిల్ ఆక్యుపెన్సీలో (ఒక్కొక్కరికి ఒక్కో గది) కంఫర్ట్ ప్యాకేజ్ 37, 640 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్కి 34, 840 రూపాయలు.డబుల్ ఆక్యుపెన్సీలో (ఇద్దరికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 21,220 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 18,430 రూపాయలు.ట్రిపుల్ ఆక్యుపెన్సీలో (ముగ్గురికి ఒక గది) ఒక్కొక్కరికి కంఫర్ట్ ప్యాకేజ్ 17,740 రూపాయలు, స్టాండర్డ్ ప్యాకేజ్లో 14,950 రూపాయలు. (చదవండి: ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..!) -
సరదాగా ఈ సండే చేప, చికెన్తో వెరైటీ స్నాక్స్ చేయండిలా..!
ఫిష్ చిప్స్ కావలసినవి: చేప ముక్కలు– 500 గ్రాములు (ముల్లు్ల లేనివి)మైదా పిండి– అర కప్పుమొక్కజొన్న పిండి– పావు కప్పుబేకింగ్ పౌడర్– కొద్దిగాబ్రెడ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్మిరియాల పొడి– అర టీ స్పూన్సోడా వాటర్– కొద్దిగాఉప్పు– తగినంతమసాలా దినుసులు– కొద్దికొద్దిగా (మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోవాలి)నూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రం చేశాక, నీరు లేకుండా ఆరబెట్టాలి. అనంతరం వాటికి ఉప్పు, మిరియాల పొడి పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి మైదా పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బ్రెడ్ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి, మసాలా దినుసుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. సోడా వాటర్ కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు ఏర్పడకుండా చేసుకోవాలి. అనంతరం చేప ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి, బాగా పట్టించి, నూనెలో దోరగా వేయించుకోవాలి. బంగాళ దుంపలను కూడా ఇదే విధంగా వేయించుకుని, వీటితో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.చికెన్తో స్పైసీ ఎగ్స్కావలసినవి: గుడ్లు– 5 లేదా 6 బోన్లెస్ చికెన్– 1 కప్పు కారం– 2 టీ స్పూన్లుపసుపు– చిటికెడుగరంమసాలా– 2 టీ స్పూన్ల పైనే చికెన్ మసాలా– 1 టీ స్పూన్ ఉప్పు– తగినంతమిరియాల పొడి– కొద్దిగా, కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా బోన్లెస్ చికెన్ను శుభ్రం చేసుకుని, మిక్సీ పట్టి, కొద్దిగా పెరుగు, 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గుడ్లు ఉడికించి, పెంకులు తీసి, సగానికి కట్ చేసుకుని పసుపు సొనలను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అనంతరం చికెన్ మిశ్రమాన్ని, పసుపు సొనలతో కలిసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక్కో గుడ్డు చెక్కభాగంలో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని పెట్టుకుని కొత్తిమీర తురుము లేదా ఉల్లికాడ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే.. ఇవి భలే రుచిగా ఉంటాయి.(చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే..! అచ్చం మనిషిని పోలిన రోబో..) -
ఏకంగా ఆన్లైన్లోనే మట్టిని అమ్మేస్తున్నారు..! ఎందుకో తెలుసా..?
ఆన్లైన్లో ప్రతి వస్తువు అమ్మకానికి ఉంచినట్లే, చైనాలో మట్టిని కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, ఈ మట్టి అలాంటి ఇలాంటి మట్టి కాదు, ‘ఇదొక అదృష్టాల మట్టి, ఈ మట్టిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుల వర్షం కురిపిస్తుంది’ అంటూ బ్యాంకుల ఆవరణలోని మట్టిని రాత్రివేళలో సేకరించి ఆన్లైన్లో అమ్ముతున్నారు. వంద గ్రాముల మట్టి ధర సుమారు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉంటోంది. ఈ మట్టితో ఆర్థికంగా లాభాలు పొందవచ్చని చాలా మంది నమ్మి, బ్యాంకుల ముందు మట్టిని, బ్యాంక్ లోపల పూలకుండీల వద్ద ఉండే మట్టిని, కౌంటింగ్ మిషన్ నుంచి వచ్చిన ధూళిని కూడా సేకరిస్తున్న వీడియాలు వైరల్గా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన చైనా ప్రభుత్వం పబ్లిక్ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం నిషిద్ధంగా ప్రకటించింది. ఇలాంటివి నమ్మవద్దని ప్రకటనలు ఇస్తోంది చైనా ప్రభుత్వం. (చదవండి: -
అడినాయిడ్స్ వాపు ..?
అడినాయిడ్స్ ముక్కు లోపలి భాగానికి కాస్త వెనకన, నోటి లోపల అంగిటి పైభాగంలో ఉంటాయి. అవి స్పాంజి కణజాలంతో తయారై మెత్తగా, గుంపులుగా ఉంటాయి. రెండు రకాలుగా వీటి ఉనికి తెలుస్తుంది. మొదటిది... ఎండోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించడం ద్వారా... ఇక రెండోది తల ఎక్స్–రే తీసినప్పుడు, ఈ తల ఎక్స్–రేలో వాటి పరిమాణం కూడా తెలుస్తుంది. అడినాయిడ్స్ అన్నా, టాన్సిల్స్ అన్నా... ఈ రెండూ ఒకటేనని చాలామంది పొరబడుతుంటారుగానీ... ఈ రెండూ వేర్వేరు. నోరు బాగా తెరచినప్పుడు టాన్సిల్స్ కనిపిస్తాయిగానీ... అడినాయిడ్స్ కనిపించవు. నిజానికి అడినాయిడ్స్ అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి పిల్లలను కాపాడుతుంటాయి. అయితే వాటికే ఇన్ఫెక్షన్స్ సోకడం కారణంగా అడినాయిడ్స్ వాచినప్పుడు వచ్చే సమస్య గురించి తెలుసుకుందాం. అడినాయిడ్స్లో కొన్ని యాంటీబాడీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు దేహంలోకి ప్రవేశించగానే... వాటిని శత్రుకణాలుగా గుర్తించి, వాటితో ΄ోరాడుతాయి. ఇలా ΄ోరాటంలో వాటిని తుదముట్టించడం ద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి సహజంగానే తక్కువగా ఉండటం వల్ల వాళ్ల పసి దేహాలను కాపాడటానికి ప్రకృతి అడినాయిడ్స్ అనే ఏర్పాటు చేసింది. అయితే పిల్లలు పెరుగుతున్న కొద్దీ... వాళ్ల వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుండటం వల్ల కొంతకాలానికి ఇవి క్రమంగా సైజు తగ్గుతూపోతాయి. ఐదేళ్ల వయసులో దాదాపుగా ఇవి పూర్తిగా కృశించి΄ోతాయి. వారికి యుక్తవయసు వచ్చేనాటికి అవి పూర్తిగా మటుమాయమవుతాయి. అడినాయిడ్స్లో ఇన్ఫెక్షన్లతో వాపు ఇలా... కొందరు చిన్నారులపైకి బ్యాక్టీరియా లేదా వైరస్ దాడి చేసినప్పుడు అడినాయిడ్స్ కణజాలంలో వాపు వచ్చే అవకాశాలుంటాయి. అలా జరగడం వల్ల ఇక అవి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వాటి నుంచి దేహాన్ని కాపాడలేవు. దేహంపై బ్యాక్టీరియా, వైరస్ దాడి పెరిగిన కొద్దీ వాటిలో వాపు కూడా పెరుగుతూపోతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు పక్కనుండే టాన్సిల్స్కు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి, వాటిల్లో కూడా వాపు రావచ్చు. ఇలా వాపు వచ్చిన కొద్దీ పిల్లలు గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. దాంతో చిన్నారుల్లో కొన్ని సమస్యలు రావచ్చు. అవి... ముక్కురంధ్రాలు మూసుకు΄ోయి గాలి పీల్చడం ఇబ్బందిగా మారడంతో నోటితో గాలి పీల్చడం. ∙నిద్ర సమయంలో పిల్లలో గురక రావడం. గొంతునొప్పిగా ఉండి, మింగడం కష్టం కావడం. ∙కొన్నిసార్లు మెడ్ర ప్రాంతంలోని గ్రంథులకూ వాపు రావడం. కొంతమందిలో వినికిడి సమస్యలూ లేదా దంత సమస్యలు కనిపించడం. ఊపిరి సరిగా అందక నిద్రాభంగమై లేచి ఏడ్వటం.చికిత్స...అడినాయిడ్స్లో వాపు వచ్చిన ప్లిలల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం కారణంగా వారికి తరచూ జ్వరాలు వస్తుంటాయి. అడినాయిడ్స్లో వాపు ఉన్నప్పుడు తొలుత యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. త్వరగా చికిత్స పొందని పిల్లల్లో వ్యాధి తీవ్రత పెరిగి మందులకు నయమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు అలాంటప్పుడు అడినాయిడెక్టమీ అనే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా డాక్టర్లు వాటిని తొలగించాల్సి వస్తుంది. డా. ఈసీ వినయ కుమార్, ఈఎన్టీ నిపుణుల (చదవండి: పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?) -
పెద్దవాళ్లు జబ్బుపడితే ఎవరు చూడాలి..?
‘శతమానం భవతి’ అన్నారు మన పెద్దలు. నూరేళ్లు జీవించి పిల్ల పాపల ఆనందాలు చూసి వీడ్కోలు తీసుకోవాలని భారతీయులు కోరుకుంటారు. ఒకప్పుడు ఆయుఃప్రమాణం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానాల వల్ల ఆయుఃప్రమాణం పెరిగింది. అయితే వైద్య విధానం ఎంత ఆధునికంగా ఉన్నా అది పూర్తిగా జబ్బు నయం చేయలేనివే ఎక్కువ. యధాతథ స్థితిని కొనసాగించి ఆయుష్షును పొడిగించగలుగుతున్నాయి. ఇది ఒక రకంగా వరం. మరో రకంగా ఇబ్బందిగా మారుతోంది. పెద్దవాళ్లు జబ్బుపడి ఎక్కువ రోజులు సహాయం పొందే స్థితికి వస్తే ఇంటిలో సమస్యలు మొదలవుతున్నాయి. మరి వీటిని ఎలా నివారించాలి?మన దేశంలో 70 ఏళ్ల వయసు దాటాక స్త్రీల కంటే పురుషులే ఎక్కువ జబ్బుల గురించి ఆందోళన చెందుతున్నారట. దానికి కారణం మంచాన పడితే ఎవరు చూడాలి అనేది ఒకటైతే పూర్తి కదలికలు నియంత్రణలోకి వెళితే జీవితం చాలా కష్టంగా మారుతుందనే భయం ఒకటి. స్త్రీలకు సేవ చేసే స్త్రీలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటే పురుషులకు సేవ చేసేవారు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 70లు 80లకు చేరుకున్న తల్లిదండ్రులు అనారోగ్యాల బారిన పడితే బాధ్యత ఎవరు తీసుకోవాలనే విషయం మీద చాలా ఇళ్లల్లో ఒక అనిశ్చితి నెలకొంటోంది.స్పష్టత వచ్చే వీలు ఉందా?తల్లిదండ్రులు జబ్బుపడితే వారి బాగోగులు చూసే స్థితిలో ఇప్పుడు సంతానం ఉండటం లేదు. దానికి కారణం బిజీ బతుకుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సం΄ాదించాల్సి వస్తోంది. దానికితోడు పిల్లల కెరీర్లకు వారి అవసరాలకు సమయం చాలదు. మధ్య తరగతి అయినా ఎగువ మధ్యతరగతి అయినా త్రీ బెడ్ నివాసాలు ఉండి జబ్బుపడ్డ తల్లిదండ్రులకు ఒక గది ఇచ్చే వీలు 90 శాతం ఇళ్లల్లో ఉండటం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగానే భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని అంటీముట్టనట్టు తయారవుతున్న సంతానం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇది తల్లిదండ్రులను మరింత బాధపెడుతోంది. ఇప్పుడే ఇలా వీరుంటే రేపెలా అనే చింత పట్టుకుంటోంది.కూర్చుని మాట్లాడుకోవాలిఅంతా బాగున్నప్పుడే తల్లిదండ్రులు, పిల్లలు కూచుని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రుల అనారోగ్యం కోసం వారు సొంతంగా దాచుకున్న నిధిని, పిల్లలు తమ వంతుగా ఇవ్వగలిగిన నిధిని కలిపి ఒకచోట ఉంచి దాని గురించి సమాచారం ఇచ్చుకోవాలి. చూసే వీలు లేకపోతే ఏజెన్సీల సహాయం ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఉండాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ హాస్పిటల్లో చేర్చాలో ముందే నిర్ణయించుకొని ఆ హాస్పిటల్లో తరచూ చెకప్లు చేయిస్తూ ఉంటే సమయానికి కొత్త పేషంట్గా మారే పరిస్థితి ఉండదు. బడ్జెట్కు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఏయే అనారోగ్యాలకు ప్రభుత్వ/చారిటీ ఆస్పత్రులు అతి తక్కువ చార్జీలకు వైద్యసేవలు ఇవ్వగలవో తెలుసుకుని అందరూ ఆ సమాచారం పంచుకోవడం మంచిది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాన్నే వెచ్చించి ఉంటారు కాబట్టి వారికి కచ్చితంగా సమయం ఇవ్వగలమని, బాధ్యతను పంచుకోగలమనే నమ్మకం వారిలో కలిగించాలి. సాధారణంగా ఎవరో ఒకరి నెత్తి మీద ఈ బాధ్యతను తోసే ధోరణి కొందరిలో ఉంటుంది. అది సమస్యను తీవ్రంగా పెంచుతుంది.పంతాలు విడవాలితల్లిదండ్రులు పెద్దవయసు వచ్చే వేళకు జీవితంలో వారి వల్ల లేదా సంతానం వల్ల ఎన్నో తప్పొప్పులు జరిగి పంతాలు పట్టింపులు ఏర్పడి ఉండవచ్చు. కాని తల్లిదండ్రులు అనారోగ్య స్థితికి చేరుకునేవేళకు అవి సమసే వాతావరణం కల్పించుకోవాలి. క్షమ చాలా సమస్యలు దూరం చేస్తుంది. మనుషులు దూరమయ్యాక చేయగలిగింది ఏమీ లేదు. అందుకే పెద్దవారు వారి చివరిదశను ప్రశాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఇందుకు సామరస్య వాతావరణంలో ఎంత మాట్లాడుకుంటే అంత స్పష్టత వస్తుంది. వాట్సప్లు, ఫోన్ కాల్స్ మాని ఎదురుబొదురు కూచుంటే తప్ప ఇలాంటి సందర్భాలలో పరిష్కారాలు దొరకవు. అసలే జబ్బుపడ్డ పెద్దవారికి ఆత్మీయమైన ఇంటి వాతావరణానికి దగ్గర చేయడం అతిఒక్క కుటుంబ సభ్యుని బాధ్యత.(చదవండి: కాన్పులో రక్తస్రావం కావడంతో ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?) -
వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి?
నడివయసుకు చేరుకుంటున్న సమయంలో వయసుతో వచ్చే మార్పుల్లో, శరీరంలోని కండరాల్లో దారుఢ్యం సడలి, కొలతలు మారిపోవడం ప్రధాన సమస్యగా మారుతుంటుంది. శరీర నిర్మాణంలోనే కాదు, ముఖంలోనూ ఆ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. జిమ్కి వెళ్తే శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవచ్చు. మరి వడలిపోయిన ముఖాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలి? ఇదిగో చిత్రంలోని ఈ ఫేస్ జిమ్ టూల్, ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. మునివేళ్లతో పట్టుకుని వాడుకోగలిగే ఈ పరికరంతో శిల్పాన్ని మలచుకున్నట్లుగా ఎవరికి వారే తమ ముఖాన్ని చక్కగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ పరికరంతో మర్దన చేసుకుంటే ముఖ కండరాల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, ముఖం పునర్యవ్వనం పొందుతుంది. సురక్షితమైన నాణ్యమైన మెటీరియల్తో రూపొందిన ఈ గాడ్జెట్ ఎలాంటి చర్మానికైనా హాని కలిగించదు. పైగా పట్టుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఇది రూపొందింది. దీనికి ఒకవైపు ఐదు దువ్వెన పళ్లులాంటి ఊచలు, వాటి చివర బాల్స్ ఉండగా.. మరోవైపు మెలితిరిగిన మృదువైన కొన, దానికో గుండ్రటి బాల్ అటాచ్ అయ్యి ఉంటుంది. మీ చర్మానికి సరిపడే సీరమ్ లేదా క్రీమ్ అప్లై చేసుకుని ఈ టూల్తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా, చర్మానికి ఆనించి, కింది వైపు నుంచి పైకి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.(చదవండి: 'ఫైట్ ఎగైనెస్ట్ ఒబెసిటీ'కి ప్రధాని మోదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
ప్రసవ సమయంలో నొప్పులు తట్టుకోవాలంటే ఏం చేయాలి..?
నాకు ఇప్పుడు తొమ్మిదో నెల. నొప్పులు తట్టుకోలేను అనిపిస్తోంది. ఎపిడ్యూరల్ లాంటి ఇంజెక్షన్స్ అంటే భయం. నొప్పులు తట్టుకోవడానికి వేరే మార్గాలు ఉంటే చెప్పండి?– కావేరి, నెల్లూరు. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఈ రోజుల్లో చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొద్దిగానే ఉంటాయి. కాని, అది వద్దనుకే వాళ్లకి కొన్ని ఆసుపత్రుల్లో కాంప్లమెంటరీ థెరపీస్ లేదా ఎండోక్సాన్ వంటి పెయిన్ రిలీఫ్ ఆప్షన్స్ని సూచిస్తున్నారు. కాంప్లమెంటరీ థెరపీస్ను సంబంధిత ఎక్స్పర్ట్ థెరపిస్ట్లతోనే తీసుకోవాలి. వాటిలో హిప్నోథెరపీ, అరోమాథెరపీ, మసాజ్, రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్ లాంటివి ఉంటాయి. హిప్నోగ్రఫీలో ప్రశాంతమైన ఒత్తిడిలేని ప్రసవం జరిగేటట్టు హిప్నో క్లాసులలో నేర్పిస్తారు. దీంతో ఆందోళన తగ్గి, బర్తింగ్ మజిల్స్ సరిగ్గా పనిచేస్తాయి. అరోమాథెరపీలో శారీరక, భావోద్వేగ ఆరోగ్యానికి అవసరమైన నూనెలు ఉపయోగించడం వలన భయం, ఆందోళన తగ్గుతుంది. కాని, దీనితో అంత పెద్దగా లాభం ఉండదని పరిశోధనల్లో తేలింది. రిఫ్లెక్సాలజీ లేదా మసాజ్లో మీ శరీరంలోని కొన్ని ప్రాంతాలు, చేతులు, కాళ్లను మసాజ్ చేయటం వలన లేబర్ పెయిన్ తగ్గుతుంది. వివిధ పరిశోధనల్లో ఇది కూడా పూర్తి ఉపశమనం ఇవ్వదని తేల్చారు. ఇక ఆక్యుపంక్చర్లో సన్నని స్టెరైల్ సూదులతో శరీరంలోని కొన్ని నిర్దిష్టమైన పాయింట్స్ని ప్రెస్ చేస్తారు. దీంతో నొప్పి తగ్గుతుంది. ఈ సూదులను ఆ నిర్దిష్టమైన స్పాట్స్లో ఇరవై నిమిషాల నుంచి మొత్తం కాన్పు జరిగే వరకు ఉంచుకోవచ్చు. ఇది థెరపిస్ట్ మీతోనే ఉండి, చేయాల్సిన చికిత్స. ఎంటోనాక్స్ అనే గ్యాస్నే ఒక ఆక్సిజన్ పంపు లాంటి దాని ద్వారా నైట్రస్ ఆక్సైడ్, ఆక్సిజన్ మిక్స్చర్ని పీల్చుకునే పద్ధతి. దీనితో చాలా వరకు నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇది రోగి సొంతంగానే ఉపయోగించుకోవచ్చు. అంటే నొప్పి మొదలైనప్పుడు ఒక పఫ్ పీల్చుకుంటే ఆ గ్యాస్ ద్వారా నొప్పి ఒక నిమిషం వరకు తగ్గుతుంది. మళ్లీ నొప్పి వచ్చినప్పుడు మళ్లీ ఉపయోగించాలి. కొంచెం మగతగా ఉంటుంది. యాభై శాతం వరకు నొప్పి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఈ మార్గాల ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా లేబర్ పెయిన్స్ను తగ్గించుకునే అవకాశం ఉంది. వీటిల్లో మీకు అందుబాటులో ఏది ఉంది అని ఆసుపత్రుల్లో పరిశీలించి తీసుకోవాలి. డా‘‘ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ప్రపంచ వాతావరణ సదస్సు ఎలా ఏర్పాటైందంటే..ఇప్పటికీ 75 ఏళ్లా..?) -
ప్రపంచ వాతావరణ సంస్థ ఎలా ఏర్పాటైందంటే..! ఇప్పటికీ 75 ఏళ్లా..?
మనిషి జాతకాన్ని పంచాంగాలు చెబుతాయి. పంచాంగాలు చెప్పే జాతకాలను సైతం మార్చగల పంచభూతాల ‘మూడ్’.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (ప్రవాస) చెబుతుంది! పంచాంగమైనా కాస్తా అటూఇటూ అవొచ్చు. లేదా, అసలెటూ కాకపోవచ్చు. పంచభూతాలు ఎలా ఉండబోతున్నాయో ‘ప్రవాస’ చెబితే మాత్రం... దాదాపుగా చెప్పిందే జరుగుతుంది. ‘మబ్బు పట్టి.. గాలి కొట్టి..’ఆకాశం మేఘావృతమై ఉంటుంది అంటే ‘ప్రవాస’ చెబితే ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుంది! భూమి భగభగమంటుంది అంటే భగభగమన్నట్లే ఉంటుంది. చిరుజల్లులు, కుంభవృష్టి, ఈదురుగాలులు, సముద్రపు ఆటు పోట్లు, సముద్రం లోపలి సుడిగుండాలు, సముద్ర గర్భంలో బద్ధలయ్యే అగ్ని పర్వతాలు, వరదలు, విపత్తులు, ప్రకృతి విలయాలు అన్నిటినీ ‘ప్రవాస’ సరిగ్గా అంచనా వేస్తుంది. ‘‘ఎండలు విపరీతంగా ఉండబోతున్నాయి ఇంట్లోంచి బయటికి రావద్దు..’’ అని జాగ్రత్త చెబుతుంది. చలి తీవ్రత, చలి గాలులు పెరిగే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తుంది. ‘‘వాయుగుండం పడబోతోంది సముద్రంలోకి వెళ్లొద్దు’’ అని మత్స్యకారులను హెచ్చరిస్తుంది. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వాలకు ముందే సమాచారం అందిస్తుంది. ఇలా అనుక్షణం ప్రకృతి ధోరణులను గమనిస్తూ, ప్రపంచ దేశాల వాతావరణ శాఖలకు ఎప్పటికప్పుడు ఆ సమాచారం పంపుతూ, మానవాళి మనుగడలో అంత్యంత ప్రాముఖ్యం కలిగి ఉన్న ‘ప్రవాస’కు నేటికి 75 ఏళ్లంటే చరిత్రలో ఒక విశేషమే కదా. ‘ప్రవాస’ స్వయం ప్రతిపత్తి కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఐక్యరాజ్య సమితి 1950 మార్చి 23న ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అప్పట్నుంచీ ఏటా ఈ రోజును ‘వరల్డ్ మీటియరలాజికల్ డే’ (ప్రపంచ వాతావరణ దినోత్సవం)గా జరుపుకుంటున్నాం. సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది.‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం’మనిషి పంచభూతాలను ‘డిస్టర్బ్’ చేయకుండా ఉంటే ‘ప్రవాస’కు గానీ, ఇండియన్ మీటియరలాజికల్ వంటి ఇతర దేశాల వాతావరణ శాఖలకు గానీ ఇంతగా ‘వాతావరణ జోస్యం’ చెప్పే అవసరం లేకపోయేది. కవులు కూడా ప్రకృతిపై కాస్త కనికరం చూపండి అని మనిషికి ఏనాటి నుండో చెబుతూనే వస్తున్నారు. ‘‘మేఘాలు లేని ఆకాశం.. పూలగడ్డి లేని మైదానం.. ’’ అంటాడు కవి. మేఘాలు లేకుండా ఆకాశం ఎందుకు ‘ఎండిపోతుంది’? మనిషి వల్లే. ఎండల్ని మండిచేస్తున్నాం కదా! ‘‘ప్రకృతిని ప్రేమించండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి’’ అంటాడు కవి. ఎందుకు మనం అసలు ప్రకృతి వైపే చూడము? ప్లాస్టిక్ సౌఖ్యాల్లో మునిగిపోయాం కదా.. అందుకు! ‘‘చెట్లను చూడండి. పక్షులను చూడండి. నక్షత్రాలను చూడండి’’ అంటాడు కవి. చూస్తూనే ఉన్నాం. కానీ కూలిపోతున్న చెట్లను, అంతరించిపోతున్న పక్షులను, ధూళి కొట్టుకుని పోయిన నక్షత్రాలను!! ఎప్పటికి మనం మారుతాం? వాతావరణం పూర్తిగా మారిపోయి, మనిషి ఉనికే లేకుండా పోయాక, ఈ భూగోళపు పునఃప్రారంభంలోనా?‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరూ..’’ అని రాశారు కొసరాజు రాఘవయ్యగారు. నిజమే. ఊహించలేం. కానీ మనమింకా మహర్జాతకులంగానే మిగిలి ఉన్నాం అంటే వాతావరణ సంస్థలు, శాఖల వల్లనే. ఏం జరగబోతోందో అవి చక్కగా అంచనా వేసి మనల్ని ఆపదల నుండి తప్పిస్తున్నాయి. మన వల్ల వాతావరణానికి ఆపద రాకుండా మనమూ బాధ్యతగా ఉండాలి. ‘ప్రవాస’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సెలెస్ట్ సౌలో ఇటీవలే జనవరి 15న ‘భారత వాతావరణ శాఖ’ (ఐ.ఎం.డి) 150 వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఇండియా వచ్చి వెళ్లారు! ఆ సందర్భంగా వాతావరణ మార్పులపై భారత్ సహసోపేతమైన చర్యలు తీసుకుంటోందని కూడా ఆమె ప్రశంసించారు. భారతదేశంలో 1875లో ఐ.ఎం.డి. ప్రారంభం అయింది. అంతకన్నా ముందు, ప్రపంచంలోనే తొలి ఐ.ఎం.డి. 1854లో బ్రిటన్లో ఏర్పాటైంది. అంటే ఇప్పటికి సుమారు 170 ఏళ్ల క్రితం. భారత్లో ఐ.ఎం.డి.ని నెలకొల్పింది కూడా బ్రిటిష్ వారే. 1864 కలకత్తా సైక్లోన్లో 80 వేల మంది ప్రాణాలు కోల్పోవటంతో, భవిష్యత్తులో మళ్లీ అంతగా ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అప్పటి దేశ రాజధాని కలకత్తా ప్రధాన కార్యాలయంగా ఐ.ఎం.డి.ని నెలకొల్పారు. తర్వాత సిమ్లాకు, అక్కడి నుంచి పుణె, చివరికి 1944లో ఢిల్లీ ఐ.ఎం.డి.కి ప్రధాన కార్యాలయం అయింది. బ్రిటన్లోను, ఇండియాలోనూ ఐ.ఎం.డి.లు ఏర్పాటు చేయకముందు వరకు మేఘాల పోకడలు, జంతువుల ప్రవర్తనలు, రుతు చక్రాల ఆధారంగా రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతున్నదో అంచనా వేసేవారు. అలాగే ఉష్ణోగ్రత, పీడనం, తేమ, గాలి వేగాలను కొలిచే సాధనాలు కొన్ని ఉండేవి. వాతావరణ హెచ్చరిక కేంద్రాల స్థాపన తర్వాత తొలిరోజుల్లో వర్షపాత సమాచారాన్ని పోస్ట్ కార్డ్లపైన, టెలిగ్రాఫిక్ సిస్టమ్ల ద్వారా అందించేవారు. తర్వాత రాడార్లు, ఇప్పుడు జీపిఎస్.. వాతావరణ సూచనల సమాచారాన్ని చేరవేయటంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. (చదవండి: ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..) -
‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’కి ప్రధాని మెదీ పిలుపు..! ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
మన దేశానికి నానా సమస్యల శిరోభారాలు ఉన్నాయి. జనాల్లో పెరుగుతున్న దేహభారం దేశానికి అదనపు శిరోభారంగా మారింది. ఐదేళ్ల పిల్లలు మొదలుకొని ముప్పయ్యేళ్ల లోపు యువత వరకు స్థూలకాయులుగా తయారవుతున్నారు. చిన్న వయసు వారిలో పెరుగుతున్న దేహపరిమాణం ఇటీవలి కాలంలో జాతీయ సమస్యగా పరిణమించింది. ఈ సమస్యను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ‘స్థూలకాయంపై పోరాటం’ ప్రకటించాల్సిన పరిస్థితి వాటిల్లింది. స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రంగాలకు చెందిన పదిమంది ప్రముఖులను ప్రచారకర్తలుగా ఎంపిక చేశారు.అధిక బరువు స్థూలకాయంశరీరం ఉండవలసిన దానికంటే అధిక బరువు లేదా స్థూలకాయం ఉన్నట్లు తెలుసుకోవడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ను (బీఎంఐ) ప్రమాణంగా పరిగణిస్తారు. ఎత్తు, బరువుల నిష్పత్తి ఆధారంగా దీనిని లెక్కిస్తారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే, తక్కువ బరువుతో ఉన్నట్లు లెక్క. 18.5–25 ఉంటే ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు, 25–29.9 ఉన్నట్లయితే, అధిక బరువుతో ఉన్నట్లు లెక్క. బీఎంఐ 30–34.9 ఉంటే, స్థూలకాయంతో ఉన్నట్లు, బీఎంఐ 35 కంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పరిగణిస్తారు. స్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.అధిక బరువుకు, స్థూలకాయానికి కారణాలు దాదాపు ఒకటే! ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే, తొలి దశలోనే జాగ్రత్తలు ప్రారంభించినట్లయితే, స్థూలకాయాన్ని నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు:శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంఅనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలం తగినంత నిద్ర లేకపోవడంమితిమీరిన ఒత్తిడఇతరేతర ఆరోగ్య సమస్యలుజన్యు కారణాలుకొన్ని ఔషధాల దుష్ప్రభావంచికిత్స పద్ధతులుఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంఆహారంలో అనవసర కేలరీలను తగ్గించుకోవడంఅధిక బరువు ఉన్నట్లయితే, వెంటనే వ్యాయామం ప్రారంభించడంస్థూలకాయం అదుపు తప్పితే, శస్త్రచికిత్స చేయించుకోవడంస్థూలకాయం ఒకప్పుడు నడివయసులో ఉన్నవారిలో కనిపించేది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా స్థూలకాయం బారినపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామానికి అవకాశంలేని చదువులు, ఉద్యోగాల్లో మితిమీరుతున్న ఒత్తిడి వంటివి చిన్న వయసు వారిలో స్థూలకాయానికి కారణంగా మారుతున్నాయి. స్థూలకాయం నానా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. స్థూలకాయం మితిమీరినప్పుడు ప్రాణాంతకంగా కూడా మారుతోంది. దేశ జనాభాలో ప్రస్తుతం దాదాపు 5 శాతం మంది ప్రాణాంతక స్థాయిలోని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుత శతాబ్ది ప్రారంభం నుంచి మన దేశంలో స్థూలకాయం సమస్య తీవ్రత ఎక్కువవుతూ వస్తోంది. ‘ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా–2023–24’ నివేదిక ప్రకారం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే సగానికి పైగా జనాభా వ్యాధులకు లోనవుతున్నారు. దేశ ఆరోగ్యరంగంపై ఏర్పడే ఆర్థిక భారంలో 56.4 శాతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లనే వాటిల్లుతోంది. ఒకప్పుడు మన దేశంలో స్థూలకాయులు పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవారు. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ స్థూలకాయుల సంఖ్య పెరుగుతోంది. స్థూలకాయం సమస్య ఉన్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్లోని 70 శాతం పట్టణ జనాభా అధిక బరువుతోను, స్థూలకాయంతోను బాధపడుతున్నారు. ‘లాన్సెట్’ అధ్యయనం ప్రకారం దేశంలోని 3 కోట్ల మంది పెద్దలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. మధుమేహంతో బాధపడేవారిలో 6.2 కోట్ల మందిలో స్థూలకాయం లక్షణాలైన అధిక బరువు, శరీరంలో అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. స్థూలకాయం సమస్య దేశంలో నానాటికీ పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోందని మొహాలీకి చెందిన బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అమిత్ గర్గ్ చెబుతున్నారు.మన దేశంలో స్థూలకాయం తీవ్రతమన దేశంలో గడచిన పదేళ్లలో స్థూలకాయుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం మన దేశంలో స్థూలకాయుల సంఖ్య 10 కోట్లకు పైబడింది. మహిళల్లో 40 శాతం, పురుషుల్లో 12 శాతం మంది పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల స్థూలకాయులుగా మారారు. సాధారణ స్థూలకాయం కంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల కలిగే స్థూలకాయం మరింత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 5–14 ఏళ్ల లోపు చిన్నారుల్లో 1.44 కోట్ల మంది స్థూలకాయులుగా ఉన్నారు. ‘కోవిడ్–19’ తర్వాత దేశంలో స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చిన్నారుల్లో స్థూలకాయం దేశ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. విద్యా విధానంలో మార్పులు; సామాజిక, ఆర్థిక కారణాలు; టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడటం వల్ల నిద్ర సమయం తగ్గడం; ఇదివరకటి పిల్లలతో పోల్చుకుంటే ఇప్పటి పిల్లల్లో వ్యాయామం లోపించడం; చాలా పాఠశాలలకు అనుబంధంగా పిల్లలు ఆడుకోవడానికి తగిన మైదానాలు లేకపోవడం; చదువుల్లో ఒత్తిడి పెరగడం; అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు; పాఠశాలల పరిసరాల్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఐస్క్రీమ్ పార్లర్లు వంటివి ఉండటం తదితర కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దోహదపడుతున్నాయి. స్థూలకాయం, దాని వల్ల కలిగే ఇతర ఆరోగ్య సమస్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ.3.11 లక్షల కోట్ల మేరకు భారం పడుతోంది.పొట్టు చుట్టూ కొవ్వు ప్రమాదకరంపొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్థూలకాయాన్ని ‘సెంట్రల్ ఒబేసిటీ’ అంటారు. ఒళ్లంతా విస్తరించి ఉండే స్థూలకాయం కంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువ ప్రమాదకరం. పొట్ట కండరాల లోపలి వైపు మాత్రమే కాకుండా జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ‘సెంట్రల్ ఒబేసిటీ’ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హై బ్లడ్ప్రెషర్, రక్తంలో కొవ్వు పెరగడం వల్ల హైపర్ లిపిడీమియా వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణ స్థూలకాయులతో పోల్చుకుంటే, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొవ్వులను తగ్గించుకోవడం, తగిన వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని జయించవచ్చు.ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే..అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, టీవీలు, స్మార్ట్ఫోన్లకు అలవాటు పడి నిద్రకు దూరం కావడం వంటి కారణాలు పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తున్నాయి. ఆహారపు అలవాట్లను ఆరోగ్యంగా మార్చుకుంటేనే పిల్లల్లో స్థూలకాయాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో చాలామంది వేళకు తగిన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. ఉదయం ఫలహారం చేసి బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్లీ ఎక్కువ మోతాదులో తింటున్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే రాత్రి భోజనం చేస్తున్నారు. ఎక్కువగా జంక్ఫుడ్కు అలవాటుపడుతున్నారు. పిల్లలు వేళకు సరైన పోషకాహారం తీసుకునేలా చూడటంతో పాటు వ్యాయామం కలిగించే ఆటలు ఆడేలా తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే, స్థూలకాయం బారిన, దానివల్ల కలిగే ఇతర వ్యాధుల బారిన పడకుండా వారిని కాపాడుకోవచ్చు. పిల్లల్లో స్థూలకాయం లక్షణాలుకొందరు పిల్లలు మిగిలిన పిల్లల కంటే కాస్త ఎక్కువ బరువు ఉండవచ్చు. అంతమాత్రాన వారిని స్థూలకాయులుగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. ఎముకల విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల కొందరు పిల్లలు కాస్త ఎక్కువ బరువుతో ఉంటారని అంటున్నారు. బీఎంఐ పద్ధతి ద్వారా పిల్లలు అధిక బరువుతో ఉన్నారా, స్థూలకాయులుగా ఉన్నారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. స్థూలకాయులైన పిల్లల్లో కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు కనిపించవచ్చని, వాటిని గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు.ఇవీ లక్షణాలుఒక పట్టాన తగ్గని తలనొప్పిఅధిక రక్తపోటువిపరీతమైన దాహంతరచు మూత్రవిసర్జన చేయడంఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు నిద్రలో శ్వాసక్రియ కష్టంగా మారడంవయసుకు తగిన ఎదుగుదల లేకపోవడంపిల్లల్లో స్థూలకాయాన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు మరికొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. స్థూలకాయులైన పిల్లలు టైప్–2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, శ్వాస సమస్యలు, శరీరంలోని జీవక్రియ మందగించడం, లివర్ జబ్బులు, హార్మోన్ల అసమతుల్యతలు వంటి సమస్యలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయులైన పిల్లలకు బడిలో మిగిలిన పిల్లల నుంచి వెక్కిరింతలు ఎదురవుతుంటాయి. వాటి కారణంగా వారు ఆందోళన, మానసిక కుంగుబాటు, చురుకుదనం లోపించడం, తిండి తినడంలో నియంత్రణ కోల్పోవడం వంటి మానసిక సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. (చదవండి: ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..)స్థూలకాయం వల్ల పిల్లల్లో అనర్థాలుపిల్లల్లో స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లల్లో స్థూలకాయం కలుగుతుంది. దీనివల్ల టైప్–2 డయాబెటిస్, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. పిల్లలు బరువు పెరిగే కొద్ది వారి ఎముకలపై భారం, ఒత్తిడి పెరిగి, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు తలెత్తుతాయి. స్థూలకాయం వల్ల పిల్లలు ఆత్మన్యూనతకు లోనై రకరకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పరీక్షల్లో రాణించలేకపోతారు. స్థూలకాయం వల్ల ఆడపిల్లల్లో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని త్వరగా రుతుక్రమం మొదలవడం వంటి సమస్యలు వస్తాయి.డాక్టర్ శివనారాయణ రెడ్డి, పిల్లల వైద్యనిపుణుడుస్థూలకాయంపై పోరాటందేశంలో స్థూలకాయం సమస్య ఆందోళనకరమైన స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ పేరుతో స్థూలకాయంపై పోరాటాన్ని ప్రకటించింది. దీని కోసం ‘స్వస్థ భారత్, సుదృఢ భారత్: స్థూలకాయంపై ఉమ్మడి పోరాటం’ అనే థీమ్ను ఎంచుకుంది. స్థూలకాయంపై పోరాటం కార్యక్రమానికి ప్రచారకర్తలుగా ప్రధాని నరేంద్ర మోదీ పదిమంది ప్రముఖులను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక చేసిన వారిలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, భోజ్పురి నటుడు దినేశ్లాల్ యాదవ్, ఒలింపిక్స్ విజేత, షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ సాయిఖోమ్ మీరాబాయి చానూ, మలయాళ నటుడు, ఎంపీ మోహన్లాల్, తమిళ నటుడు మాధవన్, గాయని శ్రేయా ఘోషాల్, రచయిత్రి, ఎంపీ సుధా మూర్తి, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. వీరు ఒక్కొక్కరు తమకు నచ్చిన మరికొందరు సెలబ్రిటీలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయవచ్చు. ‘ఫైట్ ఎగైనెస్ట్ ఒబేసిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతి ఇంట్లోనూ వంటనూనె వినియోగాన్ని కనీసం పదిశాతం తగ్గించుకున్నట్లయితే, దీని వల్ల ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. అధిక బరువు, స్థూలకాయం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, స్థూలకాయంపై పోరాటంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. (చదవండి: మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..) -
మానసిక అనారోగ్యం ఇంత భయానకమైనదా..? పాపం ఆ వ్యక్తి..
కొన్ని రకాల మానసిక రుగ్మతలు చాలా భయానకంగా ఉంటాయి. ఓ పట్టాన వాటికి ఉపశమనం దొరకదు. మనిషి సంకల్పబలానికే పరీక్ష పెట్టేలా ఉంటాయి ఆ వ్యాధులు. కొందరు జయిస్తారు. మరికొందరు ఆ వ్యాధి పెట్టే బాధకు తలవొగ్గక తప్పని పరిస్థితి ఎదురవ్వుతుంది. అలాంటి దుస్థితిలోనే ఉన్నాడు ఈ 28 ఏళ్ల వ్యక్తి. ఇన్స్టాగ్రామ్ వేదిక తన వ్యథను పంచుకున్నాడు.బ్రిటన్ సంతతి ఘనా కళాకారుడు జోసెఫ్ అవువా-డార్కో మానసిక అనారోగ్యంతో జీవించడం కంటే ముగించేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చేశాడు. అతడు మెదడుకి సంబంధించిన బైపోలార్ డిజార్డర్తో బాధపతున్నాడు. చట్టబద్ధంగా జీవితాన్ని ముగించేసేలా నెదర్లాండ్ దేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు ఇన్స్టా వేదికగా తెలిపాడు. అనాయస మరణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. అనుమతి రావడానికి సుమారు నాలుగేళ్లు పడుతుందని అన్నాడు. ఎలాగో ఇంతటి జఠిలమైన నిర్ణయం తీసుకున్నాను కదా అని.. 'ది లాస్ట్ సప్పర్ ప్రాజెక్ట్'ను ప్రారంభించాడు. ఏంటంటే ఇది..తన చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశ్యంతో అపరిచితులతో కనెక్ట్ అయ్యి వారితో విందులు ఆస్వాదించాలనేది అతడి కోరిక. ఆ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రపంచవ్యాప్త పర్యటనలకు పయనమయ్యాడు కూడా. ఇప్పటి వరకు అతడు పారిస్, మిలన్, బ్రస్సెల్స్, బెర్లిన్లలో 57 విందులను ఆస్వాదించాడు. వచ్చే ఏడాదికి 120 విందులతో కూడిన టూర్స్కి ప్లాన్ చేశాడు. దీనివల్ల తాను ఇతరులతో కనెక్ట్ అవ్వడమేగాక తనకు ఓ రుగ్మత ఉందనే విషయం మర్చిపోయి ఆనందంగా గడపగలుగుతున్నాడట. మనల్ని ప్రేమించేవారు సంతోషంగా ఉండేలా వైద్య సహాయంతో పొందే ఈ అనాయస మరణం అహింసాయుతమైనదేనని చెబుతున్నాడు జోసఫ్. చివరగా తన బైపోలార్ సమస్య ఎంత తీవ్రతరమైనదో వివరించాడు. పొద్దుపొద్దున్నే లేవడమే ఓ నరకంలా ఉంటుందని, ప్రతి ఉదయం ఓ నరకమే అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నాలుగేళ్లకు పైగా బాగా ఆలోచించే ఇక ఈ నిర్ణయం తీసుకున్నాని వివరించాడు.. జోసఫ్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అతడి వ్యథను విన్న నెటిజన్లు అతని నిర్ణయాన్ని కొందరు గౌరవించగా, మరికొందరు నిర్ణయం మార్చుకో బ్రదర్..తమతో విందు షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రకారం, బైపోలార్ డిజార్డర్ అనేది మెదడుకి సంబంధించిన మానిక్-డిప్రెసివ్ అనారోగ్యం. ఇది మానసిక స్థితి, శక్తి స్థాయిలలో తీవ్ర మార్పులకు కారణమవుతుంది. ఏటా చాలామంది ఈ రుగ్మత బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. View this post on Instagram A post shared by Joseph “Nana Kwame” Awuah-Darko 🇬🇭 (@okuntakinte) (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..! వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
అన్ని దేశాల్లో కరెన్సీ విలువ ఒకటే ఉండదు ఎందుకు?
ప్రతి దేశానికీ ఆయా దేశపు సంస్కృతి చరిత్ర, మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు రాజకీయ విధానం ఉంటాయి. దేశాలు వేర్వేరు అయినా మానవులందరికీ ఆహారం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాల తోపాటు వాహనాలు, నగలు, కంప్యూటర్లు, కాగితం, పుస్తకాలు, భవనాలు, లోహ పరికరాలు, మందులు, చెప్పులు, మోటార్లు, పెన్నులు, రంగులు, కళ్లద్దాలు, ఎరువులు, విమానాలు మొదలైన వేలాది వస్తువులు, పరికరాలు సాధారణం. అయితే అన్ని వస్తువులు, అన్ని దేశాల్లో, అన్ని స్థాయిల్లో అన్ని రుతువుల్లో తయారు కావు. ఇచ్చి పుచ్చుకోవడం అవసరం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులు, సేవలు అమెరికాకు, అమెరికాలో ఉత్పత్తి అయ్యే పరికరాలు సేవలు భారత దేశానికీ అవసరం. మన వస్తువును ఇచ్చి అదే సమయంలో వారి వస్తువును మార్పిడి చేసుకునే వస్తు మార్పిడి విధానం వల్ల సమస్యలున్నాయి కాబట్టి ఈ రోజు మనం కొన్ని వస్తువులను అమెరికాకు ఇచ్చి దానికి సంబంధించిన గుర్తుగా ఒక టోకెన్ తీసుకుంటాం. అదే టోకెన్ను రేపు నేను వారికి ఇచ్చి వారి వస్తువుల్ని తీసుకోగలను. మానవ శ్రమ వల్లనే వస్తువులకు విలువ ఏర్పడ్డం వల్ల బల్ల విలువ, సెల్ఫోను విలువ ఒకేలా ఉండదు. కాబట్టి టోకెన్ల సంఖ్య మార్పిడి చేసుకొనే వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఇలా వస్తుమార్పిడి వేర్వేరు దేశాల్లోనే కాకుండా ఒకే దేశంలో వేర్వేరు ప్రజలకు అవసరం అవుతుంది. కాబట్టి టోకెన్లు అంతర్జాతీయంగా, జాతీయంగానూ అవసరం. ఆ టోకెన్లనే కరెన్సీ అంటారు. రూపాయి మన కరెన్సీకి ప్రమాణం. అమెరికాకు డాలర్ ప్రమాణం, ఐరోపా దేశాలకు యూరో ప్రమాణం.అంతర్జాతీయంగా బంగారాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారు. అత్యంత విలువైంది. కాబట్టి మన దేశంలో 10 గ్రాముల్ని దాదాపు 30 వేల రూపాయలకు అమ్మితే అమెరికాలో 500 డాలర్లు పెడితే 10 గ్రాములు వస్తుంది. అంటే 500 డాలర్ల విలువ 30 వేల రూపాయల విలువ సమానం. మరో మాటలో చెప్పాలంటే ప్రతి డాలరుకు ఆ సమయంలో 60 రూపాయల మారకం విలువ అన్నట్టు అర్థం. ఐరోపాదేశాలు కూడబలుక్కుని తమదేశాల్లో ఉన్న వివిధ రకాల కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా ’యూరో’ను సార్వత్రికంగా వాడుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరస్పర అవగాహనకు వస్తే ఒకే కరెన్సీని చలామణీ చేసుకోవడం అసాధ్యం కాదు. (చదవండి: ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందంటే.. ) -
ప్రపంచ శాంతి కోసం ఆ పాప ఏం చేసిందో తెలుసా?
‘నేను బతుకుతానా అమ్మా?‘ అని అమాయకంగా అడిగింది సడాకో. తల్లి ఏమీ చెప్పలేక పక్కకు వెళ్లి ఏడ్చింది. సడాకోను ఆసుపత్రిలో ఉంచి రకరకాల చికిత్సలు అందిస్తున్నారు. 12 ఏళ్ల సడాకోది జపాన్ దేశం. ఆటపాటల్లో, చదువులో ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి పిల్ల ఒక రోజు ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. డాక్టర్లు తనకు రకరకాల పరీక్షలు చేశారు. పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ చిన్నారి పాపకు లుకేమియా. అంటే కేన్సర్. తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని సడాకో తల్లిని అడిగింది.‘అణుబాంబు వల్ల’ అంది తల్లి. 1945 ఆగస్టులో అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసే సమయానికి సడాకో వయసు రెండేళ్లు. సరిగ్గా బాంబు వేసిన ప్రదేశానికి మైలు దూరంలోనే సడాకో కుటుంబం ఉంటోంది. ఆ బాంబు దాడి నుంచి ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుని బతికింది. కానీ అణుధార్మికత వల్ల సడాకోకు క్యాన్సర్ వచ్చింది.‘అలాంటి బాంబును ఎందుకు వేశారు? ఎందుకు ఇంత నష్టం కలిగించారు?‘ అని అడిగింది సడాకో. తల్లి దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్పగలదు? దేశాల మధ్య వైరంలో సామాన్యులే బాధితులు అని ఆ చిన్నారికి ఎలా అర్థం చేయించాలి? ‘ఇకపై ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?‘ అని మరో ప్రశ్న వేసింది సడాకో. ‘ప్రపంచంలో శాంతి నెలకొనాలి‘ అంది తల్లి.’అవును! శాంతి నెలకొనాలి. ప్రపంచంలో అందరూ హాయిగా ఉండాలి. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఉండాలి’ అని సడాకో నిర్ణయించుకుంది. కానీ తాను ఏం చేయగలుగుతుంది? తట్టిందో ఆలోచన.జపాన్ దేశ నమ్మకం ప్రకారం కాగితంతో కొంగు బొమ్మలు చేసి దేవుణ్ని ప్రార్థిస్తే అనుకున్నది నెరవేరుతుంది. వెంటనే ఆస్పత్రి మంచం మీదే సడాకో కాగితాలతో కొంగ బొమ్మలు చేయడం ప్రారంభించింది. ఒకటి.. రెండు.. మూడు.. చేతులు నొప్పి పుట్టేవి. అలసట వచ్చేది. అయినా సడాకో ఆగిపోకుండా బొమ్మలు చేసేది. అలా చేస్తూ ఉంది. చేస్తూనే ఉంది. 1300 బొమ్మలు తయారు చేసింది. ఆపై చేయలేక΄ోయింది. 12 ఏళ్లకే సడాకో క్యాన్సర్తో మరణించింది. ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన కోరిక ఇంకా సజీవంగా ఉంది. ఈ విషయం తెలిసిన జపాన్ ప్రభుత్వం సడాకో కోసం స్మారకం నిర్మించింది. కాగితపు కొంగ బొమ్మ పట్టుకున్న సడాకో విగ్రహాన్ని చూస్తే ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన ఆశ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నేటికీ అనేక మంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి కాగితంతో కొంగ బొమ్మలు చేసి అక్కడ పెడతారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తారు. కాని నేటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. పిల్లలు ఈ పెద్దల్ని చూసి ఏమనుకుంటారు? వీరికి బుద్ధి లేదు అనే కదూ..?. (చదవండి: యమ్మీబ్రదర్స్: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!) -
Kid Entrepreneurs: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!
ఈ అన్నదమ్ములను అంబానీ బ్రదర్స్ అనొచ్చా? ఇంత చిన్న వయసులో వ్యాపారంలో ఢమఢమలాడిస్తుంటే అనక తప్పదు మరి. ఈ అన్నదమ్ముల్లో పెద్దవాడి వయసు 17. మిగిలినవారికి 15, 13, 11. వీళ్లను అందరూ ‘బిల్లింగ్స్లియా బాయ్స్’ అనీ ‘యమ్మీ బ్రదర్స్’ అనీ అంటుంటారు.అమెరికాలోని జార్జియా రాష్ట్రానికి చెందిన జాషువా, ఇషయా, కాలెబ్, మైకా అన్నదమ్ములు. చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యారు. అందుకు వారు చేసే వ్యాపారమే కారణం. వారు కుకీలు(బిస్కెట్లు) తయారు చేసి అమ్ముతుంటారు. అలా స్థానికంగా వారు పేరు తెచ్చుకున్నారు.వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వారికి ఎలా వచ్చింది? ఒకరోజు కుకీలు ఎలా తయారు చేయాలో వారికి వారి తాతమ్మ సరదాగా నేర్పింది. దాంతో ఆ నలుగురు అప్పుడప్పుడూ ఆ కుకీలు చేసి వీధిలో పంచేవారు. అవి చాలా కొత్తగా, రుచికరంగా ఉన్నాయని అందరూ మెచ్చుకునేవారు. దీంతో దాన్నే వ్యాపారంగా మార్చుకోవచ్చని వారికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే వెళ్లి వాళ్ల నాన్నకు చెప్పారు. ఆయన అంగీకరించడంతో వెంటనే పని మొదలుపెట్టారు. కుటుంబమంతా వారికి సహకరించింది. అలా ‘యమ్మీ బ్రదర్స్’ సంస్థ ప్రారంభమైంది. సుమారు 36 రకాల కుకీలు వారు తయారు చేసి మార్కెట్లో పెట్టగా, జనం వాటిని ఎగబడి కొన్నారు. అలా వారి కుకీలకు డిమాండ్ పెరిగింది. సంస్థలో మైకా ఆర్థిక అధికారి అయితే, ఇషయా మార్కెటింగ్ ఆఫీసర్, కాలెబ్ ఆపరేటింగ్ అధికారి, జాషువా ఎగ్జిక్యూటివ్ అధికారి. నలుగురూ ఒక్కొక్క పనిని పంచుకుని క్రమపద్ధతిలో చేస్తారు. తమ పనిలో చిన్న తేడా కూడా రాకుండా చూసుకుంటారు. మొదట స్థానికంగా మొదలైన వారి కార్యకలాపాలు ఆ తర్వాత దేశమంతా వ్యాపించాయి. దేశంలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా వారు కుకీలను పంపిస్తారు. రుచి, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు నాలుగు లక్షలను కుకీలను అమ్మేశారు. ప్రస్తుతం వారి వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఒక్క పక్క వ్యాపారం చేస్తూనే, చదువును నిర్లక్ష్యం చేయకుండా కాలేజీకి, స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు. (చదవండి: అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు..!) -
అందాల భామలకు ఆతిథ్యం! యాదగిరిగుట్టకు ప్రపంచ సుందరీమణులు
అందాల భామలకు అతిథ్యమిచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సిద్ధమవుతోంది. హైదరాబాద్లో మే 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్–2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలకు 140 దేశాల నుంచి మూడు వేల మంది అందాల భామలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారిద్వారా హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పర్యాటక కేంద్రాలకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా అందాల భామలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇలా వివిధ దేశాల అందాల భామలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా ఆయా ప్రాంతాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మే 15న ఇక్కత్ వస్త్రాలతో ర్యాంప్వాక్..ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరుగాంచిన భూదాన్పోచంపల్లికి మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే 15వ తేదీన రానున్నారు. వీరు ఇక్కడి చేనేత కార్మికులతో ముఖాముఖి మా ట్లాడుతారు. అనంతరం మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. తరువాత చేనేత చీరలు ధరించి ర్యాంప్వాక్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మిస్వరల్డ్ పోటీల ఈవెంట్లను నిర్వహించే పోచంపల్లి ఇక్కత్వస్త్రాల విశిష్టతను వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఫలితంగా చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మరింత పేరును తీసుకురావడమే ఈవెంట్ల ముఖ్య ఉద్దేశమని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ పేర్కొంటోంది. ఇప్పటికే అనేక ఫ్యాషన్ ఈవెంట్లకు వేదికైన పోచంపల్లికి ఇప్పుడు మరోసారి ప్రపంచ సుందరీమణులు వస్తుండడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ ఖ్యాతి పొందనుంది.ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. విజయ విహార్లో విడిదిప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్వరల్డ్ పోటీదారులు సాగర్లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక నగరికి.. మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. (చదవండి: -
స్థిరత్వం, నిలకడ బుద్దికోసం..!
ఆంజనేయాసనం అనేది యోగాలో ఒక భంగిమ. దీనిని క్రెసెంట్ మూన్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం హనుమంతుడి తల్లి అంజన చేసే నృత్య భంగిమలోదిగా చెబుతారు. అందుకే ఈ ఆసనానికి ఆంజనేయాసనం అని పేరు. ఈ ఆసనం ప్రయోజనాలు...శరీరాన్ని ఒక కాలు మీద స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సమతుల్యత కలుగుతుంది. స్థిరత్వం మెరుగుపడుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరానికి– మనసుకు మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. హిప్ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. శరీరంపై అవగాహన కలుగుతుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. కీళ్ల పనితీరును, ఉచ్ఛ్వాస–నిశ్వాసలను మెరుగు పరుస్తుంది. మానసిక, శారీరక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మనస్సును స్థిరంగా ఉంచుతుంది. దిగువ శరీరాన్ని సాగదీయడానికి, ఛాతీని విశాలం చేయడానికి ఈ ఆసనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎలా చేయాలంటే... ఎడమ మోకాలిని ముందుకు చాపి, కుడి కాలిని వెనక్కి వంచి, కుడి కాలి మునివేళ్లమీద ఉండాలి. తలను నిటారుగా ఉంచి, రెండు చేతులను కంటికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉంచాలి. ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనసును స్థిరంగా ఉంచే ఈ ఆసనంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఆసనాన్ని సాధనం చేయడం వల్ల మానసిక వికాసం కూడా మెరుగవుతుంది. (చదవండి: Round Egg Auction: కోటిలో ఒక్కటి ఇలా ఉంటుందేమో..వేలంలో ఎంతకు అమ్ముడుపోయిందంటే..) -
ఆరోగ్యానికి మంచిదని తినేయ్యొద్దు..! కొంచెం చూసి తిందామా..
చాలా మంది తెలిసో తెలియక కొన్ని ఫుడ్స్ను ఆరోగ్యానికి మంచిదని గుడ్డిగా నమ్మి తినేస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి బదులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో తెలుసా?ఫ్లేవర్డ్ ఓట్ మీల్...ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. కానీ ఇది స్వచ్ఛమైన, సాదా ఓట్ మీల్కి మాత్రమే వర్తిస్తుంది. అయితే రకరకాల ఫ్లేవర్స్తో రకరకాల ఓట్ మీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రుచిని పెంచడానికి కృత్రిమ రంగులు, చక్కెర సిరప్ వంటి అనేక ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల్ని కలుపుతారు. ఇవి తినడం మంచిది కాదు. బ్రౌన్ బ్రెడ్...ఈ రోజుల్లో మార్కెట్లో లభించే బ్రౌన్ బ్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పేరుకు మాత్రమే బ్రౌన్ బ్రెడ్స్. చాలా మంది వీటిని చౌకగా అమ్ముతున్నారు. అంటే ఇలాంటి బ్రౌన్ బ్రెడ్లో శుద్ధి చేసిన పిండి, కృత్రిమ రుచి, రంగు, చక్కెరను ఉపయోగిస్తున్నారని అర్థం. అందుకే బ్రౌన్ బ్రెడ్ కొనేటప్పుడు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే మంచి బ్రాండ్ కొనడం మేలు.ప్యాక్ చేసిన పండ్ల రసాలు లేదా స్మూతీలు...మార్కెట్లో వివిధ రకాల పండ్ల రసాలు, స్మూతీలు ప్యాకెట్లలో సులభంగా లభిస్తాయి. ఆరోగ్యానికి మంచిదని వీటిని తెగ కొనేస్తున్నారు. నిజానికి, ఈ ప్యాక్ చేసిన జ్యూస్లలో కృత్రిమ రంగులు, చక్కెర, కృత్రిమ రుచులు మొదలైన అనారోగ్యకరమైన వస్తువులు కూడా ఉంటాయి. అందుకే వీటిని కొనే ముందు వాటి ΄్యాక్ చెక్ చేస్తే పండ్ల రసాలు, స్మూతీల్లో ఏం వాడారో తెలుస్తుంది.ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్...ఈ రోజుల్లో స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని తాగడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుందేమో కానీ.. రాను రాను అనారోగ్యం కూడా వస్తుంది. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రింక్స్ తాగనివ్వకండి. వీటి బదులు ఇంట్లో చేసుకున్న పండ్ల జ్యూస్లు బెస్ట్.బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్...ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో మార్కెట్లో బ్రేక్ఫాస్ట్ మిల్లెట్స్ అమ్ముతున్నారు. చాలా మంది ఈ ప్యాకేజ్డ్ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని భావించి కొని తింటున్నారు. నిజానికి వీటిని తయారు చేయడానికి అదనపు చక్కెర, కత్రిమ రుచి కలుపుతారు. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఉండదు. వీటి బదులు సహజంగా దొరికే తృణధాన్యాలతో ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. -
నచ్చినట్లే ఉంటున్నారా..?
ఇతర పరిస్థితులు ఎలా ఉన్నా సరే, జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే, డబ్బు, ఆస్తులు, పరపతి ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఇతరుల మాటలు, సలహాల వల్ల చాలా మంది తమను తాము మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా తమ సెల్ఫ్ ఐటెంటిటీని, తద్వారా సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు. జీవితంలో ఇతరుల కోసం మార్చుకోకూడని అలవాట్లు ఏంటో తెలుసుకుందాం. మీ గుర్తింపును కాపాడుకోండిఇలా ప్రవర్తించవద్దు, అలా మాట్లాడవద్దు, ఇలా ఆలోచించవద్దు అని ఇతరుల మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని గుర్తుంచుకోండి.వ్యక్తిగత వ్యవహారాలలో తలదూర్చనివ్వద్దుప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ దాచడంతో ΄ాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంది. అయితే, ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు. వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించండి. మీ పర్సనల్ స్పేస్ని గౌరవించుకోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి.పీస్ ఆఫ్ మైండ్ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్గా ఉందని మీ మనసును చికాకు పెట్టవచ్చు. కానీ, మీరే సంతోషం లేకుంటే దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి.నైతిక విలువలపై రాజీ వద్దుకొందరు లేదా కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మోసగాళ్లుగా, అబద్ధాల కోరుగా మార్చటానికి ప్రయత్నించవచ్చు. కొందరు మీ చేత తప్పు పనులు చేయించడానికి బలవంతం పెడతారు. అయితే, ఇక్కడ నైతిక విలువలు పాటించడం ముఖ్యమని గుర్తించుకోండి. ఎవరో చె΄్పారని, వాళ్లు బలవంతం చేశారని చెడ్డ పనులు చేస్తే భవిష్యత్తులో కష్టాలే పలకరిస్తాయి. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ.. ఏది కరెక్టో దానివైపే నిలబడండి.నో చెప్పడం నేర్చుకోండిఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరుల జీవించాలని కోరుకుంటారు. అయితే, వేరే వాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్ చెప్పుకుంటూ ΄ోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమై΄ోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఇతరులకు నో చెప్పడానికి ఎందుకు సంకోచం. మీ పరిమితుల్ని మీరే నిర్ణయించుకోండి.కలల్ని, ఆశయాల్ని వదులుకోకండిచాలా మంది మనం ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సూటి ΄ోటి మాటలతో వెనక్కు లాగే ప్రయత్నం చేస్తారు. ఈ వయసులో నువ్వు ఏం సాధిస్తావు. ఇందులో నష్టం తప్ప లాభం ఉండదు, వేరే పని చూసుకుంటే మంచిదని లేని΄ోని సలహాలు ఇస్తుంటారు. అయితే, ఒకటి మాత్రం ఆలోచించండి. మీ జీవితాన్ని ఇతరుల ప్రకారం జీవించాలనుకోకూడదు. మీకు ఏదైనా సాధించాలని ఉంటే ఆ దిశగా అడుగులు వేయండి. మీ కలలకు విలువ ఇవ్వండి. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు.మీకు మీరే ముఖ్యంమన అవసరాల్ని తీర్చుకుని మిగతావారిని పట్టించుకుంటే చాలా మంది స్వార్థుపరులనే ట్యాగ్ వేసేస్తారు. మీకు మీరు ప్రాధాన్యత ఇచ్చుకోవడం స్వార్థం కాదని గుర్తుంచుకోండి. అది మీపై మీరు చూపించుకునే స్వీయ ప్రేమ. మీ ఆనందాన్ని, అవసరాల్ని ఇతరుల కోసం మార్చుకుంటే మిమ్మల్ని మీరు కోల్పోయినట్టే. ఇతరులకు అవసరమైనప్పుడు మాత్రమే సాయం చేయండి. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరుల కోసం మీ అవసరాల్ని త్యాగం చేస్తే చాలా కోల్పోతారు. (చదవండి: పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..) -
మామిడికాయతో ఆవకాయేనా..? తియ్యటి మిఠాయిలు కూడా చెసేయండి ఇలా..!
పచ్చి మామిడికాయతో ఒక్క ఆవకాయేనా? ఇంకా చాలా చేయవచ్చు. పచ్చిమామిడితో వంటకాలే కాదు... పుల్లని మామిడితో తియ్యటి మిఠాయిలూ సృష్టించొచ్చు. షర్బత్లూ తాగించొచ్చు.కావలసినవి: పచ్చి మామిడికాయ–1 (మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొంచె తీపి, పులుపు కలిపి ఉన్నది తీసుకోవాలి), మైదా–అరకప్పు, పంచదార–1 కప్పు, నీర –1 కప్పు, నెయ్యి– 2 చెంచాలు.తయారీ: మామిడికాయను పచ్చని భాగం పోయేవరకూ చెక్కు తీసి, ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక మామిడి ముక్కలు వేసి మెత్తబడేవరకూ మగ్గనివ్వాలి; తర్వాత చల్లారబెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి; ఈ పేస్ట్లో మైదా వేసి బాగా కలుపుకుని, మృదువుగా అయ్యాక ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి; గిన్నెలో నీరు, పంచదార వేసి స్టౌమీద పెట్టాలి; లేతపాకం తయారయ్యాక... జామూన్లను నూనెలో వేయించి పాకంలో వేయాలి; ఉండలు పాకాన్ని బాగా పీల్చుకున్నాక తరిగిన డ్రైఫ్రూట్స్తో అలంకరించి వడ్డించాలి. ఇవి చూడ్డానికి మామూలు జామూన్లలానే ఉంటాయి కానీ తింటే తీపితో పాటు కొద్ది పులుపుగా ఉండి ఓ కొత్త రుచిని పరిచయం చేస్తాయి.పచ్చి మామిడి హల్వాకావలసినవి: పచ్చి మామిడికాయ – 1, వెర్మిసెల్లీ – 1 కప్పు, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు, నెయ్యి పావుకప్పు, జీడిపప్పు పొడి – 2 చెంచాలు, యాలకుల పొడి – 2 చెంచాలుతయారీ: మామిడికాయను మెత్తని గుజ్జులా చేసి పెట్టుకోవాలి (గుజ్జు 1 కప్పు ఉండాలి); స్టౌమీద గిన్నె పెట్టి నెయ్యి వేయాలి; వేడెక్కాక సేమ్యా వేసి వేయించాలి; రంగు మారాక నీళ్లు పోయాలి; సేమ్యా కాస్త మెత్తబడ్డాక మామిడి గుజ్జును వేయాలి; రెండు నిమిషాలు ఉడికాక పంచదార కూడా వేయాలి; అడుగంటకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి; మిశ్రమం బాగా చిక్కబడ్డాక నెయ్యి, జీడిపప్పు పొడి, యాలకుల పొడి వేసి కలపాలి; హల్వా దగ్గరపడి నెయ్యి గిన్నె అంచులువదులుతున్నప్పుడు దించేసుకోవాలి.మ్యాంగో బనానా షర్బత్కావలసినవి: పచ్చి మామిడికాయలు – 2, పంచదార – 1 కప్పు, అరటిపండు – 1, జీలకర్ర పొడి – 1 చెంచా, మిరియాల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంతతయారీ: అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి; మామిడికాయల్ని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి; ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి; తర్వాత నీరు ΄ోసి పల్చని జ్యూస్లా బ్లెండ్ చేయాలి; దీన్ని గ్లాసులోకి వడ΄ోసుకుని అరటిపండు ముక్కలు వేయాలి; ఆపైన జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ షర్బత్ శరీరాన్ని చల్లబరుస్తుంది. (చదవండి: -
పంటపొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..
ఇంతకాలం పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం, నానో యూరియా వంటి ఎరువులు చల్లడం వంటి క్లిష్టతరమైన పనులను పురుషులే చేస్తున్నారు. అయితే ఇలాంటి పనులను కూడా ఇకపై మహిళలే చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్లతో వ్యవసాయ పనులను చేయడంపై గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 54 మంది ఎస్హెచ్జీ మహిళలను ఎంపిక చేశారు. తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఈ డ్రోన్లను అందించనున్నారు. బెంగుళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.80 శాతం సబ్సిడీపై...కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకం కింద ఈ డ్రోన్లకు 80 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ డ్రోన్ తోపాటు, సంబంధిత మెటీరియల్తో కలిపి యూనిట్ వ్యయం రూ.పది లక్షలు. ఇందులో లబ్ధిదారులు 20 శాతం (రూ.రెండు లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.ఎనిమిది లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమో దీదీ, కిసాన్ దీదీ పథకాల కింద సబ్సిడీ ఇస్తున్నాయి. ఈ డ్రోన్ సేవలను తమ వ్యవసాయ పొలాలకు వినియోగించడంతోపాటు, గ్రామంలో ఇతర రైతుల పొలాలకు సేవలందించనున్నారు. ఇందుకోసం నిర్ణీత మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇలా ఎస్హెచ్జీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతోపాటు, రైతులకు తమ పంట పొలాలకు పురుగుమందుల పిచికారీ కష్టాలు తప్పనున్నాయి. పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డిఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మేలు..డ్రోన్ స్ప్రేపై మాకు శిక్షణ ఇస్తున్నారు. వీటిని వినియోగించడం ద్వారా మేము ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. అలాగే రైతులకు తక్కువ ఖర్చుతో పురుగు మందుల పిచికారీ చేసే సేవలు అందుబాటులోకి వస్తాయి. మా లాంటి మహిళా సంఘాలకు ఈ అవకాశాన్ని కల్పించడం పట్ల సంతోషంగా ఉంది.– అనిత, ఎస్హెచ్జీ మహిళ,అల్మాయిపేట, సంగారెడ్డి జిల్లా.డ్రోన్లను వినియోగించి పంటలకు పురుగుమందులు ఎలా పిచికారీ చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. రైతులకు ఈ సేవలు అందించడం ద్వారా మాకు ఆర్థికంగా కలిసొస్తుందని భావిస్తున్నాము. అలాగే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. మాకు అర్ధమయ్యే రీతిలో వివరిస్తున్నారు. డ్రోన్ల సేవలు అందించేలా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది.– లక్ష్మి, ఎస్హెచ్జీ మహిళ, అన్నాసాగర్, సంగారెడ్డి జిల్లా (చదవండి: లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన) -
మహమ్మారి మా గౌరవాన్ని పెంచింది!
2020 మార్చి 24.. జనతా కర్ఫ్యూ... అదే లాక్డౌన్ గుర్తుందా? ఆనాడు రోజులను గుర్తుపెట్టుకోవడం కూడానా అని ముఖం చిట్లిస్తున్నారా?నిజమే చేదు అనుభవాలను అదేపనిగా గుర్తుపెట్టుకోనక్కరలేదు! కానీ కష్టకాలంలో అందిన సేవలు, సహాయాన్ని మాత్రం మరువకూడదు కదా!అలా కోవిడ్ టైమ్లో ఫ్రంట్లైన్ వారియర్స్గా నిలబడ్డ నర్స్లు, డాక్టర్లు, పోలీసులు అందించిన సేవలు, సాయం గురించి మార్చి 24 లాక్డౌన్ డే సందర్భంగా ఒక్కసారి గుర్తుచేసుకుందాం.. ఓ సిరీస్గా! అందులో భాగంగా నేడు .. సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రి సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ శిరీష ఏం చెబుతున్నారంటే..ఆ రోజులను తలచుకుంటే ఇప్పటికీ భయమే! నేనప్పుడు ఉస్మానియాలో పనిచేసేదాన్ని. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని తేలాకే అందులో జాయిన్ చేసుకునేవారు. జనరల్ పేషంట్స్, కోవిడ్ లక్షణాలున్న వాళ్లు ఉస్మానియాకు వచ్చేవాళ్లు. టెస్ట్ చేసి.. పాజిటివ్ అని తేలితే గాంధీకి పంపేవాళ్లం. ఉస్మానియా కోవిడ్ కాదు, ఎన్ 95 మాస్క్లు, పీపీఈ కిట్స్ ఖరీదైనవి కూడా .. కాబట్టి వాటిని ముందు డాక్టర్స్కే ఇచ్చారు. అయితే నిత్యం పేషంట్స్తో ఉంటూ వాళ్లను కనిపెట్టుకునేది నర్సింగ్ స్టాఫే కాబట్టి మాస్క్లు, పీపీఈ కిట్లు ముందు వాళ్లకు కావాలని మాకు ఇప్పించారు అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ సర్.మామపోయాడు.. అల్లుడు బతికాడుఒక కేస్లో మామ, అల్లుడు ఇద్దరికీ కోవిడ్ సోకింది. ఇద్దరినీ గాంధీలో చేర్పించాం. మాకు రెండు ప్రాణాలూ ఇంపార్టెంటే! ఇద్దరికీ ఈక్వల్ సర్వీసే ఇస్తాం. దురదృష్టవశాత్తు పెద్దాయన అంటే మామ చనిపోయాడు. ఆ అమ్మాయి భర్త డిశ్చార్జ్ అయ్యాడు. అల్లుడిని చూసి అత్తగారు తన భర్త కూడా తిరిగొస్తాడనుకుంది. వెంటనే నిజం చెబితే ఆమెకేమన్నా అయిపోతుందన్న భయంతో నెల తర్వాత అసలు విషయం చెప్పారురు. ఇలా ఎన్నికేసులో! కోవిడ్ నుంచి బయటపడగలమా అని దిగులేసేది. అలాంటి సిట్యుయేషన్ ఎప్పటికీ రావద్దు!వెంటిలేటర్ మీదుంచే స్థితిలో..లాక్డౌన్ టైమ్లో మాకు వారం డ్యూటీ, వారం సెలవు ఉండేది. రెండో వారమే నాకు కాళ్లు లాగడం, కళ్లు మండటం స్టార్టయింది. దాంతో తర్వాత వారం కూడా సెలవు తీసుకున్నాను. ఇది కోవిడా లేక నా అనుమానమేనా అని తేల్చుకోవడానికి డ్యూటీలో జాయినయ్యే కంటే ముందురోజు అంటే పదమూడో రోజు టెస్ట్ చేయించుకున్నాను. స్వాబ్ టెస్ట్లో నెగటివ్ వచ్చింది. సీటీ స్కాన్ కూడా చేయిస్తే.. సీవియర్గా ఉంది కోవిడ్. ఆ రిపోర్ట్స్ని మా హాస్పిటల్లోని అనస్తీషియా డాక్టర్కి పంపాను. వాటిని చూసిన ఆవిడ ‘వెంటిలెటర్ మీదుంచే స్థితి తెలుసా నీది? అసలెలా ఉన్నావ్?’ అంటూ గాభరాపడ్డారు. కానీ నేను మాత్రం బాగానే ఉన్నాను. అయినా ఆవిడ కొన్ని జాగ్రత్తలు చె΄్పారు. తెల్లవారి డ్యూటీలో జాయిన్ అయ్యాను. అయితే డాక్టర్స్, కొలీగ్స్ చాలా కేర్ తీసుకున్నారు. ఇంట్లో మా ఆయన, పిల్లలు కూడా! డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మావారు వేడినీళ్లు పెట్టి ఉంచేవారు. మా పెద్దబ్బాయి రోజూ నాన్వెజ్ చేసిపెట్టేవాడు.‘ నువ్వు డ్యూటీ చేయాలి కదమ్మా.. మంచి ఫుడ్ అవసరం’ అంటూ. అందరూ చాలా స΄ోర్ట్గా ఉన్నారు.అంత విషాదంలోనూ సంతోషమేంటంటే.. మా నర్సింగ్ స్టాఫ్లో డెబ్భై శాతం మందికి కోవిడ్ సోకింది. ఐసొలేషన్ పీరియడ్ అయిపోగానే వెంటనే డ్యూటీకొచ్చారు.. భయపడలేదు. పీపీఈ కిట్తో ఉక్కపోతగా ఉండేది. అది వేసుకున్న తర్వాత ఒక్కసారి తీసినా మళ్లీ పనికిరాదు. దాంతో వాష్రూమ్కి కూడా వెళ్లేవాళ్లం కాదు. దానివల్ల డీహైడ్రేషన్ అయింది. అయినా, సహనం కోల్పోలేదు. కోవిడ్ మా సర్వీస్కి పరీక్షలాంటిది. నెగ్గాలి.. మానవ సేవను మించిన పరమార్థం లేదు అనుకునేదాన్ని! అంత విషాదంలోనూ సంతోషమేంటంటే మా నిబద్ధత, సేవ ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వాసుపత్రుల మీదున్న చెడు అభిప్రాయం పోయింది. మమ్మల్ని గౌరవిస్తున్నారు. – సరస్వతి రమ (చదవండి: లాభాల తీరం మత్స్య సంపద యోజన) -
లాభాల తీరం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
పీఎమ్ఎస్సెస్వై (ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన) కిందకు వచ్చే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని 2020లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా చేపలపెంపకందారులకు ఏడు శాతం వడ్డీతో రెండు లక్షల రూపాయాల వరకు రుణాన్ని అందిస్తున్నారు. చేపలు, రొయ్యల పెంపకంపై ఉచిత శిక్షణనూ అందిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు 60 శాతం వరకు గ్రాంట్ అందుతోంది. ఈ పథకం తీర్రప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చేపల ఎగుమతిలో భారతదేశాన్ని ముందంజలో నడిపిస్తోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఫిషరీస్, మత్స్యకారుల సంక్షేమశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో మరిన్ని వివరాలను పొదవచ్చు. జిల్లా మత్స్యశాఖ లేదా ఏదైనా హేచరీ నుంచి ఉచితంగా చేప సీడ్ను పొందవచ్చు. ఈ పథకానికి అధికారిక వెబ్సైట్ https://pmmsy.dof.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో స్కీమ్ లింక్పై క్లిక్ చేయాలి. నింపాల్సిన ఫామ్ కనిపిస్తుంది. అందులోని వివరాలను పూరించాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా, భూమి వివరాలనూ పొందుపరచాలి. డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సహా సూచించిన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసి.. ఫామ్ను సమర్పించాలి. దరఖాస్తుదారు అర్హతలు, సంబంధిత పత్రాలను ఆమోదించిన తరువాత పథకం ప్రయోజనాలను పొందవచ్చు. తీర్రప్రాంతం లేని చోటా మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు ఈ పథకం రుణాన్ని అందిస్తోంది. కమర్షియల్ ఆక్వా కల్చర్ సిస్టమ్ కింద ఈ ప్రాజెక్ట్ విలువ రూ. 20 లక్షలు అయితే రూ. 5 లక్షల వరకు సొంత పెట్టుబడి ఉండాలి. అప్పుడు రూ. 15 లక్షల రుణాన్ని పొందవచ్చు. ఇందులో సబ్సిడీ ఉంటుంది. (చదవండి: Earth Hour: "'స్విచ్ ఆఫ్": ఆ ఒక్క గంగ ప్రకృతితో కనెక్ట్ అవుదామా..!) -
ఇవాళ గంటపాటు "స్విచ్ ఆఫ్"
మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి ఈ ఎర్త్ అవర్. అసలేంటిది..? ఆ ఒక్క రోజు.. ఒక్క గంటపాటు పాటించేస్తే నిజంగానే భూమిని కాపాడేసినట్లేనా..? అంటే..?. .ఎర్త్ అవర్ అంటే.. పర్యావరణం కోసం ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఒక కార్యక్రమం. ప్రతి ఏడాది మార్చి నెలలో చివరి శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల మధ్య జరుగుతుంది. ఈపాటికే ఇరు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు మార్చి 22 శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను స్వచ్చందంగా ఆపేయాలని అధికారికంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేసింది కూడా. అలాగే ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందురూ స్వచ్ఛందంగా భాగం కావాలని కోరాయి ఇరు ప్రభుత్వాలు.ఎలా ప్రారంభమైందంటే? 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. WWF (World Wildlife Fund) అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పాటుపడటమే ఈ కార్యక్రమం అసలు లక్ష్యం.ప్రాముఖ్యత ఎందుకు..మన ప్రపంచానికి మన సహాయం కావాలి. మనం తినే ఆహారం నుంచి పీల్చే గాలి వరకు ప్రకృతి మనకు చాలా ఇస్తుంది. అది మనల్ని ఆరోగ్యంగా, అభివృద్ధి చెందేలా చేస్తుంది. డబ్ల్యూబడ్యూఎఫ్(WWF) ఎర్త్ అవర్ అనేది స్విచ్ ఆఫ్ చేసి మనం నివశించే గ్రహానికి(భూమి) తిరిగి ఇవ్వడానికి సరైన సమయం. ఎందుకంటే మనం ప్రకృతిని పునరుద్ధరించినప్పుడే అది మనల్ని పునరుద్ధరిస్తుంది.'స్విచ్ ఆఫ్'లో ఉన్న ఆంతర్యం..ఎర్త్ అవర్ అంటే కేవలం లైట్లు ఆర్పేయడం మాత్రమే కాదు - మానసికంగా "స్విచ్ ఆఫ్" చేసి అంతర్ముఖులం కావడమే. అంటే ఇది వరకు చూడండి కరెంట్ పోతే చాలు అంతా బయటకు వచ్చి ముచ్చటలు ఆడుకునేవాళ్లు. ఆ వసంతకాలం వెన్నెలను వీక్షిస్తూ భోజనాలు చేస్తూ..హాయిగా గడిపేవాళ్లం గుర్తుందా..?. అచ్చం అలాగన్నమాట. ప్రకృతితో గడపటం అంటే ఏ అడువులో, ట్రెక్కింగ్లే అక్కర్లేదు..మన చుట్టు ఉన్న వాతావరణంతో కాసేపు సేదతీరుదాం. చిన్న పెద్ద అనే తారతమ్య లేకుండా ఫోన్ స్క్రీన్లతో గడిపే మనందరం కాసేపు అన్నింటికి స్విచ్ ఆఫ్ చెప్పేసి.. మనుషులతోనే కాదు మనతో మనమే కనెక్ట్ అవుదాం. తద్వారా గొప్ప మానసిక ఆనందాన్ని పొందుతాం కూడా. ఎందుకంటే సెల్ఫోన్ లేకుండా ప్రాణామే లేదన్నట్లుగా హైరానా పడుతున్న మనకు ఆ ఒక్క గంట అమూల్యమైన విషయాలెన్నింటినో నేర్పిస్తుందంటున్నారు మానసిక నిపుణులు.మరి అంత గొప్ప ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందామా..!. ఇది కేవలం భవిష్యతరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడమే గాక మనకు ఈ ఒక్క గంట లైట్స్ ఆపి చీకటిలో గడిపే చిన్నపాటి విరామంలో అయినా మనలో ఆరోగ్యం, ప్రకృతిని రక్షించుకోవాలనే మార్పు వస్తుందేమోనని ఆశిద్దాం.(చదవండి: ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్లో ఇంత మోసమా..? వైరల్గా హర్ష గోయెంకా పోస్ట్) -
ఫుడ్ ప్యాకేజింగ్ లేబుల్స్లో ఇంత మోసమా..? వైరల్గా హర్ష్ గోయెంకా పోస్ట్
ఆహార ప్యాకేజింగ్ లేబుల్స్పై ఉన్న సమాచారం నమ్మి..కొనుగోలు చేయకండి అని హెచ్చరిస్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నెటిజన్లతో మంచి విషయాలను ముచ్చటించే హర్ష్ గోయెంకా తాజాగా ఆహార కంపెనీలు వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నాయో వివరించే వీడియోను పంచుకున్నారు. ఇన్ని ప్రముఖ ఆహార కంపెనీలు తన ప్యాకేజీ లేబుల్పై ఇంతలా తప్పుదారి పట్టించేలా సమాచారం ఇస్తున్నాయా..? అని తెలిసి షాకయ్యా అంటూ పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతకి హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..?హర్ష గోయెంకా ఇటీవల మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో ద్వారా ఓ సమస్యను బయటపెట్టారు. మన ఆహార కంపెనీలు మనల్ని ఎలా మోసగిస్తున్నాయో ఈ వీడియోలో సవివరంగా ఉందని, అది చూసి విస్తుపోయానంటూ రాసుకొచ్చారు పోస్ట్లో. ఆ వీడియోలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ అయిన రేవంత్ హిమత్సింగాక్ ఆహార కంపెనీలు వినియోగదారులను తప్పుపట్టించేలా చేస్తున్న మోసపూరిత వ్యూహాల గురించి మాట్లాడారు. అందులో గుడ్ డే బిస్కట ప్యాకేట్స్, కుకీలు వంటి వాటిల్లో బాదం, జీడిపప్పుల క్యాండిటీ 50-60 శాతం ఉంటాయని లేబుల్పై ఉంటుంది. కానీ కేవలం బాదం 1.8 శాతం, జీడిపప్పలు 0.4 శాతం మాత్రమే ఉంటాయన్నారు. మరోక బిస్కెట్ ప్యాకెట్ని చూపిస్తూ..దీన్ని హోల్వీట్ కుకీగా ప్రచారం చేస్తుంటారు. కానీ దానిలో 52 శాతం శుద్ధి చేసిన పిండి, 19.5 శాతం మాత్రమే హోల్వీట్ ఉంటుందన్నారు. అలాగే హెర్బ్ కుకీగా అమ్ముడవుతున్న మరో ప్రొడక్ట్లో అశ్వగంధ, పసుపు, తులసి, గిలోయ్, ఆమ్లా (గూస్బెర్రీ) ఉన్నాయని పేర్కొంది. అవి లేబుల్లో చెప్పినంత శాతంగా కాకుండా కేవలం 0.1 శాతం మాత్రమే ఉన్నాయి. ఇలా మనకు తెలియకుండా చాలా పెద్ద నకిలీ మార్కెట్ జరుగుతోంది. ఇది ఒక విధమైన పెద్ద సమస్య, ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అని వీడియోలో న్యూట్రిషన్ రేవంత్ చెబుతున్నట్లు కనిపిస్తుంది. మం గనుక ప్రొడక్ట్లపై ఉన్న సమాచారాన్ని నమ్మి తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడటమేగాక ఆస్పత్రి పాలవ్వుతామని అన్నారు. ఏదో రకంగా వినియోగదారుడుకి కట్టబెట్టడంలో నైపుణ్యం కలిగిన ఆహార కంపెనీలు అవి. అవన్నీ ఒక దానికొకటి పోటీ పడుతూ మనల్ని దారుణంగా తప్పుదారి పట్టించేలా మోసం చేస్తన్నాయని చెప్పారు న్యూట్రిషన్ రేవంత్. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కంటే మొక్కల ఆధారిత ఆహరానికే ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటివి కొనుగోలు చేసి ఒళ్లు, జేబు గుల్ల చేసుకుని వాడి లాభాలు తెచ్చిపెట్టే కంటే..ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదన్నారు న్యూట్రిషన్ రేవంత్. చివరగా హర్ష గోయంకా ఆరోగ్యకరంగా తింటూ ఆరోగ్యంగా ఉందాం అని పోస్ట్ని ముగించారు. How our food companies are taking us for a ride! I was truly shocked by these revelations. pic.twitter.com/oRWTeVuYxw— Harsh Goenka (@hvgoenka) March 19, 2025 (చదవండి: నటి రాణి ముఖర్జీ టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్యనమస్కారాలు ఇంకా..) -
Rani Mukerji: టోన్డ్ బాడీ సీక్రెట్..! వంద సూర్య నమస్కారాలు ఇంకా..!
బాలీవుడ్లో అత్యంత ప్రసిద్ధ తారల్లో రాణి ముఖర్జీ ఒకరు. బెంగాలీ చిత్రంలో సహాయ నటి పాత్రతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత రాజా కీ ఆయేగీ బారాత్ వంటి బ్లాక్బస్టర్ మూవీలతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే గాక ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారామె. ఈ రోజు ఆమె 46వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2013లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి నటించిన అయ్యా మూవీ కోసం ఎంతలా కష్టపడి స్లిమ్గా మారిందో తెలుసుకుందామా. ఆ మూవీలో సన్నజాజి తీగలాంటి దేహాకృతితో హీరో పృథ్వీరాజ్తో కలిసి చేసిన నృత్యం ప్రేక్షకుల మదిని దోచుకోవడమే గాక ఇప్పటకీ హైలెట్గా ఉంటుంది. ఆ సినిమాలో రాణి ముఖర్జీ టోన్డ్ బాడీతో మెస్మరైజ్ చేస్తుంది. అందుకోసం ఎలాంటి డైట్ ప్లాన్, వర్కౌట్లు ఫాలో అయ్యేదో రాణి ముఖర్జీ ఫిట్నెస్ ట్రైనర్ సత్యజిత్ చౌరాసియా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవేంటంటే..ఆ సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ గ్లాస్ ఫిగర్ని పొందేందుకు ఎలా కష్టపడిందో వింటే విస్తుపోతారు. తన శరీరాకృతి మెరుపు తీగలా ఉండేందుకు ఎలాంటి డైట్-వర్కౌట్ ప్లాన్ని అనుసరించిందంటే. రాణి ముఖర్జీ దినచర్య ఎలా ఉండేదంటే...తెల్లవారుజామున 60 మి.లీ కలబంద రసం.ఒక గిన్నె బొప్పాయి, సగం ఆపిల్రెండు గంటలు వ్యాయామంఅల్పాహారం: ముయెస్లీ/ఓట్స్ స్కిమ్డ్ మిల్క్ మధ్యాహ్నం: రెండు మల్టీగ్రెయిన్ ఆట రోటీలు, పప్పు.సాయంత్రం: మొలకలు, రెండు గుడ్డులోని తెల్లసొన, మల్టీ-గ్రెయిన్ బ్రెడ్ .రాత్రి భోజనం: 1 రోటీ, కాల్చిన కూరగాయలు, 150 గ్రాముల తందూరీ చేపలు.100 సూర్య నమస్కారాలు, మైదా కార్బోహైడ్రేట్లు లేవుచివరగా టైనర్ సత్యజిత్ చౌరాసియా మాట్లాడుతూ..ఈ మూవీ ప్రారంభించడానికి రెండు వారాల ముందు తనను సంప్రదించి విల్లలాంటి శరీరాకృతి కోరుకుంటున్నట్లు తెలిపింది. ఆ మూవీలోని కొన్ని సన్నివేశాలకు పొట్ట భాగాన్ని, వెనుక భాగాన్ని వొంపైన తీరులో చూపించాల్సి ఉంటుందని చెప్పిందన్నారు. సులభంగా బాడీ కదలికలు కూడా ఉండాలని తెలిపిందన్నారు. కాబట్టి ఆమెను టోన్గా కనిపించేలా చేసేందుకు యోగా, చక్కటి డైట్ ప్లాన్ని ఆమెకి ఇచ్చినట్లు తెలిపారు. నటి రాణి కూడా తాను సూచించినట్లుగానే దాదాపు 50 నుంచి 100 సూర్యనమస్కారాలు చేసేది. అలాగే ప్రతి రెండు మూడు గంటలకొకసారి తినేదన్నారు. వీటి తోపాటు రెండు మూడు లీటర్ల నీరు తాగాలని, కార్బోహైడ్రేట్లు, మైదాను పూర్తిగా తొలగించాలని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆహారంలో ఒక చెంచాకు మించి నూనె ఉండకుండా కేర్ తీసుకున్నట్లు తెలిపారు. అయితే అప్పడప్పుడు చాక్లెట్ పేస్ట్రీల వంటివి తీసుకునేదన్నారు. ఇక్కడ రాణి కూడా అలాంటి దేహాకృతి కోసం చాలా అంకితభావంతో కష్టపడిందని చెప్పుకొచ్చారు. (చదవండి: 'పిలిగ్రీ కళ': ఇల్లే యూనివర్సిటీ..!) -
ఒడియా ఆహార సంస్కృతిలో ఆణిముత్యం ‘పొఖొలొ’
భువనేశ్వర్: ప్రపంచ పొఖాలొ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసన సభ స్పీకరు సురమా పాఢి, మంత్రి మండలి సభ్యులతో కలిసి పొఖాలొ (చద్దన్నం) ఆరగించారు. దేశ, విదేశాల్లో విస్తరించిన ఒడియా ప్రజలు కూడా పొఖాలొ దిబొసొ వేడుకగా జరుపుకున్నారు. పసి పిల్లలకు చద్దన్న ప్రాసనం కూడ సరదాగా నిర్వహించి ముచ్చట పంచుకోవడం మరో విశేషం. పొఖాలొ ఒడియా ప్రజలకు ఇష్టమైన నిత్య ఆహారం. ప్రతి ఇంటా పొఖాలొ ఉంటుంది. ఈ ఆహారం అనాదిగా ఒడియా ప్రజల ఆహార సంస్కృతిలో ఇమిడి పోయింది. రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత శ్రీ జగన్నాథునికి కూడా దొహి పొఖాలొ (దద్దోజనం) నివేదించడం సనాతన ధర్మ, ఆచారాలకు ప్రతీకగా పేర్కొంటారు. వ్యవహారిక శైలిలో పొఖాలొ (చద్దన్నం) శరీరానికి చల్లదనం చేకూర్చుతుందని చెబుతారు. కొరాపుట్: పొఖాలొ తినాలని బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పిలుపు నిచ్చారు. ఉత్కళ పకాలి దినోత్సవం సందర్భంగా తాను పొఖాలొ తింటున్న చిత్రం విడుదల చేశారు. వేసవిలో పొఖాలొ తినడం వల్ల చల్లదనం చేస్తుందన్నారు. (చదవండి: అవకాడో: పోషకాల పండు.. లాభాలు మెండు) -
సుమనోహరం వెడ్డింగ్ ట్రెండ్స్..!
పెళ్లిళ్ల సీజన్కు ముందు బుక్ మార్క్ చేసుకోదగిన అతిపెద్ద ఫ్యాషన్ ట్రెండ్స్ ఈ ఏడాది మనల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయం, ఆధునిక ధోరణులను కలబోసి మన ముందుకు తీసుకువచ్చాయి. వధువుల కోర్సెట్ చోళీలు, భారతీయ సంప్రదాయ నేత చీరలు, పలుచటి మేలి ముసుగులు, ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా కనిపించాయి. పెళ్ళిళ్లకు ముందే బుక్ మార్క్ చేసుకోదగిన పెళ్లికూతురుట్రెండ్స్లో ప్రధానంగా కనిపించిన జాబితాను చెక్ చేద్దాం..భారతీయ చేనేతక్లాసిక్ ఇండియన్ చేనేత పునరుజ్జీవనాన్ని మనం గమనించి తీరాలి. వివాహ వేడుకలకు కాంజీవరం, బనారసి, చికంకారి వంటి చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కాలాతీత డిజైన్లు సంప్రదాయ రూపంలో ధరించినా లేదా ఆధునిక ట్విస్ట్తో మెరిపించినా, ఇవి మసకబారే సూచనలు కనిపించడం లేదన్నది నిజం.కోర్సెట్లు ఫ్యాషన్ రంగాన్ని ఆక్రమించాయి అని చెప్పవచ్చు. వీటిని సంప్రదాయ వివాహ వేడుకలకు తీసుకురావడం ఎలా అనే అంశంపై పెద్ద కసరత్తే జరిగింది. అందుకు పెళ్లికూతుళ్లు కూడా తమ వివాహ సమయంలో ఆధునికంగా కనిపించడానికి కోర్సెట్ చోళీలను ఎంచుకుంటున్నారు. దాంతో దిగ్గజ డిజైనర్లు తమ డిజైన్స్కు ఆధునికతను జోడిస్తున్నారు. సాంప్రదాయ పెళ్లి బ్లౌజ్లకు ఇవి ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. ఫిష్టైల్ లెహంగాతో కోర్సెట్ చోళీలు జతగా చేరి అద్భుతంగా కనిపిస్తున్నాయి. సంగీత్ నుంచి రిసెప్షన్ వరకు కోర్సెట్లు అంతటా రాజ్యమేలుతున్నాయి.లాంగ్ వెయిల్స్పాశ్చాత్య వివాహాల నుంచి వీటిని స్ఫూర్తి పొందినట్లు అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం వధువులలో ట్రైల్ లేదా వెయిల్ ఉన్న లెహంగాలను ధరించే ధోరణి పెరుగుతోంది. గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకునే వధువులకు ఈ లుక్ ఒక గొప్ప ఎంపిక. లాంగ్ ట్రైల్స్ లేదా వెయిల్స్ ఉన్న లెహంగాలు ప్రిన్సెస్ లుక్తో అందంగా కనిపిస్తాయి. (చదవండి: 'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!) -
'మిట్టి దీదీ': విషరహిత విత్తనాల కోసం..!
బిడ్డ ఎదుగుదలకు తోడ్పడే పోషకాలన్నీ కలిపి అమ్మచేతి గోరుముద్ద రూపంలో బుజ్జాయి బొజ్జలోకి వెళ్తాయి. అలాంటి అమ్మ చేతి ముద్దలో ఉండే ఆహారం రసాయనాలతో నిండితే.. భవిష్యత్తు తరం ఏమవుతుందోనన్న ఆలోచనే ఓ వినూత్న కార్యక్రమానికి పురుడు పోసింది. ఒకప్పటి విష రహిత దేశీ విత్తనాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించాలన్న లక్ష్యంతో నిర్మల్ జిల్లాలో డీఆర్డీఓ విజయలక్ష్మి తమ కలెక్టర్ అభిలాష అభినవ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. గురువారం నిర్మల్ కలెక్టరేట్లో మహిళా అధికారులు, మహిళా రైతులు, మహిళా సంఘాల సభ్యులు అందరూ కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.వాక్ ఫర్ దేశీ సీడ్...‘మన విత్తనం – మన భవిష్యత్తు‘ అన్న ట్యాగ్ లైన్తో ‘వాక్ ఫర్ దేశీ సీడ్‘ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురాతన దేశీ విత్తనాలను సేకరించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం జిల్లా అధికారులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఇప్పటికీ సాగులో ఉన్న దేశీ విత్తనాలను సేకరించారు. వరి, పప్పు దినుసులతో పాటు కూరగాయలలోనూ అందుబాటులో ఉన్న దేశీ సీడ్ రకాలను తెప్పించారు. బహురూపి వంటి అరుదైన రకాలను సేకరించారు. జిల్లాలో ఆరువేల మంది సభ్యులుగా ఉన్న ‘మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ‘లో ఆధ్వర్యంలో వీటిని సాగు చేయించడం మరో ప్రత్యేకత. ముందుగా 20ఎకరాలలో 200 మంది మహిళ రైతులతో దేశీ విత్తనాలతో సాగు చేయించాలని నిర్ణయించారు. ఇలా సాగుచేసిన పంటలను సైతం తిరిగి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు చేస్తాయి. పెరటి తోటల పెంపకంపై ఆసక్తి గల వారికి సైతం దేశీ విత్తనాలు అందిస్తామని చెబుతున్నారు.మిట్టి దీదీ...ఎంతటి విత్తనమైనా మట్టి బాగుంటేనే బతికి బట్ట కడుతుంది. అందుకే ఈ మహిళా అధికారులు కేవలం దేశీ విత్తనాలనే కాకుండా.. మట్టిని సైతం పరీక్షించిన తర్వాతే సాగు చేయాలన్న మరో లక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. ‘భూసార పరీక్ష – నేలతల్లికి రక్ష‘ ట్యాగ్ లైన్ తో ‘మిట్టి దీదీ‘ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో ఏఐ టెక్నాలజీ కలిగిన ఫార్మోసిస్ యంత్రంతో భూసార పరీక్షలను చేసి అప్పటికప్పుడే అక్కడ ఎలాంటి పంటలు పండిస్తే బాగుంటాయో చెప్పేస్తారు. ఇలా భూసార పరీక్షలు చేయడం కూడా మహిళ రైతు ఉత్పత్తిదారుల సంఘాలే చేయనుండటం విశేషం.– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్దేశీ విత్తనాలు కాపాడుకోవాలని...ప్రస్తుత పరిస్థితులలో ఆర్గానిక్ ఆహారం పైన చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అధిక ధరలు ఉండటంతో ΄ాటు తక్కువ మొత్తంలో లభ్యమవుతుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో మహిళా రైతులను ్ర΄ోత్సహించడంతో΄ాటు మనవైన దేశీ విత్తనాలను ముందు తరాలకు అందించాలన్న ఉద్దేశంతో కలెక్టర్ అభిలాష అభినవ్ గారి సహకారంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నాం. – విజయలక్ష్మి, డీఆర్డీఓ, నిర్మల్ -
74 ఏళ్ల వయసులోనూ ఫిట్గా ఉండటానికి కారణం అదే..!: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా అనూహ్యంగా ఉంటాయో.. అలాగే అత్యంత విభిన్నంగా ఉండే ఆయన వ్యవహారతీరు ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అయితే మోదీ ఏడుపదుల వయసులోనూ అంతే ఫిట్గా, చలాకీగా ఉంటారు. ఎక్కడ అలసటను దరిచేరనీయరు. ఏ కార్యక్రమంలోనైన ముఖంపై రచిరునవ్వు, ఉత్సాహం చెరగనివ్వరు. మోదీ ఈ ఏజ్లో కూడా యువకుల మాదిరి నూతనోత్సహాంతో పనులు చక్కబెట్టుకుంటారు. అలా చలాకీగా ఉండేందుకు తాను పాటించే ఆ దినచర్యేనంటూ తన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. అవేంటో చూద్దామా..!.24 గంటల్లో ఒక్కసారే భోజనం..అమెరికాకు చెందిన పాడ్కాస్టర్ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన సంభాషణలో మోదీ తన ఉపవాస షెడ్యూల్ గురించి, జీవనశైలి గురించి వివరించారు. జూన్ మధ్యలో ప్రారంభమైన దీపావళి నుంచి 4 నెలలు పాటు భారత వైదిక ఆచారమైన చాతుర్మాస్ దీక్షను అవలంభిస్తారట. ఆ రోజుల్లో 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఏమైనా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు మోదీ. సరిగ్గా అది వర్షాకాలం ఆ టైంలో మనిషి జీర్ణక్రియ ఎలా మందగిస్తుందో వివరించారు. అంతేకాదు తాను పాటించే నవరాత్రి ఉపవాస దీక్ష గురించి కూడా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ పూర్తిగా ఆహారం తీసుకోకుండా తొమ్మిది రోజులు కేవలం వేడినీరు మాత్రమే తీసుకుంటానని అన్నారు. అయితే వేడినీరు ఎల్లప్పుడూ తన దినచర్యలో ఒక భాగమేనని చెప్పారు. అది తనకు ఒక అలవాటుగా మారిపోయిందన్నారు. అలాగే మోదీ మార్చి లేదా ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి ఉపవాసాన్ని కూడా అనుసరిస్తానన్నారు. అంతేగాదు తన దృష్టిలో ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ-క్రమశిక్షణగా పేర్కొన్నారు. ఇది భక్తితో కూడిన దినచర్య. నెమ్మదించేలా చేయదు. మరింత చురుకుగా ఉండేలా చేస్తుంది. ఉపవాసం శక్తి..ఉపవాసం శరీరాన్ని బలహీనపరస్తుందనే సాధారణ నమ్మకాన్ని సవాలు చేస్తూ..మనస్సు, ఆత్మ రెండింటిని రీచార్జ్ చేసుకునే ఓ గొప్ప మార్గంగా అభివర్ణించారు. ఆ టైంలో వాసన, స్పర్శ, రుచి వంటి జ్ఞానేంద్రియాలు సున్నితంగా మారడాన్ని గమనించొచ్చన్నారు. ఉపవాసం అంటే భోజనం దాటవేయడం మాత్రమే కాదు. శరీరాన్ని తిరిగి సమతుల్యం చేసుకోవడం, సంకల్ప శక్తిని బలోపేతం చేయడం, అంతర్గత సామరస్యాన్ని సాధించడం అని ఆయన వివరించారు. (చదవండి: Coconut Water Vs Sugarcane Juice: భగభగమండే ఈ ఎండలకు ఏ పానీయం మేలు అంటే..?) -
కొబ్బరి నీరు వర్సెస్ చెరకు రసం: ఈ సమ్మర్లో ఏ పానీయం బెస్ట్..!
అప్పుడే మే నెల రాకుండానే ఎండలు భగభగ మంటున్నాయి. ఉక్కపోతలతో తారెత్తిస్తోంది. ఈ ఎండలకు ఏం తినాలనిపించదు. ఒక్కటే దాహం.. దాహం అన్నట్లు ఉంటుంది పరిస్థితి. దీంతో అందరు మజ్జిగ, నిమ్మకాయ పంచదార నీళ్లు, పండ్లపై ఆధారపడుతుంటారు. అంతేగాదు ఈ కాలంలో చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా అందరూ హైడ్రేషన్కి గురవ్వుతారు. అందుకే అంతా ఆరోగ్యానికి మంచిదని ప్రకృతి అందించే సహజసిద్ధమైన రిఫ్రెషింగ్ పానీయాలైన కొబ్బరి నీరు, చెరుకురసం వంటి వాటిపై ఆధారపడుతుంటారు. ఈ రెండూ ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్? అందరూ తీసుకోవచ్చా అంటే..చెరకు రసంఇది అద్భుతమైన వేసవి పానీయం. తక్షణ శక్తిని అందించి.. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది సహజంగా చక్కెరలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రభావవంతమైన శక్తి వనరుగా ఉంటుంది.శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి అందివ్వడంలో సహాయపడుతుంది. డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో మంచి హెల్ప్ అవుతుందిచెరకురసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.చెరకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయిఆమ్లత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిదీనిలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్లు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఎవరు తీసుకోవాలంటే..?బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునే వారు చెరుకు రసాన్ని మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. చెరకు రసంలో అధిక స్థాయిలో సహజ చక్కెర ఉంటుందిఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.దీనిలో ఉండే అధిక చక్కెరలు, కేలరీల కంటెంట్ కారణంగా పరిమితంగా తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.కొబ్బరి నీరుదీన్ని ప్రకృతి స్పోర్ట్స్ డ్రింక్ అని పిలుస్తారు. ఇందులో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.చెరకు రసంలా కాకుండా, కొబ్బరి నీళ్ళల్లో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు నిర్వహణకు అనువైనదిగా చెబుతుంటారు. జీర్ణక్రియకు సహాయపడుతుందివిషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందిపేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందిఅదనపు నీటి నిలుపుదలని తగ్గించడంలో సహాయపడుతుంది.పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.రెండింటిలో ఏది బెటర్ అంటే..కొబ్బరి నీళ్ళలో చక్కెర తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన ఖనిజాలను అందిస్తుంది కాబట్టి ప్రతిరోజూ దీనిని తీసుకోవచ్చు. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల సోడియం అసమతుల్యతకు దారితీసే ప్రమదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అందువల్ల దీనిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. చెరకు రసం, కొబ్బరి నీరు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. ప్రతిది వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తికోసం అయితే చెరకు రసం బెస్ట్ ఆప్షన్. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీరు మంచిది. ఈ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్(Hydration)గా ఉండేలా చూసుకోండి. ఈ రిఫ్రెష్ పానీయాల ప్రయోజనాలను పొందేలా సరైన పద్ధతిలో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: 'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!) -
'మొక్క'వోని హాబీ.. సిరులు కురిపిస్తోంది..!
పచ్చని సీమలో ఎడారి మొక్కల అందాలు కనువిందు చేస్తున్నాయి. హాబీగా చేపట్టిన బోన్సాయ్ మొక్కల పెంపకం సిరులు కురిపిస్తోంది. ఎడారికి అందాలు అద్దే అడీనియం మొక్కలకు మండలంలోని వెలివోలు గ్రామం చిరునామాగా మారింది. ఈ కుగ్రామం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు అడీనియం మొక్కలు సరఫరా అవుతు న్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణజిల్లా వెలివోలు గ్రామానికి చెందిన కుంభా సాంబ శివరావు ప్రైవేటు స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడగా పనిచేసేవారు. 2020లో తన హాబీ మేరకు తెలిసిన వారి దగ్గర నుంచి 12 రకాల అడీనియం మొక్కలను తెచ్చి తన ఇంటి పెరటిలో నాటారు. కరోనా సంక్షోభం కారణంగా ఓ పక్క స్కూల్స్ మూతపడటం, మరోపక్క చేసేందుకు ఎక్కడా పని దొరక్కపోవటంతో తన దృష్టిని ఎడారి మొక్కల పెంపకంపై కేంద్రీకరించారు. తన పెరటిలో ఉన్న 12 అడీనియం మొక్కల నుంచి విత్తనాలను సేకరించి, వాటి నుంచి మొక్కలను పునరుత్పత్తి చేయడం ప్రారంభించారు. రెండు పద్ధతుల్లో మొక్కల పునరుత్పత్తి తన పెరటిలో ఉన్న అడీనియం మొక్కలతోపాటు థాయ్ల్యాండ్, కేరళ, తమిళనాడు నుంచి మరికొన్ని రకాల మొక్కలను సాంబశివరావు దిగుమతి చేసుకున్నారు. వాటి ద్వారా అరుదైన అడీనియం రకాలను సృష్టించడం ప్రారంభించారు. తన ఇంటి పెరట్లో 12 మొక్కలతో ప్రారంభమైన నర్సరీ నేడు 75 సెంట్ల స్థలంలో సుమారు 10 వేల అడీనియం మొక్కలతో విరాజిల్లుతోంది. ఇక్కడ మొక్కలను రెండు రకాలుగా పునరుత్పత్తి చేస్తున్నారు. అంటుకట్టు పద్ధతిలో ఇప్పటి వరకూ 100 రంగులకు పైగా పూలు పూసే మొక్కలను ఉత్పత్తి చేశారు. రెండో పద్ధతిలో విత్తనాలు నాటడం ద్వారా మరో 200 రకాల మొక్కలను సృష్టించినట్లు సాంబశివరావు తెలిపారు. 5 వేల మొక్కల విక్రయం సాంబశివరావు నర్సరీలో అరబికం, ఉబేసం, నోవా టాంజానియా, క్రిస్పం, స్వాజికం, సోమాలియన్స్, మల్టీఫ్లోరం, సోకోట్రానమ్, బహుమీనియం, తాయ్ సోకోట్రానమ్ వంటి రకాలు, ఉప రకాల మొక్కలు ఉన్నాయి. మూడు నెలల నుంచి పదేళ్ల వయసు మొక్కలు కొలువుదీరాయి. ప్రత్యేకంగా సృష్టించిన రకాల్లో టవర్ఫామ్, రూట్ ట్రెయిన్ప్లాంట్, అనకొండ వంటివి ఉన్నాయి. నాలుగేళ్లలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఢిల్లీ, మేఘాలయ ప్రాంతాలు మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఐదు వేలకు పైగా మొక్కలను ఎగుమతి చేశారు. తన SambaAdeniums అనే ఇస్టా్రగామ్, ఫేస్బుక్ అకౌంట్ల ద్వారా ఆర్డర్లు సేకరించి ఈ మొక్కలు సరఫరా చేస్తున్నట్లు సాంబశివరావు తెలిపారు. రూ.150 నుంచి రూ.25 వేల విలువైన, అరుదైన మొక్కలు తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ప్రతి నెలా రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ మొక్కల విక్రయం ద్వారా తనకు ఆదాయం వస్తోందని వివరించారు. మక్కువే పెట్టుబడి కరోనా తరువాత ఉద్యోగం లేక పనిదొరక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మొక్కల పెంపకంపై ఉన్న నా మక్కువను అడీనియం వెలల మొక్కల వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టా. 12 మొక్కలతో ప్రారంభించిన నర్సరీ 10 వేల మొక్కలకు విస్తరిం చింది. మారుమూల గ్రామమైన వెలివోలు నుంచి దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు మొక్కలు సరఫరా చేస్తున్నా. ఇష్టమైన అలవాట్లను వ్యాపార అవకాశాలుగా మార్చుకుంటే తప్పక విజయం సాధిస్తామని నా నమ్మకం. –కుంభా సాంబశివరావు, నర్సరీ యజమాని, వెలివోలు (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
సివిల్స్లో సక్సస్ కాలేదు..కానీ ఇవాళ ఓ కంపెనీ సీఈవో..!
ఒక్కోసారి మనం వెళ్లేదారిలో గమ్యం కానరాకపోవచ్చు. సక్సస్ అంత తేలిగ్గా రాకపోవచ్చు. లేదా మనం ఎంపిక చేసుకున్నదాంట్లో సక్సెస్ రాకపోవచ్చు అయినంత మాత్రాన ఓడిపోయినట్లు, అసమర్థులు కాదు. ఇంకోచోట గెలుపుని అందుకోవచ్చు. అది మనం ధైర్యంగా తీసుకునే నిర్ణయంలో ఉంటుంది. ఆ దిశగా ఫెయిల్యూర్స్ వైపు చూడకుండా వెళ్తే..సక్సస్ కచ్చితంగా మన కాళ్ల వద్దుకు వచ్చి తీరుతుందని చేసి చూపించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన స్ఫూర్తిదాయకమైన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు.అతడే చాయ్ సుత్తా బార్ సహ వ్యవస్థాపకుడు అనుభవ్ దూబే. సోషల్ మీడియా పోస్ట్లో యూపిఎస్సీ కల చెదరిపోవడంతో తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో తన స్నేహితుడితో కలిసి తీసుకున్న ఆ నిర్ణయం తన లైఫ్నే ఛేంజ్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఒక్కచోట విజయం అందుకోలేదని అక్కడే నిరీక్షించటం కంటే మరో చోట ప్రయత్నించి చూస్తే.. సక్సెస్ తథ్యం అంటున్నాడు. తాను యూపీఎస్సీకి ప్రిపేరవుతున్నప్పుడూ..వరుసగా వైఫల్యాలు పకరిస్తూనే ఉన్నాయి. ఇక రాసే ఛాన్స్ అయిపోయింది. ఇంకో పక్క జీవితంలో ఏం సాధించలేకపోయానన్న ఆత్మనూన్యత నిరాస నిస్ప్రుహలతో సతమతమవుతున్న తరుణంలో స్నేహితుడితో కలిసి వ్యాపారం చేయాలనే ఆలోచన తెరతీశాడు. ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా తెలియదు. కానీ ఏదో నమ్మకం, గెలవాలన్న పట్టుదల అంతే..ఆ కసితోనే చిన్ని టీ స్టార్టప్తో వచ్చాను. మట్టికప్పుల్లో టీ సర్వ్ చేయాలన్న విన్నూత్న ఆలోచనే తన స్టార్టప్ని విస్తరించేలా చేసింది. 300 కి పైగా నగరాల్లో 500కి పైగా టీ రిటైల్ చైన్గా విస్తరించింది. అదోకా బ్రాండ్లా తన చాయ్ సుత్తా బార్ స్టార్టప్ని తీసుకొచ్చాడు. ఇలా తన టీస్టాల్ పేరు వెరైటీగా ఉండటం కూడా ప్రజాదరణకు కారణమైంది. ఇండోర్కు చెందిన ఈ చాయ్ సుత్తా బార్ (CSB) అతిపెద్ద టీస్టాల్ విక్రేతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అలా తన బ్రాంచ్లన్నింటికి హెడ్గా సహా వ్యవస్థాపకుడిగా మారాడు. "తాను చదువులో బ్యాక్బెంచర్ని. చిన్నప్పటి నుంచి ఎలాంటి అవార్డులు, సర్టిఫికేట్లు పొందలేదు. కానీ ఈరోజు తన చాయ్ సుత్తా బార్ (CSB) క్యాబిన్ ంనిండా అవార్డులు, సర్టిఫికేట్లతో నిండిపోయింది. గెలుపురాలేదని అలానే ఉండిపోవద్దు..మరోచోట కచ్చితంగా అంతకుమించిన సక్సెస్ని చవిచూస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి అని విలువైన సందేశంతో పోస్ట్ని ముగించారు అనుభవ్ దూబే.This is for those who haven’t received any award or recognition in their life.Till the age of 25, I hadn’t received a single award. I was a backbencher. Awards, certificates se mera door door tak koi lena dena nahi tha.When I started feeling that I might not clear my UPSC… pic.twitter.com/CxX8sCVObR— Anubhav Dubey (@tbhAnubhav) March 18, 2025 (చదవండి: సునీతా విలియమ్స్ జీరో-గ్రావిటీ డైట్: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..) -
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్ఫాస్ట్లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్ని ఉపయోగించినట్లు సమాచారం.సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..విలియమ్స తన మిషన్లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..) -
ఏడేళ్లకే తైక్వాండో శిక్షకురాలిగా గిన్నిస్ రికార్డు..!
కొంతమంది చిన్నారులు అత్యంత చిన్న వయసులో అపారమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తుంటారు. వారి అద్భుతమైన ప్రతిభ ఎవ్వరినైనా ఆశ్చర్యంలో ముంచెత్తడమే గాక కట్టిపడేస్తాయి. అంతేగాదు వాళ్లని చూడగానే "పిట్ల కొంచెం కూత ఘనం" అనే ఆర్యోక్తి గుర్తుకురాక మానదు. అలాంటి ప్రతిభ పాటవాలనే ప్రదర్శిస్తోంది ఈ చిన్నారి. చిన్న వయసులో అత్యంత క్లిష్టమైన విద్యలో ఆరితేరి శెభాష్ అనిపించుకుంటోంది.ఆ చిన్నారే మధురైకి చెందిన ఏడేళ్ల సంయుక్త నారాయణన్. అసాధారణమైన తైక్వాండో నైపుణ్యాలతో యావత్తు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఆ అసాధారణమైన ప్రతిభతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది కూడా. అంతేగాదు గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్స్టా పోస్ట్లో ఏడేళ్ల 270 రోజుల వయసులో అతి పిన్న వయస్కురాలైన తైక్వాండో బోధకురాలిగా చరిత్ర సృష్టించిందని పేర్కొంది. ఈ చిన్నారి ఎంతో మంది పిల్లలకు ప్రేరణ. పిల్లలను క్రీడలకు సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే వారిలోని అపారమైన నైపుణ్యాలు వెలికివస్తాయనేందుకు ఈ చిన్నారే నిదర్శనం. అయితే నెటిజన్లు ఈ గిన్నిస్ పోస్ట్పై రకరకాలుగా స్పందించారు. కొందరేమో చిన్న వయసులో తైక్వాండో సాధన చేయడం హానికరం అని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం పిల్లలు అసాధారణమై విజయాలు అందుకోగలరని ప్రూవ్ చేసింది ఆ చిన్నారి అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..! తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..) -
ఆ పెర్ఫ్యూమ్ ప్రతి గంటకు 108 బాటిళ్లు సేల్ అవుతాయ్..!
పెర్ఫ్యూమ్లు తయారీలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆహ్లాదభరితమైన వాటి సువాసనే దాని తయారీ వెనుకున్న కృషని కళ్లకు కట్టేలా చూపిస్తుంది. అయితే ఈ పెర్ఫ్యూమ్ మాత్రం ఎన్ని కొత్త బ్రాండెడ్ పెర్ఫ్యూమ్లు వచ్చినప్పటికీ..దాని క్రేజ్కి సాటిలేదు ఏదీ..!. ఇప్పటికీ విక్రయాల పరంగా ఎవర్ గ్రీన్ ఇదే. గంటకు వందలకొద్దీ బాటిళ్లు సేల్ అయిపోతాయట. అంతలా ప్రజాదరణ పొందిన ఈ పెర్ఫ్యూమ్ తయారీ వెనుకున్న గమ్మత్తైనా స్టోరీ చూస్తే.."ప్రేమ" గొప్ప ఆవిష్కరణాలకు దారితీస్తుందా..! అనిపిస్తుంది. మరీ ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త..దాని తయారీకి ప్రేరేపించిన లవ్స్టోరీ వంటి వాటి గురించి తెలుసుకుందామా..!.ఆ పెర్ఫ్యూమ్ సృష్టికర్త ఫ్రెంచ్ పెర్ఫ్యూమర్ జాక్వెస్ గెర్లైన్. 1924లో దాన్ని తయారు చేశాడు. సువాసన పరిశ్రమలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ పెర్ఫ్యూమ్గా ఇది నిలిచింది. ఇప్పటికీ దాని అమ్మకాలు రికార్డు స్టాయిలోనే ఉంటాయట. ఎన్నెన్ని కొంగొత్త బ్రాండ్లు కూడా దానిముందు నిలవజాలవని అంటారు మార్కెట్ నిపుణులు. జాక్వెస్ని ఈ పెర్ఫ్యూమ్ని తయారు చేసేలా ప్రేరేపించింది మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ కథ అట. పారిస్ మహారాజుని సందర్శించినప్పుడే జాక్వెస్కి షాజహాన్ లవ్స్టోరీ గురించి తెలిసిందట. మొఘల్ చక్రవర్తి షాజహాన్కి తన భార్య ముంతాజ్ మహల్ అంటే ఎంతో ఇష్టమో తెలుసుకున్నాడట. ఆమె కోసమే షాలిమార్ గార్డెన్స్ని సృష్టించాడట. ఇక్కడ షాలిమార్ అంటే అత్యంత సువాసనా భరితమైన ఉద్యానవనం అని అర్థం. ఆఖరికి ఆమె తన నుంచి దూరమైపోయిందని, ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్ని కట్టించాడని తెలుసుకుని చలించిపోయాడట. షాజహాన్ ప్రేమ ఆ ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ని మనసును ఎంతగానో కదిలించిందట. అంతటి చక్రవర్తి గొప్ప ప్రేమను పొందిన మహారాజ్ఞీ ముంతాజ్ మహల్ గౌరవార్థం అత్యంత సువానభరితమైన సెంట్ని తయారుచేయాలని ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకున్నాడట. అలా జాక్వెస్ పరిపూర్ణమైన సువాసన కోసం వెల్వెట్ వెనిల్లా, గంధం,రెసిన్ బెంజోయిన్, ఐరిస్, ప్యాచౌలి, ధూపం వంటి కలయికతో మనసును కట్టిపడేసే అద్భుతమైన పెర్ఫ్యూమ్ని తయారు చేశాడు. అయితే దాని బాటిల్ డిజైన్ కూడా అంతే అద్భుతంగా ఉండాలని భావించి అసాధారణమైన డిజైన్ని ఎంపిక చేసుకున్నాడు. నీలిరంగు, ఫ్యాన్ ఆకారపు బాటిల్తో ఈ పెర్ఫ్యూమ్నీ తీసుకొచ్చాడు. ఈ బాటిల్ని బాకరట్ క్రిస్టల్తో తయారు చేశారట. అంతేగాదు ఈ పెర్ఫ్యూమ్ బాటిల్ డిజైన్ 1925లో పారిస్లో జరిగిన అంతర్జాతీయ అలంకార కళల ప్రదర్శన అవార్డు(ఇంటర్నెషనల్ డెకరేషన్ అవారడు)ని గెలుచుకుంది. ఈ రోజు వరకు కూడా ఈ ఫెర్ఫ్యూమ్ విక్రయాలు పెరుగుతూనే ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు 108 బాటిళ్లు అమ్ముడయ్యే పెర్ఫ్యూమ్గా రికార్డులకెక్కింది. (చదవండి: లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..! వైరల్గా ఐఐటీ స్టూడెంట్ పోస్ట్) -
లక్షల ప్యాకేజీ కంటే..వ్యాపారమే ముద్దు..!
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతంపైనే దృష్టిపెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ మహిళ కూడా ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐటీ, ఐఐఎం వంటి వాటిలలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసింది. అనుకున్నట్లుగానే ఓ పెద్ద కార్పోరేట్ కంపెనీలలో లక్షల ప్యాకేజీ ఉద్యోగ పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదాగా ఉందన్నే ఫీల్. ఏదో మిస్ అవుతున్నా..అన్న బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఓబ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా..? అన్నా ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరీ ఆ ఆమె తీసుకున్న నిర్ణయం లైఫ్ని ఎలా టర్న్ చేసింది ఆమె మాటల్లోనే చూద్దామా..!.ఆ మహిళే రాధిక మున్షి. ఆమె రెండు ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పూర్వ విద్యార్థిని. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని చీరబ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలుకా అనుభవం తనకు ఏ మిగిల్చాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. మరీ ఇంతకీ రాధికా తన నిర్ణయం కరెక్టే అంటోందా..?ఇన్స్టా పోస్ట్లో "తాను ఐఐటీ, ఐఐఎంలలో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవడమే నా ప్రథమ లక్ష్యం. అయితే నేను ఎన్నడు అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్లో అత్యథిక పారితోషకంతో ఉద్యోగం సాధించాను. అయితే ఏదో రోటీన్గా తన ఉద్యోగం లైఫ్ సాగిపోతుందంతే. ఆ తర్వాత ఎందుకనో ఇది కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనోరాను ప్రారంభించాను. మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసింది. అసలు జనాలు నా చీరలను ఇష్టపడతారా అని?..కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక.. సేల్స్ చేయడం ఈజీ అయిపోయింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా..అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ సగర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారు. కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలి, ఏం జరిగినా సహృద్భావంతో ముందుకెళ్లాలి. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది". వ్యవస్థాపకురాలు మున్షీ. కాగా, ఆమె 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్కి చాలామంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందిదనేది. View this post on Instagram A post shared by Anorah ✨ Contemporary sarees (@anorah.in) (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్స్టేషన్లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్: బాడీలో ఇన్ని మార్పులా..?
జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ ఇటీవల బాగా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే త్వరితగతిన బరువు తగ్గిపోతుండటంతో చాలామంది దాన్నే ఫాలో అవుతున్నారు. కొందరు తమ ట్రైనర్స్ ఆధ్వర్యంలో చేస్తుంటే మరికొందరూ అనాలోచితంగా ఫాలో అయ్యి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. అయితే ఓ న్యూట్రిషన్ ఈ డైట్ని ఫాలో అయ్యి తన అనుభవాన్ని పంచుకున్నారు. అందరూ చెబుతున్నట్లు బరువు తగ్గినా..బాడీలో ఎంత సడెన్ ఛేంజ్లు వస్తాయో తెలిపారు. స్లిమ్గా మారడం ఎలా ఉన్నా..లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందంటూ పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటంటే..పొట్ట వద్ద ఉన్న ఫ్యాట్ని తగ్గించాడానికి తాను ఏడు రోజులు జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ని తీసుకున్నట్లు తెలిపారు ప్రముఖ న్యూట్రిషన్ కోచ్ జస్టిన్ గిచాబా. అయితే ఏడు రోజుల్లో తన శరీరంలో పలు మార్పులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. బాడీ తేలికగా మారుతుంది. అయితే మిగతా పనులేవి చురుకుగా చేయలేకపోతున్న ఫీల్ కలిగిందని చెప్పారు. వర్కౌట్ చేస్తుంటే శక్తి సన్నగిల్లినట్లు అనిపించిందట. ఇదివరకటిలా ఏ బరువులు అంతగా ఎంతలేకపోయానని అన్నారు. బాడీలో ఫ్యాట్ తగ్గింది కానీ అనుహ్యంగా దాంతోపాటు బాడీలో ఉండే ఎనర్జీ కూడా తగ్గిపోయిందన్నారు. అలాగే మానసికంగా కూడా చాలా మార్పులు చూశానన్నారు. చివరికి తనకి ఇది ఆరోగ్యకరమైనది కాదని క్లియర్గా అర్థమైందన్నారు.జీరో కార్బోహైడ్రేట్స్ వల్ల సంభవించే మార్పులు..ఈ డైట్ని వరసగా ఏడురోజులు అనుసరించినప్పుడు సంభవించిన మార్పులను సవివరంగా ఇలా వివరించారు. గ్లైకోజెన్ క్షీణత: ఈ డైట్ ప్రారంభించిన మొదటి 24 నుంచి 48 గంటల్లో, శరీరం కండరాలు, కాలేయంలో నిల్వ చేయబడిన చక్కెర రూపంలో ఉన్న గ్లైకోజెన్ను ఉపయోగిస్తుంది. ప్రతి 1 గ్రా గ్లూకోజ్తో శరీరం 3 గ్రా నీటిని కలిగి ఉంటుంది కాబట్టి ుముందుగా శరీరం నీటి బరువును కోల్పోతుంది. కీటోసిస్ ప్రారంభమవుతుంది: గ్లైకోజెన్ నిల్వలు క్షీణించిన తర్వాత, శరీరం ప్రత్యామ్నాయ శక్తి వనరుగా కీటోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. అంటే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు ఖర్చవ్వడం మొదలవుతుందన్నారు. View this post on Instagram A post shared by Justin Gichaba | Nutrition Coach (@justin_gichaba) శక్తి, మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు: చురుకుదనం కోల్పోయి, తలనొప్పి, అలసట వంటివి దరిచేరుతాయి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా నిద్రలేమి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఆకలి తగ్గిపోవడం: కీటోన్లు తరచుగా ఆకలిని అణిచివేస్తాయి. ఈ డైట్లో కొంతమంది సహజంగానే కొన్ని రోజుల తర్వాత తక్కువ తింటారని అన్నారు. జీర్ణ మార్పులు: కార్బ్ మూలాల నుంచి ఫైబర్ లేకపోవడం మలబద్ధకం వచ్చి.. గట్ మైక్రోబయోటాకు దారితీయవచ్చు.ఇన్సులిన్ స్థాయిలు: పిండి పదార్థాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి లేదా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఒకరకంగా ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగపడవచ్చునని అన్నారు. ఎలా తీసుకుంటే బెటర్..జీరో కార్బో హైడ్రేట్లు బదులు తక్కువ శాతం కార్బోహైడ్రేట్లు ఉండేలా చూడండి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువుగా ఉండేలా చూసుకుంటే చాలని చెప్పారు. ఫైబర్తో కూడిన కార్మోహైడ్రేట్లు ఎప్పటికీ ఆరోగ్యదాయకమైనవే అని అన్నారు. మన శరీరం ధర్మానికి అనుగుణంగా అన్ని సమతుల్యంగా తీసుకోవాలని సూచించారు. చివరగా కార్బోహైడ్రేట్లు తీసుకోకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఫైబర్ అధికంగా ఉండే, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఎనర్జీని కోల్పోయే ప్రమాదం ఉండదు. పైగా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని నమ్మకంగా చెప్పారు. అంతేగాదు సమతుల్య ఆహారం అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మేలని చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.(చదవండి: మహిళా వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?) -
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
టెలివిజన్ షోలో హైలెట్గా 'కివీ ఐస్ క్రీం డెజర్ట్'! సెలబ్రిటీ చెఫ్లే ఫిదా
స్టార్ ప్లస్లో మంచి ఫేమస్ అయిన షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ ఇండియా. ఇది పాకకళకు సంబంధించిన రియాలటీ షో. ఈ ఈవెంట్లో ప్రముఖ సినీ సెలబ్రిటీలు, మాస్టర్ చెఫ్ల సమక్షంలో కంటెస్టెంట్లు తమ పాక కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దగ్గర దగ్గర 12 నుంచి 15 మంది దాక పోటీదారులు పాల్గొంటారు. అయితే ఈ సారి మాస్టర్ చెఫ్ ఇండియా సీజన్ 1లో ఓ వైరైటీ వంటకం ఆ షో న్యాయనిర్ణేతలని కట్టిపడేసింది. తప్పనిసరిగా ఆ డెజర్ట్ని తమ భోజనంలో భాగంలో చేసుకుంటామని అన్నారు. అదేంటో చూసేద్దామా..:తన పాక నైపుణ్యంతో న్యాయనిర్ణేతను ఫిదా చేసింది అర్చన గౌతమ్ అనే పోటీదారురాలు. ఆమె ఈ సీజన్ పోటీలో జడ్జీలను తన పాక కళతో అమితంగా జడ్జీలను ఆకట్టుకుంది. వండిన విధానమే గాక సర్వ్ చేసే తీరు హైలెట్గా నిలిచింది. అయితే ఆమె ఇటీవల జరిగిన ఎపిసోడ్లో చేసిన వంటకంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.ఆ షో న్యాయనిర్ణేతలు కూడా ఆ వంటకం చేసిన తీరు, ప్రెజెంట్ చేసిన విధానానికి ఫిదా అయ్యి ప్రశంసలతో ముంచెత్తారు. మరీ ఆ కంటెస్టెంట్ తయారు చేసిన వంటకం ఏంటంటే.. కివి ఐస్ క్రీం:ఆ షోలో ఆమె కివి ఐస్క్రీంని తయారు చేసింది. ఆకృతిపరంగానే కాకుండా తయారు చేసిన విధానం కూడా వేరెలెవెల్. కివిని పచ్చిపాలతో కలపి, అల్లం, పుదీనా, మిరపకాయలతో అత్యద్భుతంగా తయారుచేసింది. దాన్ని క్యాండీ ఫ్లాస్తో అందంగా సర్వ్ చేసింది. చూడటానికి ఏదో కళాత్మక ఖండంతో కలగలిసిన వంటకంల ఆకర్షణీయంగా ఉంది. ఇక ఆ షోలో సెటబ్రిటీలు ఫరా ఖాన్, రణవీర్ బ్రార్ , ప్రముఖ చెఫ్ ఈ వంటకాన్ని ఎంతో బాగుందంటూ ప్రశంసించారు. అంతేగాదు తాము ఇక నుంచి తమ భోజనంలో ఈ వంటకం ఉండేలా చూసుకుంటామని అన్నారు. కొన్ని వంటకాల తయారీ మనలో దాగున్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీస్తాయంటే ఇదే కదూ. అందులోనూ ఆ కంటెస్టెంట్ ఆరోగ్యకరమైన వాటితోనే రుచికరమైన డెజర్ట్ చేసి మరిన్ని ఎపిసోడ్లు కొనసాగేలా అర్హత పొందింది. View this post on Instagram A post shared by Viral Duniya (@viral_duniya_247) (చదవండి: కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!) -
కృత్రిమ గుండెతో వంద రోజులకు పైగా బతికిన తొలి వ్యక్తి..!
కృత్రిమంగా గుండెని తయారు చేయడం అనేది వైద్యశాస్త్రంలో ఓ అద్భుతం. పైగా దాన్ని ఒక మనిషికి అమర్చి సమర్థవంతంగా పనిచేసేలా చూడటం మరో అద్భుతం. అయితే అది ఏ కొన్ని గంటలో కాదు ఏకంగా వంద రోజులకు పైగా ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలిపింది. దాత దొరికేంత వరకు ఊపిరిని అందించింది. గుండె వైఫల్యంతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను రేకెత్తించింది. వైద్య చరిత్రలోనే ఈ కేసు ఓ అద్భుతమని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కృత్రిమ గుండెని ఎవరికీ అమర్చారు. దాని విశేషాలేంటో చూద్దామా..!.టైటానియంతో తయారు చేసిన కృత్రిమ గుండెతో వందరోజులకు పైగా జీవించిన తొలి వ్యక్తిగా ఆస్ట్రేలియన్ న్యూ సౌత్ వేల్స్ చరిత్ర సృష్టించాడు. ఈ 40 ఏళ్య వ్యక్తికి గత నవంబర్లో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆస్పత్రిలో టైటానియంతో తయారు చేసిన బివాకర్ అనే పరికరాన్ని అమర్చారు. ఆయన తీవ్రమైన గుండె వైఫల్యంతో బాధపడుతుండటంతో విన్సెంట్ ఆస్పత్రి వైద్యులు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ పాల్ జాన్జ్ నేతృత్వంలో దాదాపు ఆరుగంటలు శ్రమించి ఈ కృత్రిమ గుండె ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేశారు. ఈ ఆధునాత వైద్యాన్ని అందించిన తొలి వైద్య బృందం తామే కావడం గర్వంగా ఉందన్నారు వైద్యుడు జాన్జ్. అంతేగాదు ఇలా ప్రపంచంలో కృత్రిమ టైటానియం గుండెని పొందిన ఆరవ వ్యక్తి అతడేనని చెప్పారు. అతను ఈ గుండెతో పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండా వందరోజులకు పైగా బతికి బట్టగట్ట గలిగాడన్నారు. అతడికి ఈ నెల ప్రారంభంలో ఒక దాత గుండెని అమర్చినట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె ఇంప్లాంట్ ప్రక్రియని "అద్భుతమైన క్లినికల్ విజయం"గా ప్రకటించారు ఆస్ట్రేలియన్ వైద్య బృందం.ఏంటీ టైటానియం బివాకర్..క్వీన్స్ల్యాండ్లో జన్మించిన డాక్టర్ డేనియల్ టిమ్స్ ఈ గుండె మార్పిడి బివాకర్ పరికరాన్ని కనుగొన్నారు. దాత గుండె మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు రోగులను సజీవంగా ఉంచడానికి ఇది వారధిలాగా పనిచేస్తుంది. ఇది నిరంతర పంపుగా పనిచేస్తుంది. దీనిలో అయస్కాంతంగా సస్పెండ్ చేసిన రోటర్ శరీమంతా సాధారణ పల్స్లో రక్తం ప్రసరించేలా చేస్తుంది. ఇలా సస్పెండ్ చేసి ఉన్న అయస్కాంతం చర్మం వెలుపల ఉన్న త్రాడు మాదిరి పరికరంతో బయట పోర్టబుల్ కంట్రోలర్కు కలుపుతుంది. పగటిపూట బ్యాటరీలతో పనిచేస్తుంది. రాత్రిపూట మెయిన్స్లో ప్లగ్ చేసి ఉంటుంది. ఇక్కడ టైటానియంని ఉపయోగించడానికి ఇది తుప్పు నిరోధకత కలిగినది, అలాగే బలమైన జీవన వ్యవస్థకు అనూకూలమైనది కావడమే. ప్రస్తుతం ఈ పరికరాన్ని తాత్కాలిక ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు..భవిష్యత్తులో ఇది ఇతర అనారోగ్య పరిస్థితుల కారణంగా గుండె మార్పిడికి అర్హత లేనివారికి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం ఆ దిశగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఈ కృత్రిమ గుండె పనితీరు కాల వ్యవధి దాత గుండె కంటే చాలా తక్కువ అనేది గమనించదగ్గ విషయం.(చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
ఇస్రో శాస్త్రవేత్త ఆధ్యాత్మిక సేవ..! బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని..
ఆయనో శాస్త్రవేత్త.. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇష్రో)లో పనిచేసి, వృత్తిలో తన ప్రతిభను కనబర్చిన విజ్ఞాన వేత్త. భారతీయ సాహిత్యం, సంస్కృతి సంప్రదాయంలోని విశిష్టతను అవసోపన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందులో భాగంగానే తేనెలొలికే తెలుగు పదాలతో పుణ్య చరితుడు బమ్మెర పోతన రచించిన పద్య భాగవతాన్ని ఈ తరానికి మరింత చేరువ చేయాలనుకున్నారు. అంతటి బృహత్ గ్రంథమైన శ్రీమద్భాగవతాన్ని అచ్చు పుస్తక రూపంలో, ఇంటర్నెట్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయనే.. న్యూనల్లకుంటకు చెందిన మందడి కృష్ణారెడ్డి. – ఇప్పటికే వివిధ రూపాల్లో లభ్యమవుతున్న భాగవత సంబంధిత సమాచారానికి ఆయన చేసిన ఆధునాతన రూపకల్పన ఈతరం భాగవత విశ్లేషకులకు, ఔత్సాహికులకు సులభతరం చేసింది. ఒక ఉన్నత శ్రేణి శాస్త్రవేత్తగా ఇస్రో ఐఐఎస్యూ తిరువనంతపురం నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. తర్వాత విశ్రాంత సమయాన్ని దైవకార్యంగా భావించి సాహిత్య విశిష్టతలను కలగలిపి ఉన్న శ్రీమద్భాగవతాన్ని అందరికీ సులువైన మార్గంలో అందించడానికి సమగ్ర సంకలన రూపకల్పనకు నాంది పలికారు. ఇందులో భాగంగా సాంకేతిక అభివృద్ధి ఆకాశాన్ని అంటుతున్న ఈ కాలంలో వినూత్నంగా ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ అనే మార్గాన్ని ఎంచుకుని శ్రీమద్భాగవతంలోని 12 స్కందాలు, 688 ఘట్టాలలోని 10,061 పద్యాలకు భావాన్ని, పదోచ్చారణ నేర్చుకోవడానికి వీలుగా ఆ పద్యాల ఆడియోను రూపొందించారు. ప్రతి పద్యంలోని పదాలకు అర్థం, ఆ పద్యానికి సంబంధించిన వ్యాకరణ అంశాలు ఛందస్సు, అలంకారాల వివరాలన్నీ ఒక పద్యం నుంచి మరొక పద్యానికి విషయ సూచిక ఆధారంగా సులువుగా వెళ్లేలా సమకూర్చారు. ఇవన్నీ కేవలం ఒక ప్రధాన పవర్ పాయింట్ స్లయిడ్ నుంచి ఒక్క క్లిక్తో సాధ్యమయ్యేలా చేశారు. సాహిత్యం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథ పఠనం కష్టతరమైన ప్రస్తుత కాలంలో ఇంత సులభతరంగా పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం అమృతప్రాయమైన విషయంగా భావిస్తున్నారు. ఈ అనితర సాధ్యమైన సాధనం ఉపయోగించడంలో ఒక ప్రధాన స్లయిడ్ నుంచి వేల పద్యాలకు సంబంధించిన పేజీలకు ఏర్పరచిన హైపర్ లింక్స్ ద్వారా సులువుగా వెళ్లేలా విస్తృతమైన ‘స్లయిడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్‘ చేయటం ఇదే ప్రథమం. మందడి చెన్నకృష్ణారెడ్డి, రంగనాయకమ్మ పుత్రుడైన కృష్ణారెడ్డి ఒకప్పటి ఆర్ఈసీ ఇప్పటి నిట్ వరంగల్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్, ఐఐటీ చెన్నై నుంచి ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం పరిశోధనలోనూ తన ప్రతిభతో ఎన్నో అవార్డులు అందుకున్నారు.సమగ్ర సంకలనంగా రూపొందించా.. ఈ సంకలనానికి, ‘శ్రీభాగవత సుధానిధి‘ అని నామకరణం చేశాను. ఎందరో మహానుభావులు పద్య భావాన్ని, ఆ పద్యాలకు సంబంధించిన ఎన్నో విశేషాలను క్రోడీకరించి అందుబాటులోకి తెచ్చారు. కానీ ఆ అంతర్యామి లీలా విశేష గ్రంథమైన శ్రీమద్భాగవతానికి సంబంధించి గ్రంథ విశేషాలను ఒక సమగ్ర సంకలనంగా రూపొందించాను. తెలుగు భాష, గ్రంథ పఠనంపై ఆసక్తి మాత్రమే అర్హతగా విద్యార్థులు మొదలుకొని పెద్దల వరకు ఎవరైనా అమృత తుల్యమైన పోతనామాత్యుల విరచిత శ్రీమద్భాగవత గ్రంథ విశేషాలను సులువైన మార్గంలో ఆకళింపు చేసుకునేలా రూప కల్పన చేశాను. ఈ ప్రయత్నంలో భాగంగా శ్రీమద్భాగవత పద్యాలు, ఆ పద్యాల భావాన్ని, పదోచ్చారణ, ప్రతిపదార్థం, పద్యాలలోని అలంకార విశేషాలు విడివిడిగా ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలలో లభ్యమవుతున్న వాటిని సమగ్ర సంకలనంగా మార్పు చేశాను. – కృష్ణారెడ్డి (చదవండి: మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!) -
మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్ ప్రియాంక తారే..!
జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చత్తీస్గఢ్లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్సీసీలో హెచ్ఆర్, సీఎస్ఆర్గా పలు ఈవెంట్లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు . ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది. (చదవండి: 'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!) -
'విందోదయం': బ్రేక్ ఫాస్ట్లకు కేరాఫ్ ఈ టిఫిన్ సెంటర్లు..!
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్లకు లంచ్, డిన్నర్లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్లకు కేరాఫ్గా మారింది. లేట్నైట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ.. టేస్టీ ఫుడ్ ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని.. కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్వీఎస్ రోడ్లో ఉన్న ఈ సెంటర్ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే.. సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్లో ఉన్న ఉడిపి ఉపహార్కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.మాదాపూర్లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్లు, సలాడ్లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది. పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్ఫాస్ట్లను కోరుకునేవారు బంజారాహిల్స్లోని రాయల్ టిఫిన్ సెంటర్ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి. ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. నగరంలోని దారుల్షిఫా, చట్టా బజార్లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది. (చదవండి: -
ఇన్ఫెక్షన్: సెల్యు'లైట్' తీసుకోకండి..!
ఓ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మానికి సెల్యులైటిస్ అనే కండిషన్ వస్తుంది. ఇందులో కాలు లేదా చేయి విపరీతంగా వాచిపోయి, చర్మం ఎర్రగా అలాగే బాధితులకు వేడిగా అనిపిస్తుంటుంది. ముట్టుకుంటేనే నొప్పి (టెండర్నెస్)తో బాధాకరంగా ఉంటుంది. ఇది చేయి లేదా కాలు అంతటికీ వేగంగా వ్యాపిస్తుంది. ఈ దశలో కూడా చికిత్స సరిగా అందకపోతే చేయి/ కాలికి మాత్రమే పరిమితమైన ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ శరీరమంతా పాకి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టగల ఈ సెల్యులైటిస్పై అవగాహన కోసం ఈ కథనం.సెల్యులైటిస్ సాధారణంగా దేహంలోని కాలు, చేయితో పాటు ఏ భాగానికైనా రావచ్చు. కానీ ఈ కండిషన్ కాలిలో కనిపించడమే ఎక్కువ. సెల్యులైటిస్తో ప్రభావితమైన కాలు బాగా వాచిపోతుంది. ఎర్రబారుతుంది. ఇలా జరగడాన్ని ఎరిథిమా అంటారు. వాపు వచ్చి ముట్టుకుంటే మంట (ఇన్ఫ్లమేషన్)తో, లోపల వేడిగా ఉన్న భావన కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్తో కూడిన సెల్యులైటిస్ను తీవ్రమైన పరిస్థితిగానే పరిగణించాలి. అది కేవలం పై చర్మానికి మాత్రమే పరిమితమైందా లేక లోపలి పొరలూ ప్రభావితమయ్యాయా అన్నదానిపై పరిస్థితి తీవ్రత ఆధారపడి ఉంటుంది. లోపలికి వ్యాపించిన కొద్దీ సెల్యులైటిస్లోని ఇన్ఫెక్షన్ రక్తప్రవాహంతో కలిసి లింఫ్నోడ్స్కూ వ్యాపిస్తుంది. సెల్యులైటిస్ కనిపించే సూక్ష్మక్రిములివే... సెల్యులైటిస్ సోకిన కాలు నునుపుదనంతో ఎర్రగా మెరుస్తూ కనిపిస్తుంది. అంతకు ముందే కాలికేదైనా గాయం ఉండటం, చర్మం చీరుకుపోయి ఉండటం వంటివి జరిగితే దానికి సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. చర్మానికి ఏ కారణంగానైనా పుండ్లు పడి అవి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా చేరడంతో పాటు అది రెండో (సెకండరీ) దశకు చేరితే... అది సెల్యులైటిస్కు దారితీయవచ్చు. ఇందుకు చాలారకాల సూక్ష్మక్రిములు (బ్యాక్టీరియా) కారణమవుతాయి. ఉదాహరణకు... స్ట్రెప్టోకాక్సీ, స్టెఫాలోకాక్సీ, సూడోమొనాస్ ఎస్పీపీ, బ్యాక్టీరియోడీస్ వంటివి వీటిల్లో ప్రధానమైనవి. ఇవిగాక మరికొన్ని అప్రధాన రకాలకు చెందిన సూక్ష్మజీవులూ ఉంటాయి. సెల్యులైటిస్లో ఎలా వస్తుందంటే?వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకుపోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది. వాతావరణంలో ఉండే అనేక సూక్ష్మజీవులను చర్మమే మొదట ఎదుర్కొంటుంది. చర్మం మన లోపలి అవయవాలన్నింటినీ కప్పుతూ ఆ సూక్ష్మజీవులన్నింటి నుంచి మనకు రక్షణ కలిగిస్తుంటుంది. అయితే చర్మంలో ఎక్కడైనా గాయాలైనా, లేదా చీరుకు΄ోయి ఉన్నా బయటి సూక్ష్మజీవులు ఆ ప్రాంతంలోంచి... చర్మాన్ని దాటి లోపలికి ప్రవేశించగలుగుతాయి. ఉదాహరణకు అథ్లెట్స్ ఫూట్ (టీనియా పెడిస్) వంటి కండిషన్లో చర్మానికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించడమన్నది బ్యాక్టీరియాకు సులభంగా సాధ్యమవుతుంది. ఆ వెంటనే చర్మం తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ / ఇమ్యూన్ సిస్టమ్ చర్మాన్ని ఎర్రబారుస్తుంది. ఇలా జరిగిన తర్వాత జరిగే పరిణామం సెల్యులైటిస్కు దారితీస్తుంది.చర్మం రంగు మారడం: సెల్యులైటిస్ వచ్చిన భాగంలో చర్మం రంగు మారిపోతుంది. ప్రధానంగా ఎర్రబారుతుంది. అప్పటికే ఎర్రటి చర్మం ఉన్నవారిలో ఇలా ఎర్రబారడం జరిగితే దాన్ని గుర్తుపట్టడం కాస్తంత కష్టమవుతుంది. అదే కాస్త నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ రంగు మార్పును వెంటనే గుర్తుపట్టడం సాధ్యమతుంది. దాంతో తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది. వాపు రావడం : సాధారణంగా వాపు పాదం నుంచి మొదలై పై వైపునకు వ్యాపిస్తుంటుంది. కొన్నిసార్లు పిక్కల నుంచి కూడా వాపు మొదలు కావచ్చు. ∙కాలికి ఎరుపుదనం వచ్చి బాగా వాచిన కారణంగా అది బాగా నునుపుగా అనిపిస్తూ, మెరుస్తూ కనిపిస్తుంది. వాపు కారణంగా చర్మం బాగా బిగుసుకు΄ోయినట్లుగానూ అనిపిస్తుంటుంది. ∙ముట్టుకుంటే మంట / నొప్పితోపాటు లోపల వేడిగా ఉన్నట్లుగానూ అనిపిస్తుంటుంది. ఈ కాలివాపు రాక ముందు ఫ్లూ జ్వరం వచ్చినప్పటి లక్షణాలతో... చలితో కూడిన జ్వరం కూడా కనిపించవచ్చు. ∙రక్త పరీక్ష చేయిస్తే తెల్లరక్తకణాల సంఖ్య బాగా పెరిగి కనిపిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందనడానికి ఇది ఒక సూచన. ∙వాపు వచ్చిన కాలి భాగంలోని పుండ్ల నుంచి పసుపు రంగుతో కూడిన చీము స్రవిస్తుంటుంది. సెల్యులైటిస్కు తావిచ్చే కండిషన్స్చర్మానికి గాయమై అది దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం. చర్మం చీరుకు΄ోయి ఆ గాయం చాలాకాలం మానక΄ోవడం, కాలి మీద పుండ్లు రావడం. దీర్ఘకాలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండి, అవి దీర్ఘకాలికంగా మానకుండా ఉండటం (ప్రధానంగా కాలికి... అథ్లెట్స్ ఫూట్ వంటివి). ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మసంబంధమైన రుగ్మతలతో బాధపడేవారిలో చర్మం పగుళ్లుబారి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. కొద్దిగా అరుదుగా దీర్ఘకాలికంగా ఉండే తీవ్రమైన మొటిమల కారణంగా కూడా. ∙చర్మం పగుళ్లుబారేలా చేసే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉందాహరణకు చికెన్పాక్స్, షింగిల్స్ వంటి జబ్బులు వచ్చాక సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ ఉండి కాలిపై దీర్ఘకాలికంగా పుండ్లు పడటం (డయాబెటిస్ ఉన్నవారిలో సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ).రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు ఉండటం (వేరికోసిక్ వెయిన్స్ వంటివి). పెరిఫెరల్ వ్యాస్క్యులార్ డిసీజ్ వంటి జబ్బుల కారణంగా. శరీరంలో లింఫ్ ప్రవాహం తగినంతగా లేకపోవడం వల్ల. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఉండేవారిలో. (అంటే... క్రానిక్ హెపటైటిస్, సిర్రోసిస్ వంటి జబ్బులు ఉన్నవారిలో సెల్యులైటిస్కు అవకాశాలెక్కువ). స్థూలకాయం ఉన్నవారిలో. ఏదైనా శస్త్రచికిత్స తర్వాత ఏర్పడ్డ గాయం కారణంగా. చాలా సందర్భాల్లో కాలిన గాయాల కారణంగా. చర్మంలో ప్రవేశపెట్టే సూదుల కారణంగా (ఇంట్రావీనస్గా మందులను పంపడానికి అమర్చే క్యాన్యులా వంటివి), ట్యూబ్స్, ఆర్థోపెడిక్ కేసుల్లో చర్మంలోపల అమర్చే ప్లేట్లు, రాడ్ల వంటి వస్తువుల కారణంగా. ఎముకలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల. కొన్ని కీటకాల కాటు కారణంగా (ప్రధానంగా సాలీడు వంటివి); కొన్ని జంతువులు కరవడం వల్ల. దీర్ఘకాలికంగా మందులు వాడుతున్నవారిలో వాళ్ల వ్యాధినిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వల్ల... ఇలాంటి అనేక కారణాల వల్ల సెల్యులైటిస్ రావచ్చు. ఒకసారి సెల్యులైటిస్ సోకాక...ఒకసారి సెల్యులైటిస్ సోకిన తర్వాత అది వ్యాపిస్తూ ఉంటుంది. ఎలాంటి స్రావాలు లేకుండా కేవలం వాపు మాత్రమే కనిపించే దాన్ని ‘డ్రై సెల్యులైటిస్’ అంటారు. ఈ దశలో సెల్యులైటిస్కు సరైన చికిత్స తీసుకోక΄ోతే అది వ్యాపించిన మేరకు కణజాలం నాశనమవుతుంటుంది. డ్రై సెల్యులైటిస్లో చర్మంపై ఎర్రటి మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. డ్రై సెల్యూలైటిస్కు వెంటనే చికిత్స తీసుకోకపోతే చర్మంపై సన్నటి పగుళ్ల వంటివి ఏర్పడి అందులోంచి నీరు స్రవిస్తుంటుంది. దీన్నే వెట్ సెల్యులైటిస్ అంటారు.సాధారణంగా కాలి బొటనవేలికి దీర్ఘకాలంగా ఉండే గాయం వల్ల సెల్యులైటిస్ వస్తుంటుంది. సెల్యులైటిస్ కాలి భాగం నుంచి పైకి విస్తరిస్తూపోతుంటే దాన్ని అసెండింగ్ సెల్యులైటిస్ అంటారు. సాధారణంగా స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇలా జరుగుతుంది. సెల్యులైటిస్ అన్నది ఒక కాలికే కనిపిస్తుంటే దీన్ని యూనిలేటరల్ సెల్యులైటిస్గా పేర్కొంటారు. ఈ యూనిలేటరల్ సెల్యులైటిస్ చాలా సాధారణం. కానీ కొంతమందిలో రెండుకాళ్లకూ సెల్యులైటిస్ కనిపించ వచ్చు. కాకపోతే ఇది కాస్తంత అరుదు. ఇలా రెండుకాళ్లకూ సెల్యులైటిస్ రావడాన్ని ‘బైలేటర్ కాంకరెంట్ సెల్యులైటిస్’ అంటారు. చికిత్స యాంటీబయాటిక్స్తో చికిత్స స్ట్రెప్టోకాక్సి, స్టెఫాలోకాక్సి బ్యాక్టీరియాను మట్టుపెట్టే యాంటీబయాటిక్స్ మందులను నోటి ద్వారా తీసుకోవడం లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో నరానికి ఇంజెక్షన్ ద్వారా పంపడం వంటి చికిత్స అందిస్తారు.వ్యాయామం (ఫిజియోథెరపీ) వాపు తగ్గేలా కాలి వేళ్లు కదిలించే కొన్ని వ్యాయామాలు చేయడం అవసరమవుతుంది. కొన్ని జాగ్రత్తలుసెల్యులైటిస్ను నివారించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కాలిపై ఎలాంటి గాయాలూ లేకుండా చూసుకోవడం.కాలి గోళ్లను తీసుకునే సమయంలో గాయం కాకుండా జాగ్రత్త వహించడం.కీటకాలు, జంతువులు కుట్టకుండా / కరవకుండా వాటిని దూరంగా ఉంచడం.కాలిన గాయాలైనప్పుడు అవి పూర్తిగా తగ్గే వరకు జాగ్రత్తగా ఉండటం.కాలికి గాయాలు ఉన్నవారు, కాలిన గాయాలైన వారు మురికినీళ్లలోకి వెళ్లక΄ోవడం. గాయమైన కాలితో సముద్రపు నీటిలోకి వెళ్లకపోవడం. కాలికి సరిగ్గా సరిపోయి, సౌకర్యంగా ఉండే పాదరక్షలు / షూస్ ధరించడం. (కాలికి గాయాన్ని చేస్తూ, బాధను కలిగించే షూస్ను బలవంతంగా తొడగకూడదు. చెప్పులు లేదా షూ కరవడం, కాలికి గాయం చేయడం వంటివి జరుగుతుంటే ఆ పాదరక్షలను తొడగడం మానేసి, సౌకర్యంగా ఉండే వాటినే తొడుక్కోవాలి. పాదరక్షల వల్ల కాలికి గాయాలవుతున్నాయా అంటూ తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్తో బాధపడేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి) అథ్లెట్స్ ఫూట్ వంటి ఇన్ఫెక్షన్తోపాటు అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్కు తగిన చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గేలా జాగ్రత్త వహించడం వేరికోస్ వెయిన్స్ వంటి సమస్య వస్తే అది తగ్గేలా చికిత్స తీసుకోవడం సెల్యులైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం. చివరగా... సెల్యులైటిస్ వచ్చి, అది ప్రాణాంతకం అవడం కంటే ... కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో అసలది రాకుండానే చూసుకోవడం మేలు.డా. స్వప్నప్రియ, సీనియర్ డర్మటాలజిస్ట్డా.జి. వెంకటేష్ బాబు, సీనియర్ కన్సల్టెంట్, ప్లాస్టిక్ – కాస్మటిక్ సర్జన్ (చదవండి: ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?) -
ఐదు వందల ఏళ్ల నాటి బావి..నిర్మించిన తీరుకి విస్తుపోవాల్సిందే..!
పురాతన శిల్పాలు, ఆనాటి కట్టడాలు గొప్పగొప్ప కథలెన్నో చెబుతుంటాయి. ఆనాటి రాజరికపు దర్పాన్ని, ప్రజా జీవన శైలిని కళ్లకు కడుతుంటాయి. అలాంటిదే కర్నూలు జిల్లా మండల కేంద్రం మద్దికెరలోని భోజరాజు బావి. ఇది సుమారు 5 వందల ఏళ్ల క్రితం పెద్దనగరి యాదవరాజులైన భోజరాజు తవ్వించారు. నాటి నుంచి నేటికీ గ్రామస్థులు, ఆ బావి నీటిని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 70 అడుగుల లోతు, 80 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ బావి ఎన్నో ప్రాచీన విగ్రహాలతో ఆకట్టుకుంటుంది. ఈ బావిని ఎలాంటి మట్టి, ఇతర సామగ్రిని వినియోగించకుండా రాతి మీద రాతిని పేర్చి, హెచ్చుతగ్గులు కనిపించకుండా కట్టిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాతి కట్టడంపై దేవతామూర్తులు, నర్తకుల నృత్యభంగిమలు, జలచర జీవుల రూపాలు, జలకన్యలు ఇలా వందలకొద్ది శిల్పాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. పదేళ్ల క్రితం వరకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ బావి నీటినే వినియోగించేవారు. కాలక్రమేణా నీళ్ల వ్యాపారం మొదలైననాటి నుంచి, ఎవరికి వారు, వాటర్క్యాన్స్ కొనుక్కుంటూ ఈ బావి నీటిని గృహ అవసరాలకు వాడటం మానేశారు. ప్రస్తుతం ఈ నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. ‘అప్పట్లో ఈ నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఉండేవి కావు, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తేవి కావు’ అని కొందరు గ్రామస్థులు చెబుతున్నారు.కరువులోనూ ఆదుకుంది..దాదాపు 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు మా వంశస్తులు నిర్మించిన భోజరాజు బావి ప్రజల దాహార్తిని తీర్చింది. ప్రస్తుతం 15 ఎకరాల వ్యవసాయ భూమికి ఈ బావి నీరే ఆధారమైంది--విజయ రామరాజు జమేదార్ మద్దికెరపి.ఎస్.శ్రీనివాసులు నాయుడు, కర్నూలు డెస్క్టి.వెంకటేశ్వర్లు, మద్దికెర(చదవండి: ఈ తిను 'బండారం' గురించి తెలుసుకోండి..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?
హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.'జన్యుపరమైన కారణాల వల్లే'మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు వైద్యులు. (చదవండి: అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!) -
అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!
ఇంతవరకు ఎంతోమంది ఐఏఎస్ అధికారులను చూసి ఉండుంటారు. అతెందుకు టీనా దాబి, అమిత్ లోధా వంటి ఎందరో సెలబ్రిటీ హోదాని పొందిన అధికారులను చూశాం. కానీ ఈ ఐఏఎస్ అధికారి గురించి విని ఉండటం అత్యంత అరుదు. ఒక్క రూపాయే జీతం తీసుకున్న ఐఏఎస్ అతడు. కానీ కలెక్టర్లందరి కంటే అత్యంత ధనిక కలెక్టర్ ఆయన. ఎవరా కలెక్టర్ అంటే..అతడే ఐఏఎస్ అమిత్ కటారియా. ఆయన హర్యానాలోని గురుగ్రామ్లో ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి కుటుంబం కోట్లలో వార్షిక టర్నోవర్తో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రన్ చేస్తోంది . అంతేగాదు ఆ వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా విస్తరించి ఉంది. అయితే కటారియా కుటుంబ వ్యాపారాన్ని పక్కకుపెట్టి మరీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్ సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. అలా కటారియా ఐఏఎస్ అయిన ధనవంతుడుగా నిలిచాడు.. ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్.. అమిత్ కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బి.టెక్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, కటారియా UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE)కి ప్రిపేరవ్వడం ప్రారంభించారు. చివరికి 2003లో సివిల్స్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడై ఐఏఎస్ అయ్యారు. ఆయన ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించి తన కలను సాకారం చేసుకున్నారు. చత్తీస్గడ్ కేడర్లో కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. అయితే ఐఏఎస్ అమిత్ కటారియా సివిల్ సర్వీసెస్లో చేరినప్పుడు కేవలం రూ. 1 జీతమే తీసుకునేవారని సమాచారం. అందుకు కటారియా తాను దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఐఏఎస్ అయ్యానని అంటుండేవారని అంతరంగికులు చెబుతున్నారు. అమిత్ కటారియా 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి రావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇది ప్రోటోకాల్కు విరుద్ధం. ఆ సమయంలో కటారియా ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లా జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు. వైవాహిక జీవితం..ఐఏఎస్ అమిత్ కటారియా వృత్తిరీత్యా వాణిజ్య పైలట్ అయిన అస్మితా హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరుచుగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. పైగా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ జర్నీల తాలుకా ఫోటోలను షేర చేసుకునేవారు. ఇక ఈ ఐఏఎస్ అమిత్ కటారియా ఆస్తులు నికర విలువ దాదాపు రూ. 8.90 కోట్లు పైనే అని అంచనా. (చదవండి: సైన్స్ కోర్సు చదవలేకపోయా..! క్షణాల్లో వీడియో వైరల్.. ఏకంగా కేంద్ర విద్యామంత్రే..) -
చిన్నారులకు చిప్స్ ప్యాకెట్లు కొనిస్తున్నారా..?
పిల్లాడు అన్నం తినడం లేదు.. వెంటనే ఓ చిప్స్ ప్యాకెట్ తాయిలమైపోతుంది. పాప మారాం చేస్తోంది.. మరో ఎరుపురంగు ప్యాకెట్ తారకమంత్రంగా పనిచేస్తుంది. బుజ్జాయి స్కూలుకు వెళ్తోంది.. ఆ బ్యాగ్లో పుస్తకాలు ఉన్నా లేకున్నా చిరుతిళ్ల ప్యాకెట్టు మాత్రం ఉండి తీరుతుంది. చిన్నారి బడి నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వీధి చివరి దుకాణంలో ఊరూపేరూ తెలియని రంగురంగుల ప్యాకెట్ వాడి నోరు మూయిస్తుంది. ఏ పదార్థంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారో తెలీని ‘ప్యాకెట్లు’ చిన్నారుల పాలిట విషంగా మారుతున్నాయి. ఈ తిను ‘బండారం’ తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. ఏ షాపు చూసినా చిరుతిళ్ల ప్యాకెట్ల తోరణాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడినా పిల్లలను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. జంక్ ఫుడ్ పేరిట నానా రకా ల పదార్థాలు పాన్షాపుల్లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకునే బొమ్మలతో పిల్లల నోరూరిస్తున్నాయి. కానీ ఇటువంటి చిరుతిళ్లు చిన్నారుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం తప్పదని చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన రింగ్స్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా జిల్లాలోని దుకాణాల్లో కనిపిస్తున్నాయి. రింగ్స్, ట్రాప్స్ అనే రకాలకు చెందిన రింగ్స్ చిప్స్ ఒడిశా నుంచి వస్తున్నాయని, ట్రాయ్ రింగ్స్ అనే రకం పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఎక్కువగా పాఠశాలలు ఉండే ప్రాంతాల్లో పాన్ షాపుల్లో రెండు, ఐదు రూపాయలకే ఈ చిరుతిళ్లు దొరుకుతుండడంతో.. అవి తినడం బాలలకు వ్యసనంగా మారిపోతోంది. ముప్పొద్దులా వీటినే తింటుండడంతో చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు రంగు ప్యాకెట్లు, నకిలీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జంక్ ఫుడ్స్కు దూరంగా ఉంచాలి పిల్లలను జంక్ఫుడ్స్కు దూరంగా ఉంచాలి. జింక్ ఫుడ్స్లో కెమికల్స్ ఉంటాయి. ఇవి తిన డం వల్ల చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తుంటాయి. పాణిపూరి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – జి.వేణుగోపాల్, చిన్నపిల్లల వైద్యుడు, సీహెచ్సీ, పాతపట్నంవిద్యార్థులు చదువుకు దూరం విద్యార్థులు పాఠశాలకు వచ్చేముందు చిప్స్, రింగ్స్ ప్యాకెట్లు తినుకుంటూ వస్తుంటా రు. పాఠశాలకు వచ్చి కడుపు నొప్పి, విరేచనాలు అంటూ మా కు చెబుతుంటారు. ఇంటికి విద్యారి్థని పంపిస్తుంటాము. మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలో సరిగా తినడం లేదు. చిరుతిళ్లకు పిల్లలను దూరంగా ఉంచాలి. – పొడ్డిడి కృష్ణారావు,హెచ్ఎం, ఎంపీపీ మెయిన్ పాఠశాల, పాతపట్నం(చదవండి: 10th Class Exams: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడిని అధిగమిద్దాం..గెలుపును అందుకుందాం!) -
మా కష్టాలు మాకే తెలుసు.. చివరికిలా శాశ్వతంగా! పిక్స్ వైరల్
ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ జోరుగా నడుస్తోంది. ప్రముఖ్యంగా ఈ సీజన్లో చాలామంది సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. బ్యాచిలర్స్ జీవితానికి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ విపుల్ ధనాకర్ క్లబ్లో చేరారు. తన లేడీలవ్తో ఏడడుగులు వేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.విలేన్గా పాపులర్ సింగర్ విపుల్ ధనాకర్. తాజాగా ( మార్చి 16)తన ప్రేయసి దివ్య దహియాతో వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం గురించి చాలా గోప్యంగా ఉండే, విలేన్ ఇన్స్టాగ్రామ్లో ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఈ సడన్ సర్ప్రైజ్కి ఫ్యాన్స్సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. "మా ఈ ప్రయాణం లోతు ఎంతో మాకు మాత్రమే తెలుసు మా కష్టాలు, బాధలు, అనుభవించిన, బాధ , ప్రేమ అన్నీ.. చివరకు ఇలా.. జీవితాంతం కలిసి పయనించబోతున్నాం’’ తన జీవితంలో ముఖ్యమైన రోజు గురించి వార్తను షేర్ చేశాడు. దీంతో కొన్ని అందమైన ఫోటోలను కూడా పంచుకున్నాడు.విలేన్,దివ్య దహియా పెళ్లిదుస్తుల్లో అత్యద్భుతంగా కనిపించారు. తెల్లటి, సిల్వర్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో రాయల్ లుక్తో అదిరిపోయాడు. ముత్యాల హారం, ముత్యాలు, కుందన్ కల్గితో అలంకరించిన తెల్లటి పగ్డితో, గడ్డంతో విలేన్ లుక్ మరింత ఎలివేట్ అయింది.ఇకవధువు దివ్య పాస్టెల్ పింక్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది. ఎంబ్రాయిడరీ స్కర్ట్, సరిపోలే బ్లౌజ్తో మహారాణిలా మెరిసిపోయింది. తలపై షీర్ దుపట్టా, క్లాసీగా కనపించింది. డైమండ్ నెక్లెస్, గ్యాజులు మ్యాచింగ్ చెవిపోగులు ,మాంగ్ టీకాతో లుక్ను మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. అద్భుతంగా ఉన్నారు..దిష్టి తగిలేను జాగ్రత్త అంటూ నెటిజన్లు కొత్త జంటను అభినందించారు.గాయకుడిగా విలేన్ న్యూ ఢిల్లీకి విపుల్ దనాకర్ యూట్యూబ్లో తన మ్యూజిక్ వీడియోలకు బాగా ప్రాచుర్యం పొందాడు. 2018లో ‘ఏక్ రాత్’,చిడియా (2019) పాటలతో సంగీత ప్రపంచాన్ని ఉర్రూత లూగించాడు.అలాగే సావన్, జవానీ లాంటి పాటలతోపాటు, కనికా కపూర్ తో పాడిన తాజా పాట ‘చురాకే’ మరింత ప్రజాదారణ పొందాడు. గాయకుడిగా, స్వరకర్తగా,రచయితగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ప్రయాణంలో చాలా కష్టపడ్డాను. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దర్శకత్వం , స్క్రీన్ ప్లే రాయాలి, ఎడిటింగ్ కంపోజింగ్, సాహిత్యం ఎలా రాయాలి వీటన్నింటిలోనూ పట్టు ఉండాలి,అప్పడేరాణిస్తాం అంటాడు విలేన్. View this post on Instagram A post shared by Vilen (@vilenofficial) -
పదోతరగతి పరీక్షలు: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడి పరార్..! గెలుపుని ఒడిసిపడదాం ఇలా..
ఈనెల 21 నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది.ఉపాధ్యాయులు ఇలా చేయాలి..విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి.విద్యార్థులతో చేయకూడనివి..విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు.వైద్యులతో కౌన్సెలింగ్పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి.పంచ సూత్రాలు పాటిద్దాం..ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి.నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి.ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి.దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి.అందమైన చేతి రాతతో..పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి.తేలికగా జీర్ణమయ్యే ఆహారం మేలుసమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మాంసాహారాలకు దూరంగా ఉండాలి. పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తినాలి. కాఫీ, టీ జోలికి పోరాదు. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.– డాక్టర్ గందె కార్తీక్, జనరల్ ఫిజీషియన్, నారాయణపేటప్రశాంతంగా చదవాలిపరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు ఆందోళన, మానసిక ఒత్తిడికి గురికారాదు. మార్కులపై దృష్టి పెట్టి బెంగ పడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతతతోనే ఉత్తీర్ణత సాధిస్తాం. మెదడు చెరుకుగా పనిచేసే విధంగా ఉత్తేజితం కావాలి.– యాద్గిర్ జనార్ధన్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణపేట.ఇతర విషయాలపై దృష్టి పెట్టొద్దుప్రశాంతంగా ఉండి ఉత్సాహంతో పరీక్షలకు హాజరు కావాలి. గంటల తరబడి చదవాలనే నియమం లేదు. మానసికంగా సంసిద్ధులుగా ఉన్న సమయంలోనే పాఠ్యాంశాలు చదవాలి. ఇతర విషయాలపై దృష్టి పెట్టరాదు. ఇప్పటివరకు చదివిన అంశాలనే పునఃశ్చరణ చేసుకోవాలి. కొత్త వాటి జోలికి పోరాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.– గోవిందరాజు, డీఈఓ(చదవండి: తల్లికి జరిగిన అన్యాయమే ఐఏఎస్ అధికారిగా మార్చింది..ఆనంద్ మహీంద్రా మెచ్చిన స్టోరీ..) -
పద్ధతిగా బతకడం అంటే ఇది..!
ఓ రాజుకు ఒక గురువు తారసపడ్డాడు. రాజ్యం సుఖసంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆ గురువును అడిగాడు రాజు. ప్రతి గ్రామంలోనూ సత్సంగం జరుపుకోడానికి, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి తగిన భవన సముదాయాలు కట్టించమన్నాడు గురువు.అలాగేనన్నాడు రాజు. అయితే రాజు మనసులో ఓ అనుమానం మొదలయ్యింది. ‘నిజంగా అలాంటి ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో నైతికత, భక్తి భావం నెలకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారా?’ అని! ‘సరే, ప్రయత్నించి చూద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం’ అని మందీమార్బలంతో బయలుదేరాడు.తమ రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గుడి దగ్గర ప్రవచనకర్త ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. జనం దండిగా కూర్చుని ప్రవచనాలను ఆసక్తిగా వింటూ ఉన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి ‘‘నాలుగు మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ నా కానుకగా ఒక్కో వెండినాణెం ఇవ్వదలిచాను. వచ్చి తీసుకోండి’’ అని చెప్పాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ‘‘ఇక్కడి వారికి చేయి చాపడం ఇష్టం ఉండదు. ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు’’ అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు.‘‘ఏళ్లకొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంత కాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు’’ అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడినుంచి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకుని అందరూ గుమికూడారు.‘‘మీ ఊర్లో సత్సంగం జరుగుతోందా?’’ అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు. మీకందరికీ వెండి నాణేలు పంచాలని ఉందని చెప్పాడు రాజు. అంతే... జనం పరుగులు తీస్తూ వచ్చి, ఎగబడి తీసుకున్నారు. రాజులో ఆలోచనలు మొదలయ్యాయి.‘మొదటి గ్రామంలో ఇచ్చేవాడున్నా తీసుకోలేదు వారు. ఆధ్యాత్మిక భోధనల వల్ల గ్రామస్తులు ఉన్నదానితో తృప్తిగా ఉన్నారు. వారి మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. రెండవ గ్రామంలో... ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే వారిలో ‘ఇంకా... ఇంకా’ కావాలన్న కోరిక బలంగా ఉంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ లేదు’ అని గుర్తించాడు రాజు.‘ఆధ్యాత్మిక బోధనలు చేయించి మంచి చెడ్డలు తెలియజేయాల్సిన బాధ్యత నాది’ అని అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు రాజు. త్వరత్వరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దైనందిన జీవితంలో దైవం అంటే..?) -
'వాకింగ్ యోగా': జస్ట్ ఒకే వ్యాయామంతో..!
నడక, యోగా రెండూ దేనికవే ప్రత్యేకం. ఆరోగ్యకరమైన వ్యాయామ మార్గాలు. ప్రస్తుతం ఈ రెంటినీ మిళితం చేసిన సరి కొత్త వ్యాయామంగా అందుబాటులోకి వచ్చింది వాకింగ్ యోగా. అటు నడక ద్వారా లభించే ప్రయోజనాలతో పాటు.. ఇటు యోగా ఫలితాలను ఒకే వ్యాయామం ద్వారా అందుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అనేక మందిని ఆకట్టుకుంటున్న ఈ వాకింగ్ యోగా విశేషాలివి..నడక మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నడక– యోగా ఆ ప్రయోజనాలను మరింత ముందడుగు వేయిస్తుంది. ఆధునిక సౌకర్యాలు, పని విధానాల వల్ల చలన రహితంగా మారుతున్న శరీరాన్ని చురుకుగా కదపడానికి విభిన్న రకాలుగా సాగదీయడానికి, సరైన రీతిలో శ్వాస పీల్చుకోడానికి వీలుగా ఈ వాకింగ్ యోగా రూపుదిద్దుకుంది. ఇది నడిచేటప్పుడు మన శరీర భంగిమను మెరుగుపరచడానికి, నడకను మరింత ప్రయోజనకరంగా మార్చడానికి సహకరిస్తుంది. ఏదో నడిచాం అన్నట్టుగా కాకుండా అవగాహనతో నడవడం నేర్పిస్తుంది. ఇందులో ప్రతి అడుగు లోతైన శ్వాస, సున్నితమైన స్ట్రెచ్లతో కలిపి ఉంటుంది. భంగిమకు మేలు.. మనలో చాలా మంది మన శరీర భంగిమ ఎలా ఉంటుందో పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు. తద్వారా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలను కోల్పోతుంటారు. వాకింగ్ యోగా భంగిమను మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్లు, మెడ.. వీటిని సరైన రీతిలో ఉంచేలా సహాయపడుతుంది. నిటారుగా నిలిచేలా, నడుము భాగం, వీపుతో నడకను అనుసంధానిస్తుంది. కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొందరికి అననుకూలం.. ఒక వ్యక్తి తమ నడకను మరింత విశ్రాంతిగా అదే సమయంలో మరింత ఉపయుక్తంగా మార్చే నడక యోగా టీనేజర్స్తో సహా అన్ని వయసుల వారికీ ఉపయుక్తమే. అయితే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇది అందరికీ అనుకూలం కాకపోవచ్చు. వేగవంతమైన నడక లేదా తీవ్రమైన వ్యాయామాలను ఇష్టపడే వ్యక్తులకు నప్పకపోవచ్చు. అలాగే, దీనికి ఏకాగ్రత, ఎక్కువ సహనం అవసరం. అది లేనివారు దీన్ని సాధన చేయడం కష్టం. నప్పుతుందో లేదో తెలుసుకోడానికి ఒక వారం పాటు దీనిని ప్రయత్నించి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మానసికంగానూ ఎంతో మేలు.. నడక యోగా ఒత్తిడిని తగ్గించడానికి విశ్రాంతిని అందించడానికి ఒక గొప్ప మార్గం. ఇది నడుస్తున్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం అలవాటు చేస్తుంది. తద్వారా ఆందోళనను, ప్రతికూల ఆలోచనలను తగ్గించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చురుకుగా ఉంటూనే మెదడుకు రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయడం లాంటిదని చెప్పొచ్చు. మనసు శరీరానికి క్రమబద్ధమైన అభ్యాసం ఇది. ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని, ఏకాగ్రతను పెంచడానికి శరీరంపై అవగాహనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజుకు 5 నిమిషాలతో.. బాగా పరిచయం ఉన్న కాస్త ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో రోజుకు ఐదు నిమిషాలతో ఈ వాకింగ్ యోగాని ప్రారంభించాలి. రోజుకు క్రమంగా ఐదు నిమిషాల చప్పున పెంచుకోవచ్చు. తద్వారా రొటీన్ వ్యవహారాలకు, వ్యాయామాలతో సర్దుబాటు కావడానికి కండరాలకు సమయాన్ని ఇవ్వాలి. ‘రోజుకు 20 నిమిషాలు వచ్చే వరకూ ఈ విధంగా పెంచుతూపోవాలి. ప్రతిరోజూ 20 నిమిషాలు కేటాయించలేకపోతే.. కనీసం వారానికి మూడు రోజులు 30 నిమిషాలు చేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 50 ఏళ్ల క్రితమే.. మైండ్ఫుల్ వాకింగ్ అనే ప్రక్రియను యోగా శిక్షకురాలు, యోగా ఫర్ పెయిన్ యాప్ సృష్టికర్త, లండన్కు చెందిన సోఫియా డ్రోజ్డ్ వ్యాప్తిలోకి తెచ్చారు. అయితే ఇదేమీ కొత్తది కాదని, దాదాపు 50 ఏళ్ల క్రితం.. అంటే 1970 ప్రాంతంలోనే రోజువారీ కార్యకలాపాలతో యోగా, బ్రీత్వర్క్లను కలిపే సాధనంగా ఇది ప్రప్రథమంగా వినియోగంలోకి వచ్చిందని డ్రోజ్డ్ అంటున్నారు. ప్రకృతితో మమేకం.. మైండ్ ఫుల్ వాక్.. దృష్టిని పూర్తిగా శ్వాస మీదే కేంద్రీకరిస్తూ.. ఆలోచనలు మరే విషయం మీదకూ మళ్లించకుండా శరీరాన్ని కదిలించడమే మైండ్ ఫుల్ నెస్. నడిచే సమయంలో ఈ ప్రక్రియను సాధన చేస్తే.. అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. అది కూడా ప్రకృతిలో మమేకమవుతూ చేయడం మరింత ప్రయోజనకరం. నడకను, యోగాను మేళవించడమే వాకింగ్ యోగా. మైండ్ ఫుల్ బ్రీతింగ్, మైండ్ ఫుల్ నేచర్ వాక్, పచ్చని గడ్డి మీద నడిచే బేర్ ఫుట్ వాక్, క్లౌడ్ గేజింగ్.. వంటివన్నీ ఇందులో భాగంగానే చెప్పవచ్చు. నగరంలో పలువురు వాకింగ్ యోగాను సాధన చేస్తున్నారు. – రీనా హిందోచా, యోగా శిక్షకురాలు (చదవండి: క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..) -
క్షణాల్లో తయారయ్యే ఈ మ్యాగీ నూడుల్స్ రెసిపీని కనిపెట్టిందెవరంటే..
నూడుల్స్ని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వంటకం ఇది. భారతీయుల వంటకాల జాబితాలో ప్రస్తుతం ఇదే అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఈజీగా అయిపోయే వంటకం కావడంతో అంతా దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ మహిళలకు ఇది ఎంతో తేలిగ్గా చేసే వంటకం. అయితే ఈ రెసిపీ తయారీని ఎవరు కనిపెట్టారు..? ఎలా ప్రజలకు ఇష్టమైన వంటకంగా మారింది తదితరాల గురించి చూద్దామా..!.క్షణాల్లో తయారు చేసే వంటకం ఏదన్నా ఉందంటే అది మ్యాగీ నూడుల్సే. భారతీయ సంస్కృతిలో కూడా అంతర్భాగమైపోయింది. అంతలా ప్రజాదరణ చూరగొన్న ఈ వంటకం తయారీ ఎవరు కనుగొన్నారంటే..ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని చూరగొన్న ఈ వంటకం విజయవంతమైన బ్రాండ్గా నిలిచి అందరి మన్ననలకు అందుకుంటోంది. ఈ మ్యాగీ వంటకం పుట్టింది 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లోని కెంప్తాల్ అనే సుందరమైన పట్టణంలో జరిగింది. 1884లో యువ ఔత్సాహిక వ్యవస్థాపకుడు జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ఈ మ్యాగీ నూడుల్స్ ఒక బ్రాండ్లా తీసుకొచ్చాడు. తక్కువ సమయంలో మంచి పోషకాలతో రుచికరమైన వంటకం చేయాలనే సంకల్పంతో జనించిన వంటకం ఇది. అయితే మొదట్లో ఇది ఉప్పు, మిరియాలతో తయారైంది. అనాతికాలంలోనే దీని ఉత్పత్తులకు తర్వగా ప్రపంవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దాంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూఎస్ వంటి ఇతర దేశాల్లో కూడా దాని శాఖలు తెరిచే స్థాయికి చేరుకుంది. 1900 సంవత్సరంలో, జూలియస్ ఉత్పత్తులు స్విట్జర్లాండ్ వంటి అనేక దేశాలకు విస్తరించాయి. ఇక జూలియస్ మొత్తం 18 రకాల వెరైటీ ఫ్లేవర్డ్ నూడిల్స్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈమ్యాగీ ప్యాకేజ్ ఉత్పత్తులను ఈజీxe ఐడెంటిఫై చేయగలం. కానీ ఆకాలంలో ఇవి ఎరుపు, పసుపు, నలుపు రంగుల ప్యాకింగ్ల ద్వారా మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ని నెస్లే కొనుగులు చేసి చౌక ధరల్లో నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందించాలనే ఆకాంక్షను నెరవేర్చుకుంది. అలాగే నెస్లే నివేదిక ప్రకారం.. "ప్రతి సెకనుకు, ప్రపంచవ్యాప్తంగా 21000 కంటే ఎక్కువ ఆహారాలు మాగీ ఉత్పత్తులతో తయారైనవే." సంవత్సరాలుగా, ఈ బ్రాండ్ చాలా మంది హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది. చకచక తయారై ఈ వంటకం ఆల్-టైమ్ సొల్యూషన్తో వచ్చిన రెసిపీ. ఎప్పటికీ మహిళలకు, బ్యాచిలర్లకు, నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారై వంటకంగా పేరు తెచ్చుకుంది.(చదవండి: స్టూడెంట్ మైండ్ బ్లాక్ స్పీచ్..! ఫిదా అవ్వాల్సిందే..) -
ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గీ వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పెళైన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గడపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గీ సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. హోటల్కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రోజూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్లైన్ను ఆశ్రయిస్తున్నవారు 2,564 ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది..వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు.–పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి (చదవండి: పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!) -
పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!
షుగర్ వ్యాధి బారిన పడకుండా ఒక్కొక్కరు ఒక్కో ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తుంటారు. ఒకరు రైస్ తినకూడదంటారు.. ఇంకొకరు నడక మంచిదంటారు.. ఒక వయస్సుకు వచ్చిన తర్వాత వ్యాధి బారిన పడటం ఒక ఎత్తయితే, రాకుండా జాగ్రత్త పడటం ఇంకొక ఎత్తు. మరి పుట్టుకతోనే ఈ వ్యాధి తోడుగా వస్తే.. ఆ పిల్లల జీవితం నరకప్రాయం. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? వీళ్లు చేసిన పాపం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి చెందిన యువకునికి పుట్టుకతోనే షుగర్ వ్యాధి వచ్చింది. వైద్యులు పరిశీలించి టైప్–1 డయాబెటిస్గా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్సులిన్ను ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇతని వయస్సు 30 ఏళ్లు. రోజూ ఇంజెక్షన్ వేయించుకోవాలంటే బాధగా ఉంటోందని, కానీ బతకాలంటే తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. స్వీట్లు అంటే ఇష్టమని, కానీ తింటే పరిస్థితి దారుణంగా ఉంటుందని వాపోతున్నాడు. పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మల్లయ్య, మానస దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వెంకట ఉమామహేష్ రెండవ కుమారుడు లిఖిత్. 9 నెలల వయస్సు కలిగిన లిఖిత్కు పుట్టుకతోనే చక్కెర వ్యాధి తోడుగా వచ్చింది. తరచూ అపస్మారక స్థితికి చేరుకోవడం గమనించి కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు రూ.3లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. షుగర్ లెవెల్స్ గుర్తించేందుకు మిషన్ తెచ్చుకుని వారానికోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేయించాల్సిన పరిస్థితి. నెలకు సుమారు రూ.5వేల దాకా ఖర్చవుతోందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పేరులో తియ్యదనం దాచుకున్న మహమ్మారి మధుమేహం. ఇది పెద్దలనే కాదు.. చిన్నారులనూ వదలని పరిస్థితి. పుట్టుకతోనే తోడుగా వచ్చి జీవించినంత కాలం వేధిస్తోంది. అందరిలా జీవించాలంటే రోజూ సూదిపోటుతో ఇన్సులిన్ మందు వేసుకోవడం తప్పనిసరి. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలను తల్లిదండ్రులే స్వయంగా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం వారికీ నరకంతో సమానం. ఇలాంటి బాధితుల సంఖ్య సమాజంలో రోజురోజుకూ పెరుగుతోంది. శరీరంలోని క్లోమగ్రంధిలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గ్రంధిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలను(బీటా కణాలు) వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దీన్ని టైప్–1 మధుమేహం(డయాబెటిస్) అంటారు. సాధారణంగా పిల్లలు, యువకుల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు బీటా కణాలను రోగినిరోధక వ్యవస్థ నిరీ్వర్యం చేయడం కాకుండా క్లోమగ్రంధికి ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా గాయం అయినప్పుడు బీటా కణాలు నిర్వీర్యం అవుతాయి. దీనిబారిన పడిన వారికి క్రమం తప్పకుండా ఇన్సులిన్ను ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంత మందికి జన్యుపరంగా కూడా రావచ్చు. మరికొంత మందికి పలు రకాల వైరల్ వ్యాధులు, ఇతర ప్రమాదకర అనారోగ్యాల కారణంగా కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. అంతేకానీ ఆహారం, జీవనశైలి అలవాట్లు టైప్–1 డయాబెటిస్కు కారణం కావు. ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర ఇన్సులిన్ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సతో పాటు ఇన్సులిన్ను ఉచితంగా అందించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా వీరికి అరకొరగా ఇన్సులిన్ ఇస్తున్నారు. కేవలం కర్నూలు, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో మాత్రమే అధికారులు స్థానికంగా కొనుగోలు చేసి ఇన్సులిన్ను కొద్దిమొత్తంలో అందజేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలా మంది మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో చిన్నారికి వ్యాధి తీవ్రతను బట్టి నెలకు రెండు నుంచి నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. పెరుగుతున్న చికిత్స వ్యయం మెడికల్షాపుల్లో ఒక్కో ఇన్సులిన్ ఖరీదు రూ.180 వరకు ఉంటోంది. ఈ మేరకు ప్రతి చిన్నారికి నెలకు రూ.600 నుంచి రూ.800 వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేటు క్లినిక్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యుల వద్ద చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆధునిక వైద్యవిధానాల మేరకు వారికి నొప్పి తక్కువగా ఉండే ఇన్సులిన్ పెన్నుల ద్వారా ఇంజెక్షన్ చేస్తున్నారు. వీటి ఖరీదు సాధారణ ఇన్సులిన్తో పోలిస్తే రెట్టింపుగా ఉంటుంది. లక్షణాలుటైప్–1 డయాబెటిస్ లక్షణాలు బయటపడటానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. విపరీతమైన దాహం, తిన్న తర్వాత కూడా బాగా ఆకలివేయడం, నోరు తడి ఆరిపోవడం. కడుపునొప్పి, వాంతులు, ఎక్కువసార్లుమూత్రవిసర్జనకు వెళ్లడం. ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, అలసట, కంటిచూపు తగ్గిపోవడం. శ్వాస తీసుకోవడానికి ఎక్కువ కష్టపడటం, తరచుగా చర్మ, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు. మూడ్ మారిపోవడం, నిద్రలో మూత్రవిసర్జన చేయడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50లక్షల వరకు జనాభా ఉంటుంది. ఇందులో 15 నుంచి 20 శాతం వరకు మధుమేహ బాధితులు. వీరిలో టైప్–2 మధుమేహ బాధితులు 90 శాతం కాగా.. టైప్–1 బాధితులు 10 శాతం పైనే. ఈ లెక్కన 7.50లక్షల నుంచి 10లక్షల వరకు మధుమేహ బాధితులు ఉండగా.. 75వేల నుంచి లక్ష దాకా చిన్నారులు ఉంటున్నారు.కోవిడ్ తర్వాత పెరిగిన కేసులు కోవిడ్–19 అనంతరం టైప్–1 డయాబెటిస్ రోగుల సంఖ్య పెరిగింది. గతంలో డయాబెటిస్ రోగులు 5 శాతం ఉండగా ఇప్పుడు 10శాతానికి చేరుకుంది. కోవిడ్ వైరస్ నేరుగా బీటా కణాలపై దాడి చేయడమే ఇందుకు కారణం. ఈ కారణంగా కోవిడ్కు గురైన వారికి జని్మంచే పిల్లల్లో టైప్–1 డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తోంది. – డాక్టర్ పి.శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్వోడి, జీజీహెచ్, కర్నూలు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స చిన్నపిల్లల్లో వచ్చే టైప్–1 డయాబెటిస్కు ఇన్సులిన్తో మాత్రమే చికిత్స అందుబాటులో ఉంది. ఆయాసం, కడుపునొప్పి, వాంతులు లక్షణాలతో చిన్నపిల్లలను ఆసుపత్రికి తీసుకొస్తారు. అన్నిరకాల పరీక్షలు నిర్వహించి డయాబెటిస్ నిర్ధారణ అయ్యాక చికిత్స ప్రారంభిస్తాం. ఈ పిల్లలకు ఇన్సులిన్తో పాటు ఆహార నియమావళి తప్పనిసరి. – డాక్టర్ ఎం.మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు (చదవండి: మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!) -
మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!
పెదవులు పొడిబారితే ముఖమే అందహీనంగా మారుతుంది. అందుకే చాలామంది అధరాలను మృదువుగా మార్చుకోవడానికి ఏదైనా చిట్కా ఉందా అని అడుగుతుంటారు. అలాంటి వారికి ఈ లిప్బామ్ ఉత్తమ ఎంపిక. దీని పేరు ‘కోలరెన్ స్క్వాలేన్ + అమైనో యాసిడ్స్ లిప్ బామ్’. దీన్ని ఎక్కువసార్లు అప్లై చేయాల్సిన పనిలేదు. ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలాసేపటి వరకూ నిలిచి ఉంటుంది. దీన్ని పెదవులకే కాదు మోచేతులు, గోళ్లు వంటి పగుళ్లు ఉన్న భాగాల్లో అప్లై చేస్తే వెంటనే మృదువుగా మారతాయి. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లేలా చిన్నగా రూపొందించడంతో, క్యారీ చేయడం చాలా తేలిక. ఈ లిప్ బామ్ని రాత్రి పూట అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.మొటిమలకు చెక్ పెట్టేద్దాం ఇలా..అందానికి ప్రాధాన్యమిచ్చేవారు ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా, మచ్చ పడినా అసలు తట్టుకోలేరు. వెంటనే దాన్ని తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్ బాట పడుతుంటారు. ప్రస్తుత సాంకేతికత అలాంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. ఇంట్లోనే స్వయంగా, సులభంగా, తమకు తామే ట్రీట్మెంట్ చేసుకునే విధంగా గాడ్జెట్స్ను పరిచయం చేస్తోంది. అందులో భాగమే ఈ స్కిన్ కేర్ డివైస్. చిత్రంలోని ఈ మినీ మెషిన్.. మచ్చలను, మొటిమలను, చర్మంపై రంధ్రాలను పోగొట్టి, ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది బ్లూకలర్ లైట్ థెరపీతో మొటిమల్లోని బ్యాక్టీరియాను నిర్మూలించి, వాటి కారణంగా ఏర్పడిన మచ్చలను వేగంగా తగ్గిస్తుంది. దీనిలోని నీలం రంగు లైట్ 415 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో వెలుగుతూ, 0.5 మిల్లీమీటర్ల మేరకు చర్మం లోతుల్లోకి చొచ్చుకుని వెళ్లి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. సున్నితమైన చర్మానికి కూడా ఇది చక్కటి ట్రీట్మెంట్ అందిస్తుంది. అయితే ఈ లైట్ థెరపీ తీసుకునేటప్పుడు కళ్లకు ప్రత్యేకమైన కళ్లజోడును కచ్చితంగా ధరించాలి. ఈ కళ్లజోడు డివైస్తో పాటు లభిస్తుంది.మెషిన్కి ఉన్న లైట్ హెడ్ మీద, 44 హై–ఇంటెన్సిటీ ఎల్ఈడీ బల్బులు ఉంటాయి. ఈ గాడ్జెట్ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు రకరకాల అలర్జీలను తగ్గిస్తుంది. ఇక ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. దీనిలోని కాంతి చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. అలాగే దీనిలోని కంటిన్యూస్, పల్సేటింగ్ అనే రెండు మోడ్స్ ఉంటాయి. మనకు కావలసిన రీతిలో 1 నిమిషం, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 12 నిమిషాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్ 120 నిమిషాల పాటు నిరంతరాయంగా పని చేయగలదు. చార్జింగ్ పెట్టుకుని దీన్ని వైర్లెస్గా కూడా వినియోగించుకోవచ్చు. ఫేస్ క్రీమ్, సీరమ్ వంటివి అప్లై చేసుకున్నాక ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!)