International
-
అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్మెయిలింగ్కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
సానుకూల దిశగా చైనా-భారత్ సంబంధాలు
న్యూఢిల్లీ, బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా సుంకాల విధింపు తర్వాత స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో.. భారత్-చైనా సంబంధాలు(India-China Relations) బలపడే దిశగా అడుగులు పడుతుండడం గమనార్హం. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు చేశారు. అవి సానుకూల దిశలో పయనిస్తున్నాయని అన్నారాయన. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే.. రెండు దేశాల సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.2020లో తూర్పు లడ్డాఖ్లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో ఇరు దేశాల జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో సంబంధాలు దిగజారాయి. తర్వాత సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా కీలక గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం.. 2020 నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు.మరోవైపు.. ట్రంప్ టారిఫ్ల(Trump Tariffs) నేపథ్యంలో తొలిసారి స్పందించిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పందించారు. పొరుగుదేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకుంటామని ప్రకటించారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, సప్లై చైన్ వ్యవస్థలను మరింత మెరుగుపరచుకుంటామని అన్నారు.చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 104 శాతం టారిఫ్లు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో.. అమెరికా సుంకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలని న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ అభిప్రాయపడ్డారు. ‘‘పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా సుంకాల వేధింపుల కారణంగా అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు.. అభివృద్ధి చెందే హక్కును కోల్పోతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన రెండు దేశాలు కలిసి నిలబడాలి’’ అని ఆమె ఒక పోస్ట్ చేశారు. -
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్కు ట్రంప్ బిగ్ షాక్ -
ఐదేళ్ల తర్వాత రష్యాకు మోదీ.. కారణం ఇదే..
మాస్కో: రష్యా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని మాస్కోలో మే 9న జరగబోయే విజయ దినోత్సవ (విక్టరీ డే) పరేడ్కు ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 80వ విజయదినోత్సవ వార్షికోత్సవం జరగనుంది.ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తున్నట్లు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు. రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని రెడ్ స్క్వేర్లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాని పాల్గొనే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని రుడెంకో తెలిపారు. 2024 జూలైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. ఇప్పుడు ఐదేళ్ల తరువాత మరోమారు మోదీ రష్యాకు వెళ్లనున్నారు. ఈ ఆహ్వానం భారత్-రష్యా లమధ్య దీర్ఘకాల స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశంగా చూడవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన గురించి భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.రష్యాలో నిర్వహించే విజయ దినోత్సవం ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ వేడుకలలో ఒకటి. ఈ సందర్భంగా సైనిక పరేడ్, యుద్ధ వీరులకు సన్మానం, చారిత్రక ఘటనలను స్మరించుకునే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ వేడుకలకు అంతర్జాతీయ నేతలను ఆహ్వానించడాన్ని రష్యా తన సంప్రదాయంగా కొనసాగిస్తోంది. 2005లో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా విజయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఇది కూడా చదవండి: లోకో పైలట్లకు పిడుగులాంటి వార్త.. ‘విరామం’ లేనట్లే! -
చైనా ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
బీజింగ్: చైనాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చైనాలోని ఓ నర్సింగ్ హోమ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్లోని లాంగ్హువా కౌంటీలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఓ నర్సింగ్ హోమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.00 గంటల ప్రాంతంలో నర్సింగ్ హోమ్(ఆసుపత్రి)లో మంటలు చెలరేగాయి. దీంతో, వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు స్థానిక మీడియా జిన్హువా వెల్లడించింది. అలాగే, పలువురు తీవ్రంగా గాయపడినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.Deadly fire claims 20 lives at nursing home in northern ChinaThe blaze struck a facility in Chengde City, with survivors relocated to a nearby hospital for treatment and observation, Xinhua News reports.#China pic.twitter.com/dOdt0UNX1w— MOCez🇷🇺🇮🇶🇾🇪🇨🇳🇵🇰🇵🇸🇱🇧🇮🇷🇰🇵☀️ (@Mousacisse1) April 9, 2025 -
పాక్లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు స్తంభించినప్పటికీ, ఇరు దేశాల మధ్య మతపరమైన పర్యాటక యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ తమ దేశంలో జరిగే వైశాఖీ ఉత్సవాలకు భారత్ నుంచి హాజరయ్యే 6,500 మందికి పైగా సిక్కు యాత్రికులకు వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.పాకిస్తాన్లో వైశాఖీ ఉత్సవాలు ఏప్రిల్ 10 నుండి 19 వరకూ జరగనున్నాయి. ఈ సందర్భంగా పాక్కు వచ్చే యాత్రికులు గురుద్వారా పంజా సాహిబ్, గురుద్వారా నన్కానా సాహిబ్, గురుద్వారా కర్తార్పూర్ సాహిబ్లను సందర్శించనున్నారు. తాజాగా పాకిస్తాన్ హై కమిషన్లోని ఛార్జ్ డి అఫైర్స్ సాద్ అహ్మద్ వరైచ్ మీడియాతో మాట్లాడుతూ ‘పాకిస్తాన్ ప్రభుత్వం అధిక సంఖ్యలో జారీ చేసిన వీసాలు ఇరు దేశాల ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, సంస్కృతులు, మతాల మధ్య అవగాహనను ప్రోత్సహించడానికి ఉపయోగపడతాయని, పాకిస్తాన్ ఇలాంటి పవిత్ర స్థలాల సందర్శనలను భవిష్యత్తులో కూడా సులభతరం చేస్తుంటుందని’ తెలిపారు. ఈ యాత్రలు 1974లో రూపొందిన ‘పాకిస్తాన్-ఇండియా ప్రోటోకాల్ ఆన్ విజిట్స్ టు రిలీజియస్ ష్రైన్స్’ ఒప్పందం ప్రకారం జరుగుతున్నాయి.ఎవాక్యూఈ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీబీపీ) ప్రతినిధి సైఫుల్లా ఖోఖర్ మాట్లాడుతూ గడచిన 50 ఏళ్లలో ఈ ఒప్పందం ప్రకారం నిర్దేశించిన 3,000 వీసాల పరిమితిని మించి అదనపు వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈటీపీబీ ఆధ్వర్యంలో వైశాఖీ ఉత్సవాల ప్రధాన ఘట్టం ఏప్రిల్ 14న నన్కానా సాహిబ్లోని గురుద్వారా జన్మస్థాన్లో జరగనుందని తెలిపారు. సిక్కులకు పాకిస్తాన్ రెండవ ఇల్లు లాంటిదని, తాము ఇక్కడికి వచ్చే అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గతంలో వైశాఖీ ప్రధాన కార్యక్రమం హసన్ అబ్దాల్లోని గురుద్వారా పంజా సాహిబ్లో జరిగేది. అయితే ఈసారి యాత్రికుల సంఖ్య పెరగడం వల్ల నన్కానా సాహిబ్లో నిర్వహించాలని నిర్ణయించారు.ఇది కూడా చదవండి: 26/11 మాస్టర్మైండ్ తహవ్వూర్ రానా రాక.. ఢిల్లీ, ముంబై జైళ్లలో ఏర్పాట్లు? -
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యల కారణంగా పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య టారిఫ్ల యుద్ధమే నడుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్పై ట్రంప్ ఏకంగా 104శాతం టారిఫ్లు విధించారు. దీంతో, ట్రంప్ చర్యలపై చైనా ఘాటుగా స్పందించింది.ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న పన్నులపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తాజాగా స్పందించారు. తాజాగా లీ కియాంగ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల పేరుతో బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవడం అమానుషం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా అన్ని ఆయుధాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. కానీ మంగళవారం డెడ్లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘చైనా-భారత్ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది కూడా చదవండి: Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు -
Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు
సంతో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని ప్రముఖ జెట్ సెట్ నైట్క్లబ్(Jet Set Nightclub)లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరీ జరుగుతుండగా నైట్క్లబ్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 79 మంది వరకు మరణించారని, 160 మందికి పైగా జనం గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంగీత కచేరీని వీక్షించేందుకు సుమారు 600 మంది హాజరైనట్లు తెలుస్తోంది.స్థానిక రెస్క్యూ బృందాలు(Rescue teams) అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిలో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మాజీ బేస్బాల్ ఆటగాళ్లు ఎమిలియో బోనిఫాసియో, లూయిస్ రామిరెజ్ కూడా ఉన్నారు. అలాగే ఒక ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగీత కచేరీకి హాజరైన వారిలో ప్రముఖులు, స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం. 🚨🇩🇴13 DEAD, 93 INJURED IN NIGHTCLUB ROOF COLLAPSE IN THE DOMINICAN REPUBLICThis comes after the roof of the Jet Set nightclub in Santo Domingo, Dominican Republic, collapsed earlier this morning.The national police confirmed the death toll and said search and rescue… pic.twitter.com/yAdkTqw8yX— Mario Nawfal (@MarioNawfal) April 8, 2025నైట్ క్లబ్ పైకప్పు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధిక జనసమూహం కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగి పైకప్పు కూలివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. నైట్క్లబ్ యాజమాన్యంతో పాటు స్థానిక నిర్మాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కచేరీ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది.ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు చూసిన వారు ఘటన తీవ్రతను అర్థం చేసుకోగలుగుతారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించారు. బాధితులకు సహాయం చేయడానికి అత్యవసర నిధులను కేటాయించారు. ఈ ఘటన అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం -
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
రోమ్: లక్షలాది మందికి ఆహార సాయాన్ని నిలిపేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్పీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలిన మరణశాసనంగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు నిరంతరం మద్దతివ్వాలని కోరేందుకు ట్రంప్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.అఫ్గానిస్తాన్, సిరియా, యెమన్, మరో 11 పేద దేశాల్లో లక్షలాది మంది అన్నార్తులకు సాయపడే యూఎస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అత్యవసర కార్యక్రమాలకు ట్రంప్ ప్రభుత్వం నిధులను నిలిపేయడం తెలిసిందే. ఎలాన్ మస్క్ డోజ్లో టాప్ లెఫ్టినెంట్ జెరెమీ లెవిన్ ఆదేశాల మేరకు వాటికి నిధుల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర ఆహార కార్యక్రమాలకు సాయాన్ని కోతల నుంచి మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా లాభం లేకపోయింది.ట్రంప్ టార్గెట్ చేసిన కార్యక్రమాలు 13 ఏళ్ల అంతర్యుద్ధం, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు తిరుగుబాటు తర్వాత సిరియా పేదరికం, ఆకలి, అభద్రతతో సతమతమవుతోంది. ఆ దేశానికి తాజాగా 23 కోట్ల డాలర్ల ఒప్పందాలను అమెరికా రద్దు చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ విపత్తును ఎదుర్కొంటున్న యెమన్లో డబ్ల్యూఎఫ్పీ ఆహార కార్యక్రమాలకు సాయం నిలిపేసింది. సిరియా శరణార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యే లెబనాన్, జోర్డాన్లలో కార్యక్రమాలూ పడకేశాయి.సోమాలియా, అఫ్గాన్, జింబాబ్వేల్లో యుద్ధాలతో నిరాశ్రయులైన వారికి జలకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణ, ఆశ్రయం వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. అఫ్గాన్కు మానవతా సహాయంలో అమెరికా 56 కోట్ల డాలర్లు కోత పెట్టింది. తాలిబన్ ఆంక్షల వల్ల విదేశాల్లో చదువుతున్న అఫ్గాన్ యువతులకు అందించే సాయాన్ని శుక్రవారం నిలిపేసింది. అమెరికా కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఇలా సుమారు 1,000కి పైగా కార్యక్రమాలు నిలిచిపోయాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. డబ్ల్యూఎఫ్పీకి గతేడాది అందిన 980 కోట్ల డాలర్ల విరాళాల్లో 450 కోట్లు అమెరికా ఇచ్చినవే! 🚨 US emergency food aid cuts by the Trump administration threaten millions in 14 countries, warns the UN. Despite earlier pledges to protect aid, these cuts put vulnerable communities at risk. 🔵 Calls for urgent action to restore funding. #UN #FoodAid #GlobalCrisis pic.twitter.com/EGLNbz8D8n— Thomas MORE (@ThomaMore) April 8, 2025వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్పీ) 2025 లెక్కల ప్రకారం పలు దేశాల సాయం ఇలా ఉంది. అమెరికా.. మూడు బిలియన్ డాలర్లు కాగా, జర్మనీ.. ఒక్క బిలియన్ డాలర్లు. యూకే, యూరోపియన్ కమిషన్, ప్రైవేటు డోనార్స్ ఉన్నారు. -
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్పోర్ట్లో పోలీసులు, ఎఫ్బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్చేశారు.పవర్ బ్యాంక్పై అనుమానంతో.. ‘‘ఎయిర్పోర్ట్కు వచ్చినప్పుడు నా హ్యాండ్బ్యాగ్లో స్మార్ట్ఫోన్ పవర్బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్లో రాసుకొచ్చారు. తన పోస్ట్ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025 -
కనీస వేతనాలను పెంచిన కెనడా
టొరంటో: కెనడాలో జీవనవ్యయం విపరీతంగా పెరిగిన వేళ ప్రజలకు కాస్తంత ఊరటనిచ్చే నిర్ణయాన్ని కెనడా ప్రభుత్వం తీసుకుంది. ప్రైవేట్ రంగంలో కనీస వేతనాలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్య కోసం కెనడాకు వచ్చి తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే భారతీయ విద్యార్థులకు లబి్ధచేకూరనుంది. ప్రస్తుతం ప్రతి గంటకు 17.30 కెనడియన్ డాలర్ల చొప్పన కనీస వేతనం చెల్లిస్తుండగా ఇకపై 17.75 కెనడియన్ డాలర్లను చెల్లించనున్నారు. కొత్త వేతనాలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చదువుకుంటూనే చిరుద్యోగాలు చేస్తూ సంపాదించే భారతీయ విద్యార్థుల ఆర్థిక కష్టాలు కొంతమేర తగ్గనున్నాయి.‘‘ఆదాయ అసమానతలను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఫెడరల్ కనీస వేతనాలను పెంచుతున్నాం. దీంతో వ్యాపారాలు, పరిశ్రమల్లో కార్మికులకు స్థిరాదాయం కొంతైనా పెరుగుతుంది. మరింత పారదర్శకమైన ఆర్థికవ్యవస్థను నిర్మించే క్రమంలో మేం మరో అడుగు ముందుకేశాం’’అని కెనడా ఉపాధి, కార్మికాభివృద్ధి, శ్రామికుల మంత్రిత్వ శాఖ మంత్రి స్టీవెన్ మ్యాకినన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సంస్థలన్నీ తమ ఉద్యోగుల జీతభత్యాల జాబితాలను పెంచిన కనీస వేతనాలకు అనుగుణంగా వెంటనే సవరించాలని ఆదేశించాం. ఇంటర్మ్లు సహా ఉద్యోగులు, కార్మికులందరికీ సవరించిన కనీస వేతనాలు అందేలా చూస్తాం’’అని ఆయన అన్నారు. కెనడాలో గత ఏడాది వినియోగదారుల ధరల సూచీ వార్షిక సగటును ఆధారంగా చేసుకుని ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన కనీస వేతనాల సవరణ విధానాన్ని అమలుచేస్తారు. తగ్గనున్న స్థానికుల కష్టాలు పెరిగిన జీవన వ్యయంతో కెనడాలోని మధ్యతరగతి స్థానికులకు ఆహార కష్టాలు పెరిగాయి. ఇన్నాళ్లూ వీళ్లలో చాలామంది స్థానికంగా ఉచితంగా ఆహారం అందించే ఫుడ్బ్యాంక్ల మీదనే ఆధారపడ్డారు. ఉన్నత విద్య కోసం వచ్చిన విదేశీ విద్యార్థులు సైతం కాస్త డబ్బును ఆదా చేసుకునేందుకు ఈ ఉచిత ఫుడ్బ్యాంక్లనే ఆశ్రయిస్తారు. అయితే గత ఏడాది విదేశీ విద్యార్థులు వెల్లువలా పోటెత్తడంతో లక్షలాది మందికి ఉచితంగా ఆహారం అందించడం తమ వల్లకాదని ఫుడ్బ్యాంక్లు చేతులెత్తేశాయి. దీంతో ఎంతో మంది విదేశీ విద్యార్థులు ఖాళీ కడుపులతో ఫుడ్బ్యాంక్ల నుంచి వెనుతిరిగారు.ఇప్పుడు కనీస వేతనాలు పెరిగిన నేపథ్యంలో స్థానిక కెనడియన్ల నిత్యావసరాల కొనుగోలు శక్తి కాస్తంత పెరిగింది. దీంతో ఇప్పుడు వీళ్లంతా మునపటిస్థాయిలో ఫుడ్బ్యాంక్లను ఆశ్రయించకపోవచ్చు. దాంతో విదేశీ విద్యార్థులకు మళ్లీ ఫుడ్బ్యాంక్లలో ఉచిత ఆహారం లభించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం అనేది జస్టిన్ ట్రూడో ప్ర భుత్వానికి పెద్ద సమస్యగా తయారవడం తెల్సిందే. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ధరల అంశమే ప్రధానంకానుంది. కనీస వేత నం 2.4 శాతం పెరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయులకూ లబ్ధి చేకూరనుంది.కెనడా జనాభాలో 3.7 శాతం భారతీయులేకెనడా జనాభాలో 3.7 శాతం భారతీయులే ఉన్నారు. గత ఏడాది కెనడావ్యాప్తంగా తాత్కాలిక ఉద్యోగాలు చేసిన వారిలో 22 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇలా తాత్కాలిక(గిగ్) ఆర్థికరంగంలో భారతీయులు కీలకంగా ఉన్నారు. కెనడాలో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న వారిలో అత్యధిక మంది వలసదారులే. 2005 ఏడాది నుంచి 2020 ఏడాదిదాకా గమనిస్తే కెనడా కార్మికుల్లో తాత్కాలిక కార్మికుల వాటా 5 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది. వీళ్లుగాక కెనడాలో ఉన్న దాదాపు 13.5 లక్షల మంది తాము భారతీయ మూలాలున్న వ్యక్తులమని వెల్లడించడం విశేషం.ముఖ్యంగా భారతీయులు రిటైల్, హెల్త్కేర్, నిర్మాణం, ఇతర రంగాల్లో పనిచేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు మాత్రమేకాదు ఇంటర్మ్లుగా పనులు చేసుకుంటున్న భారతీయ విద్యార్థులకు సైతం ఈ కనీస వేతన లబ్ధి ప్రయోజనాలు దక్కనున్నాయి. భారత్ నుంచి ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, వ్యాపారాలు, ఇంజనీరింగ్, హెల్త్సైన్సెస్, ఐటీ రంగాల్లో విద్యనభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు కెనడాకు వస్తున్నారు. చదువు పూర్తయ్యాక ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్కేర్, వాణిజ్య, వ్యాపార రంగాల్లో ఉద్యోగులుగా కెనడాలోనే స్థిరపడుతున్నారు. భారతీయ విద్యార్థులు విద్య రూపంలో, తాత్కాలిక ఉపాధి, వస్తూత్పత్తుల వినియోగం ఇలా అన్నింటిలో కలిపి 2021 ఏడాదిలో కెనడా ఆర్థికవ్యవస్థకు 4.9 బిలియన్ కెనడియన్ డాలర్లమేర లబి్ధచేకూర్చారు. కెనడాకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ. -
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
వాషింగ్టన్: దేశం నుంచి బలవంతంగానైనా పంపేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదనే వాస్తవం ఇప్పుడు అమెరికాలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా ప్రభుత్వం వారిపై ‘వీసా రద్దు’ కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువును ముగించేసి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలిస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాన్ని సైతం వీసా రద్దుకు సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏ నిమిషంలో వీసా రద్దు ఈ–మెయిల్ వస్తుందోనన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పారిపోయిన, జాడ దొరకని ఉగ్రవాదిని అత్యవసరంగా వెతికిన చందంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తోంది. దీనిపై ఎంతటి విమర్శలు వెల్లువెత్తుతున్నా విదేశీ విద్యార్థుల బహిష్కరణ పర్వానికి ప్రభుత్వం తెరదించట్లేదు. దీంతో ఇప్పటికే గాజా అనుకూల ర్యాలీలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు, ఆ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేసినా, షేర్ చేసిన, అనుకూలంగా స్పందించిన విదేశీ విద్యార్థుల కంటిపై కనుకులేకుండా పోయింది. ఏ నిమిషంలో వీసా రద్దవుతుందోనన్న ఆందోళన సంబంధిత విదేశీ విద్యార్థుల్లో ఎక్కువైంది. సంబంధిత వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ ఒక నివేదిక వెల్లడించింది. మా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది వీసాలు హఠాత్తుగా రద్దయ్యాయని అమెరికాలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తాజాగా వెల్లడించాయి. ఇలా వీసా రద్దును ఎదుర్కొన్న వారిలో భారతీయ విద్యార్థులూ ఉన్నారు. అయితే పాలస్తీనా అనుకూల ఘటనలతో ఎలాంటి సంబంధం లేని విద్యార్థులకు సైతం వీసా రద్దు ఈ–మెయిల్స్ రావడం గమనార్హం. ఇలాంటి విద్యార్థులను అమెరికాలో గతంలో చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాలను సాకుగా చూపి దేశ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇంకొంత మంది విద్యార్థులకు వీసా ఎందుకు రద్దు చేస్తున్నామని కనీస కారణాన్ని కూడా ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొనకపోవడం దారుణమని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. డేటాబేస్ చూశాకే మాకూ తెలిసొచి్చంది అసలు ఎవరెవరి వీసాలు రద్దయ్యాయని వివరాలు సైతం ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పేర్కొనట్లేరు. దీనిపై హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మిషిగన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలెస్, ఒహాయో స్టేట్ వర్సిటీల అధికారులు స్పందించారు. ‘‘ మా కాలేజీల్లోని కొందరు విద్యార్థుల వీసాలు సైతం రద్దయ్యాయి. అమెరికావ్యాప్తంగా స్టూడెంట్ వీసాల గడువును అకస్మాత్తుగా కుదిస్తున్న నేపథ్యంలో ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్ను యథాలాపంగా చెక్చేశాం. అందులో మా కాలేజీల విద్యార్థుల పేర్లు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాం.ఎందుకు రద్దుచేశారని తెల్సుకునేందుకు ప్రయత్నిస్తే ఇమిగ్రేషన్ విభాగం నుంచి సరైన స్పందన కరువైంది’’ అని ప్రముఖ వర్సిటీల అధికారులు వెల్లడించారు. భారతీయ విద్యార్థులు ఎలాంటి గాజా, పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొనకపోయినా కొందరి వీసాల గడువును ప్రభుత్వం పూర్తిగా ముగించేసి స్వదేశానికి వెళ్లిపోవాలని సందేశాలు పంపించింది. అమెరికా వ్యతిరేక భావజాలమున్న విద్యార్థులను ఏరివేసేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడ పడుతోందని యాక్సికోస్ అనే సంస్థ వెల్లడించింది. హమాస్ అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులు పెట్టినా, అలాంటి పోస్ట్లను లైక్చేసినా, షేర్ చేసినా అలాంటి వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం మునిగిపోయిందని యాక్సికోస్ నివేదించింది. -
చైనాపై మరో 50%
బీజింగ్/వాషింగ్టన్: ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్మెయిలింగ్కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. కానీ మంగళవారం డెడ్లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.భారత్పైనా నేటినుంచే!ప్రపంచ దేశాలపై ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్ల అమలులో ఆలస్యం, డెడ్లైన్ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్ కుండబద్దలు కొట్టారు. భారత్తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్ 2న ట్రంప్ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్ టారిఫ్లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు. -
ట్రంప్ భయం.. ఈసారి భారీ ఫైన్లు, జైలు శిక్ష కూడా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచదేశాలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే స్వయంగా దేశం విడిచిపోవాలని.. లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. అక్రమ వలసదారులు ముందుగా సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ తుది ఆదేశాలు అందుకున్నాక కూడా దేశాన్ని వీడకుంటే.. రోజుకు 998 డాలర్లు(రూ.86వేల చొప్పున) జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అప్పటికీ వీడకుంటే పర్యవసనాలు మరోలా ఉంటాయని డీహెచ్ఎస్ హెచ్చరించింది. తమంతట తాముగా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలి. లేకుంటే.. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బు జరిమానా రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. వెయ్యితో మొదలై.. ఐదు వేల డాలర్ల దాకా జరిమానా విధించవచ్చు. జైలు శిక్ష ఎదుర్కొనడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశమూ కోల్పోతారు అని డీహెచ్ఎస్ హెచ్చరించింది. అయితే ఈ తరహా హెచ్చరికలను న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ భయాల్లో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. -
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చినట్లు పత్రాలు సృష్టించి...దానికి సమానమైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. -
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ లైఫ్ స్టయిల్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
న్యూఢిల్లీ: ఆయన రూ. 33,500 కోట్లకు అధిపతి.. వ్యక్తిగత ఐలాండ్, రూ. 100 కోట్లకుపైగా విలువైన కార్లు ఆయన సొంతం.. ఆయన మరెవరో కాదు.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్. ఆయన నేడు (మంగళవారం) తన రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన ఆయన పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.రూ. 33,500 కోట్ల విలువైన ఆస్తి కలిగిన ఆయన విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత అభిరుచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏప్రిల్ 8న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9న ముంబైలో జరిగే వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి ఆయన తిరిగి దుబాయ్ వెళ్లనున్నారు.షేక్ హమ్దాన్ ఆస్తి వివరాలుషేక్ హమ్దాన్ వ్యక్తిగత సంపద సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 33,500 కోట్లు) ఇది ఆయన కుటుంబ ఆస్తిలో భాగంగా కాకుండా వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాల నుండి ఆర్జించినది.రియల్ ఎస్టేట్ ఆయనకు దుబాయ్లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. జాబీల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి.ప్రైవేట్ ఐలాండ్షేక్ హమ్దాన్కు పర్షియన్ గల్ఫ్లోని ఒక ప్రైవేట్ ద్వీపం ఉంది. దీని పేరు సిర్ బానీ యాస్. దీనిని ఆయన విశ్రాంతి తీసుకునేందుకు, సాహస క్రీడలకు వినియోగిస్తారు.ఖరీదైన వాహనాలు ఆయన వద్ద రూ. 100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఇందులో బుగాటీ వెయిరాన్, లంబోర్ఘిని వెనెనో, మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఆర్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.ప్రైవేట్ జెట్లుషేక్ హమ్దాన్ వద్ద బోయింగ్ 747-400, ఎయిర్బస్ ఏ320 లాంటి అత్యాధునిక ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. వీటిని ఆయన అధికారిక, వ్యక్తిగత పర్యటనల కోసం వినియోగిస్తుంటారు.యాచ్లు(చిన్న నౌకలు) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వద్ద దుబాయ్ అనే సూపర్ యాచ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారు రూ. 4000 కోట్లు.పెంపుడు జంతువులు ఆయన వద్ద అరుదైన తెల్ల పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జంతువులను ఆయన దుబాయ్లోని తన ప్రత్యేక ఫామ్హౌస్లో పెంచుతారు.సాహస క్రీడలుషేక్ హమ్దాన్.. స్కైడైవింగ్, రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, ఫాల్కన్రీలపై అమితమైన ఆసక్తి కనబరుస్తారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేస్తుంటారు.వ్యక్తిగత జీవితంషేక్ హమ్దాన్ 1982, నవంబర్ 14న దుబాయ్లో జన్మించారు. తొలుత ఆయన యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్హర్స్ట్లో శిక్షణ పొందారు. తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్గా ఎన్నికయ్యారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగానూ పనిచేస్తున్నారు.సోషల్ మీడియా ‘ఫజ్జా’ పేరుతో సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో ఆయన తాను రాసిన కవితలు, తన జీవనశైలి, సాహస యాత్రలను షేర్ చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘భయపడొద్దు.. ఇన్కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ -
కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు
పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు. అందులోభాగంగా కొందరు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి జంతువుల్లా మారేవాళ్ళు ఉండగా మరికొందరు.. రకరాలక పచ్చబొట్లు పొడిపించుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. కొందరు రకరకాల డ్రెస్సులు వేసుకుని .. మరికొందరు చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వేసుకుని జనాన్ని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ కార్లను.. ఇళ్లను రకరకాలుగా డిజైన్లు చేయించి అందరిచేతా ఔరా అనిపించుకుంటారు..అలాగే స్వీడన్ బాబాయ్ ఫ్రాన్సిస్కో పెరెజ్ కూడా ఇలాగే చిత్రమైన విధంగా ఫోటోషూట్ చేయించుకున్నారు. స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో పెరెజ్ వయసు యాభై ఒక్క ఏళ్ళు. ఆయనకు పెళ్ళి ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు మంచి సృజనాత్మక ఆలోచనలు ఉన్న ఫోటోగ్రాఫర్ మార్టిన్ విల్క్స్ అనే మిత్రుడు ఉన్నారు. మార్టిన్ నిత్యం రకరకాల ఫోటో షూట్లు చేస్తుంటారు. పెళ్ళిళ్లు...రిటైర్మెంట్ ఫంక్షన్లు .. పిక్నిక్కులు..ఎంగేజ్మెంట్లు . పుట్టినరోజులు..ఇలా రకరకాల ఈవెంట్లకు ఫోటో షూట్లు చేయడం ఆయనకు వృత్తి..హాబీ కూడా . అందరూ తీసేలా కాకుండా వినూత్నమైన కాన్సెప్టులతో ఫోటోషూట్లు చేస్తూ అందరి కన్నా భిన్నంగా ఫోటోలు తీస్తుంటారు. సరిగ్గా తన మిత్రుడిలోని సృజనాత్మకతకు తన అభిరుచిని జోడించిన ఫ్రాన్సిస్కో కొత్తగా ఒక ఫోటో షూట్ చేసి అందరిచేతా ఔరా అనిపించుకున్నారు.వాస్తవానికి ఫ్రాన్సిస్కో చిన్నకూతురు నోయెలియా అని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉండగా దాన్ని అప్పట్లో ఆయన బీరు మత్తులో ఉండి నటాలియా గా నమోదు చేయించారు. అయితే దాన్ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె పేరును సరిగ్గా మార్చి దానికి సంబంధించి తన బిడ్డ మళ్ళీ పుట్టింది అంటూ సంబరం చేసుకున్నారుదీనికోసం తన మిత్రుడు అయిన ఫోటోగ్రాఫర్ సాయంతో తానే ఓ గర్భిణి అవతారం ఎత్తి పొట్ట మీద పూల డిజైన్లు..నెత్తికి పూల కిరీటం పెట్టుకుని చెట్లు..చేమలు..వాగులు వంకల వెంట గర్భిణి మాదిరి వగలు పోతూ పొట్టను నిమురుకుంటూ సిగ్గులు ఒలకబోసారు. తను తన బిడ్డకు మళ్ళీ జన్మను ఇచ్చానని చెబుతూ ఇలా ఫోటో షూట్ చేశారు... వీటిని చూసినవాళ్ళంతా ఓర్నీ అసాధ్యం పాడుగాను అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మనలో క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ సంఘటన.. సన్నివేశాన్ని అయినా ఇలా ఆనందంగా వినూత్నంగా మలుచుకోవచ్చని, అందర్నీ ఆకర్షించొచ్చు అని తెలియజెప్పుతున్నారు.:: సిమ్మాదిరప్పన్న -
‘ఇజ్రాయెల్’ను నాశనం చేస్తాం, కిల్ బిల్.. రూ.4 వేల కోట్లు!
జెరూసలేం: ‘ఇజ్రాయెల్’ను సర్వ నాశనం చేయడానికి ఇరాన్ నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ భారీగా సొమ్మును అభ్యర్థించింది. ఈ ‘కిల్ బిల్’… 50 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.4,295 కోట్లు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం ఈ సంగతి వెల్లడించారు.ఇరాన్ నుంచి అంత మొత్తాన్ని హమాస్ నేతలు యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ ఆర్థిక సాయంగా కోరినట్టు తెలిపే ఆధారసహిత పత్రాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ చేతికి చిక్కాయి. సిన్వర్, దీఫ్ ఇద్దరూ ఇటీవల మరణించారు. గాజాపై తాజా దాడుల సందర్భంగా తమ సైనికులకు ఆ పత్రాలు దొరికాయని, వాటిని ఇజ్రాయెల్ రక్షణ బలగాల (ఐడీఎఫ్) ‘ఇంటెలిజెన్స్ కేటలాగ్ యూనిట్’కు పంపామని కాట్జ్ తెలిపారు.(ఫొటో రైటప్: మహమ్మద్ దీఫ్, యాహ్యా సిన్వర్, ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమెనీ (ఎడమ నుంచి కుడికి). వారి వెనుక అక్షరాలతో కనిపిస్తున్నది... హమాస్ సంస్థకు ఇరాన్ ఆర్థిక సాయానికి సంబందించిన రహస్య పత్రం)ఆ పత్రాలు 2020 అక్టోబరు- 2021 జూన్ మధ్య కాలానికి చెందినవని, తాజా యుద్ధం నేపథ్యంలో సిన్వర్ వాటిని భూగర్భ సొరంగంలోకి తెచ్చాడని తెలుస్తోంది. ఇరాన్-హమాస్ దోస్తీకి ఆ పత్రాలు సాక్ష్యాధారాలని కాట్జ్ చెప్పారు. ఇరాన్ అందించిన దన్నుతోనే 2023 అక్టోబరు 7న ఇజ్రాయెలీలపై హమాస్ నరమేధానికి పాల్పడిందని చెప్పారు. 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కావాలని యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ చేసిన విజ్ఞప్తికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ‘కుద్స్ ఫోర్స్’ (పాలస్తీనా వ్యవహారాలు) హెడ్ సయీద్ ఇజాదీ ఆమోదం తెలిపారని కాట్జ్ వెల్లడించారు.ఆంక్షలు, ఆర్థిక సమస్యల్లో ఇరాన్ సతమతమవుతున్నప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలతో నెలకొన్న వైరానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆ మొత్తాన్ని అందించడానికి ఇజాదీ ఒప్పుకున్నారని చెప్పారు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలతోపాటుగా ఇరాక్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలకు మూలం ఇరాన్ అని, ‘పాముకు తల’ ఇరాన్ అని ప్రపంచమంతా గ్రహించాలని కాట్జ్ కోరారు.దాడులకు సంబంధించిన కచ్చితమైన సమయం, ‘అక్టోబరు 7 ప్రణాళికల’ గురించి ఇరాన్ నాయకత్వానికి తెలియదని, అయితే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) శిక్షణ, ఆయుధాలు, నిధులు లేకుండా అక్టోబరు 7న హమాస్ ఊచకోతకు పాల్పడేది కాదని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఇరాన్ నుంచి రూ.1,300 కోట్ల (154 మిలియన్ డాలర్లు) నిధులు హమాస్ ఉగ్ర సంస్థకు బదిలీ అయినట్టు తెలిపే పత్రాలను ఖాన్ యూనిస్ భూగర్భ సొరంగాల నుంచి ఇజ్రాయెల్ రక్షణ బలగాలు సంపాదించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రదర్శించాయి.::జమ్ముల శ్రీకాంత్ -
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్లైన్పై చైనా
వాషింగ్టన్: టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్లైన్పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్లైన్పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. -
మీకెంత ధైర్యం?
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గతవారం జరిగిన సంస్థ 50వ వార్షికోత్సవంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అదే సంస్థ ఉద్యోగిణి వనియా అగ్రవాల్ హఠాత్తుగా వేదిక వద్దకు వచ్చి అక్కడే ఉన్న సంస్థ తాజా, మాజీ సీఈవోలు సత్యా నాదెళ్ల, స్టీవ్ బామర్, బిల్ గేట్స్లనుద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ‘‘మీకెంత ధైర్యం?. యుద్ధంలో ఇజ్రాయెల్కు సాయపడేందుకు మైక్రోసాఫ్ట్కు చెందిన క్లౌడ్, ఏఐ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తారా?. పాలస్తీనియన్ల రక్తంతో సంబరాలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడండి. మైక్రోసాఫ్ట్ అందించిన టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోంది. దీంతో యుద్ధంలో గాజాలో 50,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇకనైనా మీరు ఇజ్రాయెల్తో కాంట్రాక్ట్ను తెగతెంపులు చేసుకోండి’’అని వనియా బిగ్గరగా అరిచారు. దాంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆమెను వెనక్కి లాక్కెళ్లారు. సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఘటన తర్వాత వాణియా మైక్రోసాఫ్ట్లోని ఏఐ విభాగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అజూర్ క్లౌడ్, కృత్రిమ మేధ టెక్నాలజీలను వాడుకునేందుకు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్తో దాదాపు రూ.1,144 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కుదుర్చుకుందని వనియా ఆరోపించారు. వనియాపైనా నెటిజన్ల విమర్శలు సొంత సంస్థపై ఆరోపణలు చేసిన వనియాపై పలువురు నెటిజన్లు విమర్శిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమెను పాలస్తీనాకు పంపించండి. హమాస్ వాళ్లు ఈమెను బాగా చూసుకుంటారు’, ‘ఈమె నకిలీ హిందువు. ఈమెకు జిహాదీతో పెళ్లిచేయాలి’, ‘ఈమెను అమెరికా నుంచి బహిష్కరించి ఇండియాకు పంపేయాలి’, ‘ఇండియాకు వద్దు. పాలస్తీనాకు పంపాలి’, ‘పాలస్తీనాకు పంపేయండి. హమాస్కు మద్దతుగా ఎంచక్కా కొత్త సాఫ్ట్వేర్, ఏఐ వ్యూహాలు సిద్ధంచేస్తుంది’అంటూ వేర్వేరు రకాలుగా విమర్శించారు. -
నీటిలో కరిగే ప్లాస్టిక్!
రిమోట్ కంట్రోల్, ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్, టీవీ, కంప్యూటర్, క్యాలిక్యూలేటర్, గేమ్ కంట్రోలర్, కీబోర్డ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత విలువైన లోహాలు, ఎల్రక్టానిక్ వస్తువుల సమ్మేళనంగా రూపొందిన ఉపకరణాలెన్నింటినో మనం దైనందిన జీవితంలో వాడి పాడుచేసి పడేస్తున్నాం. ఈ ఎల్రక్టానిక్ వ్యర్థ్యాలు అలాగే భూమిలో కలుస్తూ భూకాలుష్యానికి కారణమవుతున్నాయి. ఏటా పేరుకుపోతున్న ఇ–వేస్ట్లో తిరిగి పునఃశుద్ధికి నోచుకునే లోహాల పరిమాణం అత్యంత సూక్ష్మం. అత్యంత విలు వైన, అరుదైన లోహాలు, ఖనిజాలతో తయారైన వస్తువుల నుంచి కేవలం 1 శాతం లోహాలనే తిరిగి రీసైక్లింగ్ చేయగల్గుతున్నాం. ఇలా ఇప్పటికే రూ.5.32 లక్షల కోట్ల విలువైన లోహాలు ఎల్రక్టానిక్ డివైజ్ల నుంచి రీసైక్లింగ్కు నోచుకోకుండా మట్టిలో కలిసిపోయాయి. వీటిని ఇలా వృథాగా పోనివ్వకుండా పూర్తిగా ఒడిసిపట్టే అద్భుత ఆలోచనను పెంటాఫామ్ అనే అంకుర సంస్థ అమల్లోకి తెచ్చింది. ఎల్రక్టానిక్ డివైజ్, దాని సర్క్యూట్ను నీటిలో కరిగిపోయే ప్లాస్టిక్ మదర్బోర్డ్కు అమరిస్తే ఆ డివైజ్ పాడయ్యాక నీటిలో ఉంచితే ఆ సర్క్యుట్లోని విలువైన లోహాలను తిరిగి సులభంగా సంగ్రహించవచ్చు. ఇలా ఇ–వేస్ట్ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతున్న అద్భుత ‘ఆక్వాఫేడ్’ప్లాస్టిక్ కథాకమామిషు ఇదీ.. ఆరు గంటల్లో పూర్తిగా కరుగుతుంది మూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా 6.2 కోట్ల టన్నుల ఇ–వేస్ట్ పోగుబడిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ ఎల్రక్టానిక్స్ చెత్తను కోట్లాది లారీల్లో నింపితే అవి భూమధ్యరేఖ పొడవునా దారి కడతాయని ఐరాస పేర్కొంది. పాదరసం, లెడ్ వంటి వాటితోపాటు బంగారం వంటి అత్యంత ఖరీదైన లోహాలతో కొన్ని ఎల్రక్టానిక్ డివైజ్ల సర్క్యూట్లను తయారుచేస్తారు. భూమి ఎల్రక్టానిక్ వ్యర్థ్యాల కుప్పగా తయారవుతున్న దారుణ పరిస్థితుల్లో ఓవైపు ఇ–వేస్ట్ను తగ్గిస్తూనే మరోవైపు లోహాలను సంగ్రహించేలా ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ను తయారుచేశామని పెంటాఫామ్ వ్యవస్థాపకులు, ఆక్వాఫేడ్ సహ ఆవిష్కర్తలు శామ్యూల్ వాంగ్సపుత్రా, జూన్సంగ్ లీ చెప్పారు. రీసైక్లింగ్ అవుతున్న వాటితో పోలిస్తే పెరుగుతున్న ఇ–వేస్ట్ పరిమాణం ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ. అందుకే దీనిని పరిష్కారం కనుగొన్నామని సంస్థ వ్యవస్థాపకులు చెప్పారు. ఆక్వాఫేడ్ ప్లాస్టిక్ కేసింగ్తో తయారైన ఎలక్టానిక్ గ్యాడ్జెట్ను నీటితో నింపిన పాత్రలో ఉంచితే ప్లాస్టిక్ దాదాపు ఆరు గంటల్లో పూర్తిగా కరుగుతుంది. అప్పడు డివైజ్లోని ఖరీదైన లోహాలు, ఇతర ఎల్రక్టానిక్ సూక్ష్మభాగాలను చేతితో విడివిడిగా తీయొచ్చు. ప్లాస్టిక్ కరిగిన నీటిని పారబోస్తే సరిపోతుంది. ఈ ప్లాస్టిక్ కేసింగ్ను గ్యాడ్జెట్ తయారుచేసిన కొత్తలో మొదట నీరు తగిలితే మెత్తబడకుండా ఉండేలా వాటర్ప్రూఫ్ కోటింగ్తో సిద్ధంచేస్తారు. ‘‘పాడైన ఎల్రక్టానిక్ వస్తువు నుంచి విలువైన లోహాలను జాగ్రత్తగా బయటకు తీయడం ఇ–వేస్ట్ కార్మికులకు తలకు మించిన భారం. ఎంతో కష్టపడినా పూర్తిస్థాయిలో విలువైన లోహాన్ని బయటకు తీయలేం. అదే ఆక్వాఫేడ్ ప్లాస్టిక్తో తయారైన గ్యాడ్జెట్ నుంచి సులభంగా లోహాలను వేరేచేయొచ్చు’’అని శామ్యూల్ వాంగ్సపుత్రా అన్నారు. అంట్లు తోముతుంటే మెరిసిన ఆలోచన! గొప్ప ఆవిష్కరణలెన్నో విచిత్రంగా జరిగాయని వింటుంటాం. ఆక్వాఫేడ్ సైతం అలా వచ్చిందే. ఈ విషయాన్ని స్వయంగా వాంగ్సపుత్రా వెల్లడించారు. ‘‘ఓరోజు నేను అంట్లు తోముతుంటే అంట్లు తోమే సబ్బు నీరు తగలగానే పాత్రలను శుభ్రం చేస్తూనే మటుమాయం కావడం చూశా. సబ్బు తన విధి నిర్వర్తించి తర్వాత అంతర్థానమవడం గమనించా. ఎల్రక్టానిక్ సర్క్యూట్లను పట్టి ఉంచే ప్లాస్టిక్ కేసింగ్ కూడా తర్వాత అదృశ్యమైతే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ ఆక్వాఫేడ్ పురుడుపోసుకుంది. ఒక వినూత్న పాలిమర్తో కొత్తరకం ప్లాస్టిక్ తయారుచేస్తే బాగుంటుందని భావించాం. ఇందుకోసం ఈ రంగంలో నిపుణులైన లండన్ ఇంపీరియల్ కాలేజీలో ‘మెటీరియల్’శాస్త్రవేత్తలు ఎన్రికో మ్యాన్ఫ్రెడీ–హేలాక్, మరియం లామారిలతో చేతులు కలిపి కొత్త ప్లాస్టిక్ను సృష్టించాం’’అని ఆయన చెప్పారు. ఈ ప్లాస్టిక్ను వాణిజ్యపర ఉత్పత్తుల అవసరాల కోసం ఇంకా వినియోగించలేదు. పూర్తిస్థాయి పరీక్షల తర్వాత ఇది భిన్నరకాల డివైజ్ల కేసింగ్ కోసం ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాజాపై ఇజ్రాయెల్ దాడులు
డెయిర్ అల్–బలాహ్: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఖాన్ యూనిస్లోని నాజర్ ఆసుపత్రి వెలుపల ఉన్న టెంట్లపై జరిపిన దాడిలో పాలస్తీనా టుడే టీవీ స్టేషన్ రిపోర్టర్ యూసుఫ్ అల్ ఫకావితోపాటు మరో రిపోర్టర్ మృతి చెందారు. ఆరుగురు విలేకరులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరికి తీవ్ర కాలిన గాయాలు కాగా, మరొకరికి తలకు తూటా గాయమైనట్టు పాలస్తీనా మీడియా తెలిపింది. ఖాన్ యూనిస్ లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. వెస్ట్ బ్యాంక్లోని టర్మస్ అయా సమీపంలో రాళ్లు విసిరిన ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కానీ బాధితుడు 14 ఏళ్ల పాలస్తీనా–అమెరికన్ అని హమాస్ పేర్కొంది. సోమవారం ఈ ప్రాంతంలో వేర్వేరు దాడుల్లో పదిహేను మంది మృతి చెందగా 9 మందికి పైగా గాయపడ్డట్టు నాజర్ ఆస్పత్రి తెలిపింది. రాత్రి వరకే ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా మరో 13 మంది మృతదేహాలు వచ్చినట్టు వెల్లడించింది. డెయిర్ అల్–బలాహ్లోని అల్–అక్సా అమరవీరుల ఆసుపత్రి అంచున ఉన్న గుడారాలపై ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు గాయపడ్డారని ఆసుపత్రి తెలిపింది. ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారని, ముగ్గురు గాయపడ్డారని వెల్లడించింది. 2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో వారానికి సగటున 13 మంది చొప్పున ఇప్పటిదాకా 232 మంది జర్నలిస్టులు మృతి చెందినట్టు అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ నివేదిక వెల్లడించింది. రెండు ప్రపంచ యుద్ధాలు, వియత్నాం యుద్ధం, యుగోస్లేవియా యుద్ధాలు, అఫ్గానిస్తాన్లో అమెరికా యుద్ధం కంటే గాజాలోనే ఎక్కువ మంది జర్నలిస్టులు మరణించారు. తాము హమాస్పై మిలిటెంట్ల టెంట్పైనే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘‘పౌరులకు హాని జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ మిలిటెంట్లు నివాస ప్రాంతాల్లో లోతుగా పాతుకుపోయారు. పౌరుల మరణాలకు హమాసే కారణం’’ అని ఆరోపించింది. -
రాణా పిటిషన్ తిరస్కరణ
న్యూయార్క్: ముంబై ఉగ్ర దాడుల నిందితుడు తహవ్వుర్ రాణా (64)కు మరోసారి చుక్కెదురైంది. తనను భారత్కు పంపొద్దంటూ అతను పెట్టుకున్న పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. న్యూయార్క్లోని భారత సంతతికి చెందిన అటార్నీ రవీ బత్రా పీటీఐకి ఈ మేరకు వెల్లడించారు. ముంబై దాడులకు తెగబడ్డ పాకిస్తానీ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాకు సాయపడటమే గాక డెన్మార్క్లో ఉగ్ర దాడికి అన్నివిధాలా మద్దతిచ్చారంటూ రాణాపై అమెరికాలో దాఖలైన అభియోగాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రస్తుతం అతను లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఖైదీగా ఉన్నాడు. రాణాను భారత్కు అప్పగించేందుకు అమెరికా కోర్టులు ఇప్పటికే అనుమతించాయి. కోర్టు విచా రణ ఎదుర్కొనేందుకు అతన్ని త్వరలో భారత్ పంపనున్నట్టు టంప్ కూడా వెల్లడించారు. -
ఏఐకి మానవమేధ
మానవునికి మాత్రమే సాధ్యమయ్యే అపార మేధస్సును త్వరలోనే కృత్రిమమేధ సాధించనుందని గూగుల్ సంస్థ సంచలన అంచనాకొచ్చింది. సృజనాత్మకత, మానవీయత, ఉద్వేగాలు మనిషికి మాత్రమే సొంతమని, మరమనుషుల్లాంటి కృత్రిమ మేధకు ఇవి సాధ్యం కాదని ఇన్నాళ్లూ శాస్త్రవేత్తల్లో ఉన్న అభిప్రాయాలు త్వరలో పటాపంచలు కాబోతున్నాయని గూగుల్ అనుబంధ డీప్మైండ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు షేన్లెగ్ ఒక అంచనాకొచ్చారు. షేన్లెగ్ సహ రచయితగా సేవలందించిన ఒక విస్తృతస్థాయి నూతన పరిశోధన పత్రంలో సంబంధిత వివరాలున్నాయి. మానవాళికి కృత్రిమమేధ పెనుముప్పుగా పరిణమించనుందని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఏజీఐతో వినాశనం కృత్రిమ మేధ మానవ స్థాయి మేధస్సును సాధించడాన్ని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అంటారు. 2030 ఏడాదికల్లా ఏజీఐ సాకారమవుతుందని పరిశోధనా పత్రం అంచనా వేసింది. అసాధారణ ప్రజ్ఞాపాటవాలున్న ఏజీఐ సృష్టించే పెనుమార్పులకు మానవాళి వినాశనం చెందే ప్రమాదముందని అభిప్రాయపడింది. ‘‘ఏజీఐ ఎంతటి తీవ్రమైన హాని కల్గిస్తుందనే విషయం కంటే ఆ హాని తాలూకు దుష్పరిణామాలను సమాజం ఏ మేరకు తట్టుకోగలదు, ఎంతమేరకు కోలుకుని మనుగడ సాగించగలదనేవే ఇక్కడ ప్రధానం’’ అని పరిశోధన పత్రంలో అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. అయితే మానవాళికి ఏజీఐ ఏ రకమైన హాని తలపెడుతుంది, వాటి తీవ్రత ఎంత ఉండొచ్చనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. కాకపోతే ఏజీఐ ముప్పును ఎదుర్కొనేలా మానవాళి ఇప్పటినుంచే సంసిద్ధం కావాల్సిన అవసరం చాలా ఉందని నొక్కిచెప్పారు. గూగుల్, ఇతర కృత్రిమమేధ రంగ సంస్థలు కలిసి ఈ సమస్యకు ఉమ్మడి పరిష్కారం కనిపెట్టాలని సూచించారు. అంతా అస్తవ్యస్తం అందుబాటులో ఉన్న సమాచారంతో ఏజీఐ చాలా గిమ్మిక్కులు చేయొచ్చు. డేటాను తమకు అనుకూలంగా మార్చేయొచ్చు. దురి్వనియోగం చేయొచ్చు. తప్పులతడకగా డేటాలో మార్పులు చేయొచ్చు. డేటా ప్రాథమిక లక్ష్యాన్నే ఏమార్చొచ్చు. ఇతరులకు హాని తలపెట్టేందుకు ఇప్పటికే కొందరు ఏఐను విస్తృతంగా దురి్వనియోగం చేస్తున్న నేపథ్యంలో ఏజీఐ ఇంకెంత హాని తలపెట్టొచ్చనే అంచనాలను పరిశోధన పత్రం ప్రస్తావించింది. ‘‘వచ్చే పదేళ్లలో ఏజీఐ అందుబాటులోకి రావొచ్చు. అది మానవమేధను మించిపోవచ్చు. అప్పుడది సొంతంగా ఆలోచిస్తూ తనకు నచ్చిన ఫలితాలనే ఇవ్వొచ్చు’’ అని డీప్మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ ఫిబ్రవరిలో ఆందోళన వ్యక్తంచేయడం తెలిసిందే. ఏజీఐలను సహేతుకతతో మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడేలా, వినాశనానికి తావులేకుండా అభివృద్ధి చేయాలని, సంబంధిత సంస్థలన్నింటిపై అజమాయిïÙగా ఐరాస వంటి నియంత్రణ వ్యవస్థ ఉండాలని ఆయన కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. ‘‘ఏజీఐ అత్యంత సురక్షిత వ్యవస్థగా మాత్రమే ఉండేలా, సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లో పడకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రపంచ దేశాల్లో ఏజీఐల కోసం ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయనే దానిపై నిఘా ఉండాలి. మానవాళికి సురక్షితం కాని ప్రాజెక్టులపై కన్నేసి ఉంచేలా పెద్దన్న వంటి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి’’ అని డెమిస్ గతంలో అన్నారు.ఏమిటీ ఏజీఐ? కృత్రిమమేధ (ఏఐ) మరో ముందడుగు వేస్తే అదే ఏజీఐ. ఏఐ మనమిచ్చిన పనులు, టాస్క్లను మాత్రమే పూర్తి చేస్తుంది. అంతకుమించి సొంతంగా ఆలోచించదు. కానీ ఏజీఐ అలా కాదు. ఇచ్చిన పనిని ఎందుకిచ్చారు, అందులో ఎంత చేయాలి, ఆ పని అసలు నాకెందుకిచ్చారు, ఇచ్చిన డేటాలో భవిష్యత్తులో నా సొంతానికి పనికొచ్చేవి ఏమేమున్నాయి వంటివాటిని స్వీయసమీక్ష చేసుకోగలదు. అంటే సొంతంగా ఆలోచించగలదు. తుది ఫలితం పొందడం కోసం మనం ఏజీఐకు ఏదైనా సమాచారమిస్తే అది డేటాను అర్థంచేసుకుని, వాటి నుంచి కొత్త విషయాలను నేర్చుకుని, తనకు అన్వయించుకుని తుది ఫలితాన్నిస్తుంది. ఆ వివరాలను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది. దాంతో భవిష్యత్తులో మానవులు అడిగే, కోరే, అభ్యర్థించే విషయాలపై ఏఐ సైతం సొంత నిర్ణయం తీసుకున్నాకే పని మొదలుపెడుతుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మానవమేధను ఔపోసన పట్టే ఏజీఐ మనిషి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరో 50 శాతం వేస్తాం
వాషింగ్టన్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికాపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్ణయాన్ని మంగళవారంలోగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బుధవారం నుంచి చైనాపై ఏకంగా మరో 50 శాతం అదనపు సుంకాలు విధిస్తానని సోమవారం హెచ్చరించారు. అంతేకాదు, ‘‘చైనా విజ్ఞప్తి మేరకు పలు అంశాలపై ఆ దేశంతో పురోగతిలో ఉన్న అన్నిరకాల చర్చలనూ ఉన్నపళాన నిలిపేస్తాం. బదులుగా ఇతర దేశాలపై దృష్టి సారిస్తాం. ఆయా రంగాల్లో వాటితో బంధాలను పటిష్టం చేసుకుంటాం’’ అని కుండబద్దలు కొట్టారు. చైనాపై ట్రంప్ ఇటీవలే 34 శాతం సుంకాలు విధించడం, బదులుగా అమెరికాపైనా అంతే శాతం సుంకాలు విధిస్తున్నట్టు చైనా ప్రకటించడం తెలిసిందే. అంతేగాక తమనుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు కీలక ఖనిజాలపై ఆంక్షలు కూడా విధించింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడుతూ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్లో పలు పోస్టులు పెట్టారు. ‘‘అమెరికా ఉత్పత్తులపై చైనా ఏళ్లుగా రికార్డు స్థాయిలో భారీ టారిఫ్లు వసూలు చేస్తోంది. అవి చాలవన్నట్టు నిన్న మరో 34 శాతం ప్రతీకార సుంకాలు విధించింది. ఇవిగాక చైనా కంపెనీలు అనైతిక సబ్సిడీలు, భారీ ద్రవ్య అవకతవకల వంటివాటికి పాల్పడుతూ వస్తున్నాయి! నేను విధించిన సుంకాలపై ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సహించబోమని స్పష్టంగా హెచ్చరించా. వాటిపై అదనపు బాదుడు తప్పదని అప్పుడే స్పష్టం చేశా. చైనా ఇప్పుడు వాటిని రుచిచూడబోతోంది’’ అని ప్రకటించారు. అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు తన సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ పతనమవుతున్నా ట్రంప్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం కోరల్లో చిక్కుతోందని ఆర్థిక నిపుణులంతా గగ్గోలు పెడుతున్నా అదేమీ లేదని చెప్పుకొచ్చారు. ఎవరేమన్నా సుంకాలపై తగ్గే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలంటికీ అమెరికా గత పాలకులు, తమను ఇంతకాలంగా దోచేసిన చైనా వంటి దేశాలే కారణమని నిందించారు. ‘‘ఒక్కోసారి చేదుగా ఉన్నా చికిత్స తప్పదు. నా చర్యల ఫలితాలు ఇప్పటికే కని్పస్తున్నాయి. చమురు ధరలు దిగొచ్చాయి. వడ్డీ రేట్లూ తగ్గుముఖం పడుతున్నాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గుతున్నాయి. ఇక ద్రవ్యోల్బణం ఎక్కడున్నట్టు? పలు దేశాలు అమెరికాను ఇంతకాలం పీల్చి పిప్పి చేశాయి. ముఖ్యంగా చైనా! ఇప్పుడు చూడండి, నా టారిఫ్ల దెబ్బకు చైనా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇకపై అమెరికాకు ప్రతి వారం ఏకంగా బిలియన్ల కొద్దీ డాలర్లు వచి్చపడతాయి. చూసుకోండి’’ అంటూ స్పష్టం చేశారు.ఇక భారత్లోనే ఉత్పత్తి! యాపిల్, సామ్సంగ్ యోచన మొబైళ్ల తయారీ దిగ్గజాలు యాపిల్, సామ్సంగ్ ట్రంప్ టారిఫ్ల ప్రభావాన్ని తప్పించుకునే మార్గాల అన్వేషణలో పడ్డాయి. తమ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రాలను లాభదాయక ప్రాంతాలకు తరలించాలని యోచిస్తున్నాయి. వియత్నాంపై 46 శాతం చైనాపై 34 శాతం చొప్పున సుంకాలు విధించిన ట్రంప్ భారత్పై 26 శాతంతో సరిపెట్టడం తెలిసిందే. దాంతో భారత్లో ఉత్పత్తిని వీలైనంతగా పెంచడంతో పాటు అంతర్జాతీయ ఉత్పత్తి వ్యవస్థలను వీలైనంత వరకూ ఇక్కడికి తరలించాలని యాపిల్, సామ్సంగ్ యోచిస్తున్నట్టు సమాచారం. యాపిల్ చాలాకాలంగా భారత్లో ఐఫోన్లు తయారు చేస్తోంది. ‘‘చైనాలో ఉత్పత్తిని వీలైనంతగా తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయానికి వచి్చంది. ఇకమీదట అమెరికాకు కేవలం భారత్లో తయారైన ఐఫోన్లనే పంపనుంది. ప్రస్తుతానికి చైనాలో తయారు చేసిన ఫోన్లను యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలకు పంపిస్తుంది’’ అని కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ వార్తలొస్తున్నాయి. అంతేగాక ట్రంప్ టారిఫ్ల దెబ్బకు అమెరికాలో ఐఫోన్ల ధరలు 40 శాతం దాకా పెరగవచ్చంటున్నారు. -
ఓవైపు ప్రపంచ మార్కెట్లు కుదేలు.. ట్రంప్ ఆసక్తికర ప్రకటన
ట్రంప్ టారిఫ్ల దెబ్బకు.. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయినా కూడా వాణిజ్య సుంకాల విషయంలో తన నిర్ణయమే కరెక్ట్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ‘‘సవరించేదే లే..’’ అని భీష్మించుకుని కూర్చున్నారు. అయితే అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లు కుదేలు అవుతున్న వేళ తాజాగా మరోసారి ఆసక్తికర ప్రకటన చేశారాయన. వాషింగ్టన్: ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald rump) తోసిపుచ్చారు. ట్రూత్ సోషల్లో ఆయన చేసిన తాజా పోస్ట్ సారాంశం.. ‘‘ చమురు ధరలు తగ్గాయి, వడ్డీ రేట్లు తగ్గాయి. ఆహార పదార్థాల ధరలూ తగ్గాయి. కాబట్టి ద్రవ్యోల్బణం లేదు. చాలాకాలంగా అన్యాయానికి గురైన అమెరికా, ప్రతీకార సుంకాల ద్వారా సంబంధిత దేశాల నుంచి బిలియన్ల డాలర్లు తీసుకు వస్తోందని అన్నారాయన. అన్నింటికంటే.. అతిపెద్ద దుర్వినియోగదారు దేశమైన చైనా(China) మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి, ఆ దేశంపై సుంకాలను 34% పెంచినప్పటికీ.. ప్రతీకారానికి దిగొద్దన్న నా హెచ్చరికను పట్టించుకోలేదు. అమెరికా గత నాయకుల వల్లే దశాబ్దాలుగా వాళ్లు అడ్డగోలుగా సంపాదించున్నారు. ఇక.. అమెరికాను మళ్ళీ గొప్పగా తీర్చిదిద్దండి! అని పోస్ట్ చేశారాయన. ఇదిలా ఉంటే.. అమెరికా వేసిన సుంకాలకు దీటుగా స్పందించిన చైనా (China) అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా (USA) విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని చైనా ఆరోపించింది. ఏకపక్షంగా, ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొంది. ఈ క్రమంలో.. వాషింగ్టన్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్లను (US tariffs) విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని చైనాకు చెందిన ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది. ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. చైనా భయపడిందని, తప్పు నిర్ణయం తీసుకుందన్నారు. ‘‘చైనా తప్పిదం చేసింది. వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వారికి మరో మార్గం లేదు’’ అని అన్నారాయన. -
‘అసమానతలను అర్థం చేసుకోండి’: బిల్గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత దానగుణం కలిగిన వ్యక్తిగా పేరొందిన బిల్ గేట్స్(Bill Gates) భారతీయ యువతకు అమూల్యమైన సలహా అందించారు. ‘ప్రయాణాలు చేయండి.. మీకు ఉన్నటువంటి అవకాశాలను పొందలేనివారిని చూసి, పరిస్థితులను అర్థం చేసుకోండి’ అని బిల్గేట్స్ అన్నారు. ఈ మాటను అనుసరించే యువతీయువకులు వారి దృక్పథాన్ని విస్తృతం చేసుకుంటుంటారని, ప్రపంచంలోని విభిన్న జీవన పరిస్థితులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారనే భావనతో బిల్గేట్స్ ఈ సూచన చేశారు.భారతదేశంలోని యువతను ఉద్దేశిస్తూ బిల్గేట్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినదాని ప్రకారం ప్రయాణం చేయడం ద్వారా యువత వివిధ సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులు(Financial conditions), సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతుంది. ఇది వారిలో సానుభూతి, అవగాహన, బాధ్యతను పెంపొందిస్తుందని బిల్గేట్స్ భావించారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశంలో యువతకు అవకాశాలు అసమానతలతో కూడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దానిని అర్థం చేసుకుంటే వారు జీవితంలో, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి దోహదపడతారని ఆయన అభిప్రాయపడ్డారు.గేట్స్ ఈ సందర్భంగా భారతదేశం(India)లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి, సాంకేతిక అభివృద్ధిని ప్రశంసించారు. అయితే ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదని, యువత దానిని గుర్తించడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించడం ద్వారా యువత తమకంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి, వారికి సహాయం చేయడానికి లేదా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రేరణ పొందుతుందని బిల్గేట్స్ పేర్కొన్నారు.గేట్స్ తరచూ విద్య, ఆరోగ్యంతో పాటు సమాజంలోని అసమానతలను తగ్గించడంపై దృష్టి సారిస్తుంటారు. భారతదేశంలోని యువత, దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారాల కోసం కృషి చేయాలని గేట్స్ సూచించారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఈ సలహా భారతీయ యువత విజయం సాధించేందుకు, వారు సమాజంలోని ఇతరుల జీవన స్థితిగతులను అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: తరచూ బీహార్కు రాహుల్.. మహాకూటమి ప్లాన్ ఏమైనా.. -
Rat Ronin: వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో
ఓ మూషికం సరికొత్త రికార్డ్లను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడడంలో పాత రికార్డ్లన్నీ తిరగ రాసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది. కాంబోడియా దేశానికి చెందిన భూముల్లో ఉన్న బాంబులను గుర్తించడమే ఎలుక రోనిన్ పని. తాజాగా రోనిన్ బాంబుల వేటలో ప్రపంచంలోనే తొలిసారి వందకు పైగా ల్యాండ్మైన్లు, ఇతర యుద్ధ అవశేషాలను గుర్తించిన ఎలుకగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.అఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ రాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటివరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకలలో అత్యధిక మైన్లు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా, కాంబోడియా ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో రొనిన్ బాధ్యతలు అత్యద్భుతమని కొనియాడింది. ఎలుక రోనిన్ గురించి పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల వయస్సున్న రోనిన్ మంచి పనిమంతుడు. అందరితో స్నేహంగా ఉండటమే కాదు..శాంతంగా ఉంటాడట. రోనిన్ విజయానికి కారణం ఏకాగ్రత, ఒత్తిడిలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, రోనిన్ తెలివితేటలు, సహజమైన ఆసక్తి నిత్యం చురుగ్గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే కాబోలు భూమిలో బాంబులు గుర్తించడం రోనిన్కు ఒక ఆటలా ఉంటుంది’ అని ఏపోపో ప్రతినిధి లిల్లీ షాలోమ్ అన్నారు.రోనిన్ సంరక్షణ చూసుకునే ఫానీ మాట్లాడుతూ.. ‘రోనిన్ విజయాలు ఎలుకల అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. రోనిన్ను కేవలం బాంబుల్ని నిర్విర్యం చేసే ఎలుక అని అనుకోం. మేం అతన్నిఫ్రెండ్గా, సహచరుడిగా భావిస్తాం’ అని అన్నారు.ఏపోపో సంస్థ దాదాపు ముప్పై సంవత్సరాలుగా భూమిలోని బాంబులను గుర్తించేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. రోనిన్,అతని సహచరులు ప్రతి రోజూ మైన్లు ఉండే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారు. మైన్లు ఉన్నాయన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాటిని విడిచిపెడతారు. ఎలుక తమ అసాధారణమైన ప్రతిభతో మైన్లు ఉన్న ప్రదేశంపై ఉన్న మట్టిని కొరుకుతాయి. అలా ఓ నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత విధుల నుంచి పదవీ విరమణ చేస్తాయి.కాంబోడియాలో ఇరవై ఏళ్లపాటు అంతర్యుద్ధాలు జరిగాయి. చివరికి యుద్ధాలు 1998లో ముగిశాయి. అయినప్పటికీ ఇంకా ప్రపంచంలో అత్యధికంగా ల్యాండ్ మైన్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో కాంబోడియా భూముల్లో ల్యాండ్ మైన్లతో పాటు ఇంకా పేలని పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ దేశంలో సగటున 40వేల మందికి పైగా ఈ ల్యాండ్ మైన్ల వల్ల కాళ్లను పోగొట్టుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. రోనిన్కు ముందు మగావా అనే ఎలుకనే అత్యధిక బాంబులు గుర్తించాడు. మగావా 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, అయిదేళ్ల కాలంలో 71 మైన్లు, 38 పేలని బాంబులను గుర్తించాడు. అతడికి సేవల గుర్తింపుగా పీడీఎస్ఏ అనే జంతు సంక్షేమ సంస్థ నుండి సాహస వీరుడి పతాకాన్ని అందుకున్నాడు. 2022 జనవరిలో వృద్ధాప్యంతో మగవా మరణించాడు. -
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్
రియాద్: హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్కాని యాత్రికుల కారణంగా హజ్లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా -
ఉక్రెయిన్పై రష్యా దాడులు.. ట్రంప్ రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయకుండా తాము రష్యాను ఆపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. యుద్ధం కారణంగా ప్రతీ వారం వేలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై స్పందించారు. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తోంది. మేము రష్యాతో మాట్లాడుతున్నాం. దాడులను ఆపాలని మేము కోరుకుంటున్నాం. నిరంతరం రష్యా బాంబు దాడులు చేయడం సరికాదు. దాడుల కారణంగా ప్రతీ వారం వేలాది పౌరులు చనిపోతున్నారు. ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. కాల్పులు విరమణపై చర్చలు జరుగుతున్నాయి. రష్యాను ఒప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇటీవల పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన అనంతరం.. కాల్పుల విరమణ ఒప్పందానికి మాస్కో కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే, రష్యాపై పశ్చిమదేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలుచేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక.. జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్ను ఉక్రెయిన్కు తిరిగిచ్చేందుకు కూడా రష్యా నిరాకరిస్తున్నట్లు సమాచారం. కీవ్తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.#WATCH | On the ongoing Russia-Ukraine war, and if any peace deal is expected, US President Donald Trump says, "We are talking to Russia, we would like them to stop. I don't like them bombing on and on, and every week thousands of young people being killed."(Source - US Network… pic.twitter.com/L15l0oECdw— ANI (@ANI) April 7, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రైవీరిపై శుక్రవారం రష్యా క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం 18 మంది మరణించారు. ఈ ఘటనపై ఉక్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించిన తీరుపై జెలెన్స్కీ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. జెలెన్స్కీ మాట్లాడుతూ..‘క్రైవీరిపై జరిగిన దాడి విషయంలో అమెరికన్ ఎంబసీ స్పందన పేలవంగా ఉంది. అంత పెద్ద దేశం ఇలాంటి బలహీన ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది. చిన్నారులను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు ‘రష్యన్’ అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. యుద్ధం ముగియాలి. అయితే ఈ ఉద్రిక్తతలను ముగించాలనే ఉద్దేశం రష్యాకు లేదు. కాల్పుల విరమణను కాకుండా చిన్నారుల ప్రాణాలు తీయడాన్ని మాస్కో ఎంచుకుంటోంది. అందుకే ఆ దేశంపై పూర్తిస్థాయి ఒత్తిడి తీసుకురావాలి’ అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రష్యా దాడిపై జపాన్, స్విట్జర్లాండ్ దేశాల రాయబార కార్యాలయాలు స్పందించిన తీరును జెలెన్స్కీ ప్రశంసించారు. -
సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
టోక్యో: జపాన్లో హెలికాప్టర్ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెడికల్ హెలికాప్టర్ సముద్రంలో కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించాయి. మృతిచెందిన వారిలో వైద్యుడి కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. జపాన్లో సాధారణంగా డాక్టర్ హెలికాప్టర్ అని పిలువబడే విమానం Medevac EC-135 ప్రమాదానికి గురైంది. ఆదివారం నాగసాకి ప్రిఫెక్చర్లోని విమానాశ్రయం నుండి ఫుకుయోకాలోని ఆసుపత్రికి రోగులను తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. నైరుతి జపాన్ ప్రాంతంలోని సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన జపాన్ కోస్ట్ గార్డ్, సహాయక బృందాలు ముగ్గురిని కాపాడారు.అనంతరం, ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో వైద్య వైద్యుడు కీ అరకావా (34), రోగి మిత్సుకి మోటోయిషి (86), ఆమె సంరక్షకురాలు కజుయోషి మోటోయిషి (68) ఉన్నారని అధికారులు తెలిపారు. తరువాత వారి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా నీటి నుండి వెలికితీశారు. ప్రాణాలతో బయటపడిన వారిలో హెలికాప్టర్ పైలట్ హిరోషి హమడ (66), మెకానిక్ కజుటో యోషిటకే, నర్సు సకురా కునిటకే(29) ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ముగ్గురు హైపోథర్మియాకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు. #Breaking A Medevac EC-135 crashed off Nagasaki (Japan). 3 of 6 aboard died. Helicopter had been missing east of Tsushima island, found floating upside fown near Iki island. Helicopter [Registration “JA555H”] was operated by “SGC Saga Aviation opf Fukuoka Wajiro Hospital” pic.twitter.com/M5J4t7vf0H— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) April 6, 2025 -
టారిఫ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్లో.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్కు హ్యాండ్సాఫ్ సెగసోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు. ‘టారిఫ్ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు. -
లాక్డౌన్లోకి కెనడా పార్లమెంట్
ఒట్టావా: కెనడా పార్లమెంట్ భవనం శనివారం ఉన్నట్టుండి లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఓ వ్యక్తి ఆ భవనంలోకి అనధికారికంగా ప్రవేశించి, రాత్రంతా అక్కడే ఉండడమే ఇందుకు కారణమని పోలీసులు చెప్పారు. పార్లమెంట్ హిల్స్ ఈస్ట్ బ్లాక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆగంతకుడి వద్ద ఏవైనా ఆయుధాలు ఉన్నాయా? అనే తెలియరాలేదు. ఈస్ట్ బ్లాక్లో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని పోలీసులు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అన్నారు. ఆగంతకుడు ఎవరిపైనా దాడి చేయలేదని వెల్లడించారు. అతడు ఎవరు? ఎలా లోపలికి వచ్చాడు? అతడి ఉద్దేశం ఏమిటి? అతడి వెనుక ఎవరున్నారు? అనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ మార్చి 23న పార్లమెంట్ను రద్దుచేసిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. -
ఎటుచూసినా చెత్తకుప్పలే!
బర్మింగ్హామ్: బ్రిటన్లో రెండో అతిపెద్ద నగరంగా ఘన కీర్తులందుకుంటున్న బర్మింగ్హామ్ నగరం ఇప్పడు చెత్తకంపు కొడుతోంది. నగరంలో ఏ మూలన చూసినా వ్యర్థ్యాల వరద పారుతోంది. పారిశుద్ధ్యకార్మికుల సమ్మెతో నగరవ్యాప్తంగా చెత్తమూటలు గుట్టలు పేరుకుపోయాయి. వాటి కంపుతో నగరవాసుల ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. దీంతో పురుగుల భరతం పట్టే విల్ టిమ్స్ లాంటి వాళ్లకు రోజూ చేతినిండా పని దొరుకుతోంది. చెత్తకుప్పల నుంచి ఇళ్లలోకి దూసుకొచ్చే పేద్ద ఎలుకలు, బొద్దింకలు, పురుగులను చంపేయడంలో ఇలాంటి పెస్ట్కంట్రోల్ కార్మికులు ఇప్పుడు చాలా బిజీగా మారిపోయారు. మా ప్రాంతంలో ఎలుకల్ని పట్టండి మహాప్రభో అంటూ రోజూ వాళ్లకు ఫోన్చేసే స్థానికుల సంఖ్య పెరిగిపోయింది. సమ్మెతో మొదలైన సమస్య అధిక చెల్లింపులు చేయాలన్న డిమాండ్లతో గార్బేజ్ కలెక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో 12 లక్షల జనాభా ఉన్న నగరంలో వ్యర్థాల బ్యాగులను తరలించేవాళ్లులేక రోడ్లన్నీ చెత్తకుప్పలకు చిరునామాగా మారాయి. బల్సాల్ హెల్త్ అనే ప్రాంతంలో అయితే చెత్తకుప్పలు ఎన్నో అడుగుల ఎత్తులో పేరుకుపోయి గబ్బు వాసనతో జనాల గుండెల్లో వ్యాధుల గుబులు పుట్టిస్తున్నాయి. చిన్న పిల్లి సైజులో ఉన్న ఎలుకలు అక్కడ సంచరిస్తున్నాయని స్థానికుడు అబిడ్ మీడియా ప్రతినిధులకు చెప్పారు. డస్ట్బిన్ల నుంచి సమీప ఇళ్లల్లో దూరుతున్న ఎలుకల సంఖ్య ఏకాఎకి పెరిగిపోయింది. దీంతో వీటిని అదుపుచేయడం స్థానిక పెస్ట్కంట్రోలర్ల తలకు మించిన భారమైంది. దీంతో సమీప నగరాల్లో తోటి వర్కర్లను ఇక్కడికి రప్పించి సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నంచేస్తున్నారు. కోతే కారణమా? గార్బేజ్ కలెక్టర్లకు అందించాల్సిన జీతభత్యాల్లో కోత పెట్టాలని సిటీ పాలకమండలి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 400 మంది గార్బేజ్ కలెక్టర్లు సమ్మెబాట పట్టారు. జీతభత్యాలు తగ్గించడం, కొంద మందిని తొలగించడం, మరికొందరి ర్యాంక్ను కుదించడం వంటి నిర్ణయాలతో వీళ్లంతా ఆగ్రహంతో ఉన్నారు. సిటీ కౌన్సిల్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఒక్కో వ్యక్తి గరిష్టంగా రూ.8.88 లక్షల వార్షిక వేతనం నష్టపోయే ప్రమాదముంది. దీంతో వీళ్లంతా విధులకు గైర్హాజరై తమ నిరసనను ఇలా వ్యక్తంచేస్తున్నారు. మూలాలు 2023లో ఈ సంక్షోభానికి 2023లోనే బీజం పడింది. ఆదాయం తగ్గిపోయి తాము దివాళా తీశామని సిటీ కౌన్సిల్ 114 నోటీస్ను దాఖలుచేసింది. విద్య, వ్యర్థాల సేకరణ వంటివి మినహా అన్నిరకాల సేవలను కౌన్సిల్ నిలిపేసింది. అయితే ఈ సమస్య ఇటీవల మరింత ముదిరింది. మాజీ ఉద్యోగులకు సమానంగా పరిహారం ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. మాజీ ఉద్యోగుల్లో మహిళలతో పోలిస్తే పురుషులకు అధిక పరిహారం అందిందని వార్తలొచ్చాయి. విషయం బయటకు పొక్కడంతో కార్మికుల ఆందోళనలు ఎక్కువయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సిల్కు రావాల్సిన నిధులు, గ్రాంట్లుల్లో కోత పెరిగింది. దీంతో కౌన్సిల్ మరింత సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇంగ్లండ్లో 2010 ఏడాది సగటుతో పోలిస్తే కౌన్సిళ్లకు ఇచ్చే నిధులు, గ్రాంట్లు, పన్ను చెల్లింపుల్లో 18 శాతం కోత పెట్టినట్లు 2024 జూన్ నివేదిక వెల్లడించింది. దీంతో ‘చెత్త’సమస్య ఎప్పుడు తీరుతుందోనని స్థానికులు వాసనలకు ముక్కు మూసుకుని మరీ దిగాలుగా ఆలోచిస్తున్నారు.ప్రభుత్వం ఏం చెబుతోంది? బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ వాదన వేరేలా ఉంది. ‘‘కార్మికుల వేతనాల్లో కోతలు ఉండబోవు. ప్రతిపాదనల ప్రభావానికి గురయ్యే వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కలి్పస్తాం. కొత్త ఉద్యోగానికి కావాల్సిన శిక్షణను అందిస్తాం. వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని మరింత ఆధునీకరించి, నగరంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను బలోపేతం చేస్తాం’’అని సిటీ కౌన్సిల్ స్పష్టంచేసింది. ఫిబ్రవరి వరకు కొందరు పనిచేసినా మార్చి రెండో వారం నుంచి పరిస్థితి అధ్వానంగా తయారైంది. చెత్తసేకరణ, తరలింపు దాదాపు ఆగిపోయింది. స్వల్పస్థాయిలో కొందరు పనిచేసేందుకు ముందుకొచి్చనా మిగతా వాళ్లు అడ్డుకుంటున్నారు. దీంతో ఇళ్ల మధ్యలో చెత్తకుప్పలున్నాయా? చెత్తకుప్పల పక్కన ఇళ్లు కట్టుకున్నారా? అనే పరిస్థితి దాపురించిందని ఒక స్థానికుడు వ్యాఖ్యానించారు. ‘‘మేం చేసేది చెత్తపనే. కానీ అత్యంత ముఖ్యమైన పని. చేస్తున్న పనికిగాను కార్మికులకు సరైన గౌరవవేతనం దక్కాల్సిందే’’అని కార్మికుల సంఘం నేషనల్ లీడ్ ఆఫీసర్ ఒనే కసబ్ డిమాండ్చేశారు. -
యూకే అణు జలాంతర్గాములపై రష్యా నిఘా!
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే) అణు జలాంతర్గాములపై రష్యా ప్రత్యేకంగా నిఘా పెట్టిందా? సముద్రంలో వాటి కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రహస్యంగా సెన్సార్లు ఏర్పాటు చేసిందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. యూకే చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లో కొన్ని సెన్సార్ పరికరాలను బ్రిటిష్ రాయల్ నేవీ గుర్తించినట్లు సమాచారం. రష్యా తమ అణు జలాంతర్గాములపై నిఘా పెట్టినట్లు యూకే ఆరోపిస్తోంది. తమకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నట్లు రష్యాపై ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. తమ ఆయుధ సంపత్తిని దెబ్బతీయాలన్నదే రష్యా ప్రయత్నంగా కనిపిస్తున్నట్లు అనుమానం వ్యక్తంచేస్తోంది. ఈ పరిణామాన్ని దేశ భద్రతకు ముప్పుగా సైనికాధికారులు అభివరి్ణంచారు. అట్లాంటిక్ మహా సముద్రంలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, రష్యా కార్యకలాపాలు అసాధారణ రీతిలో పెరిగిపోయాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. రష్యా అధినేత పుతిన్ చేపట్టిన గ్రేజోన్ యుద్ధ వ్యూహంలోనే భాగంగానే తమ అణు జలాంతర్గాములను రష్యా టార్గెట్ చేసుకున్నట్లుగా యూకే అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర గర్భంలోని రహస్య కేబుల్స్తోపాటు పైప్లైన్లు, కీలక పరికరాలను ధ్వంసం చేయడం ద్వారా పరోక్ష యుద్ధం సాగించడమే గ్రేజోన్ వ్యూహం. ఇది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని చెబుతున్నారు. గత 15 నెలల వ్యవధిలో బాల్టిక్ సముద్రంలో 11 డీప్–సీ కమ్యూనికేషన్ కేబుల్స్ ధ్వంసమయ్యాయి. సముద్ర గర్భంలోని తమ మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి కృషి చేస్తున్నామని యూకే అధికారులు అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగినప్పటి నుంచి బ్రిటన్–రష్యా మధ్య పిల్లి, ఎలుక తరహాలో పోరాటం జరుగుతూనే ఉంది. అది ఇటీవలి కాలంలో మరింత ఉధృతమైందని యూకే నిపుణులు అంటున్నారు. -
టారిఫ్లను తప్పించుకునేందుకు 50 దేశాలు యత్నించాయి
వాషింగ్టన్: ప్రపంచదేశాలపై టారిఫ్ల కొరడా ఝళిపించిన ట్రంప్ సర్కార్ను ఎలాగోలా ఒప్పించి టారిఫ్ వాతల నుంచి తప్పించుకోవాలని దాదాపు 50కిపైగా దేశాలు ప్రయత్నంచేశాయని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. కొన్నేళ్లుగా పలు దేశాల టారిఫ్ల భారాన్ని మోస్తున్న తామూ ఇకపై పరస్పర టారిఫ్లను విధిస్తామని ఇటీవల ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాటిని అమల్లోకి తెచ్చిన విషయం తెల్సిందే. అయితే ఇవి అమల్లోకిరాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, సంప్రదింపుల ద్వారా టారిఫ్ల భారాన్ని కొంతైనా తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నించాయని వైట్హౌస్లో జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హసెట్ చెప్పారు. 50కిపైగా దేశాలు అమెరికాతో టారిఫ్ సంబంధ మంతనాలు జరిపేందుకు ఆసక్తిచూపాయని కెవిన్ ఓవైపు చెబుతుంటే ఇండోనేసియా, తైవాన్ మాత్రం తాము అమెరికాపై ప్రతీకార టారిఫ్లు విధించబోమని ప్రకటించడం విశేషం. అయితే తమపై పడే పన్నుల భారాన్ని కాస్తయినా తగ్గించుకునే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వాషింగ్టన్ డీసీలో ట్రంప్తో చర్చలకు బయల్దేరారు. సోమవారం ట్రంప్తో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది. అమెరికాలోకి దిగుమతి అయ్యే అత్యధిక దిగుమతులపై సాధారణంగా కనీసం 10 శాతం అదనపు టారిఫ్ను శనివారం ట్రంప్ అమల్లోకి తెచి్చన నేపథ్యంలో పలు దేశాలు సంప్రదింపుల పర్వానికి తెరలేపాయి. కనీసం 45 రోజులపాటు పెంపు నిర్ణయాన్ని వాయిదావేసుకోవాలని వియత్నాం నేత టో లామ్ కోరారు. పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం తమ దేశ ఆర్థికవ్యవస్థ పరిరక్షణే తొలి ప్రాధాన్యతనిస్తామని ప్రకటించింది. దిగుమతులపై టారిఫ్ల కారణంగా ఆయా ఉత్పత్తుల ధరలకు అమెరికా రెక్కలు రానున్నాయి. పెరిగే ధరలతో అమెరికన్ వినియోగదారుల జేబుకు చిల్లుపడనుంది. అయితే తొలినాళ్లలో జనం ఇబ్బందులుపడ్డాసరే కొంతకాలానికి ఆయా వస్తువుల ఉత్పత్తి స్థానికంగా మొదలై ధరలు దిగొస్తాయని ట్రంప్ నమ్మబలుకుతున్నారు. ద్రవ్యోల్బణం తప్పదు: ‘‘వస్తువులకు డిమాండ్ పెరగడంతో ద్రవ్యోల్బణం సమస్య ఎదురవుతుంది. దీనిని నివారించలేం. ఇలా టారిఫ్లతో సొంతంగా అమెరికా అతిపెద్ద ఆర్థికగాయాలు చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి’’ అని అమెరికా మాజీ ఆర్థిక మంత్రి ల్యారీ సమ్మర్స్ ఆందోళన వ్యక్తంచేశా రు. ‘‘టారిఫ్ భయాలతో స్టాక్మార్కెట్ మదుపరులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి. మార్కె ట్లు చరిత్రాత్మక కనిష్టస్థాయిలకు ఒకవేళ పడినా మళ్లీ ఊహించనంత పెరుగుతాయి’’ అని ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవరో భరోసా ఇచ్చారు.పెంగ్విన్లు, సీల్స్కూ టారిఫ్ సెగ అంటార్కిటికా ఖండంలో చివర్లో ఉన్న రెండు మారుమూల బుల్లి ద్వీపాలపైనా టారిఫ్ ఎందుకు విధించారని మీడియా ప్రశ్నించగా లుట్నిక్ అసలు విషయం బయటపెట్టారు. ‘‘ ఏ దేశంపై ఎంత టారిఫ్ వేయాలనేది అధికారులు పూర్తిగా నిర్ణయించలేదు. ఈ పనిని చాలావరకు కృత్రిమ మేథ(ఏఐ) చేసింది. అందుకే బుల్లి ద్వీపాలపైనా టారిఫ్ బాంబు పడింది’’ అని అన్నారు. వాస్తవానికి ఈ హెర్డ్ అండ్ మెక్డొనాల్డ్ ద్వీపాల్లో జనం కంటే పెంగ్విన్లు, సీల్స్ ఎక్కువగా ఉంటాయి. శివారు ద్వీపాలపైనా టారిఫ్ వేయడం చూస్తుంటే ఈ విధానం హేతుబద్ధంగా జరగలేదని, గంపగుత్తగా టారిఫ్ వేశారని కొందరు వాణిజ్యవేత్తలు విమర్శించారు. -
ట్రంప్కు హ్యాండ్సాఫ్ సెగ
వాషింగ్టన్: మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన డొనాల్డ్ ట్రంప్ వెనువెంటనే తీసుకున్న అనూహ్య, విపరీత నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై టారిఫ్ల బాంబు విసిరితే అది ప్రతీకార టారిఫ్ల రూపంలో తిరిగొచ్చి అధిక ధరలు, ద్రవ్యోల్బణానికి బాటలు వేస్తోందన్న ఆగ్రహంతో ప్రజలు నిరసన బాటపట్టారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూలేనిస్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్తకంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన ‘హ్యాండ్సాఫ్’ ఉద్యమం శనివారం భారీస్థాయిలో కొనసాగుతోంది. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీస్లు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్దస్థాయిలో ర్యాలీలు జరిగాయి. అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన పాలనాపగ్గాలను విడిపిస్తామని నినదించారు. ‘‘ మావి ప్రధానంగా మూడు డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతంకావాలి. మెడికేర్, సోషల్సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగమార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్రాలను తొలగించాలి’’ అని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.50 రాష్ట్రాల్లో 1,400 చోట్ల..50 రాష్ట్రాల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ+ మద్దతుదారులు, మాజీ ఫెడరల్ ఉద్యోగులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానంగా 1,400 ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్ట్లు జరగలేదు. మ్యాన్హాట్టన్ మిడ్టౌన్ మొదలు అలాస్కాలోని యాంకరేజ్దాకా ప్రతి ప్రధాన నగరం, పట్టణంలో జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్సాఫ్ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలు, సమూల సంస్కరణల పేరుచెప్పి హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేయడం, వలసలపై ఉక్కుపాదం మోపడం, మానవ హక్కులను కాలరాయడం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్ మస్క్పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. అమెరికాలోనేకాదు బ్రిటన్లోని లండన్, ఫ్రాన్స్లోని పారిస్, జర్మనీలోని బెర్లిన్ నగరాల్లోనూ అమెరికా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ‘‘అమెరికాకు ఏమైంది?. ప్రజలను టారిఫ్లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్ పెద్ద ఇడియట్’’ అని రాసి ఉన్న ప్లకార్డులను లండన్లో ప్రదర్శించారు. నిరసనలపై స్పందించిన శ్వేతసౌధంట్రంప్ వ్యతిరేక ర్యాలీలపై అధ్యక్ష భవనం స్పందించింది. ‘‘ ఇన్నాళ్లూ డెమొక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాలను అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్ అమెరికన్లు ఎంతో లబ్దిని కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్యసాయం, వైద్యసదుపాయాలు అందిస్తున్నాం’’ అని వైట్హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
కెనడా పార్లమెంట్కు తాళాలు.. ఎన్నికల వేళ అసలేం జరుగుతోంది?
కెనడా పార్లమెంటు భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పార్లమెంట్ హిల్లోని ఈస్ట్ బ్లాక్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు వెల్లింగ్టన్ స్ట్రీట్లోని అన్ని రోడ్లను మూసివేశారు. పెద్ద సంఖ్యల్లో పోలీసులు మోహరించారు. తూర్పు బ్లాక్లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.కాగా, కెనడాలో అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలకు ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. -
యుద్ధం ఆగేనా? సుంకాలు మీకు ఓకేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) వివిధ దేశాలపై సుంకాలను విధించిన తరుణంలో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం కానుండడం ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 7న జరగనున్న ఈ భేటీలో ఇరువురు నేతలు గాజా స్వాధీనం కోసం తుది యుద్ధ ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ త్వరలోనే గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోబోతోందని, ఇందుకు ట్రంప్ మద్దతుగా నిలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే అమెరికా సర్కారు కొత్తగా విధించిన సుంకాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ చర్చించనున్నారని సమాచారం.ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైన తర్వాత వైట్ హౌస్లో నెతన్యాహు(Netanyahu)తో ఇప్పుడు రెండోసారి సమావేశమవుతున్నారు. ఈ సమావేశాన్ని వైట్ హౌస్ తో పాటు నెతన్యాహు కార్యాలయం ధృవీకరించాయి. హమాస్ తీవ్రవాదులపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ గతకొంతకాలంగా గాజా స్ట్రిప్లోని నూతన భద్రతా కారిడార్లో సైన్యాన్ని మోహరిస్తున్న తరుణంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.గత నెలలో ఇజ్రాయెల్(Israel) కాల్పుల విరమణను ఉల్లంఘించి, అకస్మాత్తుగా గాజాపై బాంబు దాడి చేసింది. ఈ చర్యకు వైట్ హౌస్ మద్దతు పలికింది. కాగా బెంజమిన్ నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ ఈ సమావేశంలో సుంకాల సమస్య, ఇజ్రాయెల్-టర్కీ సంబంధాలు, ఇరాన్ నుండి పొంచివున్న ముప్పు తదితర అంశాలపై చర్చించనున్నట్లు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.గాజాలో హమాస్కు ఎదురుదెబ్బగత వారం గాజాలో హమాస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణ భయంతో శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హమాస్కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసులు నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్తో ఘర్షణకు ముగింపు పలికి, అధికారం నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది పాలస్తీనియన్లు ఆందోళనలు చేశారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియాతో సహా వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ‘యుద్ధాన్ని ఆపాలి, మేము శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నాం అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గాజాలోని ప్రజలను రక్షించేందుకు హమాస్ తన అధికారాన్ని ఎందుకు వదులుకోదని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో శుక్రవారం ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 16 మందికి పైగా పాలస్తీనా వాసులు చనిపోవడం గమనార్హం. ఈ తరుణంలో అమెరికా-ఇజ్రాయిల్ దేశాధినేతలు భేటీ కావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయిల్ కు టారిఫ్ ఉపశమనం..అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు సంబంధించి ఇటీవల ప్రపంచ దేశాలపై సుంకాల విధించి షాకిచ్చిన ట్రంప్.. ఇజ్రాయిల్ పై 17 శాతం సంకాన్ని విధించారు. ట్రంప్ పలు దేశాలకు విధించిన సుంకాల పరంగా చూస్తే ఇజ్రాయిల్ కు కాస్త ఊరటనిచ్చినట్లే కనబడింది. భారత్ పై 26 శాతం సుంకాన్ని విధించిన ట్రంప్.. చాలా దేశాలపై 20 శాతం 49 శాతం వరకూ కూడా సుంకాలు విధించారు. ఇక్కడ ఇజ్రాయిల్ కు మాత్రం 17 శాతాన్ని సుంకాన్ని మాత్రమే విధించడంతో ఆ దేశంపై కాస్త ప్రేమ చూపించినట్లే అవగతమవుతుంది. సుంకాలకు సంబంధించి కూడా ఇజ్రాయిల్ తో డొనాల్డ్ ట్రంప్ చర్చించే అవకాశం ఉంది. ఒకవేశ ఇజ్రాయిల్ ఏమైనా గట్టిగా పట్టుబడితే దానిని కాస్త కుదించే అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: West Bengal: నవమి వేడుకల్లో కత్తులు తిప్పిన బీజేపీ నేతలు -
ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
వాషింగ్టన్: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్డౌన్(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్ నడుస్తోంది.అమెరికాలోని వినియోగదారులు షాపింగ్ మాల్స్కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్టాప్లు, మొబైల్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్మిల్స్ కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్ -
ఇజ్రాయెల్ ఓవరాక్షన్.. బ్రిటన్ ఎంపీలతో అనుచిత ప్రవర్తన!
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ ఎంపీలను అక్కడి అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. దీంతో, ఈ ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ మండిపడ్డారు.వివరాల ప్రకారం.. బ్రిటన్లో అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్, అబ్తిసామ్ మొహమ్మద్ ఇద్దరూ శనివారం ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లారు. లుటాన్ నుంచి ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. అనంతరం కొంత సమయం తర్వాత వారిద్దరినీ విడిచిపెట్టారు. తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతో పాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపారు. సమాచారం లేకుండా ఇక్కడ వచ్చారు? అని ప్రశ్నించారు అధికారులు. దీంతో, ఇజ్రాయెల్ టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ తీవ్రంగా పరిగణించారు.ఈ నేపథ్యంలో డేవిడ్ లామీ స్పందిస్తూ..‘ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన యూకే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలోని ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మా ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు. ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని నా సహచరులకు స్పష్టం చేశాను. ఇజ్రాయెల్-హమాస్ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్చలపైనే మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది’ అని తెలిపారు.ఇక, యువాన్ యాంగ్ బిట్రన్లోని ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్ మొహమ్మద్ (Abtisam Mohamed) షెఫీల్డ్ సెంట్రల్కు ఎంపీగా ఉన్నారు. వీరిద్దరి నిర్భందానికి సంబంధించిన కథనాలు పలు మీడియా చానల్స్లో ప్రసారం అయ్యాయి. Israel detained British MPs Yuan Yang and Abtisam Mohamed, denying them entry over suspicions they aimed to document Israeli security forces and spread anti-Israel narratives. UK Foreign Secretary Lammy condemned the move as “unacceptable” and “deeply concerning.” pic.twitter.com/jUcApToxis— Nassim Chalhoub (@WarRoomIntel1) April 6, 2025 -
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్కు ఝలక్!
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్('Hands Off!') పేరుతో నిరసనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాలలో 1,200కిపైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతు ఇచ్చాయి.HAPPENING NOW: A MASSIVE protest is taking place in downtown Chicago for the "Hands Off!" movement against Elon Musk and Donald Trump pic.twitter.com/NVEiTFi8Iy— Marco Foster (@MarcoFoster_) April 5, 2025 ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచానికే సవాల్ చేస్తున్నారని అన్నారు. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, 2017 తర్వాత అమెరికా ఇంత మంది బయటకు వచ్చి నిరసనలు ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. కాగా, వీరి నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A surprising 300 people showed up at the state Capitol in downtown Jackson, Mississippi as part of the nationwide HANDS OFF! protests of @POTUS, @elonmusk and the work of @DOGE. Rally organizes expected only 30 people to show up. #DOGE #handsoffprotests pic.twitter.com/d9dSIkXkD2— Ross Adams (@radamsWAPT) April 5, 2025BREAKING: Thousands have flooded the streets of Boston for the massive anti-Trump “Hands Off!” rally—one of over 1,200 protests erupting across all 50 states.From coast to coast, Americans are sending a message: Hands off our rights. Hands off our democracy. Hands off our… pic.twitter.com/ZGQWF8fRy3— Brian Allen (@allenanalysis) April 5, 2025Absolutely incredible!Protesters are lining both sides of the street for blocks in the tiny little town of Geneva, Illinois!It's estimated that around 5000 people showed up for the Hands Off! protest.Let's go!!!!! pic.twitter.com/lStDLrtQpp— Art Candee 🍿🥤 (@ArtCandee) April 5, 2025 -
టారిఫ్లు సబబే: ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. వాటి ఫలితాలు చరిత్రాత్మకంగా ఉంటాయని చెప్పుకున్నారు. అమెరికాపై చైనా ప్రతీకార సుంకాల నేపథ్యంలో శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఇక ఎంతమాత్రమూ మౌనంగా, నిస్సహాయంగా ఉండబోదని కుండబద్దలు కొట్టారు. ‘‘అమెరికాను చైనా సుంకాలతో గట్టిగా దెబ్బ కొట్టింది. నిజానికి మాపై చైనా సుంకాలతో పోలిస్తే ఆ దేశంపై నేను విధించిన టారిఫ్ ఏ మూలకూ కాదు. చాలా దేశాలు అమెరికా పట్ల ఇంతకాలం ఇలాగే వ్యవహరించాయి. ఇది ఇకపై సాగదు. మునుపెన్నడూ లేని విధంగా ఉద్యోగాలు, వ్యాపారాలను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నాం. ఇప్పటికే ఐదు లక్షల డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. అవి మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక విప్లవంలో మనం గెలుస్తాం. అయితే ఈ ప్రక్రియ అంత సులువు కాదు. ఈ పునరుద్ధరణకు అమెరికన్లు సహకరించాలి. సమస్యలను తట్టుకొని నిలబడగలగాలి. అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దుతాం’’అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. తమ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి, ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. -
వినువీధిలో వింత వలయాలు
ఈ ఫొటోలోని వింత వలయాలను చూశారుగా! ఎస్ ఆకారంలో మొదలై క్రమంగా వలయాలుగా మారుతూ కొట్టొచ్చినట్టుగా కన్పించాయి. గత వారం యూరప్లో పలు ప్రాంతాల నుంచి ఆకాశ వీధిలో కనువిందు చేశాయి. జనమంతా వాటిని ఆసక్తిగా వీక్షించారు. ఇందులో వింతేమీ లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘ఉపగ్రహ ప్రయోగాల సందర్భంగా ఇలాంటివి మామూలే. గత వారం యూరప్లో కన్పించిన ఆ వలయాలకు స్పేస్ ఎక్స్ తాలూకు ఫాల్కన్ 9 ఉపగ్రహ ప్రయోగమే కారణం’’ అని వారు వివరించారు. ‘‘అమెరికా సైనిక నిఘా ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన అనంతరం ఫాల్కన్ వాహకనౌక తాలూకు శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించి సురక్షితంగా సముద్రంలో పడిపోయాయి. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో వాహక నౌక తనలో మిగిలిపోయిన ఇంధనాన్ని భద్రతా కారణాల రీత్యా విడుదల చేసేస్తుంది. ఆ క్రమంలో అది ఒక్కసారిగా వలయాకృతిలో సుడులు తిరుగుతుంది. ఫాల్కన్ వాహకనౌక విషయంలోనూ అదే జరిగింది’’ అని నాసా సైంటిస్ట్ మెక్డొవెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశ్వానికి అంతముంది!
అనంత విశ్వం మనిషికి ఎప్పుడూ మిస్టరీయే. దాని పుట్టుక, వికాసం, విస్తరణ తదితరాలు ఎప్పుడూ అబ్బురపాటు కలిగించే విషయాలే. సైంటిస్టులు ఎంతగా ప్రయత్నిస్తున్నా వాటి గుట్టుమట్లను నేటికీ విప్పలేకపోయారు. విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా అంతా విశ్వసిస్తూ వస్తున్న సిద్ధాంతం. అది తప్పని, ఇంతటి ‘అనంత’ విశ్వానికీ ఏదోనాటికి అంతం కచ్చితంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి అంటోంది! కృష్ణపదార్థంపై జరిగిన విశ్లేషణలో వెలుగులోకి వచ్చిన కొత్త వివరాల ఆధారంగా ఈ మేరకు తేల్చింది! కృష్ణ పదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ ఆస్కారం లేకుండా స్థిరంగా ఉంటుందన్నది శాస్త్రవేత్తల భావన. అందుకే దాన్ని అంతరిక్ష స్థిరాంకమనీ అంటారు. కానీ ఆ భావన నిజం కాదని, కృష్ణపదార్థం నానాటికీ విస్తరిస్తోందని అధ్యయనంలో తేలింది! దీనిపై ఖగోళ శాస్త్రవేత్తల్లో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘విశ్వావిర్భావపు గుట్టును కనిపెట్టేందుకు, పలు అంతరిక్ష రహస్యాల చిక్కుముళ్లను విప్పేందుకు ఇది అత్యంత కీలక ఆధారం కానుంది. అంతేగాక మొత్తంగా విశ్వానికి సంబంధించి ఇప్పటిదాకా ఉన్న అవగాహననే సమూలంగా మార్చేయగలదు’’ అని వారంటున్నారు. ఏమిటీ పదార్థం? డార్క్ ఎనర్జీ. కృష్ణపదార్థం. అనంత విశ్వంలో మూడొంతులకు పైగా విస్తరించిన పదార్థం. అయినా ఇప్పటికీ మనిషికి అంతుచిక్కని, అతని మేధకు అందని దృగి్వషయం. దాని ఉనికి వాస్తవమే అయినా నిజానికి అదేమిటో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. విశ్వ విస్తరణను వేగవంతం చేసే శక్తిగా కృష్ణపదార్థాన్ని సైంటిస్టులు నిర్వచిస్తారు. దాని ఆనుపానులను కనిపెట్టేందుకు డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ కొలాబరేషన్ (దేశీ) పేరుతో నాలుగేళ్ల క్రితం 900 మంది అంతర్జాతీయ స్థాయి సైంటిస్టులు బృందంగా ఏర్పడ్డారు. అరిజోనాలోని టక్సన్ అబ్జర్వేటరీలో మేయల్ టెలిస్కోప్ తాలూకు దాని 5,000 ఫైబర్ ఆప్టిక్ లెన్సుల సాయంతో అంతరిక్షాన్ని ఆమూలాగ్రం వడపోస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా 5 వేలకు పైగా గెలాక్సీల నుంచి వెలువడే కాంతిని ఏకకాలంలో పరిశీలిస్తున్నారు. ఆ లెక్కన వచ్చే ఏడాది సర్వే పూర్తయ్యేనాటికి దేశీ ఏకంగా 5 కోట్ల గెలాక్సీల నుంచి వచ్చే కాంతిని ‘దేశీ’ లెక్కగట్టనుంది! 1,180 కోట్ల ఏళ్ల పై చిలుకు వికాస క్రమంలో విశ్వాన్ని కృష్ణపదార్థం ఎలా ప్రభావితం చేస్తూ వచ్చిందో తేల్చడమే ఈ అధ్యయన లక్ష్యం. మూడేళ్ల ‘దేశీ’ డేటాను సైంటిస్టులు తాజాగా విశ్లేషించారు. అది అందజేసిన 1.5 కోట్ల గెలాక్సీల కాంతికి సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేశారు. ఫలితంగా ఆశ్చర్యపరిచే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు దేశీ సహ సారథి, డాలస్లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ముస్తఫా ఇషాక్ బౌషాకీ తెలిపారు. ‘‘కృష్ణపదార్థం ఎలాంటి మార్పుచేర్పులకూ లోనవదన్నది వాస్తవం కాదు. అది విస్తరిస్తోందని, అంతేగాక అప్పుడప్పుడూ అనూహ్యంగా కూడా ప్రవర్తిస్తోందని వెల్లడైంది. ఆ క్రమంలో కృష్ణపదార్థం కొన్నిసార్లు బలహీనపడుతోంది కూడా. ఆ లెక్కన అంతిమంగా విశ్వంపై దాని ప్రభావం క్రమంగా క్షీణిస్తూ ఏదో ఒకనాటికి సున్నా అవుతుంది. మరోలా చెప్పాలంటే విశ్వ విస్తరణ వేగం క్రమంగా తగ్గుతూ చివరికి పూర్తిగా నిలిచిపోతుంది. అక్కడినుంచి విశ్వం కుంచించుకుపోయే ప్రక్రియ మొదలవుతుంది. అది క్రమంగా వేగం పుంజుకుని ఒకనాటికి ఈ విశ్వపు ఉనికే లేకుండా పోతుంది’’ అని అభిప్రాయపడ్డారు. కాకపోతే ఇదంతా జరిగేందుకు కనీసం కొన్ని వందల కోట్ల ఏళ్లకు పైగా పట్టవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డాలర్కు 10 లక్షల రియాల్స్
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో శత్రుత్వం, అంతర్జాతీయ ఆంక్షలు మరింత ముదరడంతో ఇరాన్ కరెన్సీ రియాల్ మారకం విలువ అత్యంత కనిష్టాలకు దిగజారింది. శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే ఒక ఇరాన్ రియాల్ మారకం విలువ ఏకంగా 10,43,000కు పడిపోయింది. అంటే ఇరాన్ ప్రజలు ఒక్క అమెరికన్ డాలర్ను తమ సొంతం చేసుకోవాలంటే ఏకంగా 10,43,000 రియాల్ కరెన్సీలను కుమ్మరించాల్సిందే. ఇరాన్ రియాల్ మారకం విలువ ఇంతటి అత్యల్ప స్థాయికి పడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. పర్షియా నూతన సంవత్సరం నౌరూజ్ సందర్భంగా కరెన్సీ మారకం దుకాణాలను మూసేశారు. కానీ వీధుల్లో అనధికారికంగా దుకాణాలు నడిచాయి. దీంతో డాలర్కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రియాల్ విలువ మరింత దిగజారింది. శనివారం దుకాణాలు తెరిచాక విలువ మరింత పతనమై చివరకు 10,43,000 వద్ద ఆగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఫిర్దౌసీ మనీ ఎక్సే్ఛంజ్ మార్కెట్లో కొందరు వ్యాపారులు తమ ఎల్రక్టానిక్ సైన్బోర్డులను స్విచ్ఛాఫ్ చేశారు. ఆన్లైన్లో ఉంటే ఇంకెంత పతనమవుతోందోనన్న భయంతో వాటిని ఆఫ్ చేశామని రేజా షరీఫ్ అనే ఎక్సే్ఛంజ్ వ్యాపారి చెప్పారు. రియల్ శక్తిని మరింత పీల్చేసిన పరిస్థితులు 2018లో తొలిసారిగా అమెరికా అధ్యక్షునిగా ఉన్నకాలంలో ఇరాన్తో అణ్వాయుధ ఒప్పందం నుంచి ట్రంప్ సర్కార్ వైదొలిగాక ఇరాన్పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత పెరిగింది. 2015లో తొలిసారిగా అమెరికాతో అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఇరాన్ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తగ్గించుకుంది. యురేనియం నిల్వలను పెంచుకునే వేగానికి కళ్లెం వేసింది. ఆ కాలంలో డాలర్తో రియాల్ మారకం విలువ 32,000 స్థాయిలో కొనసాగేది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా గెలిచాక ఆంక్షల చట్రంలో ఇరాన్ను బంధించారు. దీంతో మారకం జారుడుబల్లపై రియాల్ మరింత కిందకు జారింది. నేరుగా చర్చలకు సిద్ధమని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీకి ట్రంప్ లేఖ రాయడం, దానిని ఖమేనీ తిరస్కరించడం తెల్సిందే. మధ్యవర్తిత్వ చర్చలకే తాము మొగ్గుచూపుతామని ఖమేనీ స్పష్టంచేశారు. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న యెమెన్ హౌతీలను అమెరికా వాయుసేనలు లక్ష్యంగా చేసుకోవడంతో ఇరాన్, అమెరికా బంధంలో బీటలు మరింత పెద్దవయ్యాయి. -
లంకతో ఆరు రక్షణ ఒప్పందాలు
కొలంబో: పొరుగు దేశం శ్రీలంకతో భారత్ ఆరు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. లంకలోని ట్రింకోమలీని ఇంధన హబ్గా తీర్చిదిద్దడంతో పాటు పవర్ గ్రిడ్ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరాయి. శనివారం లంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకెతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చల అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. సంపూర్ సౌర విద్యుత్కేంద్రాన్ని నేతలిద్దరూ వర్చువల్గా ప్రారంభించారు. భద్రత విషయంలో ఇరుదేశాలు పరస్పరం ఆధారపడి ఉన్నాయని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దిస్సనాయకె అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలి విదేశీ పర్యటనకు భారత్నే ఎన్నుకున్నారు. ఆయన హయాంలో లంకను సందర్శించిన తొలి విదేశాధినేతను నేనే. ద్వైపాక్షిక బంధానికి ఇరు దేశాలూ ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనం’’ అన్నారు. అనంతరం జరిగిన చర్చల్లో పలు కీలకమైన అంశాలు వారి నడుమ ప్రస్తావనకు వచ్చాయి. లంక జైళ్లలో మగ్గుతున్న భారత మత్స్యకారులను విడిచి పెట్టాల్సిందిగా మోదీ కోరారు. ఈ విషయంలో ఇరు దేశాలూ మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ‘‘ఆర్థిక సాయంలో భాగంగా లంకకు ఇచ్చిన రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తున్నాం. వాటిపై వడ్డీరేటును మరింత తగ్గిస్తున్నాం. లంకకు ఇచ్చిన 10 కోట్ల డాలర్ల మేరకు రుణాలను గ్రాంట్లుగా మార్చాం. శ్రీలంక ప్రజలకు భారత్ అన్నివిధాలా అండగా నిలుస్తుంది’’ అని పునరుద్ఘాటించారు. లంక తూర్పు ప్రాంతాల ఆర్థికాభివృద్ధి నిమిత్తం 240 కోట్ల శ్రీలంక రూపాయల సాయాన్ని ప్రకటించారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు దిస్సనాయకె తెలిపారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు లంక భూభాగాన్ని వాడుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. శ్రీలంకలోని కీలక నౌకాశ్రయాలు, భూభాగాలను నిఘా తదితర కార్యకలాపాలకు వాడుకునేలా చైనా పథక రచన చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్లో ఆరావళి ప్రాంతాల్లో 1960లో దొరికిన బుద్ధుని పవిత్ర అవశేషాలను లోతైన పరిశోధనల నిమిత్తం లంకకు పంపుతున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రధాని మోదీ శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు. అధ్యక్షుడు దిస్సనాయకె ఆయనకు స్వయంగా అవార్డును ప్రదానం చేశారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరచడంలో మోదీ కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీన్ని 140 కోట్ల పై చిలుకు భారతీయులకు లభించిన గౌరవంగా ప్రధాని అభివరి్ణంచారు. ఘనస్వాగతం అంతకుముందు రెండు రోజుల థాయ్లాండ్ పర్యటన ముగించుకున్న మోదీ శుక్రవారం రాత్రి బ్యాంకాక్ నుంచి కొలంబో చేరుకున్నారు. నగరంలోని చారిత్రక ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద శనివారం ఆయనకు అత్యంత ఘనస్వాగతం లభించింది. అధ్యక్షుడు దిస్సనాయకె స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ఒక విదేశీ నేతలకు ఈ స్థాయి స్వాగతం లభించడం శ్రీలంక చరిత్రలో ఇదే తొలిసారి.తమిళులకు న్యాయం చేయండి శ్రీలంక తమిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, వారికి న్యాయం జరిగేలా చూసేందుకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. శ్రీలంక పర్యటన సందర్భంగా శనివారం స్థానిక తమిళ నేతలతో సమావేశమయ్యాక ఆయన ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు దిస్సనాయకెతో చర్చల సందర్భంగా కూడా ఈ అంశాన్ని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘లంక తమిళుల ఆకాంక్షలను గౌరవించండి. హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం రాజ్యాంగంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చండి. ప్రొవిన్షియల్ కౌన్సిళ్లకు తక్షణం ఎన్నికలు జరిపించండి’’ అని సూచించారు. అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. లంక తమిళుల ఆకాంక్షలను దిస్సనాయకె సర్కారు నెరవేరుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. భారత మూలాలున్న తమిళులకు 10 వేల ఇళ్ల నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు తమకు కూడా అధికారంలో భాగస్వామ్యం కావాలని తమిళులు చిరకాలంగా కోరుతున్నారు. -
ఇజ్రాయెల్తో సైనిక ఒప్పందంపై మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల నిరసన
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సైన్యానికి సాంకేతిక సాయం అందిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్పై ఉద్యోగులు నిరసన తెలిపారు. సంస్థ 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి పలుమార్లు అంతరాయం కలిగించారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు. ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ప్రసంగిస్తుండగా ఉద్యోగి ఇబ్దిహాల్ అబూస్సాద్ లేచి నినాదాలు చేశారు. ‘ముస్తఫా ఇది నీకు సిగ్గు చేటు.. మైక్రోసాఫ్ట్ చేతులకూ రక్తం అంటింది’అంటూ నిరసన తెలిపారు. ‘ఏఐని మంచి కోసం ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు కానీ.. మైక్రోఐసాఫ్ట్ ఇజ్రాయెల్ సైన్యానికి కృత్రిమ మేథ ఆయుధాలను అందించింది. 50 వేల మంది ప్రాణాలు తీసిన మారణహోమానికి మైక్రోసాఫ్ట్ సహకరించింది’అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాకు సంఘీభావానికి చిహ్నమైన కెఫియేను వేదికపైకి విసిరారు. అందుకు స్పందించిన సులేమాన్ ‘మీ నిరసనకు ధన్యవాదాలు.. నేను మీరు చెప్పింది విన్నాను’అని అన్నారు. సెక్యూరిటీ ఆమెను బయటికి పంపారు. తరువాత రెండో కార్యక్రమంలో నిరసనలు కొనసాగాయి. మాజీ సీఈఓలు బిల్గేట్స్, స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్లలు వేదికపై ఉండగా.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ నిరసన తెలిపారు. ఏఐ టూల్ ఉపయోగించి 2023లో లెబనాన్లపై చేసిన దాడుల్లో ముగ్గురు యువతులతోపాటు తన నానమ్మను బలిగొందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనాకు సంఘీభావంగా మైక్రోసాఫ్ట్లో నిరసన ఇది మొదటిది కాదు. సత్యనాదెళ్ల సమావేశంలో ఇజ్రాయెల్తో సైనిక ఒప్పందాలను నిరసించినందుకు ఈ ఏడాది ప్రారంభంలోనే ఐదుగురు ఉద్యోగులను తొలగించారు. అయితే అంతర్గత సమావేశం కావడంతో విషయం బయటికి రాలేదు. వార్షికోత్సవ సమయంలో జరగడంతో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం నాటి ఘటన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఉద్యోగులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు సంస్థ స్వేచ్ఛనిస్తుందని, అదే సమయంలో అవి సంస్థ కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా ఉండాలని మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అబూస్సాద్, అగర్వాల్లపై చర్యలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికయితే తమ ఐడీలు పనిచేయడం లేదని వారిద్దరూ తెలిపారు. -
అప్పుడు మనస్పర్ధలొచ్చాయి
వాషింగ్టన్: రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. భార్య మిషెల్తో జీవనప్రయాణంపై ఒబామా మీడియాతో మాట్లాడారు. హాలీవుడ్ నటి జెన్నీఫర్ అనీస్టన్తో వివాహేతర సంబంధం వంటి వార్తలను వదంతులుగా కొట్టిపారేశారు. భార్య మిషెల్ నుంచి విడాకులు తీసుకోబోతున్నారనేవి కూడా పూర్తిగా వదంతులేని స్పష్టంచేశారు. జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లోనూ, ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భార్య మిషెల్తో రాకుండా ఒంటరిగా ఒబామా కనిపించిన నేపథ్యంలో మీడియా ఆయన విడాకుల అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. దీంతో తాజాగా హామిల్టన్ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాలేజీ అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్ అడిగిన ప్రశ్నలకు ఒబామా సమాధానాలిచ్చారు. ‘‘2020 నవంబర్లో నా ఆత్మకథ ఏ ప్రామిస్ట్ ల్యాండ్ మొదటి భాగాన్ని మార్కెట్లోకి తెచ్చాం. ఇప్పుడు రెండో భాగం పూర్తిచేసే పనిలో ఉన్నా. రోజూ పేజీల కొద్దీ రాస్తున్నా’’ అని అన్నారు. రాయడం ఇష్టపడతారా అన్న ప్రశ్నకు ‘‘అస్సలు ఇష్టంలేదు. కానీ రాయడం పూర్తయ్యాక మాత్రం రాశానన్న ఆనందంలో మునిగితేలుతా’’అని సరదాగా అన్నారు. ‘‘అధ్యక్షునిగా కొనసాగిన కాలంలో విధి నిర్వహణలో పడిపోయా. దాంతో సతీమణితో మనస్పర్ధలొచ్చాయి. ఇప్పుడు పరిస్థితి అంతా కుదుటపడింది. నాటి విబేధాల లోయలోంచి బయటపడ్డా’’అని చెప్పారు. 1980వ దశకంలో ఒక న్యాయసేవల సంస్థలో కొన్నాళ్లు కలిసి పనిచేసిన కాలంలో మిషెల్తో ఒబామాకు పరిచయం ఏర్పడింది. అది తర్వాత ప్రేమగా మారి 1992లో పెళ్లికి దారితీసింది. ఒబామా అధ్యక్షుడయ్యాక కొంతకాలం వాళ్ల మధ్య బేధాభిప్రాయాలు పొడచూపాయి. తమ వైవాహిక బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని మూడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మిషెల్ చెప్పారు. అప్పట్నుంచి వీళ్ల వివాహబంధంపై మీడియాలో ఎన్నో కథలు షికార్లు చేశాయి. అమెరికాలో ప్రఖ్యాత జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ సైతం ఇదే విషయం అంచనావేశారు. ఒబామా దంపతులకు జూలై, ఆగస్ట్ నెలలు అత్యంత విషమకాలమని ఆమె అంచనా వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారని అమీ ట్రిప్ చెప్పిన జోక్యం నిజం కావడం తెల్సిందే. పెళ్లి పెటాకులు అవుతుందన్న పుకార్లు పెరగడంతో ఒబామా జంట ఫిబ్రవరి 14న జంటగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టింది. వేలంటైన్స్డే గ్రీటింగ్స్ చెప్పి విమర్శించే వాళ్ల నోరు మూయించారు. -
హ్యాండ్షేక్.. షాక్
మీరెప్పుడైనా నిలబడి సరదాగా అప్పటిదాకా మాట్లాడుతున్న వ్యక్తితో వీడ్కోలు చెప్పబోతూ కరచాలనం ఇస్తే చేతికి షాక్ కొట్టిందా?. ఎవరో కూర్చున్న కుర్చిని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్ కొట్టిందా?. గుండ్రంగా వెండిరంగులో మెరిసే డోర్నాబ్ను పట్టుకోగానే చిన్నపాటి షాక్కు గురయ్యారా?. ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ మీలో ఉండిపోతే అలాంటి సైన్స్ ప్రియుల కోసం పరిశోధకులు కొన్ని సమాధానాలను సిద్ధంచేశారు. చదివేద్దామా మరి !! ఉపరితలం చేసే మేజిక్కుప్రతి వస్తువులో కణాలకు విద్యుదావేశశక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్ స్థిరత్వం అనేది వాతావరణాన్ని తగ్గట్లు మారతుంది. అంటే గాలిలో తేమ పెరగడం, తగ్గడం, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాల్లో వస్తువుల ఉపరితల ఎలక్టిక్ స్థిరత్వం దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కుర్చిని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్టిక్ ఛార్జ్ అనేది ఎండాకాలంలో ఒకలా, చలికాలంలో మరోలా ఉంటుంది. అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రంతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్ చార్జ్ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబడటంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్ చార్జ్ ఉంటుంది. దీనిని విభిన్న ఎలక్టిక్ ఛార్జ్ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్పస్థాయిలో విద్యుత్కణాలు అటుఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి, ఇంకో మనిషికి షేక్ హ్యాండ్ ఇచి్చనప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దృగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న ఛైర్ను పట్టుకున్నా షాక్ రావడానికి అసలు కారణం ఇదే. చలికాలంలోనే ఎక్కువ! మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ దుస్తుల ధరించిన మన శరీర ఉపరితల చార్జ్ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, ఛైర్, డోర్నాబ్ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమలేని గాలిలో చలికాలంలో ఈ షాక్ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్ ఘటనలు తక్కువగా చూస్తుంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి, ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం. దీనిని తప్పించుకోలేమా? ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మస్థాయి విద్యుత్స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్ లాంటివి రాసుకోవచ్చు. సింథటిక్ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజసిద్ధ కాటన్ దుస్తులు ధరించడం మంచిది. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్ విద్యుత్కు గురికాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పుల్లేకుండా నడవండి. ఇకపై మీరెప్పుడైనా ఇంట్లో సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి షాక్కు గురైతే సరదాగా తీసుకోండి. అద్భుత, విచిత్ర సైన్స్కు మీరూ సాక్షీభూతంగా నిలిచామని సంబరపడండి. స్టాటిక్ షాక్ ప్రమాదమా? స్థిర విద్యుత్తో మని షికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదంలేదు. సెకన్ వ్యవధిలో షాక్ అనుభూతి వచ్చి పోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో, అత్యంత సున్నితమైన ఎల్రక్టానిక్ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్ విద్యుత్ ప్రాణహాని కల్గించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ స్టేషన్లు, కంప్యూటర్ చిప్ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20 మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు. ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు. -
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని 'జేపీ మోర్గాన్' అంచనా వేసింద. ఈ మాంద్యం వల్ల యూఎస్ఏలో నిరుద్యోగం రేటు 5.3 శాతానికి చేరుతుందని.. మైఖేల్ ఫెరోలి అన్నారు.డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం.. ఉద్యోగాల మీద మాత్రమే కాకుండా, దేశ జీడీపీ మీద కూడా ప్రభావం చూపిస్తుందని జేపీ మోర్గాన్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త 'మైఖేల్ ఫెరోలి' వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు కూడా 20 శాతం తగ్గుతాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగాలు ఉండవని చెబుతున్నారు.ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల దిగుమతులు తగ్గుతాయి. జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయికి చేరుకుంటుందని.. యూబీఎస్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ ఒక నోట్లో తెలిపారు. దీనివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్ధిక నష్టాన్ని అమెరికా చూడబోతోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్గేట్స్ ఎదుటే ఉద్యోగుల నిరసన (వీడియో)డొనాల్ట్ ట్రంప్ భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల మీద సుంకాలను విధించారు. అంతే కాకుండా మనుషులు లేని ఆస్ట్రేలియన్ దీవుల మీద కూడా 10 శాతం సుంకాలను ప్రకటించడం గమనార్హం. భారత్పై విధించిన సుంకాలలో 10 శాతం సుంకం ఈ రోజు (ఏప్రిల్ 5) నుంచి అమలులోకి వస్తుంది. మిగిలిన శాతం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానుంది. -
ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్ ఏమన్నారంటే..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్స్ట్రీట్లో బ్లడ్బాత్తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మార్కెట్ క్రాష్ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్ ఛార్జ్గా పనికొస్తుందని.. టారిఫ్ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన. -
మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం
కొలంబో: మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) శ్రీలంకకు చేరుకున్నారు. ఘన స్వాగతంలో భాగంగా.. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద భారత ప్రధానికి గార్డ్ ఆఫ్ ఆనర్ దక్కింది. ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో మోదీ భేటీ కానున్నారు. కాగా, ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఇంధనం, రక్షణ, వాణిజ్య, డిజిటల్ ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. భారత్ సహకారంతో ఆ దేశంలోనూ పలు ప్రాజెక్టులు నిర్మాణం జరిగే అవకాశం ఉంది.మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారంశ్రీలంకలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీని ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ అవార్డు అందుకోవడానికి మోదీ అన్నివిధాల అర్హుడని అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. Glimpses from the ceremonial welcome in Colombo this morning.@anuradisanayake pic.twitter.com/88k2T1NN20— Narendra Modi (@narendramodi) April 5, 2025 -
దురదృష్టవశాత్తు.. ‘50 వసంతాల మైక్రోసాఫ్ట్’పై బిల్గేట్స్ వీడియో
వాషింగ్టన్: టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఆరంభ రోజుల్లో.. యవ్వనంలో ఉండగా దిగిన ఫొటోలను సరదాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తు.. నేను మళ్ళీ ఎప్పటికీ కూల్గా ఉండను. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఇది నేనే’’ అంటూ క్యాప్షన్ ఉంచారాయన. 1975 ఏప్రిల్ 4వ తేదీన న్యూ మెక్సికో అల్బుకెర్కీలో మైక్రోసాఫ్ట్ను చిన్ననాటి స్నేహితులైన బిల్ గేట్స్, పాల్ అలెన్లు స్థాపించారు. 1979లో కంపెనీ విస్తరణలో భాగంగా వాషింగ్టన్కు మార్చారు. ఆ తర్వాత గేట్స్, అలెన్తో పాటు స్టీవ్ బాల్మర్, సత్య నాదెళ్ల కంపెనీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) మైక్రోసాఫ్ట్కు 2000 సంవత్సరం దాకా గేట్స్ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద రీతిలో.. మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి 2020 నుంచి ఆయన వైదొలిగారు. 1955 సియాటెల్లో జన్మించిన విలియమ్ హెన్సీ గేట్స్.. బాలమేధావిగా 13 ఏళ్ల వయసుకే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాసే స్థాయికి చేరాడు. అలెన్తో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించేందుకు హార్వార్డ్ నుంచి విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారాయన. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ ఎంఎస్-డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించి.. ఆపై దానిని విండోస్గా పేరు మార్చారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా.. మైక్రోసాఫ్ట్ తన వెబ్సైట్లో కొత్త పేజీలను లాంచ్ చేసింది. గత ఐదు దశాబ్దాలుగా సాగిన ప్రయాణాన్ని అందులో పదిలపరిచింది. కంపెనీ ఎదుగుదల, మైలు రాళ్లు, ఆవిష్కరణలను అందులో ఉంచింది. అలాగే.. రాబోయే 50 ఏళ్ల విజన్ను అందులో పొందుపరిచింది. -
కెనడాలో భారతీయుడి దారుణ హత్య
ఒట్టావా: కెనడాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొందరు దుండగులు కత్తితో పొడిచి భారతీయుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయుడి హత్యపై విచారణ వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. కెనడా రాజధాని ఒట్టావా సమీపంలోని రాక్లాండ్లో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేశారు. కత్తితో పొడిచి అతడిని హత్య చేశారు. ఈ ఘటనపై కెనడాలో భారత రాయబార కార్యాలయం స్పందించింది. హత్య ఘటనపై విచారణ వ్యక్తం చేసింది. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కెనడా పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించింది. ఇక, ఈ ఘటనలో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. We are deeply saddened by the tragic death of an Indian national in Rockland near Ottawa, due to stabbing. Police has stated a suspect has been taken into custody. We are in close contact through a local community association to provide all possible assistance to the bereaved…— India in Canada (@HCI_Ottawa) April 5, 2025 -
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్చుప్గా ఆసియా రీజియన్లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్ను, మిడిల్ ఈస్ట్లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది. -
పుతిన్ దాడులు ఆపాలంటే.. ఇదే కరెక్ట్ ప్లాన్: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా సైన్యం దాడిలో మరో 16 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అంశంపై జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై అమెరికా ఇప్పటికైనా ఒత్తిడి పెంచాలి అని డిమాండ్ చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియాలో మాట్లాడుతూ.. రష్యా క్షిపణి దాడి తర్వాత ప్రస్తుతం క్రివీ రిహ్లో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి, ఆరుగురు పిల్లలు సహా 16 మంది మరణించారు. ఖార్కివ్ లక్ష్యంగా చేసుకున్న రష్యన్ డ్రోన్ దాడి తర్వాత రోజంతా సహాయక చర్యలు కొనసాగాయి. ఆరు "షాహెద్" డ్రోన్లతో రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది. ఈ దాడులు ప్రమాదవశాత్తు జరగలేదు. రష్యా స్వయంగా అమెరికాతో కాల్పులు విరమణ గురించి చర్చించినప్పటికీ దాడులను కొనసాగిస్తోంది. కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ పదేపదే ఉల్లంఘిస్తున్నారు.అందుకే రష్యాపై ఒత్తిడి చాలా అవసరం. రష్యాపై ఇంకా ఆంక్షలు విధించాలి. కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్పై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తేనే రష్యా దాడులు చేయకుండా ఉండగలదు. మార్చి 11వ తేదీ నుంచి పుతిన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. చర్చల ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలి. అప్పుడే పుతిన్ దారిలోకి వస్తారు అంటూ చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులతో ట్రంప్ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నించారు. Rescue operations are currently underway in Kryvyi Rih following a Russian missile strike. As of now, 16 people are confirmed dead, including six children. In Kharkiv, rescue efforts continued all day after a targeted Russian drone strike. A deliberate attack by six “Shahed”… pic.twitter.com/7TbgHQYfEI— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 4, 2025 -
పలు దేశాల్లో భూకంపం.. ఉత్తర భారతంలోనూ భూ ప్రకంపనలు
న్యూఢిల్లీ: నేపాల్ను శుక్రవారం సాయంత్రం స్వల్ప భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతతో గర్ఖాకోట్కు మూడు కి.మీ దూరంలో 20కి.మీ లోతులో భూకంప కేంద్రం రికార్డయ్యింది. ఈ ప్రభావంతో ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది.నేపాల్లో శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది రికార్డయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్లలో పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకుంది. మరోవైపు జపాన్లోనూ గత 24 గంటల్లో నాలుగుసార్లు భూమి కంపించింది. తాజాగా హోక్కాయిడో ఒట్రాడాలో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. రెండ్రోజుల కిందట.. కాగోషిమా నిషినూమోటో కేంద్రంగా 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పపువా న్యూ గినియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీమరోవైపు.. పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదు అయింది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీచేసింది.A 5.0 magnitude earthquake struck Nepal at 7:52 PM, with tremors felt across North India. This seismic event comes just days after a catastrophic earthquake in Myanmar, which registered a 7.7 magnitude on March 28. That disaster resulted in over 3,000 deaths, 4,500 injuries, and at least 341 people still missing. No reports of damage in Nepal yet. Stay tuned for updates.ఇదిలా ఉంటే.. మార్చి 28వ తేదీన మయన్మార్, థాయ్లాండ్లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక్క మయన్మార్లోనే మూడువేల మందికిపైగా చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. -
యూన్ అభిశంసన సరైనదే
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసన సబబేనని ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రెండు నెలల్లో ఎన్నికలకు ఆదేశించింది. 64 ఏళ్ల యూన్ ప్రయోగించిన మార్షల్ లా రాజ్యాంగాన్ని, ఇతర చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించినందని కోర్టు తాత్కాలిక చీఫ్ మూన్ హ్యూంగ్ బే ప్రకటించారు. అందుకే ఆయన అభిశంసనను ఎనిమిది మంది సభ్యుల ధర్మాసనం సమర్థించిందని పేర్కొన్నారు. ‘‘యూన్ మార్షల్ లా అమలు ప్రజల ప్రాథమిక రాజకీయ హక్కులను దెబ్బతీసింది. చట్ట పాలనను, ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించింది. ఆయన తన విధి నిర్వహణలో విఫలమయ్యారు. రక్షించాల్సిన వ్యక్తులకు వ్యతిరేకంగా పనిచేశారు. జాతీయ అత్యవసర అధికారాలను ఉపయోగించడం సమర్థనీయం కాదు’’ అని తీర్పు పేర్కొంది. దేశంలో రాజకీయ గందరగోళానికి ఇకనైనా తెర పడుతుందేమో చూడాలి. యూన్పై క్రిమినల్ అభియోగాలు కొనసాగనున్నాయి. పదవిలో ఉంటూ అరెస్టయిన, అభియోగాలు ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడు ఆయనే! ప్రజావిజయం: విపక్షం తీర్పును ప్రజల విజయంగా ప్రతిపక్ష డెమొ క్రటిక్ పార్టీ అభివర్ణించింది. యూన్ వ్యతిరేకులు హర్షధ్వానాలతో హోరెత్తించారు. జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. మైదానాల్లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. ‘‘రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు లభించిన విజయమిది. ప్రజా శత్రు వును ప్రజాస్వామ్య ఆయుధంతో ఓడించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అని అభిశంసన కేసు ప్రాసిక్యూటర్, డెమొక్రటిక్ పార్టీ చట్టసభ్యుడు జంగ్ చుంగ్ రే తెలిపారు. తీర్పుపై యూన్ మద్దతుదారులు కన్నీటిపర్యంతమ య్యారు. తీర్పు రాగానే ‘కొరియా కథ ముగిసింది’ అంటూ నినాదాలు చేశారు. ఇది పూర్తి గా అప్రజాస్వామిక, అన్యాయమైన తీర్పు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ తీర్పేనని యూన్ లాయర్లు వాపోయారు. అయితే తీర్పును అంగీకరిస్తున్నామ ని అధికార పీపుల్ పవర్ పార్టీ తెలిపింది. ఇదీ నేపథ్యం... దక్షిణ కొరియాలో ఈ రాజ్యాంగ సంక్షోభం నాలుగు నెలల క్రితం మొదలైంది. గత డిసెంబర్ 3న రాత్రివేళ ఉన్నట్టుండి మార్షల్ లా విధిస్తున్నట్టు అధ్యక్ష హోదాలో యూన్ ప్రకటించారు. విపక్ష డెమొక్రటిక్ పార్టీ తన పార్లమెంటరీ మెజారిటీని దురి్వనియోగం చేస్తోందని, దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే పార్లమెంటును మూసేసేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఆ ప్రయత్నాలను చట్టసభ సభ్యులు ధిక్కరించారు. సైనిక చట్టాన్ని తిరస్కరిస్తూ ఓటేశారు. దాంతో ఆరు గంటలకే మార్షల్ లా డిక్రీని యూన్ ఎత్తేయాల్సి వచ్చింది. కానీ ఆ ఆరు గంటల సైనిక పాలన రాజకీయ సంక్షోభాన్ని మిగిల్చింది. ఆర్థిక మార్కెట్లను కుదిపేసింది. దీనిపై నెలల తరబడి నిరసనలు వెల్లువెత్తాయి. విపక్షాల ఆధిపత్యమున్న జాతీయ అసెంబ్లీ డిసెంబర్ 14న యూన్ను అభిశంసించింది. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించారని, నేతల నిర్బంధించడానికి యత్నించారని, శాంతికి భంగం కలిగించారని ఆరోపించింది. వీటిని యూన్ ఖండించారు. జాతీయ అసెంబ్లీని నేరగాళ్లు, ప్రభుత్వ వ్యతిరేక శక్తుల అడ్డాగా అభివర్ణించారు. డెమొక్రటిక్ పార్టీ దుర్మార్గంపై పోరాటానికి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగానే మార్షల్ లా విధించినట్టు రాజ్యాంగ కోర్టు ముందు చివరి వాంగ్మూలంలో చెప్పుకున్నారు. 2021లో పీపుల్ పవర్ పారీ్టలో చేరిన ఆయన రాజీలేని వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారు. 2022లో అధ్యక్షుడయ్యారు. కుంభకోణాల్లో చిక్కుకున్న అధికారులను మార్చడానికి నిరాకరించడం, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వీటో చేయడం ద్వారా విమర్శల పాలయ్యారు. భారీ భద్రత తీర్పు నేపథ్యంలో యూన్కు అనుకూలంగా, వ్యతిరేకంగా ప్రజలు వేలాదిగా కోర్టు ముందు బారులు తీరారు. దాంతో తీర్పు తర్వాత అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహ రించారు. దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించారు. తీర్పు సందర్భంగా దేశమంతటా జనం టీవీలకు అతుక్కుపోయారు. విపక్ష నేత లీ ముందంజ దక్షిణ కొరియాలో జూన్ 3న ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. 2017లో పార్క్ గ్యున్ హైని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పుడు కూడా 60 రోజుల తర్వాత ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష రేసులో విపక్ష డెమొక్రటిక్ పార్టీ నేత లీ జే మ్యుంగ్ ముందున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల దాకా తాత్కాలిక అధ్యక్షునిగా హాన్ డక్ సూ కొనసాగుతారు. ‘‘ప్రజల సంకల్పాన్ని గౌరవిస్తూ ఎ న్నికలను రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా నిర్వహించడానికి కృషి చేస్తా. అధికార మారి్పడి సజావుగా జరిగేలా చూస్తా’’ అని ఆయన ప్రకటించారు. -
టారిఫ్లతో పడిపోయిన ట్రంప్ గ్రాఫ్
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్లు వడ్డించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ బాగా పడిపోయింది. ఆయనను అధ్యక్షుడిగా అంగీకరించే అమెరికన్ల సంఖ్య 43 శాతానికి పడిపోయింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. మూడు నెలల కింద అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయనకు మద్దతు ఇంత తగ్గడం ఇదే తొలిసారి. జనవరిలో పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ట్రంప్కు 47 శాతం మద్దతు లభించింది. ట్రంప్ సుంకాలు, నిర్వహణపై అమెరికన్లు బాగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. వలసదారులను తిప్పి పంపుతున్న అంశంపై మాత్రమే ట్రంప్ విధానాలకు ఆమోదం తెలిపారు. ట్రంప్ పాపులారిటీ తగ్గడానికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరే. ఈ విషయంలో ఆయన పనితీరును కేవలం 37 శాతం మంది మాత్రమే ఆమోదించారు. ఆటోమొబైల్స్, ఆటోమోటివ్ విడిభాగాల వంటి వస్తువులపై ట్రంప్ విధించిన భారీ సుంకాలతో చాలామంది అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త టారిఫ్లు తమకు, తమ కుటుంబాలకు చేటు చేస్తాయని భావిస్తున్నట్లు సర్వేలో దాదాపు సగం మంది పేర్కొన్నారు. ట్రంప్ సుంకాల పెంపు స్టాక్ మార్కెట్లో కూడా అనిశ్చితికి దారితీయడం తెలిసిందే. ఆయన దుందుడుకు విధానాలు దీర్ఘకాలిక దౌత్య నిబంధనలకు విఘాతం కలిగించడమే గాక ప్రపంచంతో అమెరికా వ్యవహరించే విధానంలో మార్పుకు కారణమయ్యాయి. ట్రంప్ సైనిక నిర్వహణ పట్ల కూడా అమెరికన్లు బాగా ఆందోళన చెందుతున్నట్టు సర్వే తేల్చింది. యెమెన్లో హౌతీ ఉగ్రవాదులపై సైనిక దాడి ప్రణాళిక సిగ్నల్ యాప్ ద్వారా లీకవడంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ఇది తవ్ర బాధ్యతారాహిత్యమని ఏకంగా 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్ విదేశాంగ విధానానికి జనామోదం కూడా జనవరిలో 34 శాతానికి పడిపోయింది. జనవరిలో ఇది 37 శాతంగా ఉంది. ట్రంప్ వలస విధానాలకు 48 శాతం ఆమోదం లభించింది. -
Israel-Hamas War: గాజాపై మళ్లీ దాడులు..17 మంది మృతి
ఖాన్ యూనిస్: గాజాలోని దక్షిణ ప్రాంత ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం జరిపిన దాడిలో 17 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం స్థానికులు గాలిస్తున్నారు. హమాస్ను కట్టడి చేసేందుకు మరో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని నెతన్యాహూ ప్రభుత్వం పథక రచన చేసింది. ఇందులో భాగంగా పాలస్తీనియన్లను నివాసాలు వదిలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకు పాల్పడుతోంది. అక్కడే ఉన్నవారిని వెళ్లగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం ఆ ప్రాంతంలోకి ప్రవేశించాయి. గాజాలోని వేర్వేరు ప్రాంతాలపై గురువారం ఇజ్రాయెల్ చేపట్టిన భారీ వైమానిక దాడుల్లో 14 మంది చిన్నారులు కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొంది. -
అంతకు మించి...!
బీజింగ్: తెంపరి ట్రంప్ తెర తీసిన టారిఫ్ల యుద్ధం అప్పుడే ముదురు పాకాన పడుతోంది. అమెరికా అధ్యక్షుని సుంకాల బాదుడుపై ప్రపంచ దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు కెనడా గురువారమే ప్రకటించడం తెలిసిందే. శుక్రవారం చైనా కూడా అదే బాట పట్టింది. అమెరికాపై 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది. అగ్ర రాజ్యపు ఉత్పత్తులపై ఇప్పటికే అమల్లో ఉన్న సుంకాలకు ఇవి అదనం. తమ నుంచి చైనా ఏకంగా 54 శాతం సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ బుధవారం ఆక్షేపించడం తెలిసిందే. అందుకే ఆ దేశంపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపే అమెరికాపై తానూ అంతే మొత్తం సుంకాలు విధించడం ద్వారా డ్రాగన్ దేశం దెబ్బకు దెబ్బ తీసింది. టారిఫ్ పోరులో తగ్గేదే లేదని స్పష్టం చేసింది. అంతటితో ఆగలేదు! అమెరికాకు అత్యవసరమైన పలు అరుదైన ఖనిజాల ఎగుమతులపైనా నియంత్రణలు ప్రకటించింది. సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం వంటి పలు ఖనిజాలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా నిర్ణయంతో అమెరికా రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఆయా ఖనిజాల కోసం చైనా దిగుమతులపైనే భారీగా ఆధారపడుతుండటమే ఇందుకు కారణం. వీటికి తోడు 16 అమెరికా కంపెనీలకు పలు ‘డ్యుయల్ యూజ్’ వస్తువుల ఎగుమతులను పూర్తిగా నిలిపేయాలని కూడా చైనా నిర్ణయించింది. చైనాకు ఎలాంటి ఎగుమతులూ చేయకుండా మరో ఆరు అమెరికా కంపెనీలపై నిషేధం విధించింది. అమెరికా, భారత్ నుంచి దిగుమతైన మెడికల్ సీటీ ట్యూబులపై యాంటీ డంపింగ్ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. తాజా సుంకాలు, ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు ఏప్రిల్ 4 నుంచే అమల్లోకి రానున్నట్టు చైనా ప్రకటించింది. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘చైనాది తొండాట. మా దెబ్బతో వారు గాభరా పడిపోయారు. దాంతో చేయకూడని పనులు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. అయితే తన నిర్ణయాలు, విధానాలు మారబోవని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన సోషల్మీడియా హ్యాండిల్ ట్రూత్లో పోస్టులు పెట్టారు.డబ్ల్యూటీఓలో చైనా దావాచైనాపై ట్రంప్ ఇప్పటికే 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. బుధవారం నాటి వడ్డింపులతో అవి ఏకంగా 54 శాతానికి 64 శాతానికి చేరాయి. దీనిపై చైనా తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేసింది. -
బిమ్స్టెక్ బలోపేతానికి 21 సూత్రాలు
బ్యాంకాక్: భారత యూపీఐ చెల్లింపుల వ్యవస్థను బిమ్స్టెక్ సభ్యదేశాల చెల్లింపుల వ్యవస్థలతో అనుసంధానిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తద్వారా వ్యాపారం, వాణిజ్యంతో పాటు పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ‘బిమ్స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్’ ఏర్పాటును ప్రతిపాదించారు. ఈ మేరకు 21 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఆయన తెరపైకి తెచ్చారు. శుక్రవారం థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో బహుళ రంగాల సాంకేతిక, ఆర్థిక సహకార కార్యక్రమం(బిమ్స్టెక్) సదస్సులో మోదీ ప్రసంగించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యానికి కూటమి ముఖ్యమైన వేదిక అన్నారు. ‘‘భాగస్వామ్య దేశాల మధ్య సహకారం, అనుబంధం బలపడాలి. ఇందుకు 21 సూత్రాల ప్రణాళికను అమలు చేద్దాం. అందులో భాగంగా బిమ్స్టెక్ ఫర్ ఆర్గనైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ (బోధి) ఏర్పాటు చేద్దాం. దీనికింద ఏటా సభ్యదేశాలకు చెందిన 300 మంది యువతకు భారత్లో శిక్షణ ఇస్తాం. సామర్థ్య నిర్మాణంలో ప్రపంచ దేశాలకు ఆదర్శ నమూనాగా నిలిచే సత్తా మన కూటమికి ఉంది. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుంటూ ఎదుగుదాం. డిజిటల్ ప్రజా సదుపాయాల (డీపీఐ) విషయంలో అనుభవాలు పంచుకుందాం. ఐటీ రంగ శక్తిసామర్థ్యాల సాయంతో బిమ్స్టెన్ను సాంకేతికంగా బలోపేతం చేసుకుందాం. బిమ్స్టెక్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఏటా వ్యాపార సదస్సులు నిర్వహిద్దాం. స్థానిక కరెన్సీల్లోనే వ్యాపారాలు చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. సదస్సులో థాయ్లాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, భూటాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. మారిటైమ్ ట్రాన్స్పోర్టు అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. బంగాళాఖాతంలో శాంతి, సౌభాగ్యం, భద్రత, సుస్థిరతే లక్ష్యంగా ‘బ్యాంకాక్ విజన్–2030’ను ఆమోదించారు.బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇటీవలి భూకంపంలో మయన్మార్, థాయ్లాండ్ ల్లో వేలాది మంది మరణించడం పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘విపత్తుల నిర్వహణ విషయంలో అంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత్లో బిమ్స్టెక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టెయినబుల్ మారిటైమ్ ట్రాన్స్పోర్టు సెంటర్ నెలకొల్పుదాం. బిమ్స్టెక్ దేశాలకు మానవ వనరుల శిక్షణ నిమిత్తం గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటు చేద్దాం. ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు నలందా యూనివర్సిటీలో బిమ్స్టెక్ దేశాల విద్యార్థులకు స్కాలర్íÙప్లు ఇస్తాం. కూటమి దేశాల మధ్య ఎలక్ట్రిక్ గ్రిడ్ ఇంటర్కనెక్షన్ పనులను వేగవంతం చేద్దాం. ఈ ఏడాది బిమ్స్టెక్ యూత్ లీడర్ల సదస్సు నిర్వహించనున్నాం. 2027లో తొలి బిమ్స్టెక్ క్రీడలు నిర్వహిద్దాం’’ అని సూచించారు.నేపాల్తో సంబంధాలకు ప్రాధాన్యం నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలీతో మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఓలీతో ఫలవంతమైన చర్చ జరిగిందని మోదీ వెల్లడించారు. నేపాల్తో సంబంధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత జనరల్ మిన్ ఆంగ్ లైంగ్తో మోదీ భేటీ అయ్యారు. భూకంపం నుంచి కోలుకోవడానికి సాయమందిస్తామని చెప్పారు. మయన్మార్లో సంఘర్షణలకు తెరపడాలంటే ప్రజాస్వామిక విధానంలో సజావుగా ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. థాయ్లాండ్ రాజు మహా వాజిరాలాంగ్కాన్ దంపతులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టం చేసుకోవడంపై చర్చించారు. సారనాథ్ బౌద్ధ స్థూపం నమూనాను థాయ్లాండ్ రాజుకు మోదీ అందజేశారు. మోదీ శ్రీలంక పర్యటన ప్రారంభం థాయ్లాండ్లో మోదీ రెండు రోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. అనంతరం ఆయన శ్రీలంక చేరుకున్నారు. అక్కడ మూడు రోజులపాటు పర్యటిస్తారు. అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకేతో సమావేశమవుతారు. మోదీ చివరిసారిగా 2019లో శ్రీలంకలో పర్యటించారు. 2015 తర్వాత ఆయన శ్రీలంకలో పర్యటిస్తుండడం ఇది నాలుగోసారి.వాట్ ఫో ఆలయాన్ని దర్శించుకున్న మోదీ ప్రధాని మోదీ బ్యాంకాక్లో వాట్ ఫో బౌద్ధ ఆలయాన్ని దర్శించుకున్నారు. 46 మీటర్ల పొడవైన బుద్ధుడి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట థాయ్లాండ్ ప్రధానమంత్రి షినవత్ర సైతం ఉన్నారు. అశోక స్తంభం నమూనాను మోదీ వాట్ ఫో ఆలయానికి బహూకరించారు. భారత్, థాయ్లాండ్ మధ్య ప్రాచీన కాలం నుంచి సంబంధాలు ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. -
ఇదిగో ‘ట్రంప్’కార్డు
వాషింగ్టన్: అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు తాలూకు కొత్త లుక్కును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేశారు. గురువారం ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ప్రయాణిస్తూ దాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇదేమిటో తెలుసా? గోల్డ్ కార్డు. ట్రంప్ కార్డు. ఐదు మిలియన్ డాలర్లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. ట్రంప్కార్డు తొలి కొనుగోలుదారు ఎవరని మీడియా ప్రశ్నించగా, ‘నేనే’నంటూ అధ్యక్షుడు బదులిచ్చారు. కొత్త కార్డును రెండు వారాల్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ట్రంప్కార్డును పేరుకు తగ్గట్టే బంగారు రంగులో రూపొందించారు. కార్డులో ఎడమవైపు దాదాపుగా సగం మేరకు ట్రంప్ ఫొటో ఆక్రమించింది. ఆ పక్కనే చుట్టూ చుక్కల నడుమ ‘ద ట్రంప్ కార్డ్’ అని రాసుంది. కింద ట్రంప్ సంతకం, 5,000,000 సంఖ్య ఉన్నాయి. కార్డు విలువ 50 లక్షల డాలర్లని చెప్పేలా ఎడమవైపున పైన, కింద 5ఎం అని రాసుంది. విదేశీ సంపన్నులకు అమెరికాలో శాశ్వత నివాసానికి, అంతిమంగా పౌరసత్వానికి వీలు కల్పించేలా ఈ గోల్డ్కార్డును రూపొందించడం తెలిసిందే. ఈబీ–5 వీసా స్థానంలో కొద్దివారాల క్రితమే దాన్ని తీసుకొచ్చారు. ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యి గోల్డ్ కార్డులు అమ్ముడైనట్టు అమెరికా ప్రకటించింది కూడా. తర్వాత దాని పేరును ట్రంప్ కార్డుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ల కోరిక మేరకే ఈ మార్పు చేసినట్టు ట్రంప్ చెప్పుకున్నారు. -
టారిఫ్పై మళ్లీ తూచ్
న్యూఢిల్లీ: 26 శాతం. కాదు 27. కాదు, కాదు... 26 శాతమే! భారత్పై విధించిన ప్రతీకార సుంకాల టారిఫ్ విషయంలో అమెరికా వరుస పిల్లిమొగ్గలివి. జనమే ఉండని అంటార్కిటికాతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఎడాపెడా టారిఫ్లతో బాదేయడం తెలిసిందే. వైట్హౌస్ రూపొందించిన టారిఫ్ల చార్టును చేతిలో పట్టుకుని మరీ ఒక్కో దేశంపై టారిఫ్లను ప్రకటించారాయన. అమెరికాలోకి ప్రవేశించే ప్రతి ఉత్పత్తిపైనా 10 శాతం సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ఆ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ‘‘భారత్ మాపై ఏకంగా 52 శాతం సుంకాలు విధిస్తోంది. అందులో సగం మాత్రమే మేం వసూలు చేయబోతున్నాం. ఆ లెక్కన చూస్తే మేమిప్పటికీ ఉదారంగానే వ్యవహరిస్తున్నట్టే’’ అని చెప్పుకున్నారు. కానీ మ ర్నాటికల్లా వాటిని 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భారత్తో పా టు మొత్తం 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్లను వైట్హౌస్ గురువారం సవరించింది. ఆ మేరకు అనుబంధ ప్రకటన విడుదల చేసింది. అయితే శుక్రవారానికల్లా మళ్లీ కథ మొదటికి వచ్చింది. భారత్పై టారిఫ్ను అమెరికా తిరిగి 26 శాతానికి తగ్గించేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వైట్హౌస్ ఈ మేరకు పేర్కొంది. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్ విషయంలో ఈ ‘ఒక్క శాతం’ తడబాటుపై ఆర్థిక నిపుణులు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. టారిఫ్ల విధింపు విషయంలో బహుశా ట్రంప్, ఆయన యంత్రాంగంలో నెలకొన్న తీవ్ర అయోమయానికి ఇది నిదర్శనమని వారంటున్నారు. ఈ దుందుడుకు టారిఫ్లు అంతిమంగా అమెరికా పుట్టినే ముంచుతాయని ఇంటా బయటా జోరుగా విశ్లేషణలు వెల్లువెత్తుతుండటం తెలిసిందే. బయటికి బెదిరింపు స్వరం వినిపిస్తున్నా, ఆ విశ్లేషణల ప్రభావం ట్రంప్ టీమ్పై బాగానే పడుతున్నట్టు కనిపిస్తోంది. -
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: తమ దిగుమతులపై 34 శాతం టారిఫ్ విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వారు తప్పు చేశారంటూనే దాన్ని చైనా అమలు చేయలేదన్నారు. ఇంకా చైనా భయపడిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో చైనా విధించిన టారిఫ్ ల పై స్పందించారు ట్రంప్ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూఎస్ వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు చైనా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత చైనా ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా వస్తువులపై అదనంగా 34 శాతం సుంకాలను అమెరికా విధించిన నేపథ్యంలో.. చైనా కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా అంతే శాతాన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్నట్లు ప్రకటించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల్గిన దేశాల మధ్య టారిఫ్ వార్..!చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం చైనా.. తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించడంతో ఇది చర్చకు దారి తీసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణానికి దారితీసినట్లయ్యింది. అమెరికా, చైనాలు ఎవరికి వారే వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది టారిఫ్ లకే పరిమితం అవుతుందా.. లేక విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందా అనేది ప్రజల్లో తలెత్తున్న ప్రశ్న. అమెరికా విధిస్తున్న సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ మాటలు వద్దు: బంగ్లాకు ప్రధాని మోదీ క్లియర్ కట్ వార్నింగ్
బ్యాంకాక్: భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశిస్తూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్ స్టెక్(BIMSTEC) సమ్మిట్ కు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తో కలిసి హాజరైన ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ.. ఆ తరహా వ్యాఖ్యలు మంచిది కాదంటూ సుతిమెత్తగా మందలించారు.‘భారత్ కు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమ్మతం కాదు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆ తరహా వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని చెడగొడతాయి’ అంటూ ప్రధాని మోదీ నేరుగా స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మీడియాకు తెలిపారు.‘ ప్రజాస్వామ్యయుత, శాంతియుత, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారతదేశం మద్దతు ఇస్తుంది. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న సహకారంతో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు అందించిందని ప్రధాని మోదీ చెప్పినట్లు విక్రమ్ మిస్రి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో ఇరు దేశాలు ముందుకు సాగాలని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఇటువంటి తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు అనవరసమని మోదీ సూచించారన్నారు. అక్రమంగా బోర్డర్లు దాటడం వంటి ఘటనలకు కఠినంగా శిక్షలు అమలు చేయాలని, ప్రత్యేకంగా రాత్రి పూట బోర్డర్ల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉందని మహ్మద్ యూనస్ కు విజ్ఞప్తి చేశారు మోదీ. బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీల పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని బంగ్లా చీప్ అడ్వైజర్ ను అడిగినట్లు మిస్రి పేర్కొన్నారు. ప్రధానంగా బంగ్లాలో ఉన్న మైనార్టీల రక్షణ గురించి, వారి హక్కుల గురించి ప్రధాని ఆరా తీశారన్నారు.భారత్ గురించి బంగ్లా చీఫ్ అడ్వైజర్ ఏమన్నారంటే.. చైనా పర్యటన సందర్భంగా యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదని,. సముద్ర తీరమున్న ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు బంగ్లాదేశ్ సాగర రక్షకుడిగా ఉందంటూ వ్యాఖ్యానించారు. చైనాకు ఇది ఒక సువర్ణావకమన్నారు. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత్ లో పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకోగా, దీనికి తాజాగా ప్రధాని మోదీ కౌంటర్ తో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
జనాలే లేని ద్వీపంపై పన్నులా? ట్రంప్ సుంకాలపై పెంగ్విన్స్ సెటైర్లు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు.వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్కు ఆవాస ప్రాంతంగా ఉంది. The penguin wore a suit. But didn’t escape the Trump tarifs on the Heard og McDonald Islands. Maybe it didn’t say thank you? pic.twitter.com/aaPr1ufCr0— Christopher Arzrouni (@CArzrouni) April 3, 2025 ఓవల్ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్ ఉంది. జెలెన్స్కీ ప్లేస్లో పెంగ్విన్ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్పై కాదు పెంగ్విన్లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,Outstanding memes capturing the absurdity of Trump’s tariff on penguin inhabited Heard & McDonald Islands #owngoal #PowerToThePenguins pic.twitter.com/AETymaLFdC— Eddie Lloyd (@worldzonfire) April 4, 2025 ; చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!మరోవైపు ట్రంప్ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్లీ ఇపుడు స్టాక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. -
ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్తో భారత ప్రధాని మోదీ
బ్యాంకాక్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus)తో భారత ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) భేటీ అయ్యారు. బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు(BIMSTEC Summit) ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు.ఈ భేటీ సారాంశాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రి తెలియజేశారు. భేటీలో.. సుస్థిర, ప్రగతిశీల, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్కు ప్రధాని మోదీ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రజలే కేంద్రంగా ఉండే సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సుదీర్ఘకాలం ప్రజలు పొందిన ఫలాలను గుర్తు చేశారు. వాస్తవిక దృక్పథంతో సాగే సానుకూల, నిర్మాణాత్మక బంధాన్ని న్యూఢిల్లీ ఆకాంక్షిస్తోందని యూనస్కు వెల్లడించారు. అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ప్రధాని కోరారు. ముఖ్యంగా సరిహద్దు భద్రత, సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని కోరారు’’ అని మిస్రి వివరించారు. దీంతోపాటు బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై ఆందోళనను యూనస్ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. తాజా భేటీ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా అక్కడే ఉన్నారు.Profsssor Muhammad Yunus is presenting a photo to Prime Minister Narendra Modi during their bilateral meeting in Bangkok on Friday. The photo is about Prime Minister Narendra Modi presenting a gold medal to Professor Yunus at the 102nd Indian Science Congress on January 3, 2015 pic.twitter.com/lsikvMOWT4— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) April 4, 2025ఈ భేటీ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనస్ భారత ప్రధాని మోదీకి ఓ పాత జ్ఞాపకాన్ని గుర్తుగా బహూకరించారు. 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని ప్రొఫెసర్ యూనస్ అందుకొన్నారు. ఈ ఫొటోను తాజాగా ఆయన ప్రధానికి అందజేశారు... గతేడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బంగ్లాదేశ్ సారథ్య బాధ్యతలు స్వీకరించారు యూనస్. అప్పటి నుంచి ఈ ఇరు దేశాల నేతలు కలవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యలో ఈ ఇరువురి భేటీ కోసం ప్రయత్నాలు జరిగినా.. ఇరు దేశాల మధ్య కొనసాగిన విమర్శల కారణంగా అది ఫలించలేదు. అయితే బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని స్వయంగా ఆ దేశానికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో బిమ్స్టెక్లో ఈ ఇరువురు భేటీ అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు, చైనాకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా యూనస్ నాలుగు రోజుల పర్యటన, ఆ పర్యటనలో భారత ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ చేసిన వ్యాఖ్యలు.. వీటన్నింటిని దరిమిలా ఈ ఇద్దరు నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.దేశవ్యాప్త ఆందోళనలతో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి.. భారత్కు ఆశ్రయం కింద వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా బంగ్లాలో హిందువులపై దాడుల నేపథ్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయగా.. అది పూర్తిగా తమ దేశ వ్యవహారమంటూ బంగ్లాదేశ్ నొక్కి చెప్పింది. మరోవైపు.. చైనా పర్యటనలో యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బంగ్లాదేశ్తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలపై భారత్ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అవి ప్రమాదకర వ్యాఖ్యలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Sarma) మండిపడగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. -
భారతీయుల ఆవేదన.. 30 గంటలుగా ఎయిర్పోర్టులోనే.. ఒకటే టాయిలెట్..
అంకారా: తుర్కియే విమానాశ్రయంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 గంటలుగా 250 మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులోనే ఉన్నారు. తమకు సరైన భోజనం లేదని, టాయిలెట్ కూడా ఒకటే ఉందని ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో అరకొరగా సౌకర్యాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. లండన్ నుండి ముంబై ప్రయాణిస్తున్న విమానం తుర్కియేలో అత్యవసరంగా ల్యాండ్ కావడంతో 250 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయారు. వర్జిన్ అట్లాంటిక్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తుర్కియేలోని మారుమూల దియార్బాకిర్ విమానాశ్రయం (డిఐవై)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒక ప్రయాణికుడు తీవ్ర భయాందోళనకు గురికావడంతో అతనికి వైద్య చికిత్స అనివార్యమైంది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం అక్కడే నిలిచిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.My family along with 250+ passengers have been inhumanely treated by @virginatlantic . Why is this chaos not being covered in the @BBCWorld or global media?? Over 30 hours confined at a military airport in Turkey.In contact with the @ukinturkiye to please more pressure needed pic.twitter.com/TIIHgE07bb— Hanuman Dass (@HanumanDassGD) April 3, 2025అయితే, విమానం ల్యాండ్ అయిన తర్వాత 30 గంటలుగా తాము ఎయిర్పోర్టులోనే ఉన్నామని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. విమానయాన సంస్థ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు తెలిపారు. తమకు వసతి సౌకర్యం కూడా కల్పించలేదని, మారుమూల ప్రాంతం కావడంతో చిమ్మచీకటిగా ఉందని, బేస్ క్యాంప్ (సైనిక స్థావరం) కావడంతో బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన భోజనం లేదని, టాయిలెట్ కూడా ఒకటే ఉందని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “Mother of the youngest child on board requesting for baby food. It’s been almost 24 hours - Passengers of @VirginAtlantic flight VS358 share their plight in the video below. @virginmedia confirms that the flight landed due to medical emergency at Diyarbakır Airport in Turkey… pic.twitter.com/zUKuNNpVBX— loveena tandon (@loveenatandon) April 3, 2025 Received a distress call from a passenger on @VirginAtlantic flight VS358 from #London to #Mumbai , now stranded in #DiyarbakirAirport in #Turkey - apparently a military facility - emergency landing . It’s been 20hours without any concrete communication from airline or food or… pic.twitter.com/RE4h2JiHYe— loveena tandon (@loveenatandon) April 3, 2025 -
వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు
బ్యాంకాక్: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా యుత, సమ్మిళిత, న్యాయబద్ధమైన విధానాలకు కట్టుబడి ఉంటామని భారత్, థాయ్లాండ్ ప్రకటించాయి. విస్తరణ వాదం కాదు, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశాయి. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, థాయ్లాండ్ ప్రధాని పెటొంగ్టర్న్ షినవత్ర గురువారం బ్యాంకాక్లో సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. అంతకుముందు, రెండు దేశాల ప్రతినిధుల స్థాయి మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు, థాయ్లాండ్ మధ్య పర్యాటకం, సాంస్కృతిక, విద్యా రంగాలతోపాటు పరస్పర వాణిజ్యం, పెట్టుబడుల్లో సహకారానికి గల అవకాశాలపై షనవత్రతో చర్చించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చేనేత, హస్తకళల్లో సహకారంపై ఒప్పందాలు కుదిరాయన్నారు. ఇండో–పసిఫిక్, యాక్ట్ ఈస్ట్ విధానంలో థాయ్లాండ్కు భారత్ ప్రత్యేక స్థానం కల్పిస్తుందని తెలిపారు. భద్రతా విభాగాల మధ్య వ్యూహాత్మక సమావేశాలపైనా చర్చ జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా, మాజీ ప్రధాని థక్సిన్ షినవత్రాతోనూ మోదీ సమావే శమయ్యారు. తన పర్యటనను పురస్కరించుకుని 18వ శతాబ్దినాటి రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసినందుకు థాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని షినవత్ర తనకు బహూకరించిన త్రి పీఠకను బుద్ధుని భారత్ తరఫున వినమ్రుడనై స్వీకరించినట్లు తెలిపారు. బౌద్ధమత నియమాలతో కూడిన వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిదమ్మ పీఠకాలని త్రిపీఠకాలని పేరు. మార్చి 28వ తేదీన భూకంపంతో సంభవించిన ప్రాణనష్టంపై భారత ప్రజల తరఫున నివాళులర్పించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. అంతకుముందు, బిమ్స్టెక్ 6వ శిఖరాగ్రానికి హాజరయ్యేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్యాంకాక్ చేరుకున్న ప్రధాని మోదీకి ఉపప్రధాని సురియా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన థాయ్ రామాయణం, సిక్కులు ప్రదర్శించిన భాంగ్రా నృత్యం అలరించింది. అనంతరం ప్రధాని మోదీ బిమ్స్టెక్లోని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యూనుస్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి, మయన్మార్ సైనిక పాలకుడు మిన్ ఔంగ్ తదితరులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. బ్యాంకాక్ నుంచి ఆయన శ్రీలంకకు వెళ్లనున్నారు. -
ట్రంప్ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు
న్యూఢిల్లీ: అమెరికాకు ‘విముక్తి దినం’గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్దినంగా మిగిలిపోయింది. భారత్తో పాటు ఏకంగా 60 పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరడా ఝళిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను కుదుపుకు లోనైంది. వాళ్లూ, వీళ్లూ అని తేడా చూపకుండా అన్ని దేశాల మీదా 10 నుంచి 50 శాతం దాకా సుంకాలు బాదడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెర తీశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై బుధవారం సంతకం చేశారు. భారత్ను తప్పుడు వాణిజ్య విధానాలు అనుసరిస్తున్న ‘దారుణ దేశం’గా ఈ సందర్భంగా అభివర్ణించారు! అన్నిరకాల భారత ఉత్పత్తుల మీదా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించగా, అనంతరం దాన్ని 27 శాతంగా సవరించారు. అమెరికాకు అత్యవసరమైన ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, పలు ఖనిజాలు తదితరాలను మాత్రం సుంకాల బాదుడు నుంచి మినహాయించారు. అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తూత్పత్తుల మీదా 10 శాతం బేసిక్ టారిఫ్ విధించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్ తదితర దేశాలను వాణిజ్యపరంగా ‘ధూర్త దేశాలు’గా ట్రంప్ ఆక్షేపిస్తుండటం తెలిసిందే. వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లెక్కన భారత ఉత్పత్తులపై 10 శాతం బేస్లైన్ టారిఫ్ ఏప్రిల్ 5 నుంచి, 27 శాతం అదనపు సుంకాల వసూలు ఏప్రిల్ 9 నుంచి మొదలవుతాయి. చైనాపై ఇటీవలే 20 శాతం సుంకాలు విధించగా మరో 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ తాజాగా ప్రకటించారు! ట్రంప్ నిర్ణయంతో అమెరికా వార్షిక పన్ను వసూళ్లు ఏటా 60 వేల కోట్ల డాలర్ల మేరకు పెరుగుతాయని వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అంచనా వేశారు. ట్రంప్ ప్రకటనను దేశాలన్నీ దుయ్యబట్టాయి. అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని యూరోపియన్ యూనియన్, చైనా హెచ్చరించాయి. ట్రంప్ పునరాలోచించాలని పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ‘‘ట్రంప్కు అమెరికా ఫస్ట్ అయితే మోదీకి భారతే ఫస్ట్. దీనిపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం’’ అన్నారు. ట్రంప్ వలలో మోదీ: కాంగ్రెస్ భారత్పై అమెరికా తాజా సుంకాల మోతను మోదీ ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘మోదీ తన మిత్రుడంటూ ట్రంప్ ఆప్యాయత కనబరుస్తారు. బహిరంగంగా కౌగిలించుకున్నారు. కానీ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటూ మోదీపై చాకచక్యంగా వల విసిరారు. మనవాడు అందులో ఇరుక్కుపోయాడు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. తాజా సుంకా లు భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తా యని లోక్సభలో వి పక్ష నేత రాహుల్గాంధీ ఆందోళన వెలిబుచ్చా రు. వీటిని ఎలా ఎదుర్కోనున్నదీ కేంద్రం తక్షణం వివరించాలని డిమాండ్ చేశారు.మెరుగ్గా, బలంగా, దృఢంగా: ట్రంప్ప్రపంచ దేశాలపై తాను విధించిన తాజా సుంకాల మీద ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ ముగిసింది. రోగి బతికాడు. భేషుగ్గా ఉన్నాడు. చక్కగా కోలుకుంటున్నాడు. మునపటి కంటే పెద్దగా, మెరుగ్గా, బలంగా, ఎన్నడూ లేనంత దృఢంగా తయారవుతాడని తేలింది’’ అని ట్రూత్సోషల్లో కామెంట్ చేశారు.ఇండియాపై ఇరవై ఆరా, ఇరవై ఏడా? ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్తో పాటు 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు, అనంతరం వైట్హౌస్ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్లను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ వివరించింది. ఆ మేరకు భారత్పైనా సుంకం ఒక శాతం పెరిగింది. దాన్ని 26 శాతంగా ట్రంప్ పేర్కొనగా తర్వాత దాన్ని 27 శాతంగా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్హౌస్ ఈ మేరకు పేర్కొంది. భారత్తో పాటు దక్షిణకొరియ సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు. కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పనీ చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ప్రభా వం అమె రికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కెనడా, మెక్సికోలకు మినహాయింపుఐఈఈపీఏ స్టాండింగ్ ఆర్డరే కారణంఆ దేశాలపై ఇప్పటికే 25 శాతం బాదుడుడొనాల్డ్ ట్రంప్ వడ్డించిన తాజా సుంకాల నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. కైనడా, మెక్సికోలపై భారీ సుంకాలు తప్పవని పదేపదే చెబుతూ వచ్చినా తాజా టారిఫ్ల జాబితాలో వాటిని చేర్చలేదు. ఫెంటానిల్, వలసలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద స్టాండింగ్ ఆర్డర్ల కారణంగా కెనడా, మెక్సికోలకు కొత్త టారిఫ్లు వర్తించవని వైట్హౌస్ స్పష్టం చేసింది. అమెరికా–మెక్సికో–కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద అమెరికాలోకి ప్రవేశించే వస్తువులకు కూడా కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే చైనాతో పాటుగా కెనడా, మెక్సికోలపై ట్రంప్ ఇటీవలే 25 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. కనుక తాజా మినహాయింపు వాటికి పెద్దగా ఉపశమనం కలిగించబోదు. -
బుల్లి పేస్ మేకర్
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన, బియ్యం గింజ కంటే కూడా బుల్లి పేస్ మేకర్ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి పరిచారు. నార్త్వెస్ట్ర్న్ యూ నివర్సిటీకి చెందిన ఇంజనీర్లు గుండెను కృత్రిమంగా పనిచేయించే ఈ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఉపయో గం తీరాక శరీరంలోనే కలిసిపోవడం దీని మరో ప్రత్యేకత. శరీరంపై గాటు పెట్టాల్సిన అవసరమేమీ లేకుండా ఇంజెక్షన్ ద్వారానే దీనిని లోపలికి పంపించేయొచ్చు. జర్నల్ నేచర్లో ఈ వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. తాత్కాలిక అవసరాలు కలిగిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ‘మేం రూపకల్పన చేసిన ఈ డివైజ్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పేస్ మేకర్గా భావిస్తున్నాం’అని నార్త్వెస్టర్న్ బయో ఎల్రక్టానిక్స్ నిపుణుడు, బృంద సారథి జాన్ ఎ.రోజెర్స్ చెప్పారు. ‘ముఖ్యంగా పీడియాట్రిక్ గుండె సర్జరీలకు సూక్ష్మంగా ఉండటం ఎంతో కీలకం. పేస్ మేకర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది’అని ఆయన చెప్పారు. చిన్నారులను దృష్టిలో ఉంచుకునే ఈ డివైజ్ను రూపొందించామని నార్త్వెస్టర్న్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ చెప్పారు. ‘దాదాపు ఒక శాతం శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధ లోపాలతో ఉంటున్నా రు. సర్జరీ తర్వాత వీరికి తాత్కాలిక పేస్ మేకర్ అవసరమవుతుంది. దాదాపు వారం పాటు వీరి గుండెలు సొంతంగా రిపేర్ చేసుకుంటాయి. ఆ కీలకమైన సమయంలో ఈ చిన్న పేస్ మేకర్ వారికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది. దీనిని తొలగించడానికి మరో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు’అని ఎఫిమోవ్ వివరించారు. ఇదెలా పని చేస్తుందంటే..? ఛాతీపైన అమర్చే చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్, వైర్లెస్ ప్యాచ్లో ఈ పేస్ మేకర్ ఉంటుంది. గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే పేస్ మేకర్కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి, దానిని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం, కండరాల ద్వారా అంది గుండె లయను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు. దీని వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. సులభంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారైన పేస్ మేకర్లు రేడియో సిగ్నళ్లపై ఆధారపడగా, ఈ కొత్త డివైజ్ కేవలం కాంతిని ఉపయోగించుకుని గుండె లయను నియంత్రించ గలుగుతుందని రోజెర్స్ చెప్పారు. జంతువులపైన, దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డోజ్ నుంచి వైదొలగను: మస్క్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. వైట్హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరన్నారు. డోజ్ నుంచి మస్క్ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే. ‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. మస్క్ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్ ఫెడరల్ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు. ఆయన నాయకత్వంలో డోజ్ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు. -
నోబెల్ గ్రహీత వీసా రద్దు
శాన్జోస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్ అరియాస్ (84) వీసాను అమెరికా రద్దు చేసింది. దీనిపై అరియాస్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. రద్దుకు కారణమేమిటో తనకు తెలియదని కోస్టారికా రాజధాని శాన్ జోస్లో మీడియాతో అన్నారు. ‘‘వీసా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధికారులు మెయిల్ పంపారు. కానీ ఈ విషయమై ఎలాంటి వివరణా ఇవ్వలేదు’’అని చెప్పారు. ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును రోమన్ చక్రవర్తితో పోలుస్తూ నేను బహిరంగ విమర్శలు చేశా. నేను అధ్యక్షుడిగా ఉండగా చైనాతో కోస్టారికా దౌత్య బంధాన్ని పునరుద్ధరించా. బహుశా ఇవన్నీ కారణమై ఉంటాయి’’అని అభిప్రాయపడ్డారు. సెంట్రల్ అమెరికాలో ఘర్షణల నివారణకు చేసిన కృషికి అరియాస్కు 1987లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆయన 1986–1990, 2006–2010 మధ్య ఎనిమిదేళ్లు కోస్టారికా అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో పదవీకాలంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రోత్సహించారు. 2007లో తైవాన్కు దూరమై చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెజ్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలో 5జీ సదుపాయాల అభివృద్ధి పనుల నుంచి చైనా సంస్థలను పక్కన పెట్టారు. దీన్ని వ్యతిరేకించిన ముగ్గురు కోస్టారిక చట్టసభ సభ్యుల వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలపై అరియాస్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి రోడ్రిగో లొంగుతున్నారని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఒక చిన్న దేశం అమెరికాతో విభేదించడం సులువు కాదు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు రోమన్ చక్రవర్తిలా ప్రవర్తిస్తూ మిగతా ప్రపంచానికి ఏం చేయాలో, ఏం చేయొద్దో పొద్దస్తమానం చెబుతున్నప్పుడు మరింత కష్టం’’అంటూ ఎద్దేవా చేశారు. కోస్టారికాకు చెందిన మరో ప్రతిపక్ష శాసనసభ్యురాలి వీసాను కూడా అమెరికా మంగళవారం రద్దు చేసింది. -
ప్రతీకారం తప్పదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా టారిఫ్లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్ యూనియన్పై 20 శాతం సుంకాలను యూరప్ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్ మర్చిపోయినట్టున్నారు. యూఎస్పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్ లెయన్ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కియిర్ స్టార్మర్ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్–జపాన్ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్ ట్రంప్ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్ వైన్, స్పిరిట్స్ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్1బీ వీసా దారులు భవిష్యత్లో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో,రాదోనన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్ చేశాయి. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారి సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ హైలెట్ చేసింది.అయితే, హెచ్1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపాయి. -
సెల్యూట్ కొట్టే వాళ్లూ లేకుండా పోతారు!
పొరుగూరు వెళ్లి లాడ్జిలో దిగారనుకోండి.. వచ్చేటప్పుడు పోయేటప్పుడు తలుపులు తీసి.. దర్బాన్లు మనకు సెల్యూట్ చేస్తూంటే.. మన మనసు మూలల్లో ఎక్కడో ఒకచోట గర్వంగా ఫీల్ అవుతూంటాం! థ్యాంక్స్ టు రోబోటిక్స్ ఇప్పుడు ఈ చిన్ని ఆనందానికీ మనం దూరం కావల్సిందే! ఎందుకంటారా...?రోబో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనకు ఉద్యోగాలు తక్కువైపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వినపిస్తున్నదే. తాజా నిదర్శనం.. చైనీస్ కంపెనీ పుడు రోబోటిక్స్ అభివృద్ధి చేసిన ఫ్లాష్బోట్! మనిషి మాదిరిగానే ఎంచక్కా రెండు కాళ్లపై నడవడం మాత్రమే దీని ప్రత్యేకత కాదు. హోటళ్లు తదితర భవనాల్లో తలుపులు తీయడం, వేయడం... లాడ్జీల్లోనైతే వచ్చిన అతిథి సామాను మోసుకుని గది చూపించడం కూడా చేసేస్తుంది ఇది.ఫొటోలు చూడండి.. ఎంత వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉందో ఈ ఫ్లాష్బోట్. చేయి చాచితే మాత్రం ఆరు అడుగుల దూరంలోని వస్తువులను కూడా ఒడుపుగా పట్టుకోగలదు ఇది. ఇందుకు తగ్గట్టుగా పుడు రోబోటిక్స్ అత్యాధునిక డీహెచ్11 రోబో చేతులను అమర్చింది దీనికి. ఎత్తు తక్కువగా ఉన్నా లిఫ్ట్లలో సులువుగా బటన్స్ నొక్కేందుకు, వస్తువులను పట్టుకునేందుకు ఈ పొడవాటి చేతులు ఉపయోగపడతాయి అన్నమాట. ఛాట్జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ పుణ్యమా అని ఈ ఫ్లాష్బోట్ గొంతు కూడా అచ్చం మనిషిని పోలి ఉంటుంది. చెప్పే విషయాలను సరిగ్గా అర్థం చేసుకోగల సామర్థ్యమూ అబ్బింది. కాబట్టి ప్రత్యేకమైన సైగలు, బటన్స్ నొక్కే అవసరం లేకుండా చేయాల్సిన పనిని మనమే నేరుగా చెప్పేయవచ్చు.ఫ్లాష్బోట్ ముఖ భాగంలో పెద్ద టచ్స్క్రీన్ ఉంటుంది. దాంట్లో అమర్చిన సెన్సర్ల సాయంతో ఇది తన పరిసరాలను స్కాన్ చేయగలదు. ఏది ఎక్కడుందో గుర్తించేందుకు ఆర్జీబీ డెప్త్ కెమెరాలు, పానోరామిక్ కెమెరాలు, త్రీడీ మ్యాపుల కోసం, అడ్డంకులను గుర్తించి తప్పించుకునేంఉదకు లైడార్లు కూడా ఉన్నాయి దీంట్లో. హోటళ్లలో ఈ రోబోను వాడితే అతిథుల సామాన్లు మోసేందుకు ప్రత్యేకమైన క్యాబిన్లాంటిది కూడా ఉంటుంది. ఫలితంగా రోబో చేతులను ఇతర పనులకు వాడవచ్చు. ఫ్లాష్బోట్ ఒకొక్కటి సుమారు 15 కిలోల బరువుంటుంది. నాలుగు గంటలపాటు ఛార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు పనిచేయగలదు. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఖరీదెంత? వంటి వివరాలు కావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.(ఫొటోలు, వీడియోలు పుడు రోబోటిక్స్ సౌజన్యంతో) -
విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తుర్కియేలో చిక్కుకున్న భారతీయులు
లండన్ నుంచి ముంబై వెళ్తున్న ‘వర్జిన్ అట్లాంటిక్’ విమానం తుర్కియేలోని దియార్బాకిర్ ఎయిర్పోర్ట్ (డీఐవై)లో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.తుర్కియేలో ఒక మారుమూల విమానాశ్రయంలో బుధవారం రాత్రి నుంచి 200 మందికి పైగా భారత ప్రయాణికులు 16 గంటలకుపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రయాణికులు తిరిగి వారు ఎప్పుడు గమ్యస్థానం చేరతారనే దానిపై విమానయాన సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు. వీలైనంత త్వరగా రవాణా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ప్రయాణికులు కోరారు. -
ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా ఝుళిపింఆడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై "రెసిప్రోకల్ టారిఫ్స్" (Reciprocal Tariffs) విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10శాతం పన్నులు(Tariffs) చెల్లించాల్సింది ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 34 శాతం పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54 శాతానికి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25 శాతం యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20 శాతం పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10 శాతం పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధికోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరూ ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతోందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సుంకాలను ప్రకటించిన వెంటనే #TrumpTariffs , #TradeWar ఎక్స్( X)లో ట్రెండింగ్ షురూ అయింది. Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?"విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు! మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్ ధన్యవాదాలు. ఇకనాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మహా మాంద్యంలోకి తీసుకెళ్లడం అని అనుకున్నాడనుకుంట’’ అని ఒకరు ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24 శాతం సుంకాలు విధించినందుకు ట్రంప్ను విమర్శిస్తూ,"సరైన మనస్సు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కారును ఎందుకు కొనుగోలు చేయాలి?" అని ప్రశ్నించారు.Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅంతేకాదు ఈ సుంకాల నుండి రష్యాను మినహాయించినందుకు నెటిజన్లు ట్రంప్ను కూడా ఎగతాళి చేశారు. "ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జిఫ్ను ట్విట్ చేశాడు. "ట్రంప్స్టర్స్ శుభవార్త! మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం.. ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక’’ అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
తూచ్.. నేనేం పడిపోలేదు
పబ్లిక్ ఈవెంట్లకు హాజరైనప్పుడు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనస్ఫూర్తిగా మనుషుల్లోకి వెళ్లడం కంటే.. పబ్లిసిటీ కోసం ఫొటోలకు, వీడియోలకు ఫోజులు ఇచ్చేవాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆనక.. శానిటైజర్లతో చేతులు తుడుచుకుంటూ కనిపించిన దాఖలాలు మన తెలుగు రాజకీయాల్లోనే చూశాం. ఆ సంగతి పక్కన పెడితే, పాపం.. ఫొటోషూట్ హడావిడిలో ఏకంగా ప్రధాని స్థాయి వ్యక్తికే ఇక్కడ చేదు అనుభవం ఎదురైంది.కాన్బెర్రా: గురువారం న్యూ సౌత్వేల్స్ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొన్నారు. ప్రసంగం పూర్తయ్యాక.. వేదికపై ఫొటోషూట్లో పాల్గొన్నారు. ఆపై ఒక్కసారిగా పక్కకు వెళ్లి పడిపోయారు. వెంటనే లేచి తాను క్షేమంగా ఉన్నానని నవ్వుతూ సంకేతమిచ్చారు. ఆపై ఓ రేడియో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన ఆ ఘటనపై స్పందించారు. నేనేం పడిపోలేదు. ఓ అడుగు వెనక్కి పడిందంతే. ఒక కాలు కిందకు వంగిపోయింది.. అంటూ నవ్వుతూ చెప్పారు. ఇదిలా ఉంటే మే 3వ తేదీన ఆస్ట్రేలియా ఎన్నికలు జరగనున్నాయి.అధికార లేబర్ పార్టీకి, పీటర్ డుట్టాన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ లిబరల్ నేషనల్ పార్టీకి విజయావకాశాలు సమానంగా కనిపిస్తున్నాయి.Anthony Albanese has fallen off the stage while speaking at a mining union conference… pic.twitter.com/Z716MlW629— Roman Mackinnon (@RomanMackinnon6) April 3, 2025 -
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) దాదాపు అన్ని దేశాలపైన సుంకాలు విధించారు. మనుషులున్న దేశాలు లేదా ప్రాంతాలపై సుంకాలు విధిస్తే సరే అనుకోవచ్చు.. కానీ మనుషులే లేని దీవులపై కూడా సుంకాలు విధించడం చర్చనీయాంశమైంది.ట్రంప్ సుంకాలు విధించిన ప్రాంతాల జాబితాలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అధీనంలో ఉన్న హియర్డ్ ఐలాండ్, మెక్డొనాల్డ్ దీవులు కూడా ఉన్నాయి. నిజానికి ఈ దీవులు పెంగ్విన్ పక్షులు, సీల్స్, వివిధ పక్షి జాతులకు మాత్రమే నిలయం. ఈ దీవులపై ట్రంప్ సుంకాలను విధించారు.. కానీ ఎందుకు విధించారనే సంగతి చెప్పలేదు.ఆస్ట్రేలియాలోని పెర్త్కు సుమారు 4100 కిమీ దూరంలో ఉన్న ఈ హియర్డ్ ఐలాండ్, మెక్డొనాల్డ్ దీవులు 1947 నుంచి ఆస్ట్రేలియా భూభాగంగా ఉన్నాయి. భూమిపై అత్యంత మారుమూల ఉన్న ఈ ప్రాంతాల్లో జనావాసం ఉండదు. ఈ దీవులను సముద్రం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక నౌకలను ఉపయోగించి ప్రయాణం చేయడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.ఎవరూ నివసించని దీవులపై ట్రంప్ ప్రభుత్వం 10 శాతం సుంకం విధించడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెంగ్విన్ పక్షుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారా? అని ఒకరు కామెంట్ చేస్తే.. అమెరికా ఇప్పుడు చేపలపై కూడా సుంకాలు విధిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.భారత్పై 26 శాతంప్రపంచంలోని చాలా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ భారతదేశం మీద కూడా 26 శాతం సుంకం ప్రకటయించారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో తాము సగం మాత్రమే విధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ మామీద 52 శాతం సుంకం విధించింది. మేము ఇండియాపై 26 శాతం సుంకం విధిస్తున్నామని ఆయన అన్నారు. అమెరికా అత్యధిక సుంకం విధించిన దేశాలలో కంబోడియా (49 శాతం) ఉంది.Trump administration has put a 10 percent tariff on the Heard and McDonald Islands….which has a population of 0 people and is inhabited only by penguins. pic.twitter.com/oSx7LyU0b3— MaineWonk (@TheMaineWonk) April 2, 2025 -
ట్రంప్ 26శాతం సుంకాలు: భారత్ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: లిబరేషన్ డే పేరిట.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ‘సుంకాల బాంబు’ పేల్చారు. ఈ క్రమంలోనే భారత్పై 26శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించారు. దీంతో ట్రంప్ నిర్ణయంపై భారత్లో విశ్లేషణ మొదలైంది. అయితే ఇదేం మన దేశానికి ఎదురుదెబ్బ కాదంట!. ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల(reciprocal tariffs) ప్రభావం మన దేశంపై ఎంత ఉండొచ్చనే అంశాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. అయితే, ఇక్కడో మార్గం లేకపోలేదు. అమెరికా ఆందోళనలను ఏ దేశమైనా పరిష్కరించగలిగితే.. ఆ దేశంపై సుంకాల (Tariffs) తగ్గింపును ట్రంప్ ప్రభుత్వం పునఃపరిశీలించే నిబంధన కూడా ఉంది. కాబట్టి ఇది మిశ్రమ ఫలితమే అవుతుంది తప్ప.. భారత్కు ఎదురుదెబ్బ కాదు అని కేంద్ర వాణిజ్య శాఖలోని ఓ సీనియర్ అధికారి అంటున్నారు.ఎప్పటి నుంచి అమలు.. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు (అక్కడి కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో..) ట్రంప్ ప్రతీకార సుంకాలపై ప్రకటన చేశారు. తాను విధించిన టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ అన్నారు. కానీ, 26 శాతం టారిఫ్లో.. 10 శాతం సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. మిగతా 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని చెబుతోంది. లిబరేషన్ డే పేరిట ట్రంప్ చేసిన ప్రకటన సారాంశం.. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చు. అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందే. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం.. ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర విధిస్తున్నాం. భారత్ మా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తున్నందున, మేం 26% సుంకం విధిస్తున్నాం. ఇదిలా ఉంటే.. ట్రంప్ టారిఫ్ల ప్రకటన చేసే వేళ భారత ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదన్నారు.ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనకు ముందు గతంలో భారతీయ దిగుమతులపై అమెరికా చాలా తక్కువ సుంకాలను విధిస్తూ వచ్చింది. విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై కేవలం 2.5% సుంకాలను, దిగుమతి చేసుకున్న మోటార్సైకిళ్లపై 2.4% సుంకాలను మాత్రమే విధించాయి. అయితే భారత్ మాత్రం అమెరికా వస్తువులపై 52% సుంకాలను వసూలు చేస్తోందన్నది ట్రంప్ వాదన.నీ క్రమంలోనే ఇప్పుడు 26 శాతం టారిఫ్ను ప్రకటించారు. -
పుతిన్ మరో సంచలన నిర్ణయం.. 1.6 లక్షల మంది సైనికులు..
మాస్కో: ఉక్రెయిన్తో యుద్ధం వేళ రష్యా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా తన సైనిక బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నంలో పడింది. మరో 1,60,000 మంది సైనికుల నియామకానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా పిలుపునిచ్చారు. జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది.వివరాల ప్రకారం.. రష్యా సైనిక బలం పెంచే యోచనలో ఉన్నారు అధ్యక్షుడు పుతిన్. ఇందులో భాగంగానే 1,60,000 మంది సైనికుల నియామకానికి రంగం సిద్ధం చేశారు. 18–30 ఏళ్ల మధ్య వయసున్న పురుషులను సైన్యంలోకి తీసుకోనున్నారు. 2011 నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్లలో ఇదే అతి పెద్దది. వచ్చే మూడేళ్లలో ఇది 1.8 లక్షలకు పెరగనుంది.ఇక, సైన్యం పరిమాణాన్ని 24 లక్షలకు, క్రియాశీల సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచుకుంటామని పుతిన్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కొత్త సైనికులను యుద్ధానికి పంపబోమని, ఈ నియామకాలకు ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక చర్యకు వారిని పంపబోమని వెల్లడించింది. Putin’s War Machine Expands: 160,000 More Drafted as Ceasefire Stalls! —largest conscription since war began. pic.twitter.com/AoTrzrzdCB— Kristin Sokoloff (@KSOKUNCENSORED) April 1, 2025 -
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్హౌస్లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025 -
గాజాలో ఆకలి కేకలు: పిండీ లేదు.. తిండీ లేదు
రంజాన్ పండుగతో పాటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల ఉపవాస దీక్షలు ముగిసినా గాజాలో మాత్రం పాలస్తీనియన్లకు నిత్య ఉపవాసాలే కొనసాగుతున్నాయి. తినడానికి ఏమీ లేక ఖాళీ జనం డొక్కలెండుతున్నాయి. గాజాకు మానవతా సాయాన్ని, ఆహార సరఫరాను ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకోవడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజం భారీ పరిమాణంలో పంపిన ఆహార నిల్వలన్నీ సరిహద్దుల వద్దే కుళ్లిపోతున్నాయి. గాజా ఏమో నిస్సహాయ స్థితిలో ఆకలితో యుద్ధం చేస్తోంది. రంజాన్ పండుగ సందర్భంగా కూడా కనీసం రొట్టెముక్కయినా దొరకని కుటుంబాలెన్నో...! ఇది చాలదన్నట్టు పిండి నిల్వలు కూడా పూర్తిగా నిండుకోవడంతో తాజాగా గాజాలో బేకరీలన్నీ మూతబడ్డాయి!!ఈద్. పవిత్ర రంజాన్ మాసానికి ముగింపు. సాధారణంగా అయితే గాజావాసులకూ వేడుకే. కుటుంబాలన్నీ కలిసి ఆనందంగా పండుగ జరుపుకొంటాయి. కానీ గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అక్కడ ఈద్ పాలస్తీనావాసుల ఆకలి కేకలు, ఇజ్రాయిల్ బాంబు దాడుల నడుమే ముగిసింది. యుద్ధం దెబ్బకు గాజా ఆహారోత్పత్తి సామర్థ్యం పూర్తిగా పడకేసింది. దాంతో తిండికి కూడా అంతర్జాతీయ సాయంపైనే ఆధారపడుతోంది. ఇజ్రాయెల్ మాత్రం తమ బందీల విడుదల కోసం హమాస్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నుంచే గాజాకు ఆహారం, మానవతా సాయం సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. దాంతో సహాయక ట్రక్కులు గాజాలో అడుగు పెట్టి మూడు వారాలు దాటింది. 18 నెలల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ గాజాకు ఇంతకాలం పాటు ఎలాంటి ఆహార సరఫరాలూ అందకపోవడం ఇదే తొలిసారి. దాంతో ఇంధనం తదితరాల కొరత తారస్థాయికి చేరింది. అంతేకాదు, కనీసం పిండి నిల్వలు కూడా లేని పరిస్థితి! దాంతో బుధవారం గాజాలోని బేకరీలన్నీ మూతబడ్డాయి. స్థానిక బేకరీ యజమానుల సంఘం చీఫ్ అబ్దెల్ నాసర్ అల్–అజ్రామి ఈ మేరకు ప్రకటించారు. ‘‘గిడ్డంగుల్లో పిండి పూర్తిగా అయిపోయినట్టు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్పీ) మాకు తెలిపింది. ఇజ్రాయిల్ రఫా క్రాసింగ్ తదితరాలను తెరిచి సహాయక సామగ్రి, మానవతా సాయాలను తిరిగి గాజాలోకి అనుమతించేదాకా బేకరీలు పనిచేయబోవు’’అని వెల్లడించారు. అబద్ధాలతో నిద్రపుచ్చుతూ... పాలస్తీనియన్ల ఆకలిని తీరుస్తున్న ప్రధాన వనరు రొట్టె మాత్రమే. చికెన్, మాంసం, కూరగాయలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. అందుబాటులో ఉన్న ఇతర ఆహార పదార్థాలను రొట్టెను తింటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ‘‘పరిస్థితి వివరించలేనంత దారుణంగా ఉంది. నా కుటుంబసభ్యులకు బ్రెడ్ కోసం ఉదయం 8 గంటల నుంచీ వెతుకుతున్నాను. డెయిర్ అల్–బలాహ్లోని అన్ని బేకరీల చుట్టూ తిరిగా. ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పిండి లేదు. కట్టె లేదు. ఏమీ లేవు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఇంత దారుణం చూస్తామని ఎన్నడూ అనుకోలేదు’’అని ఇబ్రహీం అల్ కుర్ద్ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘పిల్లలు రాత్రి భోజనం చేయకుండానే పడుకుంటున్నారు. ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టండి, ఉదయాన్నే పిండి తెచ్చుకుందామని వారికి అబద్ధాలు చెబుతూ నిద్రపుచ్చుతున్నాం’’అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. రఫా తదితర క్రాసింగ్లను తిరిగి తెరిచేలా ఇజ్రాయెల్పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన వేడుకుంటున్నాడు. చుక్కల్లో పిండి ధరలు... రొట్టెతో పాటు గాజావాసులకు వంట కోసం గ్యాస్ను కూడా బేకరీలే అందించేవి. అవి మూతబడటంతో తిండి వండుకోవడానికి కలపనే ఆశ్రయిస్తున్నారు. కానీ దానికీ తీవ్ర కొరతే ఉంది. కలపను బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముతున్నారు. దాంతో అదీ జనానికి అందుబాటులో లేకుండా పోయింది. నూనె, ఈస్ట్ వంటి బేకింగ్ పదార్థాలు కూడా కొనలేని పరిస్థితి! బేకరీలు మూతబడటంతో పిండి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఒక్క సంచీ ఏకంగా 400 షెకెల్స్ (115 డాలర్ల)కు అమ్ముతున్నారు. యుద్ధానికి ముందు 25 షెకెల్స్ ఉండేది. గత జనవరిలో స్వల్పకాలిక కాల్పుల విరమణ సందర్భంగా కూడా 35 షెకెల్స్కు దొరికేది. ‘‘ప్రజలు ఇప్పుడు యుద్ధ భయాన్ని, బాంబు దాడులను, వలస కష్టాలను, అన్నింటినీ మర్చిపోయారు. వారి ఆలోచనలన్నీ ఏ పూటకు ఆ పూట పిండి ఎలా దొరుకుతుందా అన్నదాని మీదే ఉన్నాయి’’అని ఉత్తర గాజాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అహ్మద్ డ్రెమ్లీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధం మొదలైనప్పుడు ప్రజలు ఆరోగ్యంగా, దేన్నయినా తట్టుకునే సామర్థ్యంతో ఉన్నారు. ఇప్పుడంతా మారిపోయింది. రొట్టెకు కూడా దిక్కు లేదు! దాంతో జనం ఏది దొరికినా తిని కడుపు నింపుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా చాలామందికి తినేందుకు ఏమీ దొరకడం లేదు. బియ్యం కొనడానికి అప్పు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. చాలామంది పాలస్తీనియన్లు రద్దీగా ఉన్న గుడారాల్లో బతుకీడుస్తున్నారు. కొందరైతే వీధుల్లోనే నిద్రపోతున్నారు. తిండి వండుకునే పరిస్థితులు కూడా లేవు’’అంటూ గాజాలోని దైన్యాన్ని ఆయన వివరించారు. దారుణ సంక్షోభం: ఐరాస ‘‘కాల్పుల విరమణ సమయంలో గాజాలోకి రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల్లో సహాయక సామగ్రి వచ్చేది. ఇప్పుడన్నీ ఆగిపోయాయి. కాల్పుల విరమణ ముగిసి యుద్ధం తిరిగి మొదలైనప్పటినుంచీ ఘోరమైన మానవతా సంక్షోభం నెలకొంది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఆపేసింది. ముఖ్యంగా బేకరీల మూతతో ఆహారం కోసం కేవలం వాటిపైనే ఆధారపడ్డ లక్షలాది మంది అల్లాడుతున్నారు. దిగ్బంధాన్ని తక్షణం ఎత్తేయకపోతే గాజాలో త్వరలోనే మరణమృదంగం తప్పదు’’అని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారి హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాపై సుంకాలు ఎత్తేసిన ఇజ్రాయెల్
జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలు పని చేస్తున్నాయి. అమెరికా దిగుమతులపై అన్ని సుంకాలను ఇజ్రాయెల్ ఎత్తేసింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘అమెరికా వస్తువులపై కస్టమ్స్ సుంకాలను రద్దు చేయడమంటే మార్కెట్ను ఒక దశాబ్దం పాటు పోటీకి తెరవడం. ఆర్థిక వ్యవస్థకు వైవిధ్యాన్ని పరిచయం చేయడం. జీవన వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం ఎంచుకున్న విధానాల్లో ఇది అదనపు దశ. మార్కెట్కు, ఇజ్రాయెల్ పౌరులకు ప్రయోజనం చేకూర్చేది. ఇజ్రాయెల్, అమెరికాల సంబంధాలను ఈ చర్య మరింత బలోపేతం చేస్తుంది’’ అని ‘ఎక్స్’లో నెతన్యాహు ప్రకటించారు.40 ఏళ్ల స్వేచ్ఛా వాణిజ్యంఇజ్రాయెల్, అమెరికా మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లో ఉంది. 99 శాతం అమెరికా దిగుమతులను ఇజ్రాయెల్ ఇప్పటికే సుంకాల నుంచి మినహాయించింది. ఈ నేపథ్యంలో తాజా చర్యను ఆర్థిక చర్యగా కంటే దౌత్య, రాజకీయ చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వ్యవసాయోత్పత్తులపై ఇజ్రాయెల్ ఏటా 42 మిలియన్ షెకెల్స్ (సుమారు 1.15 కోట్ల డాలర్ల) సుంకాలు వసూలు చేస్తోంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం 2024లో ఆ దేశం మొత్తం ఎగుమతుల విలువ 172 కోట్ల డాలర్లు. అమెరికా నుంచి దిగుమతుల విలువ 92 కోట్ల డాలర్లు. -
మృత్యువుతో 108 గంటల పోరాటం
బ్యాంకాక్: భారీ భూకంపం మయన్మార్ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్ లిన్ టున్ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్ లిన్ టున్ మయన్మార్ రాజధాని నేపడాలోని క్యాపిటల్ సిటీ హోటల్లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్ లిన్ టున్ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్ఫోన్ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్షిప్లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది. -
జపాన్లో భారీ భూకంపం
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.గత ఏడాది ఆగస్టులోనూ జపాన్లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. 6.9, 7.1 తీవ్రతతో ఏర్పడిన రెండు శక్తిమంతమైన భూకంపాలు నైరుతి దీవులైన క్యూషు, షికోకులను ప్రభావితం చేశాయి. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.ఏఎఫ్పీ (Agence France-Presse) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుందని పేర్కొంది.కాగా, ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్లో సంభవించిన భూకంపం థాయిలాండ్లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. -
రష్యాను టెన్షన్ పెడుతున్న కొత్త వైరస్.. భయాందోళనలో రష్యన్లు!
మాస్కో: రష్యాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అంతుచిక్కని వైరస్ కారణంగా రష్యా ప్రజలకు విపరీతమైన దగ్గుతో నోటిలో నుంచి రక్తం పడుతుందనే కథనాల్లో పేర్కొన్నాయి. వీరికి కోవిడ్ టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చిందని.. ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేశాయి. మరోవైపు.. ఈ కథనాలను రష్యా అధికారులు ఖండించారు. వైరస్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదన్నారు.వివరాల ప్రకారం.. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని మార్చి 29న పలు నివేదికలు వెలువడ్డాయి. అలెగ్జాండ్రా అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుందని.. కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిపిందని నివేదికలు వెల్లడించాయి. అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధులతో.. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. పలు నగరాల్లో ప్రజలు వారాలతరబడి జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎన్ని మందులు వాడినప్పటికీ తగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే సమయంలో మరికొందరు నెటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అలాగే, తాము కోవిడ్ టెస్టులు చేపించుకున్నప్పటికీ పాజిటివ్ రాలేదని చెప్పుకొచ్చారు. ఈ వైరస్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలిపారు.🦠 Unknown virus emerges in Russia: people suffer from high fever and bloody cough for weeksAccording to media reports, the symptoms of those infected are identical: it begins with typical aches and weakness, but after a few days, the virus drains the person, making it… pic.twitter.com/0tsDsCfLv8— NEXTA (@nexta_tv) March 29, 2025దీంతో, కొత్త వైరస్పై తీవ్ర చర్చ మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రష్యా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో సదరు అధికారులు స్పందిస్తూ.. ఈ నివేదికలను ఖండించారు. తాము జరుపుతున్న పరీక్షల్లో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని.. కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాస్మా న్యుమోనియా ఉన్నట్లు నిర్ధరించారని తెలిపారు. ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దానిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇక, కొత్త వైరస్కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.🇷🇺 A mystery outbreak causing patients to cough up blood and suffer from a prolonged high fever has been reported in Russia, sparking fears of a new pandemic. However, Russian authorities have denied claims of an unidentified virus and have not disclosed the number of infections… pic.twitter.com/B03IPo3kPG— 🔴 Press review and more 🛰️ (@EUFreeCitizen) April 1, 2025 -
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమెరికాతో చర్చలకు ఇరాన్ రాని పక్షంలో.. ఒకవేళ మంతనాలకు ఇరాన్ వచ్చినా చర్చలు విఫలమయ్యే పక్షంలో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపేందుకు ఇరాన్ భూభాగంపై లక్ష్యాలుగా ఎంచుకునే మూడు కీలక అణు స్థావరాలు.. నతాంజ్, ఫర్దో, ఇస్ఫహాన్. ఒక చోట అని కాకుండా ఇరాన్ గడ్డపై పలు ప్రాంతాల్లో అణు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచివున్న నేపథ్యంలో రక్షణ కోసం కొన్ని అణు స్థావరాలను భూగర్భంలో ఇరాన్ నిర్మించుకుంది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఇరాన్ 2015లో పీ5 (పర్మినెంట్5/ఐరాసలో శాశ్వత సభ్యత్వం గల) దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అణు కార్యక్రమాన్ని చాలావరకు నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాకుండా తమ అణు స్థావరాల్లో అంతర్జాతీయ తనిఖీలను అనుమతించేందుకు అంగీకరించింది. ఒప్పందం అమల్లో ఉన్నా ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేక్ పడలేదన్న కారణంతో ట్రంప్ తొలి హయాంలో 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇదే అదనుగా ఇరాన్ కూడా తమ అణు కార్యక్రమంపై ఆయా దేశాలు విధించిన ఆంక్షలను ఆ మరుసటి ఏడాది నుంచి విస్మరించడం ఆరంభించింది. అలా ఒప్పందం విచ్ఛిన్నమవడంతో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ విస్తరించింది. భారీ అణుశక్తి..2015 నాటి ఒప్పందం అమలైతే ఇరాన్ అణుబాంబు తయారీకి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి కనీసం సంవత్సర కాలం పట్టేది. ఎప్పుడైతే ఒప్పందం విఫలమైందో ఆ వెంటనే యురేనియం శుద్ధిని ఇరాన్ వేగవంతం చేసింది. ఫలితంగా వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తి కాలాన్ని ఏడాది నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వ్యవధికి ఇరాన్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇరాన్ ప్రస్తుతం రెండు ప్రదేశాల్లో యురేనియంను 60% ఫిజైల్ ప్యూరిటీ వరకు శుద్ధి చేస్తోంది. దీని అర్థం 90% వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఇరాన్ చేరువైనట్టే. శుద్ధితో యురేనియం స్వచ్ఛత పెరిగేకొద్దీ కేంద్రక విచ్ఛిత్తి (విస్ఫోటన) సామర్థ్యం అధికమవుతుంది. సైద్ధాంతికంగా చూస్తే.. యురేనియం శుద్ధిని మరింత కొనసాగిస్తే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న యురేనియంతో ఆరు అణుబాంబులు రెడీ అవుతాయి!.నతాంజ్.. భూగర్భంలో మూడంతస్తులు! రాజధాని టెహ్రాన్ నగరానికి దక్షిణంగా నతాంజ్ వద్ద భూగర్భంలో ఒకటి (ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్), భూమి ఉపరితలంపై ఒకటి (పైలట్ ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్) చొప్పున రెండు యురేనియం శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో భూగర్భ ప్లాంటులో ప్రస్తుతం 16 వేల సెంట్రీఫ్యూజెస్ ఉండగా 13 వేల సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. ఇవి యురేనియంను 5% స్వచ్ఛత వరకు శుద్ధి చేస్తున్నాయి. భూగర్భంలో మూడు అంతస్తుల్లో ఈ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ భూగర్భ స్థావరాన్ని ఎంతవరకు నాశనం చేయగలవనేది ప్రశ్నార్థకం. ఇక భూ ఉపరితలంపై ఉన్న ప్లాంటులో వందల సెంట్రీఫ్యూజెస్ మాత్రమే ఉన్నప్పటికీ 60% స్వచ్ఛత వరకు యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోంది. ఏమిటీ సెంట్రీఫ్యూజెస్? యురేనియం శుద్ధి ప్రక్రియలో సెంట్రీఫ్యూజెస్ పాత్ర కీలకం. సహజ యురేనియంలో యురేనియం-238 అధికంగా, యురేనియం-235 స్వల్పంగా (0.7%) ఉంటాయి. అణు ఇంధనం తయారీకి ఎక్కువ గాఢతతో కూడిన యురేనియం-235 కావాలి. యురేనియం-238 నుంచి యురేనియం-235ను వేరుచేయడానికి అపకేంద్ర బలాన్ని సెంట్రీఫ్యూజెస్ ఉపయోగించుకుంటాయి. సెంట్రీఫ్యూజెస్ నిమిషానికి 50 వేల రౌండ్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో భార అణువులు కేంద్రానికి దూరంగా తోసివేయబడితే, తేలికపాటి అణువులు కేంద్రానికి దగ్గరగా వస్తాయి. యురేనియంను వాయువు (యూఎఫ్6)గా మార్చి వేగంగా తిరిగే సిలిండర్ల (సెంట్రీఫ్యూజెస్)లోకి పంపుతారు. అధిక సాంద్రతతో కూడిన యురేనియం-238 గల భార యూఎఫ్6 అణువులు ఆ సిలిండర్ల వెలుపలి అంచుల వద్దకు, అల్ప సాంద్రతతో కూడిన యురేనియం-235 గల తేలికపాటి యూఎఫ్6 అణువులు కేంద్రం వద్దకు చేరతాయి. అలా యురేనియం-235ను వేరుచేసి తర్వాత దశకు పంపుతారు. బాగా శుద్ధి అయిన (హైలీ ఎన్రిచ్ద్) యురేనియంను అణ్వాయుధాల తయారీలోనూ, అల్ప శుద్ధి (లో ఎన్రిచ్ద్) యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగిస్తారు. Telegraph: Current US bombs not enough to penetrate Iran's nuclear facilities!The American B-2 bomber can penetrate to a depth of 61 meters, but the Natanz and Fordow nuclear facilities in Iran are built at a depth of 80 to 100 meters.In addition, Iran's facilities are… pic.twitter.com/lcDi8GMKAN— Sprinter Observer (@SprinterObserve) December 24, 2024ఫర్దో.. పర్వతగర్భంలో! భద్రత పరంగా నతాంజ్ భూగర్భ ప్లాంటు కంటే ఫర్దోలోని యురేనియం శుద్ధి కేంద్రం ఉత్తమమైనది. ఎందుకంటే దీన్ని పర్వతాన్ని తొలిచి నిర్మించారు. ఇక్కడ రెండు వేల దాకా సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మూడో తరానికి చెందిన అత్యాధునిక ఐఆర్-6 సెంట్రీఫ్యూజ్ యంత్రాలను వినియోగిస్తుండటం విశేషం. ఇస్ఫహాన్.. శుద్ధి చేసిన యురేనియం నిల్వ! దేశంలో రెండో అతి పెద్ద నగరం ఇస్ఫహాన్. ఇరాన్ ఇక్కడ భారీ న్యూక్లియర్ టెక్నాలజీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఫ్యూయెల్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలో యురేనియంను ‘యురేనియం హెక్సాఫ్లోరైడ్ (యూఎఫ్6)గా మార్చి సెంట్రీఫ్యూజెస్ యంత్రాల్లోకి పంపుతారు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఇక్కడే నిల్వ చేస్తుంది.-జమ్ముల శ్రీకాంత్.Natanz for uranium enrichment. Underground enrichment facility of this center is protected by a concrete shield with a thickness of approximately 7.6 meters📍33°43'29.8"N 51°43'33.9" pic.twitter.com/jHffMnchWE— 𝓂𝒶𝓇𝒾𝑜🇱🇧🇬🇧🇦🇪 (@MarioLeb79) March 31, 2025 -
పొంచివున్న మహాభూకంపం.. మూడు లక్షల మరణాలు ఖాయం?
న్యూఢిల్లీ: భవిష్యత్లో మహా భూకంపం (Mega quake) రానుందా? దీని తీవ్రతకు 3,00,000 మంది ప్రాణాలు కోల్పోనున్నారా? లెక్కలేనన్ని నగరాలు సముద్రంలో మునిగిపోతాయా? ఈ సామూహిక విధ్వంసానికి సమయం ఆసన్నమయ్యిందా?.. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రశ్నలకు ‘అదే జరగవచ్చు’ అంటూ జపాన్ తన అంచనాలను, భవిష్యవాణిని వెల్లడించింది. ఏజెన్సీ ఫ్రాన్స్-ప్రెస్ (Agence France-Presse) (ఏఎప్పీ) తెలిపిన వివరాల ప్రకారం జపాన్ ప్రభుత్వ సంస్థ భవిష్యత్లో మెగా భూకంపం రానున్నదని అంచనా వేసింది. ఈ భారీ భూకంపం భూమిపై అపరిమిత వినాశనాన్ని కలిగిస్తుందని, మూడు లక్షల మంది మరణానికి కారణమవుతుందని తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా సునామీ సంభవిస్తుందని, ఇది అనేక నగరాలను సముద్రంలో కలిపేస్తుందని పేర్కొంది. ‘మెగా క్వేక్ అనేది చాలా శక్తివంతమైన భూకంపం. దీని తీవ్రత 8 లేదా అంతకన్నా అధిక తీవ్రతతో ఉంటుంది. ఇది భారీ విధ్వంసానికి కారణంగా నిలుస్తుంది. సునామీని కూడా సృష్టిస్తుంది.ఇటీవల మయన్మార్ (Myanmar)లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. వేలాది మంది ప్రస్తుతం ఆస్పత్రులలో జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నారు. లెక్క లేనంత మంది గల్లంతయ్యారు. పలు నగరాల్లో, ఎత్తైన భవనాలు, ఇళ్లు, దేవాలయాలు శిథిలమయ్యాయి. మయన్మార్లో సంభవించిన భూకంపం థాయిలాండ్లోనూ వినాశనాన్ని మిగిల్చింది. బ్యాంకాక్లో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను మరువక ముందే జపాన్ మహాభూకంపం అంచనాలను చెప్పడంతో అందరూ ఆందోళనకు గురవుతున్నారు.జపాన్ ప్రభుత్వం (Japanese Government) తమ దేశ పసిఫిక్ తీరంలో వినాశకరమైన మెగా క్వేక్ సంభవించవచ్చని తెలిపింది. దీని కారణంగా సునామీ వస్తుందని, ఇదే జరిగితే జపాన్లో లక్షలాది మంది ప్రజలు కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడతారని పేర్కొంది. మృతదేహాలను లెక్కించడం కూడా కష్టమయ్యేంత విధ్వంసం జరుగుతుందని అంచనా వేసింది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు నాశనమవుతుందని పేర్కొంది. అందుకే మెగా భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించినట్లు వెల్లడించింది.భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీరప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం 80 శాతం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వార్తా సంస్థ ఏఎప్పీ నివేదిక ప్రకారం జపాన్లో 9 తీవ్రతతో భూకంపం సంభవిస్తే, 13 లక్షల మంది నిరాశ్రయులు కానున్నారు. భవనాలు కూలిపోవడం వల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే జపాన్ ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు (అంటే రూ. 171 లక్షల కోట్లకు పైగా) నష్టపోతుంది. ఈ నష్టం నుండి కోలుకోవడం జపాన్కు చాలా భారంగా మారుతుంది.ఇది కూడా చదవండి: చెలరేగిపోతున్న యూట్యూబర్లు.. కేదార్నాథ్లో కొత్త రూల్ -
భారత్కు షాక్.. ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు
గువాహటి/ఇంఫాల్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహదారు ముహమ్మద్ యూనుస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీంతో, మరోసారి రెండు దేశాల మధ్య రాజకీయంగా ప్రాధాన్యత చోటుచేసుకుంది.చైనా పర్యటన సందర్భంగా యూనుస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా యూనుస్.. ‘సెవన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్రమార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణావకావం. ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక సత్తాను చాటొచ్చు. ఇక్కడ విస్తరించి, ఉత్పత్తులు తయారుచేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు’ అని అన్నారు.దీంతో, పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చైనాతో దోస్తీకి అర్రులు చాచే యూనుస్ ఏ అర్హతతో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన తెస్తారు?’ అని నేతలు మండిపడ్డారు. త్రిపురలో ముఖ్యమైన తిప్రా మోతా పార్టీ చీఫ్, రాజవంశీకుడు ప్రద్యోత్ దేబర్మా మాణిక్య ఘాటుగా స్పందించారు. ‘ఇరుకైన చికెన్ నెక్ కారిడార్లో భారత సైన్యం మోహరింపు, పటిష్టమైన భద్రతపై దృష్టిపెట్టడంతోపాటు ఈసారి ఏకంగా బంగ్లాదేశ్ను నిలువుగా చీల్చి ఈశాన్య రాష్ట్రాలకు సముద్రమార్గాన్ని ఏర్పాటుచేయాలి. అసలు 1947 బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ నౌకాశ్రయం మన చేతికొచ్చినా త్యజించడం ఆనాడు చేసిన పెద్ద తప్పు’ అని ప్రద్యోత్ అన్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్ర పరిణామాలు ఊహించకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని యూనుస్కు మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ హితవు పలికారు. ‘భారత విదేశాంగ విధానం ఈ స్థాయికి దిగజారడం శోచనీయం. ఏ దేశం విమోచన కోసం భారత్ పోరాడింతో ఇప్పుడు అదే దేశం శత్రుదేశంతో చేతులు కలపడం దారుణం’ అని అస్సాం జాతీయ పరిషత్(ఏజేపీ)అధ్యక్షుడు, జొర్హాట్ ఎంపీ లురిన్ జ్యోతి గొగోయ్ అన్నారు. భారత విదేశాంగ విధానం ఎంత బలహీనపడిందో యూనుస్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని మోదీ సర్కార్పై కాంగ్రెస్ విమర్శించింది. -
ఏనుగు–డ్రాగన్ ‘ట్యాంగో’ చేయాలి
బీజింగ్: భారత్, చైనా దేశాలు కలిసికట్టుగా పని చేయాలని చైనా అధినేత జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి లక్ష్యాల సాధనకు మనమంతా చేతులు కలపాలని సూచించారు. ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు–డ్రాగన్ కలిసి ‘ట్యాంగో’డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. భారత్–చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లవుతున్న సందర్భంగా భారత్కు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జిన్పింగ్ ఒక సందేశం పంపించారు. భారత్, చైనాలు ప్రాచీన నాగరికతలు కలిగిన దేశాలని గుర్తుచేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశాలుగా, గ్లోబల్ సౌత్లో ముఖ్యమైన సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆధునీకరణ ప్రయత్నాల్లో ఇరుదేశాలూ ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు జిన్పింగ్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి, భారత్–చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడానికి భారత్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.కీలక రంగాల్లో పరస్పర సహకారం మరింత వృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జిన్పింగ్ సందేశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిస్పందించారు. స్థిరమైన సేŠన్హ సంబంధాలు, ద్వైపాక్షిక భాగస్వామ్యం మన రెండు దేశాలతోపాటు మొత్తం ప్రపంచానికి మేలు చేస్తాయని వివరించారు. భారత్–చైనా సంబంధాలను మరింత ఉన్నత స్థానానికి చేర్చడానికి ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా ఉపయోగించాలని పేర్కొన్నారు. మరోవైపు చైనా ప్రధాని లీ ఖెకియాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సైత పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. -
ఐస్లాండ్లో మళ్లీ బద్దలైన అగ్ని పర్వతం
లండన్: అట్లాంటిక్ సముద్ర ద్వీప దేశం ఐస్లాండ్లో మరోసారి అగ్ని పర్వతం బద్దలైంది. రెక్జానెక్ ద్వీపకల్పంలోని గ్రిండావిక్ పట్టణ సమీపంలోని అగ్ని పర్వతం నుంచి భారీగా లావా, పొగలు చిమ్ముతుండటంతో మంగళవారం అధికారులు అక్కడున్న 40 నివాసాలను ఖాళీ చేయించారు. ఐస్లాండ్లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్ జియోథర్మల్ స్పాను మూసివేశారు. దాదాపు 800 ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా లావా పెల్లుబకడంతో గతేడాదే ఇక్కడున్న వారందరినీ వేరే చోటుకు తరలించారు. ఉదయం 6.30 గంటలకు లావా ప్రవాహం మొదలై గ్రిండావిక్కు ఉత్తరంగా ఏర్పాటు చేసిన రక్షణ బారియర్ను దాటుకుని 500 మీటర్ల పొడవున ప్రవహిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. ఉత్తర అట్లాంటిక్లోని అగ్ని పర్వతాలకు కేంద్రమైన ప్రాంతంలో ఐస్లాండ్ ఉంది. 2010లో ఇక్కడి అగ్ని పర్వతం విస్ఫోటంతో భారీగా వాతావరణంలోకి వెదజల్లిన బూడిద మేఘాలు కొన్ని నెలలపాటు అట్లాంటిక్ మీదుగా విమాన ప్రయాణాలకు అంతరాయం కలిగించాయి. -
మాండలే.. మరుభూమి
మాండలే: మయన్మార్ భూకంపం దేశంలో రెండో అతి పెద్ద నగరమైన మాండలేను మరుభూమిగా మార్చేసింది. నగరంలో మూడొంతులకు పైగా భవనాలు కుప్పకూలాయి. అవన్నీ క్రమంగా శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల లేమితో శిథిలాల వెలికితీత నత్తనడకన సాగుతోంది. వాటికింద వేలాదిమంది చిక్కుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు కావస్తుండటంతో వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లుతున్నాయి. కుళ్లుతున్న శవాలతో మాండలే వీధుల్లో ఇప్పటికే భరించలేనంతటి దుర్గంధం వ్యాపించింది.దీనికితోడు మంగళవారం సాయంత్రం కూడా మాండలేను మరో భూకంపం వణికించింది. 5.1 తీవ్రత భూమి కంపించడంతో ఇప్పటికే దెబ్బతిని పగుళ్లిచ్చిన చాలా భవనాలు కుప్పకూలాయి. దాంతో జనం హాహాకారాలు చేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. రాత్రంతా ఆరుబయటే జాగారం చేస్తూ గడిపారు. దేశవ్యాప్తంగా భూకంప మృతుల సంఖ్య 2,700, క్షతగాత్రుల సంఖ్య 5,000 దాటాయి. వారి స్మృత్యర్థం మంగళవారం మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ప్రజలు నిమిషం పాటు మౌనం పాటించారు. మయన్మార్లో 10 వేలకు పైగా భవనాలు కూలిపోయినట్టు ఐరాస పేర్కొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య అపారంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు పెద్ద ప్రతిబంధకంగా మారుతోంది. మంగళవారం దాకా విపరీతమైన ఎండ కాయగా బుధవారం నుంచి భారీ వర్ష సూచనలు ఆందోళనగా మారాయి. బ్యాంకాక్లో 21 మంది...థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపానికి 21 మంది బలైనట్టు ఇప్పటిదాకా తేలింది. కుప్పకూలిన నిర్మాణంలోని 30 అంతస్తుల భవనం వద్ద శిథిలాల తొలగింపు ఇంకా కొనసా గుతోంది. అందులో పని చేస్తున్నవారిలో 78 మంది ఆచూకీ తేలడం లేదని అధికారులు తెలిపారు. దానికింద చిక్కినవారి సంఖ్య 300 దాకా ఉంటుందని అనధికారిక అంచనాలు చెబుతున్నాయి.పాపం పసివాళ్లు!మాండలేకు 40 కి.మీ. దూరంలోని క్యౌక్సే పట్టణంలో ఓ ప్రీ స్కూల్లో 70 మంది చిన్నారుల్లో అత్యధికులు భూకంపానికి నిస్సహాయంగా బలయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. జరిగిన దారుణాన్ని తలచుకుంటూ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ గుండెలవిసేలా రోదిస్తున్నారు. మాండలే సమీపంలో కుప్పకూలిన ఓ బౌద్ధారామం శిథిలాల నుంచి ఇప్పటిదాకా 50 మందికి పైగా సన్యాసుల మృతదేహాలను వెలికితీశారు. వాటికింద నలిగి కనీసం మరో 150 మంది మరణించి ఉంటారని చెబుతున్నారు.మృత్యుంజయులుమయన్మార్ రాజధాని నేపిడాలో భవన శిథిలాల నుంచి ఓ 63 ఏళ్ల వృద్ధురాలు, ఆమె మనవరాలు ఏకంగా 91 గంటల తర్వాత మంగళవారం ప్రాణాలతో బయటపడ్డారు. మరోచోట ఓ ఐదేళ్ల చిన్నారిని, గర్భిణిని కూడా సహాయక బృందాలు కాపాడాయి. -
టారిఫ్లకు వేళాయె
న్యూయార్క్/వాషింగ్టన్/రోమ్/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్హౌస్ తాజాగా స్పష్టం చేసింది. వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు 50 శాతం టారిఫ్లు వసూలు చేస్తున్నాయి. జపాన్ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్లు విధించింది. మా బటర్, చీజ్ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్లను భారత్ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ అమెరికా టారిఫ్లకు బెదిరేది లేదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్.ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్ బాదుడు నుంచి జపాన్ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్లపై కేంద్రం ప్రకటనన్యూఢిల్లీ: భారత్కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.హెచ్చు టారిఫ్లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్ ఎఫ్టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్టీఏపై చర్చలు జరుగుతున్నాయి.ఇదీ పరిస్థితి!అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్లు వసూలు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్ల అంతరం ఆటోమొబైల్స్ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్పై 7.2, ప్లాస్టిక్స్పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్పై 2.5, టెక్స్టైల్స్, క్లా్లతింగ్లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
భారత్-చైనా అధ్యక్షులు అభినందనలు తెలియపరుచుకున్న వేళ..
బీజింగ్: గతంలో భారత్-చైనా అంటే ఒక యుద్ధ వాతవారణమే కనిపించేది. భారత్ తో పాకిస్తాన్ ఏ రకంగా కయ్యానికి కాలు దువ్వుతుందో ఆ రకంగానే ఉండేది చైనాతో కూడా. అయితే భారత్-చైనా సంబంధాలు ఇప్పుడు దాదాపు మెరుగైన స్థితిలోనే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఎక్కడా కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు.అయితే భారత్ తో స్నేహ హస్తం కోసం చైనా కొన్ని నెలల నుంచి ఎదురుచూస్తోంది. భారత్ తో కలిసి ఎలిఫెంట్ డ్రాగన్ డ్యాన్స్ చేయాలంటూ ఇప్పటికే చైనా చాలా సార్లు స్నేహ హస్తాన్ని ఇవ్వమని నేరుగానే అడిగేసింది. దీనికి భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది. చైనాతో స్నేహ పూర్వకంగా కలిసి పని చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రధాని మోదీ కూడా ఇటీవలే స్సష్టం చేశారు. ఇరు దేశాలది ఘనమైన చరిత్ర అని, ప్రపంచ జీడీపీలో ఇరు దేశాలది సగం వాట ఉందంటే భారత్-చైనాలు ఎంత బలమైన దేశాలో అర్థం చేసుకోవచ్చని కూడా ఆ సందర్భంలో మోదీ పేర్కొన్నారు.భారత్ చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాల అధ్యక్షుడు మంగళవారం అభినందనలు తెలుపుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల అధ్యక్షులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.ఇరు దేశాలు మరింత స్నేహ పూర్తకంగా కలిసి పని చేయాలని, భారత్ చైనాల బంధం ఎలిఫెంట్ డ్రాగన్ టాంగో రూపంలో ఉండాలని ఈ సందర్భంగా జిన్ పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల సంబంధాలు శాంతియుతంగా, స్నేహపూర్వకంగా మారడానికి మార్గాలను కనుగొనాలని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ తదితర వాటిల్లో మరింతగా పెంచుకోవాలని జిన్పింగ్ సూచించారు. సరిహద్దు ప్రాంతాలలో శాంతిని కాపాడడంలో భారత్తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నానని అన్నారు.భారత ప్రధాని మోదీ ‘మంచి మాట’ చెప్పారు: చైనా -
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న -
నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి నాలుగు లక్షల మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి విక్రయించాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి దొంగలించిన నాలుగు లక్షల నెంబర్లు, వ్యక్తిగత సమాచారం.. అక్రమ వలసలు, అమెరికా పౌరులు కానివారు ఓటు వేయడానికి అనుమతిస్తామని మస్క్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. సామాజిక భద్రత, వైద్య సంరక్షణ, నిరుద్యోగ భృతి, ఐఆర్ఎస్ వాపసులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, పత్రాలు లేని వలసదారులు ప్రయోజనాలను పొందడాన్ని డెమొక్రాట్లు సులభతరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.విపత్తు సహాయానికి ఉద్దేశించిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని మస్క్ ఆరోపించారు. జాతీయ విపత్తుల వల్ల బాధపడుతున్న అమెరికన్లకు సహాయం చేయడానికి ఉద్దేశించిన ఎఫ్ఈఎమ్ఏ నిధులను దారి మళ్లించి, న్యూయార్క్లోని లగ్జరీ హోటళ్లకు అక్రమంగా నివసించేవారి కోసం చెల్లించడానికి ఉపయోగించారని అన్నారు.🚨 ELON MUSK: "Someone is going to be arrested tomorrow. He actually stole 400,000 social security numbers & personal information from the Social Security database and was selling social security numbers in order for people to basically steal money from Social Security." pic.twitter.com/1hjl1Umcup— DogeDesigner (@cb_doge) April 1, 2025 -
హుర్రే.. అరవైలో కూడా ఇరవైలా మారిపోవచ్చా?
నిత్య యవ్వనం కోసం మందులు మాకులు మింగే వారి దగ్గరి నుంచి.. రకరకాల ప్రయోగాలతో ఒళ్లు హూనం చేసుకుంటున్నవాళ్ల గురించి కూడా ఈ మధ్య మనం కాలంగా వింటున్నాం. కానీ.. వయసుతో వచ్చే ఆరోగ్య సమస్యలను, మరణాన్ని మాత్రం ఇప్పటివరకూ జయించలేకపోతున్నాడు. అయితే సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. శాస్త్రవేత్తలు మానవ శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటున్న కొద్దీ జబ్బులను ఎంతో కొంత నయం చేయగలిగాడు. తాజాగా ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం.. వారం రోజుల పాటు మంచుముక్కల్లో మునిగి తేలితే.. వృద్ధాప్యంతోపాటు వచ్చే సమస్యలను ఆలస్యం చేయవచ్చని తేలింది. చల్లటి నీళ్లలో స్నానం చేస్తేనే వణికిపోతూంటాం మనం. జలుబు చేస్తుందేమో అని భయపడుతూంటాం. అలాంటిది వారం రోజులపాటు మంచుముక్కల్లో మునిగితేలితే ఇంకేమైనా ఉందా? అని అనుకుంటున్నారా? అక్కడే కిటుకు ఉందంటున్నారు ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. నిజానికి మనం ఒకసారి చన్నీళ్లలో మునిగితే శరీరం అలర్ట్ అయిపోతుంది. ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చేసేందుకు ఇన్ఫ్లమేషన్ను సృష్టిస్తుంది. జలుబు లేదా ఒంటినొప్పులు వస్తాయన్నమాట. అయితే వీటిని విస్మరించి.. ఒక వారం రోజులపాటు మంచుముక్కల్లో మునుగుతూంటే మాత్రం శరీరం ఆ పరిస్థితికి అలవాటు పడిపోతుందని.. ఆటోఫేజీని మొదలుపెడుతుందని తాజా పరిశోధన ద్వారా తెలిసింది.ఆటోఫేజీనా అంటే ఏంటో తెలుసా?సింపుల్గా చెప్పాలంటే శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియ ఆటోఫేజీనా(Autophagy). కాస్త డెప్త్గా వెళ్తే.. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ మన శరీరంలోని కణాలు విడిపోతూనే ఉంటాయి. అయితే తినే ఆహారమనండి.. ఉండే వాతావరణం అనండి.. లేదా జన్యుపరమైన కారణాలైనా కానివ్వండి.. శరీర కణాల్లో కొన్ని పనికి రాకుండా పోతాయి. పాడైపోయిన ప్రొటీన్లు, కణ భాగాలు.. బయటి నుంచి వచ్చిన బ్యాక్టీరియా, వైరస్ల భాగాలు వయసుతోపాటు పేరుకుపోతూంటాయి. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమవుతూంటాయి కూడా. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు శరీరం ఉపయోగించే ప్రక్రియే ఆటోఫేజీ. .. శరీరం చెడిపోయిన, ముక్కలైపోయిన భాగాలను గుర్తించి వాటిని చిన్న బుడగల్లాంటి వాటిల్లో ప్యాక్ చేసి.. పనికొచ్చే వాటిని వాడుకుంటుంది. వ్యర్థాలను బయటకు తోసేస్తుంది. దీనివల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. జబ్బు పడితే తొందరగా కోలుకోవచ్చు కూడా. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ ప్రక్రియను చేపడుతుంది శరీరం. చల్లటినీళ్లలో మునగడం వాటిల్లో ఒకటని ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతూంటే.. వ్యాయామం, తగినన్ని పోషకాలు అందించడం... పదిహేడు గంటలకుపై నిరాహారంగా ఉండటం వల్ల కూడా ఈ ఆటోఫేజీ ప్రక్రియ మొదలవుతుందని ఇటీవలికాలంలో వినిపిస్తున్న మాట. పరిశోధనలు ఇలా.. ఒట్టావా శాస్త్రవేత్తలు ఈ పరిశోధన కోసం... ఆరోగ్యంగా ఉన్న పది మంది మగాళ్లను ఎంచుకున్నారు. వీరి వయసు అటు ఇటుగా 23 ఏళ్లు. ఏడు రోజులపాటు వీరిని పద్నాలుగు డిగ్రీ సెల్సియస్ చల్లటి నీళ్లలో రోజుకు గంట సేపు ఉంచారు. వీరి రక్తాన్ని సేకరించి ప్రొటీన్లను పరిశీలించారు. చల్లటి నీళ్లల్లో మునగడం కణాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే మంట/వాపు ఏమైనా ఉందా? ఆటోఫేజీ మొదలైందా? ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఏర్పడ్డ షాక్ మాట ఏమిటి? అన్నవి పరిశీలించారు. అకస్మాత్తుగా చల్లటి నీళ్లలోకి మునిగినప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా ప్రొటీన్ల ఆకారంలో మార్పులు వస్తాయి. శరీర క్రియలన్నింటికీ కీలకమైన ప్రొటీన్లలో తేడా రాగానే శరీరం అలర్ట్ అవుతుంది. ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రత్యేకమైన ప్రొటీన్లు కొన్నింటిని విడుదల చేస్తుంది. ఇవి చలికి ఉండచుట్టుకుపోయిన ప్రొటీన్లు మళ్లీ సాధారణ స్థితికి చేరేలా చేస్తాయి. బాగా పాడైన ప్రొటీన్లను ఆటోఫేజీకి గురి చేస్తాయి!చల్లటి నీళ్లల్లో ఒక్కసారి మునిగితే శరీరంలో అద్భుతాలు జరిగాయని ఒట్టావా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాడైపోయిన ప్రొటీన్లను పట్టుకుని క్లీన్ చేసే పీ62 అనే ప్రొటీన్ ఉత్పత్తి బాగా పెరిగిందని, ఆ తరువాత ఆటోఫేజీ ప్రక్రియలో రెండూ ముక్కలు ముక్కలపోయి శరీరంలో పేరుకుపోయిన కణాల చెత్త తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు! ముఖ్య గమనిక: ఇలాంటివి స్వంతంగా మీరు ప్రయత్నించొద్దు. ఈ విషయమై మీ డాక్టర్తో మాట్లాడటం మాత్రం మరచిపోవద్దు! -
Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం
మనం ఏదైనా రైలులో లేదా బస్సులో ప్రయాణించినప్పుడు ఆ దారిలో మనకు సొరంగాలు ఎదురైనప్పుడు అద్భుతమైన అనుభూతికి లోనవుతుంటాం. అలాంటి సందర్భాల్లో మళ్లీమళ్లీ అలాంటి సొరంగాల గుండా వెళ్లాలని అనిపిస్తుంటుంది. ఇక చిన్నపిల్లలైతే సొరంగమార్గం(Tunnel) గుండా వెళ్లినప్పుడు ఒక్కసారిగా చీకటి ప్రదేశంలోకి వెళ్లడం, తరువాత వెలుతురులోకి రావడాన్ని చూసినప్పుడు కేరింతలు కొడుతూ, భలేగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఇలాంటి అనేక సొరంగ మార్గాలు కలిగిన దేశమేదో తెలుసా?స్విట్జర్లాండ్(Switzerland) విస్తృతమైన సొరంగమార్గాలకు ప్రసిద్ది చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంలో ఈ సొరంగాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి అటు రైలు మార్గంలోనూ ఇటు, రోడ్డు మార్గంలోనూ కనిపిస్తాయి. ఈ సొరంగ మార్గాల నిర్మాణానికి స్విట్జర్లాండ్ ప్రభుతం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అటు రైలు, ఇటు రోడ్డు మార్గాల్లో విరివిగా సొరంగాలను నిర్మిస్తూ ప్రయాణాలను వేగవంతం చేస్తోంది. ఈ సొరంగమార్గాలు దేశ ప్రజలనే కాకుండా పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటువంటి సొరంగమార్గాల్లో పలు విశేషాలు కలిగినవాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పొడవైన రైలు సొరంగం: గోథార్డ్ బేస్ టన్నెల్ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్.. గోథార్డ్ బేస్ టన్నెల్(Gotthard Base Tunnel). దీని నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది. భూమి ఉపరితలానికి ఎనిమిదివేల అడుగుల లోతున ఈ రైలు సొరంగాన్ని నిర్మించారు. నీట్ గోథార్డ్ బేస్ టన్నెల్ అని దీనిని పిలుస్తున్నారు. 57 కిలో మీటర్ల పొడవైన ఈ రైల్వే టన్నెల్ ప్రపంచంలోనే అతి పొడవైన రైలు సొరంగంగా గుర్తింపు పొందింది. జురిచ్ నుంచి మిలాన్ నగరాన్ని కలిపేందుకు ఈ రైలు మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రైలు గంటకు 240 కిలో మీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ రైల్వే టన్నెల్ నిర్మాణానికి స్విస్ ప్రభుత్వం రూ. 65 వేల కోట్లు ఖర్చు చేసింది.పొడవైన రోడ్డు సొరంగం: గోథార్డ్ రోడ్డు టన్నెల్స్విట్జర్లాండ్లోని గోథార్డ్ రోడ్డు టన్నెల్ దేశంలోని గోస్చెనెన్ దగ్గర మొదలైన దక్షిణాన టిసినోలోని ఐరోలో వరకు కొనసాగుతుంది. ఇది ఆల్ప్స్ ప్రధాన మార్గమైన సెయింట్ గోథార్డ్ పాస్(Saint Gotthard Pass) వద్ద 16.9 కిలోమీటర్లు (10.5 మైళ్ళు) పొడవున నిర్మితమయ్యింది. 1980 నాటికి ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు సొరంగంగా ఇది పేరొందింది. బాసెల్ నుంచి చియాస్సో వరకు వెళుతుంది. దీనిలో రెండు లేన్లు ఉన్నాయి. దీనిలో ఒక మార్గాన్ని ద్విచక్రవాహనాల కోసం కేటాయించారు. ఈ సొరంగం గరిష్టంగా 1,175 మీటర్లు (3,855 అడుగులు) ఎత్తు కలిగివుంది. ఉత్తర పోర్టల్ నుండి ఈ మార్గం 10.3 కిలోమీటర్లు (6.4 మైళ్ళు) పొడవు కలిగివుంది.మరో రైల్ సొరంగం: లోట్స్చ్బర్గ్ బేస్ టన్నెల్లోట్స్చ్బర్గ్ బేస్ టన్నెల్ (ఎల్బీటీ) లోట్స్చ్బర్గ్ లైన్లోని 34.57 కిమీ (21.48 మైళ్ళు) రైల్వే బేస్ టన్నెల్. ఇది స్విట్జర్లాండ్లోని బెర్నీస్ ఆల్ప్స్ గుండా పాత లోట్స్చ్బర్గ్ టన్నెల్ వరకూ సాగుతుంది . ఇది ఫ్రూటిజెన్ , బెర్న్, రారాన్ , వాలాయిస్ మధ్య నడుస్తుంది. ఆల్ప్స్ పర్వతాల గుండా ఈ లోట్ష్బర్గ్ బేస్ టన్నెల్ను నిర్మించారు. ఎల్బీటీ నిర్మాణం 1999లో ప్రారంభమై, 2007లో పూర్తయింది. మొదటి రైలు కార్యకలాపాలు 2007 డిసెంబర్లో ప్రారంభమయ్యాయి. అయితే 2020లో ఈ మార్గంలోకి నీరు, ఇసుక ప్రవేశించడంతో తాత్కాలికంగా ఈ సొరంగాన్ని మూసివేశారు. అనంతరం సొరంగం లోపల అవసరమైన మరమ్మతులు చేశారు. 2020 చివరిలో రవాణా కోసం ఈ సొరంగాన్ని తిరిగి సిద్ధం చేశారు. దీంతో అదే ఏడాది ఏప్రిల్ 27న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు -
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్లోడ్ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్లోడ్ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్బాట్ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే.. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్ఫామ్లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్ ఏఐ ఇమేజ్ జనరేటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్లోడ్ చేస్తే.. అవి ఫేషియల్ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్లోడ్ చేసేటప్పుడు.. ఆ జనరేటర్ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్ గురించి నెట్లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్జీపీటీ, గూగుల్ జెమినీ, ఎక్స్ గ్రోక్, డీప్ఏఐ, ప్లేగ్రౌండ్ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్ వెర్షన్లలోనూ రకరకాల ఎఫెక్ట్లతో ఈ తరహా ఎఫెక్ట్లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్ ఆర్ట్ వర్క్తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్: పర్సనల్ డాటా తస్కరణ.. సైబర్ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్ నిపుణుల సూచన. -
మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు
నేపిడా: ప్రకృతి ప్రకోపానికి మయన్మార్.. మరుభూమిగా మారింది. గత శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆ దేశాన్ని అస్తవ్యస్తం చేసింది. భూకంపం దరిమిలా ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. భూకంప మృతుల సంఖ్య 2,056 కు చేరింది. దాదాపు 3,900 మంది గాయపడ్డారు. 270 మంది గల్లంతయ్యారు.మరింత దిగజారిన పరిస్థితులు మయన్మార్(Myanmar)లోని ప్రధాన పట్టణాలైన మండలే, నేపిడాలలో భూకంప బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులన్నీ భూకంప బాధితులతో నిండిపోయాయి. దీంతో అందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వారికి చికిత్స అందించేందుకు స్థలం, వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ రెండు నగరాల్లోని వైద్య సిబ్బంది బాధితులను ఆదుకునేందుకు నిరంతరం తమ సేవలు అందిస్తున్నారు.సైనిక పాలనలో..పలు నివేదికల ప్రకారం గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న సైనిక పాలన(Military rule) మయన్మార్లో ఆరోగ్య సేవలను పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. భూకంపానికి ముందు నుంచి పలు ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మండలేలో పరిస్థితి దారుణంగా ఉంది. 80 శాతానికిపైగా వైద్య సిబ్బంది సైనిక పాలనకు వ్యతిరేకిస్తున్నారు. గడచిన నెలలో ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్సులు రద్దు చేశారు. భూకంపానికి ముందే మండలేలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు.ఆస్పత్రులు ధ్వంసంభూకంపం కారణంగా కొన్ని ఆస్పత్రులు ధ్వంసం కావడంతో బాధితులందరికీ వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా ఉన్న ఆస్పత్రులలో పడకల కొరత అధికంగా ఉంది. రోగులను నేలపైనే పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. కాగా మయన్మార్ వాతావరణ, జలశాస్త్ర విభాగం తెలిపిన వివరాల ప్రకారం భారీ భూకంపం తరువాత 36 భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 2.8- 7.5 మధ్య ఉంది. శుక్రవారం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కొద్ది నిమిషాల తర్వాత 6.4 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించింది.ఇది కూడా చదవండి: చిరాగ్ పాశ్వాన్ తల్లి గదికి తాళం.. రోడ్డునపడ్డ కుటుంబ కలహాలు -
అమెరికాలోనే చనిపోతా: ఎలాన్ మస్క్
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార -
సుంకాల మోత వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్ల డెడ్లైన్ ఏప్రిల్ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్ వార్ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి. -
Sunita Williams: మళ్లీ స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు వెళ్తారా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్( Boeing Starliner) స్పేస్క్రాఫ్ట్లో ఐఎస్ఎస్కు వెళ్తారా? అని ఫాక్స్ న్యూస్ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams) అన్నారు. అయితే స్టార్ లైనర్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్లైనర్లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్ఎస్కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు.ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్లైనర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్ నిక్ హేగ్ మాట్లాడుతూ.. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు. -
పుతిన్, జెలెన్స్కీ మధ్య అంతులేని విద్వేషం
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ అధినేతలు పుతిన్, జెలెన్స్కీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రుసరుసలాడారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించి, శాంతిని నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వారు ముందుకు సాగనివ్వడం లేదని మండిపడ్డారు. ఆ ఇద్దరు నాయకుల మధ్య అంతులేని విద్వేషం కనిపిస్తోందని చెప్పారు. అయినప్పటికీ యుద్ధాన్ని ముగించే విషయంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించానని అన్నారు. ఆదివారం ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్ ‘మర్–అ–లాగో’లో ‘ఎన్బీసీ న్యూస్’వార్తా సంస్థకు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. జెలెన్స్కీ విశ్వసనీయతను పుతిన్ ప్రశ్నించడం తనకు నచ్చలేదని చెప్పారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసే హక్కు జెలెన్స్కీకి లేదని, ఉక్రెయిన్కు బాహ్య పరిపాలన అవసరమని పుతిన్ చేసిన వ్యాఖ్యల పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ పట్ల సానుకూల ధోరణితో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. క్రిటికల్ మినరల్స్ మైనింగ్పై మాట తప్పితే.. ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ పుతిన్ తనకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గబోరని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాము కలిసి పనిచేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పుడు అంగీకరిస్తారో చెప్పలేనని, దానిపై సైకలాజికల్ డెడ్లైన్ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్కు ఇన్నాళ్లూ అందించిన ఆర్థిక, సైనిక సాయానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, విషయంలో జెలెన్స్కీ మోసం చేసే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం అందని ట్రంప్ చెప్పారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో మాట తప్పితే చాలాచాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలెన్స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఉక్రెయిన్ భద్రతకు స్పష్టమై హామీని ఇవ్వాలంటూ మిత్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచనలో జెలెన్స్కీ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్కు ‘నాటో’సభ్యత్వం లభించే అవకాశమే లేదని, ఆ విషయం జెలెన్స్కీకి కూడా తెలుసని తే ల్చిచెప్పారు. సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం చెబుతుండగా పుతిన్ ప్రభుత్వం అంగీకరించడంలేదు. కనీసం 30 రోజులపాటు దాడులు ఆపేయాలని కోరినా లెక్కచేయడం లేదు. పైగా ఉక్రెయిన్పై వైమానిక, క్షిపణి దాడులను మరింత ఉధృతం చేస్తుండడం గమనార్హం. -
అమెరికా పర్యటనా?... వద్దు బ్రో!
లీడ్స్ (యూకే): ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశాల జాబితాలో అమెరికా టాప్–3లో ఉండడం పరిపాటి. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, షికాగో వంటి నగరాలు, అక్కడున్న జాతీయ పార్కులు, వినోద కేంద్రాలు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శిస్తుంటాయి. 2023లో 66.5 మిలియన్ల మంది అమెరికాను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024లో ఈ సంఖ్య మరింత ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నారు. అక్రమ వలసదార్ల పేరిట వేలాది మందిని బలవంతంగా బయటకు తరిమేస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో పర్యటించాలని నిర్ణయించుకున్నవారు సైతం పునరాలోచన చేస్తున్నారు. అమెరికా పట్ల ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. → అమెరికా పర్యాటక రంగం ఈ ఏడాది కనీసం 5.5 శాతం పతనమయ్యే అవకాశం ఉన్నట్లు పరిశోధక సంస్థ ‘టూరిజం ఎకనామిక్స్’ అంచనా వేసింది. ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. పర్యాటక రంగం ఈ ఏడాది 9 శాతం వృద్ధి చెందనున్నట్లు ఇదే సంస్థ గతంలో అంచనా వేయడం గమనార్హం. → ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన టారిఫ్లు, వాణిజ్య యుద్ధంతో పర్యాటకానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది టూరిజంపై జనం చేసే ఖర్చు 18 బిలియన్ డాలర్లు తగ్గనున్నట్లు అంచనా. → అమెరికా పర్యాటకానికి కెనడా ప్రజలే అతిపెద్ద వనరు. కెనడా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలను ట్రంప్ విధించడం కెనడా పర్యాటకులకు నచ్చడం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కెనడా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్యలో భారీగా తగ్గుదల నమోదవుతోంది. కొన్నిసార్లు ఇది 45 శాతంగా ఉంటోంది. → అమెరికా ప్రయాణాలకు డిమాండ్ తగ్గడంతో విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని ఎయిర్ కెనడా ప్రకటించింది. అమెరికాకు వెళ్లడానికి జనం ఆసక్తి చూపడం లేదని వెల్లడించింది. → అమెరికాకు ఇప్పటికే ట్రిప్పులు ప్లాన్ చేసుకున్నవారిలో 36 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారని కెనడియన్ మార్కెట్ రీసెర్చర్ ‘లెగర్’ తెలియజేసింది. → గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కెనడా నుంచి అమెరికాకు ప్యాసింజర్ బుకింగ్లు 70 శాతం పడిపోయాయని ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ ‘ఓఏజీ’ ప్రకటించింది. → పర్యాటకుల రాక తగ్గుతుండడం పట్ల యూఎస్ ట్రావెల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. కెనడా నుంచి పర్యాటకుల సంఖ్య 10 శాతం తగ్గినా 2.1 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని స్పష్టంచేసింది. 1.40 లక్షలు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. → అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వాతావరణం మారిపోయిందని, పర్యాటకులకు అది అనువుగా లేదని విదేశీయులు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, వలసదార్లతోపాటు స్వలింగ వివాహాల పట్ల ట్రంప్ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లడం క్షేమకరం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. → పశ్చిమ యూరప్ ప్రజల్లో ట్రంప్ ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల ఒక సర్వేలో బ్రిటన్లో 53 శాతం, జర్మనీలో 56 శాతం, స్వీడన్లో 63 శాతం, డెన్మార్క్లో 74 శాతం మంది ట్రంప్ సర్కారుపై ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికాపై ఈ స్థాయిలో వ్యతిరేకత కనిపించడం 2016 తర్వాత ఇదే మొదటిసారి. → అమెరికాకు పొరుగు దేశం మెక్సికో నుంచి కూడా అధికంగా టూరిస్టులు వస్తుంటారు. ట్రంప్ తొలి హయాంలో మెక్సికో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం. అప్పుడు మెక్సికో నుంచి విమాన ప్రయాణాలు 3 శాతం తగ్గాయి. 2025లో కూడా 2024తో పోలిస్తే ఇప్పటికే 6 శాతం తగ్గాయి. → అమెరికాకు వెళ్తే అరెస్టయ్యే, నిర్బంధానికి గురయ్యే ప్రమాదముందని చాలా దేశాలు తమ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి. → అమెరికాలో పర్యటన కష్టంగా మారుతోందనే ఉద్దేశంతో అంతర్జాతీయ టూరిస్టులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారు. బెర్ముడా హోటళ్లలో బుకింగ్ల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికా పర్యటనలు రద్దు చేసుకుంటున్నవారు యూరప్ దేశాలను డెస్టినేషన్గా ఎంచుకున్నారు. → 2026లో ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికోల్లో జరుగనుంది. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యాటకుల్లో భయాందోళనను తొలగించడానికి అమెరికా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
నిధుల మళ్లింపు కేసులో దోషిగా తేలిన పెన్
పారిస్: ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ పార్టీ అగ్రనేత మెరీన్ లీ పెన్(56)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అవకతవకల కేసులో పారిస్ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కోర్టు తీర్పు పూర్తిగా వెలువడకముందే లీ పెన్ కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు. కరుడుగట్టిన అతివాద నాయకురాలిగా గుర్తింపు పొందిన మెరీన్ లీ పెన్ 2027లో జరిగే ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూలంగా తీర్పు రావడం శరాఘాతంగా మారింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆమెకు ఉపశమనం దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆలోగా పై కోర్టులో విచారణ జరగడం, తీర్పు రావడం కష్టమేనని అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు లీ పెన్పై ఆరోపణలు వచ్చాయి. 2004 నుంచి 2016 మధ్య సుమారు 33 లక్షల డాలర్లను సొంత పార్టీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో లీ పెన్తోపాటు మరో 12 మందిని సైతం న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. లీ పెన్ గతంలో మూడుసార్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. 2022లో ఎమ్మానుయేల్ మేక్రాన్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
5 లక్షల కోట్ల టన్నుల మంచు కరిగింది
అపారమైన మంచు నిల్వలకు గ్రీన్లాండ్ ఆలవాలం. ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 8 శాతం అక్కడే ఉందని అంచనా. అలాంటి గ్రీన్లాండ్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. ఎంతగా అంటే ఏటా సగటున 5,500 కోట్ల టన్నుల మేరకు! 1992లో మొదలైన ఈ ధోరణి ఏటా అంతకంతకూ పెరుగుతూనే వస్తోందట. ఆ లెక్కన గత 28 ఏళ్లలో అక్కడ ఏకంగా 5 లక్షల టన్నుల మంచు మాయమైపోయిందట! గ్రీన్లాండ్పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై చేపట్టిన అధ్యయనంలో సైంటిస్టులు ఈ మేరకు తేల్చారు. ఇది ఒక్క గ్రీన్లాండ్కే పరిమితం కాదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. ‘‘మొత్తమ్మీద ధ్రువాల వద్ద మంచు కరుగుదల ప్రమాదకర స్థాయిలో ఉంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం’’అని ఆందోళన వెలిబుచి్చంది. అక్కడ మంచు ఈ స్థాయిలో కరిగిపోవడానికి నిర్దిష్ట కారణాలేమిటో తేల్చే పనిలో పడింది. అక్కడినుంచి ఆవిరవుతున్న నీరు ఎటు వెళ్తోందో తెలియడం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అక్కడి నీటి ఆవిరిని డ్రోన్ల సాయంతో సేకరించి పరిశోధిస్తున్నారు. ఇందుకోసం భూ ఉపరితలం నుంచి 5,000 అడుగుల ఎత్తు దాకా వివిధ స్థాయిల్లో నీటి ఆవిరిని పలు దఫాలుగా సేకరించారు. ‘‘ఆవిరయ్యే నీటిలో ఎంతోకొంత తిరిగి మంచుగా మారి అక్కడే పడుతుంది. కానీ చాలావరకు మాత్రం గ్రీన్లాండ్ జలవ్యవస్థకు శాశ్వతంగా దూరంగా వెళ్లిపోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం’’అని అధ్యయనానికి సారథ్యం వహించిన కెవిన్ రోజి్మయారెక్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ టారిఫ్ల టెన్షన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార టారిఫ్ల అమలుకు డెడ్లైన్ అయిన ఏప్రిల్ 2 దగ్గరపడటంతో ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొంది. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే దేశాల జాబితాలో భారత్ని కూడా అమెరికా చేర్చడంతో ... టారిఫ్లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని ఆశాభావం నెలకొంది. ఈ నేపథ్యంలో టారిఫ్లు, ఏయే రంగాలపై ప్రభావం పడొచ్చనే అంశాలను ఒకసారి చూస్తే.. – న్యూఢిల్లీఅమెరికా ప్రణాళిక ఏంటంటే..వివిధ దేశాలతో తమకున్న వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు వాటి నుంచి తమకు వచ్చే దిగుమతులపై అమెరికా సుంకాలను విధించడం / పెంచడం వంటి చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ప్రతిపాదన ఇది. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన.2021–22 నుంచి 2023–24 మధ్య కాలంలో భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. భారత్ ఎగుమతుల్లో 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, అన్ని దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతం వాటా అమెరికాది ఉంది. 2023–24లో భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 119.71 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో భారత్ నుంచి 77.51 బిలియన్ డాలర్ల ఎగుమతులు, అమెరికా నుంచి 42.19 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి. దీంతో వాణిజ్య మిగులు భారత్ పక్షాన సుమారు 35.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది.భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..ప్రస్తుతానికి టారిఫ్లను ఏ విధంగా విధిస్తారనేది, అంటే ప్రోడక్టు స్థాయిలోనా, లేదా రంగాలవారీగానా, లేదా దేశ స్థాయిలోనా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..అమెరికా నుంచి దిగుమతులపై భారత్ విధించే సుంకాలు, నిజానికి ఆరోపిస్తున్న దానికంటే చాలా తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికా గానీ సహేతుక వాణిజ్య విధానాన్ని అవలంబిస్తే, పెద్దగా అవాంతరాలు లేకుండా భారత పరిశ్రమలు ఎగుమతులను కొనసాగించవచ్చని, ఇరు దేశాల మధ్య మరింత సమతూకమైన, స్థిరమైన విధంగా వాణిజ్య బంధం బలోపేతం కావచ్చని పేర్కొన్నారు. నాలుగు స్థాయిల్లో టారిఫ్ల ప్రభావాలను జీటీఆర్ఐ అంచనా వేసింది.దేశ స్థాయిలో: భారత్ నుంచి అన్ని ఎగుమతులపై ఒకే రకంగా టారిఫ్లు విధించడం: ఒకవేళ ఈ విధానాన్ని అమలు చేస్తే మన ఎగుమతులపై అదనంగా 4.9 శాతం భారం పడుతుంది. ప్రస్తుతం అమెరికా ఉత్పత్తులపై మన దగ్గర టారిఫ్లు సగటున 7.7 శాతంగా ఉండగా, మన ఎగుమతులపై అక్కడ సగటున 2.8 శాతంగా ఉంటోంది. ఆ విధంగా రెండింటి మధ్య 4.9 శాతం వ్యత్యాసం ఉంది.వ్యవసాయం, పరిశ్రమల స్థాయిలో: ఈ విధానాన్ని అమలు చేస్తే వ్యవసాయోత్పత్తులపై అదనంగా 32.4 శాతం, పారిశ్రామికోత్పత్తులపై 3.3 శాతం భారం పడొచ్చు. ప్రస్తుతం అమెరికాకు భారత వ్యవసాయోత్పత్తులపై 5.3 శాతం సుంకాలు ఉండగా, అక్కడి నుంచి దిగుమతులపై అత్యధికంగా 37.7 శాతంగా (వ్యత్యాసం 32.4 శాతం) ఉంటోంది. మరోవైపు పారిశ్రామికోత్పత్తుల విషయానికొస్తే.. అమెరికా నుంచి దిగుమతులపై సగటున 5.9 శాతం, మన ఎగుమతులపై కేవలం 2.6 శాతం (వ్యత్యాసం 3.3 శాతం) ఉంటోంది.రంగాల స్థాయిలో: వివిధ రంగాల్లో ఇరు దేశాల ఉత్పత్తులపై టారిఫ్ల మధ్య వ్యత్యాసాలు వివిధ రకాలుగా ఉన్నాయి. రసాయనాలు..ఫార్మాలో 8.6 శాతం, ప్లాస్టిక్స్లో 5.6 శాతం, టెక్స్టైల్స్పై 1.4 శాతం, వజ్రాలు.. బంగారం మొదలైన వాటిపై 13.3 శాతం, ఇనుము..ఉక్కుపై 2.5 శాతం, మెషినరీ .. కంప్యూటర్స్పై 5.3 శాతం, ఎలక్ట్రానిక్స్పై 7.2 శాతం, ఆటోమొబైల్స్ .. ఆటో విడిభాగాలపై 23.1 శాతం వ్యత్యాసం ఉంటోంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే, సదరు రంగంపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. భారత్ ఎగుమతులు 30 కేటగిరీలుగా ఉంటున్నాయి. ఇందులో వ్యవసాయంలో ఆరు, పరిశ్రమల్లో 24 ఉన్నాయి.వ్యవసాయం⇒ అత్యధికంగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్పై ప్రభావం ఉంటుంది. దాదాపు 2.58 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులపై టారిఫ్ల వ్యత్యాసం 27.83 శాతం ఉంటోంది. ⇒1.03 బిలియన్ డాలర్లుగా ఉంటున్న ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులపై ఏకంగా 24.99 శాతం మేర టారిఫ్లు పెరగొచ్చు. దీంతో అమెరికాలో భారతీయ స్నాక్స్ ఖరీదు మరింత పెరగొచ్చు. ⇒ చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలపై వ్యత్యాసం (1.91 బిలియన్ డాలర్ల విలువ) 5.72 శాతంగా ఉంటోంది. బియ్యం మొదలైన ఎగుమతులపై ప్రభావం పడొచ్చు.⇒ 181.49 మిలియన్ డాలర్ల విలువ చేసే డెయిరీ ఉత్పత్తులపై ఏకంగా 38.23 శాతం టారిఫ్ వ్యత్యాసం ఉంటోంది. దీంతో నెయ్యి, వెన్న, పాల పొడిలాంటివి రేట్లు పెరిగి, మన మార్కెట్ వాటా పడిపోవచ్చు.⇒ 199.75 మిలియన్ డాలర్ల విలువ చేసే వంటనూనెల ఎగుమతులపై 10.67 శాతం మేర టారిఫ్ పెరగవచ్చు.⇒ సుమారు 19.20 మిలియన్ డాలర్ల ఎగుమతులే అయినప్పటికీ ఆల్కహాల్, వైన్లపై అత్యధికంగా 122.10 శాతం సుంకాలు విధించవచ్చు.పారిశ్రామిక ఉత్పత్తులు⇒ 12.72 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్న ఫార్మా ఉత్పత్తులకు సంబంధించి టారిఫ్ వ్యత్యాసం 10.90 శాతం మేర ఉంటోంది. ఇది విధిస్తే, జనరిక్ ఔషధాలు, స్పెషాలిటీ డ్రగ్స్ రేట్లు పెరిగిపోతాయి.⇒ 14.39 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎలక్ట్రికల్, టెలికం, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై 7.24 శాతం టారిఫ్లు పడొచ్చు.⇒ మెషినరీ, బాయిలర్, టర్బైన్, కంప్యూటర్ ఎగుమతుల విలువ 7.10 బిలియన్ డాల ర్లుగా ఉంటోంది. వీటిపై 5.29 శాతం టారిఫ్ల పెంపు అవకాశాలతో భారత్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చు.⇒ 5.71 బిలియన్ డాలర్ల విలువ చేసే రసాయనాల ఎగుమతులపై (ఫార్మాను మినహాయించి) 6.05 శాతం, 1.71 బిలియన్ డాలర్ల సెరామిక్, గ్లాస్, స్టోన్ ఉత్పత్తులపై 8.27 శాతం, 457.66 మిలియన్ డాలర్ల ఫుట్వేర్పై 15.56 శాతం ఉండొచ్చు. టెక్స్టైల్స్, ఫ్యాబ్రిక్స్, కార్పెట్లు మొదలైన వాటి ఎగుమతులు 2.76 బిలియన్ డాలర్లుగా ఉండగా వీటిపై సుమారు 6.59 శాతం; 1.06 బిలియన్ డాలర్లుగా ఉన్న రబ్బర్ ఉత్పత్తులపై (టైర్లు, బెల్టులు సహా) 7.76 శాతం; పేపర్ .. కలప ఉత్పత్తులపై (969.65 మిలియన్ డాలర్లు) 7.87 శాతం మేర టారిఫ్ల ప్రభావం ఉండొచ్చు.పెద్దగా ప్రభావం / అసలు ప్రభావమే ⇒ ఉండని రంగాలు3.33 బిలియన్ డాలర్ల విలువ చేసే ముడి ఖనిజాలు, పెట్రోలియం ఎగుమతులపై టారిఫ్లు మైనస్ స్థాయిలో (మైనస్ 4.36) ఉంటున్నాయి కాబట్టి, కొత్తగా విధించడానికేమీ ఉండకపోవచ్చు.⇒ అలాగే, 4.93 బిలియన్ డాలర్ల గార్మెంట్స్ ఎగుమతులపై, వ్యత్యాసం మైనస్ 4.62 శాతంగా ఉంది కాబట్టి టారిఫ్ల భారం ఉండకపోవచ్చు. -
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్, ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్ బెల్లె గిబ్సన్లతో బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్. నిన్న(ఆదివారం) అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్ జాన్సన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి. దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. It is terrifying that people do not see Bryan Johnson as actually a well-evolved masculine form of fraudsters Elizabeth Holmes and Belle Gibson, selling both expensive and utterly useless investigations and peddling potentially dangerous snake oil supplements in the name of… pic.twitter.com/qjts5KKXTF— TheLiverDoc (@theliverdr) March 30, 2025 Cyriac why are you so angry? Who hurt you?Blueprint offers extra virgin olive oil, proteins, nuts, and nutrients which have independent and robust scientific evidence. They are third party tested. The certificates of analysis are publicly available. They are affordably priced.— Bryan Johnson (@bryan_johnson) March 30, 2025 -
భూకంప శిథిలాల నుంచి కీలక పత్రాల చోరీ?
బ్యాంకాక్: థాయ్లాండ్ భూకంప సహాయక చర్యల్లో.. కొత్త కోణం వెలుగు చూసింది. రాజధాని బ్యాంకాక్(Bangkok Building Collapse)లోని 33 అంతస్థుల భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రమాద స్థలి నుంచి కొన్ని పత్రాలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కొందరు ప్రయత్నించగా.. సహాయక బృందాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేయగలిగారు. అయితే ఆ ఐదుగురు చైనాకు చెందిన వాళ్లు కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చైనా(China)కు చెందిన రైల్వే నంబర్ 10 కంపెనీ 2018లో థాయ్లాండ్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. హౌజింగ్ సొసైటీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఇతర బడా కాంట్రాక్టులను ఈ కంపెనీ స్థానిక కంపెనీలతో జాయింట్ వెంచర్గా నిర్వహిస్తూ వస్తోంది. ఈ క్రమంలో థాయ్లాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం సుమారు 58 బిలియన్ డాలర్లతో మూడేళ్ల కిందట పనులు చేపట్టారు.తాజా భూకంపం(Earthquake) ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ భవనం కుప్పకూలిపోగా.. శిథిలాల నుంచి ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీశారు. అయితే, ఆశ్చర్యకరంగా ఇంతకంటే ఎక్కువ ఎత్తులో భవనాలకు ఏం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డిజైనింగ్లో లోపాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాల నడుమే.. థాయ్లాండ్ ఉప ప్రధాని అనుతిన్ చార్న్విరాకుల్ సైతం ప్రమాద స్థలిని సందర్శించి దర్యాప్తునకు ఆదేశించారు. ఈలోపు.. ఈ భవనం నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. భవన శిథిలాల వద్దకు ఆదివారం ఐదుగురు వ్యక్తులు అనుమతి లేకుండా లోనికి ప్రవేశించారు. శిథిలాల నుంచి కొన్ని పత్రాలను తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా రెస్క్యూ టీంలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పాయి. వారిని ప్రశ్నించగా.. చైనా దేశస్థులని తెలిసింది. అయితే.. అందులో ఒకరు తాను ప్రాజెక్ట్ మేనేజర్ అని, బీమా క్లెయిమ్ చేసుకోవడం కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఈ కంపెనీ ‘నాసిరక నిర్మాణాల’తో వార్తల్లోకి ఎక్కింది. అయితే ఆయా ఘటనలతో ప్రమాదవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణాలను ఈ చైనా కంపెనీకి అప్పగించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక శుక్రవారం మధ్యాహ్నాం మయన్మార్లో సంభవించిన భారీ భూకంపం ధాటికి.. పొరుగున ఉన్న థాయ్లాండ్లోనూ భారీగా భూమి కంపించింది. రాజధాని బ్యాంకాక్లో పలు భవనాలు కుప్పకూలిపోవడంతో.. ఇప్పటిదాకా 18 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 83 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. -
Newton Death Anniversary: నేటికీ వెల్లడికాని న్యూటన్ మరణ రహస్యం
సర్ ఐజాక్ న్యూటన్(Sir Isaac Newton).. ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకనిగా గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన సూత్రాలు నేటికీ గణితం, విజ్ఞాన శాస్త్రంలో ఉపయుక్తమవుతున్నాయి. ఆయన జీవితం ఎన్నో రహస్యాలతో కూడి ఉందంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనత సాధించిన న్యూటన్ అనుమానాస్పద స్థితిలో మరణించడంపై నేటికీ చర్చలు కొనసాగుతుంటాయి.ఐజాక్ న్యూటన్ 1727, మార్చి 31న బ్రిటన్లోని మిడిల్సెక్స్లోని కెన్సింగ్టన్లో కన్నుమూశారు. నేడు ఆయన వర్థంతి(Death anniversary). ఈ సందర్భంగా పలుచోట్ల ఆయనను గుర్తు చేసుకుంటూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. న్యూటన్ గణిత శాస్త్రవేత్తగా, భౌతిక శాస్త్రవేత్తగా, ఖగోళ శాస్త్రవేత్తగా, రచయితగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. న్యూటన్ కనుగొన్న కలన గణిత సిద్ధాంతం గణిత శాస్త్రానికి కొత్త ఆధారాన్ని అందించింది. అదేవిధంగా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అందించి, శాస్త్రీయ భౌతిక శాస్త్ర సిద్ధాంతానికి పునాది వేశారు.ఖగోళ శాస్త్రంలో విశేష కృషి చేసిన ఆయన గ్రహాల కదలికల గురించి వివరించారు. తొలి ఇమేజ్ ఆధారిత టెలిస్కోప్(Telescope)ను తయారు చేశారు. ప్రిజం ద్వారా ఆప్టికల్ రంగులపై అధ్యయనం చేశారు. ధ్వని వేగాన్ని లెక్కించడం, శీతలీకరణ నియమం మొదలైనవి న్యూటన్కు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయనకు వేదాంతశాస్త్రంలో కూడా ఆసక్తి ఉంది. న్యూటన్ బైబిల్ను అధ్యయనం చేశారని చెబుతారున్యూటన్ మరణంలోనూ రెండు వాదనలు వినిపిస్తాయి. న్యూటన్ నిద్రలో మరణించారని, అనంతరం అతని శరీరంలో పాదరసం కనిపించిందని చెబుతారు. ఈ నేపధ్యంలోనే ఆయనకు రసవాదంతోనూ సంబంధం ఉందని అంటారు. న్యూటన్ తన చివరి రోజులను ఎంతో రహస్యంగా గడిపారు. ఆ సమయంలో ఆయన మానసిక అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారని, సమాజానికి దూరంగా మెలిగారని చెబుతారు. న్యూటన్ తన మరణానికి ముందు తన ఆవిష్కరణలకు సంబంధించిన కొన్ని పత్రాలను తగులబెట్టారని కొందరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవి రసవాదానికి సంబంధించినవని భావిస్తారు. న్యూటన్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.ఇది కూడా చదవండి: మయన్మార్లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు! -
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
మయన్మార్లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్, థాయిలాండ్(Myanmar, Thailand)లను తాకిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మయన్మార్లో ఇప్పటివరకు సుమారు 1,700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం నిర్థారించింది. సుమారు 3,400 మంది గాయపడ్డారని, 300 మంది గల్లంతయ్యారని తెలిపింది.బ్యాంకాక్లో ప్రస్తుత పరిస్థితి ఇదే..బ్యాంకాక్లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి పెరిగిందని నగర అధికారులు తెలిపారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అథారిటీ(Bangkok Metropolitan Authority) తెలిపిన వివరాల ప్రకారం 32 మంది గాయపడ్డారు. 82 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వీరు నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల టవర్లో గల్లంతయ్యారని సమాచారం. ఈ భూకంపం మధ్య మయన్మార్లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా సంభవించింది. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.సాయం కోసం రెడ్ క్రాస్ విజ్ఞప్తిభూకంప బాధితులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ(International Red Cross and Red Crescent Society)ల సమాఖ్య (ఐఎఫ్ఆర్సీ)100 మిలియన్ డాలర్ల పైగా మొత్తం అత్యవసరమని విజ్ఞప్తి చేసింది. అలాగే భూకంపం సంభవించిన ప్రాంతంలో అవసరాలు అంతకంతకూ పెగుతున్నాయని పేర్కొంది. రాబోయే 24 నెలల్లో లక్ష కుటుంబాలకు సహాయం అందించేందుకు మరింతగా నిధులు అవసరం కానున్నాయని పేర్కొంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మరో సంక్షోభం తలెత్తకముందే అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది. ఇది విపత్తు మాత్రమే కాదని, సంక్లిష్టమైన మానవతా సంక్షోభమని ఐఎఫ్ఆర్సీ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ పేర్కొన్నారు.‘ఈ సమయంలో వైమానిక దాడులా?’1,700 మందిని బలిగొన్న భూకంపంతో దేశం అతలాకుతలం అవుతున్నసమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సాయుధ ప్రతిఘటన ఉద్యమం గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించడంపై మయన్మార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెన్ నేషనల్ యూనియన్ జంటా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తూనే ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ పరిస్థితులలో సైన్యం సహాయ చర్యలకు ముందుకు వస్తుందని, అయితే ఇప్పుడు దీనికి బదులుగా దేశ ప్రజలపై దాడి చేయడానికి బలగాలను మోహరించడం దురదృష్టకరమని పేర్కొంది. #OperationBrahma continues. @indiannavy ships INS Karmuk and LCU 52 are headed for Yangon with 30 tonnes of disaster relief and medical supplies.🇮🇳 🇲🇲 pic.twitter.com/mLTXPrwn5h— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 30, 2025భారత్ నుంచి 30 టన్నుల సహాయక సామగ్రిభారత నావికాదళ నౌకలు మయన్మార్కు 30 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు తెలిపారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కార్ముక్, ఎల్సీయూలు 52 భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకువెళ్లాయని అయన పేర్కొన్నారు. ఈ సహాయ చర్యలు ఆపరేషన్ బ్రహ్మలో భాగమని తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోంది. భారత నావికాదళ నౌకలు 30 టన్నుల సహాయక, వైద్య సామాగ్రితో యాంగోన్కు వెళ్లాయని తెలిపారు."మయన్మార్కు భారత రెస్క్యూ బృందంభారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం 10 మంది సిబ్బందితో కూడిన మొదటి సహాయక బృందం మయన్మార్లోని మండలే అంతర్జాతీయ విమానాశ్రయానికి(Mandalay International Airport) చేరుకుంది. ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. భారీ పరికరాలు, సహాయక సామగ్రిని తరలించేందుకు ఈ బృందం సోమవారం రోడ్డు మార్గంలో ప్రయాణించనుంది. కాగా భారత నేవీ నౌకలు సహాయ సామగ్రిని మయన్మార్కు తీసుకువెళుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.‘సహాయం అందినా ప్రాణం పోయింది’మయన్మార్లోని మండలేలో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిల్లాల్లో ఒక గర్భిణి 55 గంటల పాటు చిక్కకుపోయింది. రెస్క్యూ సిబ్బంది బాధితురాలు, 35 ఏళ్ల మాథు తుల్విన్ ప్రాణాలను కాపాడారు. అయితే స్కై విల్లా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ శిథిలాల నుండి ఆమెను బయటకు తీసిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది.‘హూ’నుంచి మూడు టన్నుల వైద్య సామగ్రిమయన్మార్ను కుదిపేసిన భూకంపాలలో గాయపడిన వేలాది మందికి సాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(హూ)దాదాపు మూడు టన్నుల వైద్య సామగ్రిని పంపింది. ట్రామా కిట్లు,టెంట్లతో సహా వైద్య సామగ్రి ఇప్పటికే వెయ్యి పడకల ఆసుపత్రికి చేరుకున్నాయని ‘హూ’ ఒక ప్రకటనలో తెలిపింది. భూకంప సంభవించిన 24 గంటల వ్యవధిలోపునే యాంగోన్లోని అత్యవసర వైద్య సామగ్రి నిల్వ నుంచి ఈ సామగ్రిని తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ధ్వంసమైన 50 మసీదులుమయన్మార్లో శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు ముస్లింలు చేరుకుంటున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఈ ప్రమాదం బారినపడి వందలాది మంది ముస్లింలు మృతిచెంది ఉంటారనే అంచనాలున్నాయి. భూకంపం సంభవించినప్పుడు, మండలేలో ఉంటున్న ఒక ముస్లిం తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మసీదు పక్కనే ఉన్న తన ఇల్లు కూలిపోయిందని, తన అమ్మమ్మ, ఇద్దరు మామలు శిథిలాల కింద చిక్కకున్నారని తెలిపారు. నగరంలో శిథిలాల భవనాలు అలానే ఉన్నాయని, రెస్క్యూ బృందాలు అందించే సాయం సరిపోవడం లేదని ఆయన కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. షాడో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 50కి పైగా మసీదులు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం -
ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
దుబాయ్: అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం నేత ఖొమైనీకి రాసిన లేఖపై ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అలాగే, ట్రంప్ బాంబు దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మసూద్..‘ఎన్నో వాగ్దానాలను అమెరికా కాలరాసింది. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి’ అని పేర్కొన్నారు. దీనిద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. పెజెష్కియాన్ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.మరోవైపు.. ఇరాన్ను అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో.. ఆ దేశంపై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ స్పష్టం చేశారు.ఇక, ట్రంప్ మొదటి హయాంలో ఇరాన్తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం’ అని తెలిపారు. -
అమెరికా నటుడు చాంబర్లీన్ కన్నుమూత
లండన్: 1960ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘డాక్టర్ కిల్డేర్’ టీవీ సీరియల్తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాంబర్లీన్(90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయ్లోని వైమనలో శనివారం రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 91వ ఏట అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే ఈ విషాదం చోటుచేసుకుందన్నారు. ‘షొగున్, ది థోర్న్ బర్డ్స్’ సీరియళ్లలో ప్రధాన పాత్రలు పోషించి ‘కింగ్ ఆఫ్ ది మినీ సిరీస్’గా చాంబర్లీన్ మన్ననలు అందుకున్నారు. 1934లో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో జన్మించిన ఈయన డాక్టర్ కిల్డేర్ సీరియల్లోని డాక్టర్ జేమ్స్ కిల్డేర్ పాత్రతో 1961లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. 1980ల్లో షొగున్ సిరీస్లో ఖైదీగాను, అనంతరం థోర్న్ బర్డ్స్లో క్రైస్తవ గురువుగా పోషించిన పాత్రలు ఆయన్ను తిరుగులేని స్థాయికి చేర్చాయి. అప్పట్లో అమెరికాలో 60 శాతం మంది టీవీ వీక్షకులు థోర్న్ బర్డ్స్ సీరియల్నే చూడటం ఓ రికార్డు. ఇది ఏకంగా 16 ఎమ్మీ నామినేషన్లు పొందింది. స్వలింగ సంపర్కుడైన చాంబర్లీన్.. ఆ విషయాన్ని 70 ఏళ్ల వయస్సులో ‘షట్టర్డ్ లవ్’ పేరుతో విడుదల చేసిన ఆత్మకథలో మొదటిసారిగా అంగీకరించారు. నటుడు, దర్శకుడు మార్టిన్ రబెట్తో 30 ఏళ్లపాటు బంధం కొనసాగించారు. 2010లో వీరిద్దరూ విడిపోయారు. -
దత్తత పర్వంలో... దారుణ కోణం!
దత్తత మాటున దారుణాలు. కొరియా యుద్ధం తాలూకు విషాదంలో మరో చీకటి అధ్యాయం. దీనికి సంబంధించి తాజాగా బహిర్గతమైన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. 1950ల్లో యుద్ధం కారణంగా దక్షిణ కొరియా పేదరికంలో కూరుకుపోయింది. జనం తమ సంతానాన్ని పోషించుకోలేని దుస్థితికి దిగజారడంతో వారిని ఆదుకునే సాకుతో ప్రభుత్వం తెచ్చిన పథకం అక్రమాలకు నెలవుగా, అంతులేని విషాదానికి చిరునామాగా మారింది. తొలుత ప్రశంసలు అందుకున్నా విదేశీ దత్తత పథకంలోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఎన్నో అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది చిన్నారులు సొంతవారికి దూరమై విదేశాల్లో కష్టాల పాలయ్యారని దీనిపై విచారణకు నియమించిన కమిషన్ కుండబద్దలు కొట్టింది. ‘‘ఇది పిల్లల భవిష్యత్తులో క్రూర చెలగాటం. దీనికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అని సిఫార్సు చేసింది. దత్తత పేరుతో దూర దేశాలకు తరలిపోయిన తమ చిన్నారుల కన్నీటి గాథలు దక్షిణ కొరియన్లను కంటతడి పెట్టిస్తున్నాయిప్పుడు...! విదేశాల్లో మొదలైన కష్టాలు దత్తత తీసుకున్న తల్లిదండ్రుల చెంత హాయిగా పెరిగిన పిల్లలు కొందరే. అత్యధికులు బానిసలుగా బతికారు. సరైన పోషణ, సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హింస, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. దత్తత తండ్రుల చేతుల్లో అత్యాచారాలకు బలైన అమ్మాయిలు కోకొల్లలు. దత్తత సమయంలో తప్పుడు ఊళ్లు, పేర్లు, అన్నీ మార్చేసిన కారణంగా అసలు తమ కన్న తల్లిదండ్రులు ఎవరనేదీ పెద్దయ్యాక ఆ పిల్లలకు తెలీకుండా పోయింది. నార్వేలో జీవిస్తున్న 60 ఏళ్ల ఇంగర్ టోన్ ఉయిలాండ్ షిన్ కన్నీటిగాథ ఇలాంటిదే. ‘‘13 ఏళ్ల వయసులో నన్ను దత్తత తీసుకుని నార్వేకు తీసుకొచ్చారు. తిండి, వాతావరణం ఏదీ నాకు సరిపడలేదు. పెంపుడు తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. నాకన్నా పెంపుడు కుక్కనే బాగా చూసుకునేవాళ్లు. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండానే వాళ్లు చనిపోయారు. నేను మాత్రం ఇలా మిగిలిపోయా. చిన్ననాటి జ్ఞాపకాలు, అందమైన బాల్యం, సర్వం కోల్పోయా’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా, ఆ్రస్టేలియాతో పాటు యూరప్లోని ఎన్నో దేశాలకు దత్తు వెళ్లిన ఆయిలాండ్ వంటి చిన్నారుల కన్నీటిగాథలు కోకొల్లలని ‘ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్’ పేర్కొంది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత బుధవారం సమగ్ర నివేదిక సమర్పించింది. అంతర్జాతీయ దత్తత చట్టాలు, చిన్నారుల పరిరక్షణపై ‘ది హేగ్ ఒడంబడిక’ను దక్షిణ కొరియా ప్రభుత్వం తుంగలో తొక్కిందని కమిషన్ చైర్పర్సన్ పార్క్సన్ యంగ్ మండిపడ్డారు.ఎందుకీ దుస్థితి? 1950వ దశకంలో కొరియా ద్వీపకల్పంలో మొదలైన యుద్ధమే ఈ దత్తత దారుణాలకు ప్రధాన కారణం. దేశ భూభాగంలో ఉత్తరభాగం డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే)గా, దక్షిణభాగం రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా రెండు ముక్కలైంది. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినాసరే అమెరికాసహా 17 దేశాలు ద.కొరియాకు మద్దతు ప్రకటించాయి. చైనా, రష్యాలు ఉత్తరకొరియాకు అండగా నిలబడ్డాయి. చాన్నాళ్లు కొనసాగిన ఈ యుద్ధంలో ఒక్క దక్షిణకొరియాలోనే దాదాపు 2,00,000 మందికిపైగా మహిళలు తమ భర్తలను కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయారు. మరో 1,00,000 మంది చిన్నారులు అనాథలయ్యారు. వితంతులు తమ పిల్లలను పెంచే స్తోమతలేక అనాథాశ్రమాల్లో చేర్పించారు. దీంతో దేశవ్యాప్తంగా అనాథాశ్రయాల్లో చిన్నారుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. యుద్ధంకారణంగా పేదరికం కోరల్లో చిక్కుకుపోయిన ద.కొరియా సర్కార్కు వీళ్ల పోషణ పెద్ద భారంగా తయారైంది. యుద్దంలో ద.కొరియాకు సాయంగా దేశంలో తిష్టవేసిన అమెరికా సైనికులు స్థానిక మహిళలతో సంబంధాలు పెట్టుకోవడంతో లక్షలాది మంది చిన్నారులు జని్మంచారు. ఇలాంటి వాళ్లకు సమాజంలో ఆదరణ కరువైంది. ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. వితంతువుల పిల్లలు, అమెరికన్ల పిల్లలు, అనాథాశ్రయాల్లోని చిన్నారుల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం విదేశీ దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీళ్లను దత్తత తీసుకునేందుకు పశ్చిమదేశాల్లోని జంటలు తెగ ఆసక్తి చూపించారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్లోని కొన్ని దేశాల నుంచి దత్తత డిమాండ్లు అధికమయ్యాయి. 1954లో ఈ ధోరణి ఊపందుకుంది. 1948 నుంచి 1960 వరకు సింగ్మాన్ రీ పాలనకాలంలో, తర్వాత పార్క్ చుంగ్ హీ హయాంలో 1961నుంచి 1979 కాలంలో ఈ పోకడ విపరీతంగా పెరిగిపోయింది.వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు దత్తత ప్రక్రియ పూర్తి లోపభూయిష్టమని, తమను అన్యాయంగా, అక్రమంగా విదేశాలకు తరలించారని చాలామంది చిన్నారులు పెద్దయ్యాక ఫిర్యాదులు చేశారు. వాటిపై కమిషన్ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘దత్తత ప్రక్రియ తప్పులతడకగా సాగింది. పేర్లు మార్చేయడం, తల్లిదండ్రులున్నా అనాథ అని పేర్కొనడం వంటి ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. విదేశీ జంటలకు అప్పగింతపై నెలవారీ పరిమితి ఉన్నా ఆ కోటాను ప్రభుత్వమే తుంగలో తొక్కింది. అలా ప్రైవేట్ ఏజెన్సీలు దశాబ్దాలుగా లక్షలాది మంది చిన్నారులను విదేశాలకు తరలించాయి. ఉచితంగా జరగాల్సిన దత్తత ప్రక్రియలో అడుగడుగునా భారీగా నగదు చేతులు మారింది’’ అని కమిషన్ పేర్కొంది. ఎట్టకేలకు 2023లో దత్తత ప్రక్రియలో కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ఇకపై ప్రైవేట్ ఏజెన్సీలకు బదులు విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం నడుస్తుందని ప్రకటించింది. కానీ కమిషన్ వెల్లడించిన కఠోర వాస్తవాలపై మాత్రం ప్రభుత్వం పెదవి విప్పలేదు. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని తేలినా క్షమాపణ చెప్పలేదు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దారి తప్పిన పథకంపశ్చిమ దేశాల జంటలకు అనాథలను దత్తతనిచ్చే కార్యక్రమం మొదట్లో సవ్యంగా సాగినా రానురాను ఇది అక్రమాలకు నెలవుగా తయారైంది. దత్తత ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి చేతులు దులుపుకుంది. దీంతో ఈ ఏజెన్సీలు పశ్చిమదేశాల జంటల నుంచి అత్యధిక మొత్తాలను వసూలుచేసి వాళ్లకు నచ్చిన పిల్లలను విదేశాలకు తరలించడం మొదలెట్టాయి. ఇందుకోసం ఏజెన్సీలు ఎన్నో అక్రమ మార్గాలను ఎంచుకున్నాయి. అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పిల్లల అసలు పేర్లను మార్చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించేవారు. కుటుంబాలతో ఉంటున్న అందంగా, పుష్టిగా ఉన్న చిన్నారులు కొందరిని కిడ్నాప్ చేసి మరీ విదేశాలకు తరలించారు. కుటుంబాలకు చెందిన పిల్లలను అనాథలుగా ముద్రవేసి విదేశీ జంటలకు అప్పగించారు. ఇలా లక్షలాది మంది చిన్నారులను దేశం దాటించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదిమ గెలాక్సీ చిక్కింది
అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీన్ని అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎదుకంటే విశ్వావిర్భావానికి మూల కారణమని భావిస్తున్న బిగ్బ్యాంగ్ జరిగిన కేవలం 33 కోట్ల ఏళ్లకే అది పురుడు పోసుకుంది! విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లని అంచనా. ఈ లెక్కన ఈ గెలాక్సీ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. దీనికి జేడ్స్–జీఎస్–జెడ్13–1గా సైంటిస్టులు నామకరణం చేశారు. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలన్నది తెలిసిందే. అయితే, ‘‘జేడ్ గెలాక్సీ కేవలం 230 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలోనే వ్యాపించింది. ఆ లెక్కన మన పాలపుంత కంటే ఇది వందలాది రెట్లు చిన్నదే’’ అని సైంటిస్టులు వివరించారు. కానీ దీని గుర్తింపుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. చీకట్లను చీల్చుకుని...మనకు ఇప్పటిదాకా తెలిసిన అత్యంత పురాతన గెలాక్సీల్లో జేడ్స్ నాలుగోది. కానీ వాటన్నింట్లోకీ ఇది అత్యంత ప్రకాశవంతమైనది మాత్రం ఇదే. తద్వారా అయానీకరణ దశకు జేడ్స్ తొలి రుజువుగా నిలిచిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్టుల బృందం సంబరపడుతోంది. బిగ్బ్యాంగ్తో పురుడు పోసుకున్న విశ్వం క్షణాల వ్యవధిలోనే శరవేగంగా, అనంతంగా విస్తరించడం మొదలు పెట్టిందన్నది సైంటిస్టుల భావన. నవజాత దశను దాటి కాస్త చల్లబడ్డాక చాలాకాలం పాటు వైశ్విక అంధకార యుగం కొనసాగిందని చెబుతారు. ఆ దశలో విశ్వం మొత్తాన్నీ హైడ్రోజన్ వాయువు దట్టంగా కప్పేయడమే ఇందుకు కారణం. ‘‘దాంతో విశ్వమంతా కేవలం హైడ్రోజన్, హీలియం, కృష్ణరాశితో కూడిన ముద్దగా మిగిలిపోయింది. ఆ తర్వాత విశ్వపు తొలి తారలు, కృష్ణబిలాలు, గెలాక్సీలు పురుడుపోసుకున్నాయి. వాటినుంచి నుంచి అతి శక్తిమంతమైన పరారుణ కాంతి ఉద్గారాలు వెలువడ్డాయి. విశ్వాన్ని చిరకాలంగా కప్పి ఉంచిన తటస్థ హైడ్రోజన్ వాయు మండలాన్ని ఛేదించాయి. తొట్టతొలి వెలుగు కిరణాలుగా నిలిచిపోయాయి’’ అని పెన్హెగన్యూనివర్సిటీ కాస్మిక్ డాన్ సెంటర్కు చెందిన ఆస్ట్రో ఫిజిసిస్టు జోరిస్ విట్స్కాక్ వెల్లడించారు. తాజా అధ్యయనానికి ఆయనే సారథ్యం వహించారు. ‘‘అలా విశ్వం అయానీకరణ దశలో తొలిసారిగా వెలుగులు విరజిమ్మడం మొదలైంది. అందుకే దీన్ని విశ్వానికి పొద్దుపొడుపుగా చెబుతుంటారు. జేడ్స్ గెలాక్సీ సరిగ్గా ఆ పరివర్తన దశకు చెందినదని తేలింది’’ అని విట్స్కాక్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మనకు చిక్కిన ఇతర సుదూర గెలాక్సీలకు భిన్నంగా జేడ్స్ అత్యంత స్పష్టంగా కని్పస్తుండటం వెనక కారణం కూడా ఇదే. అందులో అత్యంత శక్తిమంతమైన పరారుణ రేడియేషన్ వంటిది ఉందనేందుకు ఇది నిదర్శనం. అయానీకరణం చెందిన హైడ్రోజన్ దాని చుట్టూ భారీగా పరుచుకుని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డోజ్కు త్వరలో మస్క్ గుడ్బై?
వాషింగ్టన్: అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథ్య పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు. ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావిస్తూ డోజ్కు వీడ్కోలు పలకబోతున్న అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే డోజ్ బృందంలోని కీలకమైన ఏడుగురు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సంస్థ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆరామ్ మొఘాద్దాషీ, స్టీవ్ డేవిడ్, బ్రాడ్ స్మిత్, ఆంటోనీ ఆర్మ్స్ట్రాంగ్, జోయీ గిబ్బియా, టోమ్ క్రాస్, టైలర్ హసేన్లతో మస్క్ సమావేశమయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్కు కుడిభుజంగా వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. దాంతో ఆయన తప్పుకున్నాక డోజ్ విభాగం ఉంటుందా, ఉంటే నూతన సారథి ఎవరంటూ చర్చ మొదలైంది. సొంత సమస్యలను పరిష్కరించుకునేందుకే మస్క్ ఇలా హడావుడిగా డోజ్ నుంచి వైదొలగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన టెస్లా కంపెనీ కార్ల పనితీరు, సంస్థలో శ్వేతజాతీయేతర ఉద్యోగుల పట్ల వివక్ష, భాగస్వాముల విభేదాలు, వినియోగదారుల ఫిర్యాదుల వంటి సమస్యలతో మస్క్ సతమతమవుతున్నారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నాకే డోజ్ నుంచి నిష్క్రమించబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘అమెరికా ఆర్థిక భారాన్ని కనీసం ట్రిలియన్ డాలర్ల మేర తగ్గించాలన్న లక్ష్యం దాదాపు సాధించాం’’అని చెప్పారు. -
Myanmar earthquake: కుళ్లుతున్న మృతదేహాలు
మాండలే: భూకంపం తాలూకు విధ్వంసం నుంచి మయన్మార్ ఇంకా తేరుకోలేదు. మౌలిక వనరుల లేమికి భూ ప్రకంపనలు తోడై సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుబడ్డవారి సంఖ్య అపారంగా ఉన్నట్టు సైనిక ప్రభుత్వ వర్గాలు అంగీకరిస్తున్నానాయి. ఇప్పటికే రెండు రోజులు దాటిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. దాంతో రాజధాని నేపిడా మొదలుకుని ఏ నగరంలో చూసినా మృత్యుఘోషే విన్పిస్తోంది. ముఖ్యంగా భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న మాండలేలో శిథిలాల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి! అంతర్జాతీయంగా అందుతున్న సాయం ఏ మూలకూ చాలడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. చాలా నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. భూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని నేపిడా సమీపంలో శనివారం రెండుసార్లు 4.7, 4.3 తీవ్రతతో భూమి కంపించడం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కూడా 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో జనం భయాందోళనలతో ఇళ్లను వీడి వీధుల్లోకి పరుగులు తీశారు. స్వల్ప స్థాయి ప్రకంపనలు రోజంతా కొనసాగాయి. రోడ్డు, రైలు మార్గాలు, బ్రిడ్జిల వంటివన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రవాణా వ్యవస్థలన్నీ పడకేశాయి. దాంతో సహాయక బృందాలను బాధిత ప్రాంతాలకు తరలించడమే సవాలుగా మారింది. సమాచార వ్యవస్థలు కూడా కుప్పకూలాయి. వీటికి తోడు 41 డిగ్రీల పై చిలుకు ఎండ ఠారెత్తిస్తోంది. చాలాచోట్ల శిథిలాలను పారలు, చేతులతోనే తొలగించేందుకు స్థానికులు ప్రయతి్నస్తున్నారు! ఇన్ని ప్రతికూలతల మధ్యే ఇప్పటిదాకా 1,700కు పైగా మృతదేహాలను వెలికితీశారు. అయితే సహాయక బృందాలు ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు చేరుకోనే లేదు. తిరుగుబాటుదారుల అ«దీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యల ఊసే లేదు. దాంతో అక్కడి మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారమూ లేదు. ఈ నేపథ్యంలో మరణాలు 10 వేలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు. భారత్ ఆపద్బాంధవ పాత్ర కల్లోల మయన్మార్ను ఆదుకోవడంతో భారత్ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్ బ్రహ్మ పేరిట ఇప్పటికే ఐదు సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయక సామగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామగ్రి సముద్ర మార్గాన చేరుకుంటోంది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్ బృందం కూడా తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో వాయు మార్గాన తరలించిన తాత్కాలిక ఆస్పత్రి రెండుగా విడిపోయి మాండలే, నేపిడాల్లో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటోంది.మాండలేలో ఆకలి కేకలు 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో విధ్వంసం మాటలకందని రీతిలో ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ నిర్మణాలన్నీ కుప్పకూలడమో, భారీగా పగుళ్లివ్వడమో జరిగింది. దాంతో నగరవాసులు వీధుల్లోనే గడుపుతున్నారు. శిథిలాల కింద చిక్కిన తమవారిని ఎలాగోలా కాపాడుకోవాలని తపిస్తున్నారు. పారలు, పలుగులతో వాటిని తవ్వి తీసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే తిండికి, తాగునీటికి కూడా వాళ్లు అల్లాడిపోతున్న పరిస్థితి! శిథిలాల తొలగింపుకే నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని కేథలిక్ రిలీఫ్ సరీ్వసెస్ మేనేజర్ కారా బ్రాగ్ అభిప్రాయపడ్డారు. ‘‘క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు చాలినన్ని సదుపాయాల్లేవు. ఔషధాలు తదితరాలకు తీవ్ర కొరత ఉంది. తిండికి, తాగునీటికి కొరత తీవ్రతరమవుతోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నేపిడా, మాండలే విమానాశ్రయాలు పూర్తిగా దెబ్బతినడంతో ఆ నగరాలకు వాయుమార్గాన సహాయక సామగ్రి, సిబ్బంది తరలింపు అసాధ్యంగా మారింది. నేపిడాలో ప్రభుత్వ కార్యాలయాల పునరుద్ధరణకే సైనిక సర్కారు ప్రాధాన్యమిస్తోంది. దాంతో సాధారణ ప్రజల దైన్యాన్ని పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు.థాయ్లాండ్లో 18కి మృతులు శుక్రవారం నాటి భూకంపంతో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్లాండ్లో మృతుల సంఖ్య 18కి పెరిగింది. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతçస్తులు నిర్మాణంలోని భవనం శిథిలాల్లో నుంచి ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికితీశారు. -
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ రుచి చూడాల్సి వస్తుందన్నారు.మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్ఇరాన్తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్. అందుకు సుమారు రెండు నెలల డెడ్లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దుట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటు ఇరాన్ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. -
Myanmar earthquake: మయన్మార్లో మళ్లీ భూకంపం
మయన్మార్లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రత నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు. యునైటెడ్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ప్రకారం.. ఆదివాయం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట మధ్యలో మయన్మార్ను మరోసారి భూకంపం వణికించింది. మయన్మార్లోని మాండలే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తేలింది.మరణాల సంఖ్య పెరుగుతోందిమార్చి 28న మయన్మార్ను భారీగా కుదిపేసిన 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య సుమారు 1600కు పైకి చేరింది. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. యూఎస్జీఎస్ ప్రాథమిక సమాచారం మేరకు మయన్మార్లో ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశముందని పేర్కొంది. -
పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు లిమోజిన్లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుని భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం పుతిన్కు చెందిన ఈ అత్యంత ఖరీదైన కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుండి మంటలు ప్రారంభమై, వాహనం లోనికి వ్యాపించాయి. JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU— BRICS News (@BRICSinfo) March 29, 2025అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతిడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ‘ది సన్’ పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కారు తగలబడిన ఘటన నేపధ్యంలో ఆయన మరణాన్ని జెలెన్స్కీ ముందే ఊహించారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కైవ్ ఇండిపెండెంట్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం యూరోవిజన్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ త్వరలో చనిపోతారని, ఇరు దేశాల యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు.ఇది కూడా చదవండి: Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే.. -
భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్తో పాటు థాయ్లాండ్లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025 -
Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం -
బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే. -
వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్లో మీ పాస్పోర్ట్ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే. -
నిర్బంధాలు.. బహిష్కరణలు!
న్యూయార్క్: అమెరికా యూనివర్సిటీల్లో చదువుకొనసాగిస్తూ పాలస్తీనా అనుకూల నిరసనలకు మద్దతు పలుకుతున్న వారిపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. వీరు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ట్రంప్తోపాటు అధికారులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, గాజాలో ని హమాస్పై ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే తాము మాట్లాడుతున్నామన్నది నిరసనల్లో పాల్గొంటున్న వారి వాదనగా ఉంది. ఇటీవలి కాలంలో యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏడెనిమిది మంది పాలస్తీనా అనుకూల విద్యార్థి నేతలను నిర్బంధంలోకి తీసుకోవడమో లేదా బలవంతంగా సొంతదేశాలకు పంపించడమో చేశారు. వీరిలో కొందరిని గురించి పరిశీలిద్దాం.. రుమేసా ఒజ్టుర్క్ తుర్కియేకు చెందిన 30 ఏళ్ల రుమేసా ఒజ్టుర్క్ మంగళవారం బోస్టన్లోని ఓ వీధిలో నడిచి వెళ్తుండగా ఫెడరల్ అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. టఫ్టŠస్ వర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న ఈమె హమాస్కు మద్దతుగా జరిగే కార్యకలాపాల్లో పాల్గొంటోందని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలను మాత్రం చూపలేదు. అయితే, ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసే వర్సిటీ వార్తాపత్రికకు రమేసా వ్యాసాలు రాస్తుంటారని స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం లూసియానాలో డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. రుమేసా నిర్బంధానికి తగు కారణాలు తెలపాలని జిల్లా జడ్జి ఒకరు అధికారులను ఆదేశించారు. మహ్మూద్ ఖలీల్ అమెరికాలో నివాసానికి అర్హత పొందిన పాలస్తీనా అనుకూల ఉద్యమకారుడు మహ్మూద్ ఖలీల్ను మార్చిలో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి, నిర్బంధంలో ఉంచారు. కొలంబియా వర్సిటీలో గతేడాది జరిగిన ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలను నడిపిన వారిలో ఇతడూ ఉన్నాడు. అనంతరం వర్సిటీ అధికారులు, ఆందోళనకారులకు మధ్యవర్తిగా ఉండి ఆందోళనలను విరమింపజేశాడు. అయితే, ఇతడు హమాస్కు మద్దతు తెలుపుతున్నాడనే ఆరోపణలపై ఖలీల్కున్న గ్రీన్కార్డును యంత్రాంగం రద్దు చేసింది. బలవంతంగా సొంతదేశం సిరియాకు పంపించేందుకు జరిగే ప్రయత్నాలను ఇతడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఇతడు అమెరికా పౌరురాలిని వివాహం చేసుకున్నాడు. యున్సియో చుంగ్ దక్షిణ కొరియా నుంచి చిన్నతనంలోనే అమెరికాకు వచ్చిన యున్సియో చుంగ్ నివాసార్హత పొందింది. ఈమె కొలంబియా వర్సిటీ విద్యార్థి. పాలస్తీనా అనుకూల విద్యార్థులపై ప్రభుత్వం బహిష్కరాస్త్రాన్ని ప్రయోగించడాన్ని నిరసిస్తూ ఇటీవల బర్నార్డ్ కాలేజీలో జరిగిన నిరసనల్లో పాల్గొనడమే ఈమె చేసిన నేరం. ఈమెను సొంతదేశం కొరియాకు పంపించాలని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై ఈమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు వచ్చే వరకు యున్సియోను నిర్బంధించవద్దని జడ్జి ఒకరు ఆదేశించారు. బాదర్ ఖాన్ సురి భారత్కు చెందిన బాదర్ ఖాన్ సురి జార్జిటౌన్ వర్సిటీ విద్యార్థి. వర్జీనియాలోని తన నివాసం వద్ద ముసుగు ధరించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. హ మాస్ సిద్ధాంతాలను ఇతడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. సురి సోషల్ మీడియా పోస్టులు, ఇతడి భార్య పాలస్తీనా వాసి కావడమే ఇందుకు కారణమని ఇతడి లాయర్ కోర్టుకు తెలిపారు. విజిటింగ్ స్కాలర్గా అమెరికాలో ఉండేందుకు సురికి అనుమతి ఉందని, ఇత డి భార్య అమెరికా పౌరు రాలని అ న్నారు. లూసియానాలోని డి టెన్షన్ సెంటర్లో సురిని ఉంచారు. సురి ని వెంటనే విడుదల చేయాలని, భారత్కు బలవంతంగా పంపించరాదని వాదిస్తున్నారు. లెకా కొర్డియా వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనా వాసి లెకా కొర్డియా. ప్రస్తుతం న్యూయార్క్లోని నెవార్క్లో ఉంటోంది. విద్యార్థి వీసా పరిమితి ముగిసిన తర్వాత కూడా అమెరికాను వీడి వెళ్లలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. కొర్డియా తమ విద్యార్థి కానేకాదని కొలంబియా యూనివర్సిటీ అంటోంది. టెక్సాస్లోని అల్వరాడో డిటెన్షన్ సెంటర్లో ఈమెను ఉంచారు. రంజనీ శ్రీనివాసన్ భారత పౌరురాలైన రంజనీ శ్రీనివాసన్ కొలంబియా వర్సిటీలో డాక్టరేట్ చేస్తోంది. యూనివర్సిటీ హాస్టల్లో ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు ఈమెను సోదా చేయడంతో ఈమె భారత్కు తిరిగి వచ్చింది. హింసను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున ఈమె వీసాను రద్దు చేసినట్లు యంత్రాంగం తెలిపింది. ఇందుకు గల ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరోపణలను ఈమె ఖండించింది. నిరసనల్లో తనకెలాంటి పాత్ర లేదని తెలిపింది. ‘సెల్ఫ్ డిపోర్ట్’ఆప్షన్ను ఎన్నుకుని, స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. అలిరెజా డొరౌడి అలబామా యూనివర్సిటీ డాక్టొరల్ విద్యార్థి అలిరెజా డొరౌడి సొంత దేశం ఇరాన్. మంగళవారం ఇతడిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధంలోకి తీసుకుని, లూసియానాలోని జెనా ఇమిగ్రేషన్ ఫెసిలిటీకి తరలించారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఇతడి వీసాను అధికారులు 2023లోనే రద్దు చేశారని లాయర్ డేవిడ్ రొజాస్ తెలిపారు. అయితే, విద్యార్థి హోదాలో ఉన్నంత కాలం ఇతడు అమెరికాలో ఉండేందుకు అర్హత ఉంటుందన్నారు. జాతీయ భద్రతకు ప్రమాదమనే ఆరోపణలపై ఇతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు అంటున్నారు. అయితే, ఇతడికి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలతో సంబంధం లేదని లాయర్ డేవిడ్ తెలిపారు. డాక్టర్ రషా అలావీహ్ లెబనాన్కు చెందిన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రషా అలావీహ్(34). రోడ్ ఐల్యాండ్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉన్న ఈమెను ఇటీవలే సొంత దేశానికి బలవంతంగా పంపించివేశారు. ఈమె పిటిషన్పై తీర్పు వెలువడే వరకు నిర్బంధించరాదన్న జడ్జి ఆదేశాలను సైతం ఇమిగ్రేషన్ అధికారులు పక్కనబెట్టడం గమనార్హం. లెబనాన్లోని హెజ్బొల్లా సాయుధ సంస్థకు ఈమె బహిరంగంగా మద్దతు పలికారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, హెజ్»ొల్లా నేత హసన్ నస్రుల్లా మత, ఆధ్యాతి్మక బోధనలకే తప్ప రాజకీయ సిద్ధాంతాలకు మద్దతు తెలపలేదని రషా అంటున్నారు.మొమొడౌ తాల్ కార్నెల్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్న మొ మొడౌ తాల్(31) వీసాను ఇటీవలే అధికారులు రద్దు చేశారు. క్యాంపస్లో జరిగిన పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొనడమే ఇతడి తప్పు. యూకే, గాంబియా పౌరసత్వాలున్న మొమొడౌ తనను అక్రమంగా నిర్బంధించారంటూ కోర్టులో సవాల్ చేశాడు. ప్రభుత్వ చర్యలు చట్టబద్ధమేనని కోర్టు ప్రకటిస్తే ఇమిగ్రేషన్ అధికారుల ఎదుట లొంగిపోతానని ఇతడు అంటున్నాడు. -
డెన్మార్క్ను వదిలేయండి.. అమెరికాతో ఒప్పందం చేసుకోండి
గ్రీన్లాండ్: ఆర్కిటిక్ ద్వీప దేశమైన గ్రీన్లాండ్పై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్లాండ్ను అప్పగించాలన్నదే డెన్మార్క్ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్లాండ్ ప్రజలకు సూచించారు. జె.డి.వాన్స్ శుక్రవారం తన భార్య ఉషా వాన్స్తో కలిసి గ్రీన్లాండ్లో పర్యటించారు. డెన్మార్క్తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్లాండ్ పౌరులకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని రక్షించే పరిస్థితిలో డెన్మార్క్ లేదని అన్నారు. ఇతర దేశాల ఆక్రమణల నుంచి గ్రీన్లాండ్ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్లాండ్ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్లాండ్లో 57 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. -
దక్షిణాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం
జొహన్నెస్బర్గ్: వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ అపప్రథ మూటగట్టుకున్న దేశంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అదేసమయంలో, ప్రపంచంలోనే డ్రైవింగ్కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి కీర్తి కిరీటం ధరించింది. అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రెయినింగ్ కంపెనీ జుటోబీ వార్షిక నివేదికలో ఈ విషయాలున్నాయి. మొత్తం 53 దేశాలకు గాను దక్షిణాఫ్రికా అట్టడుగున 53వ స్థానంలో ఉండగా అమెరికాకు 51, భారత్కు 49వ ర్యాంకులు దక్కా యి. రహదారులపై స్పీడ్ లిమిట్లు, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ మోతాదు పరిమితులు, రహదారి ప్రమాదాల స్థాయిలు ఆధారంగా డ్రైవింగ్కు సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాలను విశ్లేషించామ ని జుటోబీ తెలిపింది. ప్రతి లక్ష మందిగాను రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోయే సరాసరి సంఖ్య గతేడాది 8.9 ఉండగా ఈసారి ఇది 6.3కు తగ్గిందని జుటోబీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నా అవినీతి అధికారుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమని జొహన్నెస్బర్గ్కు చెందిన డ్రైవింగ్ కంపెనీ ఉద్యోగి అలిషా చిన్నాహ్ వ్యాఖ్యానించారు. -
ఇప్పటికైనా సారీ చెప్తారా ?
లండన్: తోటలో సమావేశమైన భారతీయులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించి దాదాపు 1,500 మందిని బలితీసుకున్న జలియన్వాలా బాగ్ ఉదంతంలో బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఊపందుకుంది. స్వాతంత్య్రసమరంలో భాగస్వాములైన వేలాది మంది అమాయకులపై జలియన్వాలా బాగ్లో జనరల్ డయ్యర్ బలగాలు తుపాకులు ఎక్కుపెట్టి వందలాది మంది ప్రాణాలు తీసిన ఉదంతం జరిగి ఏప్రిల్ 13వ తేదీకి 106 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నాటి దారుణ దాడికి బ్రిటన్ సర్కార్ సారీ చెప్పాలని యూకే పార్లమెంట్ సాక్షిగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. దిగువసభలో కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మాన్ ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ ప్రసంగించారు. ‘‘నాటి బ్రిటిష్ పాలకుల అరాచకాలను అంగీకరిస్తూ నేటికైనా నాటి ఉదంతంపై క్షమాపణలు చెప్పాలి. 1919 ఏప్రిల్ 13నాటి ఘటన బ్రిటన్ చరిత్రలోనే మాయని మచ్చ. ప్రశాంత వాతావరణంలో సమావేశమైన నిరాయుధులపైకి తుటాలు అయిపోయేదాకా కాల్పులు జరపాలని జనరల్ డయ్యర్ తన సైన్యానికి ఆదేశాలిచ్చారు. తూటాలకు 1,500 మంది ప్రాణాలు కోల్పోగా మరో 1,200 మంది గాయపడ్డారు. హేయమైన చర్యకు జనరల్ డయ్యర్ హత్యకు గురై తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇది కూడా బ్రిటిష్ వలసపాలనలో మరో మాయని మచ్చగా మిగిలింది. ఇదంతా బ్రిటన్ పాలనలో చీకటి అధ్యాయంగా 2019లో అప్పటి బ్రిటన్ మహిళా ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి క్షమాపణలు తెలపలేదు. ఇకనైనా ప్రభుత్వం సారీ చెప్పాలి. ఏప్రిల్ 13న పార్లమెంట్ సమావేశాలు లేవుకాబట్టి ఆరోజు క్షమాపణలు చెబుతూ అధికారిక ప్రకటన అయినా వెలువరించాలి’’అని ఆయన డిమాండ్చేశారు. ఈ డిమాండ్కు మరో సభ్యుడు లూసీ పావెల్ మద్దతు పలికారు. -
శరణార్థులకు, నిరాశ్రయులకు జారీ చేసే గ్రీన్ కార్డులకు ఫుల్స్టాప్!
గత జో బైడెన్ ప్రభుత్వం చూపించిన ఉదారవాద విధానాలను స ద్వినియోగం చేసుకుని ఇప్పటికే శరణార్థి/నిరాశ్రయుల హోదా సంపాదించిన విదేశీయులకు అందజేసే గ్రీన్కార్డుల జారీ ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. తాత్కాలికంగా ఈ గ్రీన్కార్డుల జారీ ప్రక్రియను నిలిపేసినట్లు అమెరికా పౌరసత్వం, శరణార్థి సేవల విభాగం తాజాగా ధ్రువీకరించింది. దీంతో అక్రమ మార్గా ల్లో అమెరికాలోకి వచ్చి ఎలాగోలా శరణార్థి హో దా పొందిన వారికి ఇక కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది. శరణార్థి/నిరాశ్రయుల హోదా పొందటంతో ఏవైనా అవకతవకలు జరిగాయా లేదంటే వీళ్లంతా నిజంగానే సొంతదేశాల్లో హింస, పీడనకు గురయ్యారా? అనేది తేలాల్సి ఉంది. ఇందుకోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సంబంధిత పాత రికార్డులను తవ్వితీయనుందని తెలుస్తోంది. గ్రీన్కార్డు హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూర్వాపరాలను సమీక్షించాకే వారికి గ్రీన్కార్డు కట్టబెట్టడంపై ముందుకెళ్లాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. దీంతో లక్షలాది మంది శరణార్థులు/నిరాశ్రయుల గ్రీన్కార్డు కలలపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. భారతీయుల్లో 466 శాతం ఎక్కువ రెండేళ్ల క్రితం అంటే 2023 ఏడాదిలో ఏకంగా 51,000 మందికిపైగా భారతీయులు అమెరికాకు చేరుకుని శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఒకేఏడాదిలో ఇంతమంది భారతీయులు శరణార్థులుగా అగ్రరాజ్యం చెంతకు చేరడం ఇదే తొలిసారి. 2018 ఏడాదిలో కేవలం 8,000 మంది భారతీయులు ఈ తరహా దరఖాస్తు చేసుకోగా 2023 ఏడాదికి వచ్చేసరికి ఏకంగా 466 శాతం అధికంగా 51,000 మంది అప్లై చేశారని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. అక్రమ మార్గాల్లో మెక్సికో, కెనడా సరిహద్దుల గుండా అమెరికా భూభాగంలోకి అడుగుపెడుతూ అమెరికా బోర్డర్ సెక్యూరిటీ పోలీసులకు చిక్కిన వేలాది మంది భారతీయులు శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు అమెరికా ఇమిగ్రేషన్ సిస్టమ్ అనుమతిస్తోంది. శరణార్థి హోదా.. సుదీర్ఘ ప్రక్రియ బోర్డర్ వద్ద చిక్కిన వాళ్లకు వెంటనే శరణార్థి హోదా ఇవ్వరు. వాళ్లు చెప్పే వివరాలను అధికారులు నమోదుచేసుకుని దరఖాస్తు ప్రక్రియను మొదలుపెడతారు. వైద్య పరీక్షలతోపాటు ముఖాముఖి ఇంటర్వ్యూలు చేస్తారు. సంబంధిత శరణార్థి అధికారులు ఈ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ సందర్భంగా తాము స్వదేశాన్ని ఎందుకు వీడాల్సి వచ్చింది?. స్వదేశంలో తాము పడిన కష్టాలు, ఎదురైన సమస్యలు, సొంత సమాజంలో అణచివేతకు గురవడానికి కారణాలను వివరించాల్సి ఉంటుంది. వీళ్లు చెప్పే మాటలు, వివరాలను అధికారులు/ఇమిగ్రేషన్ న్యాయమూర్తులు నమ్మితే శరణార్థి హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. కార్యనిర్వాహక ఉత్తర్వుతో అడ్డుకున్న ట్రంప్ ఎలాగోలా శరణార్థి హోదా పొందిన వారికి అమెరికాలో తాత్కాలికంగా నివసించేందుకు అవకాశం చిక్కుతోంది. ఈ అవకాశం లేకుండా చేసేందుకు రెండోదఫా అధికారంలోకి వచ్చిన ట్రంప్ వెంటనే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీచేశారు. శరణార్థులుగా వచ్చే వారిని లోపలికి రానివ్వడం ఆపేశారు. అరెస్టయి శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారు శరణార్థి హోదా దరఖాస్తు చేయకుండా నిలువరిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–మెక్సికో సరిహద్దు వద్ద ఈ రెండు విధానాలను ట్రంప్ కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఇప్పటికే కొందరు కోర్టుల్లో సవాల్చేశారు. కొందరిని స్వదేశాలకు తిరిగి పంపడాన్ని ఇటీవల ఒక ఫెడరల్ జడ్జి తన ఉత్తర్వులతో అడ్డుకోవడం తెల్సిందే. హోదా సవరణపై ట్రంప్ సర్కార్ తీవ్ర అభ్యంతరం శరణార్థి హోదాతో చాన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్న వాళ్లు ఇక శాశ్వత స్థిర నివాసం కోసం గ్రీన్కార్డుకి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనను ట్రంప్ సర్కార్ తాజాగా ఆపేసింది. హడావుడిగా వీళ్లకు గ్రీన్కార్డు ఇచ్చేయకుండా అసలు ఈ శరణార్థుల గతచరిత్ర స్వదేశంలో ఎలాంటిది?. భవిష్యత్తులో వీళ్లు అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందా?.. ఇలా పలు అంశాల తుది నిర్దారణకు సంబంధించి ‘స్క్రీనింగ్’విధానాలను అవలంబించాలని, అందుకోసమే అప్లికేషన్ల పరిశీలనను ఆపేశామని యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐసీ) అధికారులు స్పష్టంచేశారు. మెక్సికోలో గతంలో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న వ్యక్తులు/కుటుంబాలు అమెరికాలో శరణార్థులుగా ఉంటే అలాంటి వారి జాబితాను ఈ గ్రీన్కార్డు దరఖాస్తుల్లో వెతుకుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మయన్మార్ వెన్ను విరిగింది
బ్యాంకాక్: భూకంపం మయన్మార్ వెన్ను విరిచింది. అంచనాలకు కూడా అందనంతటి నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలు, వారి సంబం«దీకుల ఆక్రందనలే. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో కునారిల్లుతున్న ఆ దేశానికి ఇది పులిమీద పుట్రలా పరిణమించింది. అత్యవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు కనీస స్థాయి మౌలిక వనరులు కూడా లేక సైనిక సర్కారు చేతులెత్తేస్తోంది. శిథిలాల నుంచి మృతులు, క్షతగాత్రుల వెలికితీతకు అవసరమైనన్ని భారీ క్రేన్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి! దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఫలితంగా శిథిలాల కింద చిక్కిన వారిలో అత్యధికులు మృత్యువాత పడే దుస్థితి నెలకొంది. నిస్సహాయ స్థితిలో ఉన్న మయన్మార్కు భారత్ తక్షణం ఆపన్నహస్తం అందించింది. ఇతర దేశాల నుంచి కూడా మయన్మార్కు సాయం అందుతోంది. మరోవైపు శనివారం మధ్యాహ్నం నేపిడా సమీపంలో మూడు గంటల తేడాతో రెండుసార్లు భూమి కంపించింది. 4.3, 4.7 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపాల తాలూకు నష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. గత 24 గంటల్లో మయన్మార్లో 14కు పైగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కుప్పకూలిన కంట్రోల్ టవర్ భూకంప ధాటికి నేపిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో కంట్రోల్ టవర్ కుప్పకూలి శిథిలాల దిబ్బగా మారింది. విమాన సేవలు ఆగిపోవడంతో భారత్ తదితర దేశాల నుంచి వస్తున్న సహాయక విమానాలు యాంగూన్లో దిగుతున్నాయి. థాయ్లాండ్లో... థాయ్లాండ్లో భూకంపం తాలూకు విధ్వంస తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రాజధాని బ్యాంకాక్తో పాటు పలు నగరాల్లో భవనాలు, ఆస్పత్రులు, ఆలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరంలో కనీసం 2,000 పైచిలుకు భవనాలు తీవ్రంగా పగుళ్లిచ్చినట్టు గవర్నర్ తెలిపారు. 334 అణుబాంబుల శక్తి! మయన్మార్ భూకంపం ఏకంగా శక్తిమంతమైన 334 అణుబాంబుల పేలుడుకు సమానమైన శక్తిని విడుదల చేసినట్టు జియాలజిస్టులు తేల్చారు! మాండలే, పరిసర ప్రాంతాలకు ముప్పు ఇంకా తొలగలేదని వారు హెచ్చరించారు. అక్కడ ఒకట్రెండు నెలల పాటు ప్రకంపనలు కొనసాగే ఆస్కారముందని వివరించారు.రోడ్డుపైనే ప్రసవం శుక్రవారం మధ్యాహ్న వేళ. భూకంపం దెబ్బకు బ్యాంకాక్ అతలాకుతలమైంది. జనమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లూ, భవనాలు వీడుతున్నారు. ఉన్నపళంగా రోడ్లపైకి పరుగులు తీస్తున్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని అధికారులు హుటాహుటిన ఖాళీ చేయించి రోగులను ఫైర్ సేఫ్టీ మార్గం గుండా బయటికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో ఓ నిండు గర్భిణికి నడిరోడ్డు మీదే పురిటి నొప్పులు మొదలయ్యాయి. చుట్టూ గందరగోళం మధ్యే వైద్య సిబ్బంది సమక్షంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.15 మంది సజీవం! భూకంపం ధాటికి బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం శుక్రవారం కుప్పకూలడం తెలిసిందే. పదుల సంఖ్యలో నిర్మాణ కారి్మకులు, సిబ్బంది శిథిలాల కింద చిక్కుబడ్డట్టు చెబుతున్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన 100 మందిలో అత్యధికులు ఆ శిథిలాల కిందే ఉన్నట్టు భావిస్తున్నారు. దాంతో వారి బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. వారిలో కనీసం 15 మంది ప్రాణాలతో ఉన్నట్టు సహాయక సిబ్బంది గుర్తించారు. శిథిలాల అడుగుభాగం నుంచి వారి మూలుగులు, సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు తమకు లీలగా వినిపిస్తున్నాయని సిబ్బంది చెప్పారు. -
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్లాండ్, మయన్మార్లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్లాండ్లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు, వీల్చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్పై బయటకు తీసుకొచ్చి పార్క్లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..) -
Myanmar: భూ ప్రకంపనల వైరల్ వీడియోలు
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్(Myanmar)ను భూకంపం కుదిపేసింది. వందలాది భవనాలు నేల మట్టమయ్యాయి. మరణాల సంఖ్య లెక్కకు అందనంతగా ఉంది. ఇక నిరాశ్రయులైనవారి సంఖ్య చెప్పలేనంతగా ఉంది. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Dashcam footage of the powerful 7.7 magnitude earthquake in Myanmar Mandalay city#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/jzuRilDMsr— Culture War Report (@CultureWar2020) March 29, 2025మయన్మార్, థాయిలాండ్లలో సంభవించిన భూకంపానికి సంబంధించిన ఈ వీడియోలో ఆకాశహర్మ్యాలు ఊగడాన్ని చూడవచ్చు. రోడ్లపై వాహనాలు కదలడాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియో వణుకుపుట్టించేదిగా ఉంది.High-rise condo in Thailand with a pool on the 37th floor#Myanmar #Burma #Thailand pic.twitter.com/9tHDxZ7B4M— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఆకాశహర్మ్యంలో నిర్మించిన స్విమ్మింగ్ ఫూల్లో అలలు ఏర్పడి, అవి ఎగసిపడటాన్ని చూడవచ్చు. దీనిని చూస్తే చాలు.. భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు.🧵 Extreme shaking going on in Myanmar during the 7.7 Earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/4jGeCgZJXc— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియోలో ఇంటిలో ఏర్పడిన భూకంప ప్రభావాన్ని చూడవచ్చు. చిన్న చెట్టును ఊపినప్పుడు అది ఎలా ఊగిపోతుందో ఆ విధంగా ఈ ఇల్లు భూకంప తీవ్రతకు ఊగిపోయింది.People trapped on the 78th floor Skywalk at Mahanakhon Building, Bangkok, during the 7.7 earthquake#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/j7WQYai24w— Culture War Report (@CultureWar2020) March 29, 2025స్కై వాక్ చేయడానికి 78వ అంతస్తుకు చేరుకున్న జనం భవనం కంపించడంతో ఎంతగా భయపడ్డారో ఈ వీడియోలో చూడవచ్చు. అక్కడున్న వస్తువులు జారిపోతుండటాన్ని గమనించవచ్చు.🧵 Mother Nature is Mind blowing The Earth was torn open today in Myittha, Mandalay Region, following the powerful 7.7 earthquake in Myanmar#MyanmarEarthquake #Myanmar #Burma #Thailand #Bangkok pic.twitter.com/tORlQD019c— Culture War Report (@CultureWar2020) March 29, 2025ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భూమి పూర్తిగా చీలిపోయి, చాలా లోతైన పగుళ్లు ఏర్పడటాన్ని చూడవచ్చు.Narrowly escape! In #Bangkok, Thailand, a worker was cleaning the exterior walls while the building shook violently due to the #Myanmar earthquake, nearly hit by the falling glasses.#Myanmarquake #earthquakemyanmar pic.twitter.com/mDSB8MgiX4— Shanghai Daily (@shanghaidaily) March 29, 2025ఈ వీడియోలో భూకంపం తర్వాత ఆకాశహర్మ్యం పైకప్పుపై నుంచి నీరు జలపాతంలా పడటం కనిపిస్తుంది. భూకంపం సంభవించిన సమయంలో భవనాన్ని శుభ్రం చేస్తున్న వ్యక్తి ఎంతో భయపడుతూ కనిపిస్తున్నాడు.Devastating 7.7 Earthquake causes water to rise up from the ground in Myanmar pic.twitter.com/VFfT8qMLmU— TaraBull (@TaraBull808) March 29, 2025ఈ వీడియోలో భూమికి పగుళ్లు ఏర్పడిన దరిమిలా భూమి నుండి పంపు ద్వారా నీరు దానికదే ఉబికి రావడాన్ని గమనించవచ్చు.Nurses at a maternity center in Ruili, southwest China's Yunnan Province, did all they could to protect newborns when a deadly earthquake struck Myanmar, sending strong tremors across the border into Yunnan. #quake #heroes #China pic.twitter.com/KKhkxiDrKm— China Xinhua News (@XHNews) March 29, 2025ఈ వీడియో నైరుతి చైనాలోని ఒక ఆస్పత్రికి సంబంధించినది. భూకంపం సమయంలో నవజాత శిశువులను రక్షించడానికి నర్సులు పడుతున్న పాట్లను గమనించవచ్చు.ఇది కూడా చదవండి: ‘ప్రయాగ్రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా -
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్చ్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్లైన్లో యాక్టివ్గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది. -
రాజరికం కోసం.. అట్టుడుకుతున్న నేపాల్
ఖాట్మండు: నేపాల్(Nepal)లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్ అంతకంతకూ ఉధృతమవుతోంది. ఈ నేపధ్యంలో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో హింస చెలరేగి, ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పరిస్థితిని చక్కదిద్దేందుకు హోం మంత్రిత్వ శాఖ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ హింసాయుత ఘటనలకు మాజీ రాజు జ్ఞానేంద్ర షానే కారణమని ఆరోపిస్తూ, ఆయనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.ఇటీవల ఖాట్మండులోని పలు ప్రాంతాలలో రాచరిక మద్దతుదారులు, భద్రతా దళాల(Security forces) మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇంతలో ఆందోళనకారులు ఒక వాణిజ్య సముదాయం, ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం, ఒక మీడియా హౌస్ భవనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో 12 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.ఈ హింసాయుత ఘటనలను నివారించేందుకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి(Nepal Prime Minister KP Sharma Oli) అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాట్మండులో జరుగుతున్న హింసకు మాజీ రాజు జ్ఞానేంద్ర షాను బాధ్యునిగా చేసి, ఆయనను అరెస్టు చేయాలనే ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. జ్ఞానేంద్ర షా అరెస్టుకు సంబంధించి భద్రతా అధిపతుల అభిప్రాయాన్ని సేకరించడానికి, తదనంతర పరిణామాలను అంచనా వేయడానికి చర్చలు జరుగుతున్నాయని క్యాబినెట్ మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు. ఖాట్మండులో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.చెలరేగిన హింస.. ఇద్దరు మృతిరాజధాని ఖాట్మండులోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రాళ్లు రువ్వారు. అలాగే దుకాణాలను దోచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ భవనం వైపు రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో జరిగిన ఘర్షణల్లో 112 మంది గాయపడ్డారు. ఒక టెలివిజన్ కెమెరామెన్తోపాటు ఒక నిరసనకారుడు మృతిచెందాడని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు సైన్యాన్ని మోహరిస్తున్నారు.नेपाल जैसे छोटे देश में भी हिंदू राष्ट्र की मांग उठ रही है, लेकिन भारत में 115 करोड़ हिंदू होने के बावजूद यह भावना नहीं जागती। यह वाकई शर्म की बात है!#HinduRashtra #Nepal #India #HinduUnity #Sanatan #WakeUpHindus#earthquake #Bangkok #earthquake#AmitShahAtTimesNowSummit… pic.twitter.com/QBh2uCjNWZ— Journalist Namita Sharma (@NamitaSharmaSV) March 28, 20252008లో రాచరికాన్ని రద్దు చేసి నేపాల్లో లౌకిక, సమాఖ్య, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఇటీవలి కాలంలో రాచరికం పునరుద్ధరణ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ అవినీతి, ఆర్థిక అస్థిరత, తరచూ ప్రభుత్వాలు మారడంపై ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ప్రజల నుంచి మద్దతు కోరారు. ఇది ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీని తరువాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి. 2008 నుండి నేపాల్లో 13 ప్రభుత్వాలు మారాయి. అయినా రాజకీయ స్థిరత్వం ఏర్పడలేదు.ఇది కూడా చదవండి: World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు? -
World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?
నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.ప్రపంచంలో అతిపెద్ద పియానో 1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో రెండు విధాలుగా ధ్వనిని అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్ -
‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రధాని నరేంద్రమోదీని మెచ్చుకున్నారు. వాషింగ్టన్- భారతదేశం మధ్య సుంకాల చర్చలపై ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తి అని సుంకాల విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర సమన్వయం ఉంటుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ ఆ మర్నాడే భారత్ సుంకాలపై స్పందించారు. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా వచ్చారని, తమ మధ్య మంచి స్నేహం ఉన్నదన్నారు. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చాలా తెలివైన వ్యక్తి అని, తామ సుంకాల విషయంలో చర్చలు జరిపామని, ఇది అమెరికా, భారత్లకు మంచి చేస్తుందన్నారు. అమెరికాలోకి దిగుమతి చేసుకున్న వాహనాలపై ట్రంప్ సర్కారు 25 శాతం సుంకాన్ని విధిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇది ఏప్రిల్ 2 నుండి అమలులోకి రానుంది.భారతదేశం విధించే అధిక సుంకాలను హైలైట్ చేసిన ట్రంప్ తాము కూడా త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని, వారు మా నుంచి వసూలు చేస్తే, మేము వారి నుంచి వసూలు చేస్తామన్నారు. భారత్, చైనాలు లేదా అక్కడి కంపెనీల విషయంలో తాము న్యాయంగా ఉండాలనుకుంటున్నామని, పరస్పర అంగీకారంలో సుంకాల విధింపు ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీని సందర్శించి ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు తమ నూతన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ‘మిషన్ 500’గా నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల వస్తు, సేవల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్థారించారు.ఇది కూడా చదవండి: నాగ్పూర్లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు -
Earthquake: ఆఫ్ఘనిస్థాన్లో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు
కాబూల్: మయన్మార్లో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో స్వల్ప వ్యవధిలో రెండుమార్లు భూకంపం సంభవించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిముషాల వ్యవధిలో భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. EQ of M: 4.7, On: 29/03/2025 05:16:00 IST, Lat: 36.50 N, Long: 71.12 E, Depth: 180 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/F4P212Y0hC— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025ఆఫ్ఘనిస్థాన్లో ఈరోజు (శనివారం, మార్చి 29) ఉదయం సంభవించిన భూప్రకంననలు(Earthquakes) ప్రజలను వణికింపజేశాయి. స్వల్ప వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన రెండు ప్రకంపనల తీవ్రత వరుసగా 4.7, 4.3 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:51.. 5:16 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం కారణంగా జనం తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. మార్చి 28న మయన్మార్, థాయిలాండ్లలో బలమైన ప్రకంపనలు సంభవించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్లోనూ భూకంపం సంభవించింది.EQ of M: 4.3, On: 29/03/2025 04:51:37 IST, Lat: 36.59 N, Long: 71.12 E, Depth: 221 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/gPUcvvaCpb— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.ఇది కూడా చదవండి: Earthquake: మయన్మార్లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనం పరుగులు -
Earthquake: మయన్మార్లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనం పరుగులు
నేపిడా: మయన్మార్లో శుక్రవారం (మార్చి 28) ఉదయం భూకంపం(Earthquake) విధ్వంసం సృష్టించింది. ఇదిమరువకముందే రాత్రి మరోమారు భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. మళ్లీ పెను భూకంపం వచ్చిందేమోనంటూ వణికిపోయారు. అయితే ఇది అంత శక్తివంతమైనది కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 28న రాత్రి 11.56 గంటలకు మయన్మార్(Myanmar)లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి 10 మీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపానికి ముందు పగటిపూట వరుసగా సంభవించిన రెండు భూకంపాలలో 150 మందికి పైగా జనం మరణించారని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. శుక్రవారం ఉదయం సంభవించిన భూ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. పొరుగు దేశమైన థాయిలాండ్పై కూడా భూకంపం తీవ్ర ప్రభావం చూపింది. భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మయన్మార్లో తీవ్ర భూకంపం సంభవించిన దరిమిలా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇది కూడా చదవండి: Earthquake Updates: ఎటు చూసినా విషాదమే! -
Earthquake Updates: మయన్మార్లో మరోసారి భూకంపం
Earthquake Live Rescue OP Updatesమయన్మార్లో మరోసారి భూకంపం👉రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.1 గా నమోదు👉భారీగానే భూకంప మృతులు.. శిథిలాల కింద వందల మందిమయన్మార్, పొరుగున ఉన్న థాయ్లాండ్కు భారీ భూకంపం తీరని నష్టం కలుగ జేసింది.ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యికి పైగా చేరిందిసగాయింగ్ కేంద్రంగా శుక్రవారం మధ్యాహ్నాం 12.50గం. 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంనిమిషాల వ్యవధిలో మరో భారీ భూకంపం.. ఆపై స్వల్ప తీవ్రతతో పలుమార్లు కంపించిన భూమికేవలం 10 కి.మీ. లోతులో భూకంపం ఏర్పడడంతో భారీ నష్టంఈ ప్రభావంతో పొరుగున ఉన్న.. భారత్, చైనా, కంబోడియా, లావోస్, బంగ్లాదేశ్లలోనూ కంపించిన భూమి థాయ్లాండ్లో ఛాటుఛక్ మార్కెట్లో కుప్పకూలిన నిర్మాణంలోని భారీ భవనం10 మంది మృతి.. శిథిలాల కింద చిక్కుకున్న 100 మందిప్రపంచ దేశాల తక్షణ సాయంఏ దేశమైనా సరే.. ఏ సంస్థ అయినా సరే.. మయన్మార్కు ఆపన్న హస్తం అందించాలని ప్రపంచ దేశాల సాయం కోరుతున్న జుంటూ మిలిటరీ చీఫ్ అవుంగ్తక్షణమే స్పందించి సాయానికి ఆదేశించిన ప్రధాని మోదీభారత్ తరఫున ప్రత్యేక విమానాల్లో ఇప్పటికే చేరుకున్న సాయపు సామాగ్రియూరప్ దేశాలతో పాటు అమెరికా సాయం ప్రకటనథాయ్లో భారతీయులు సేఫ్భూకంపంపై అత్యవసర సమావేశం నిర్వహించిన థాయ్ ప్రధాని షినవత్రాభారతీయులంతా సురక్షితంగానే ఉన్నారని ప్రకటించిన ఎంబసీఅయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన👉వెయ్యి దాటిన భూకంప మృతులుమయన్మార్, థాయ్లాండ్లో వెయ్యి దాటిన మృతుల సంఖ్యమయన్మార్లోనే మృతులు అత్యధికంశిథిలాల నుంచి పలువురిని రక్షిస్తున్న సహాయక బృందాలు 👉 మయన్మార్, థాయ్లాండ్లో మృత్యు ఘోషభారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యు ఘోషమయన్మార్, థాయ్లాండ్లో 700కి పెరిగిన భూకంప మృతుల సంఖ్యఒక్క మయన్మార్లోనే 694 మంది మృతి, 1500 మందికి పైగా గాయాలుబ్యాంకాక్లో ఇప్పటిదాకా 10 మంది మృతి చెందినట్లు ప్రకటనసహాయక చర్యల్లో భాగంగా.. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు సజీవంగా బయటపడుతున్నవాళ్ల సంఖ్య తక్కువేరెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలుమయన్మార్లో కూలిపోయిన సగాయింగ్ బ్రిడ్జిశిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయంమృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండొచ్చని అమెరికా సంస్థ అంచనా 👉 భూకంపం ధాటికి బ్యాంకాక్లో కుప్పకూలిన భారీ భవనంకుప్పకూలిన 33 అంతస్తుల భవనంనాలుగు మృతదేహాల వెలికితీత90 మంది ఆచూకీ గల్లంతుకొనసాగుతున్న శిథిలాల తొలగింపు👉మయన్మార్, థాయ్లాండ్లో ప్రకృతి విలయం200 దాటిన మృతుల సంఖ్యమయన్మార్లో నేలమట్టమైన 40 భారీ అపార్ట్మెంట్లుబ్యాంకాక్లోనూ కూలిన భవనాలుశిథిలాల కింద వందలాది మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలురక్షించాలంటూ శిథిలాల నుంచి కేకలుఅయినవాళ్ల కోసం కన్నీళ్లతో గాలిస్తున్న పలువురుమృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా👉అఫ్గాన్లో భూకంపంరిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రత నమోదుఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ👉భూకంప బాధితులకు భారత్ ఆపన్న హస్తం15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్కు పంపించిన భారత్గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ 👉మయన్మార్లో మళ్లీ భూకంపంమయన్మార్ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్లాండ్లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్లాండ్లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్లాండ్లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశంA huge earthquake hits Bangkok Capita Thai and Mayanmar.#trending #breakingnews #viralreels #viral #earthquake #bangkok #mayanmar #NEW pic.twitter.com/AoNn9P30Oq— Dr Maroof (@maroof2221) March 28, 2025👉హృదయ విదారకం మయన్మార్, థాయ్లాండ్ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు👉మయన్మార్, థాయ్లాండ్ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్లాండ్లో భారతీయుల సహాయార్థఇండియన్ ఎంబసీ హెల్ప్లైన్థాయ్లాండ్లో హెల్ఫ్లైన్ నెంబర్ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ ఫలకాలపై ఉన్నందున మయన్మార్కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్ ఫాల్ట్గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్లాండ్, మయన్మార్మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్లాండ్లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్లో.. అటు థాయ్ రాజధాని బ్యాంకాక్లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి -
అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారులు 636 మంది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 636 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరిలో 341 మంది చార్టెర్డ్ విమానాల్లో, 55 మంది పనామా నుంచి వాణిజ్య విమానాల్లో, మిగతా 240 మంది వేర్వేరు వాణిజ్య విమానాల్లో చేరుకున్నారని లోక్సభలో విదేశాంగ శాఖసహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అమెరికాలో ఉంటున్న 18 వేల మంది భారతీయ అక్రమ వలసదారులను వాపసు తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వచ్చిన వార్తలపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ప్రశ్నించగా..విదేశాల్లో ఉండే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత దేశాలదేనని మంత్రి చెప్పారు. భారత్ ఒక్కటే కాదు..అంతర్జాతీయ సంబంధాల్లో అందరూ అంగీకరించిన సూత్రమని చెప్పారు. తమ నిర్బంధంలో ఉన్న మరో 295 మంది వ్యక్తుల సమాచారాన్ని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మన అధికారులకు అందజేసిందని మంత్రి చెప్పారు. వీరు మన జాతీయులేనా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వం తిప్పి పంపేవారికి అవసరమైన సాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. -
వైట్ హౌస్లో ట్రంప్ ఇఫ్తార్ విందు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంజాన్ సందర్బంగా గురువారం వైట్ హౌస్లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వర్గం నేతలు, దౌత్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చారిత్రక అబ్రహాం ఒడంబడికల ప్రాతిపదికగా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. గత బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్, ఏడు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో గతంలో ట్రంప్ ప్రభుత్వం హయాంలో కుదిరిన అబ్రహాం ఒప్పందాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారడం, గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ట్రంప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం.