Yadadri
-
అన్నదాతను వీడని అకాల వర్షం
అడ్డగూడూరు : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి కోటమర్తి, చిర్రగూడూరు, అడ్డగూడూరు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కాంటా వేసిన వడ్లబస్తాలు తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలులకు అడ్డగూడూరు మండల కేంద్రంలో రామనర్సయ్య, మొత్కు బ్రహ్మయ్యకు చెందిన ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. దీంతో ఇళ్లలోని సామగ్రి తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. నేటి నుంచి ఎంజీయూకు వేసవి సెలవులు నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీ పరిధిలోని పీజీ, బీఈడీ, ఎంఈడీ కాలేజీలకు గురువారం నుంచి ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, డిగ్రీ కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు. -
వేసవి ఆటలకు వేళాయే..
క్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలివే.. వాలీబాల్: వలిగొండ జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (పి.సాయికుమార్), మల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (వినోద్కుమార్), నారాయణపురం జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (సుక్క గిరిబాబు), శారాజీపేట జెడ్పీహెచ్ఎస్ శిక్షకుడు (మధుసూదన్). ఖోఖో: వలిగొండ (మత్య్సగిరి), మర్యాల (కె.గోపాల్), అనాజీపురం జెడ్పీహెచ్ఎస్, (ఆంజనేయులు). అథ్లెటిక్స్: మర్యాల, శిక్షకుడు (సునీల్) తైక్వాండో: జూలూరు జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (కృష్ణ), నారాయణపురం జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (భరత్కుమార్). భువనగిరి: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు వెలికి తీసేందుకుగాను ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షకుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించి 10 మందిని ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. రూ.50వేల నిధులు క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ. 50వేలు రానున్నాయి. ఇందులో క్రీడా సామగ్రి కొనుగోలు, ప్రథమ చికిత్సకు రూ.10వేలు, ఒక్కో శిక్షకుడికి రూ. 4వేల చొప్పున 10 మందికి రూ. 40వేలు రానున్నాయి. శిబిరాల నిర్వహణకు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. యువజన క్రీడల సర్వీసుల అధికారి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. వీళ్లు అర్హులు: శిబిరాల్లో 14 ఏళ్ల లోపు బాలబాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ శిబిరాల్లో నాలుగు రకాల క్రీడలు ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఇందులో ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ ఉన్నాయి. ఆన్లైన్లో నమోదు: శిబిరాలకు వచ్చే విద్యార్థుల వివరాలు గతంలో శిక్షకులు నమోదు చేసుకునే వారు. ఇందుకోసం ప్రత్యేకంగా హాజరు రిజిస్టర్ నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి క్రీడాకారుల వివరాలు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. నేటి నుంచి విద్యార్థులకు క్రీడా శిక్షణ ఫ జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు ఏర్పాటు ఫ 14ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం -
టెన్త్లో 7 వ స్థానం
గురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025సాక్షి,యాదాద్రి : పదో తరగతి పరీక్షలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించింది. 97.80 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. గత ఏడాది 26 స్థానంలో నిలవగా.. ఈసారి 19 ర్యాకులు మెరుగుపడింది. జిల్లా ఆవిర్భావం తరువాత ఇదే అత్యధిక ఉత్తీర్ణత కావడం గమనార్హం. ఏప్రిల్ 3నుంచి 24వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 8,631 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 8,432 మంది (97.80శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.బాలురు 4,215 మందికి 4,111(97.5శాతం), బాలికలు 4,407 మందికి 4,321 (98శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. సత్తాచాటిన ప్రభుత్వ విద్యార్థులు జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 266 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 159 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో ప్రైవేట్ 54 పాఠశాలలు ఉన్నాయి. 81 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించాయి. ఇంకా కస్తూర్బాగాంధీ విద్యాలయాలు 5, నాలుగు బీసీ గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదే విధంగా ఒకే ఒక విద్యార్థి ఉన్న సీఎస్ఐ గుండ్లగూడెం విద్యార్థి పాసయ్యాడు. వలిగొండ(బీబీనగర్)లోని జ్యోతిబా పూలే గురుకుల విద్యార్థినులు సాయి మేఘన 582, సాత్విక 578 మార్కులు సాధించారు. పక్కా ప్రణాళికతో.. ఉత్తమ ఫలితం రాష్ట్రస్థాయిలో యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ టెన్లో నిలువడం వెనుక కలెక్టర్, విద్యాశాఖ అధికారుల కృషి ఎంతగానో ఉంది. గత ఏడాది జిల్లా ర్యాంకు రాష్ట్రస్థాయిలో 25 స్థానానికి పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అటువంటి పరి స్థితి పునరావృతం కాకుండా కలెక్టర్ హనుమంతరావు చొరవతో విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పక్కాగా అమలు చేసింది. కలెక్టర్తో పాటు డీఈఓ సత్యనారాయణ, విద్యాశాఖతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు నిరంతరం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ప్రత్యేక తరగతులను పర్యవేక్షించారు. ఉపాధ్యాయులతో ప్రతి వారం జూమ్ మీటింగులు నిర్వహించి అప్రమత్తం చేశారు. అంతేకాకుండా కలెక్టర్ సొంత ఆలోచనతో విద్యార్థులకు మార్నింగ్ వేకప్ కాల్ చేయడం, విద్యార్థి ఇంటి తలుపుతట్టి కార్యక్రమాలను పక్కాగా అమలు చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లతో పాటు అధికారులు, ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకున్నారు.కౌన్సెలింగ్ ఇస్తూ సబ్జెక్టుల వారీగా శ్రద్ధ తీసుకున్నారు.100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పరీక్షలకు సన్నద్ధం చేశారు. జ్యోతిబా పూలే రెసిడెన్సియల్ స్కూల్, వలిగొండఈఓగా బాధ్యతల స్వీకరణ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. - IIలోన్యూస్రీల్ఫలితాల్లో మెరిసిన యాదాద్రి జిల్లా.. 97.80 శాతం ఉత్తీర్ణత ఫ గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రస్థాయిలో 19 స్థానాలు మెరుగు ఫ 159 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత ఫ వలిగొండ జ్యోతి బా పూలే గురుకుల విద్యార్థినులకు అత్యధిక మార్కులు ఫ ఫలించిన కలెక్టర్, విద్యాశాఖ అధికారుల కృషి ఎక్కువ మార్కులు సాధించిన 65 మంది విద్యార్థులకు సైకిళ్లు : కలెక్టర్పరీక్షల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అత్యధిక మార్కులు సాధించిన 65 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తానని కలెక్టర్ తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు గాను బుధవారం తన చాంబర్లో ఇంచార్జి డీఈఓ, అదనపు కలెక్టర్, అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఇంచార్జ్ డీఈఓ ప్రశాంత్రెడ్డిని కలెక్టర్ సన్మానించి అభినందనలు తెలిపారు. ఎక్కువ మార్కులు సాధించి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా త్వరలో సన్మానం చేస్తానని కలెక్టర్ ప్రకటించారు. ప్రత్యేక కార్యాచరణ అమలుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయడం వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న విద్యాసంవత్సరం జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి (రెవె న్యూ), భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీఆర్డీఓ విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎస్.జగన్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఉత్తీర్ణత శాతంపాఠశాల విద్యార్థులు ఉత్తీర్ణులు శాతం వందశాతం ప్రభుత్వ స్కూళ్లు 231 209 90.5 - జెడ్పీహెచ్ఎస్ 3,637 3,515 96.6 81 టీజీఎం 585 574 98.1 03 కేజీబీవీ 462 445 96.3 05 టీఎస్ఆర్ఈఐఎస్ 235 235 100 03 ఎస్టీ ఆశ్రమ 16 16 100 01 ఎంజేపీటీబీసీ 271 271 100 04టీఎంఆర్ఈఐఎస్ 114 114 100 03టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 523 521 99.6 05 ఎయిడెడ్ 01 01 -100 01 ప్రైవేట్ స్కూళ్లు 2,556 2,531 99 54 జిల్లా ఆవిర్భావం తరువాత ఫలితాలు సంవత్సరం ఉత్తీర్ణత శాతం జిల్లా స్థానం 2016–17 80.95 25 2017–18 82.98 19 2018–19 95.57 162019–20 100 కోవిడ్ 2020–21 100 కోవిడ్ 2021–22 93.61 13 2022–23 80.97 23 2023–24 90.44 252024–25 97.80 07 -
భరత్చంద్రచారి.. కంగ్రాట్స్
సంస్థాన్ నారాయణపురం : ‘భరత్చంద్రచారి కంగ్రాట్స్.. నేను జిల్లా కలెక్టర్ను మాట్లాడుతున్న.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. మొదటగా నీ ఫలితాలే చూశా.. మధ్యలో చదువు అపినప్పటికీ ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించావు.. 73 శాతం మార్కులు వచ్చాయి.. సెకండ్ లాంగ్వేజ్లో తక్కువగా వచ్చినా గణితంలో 86 మార్కులు సాధించావు.. ఒకటిరెండు రోజుల్లో మీ ఇంటికి వస్తా’ అని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో సంస్థాన్నారాయణపురం మండలం కంకణాలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దేశ్యతండాలో నివాసం ఉంటున్న దేవరకొండ భరత్ చంద్రచారికి బుధవారం కలెక్టర్ కాల్ చేసి అభినందించారు. పాలిటెక్నిక్ ఎంట్రెన్స్కు ప్రిపేర్ కావాలని సూచించారు. పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చని, అది వద్దనుకుంటే ఐటీఐ చేయమని సలహా ఇచ్చారు. బాసర్ ట్రిపుల్ ఐటీలోనూ దరఖాస్తు చేయాలన్నారు. అనంతరం అతని తల్లి విజయలక్ష్మితో కలెక్టర్ మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్. మీ ప్రోత్సాహం వల్లే..కలెక్టర్ మాటలకు విద్యార్థి భరత్ చంద్రచారి ఆనందం వ్యక్తం చేశారు. మీ ప్రోత్సాహంతో చదవగలిగా సర్.. అని సమాధానం ఇచ్చారు. విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమానికి భరత్ చంద్రచారి ఇంటినుంచే శ్రీకారం టెన్త్లో 100శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని దేశ్యాతండాలో భరత్ చంద్రచారి ఇంటి నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.ఫ దేశ్యతండాలో దత్తత తీసుకున్న విద్యార్థికి కలెక్టర్ ఫోన్ కాల్ ఫ పదో తరగతిలో మంచి మార్కులు సాధించావంటూ కితాబు -
మహాత్మా శ్రీ బసవేశ్వరకు నివాళి
భువనగిరిటౌన్ : సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వర జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంపై అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వర అని, జగత్ గురువుగా వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ వారిచ్చి న శాంతి సందేశం పాటించినట్లయితే ఉద్రిక్త వాతావరణం ఉండదన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ సమాజ చైతన్యానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందుల్లేవుసాక్షి,యాదాద్రి : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయని, కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. బుధవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కలెక్టర్లు, పౌరసరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 366 కేంద్రాల ద్వారా 76,561 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 176.82 కోట్లకు గాను రూ.85.66 లక్షలు చెల్లించినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, సివిల్ సప్లై జిల్లా అధికారి రోజారాణి, జిల్లా మేనేజర్ హరికృష్ణ, జిల్లా సహకార అధికారి మురళీ, వ్యవసాయ శాఖ అధికారి నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికే ‘భూ భారతి’
యాదగిరిగుట్ట : రెవెన్యూ వ్యవస్థను బలోపేతానికి చేయడమే భూ భారతి పోర్టల్ ఉద్దేశమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. భూ భారతి చట్టంపై యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి ఆధార్లాగా ప్రతి రైతు భూమికి ప్రభుత్వం భూధార్ కార్డు జారీ చేస్తుందన్నారు. భూ రికార్డుల్లో మార్చి ప్రభుత్వ, భూధాన్, అసైన్డ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసే అధికారం సీసీఎల్ఏకు ఉంటుందన్నారు. ధరణి వల్ల భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ భూ భారతి చట్టంతో సులభంగా పరిష్కారం అవుతాయన్నారు. అంతకు ముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, భూభారతి చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఇంచార్జ్ తహసీల్ధార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ నవీన్కుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ అయిలయ్య -
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
నల్లగొండ: రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మక్తల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా పరిశీలకుడు వాకటి శ్రీహరి అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికే రానున్న ఎన్నికల్లో, ఇతర పదవుల్లోనూ అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జూకూరి రమేష్, అంకతి సత్యం, మహిళా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నల్లగొండ జిల్లా పరిశీలకుడు, మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి -
ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత
మోటకొండూర్: మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. తమకు న్యాయం చేయాలని మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో బుధవారం ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. కాటేపల్లి ప్రధాన రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. నాలుగు గంటల పాటు మోత్కూరు–రాయిగిరి రోడ్డును దిగ్భందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. బాధిత కుటుంబాలను భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వేర్వేరుగా వచ్చి పరామర్శించారు. తగిన న్యాయం చేయటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కంపెనీలో పేలుడు సంభవించిన స్థలాన్ని పరిశీలించారు. మృతులకు రూ.కోటి నష్టపరిహారం.. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ యాజమాన్యంతో భువనగిరిలోని ఓ హోటల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్, పలువురు నాయకులు చర్చలు జరిపారు. దీంతో పరిశ్రమ యాజమాన్యం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా రూ.50లక్షలు, మిగతా రూ.50లక్షలు తర్వాత చెల్లిస్తామని ఒప్పుకున్నారు. గాయపడిన వారికి తక్షణ సహాయం కింద రూ.5లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆస్పత్రి ఖర్చులు భరిస్తామని, తిరిగి వారు పనిలో చేరేవరకు పూర్తి జీతం, అంగవైక్యం సంభవిస్తే తగిన న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. దీంతో ఆందోళన విరమించారు. రెండు మృతదేహాల వెలికితీత.. రియాక్టర్ పేలుడు ధాటికి మాంసం ముద్దలుగా మారి శిథిలాల కింద చిక్కుకున్న మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన చెన్నోజి దేవిచరణ్, కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్ మృతదేహాలను బుధవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పోలీసులు వెలికితీసి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సందీప్ తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కంపెనీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ప్రొడక్షన్ మేనేజర్ శ్రీకాంత్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపారు. న్యాయం చేయాలని బాధితుల కుటుంబ సభ్యుల ఆందోళన మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.కోటి ఇస్తామని యాజమాన్యం హామీ క్షతగాత్రులకు రూ.5లక్షల ఆర్థికసాయంనరేష్ అంత్యక్రియలు పూర్తిఆత్మకూరు(ఎం): ఈ ఘటనలో మృతిచెందిన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్(32) అంత్యక్రియలను మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు. నరేష్ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అంత్యక్రియలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
‘పది’లో జయ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం
సూర్యాపేటటౌన్: పదో తరగతి ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు 587 మార్కులు, 15 మంది విద్యార్థులు 580పైగా మార్కులు, 52 మంది విద్యార్థులు 570పైగా మార్కులు, 106 మంది విద్యార్థులు 560 పైగా, 154 మంది విద్యార్థులు 550పైగా మార్కులు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ తెలిపారు. వి. హాసిని, కె. శ్రేష్ట, ఎం. అనన్య, ఎం. శ్రీదేవి 587 మార్కులు, కె. శరణ్య 586 మార్కులు, లోకేష్ 585, సాయి చర్విత, శ్రీజ 584 మార్కులు, చాణక్య, హర్షవర్దని 583 మార్కులు, రేవంత్రెడ్డి, మన్విత, ప్రగతి, వేద 580 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు అభినందించారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● 14 బైక్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్నల్లగొండ: బైక్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం వాడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 14 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన నలమాల ఎర్రబ్బాయి అలియాస్ లూథర్, అదే గ్రామానికి చెందిన గంజి అంకమరావు, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపహాడ్ గ్రామానికి చెందిన వట్టిపల్లి శ్రీకాంత్ ముఠాగా ఏర్పడి బైక్లు చోరీ చేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. నలమాద ఎర్రబాబు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ, దామరచర్ల, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు ఏపీలోని మార్టూరు, పొన్నూరులో ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, వైన్స్లు, రాత్రివేళ ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లను చోరీ చేసి వాటిని గంజి అంకమరావు, మట్టిపల్లి శ్రీకాంత్తో కలిసి తక్కువ ధరకు విక్రయించేవాడు. బుధవారం ఉదయం వాడపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రబ్బాయి, అంకమరావు చోరీ చేసిన బైక్లను అమ్మడానికి దామరచర్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా.. అనుమానం వచ్చి ఎస్ఐ వారిని పట్టుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మట్టిపల్లి శ్రీకాంత్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు, ఏడు పల్సర్ బైక్లు, ఒక షైన్ బైక్ను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.26.50 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ముగ్గురు నిందితులపై వాడపల్లి పోలీస్ స్టేషన్లో 3, నల్లగొండ వన్టౌన్, టూటౌన్, రూరల్ పోలీస్ స్టేషనల్లో ఒక్కోటి చొప్పున, నార్కట్పల్లి పీఎస్లో 2, ఇబ్రహీంపట్నం పీఎస్లో 1, ఏపీలోని మార్టూర్ పీఎస్లో 2, పొన్నూరు పీఎస్లో 1, రాజమండ్రిలో 1 కేసు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. మొత్తం 22 బైక్లు దొంగిలించినట్లుగా నిందితులు అంగీకరించారని, మిగతా వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ తెలిపారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్, సీసీఎస్ సీఐ డానియేల్, వాడపల్లి ఎస్ఐ ఎ. శ్రీకాంత్రెడ్డి, పోలీస్ సిబ్బంది సతీష్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీద్, సీసీఎస్ సిబ్బంది విష్ణువర్ధనగిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్రెడ్డిని ఎస్పీ అభినందించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బైక్లు -
జీవితంపై విరక్తితో బిల్డర్ ఆత్మహత్య
నల్లగొండ: వ్యాపారంలో నష్టాలు రావడంతో జీవితంపై విరక్తితో బిల్డర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగింది. టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. అమ్మనబోలు మండలం బెండలపహాడ్ గ్రామానికి చెందిన జిల్లా యాదగిరి(45) నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని రాక్హిల్స్ కాలనీలో నివాసముంటూ బిల్డర్గా పనిచేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో యాదగిరి మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో అతడు బుధవారం రాక్హిల్స్ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు గాయాలుభువనగిరిటౌన్: ట్రాఫిక్ మళ్లిస్తున్న కానిస్టేబుల్ కాలు పైనుంచి గూడ్స్ వాహనం వెళ్లడంతో గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. భువనగిరి పట్టణంలోని గంజ్ మార్కెట్ యార్డులో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ వాహనాలు వెళ్తుండడంతో భువనగిరి పట్టణానికి చెందిన కానిస్టేబుల్ మురళి ట్రాఫిక్ను మళ్లిస్తున్న క్రమంలో అతడి కాలు పైనుంచి గూడ్స్ వాహనం వెళ్లింది. దీంతో కానిస్టేబుల్ మురళి కిందపడిపోవడంతో స్థానికులు అతడిని పైకి లేపి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసు వాహనంలో మురళిని ఆస్పత్రికి తరలించారు. పిడుగుపాటుతో రెండు ఎద్దులు, గేదె మృతిడిండి: డిండి మండల కేంద్రానికి చెందిన బద్దెల బచ్చలు తన వ్యవసాయ పొలం వద్ద గేదెను కట్టేయగా.. బుధవారం కురిసిన వర్షానికి పిడుగుపడి గేదె మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. అదేవిధంగా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జబ్బు పెద్దయ్య వ్యవసాయ పొలంలో పిడుగు పడడంతో సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే రెండు ఎద్దులు మృతిచెందాయి. కుక్కల దాడిలో గొర్రె పిల్లలు..నడిగూడెం: కుక్కల దాడిలో 31 గొర్రె పిల్లలు మృతిచెందాయి. ఈ ఘటన బుధవారం నడిగూడెం మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఒట్టె సతీష్ తన గొర్రెలను మేత కోసం శివారు ప్రాంతానికి తోలుకెళ్లాడు. ఈ క్రమంలో గొర్రె పిల్లలను ఇంటి వద్దే ఉంచగా.. వాటిపై కుక్కలు దాడి చేయడంతో 31 గొర్రె పిల్లలు మృతి చెందాయి. మృతిచెందిన గొర్రె పిల్లల విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి హల్చల్హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ రాక ముందే గుడిమల్కాపురం గ్రామానికి చెందిన రైతు దొంగరి నాగరాజు వచ్చి తమకు దొండపాడు శివారులోని 187, 200 సర్వే నంబర్లలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కావడంలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపాడు. పోలీసులు, స్థ్ధానికులు అతడిని సముదాయించారు. అనంతరం సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ అన్నారు. -
ప్రజా వ్యతిరేక విధానాలపై తిరుగుబాటు తప్పదు
గట్టుప్పల్: ప్రజా వ్యతిరేక విధానాలు అవలబించే ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెట్టుబడిదారులు, భూ స్వాములకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతు న్నాయన్నారు. కూలీలు, కార్మికుల హక్కుల కోసం ఎర్రజెండా అలుపులేకుండా పోరాడుతోందన్నారు. ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకూ ఎర్రజెండాను అంతం చేయడం ఎవ్వరి తరం కాదన్నారు. మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడతోందని విమర్శించారు. మే 1 నుంచి 8వ తేదీ వరకు కార్మిక వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటాలకు పార్టీ నాయకులు కలిసి నివాళులు అర్పించారు. జాన్వెస్లీ రాక సందర్భంగా గట్టుప్పల్లో నిర్వహించిన ర్యాలీలో కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఆ పార్టీ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, నాయకులు కట్ట నర్సింహ, సుర్కంటి శ్రీనివాస్రెడ్డి, బండ శ్రీశైలం, చాపల మారయ్య, శంకర్, నాంపల్లి చంద్రమౌళి, రవీందర్రెడ్డి, కర్నాటి సుధాకర్, పెద్దులు, దోనూరి నర్సిరెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలిసంస్థాన్ నారాయణపురం: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో వెంటనే శాంతియుతంగా చర్చలు జరపాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సంస్థాన్ నారాయణపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో కర్రి గుట్టల్లో ఆదివాసీలను చుట్టుముట్టి చంపుతున్నారని, కర్రిగుట్టల్లో సహజ ఖనిజాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వాటిని ప్రైవేట్ వారికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే నివేదికను బహిర్గతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ ప్రజాసమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఉన్నారు. అంతకుముందు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
సర్వేల్ గురుకులంలో 100శాతం ఉత్తీర్ణత
సంస్థాన్ నారాయణపురం: సర్వేల్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. 85మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 85మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సండ్ర స్వాతిక్ 600 మార్కులకు గాను 555 మార్కులు సాధించి పాఠశాల టాపర్గా నిలువగా, 540పైగా మార్కులు సాధించిన వారు 15మంది విద్యార్థులున్నారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్కుమార్ అభినందించారు. నృసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్యిక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ఆలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు, ముఖ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికిశయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
గుట్ట ఈఓగా వెంకట్రావ్ బాధ్యతల స్వీకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ఈఓగా వెంకట్రావ్ (ఐఏఎస్) బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా వెంకట్రావ్ను దేవాదాయశాఖ డైరెక్టర్గా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం.. అదనంగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా బాధ్యతలు అప్పగించింది. బుధవారం సాయంత్రం గర్భాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఈఓ చాంబర్లో బాధ్యతలు స్కీరించారు. ఆలయ రికార్డులను, పత్రాలను బదిలీ అయిన భాస్కర్రావు నూతన ఈఓకు అప్పగించారు. నూతన ఈఓ, బదిలీపై వెళ్తున్న భాస్కర్రావును అర్చకులు, ఆలయ ఉద్యోగులు సన్మానించారు. అనంతరం నూతన ఈఓ క్యూలైన్లో నిల్చున్న భక్తులను పలకరించారు. దర్శనానికి ఎక్కడి నుంచి వచ్చారు, క్యూలైన్లలో ఎలా ఉందని తెలుసుకున్నారు. అలాగే పెండింగ్ పనులు, నూతన నిర్మాణాలు, పూజలకు సంబంధించిన అంశాలను అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, పాత ఈఓ భాస్కర్రావు, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా భాస్కర్రావుకు ప్రభుత్వం ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. ఏదుళ్ల మధుసూదన్రెడ్డికి ఘన సన్మానంనల్లగొండ: డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తూ బుధవారం పదవీ విరమణ పొందిన ఏదుళ్ల మధుసూదన్రెడ్డిని డీఈఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు డీఈఓ భిక్షపతి సన్మాన పత్రం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ిపీఏగానూ సేవలు అందించిన ఏదుళ్ల మధుసూదన్రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో ఉండాలని డీఈఓ ఆకాంక్షించారు. డీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఏదుళ్ల మధుసూదన్రెడ్డి, జ్యోతి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, విద్యాశాఖ ఏడీ రమాచారి, ఏసీజీఈ యూసుఫ్ షరీఫ్, ఏఎంఓ రామచంద్రయ్య, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సత్తెమ్మ, డీసీసీబీ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్, యేసు ఆదినారాయణ, సూపరింటెండెంట్ మోహన్, మధుసూదన్రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్
నల్లగొండ, గుర్రంపోడు: ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) ప్రధాన కాల్వ సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.442 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి పరిపాలనా అనుమతులు సైతం ఇస్తూ బుధవారం నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 23.500 కిలోమీటర్ల నుంచి మూసీ వరకు గల 136.150 కిలోమీటర్ల లైనింగ్కు 113 కిలోమీటర్ల మేర కాల్వ సిమెంట్ కాంక్రీట్ చేయనున్నారు. ఇటీవలే అధికారులు ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే నేరుగా కృష్ణాజలాలు అందే 23వ కిలోమీటర్ కామన్ పాయింట్ నుంచి ప్రధాన కాల్వకు సీసీ లైనింగ్ పనులు మొదలవుతాయి. బిడ్లుగా విభజించి త్వరలో టెండర్లు పిలువనున్నారు. కాల్వకు నీటి విడుదల జరగని జూలైలోగా కాల్వ సీసీ లైనింగ్ పనులు చేపట్టేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎట్టకేలకు సీసీ లైనింగ్ .. 1984లో తవ్విన ప్రధాన కాల్వకు దశాబ్దాలు గడిచినా కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో కాల్వగట్టు శిథిలమై నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయింది. 3వేల క్యూసెక్కుల సామర్థ్యం గల ప్రధాన కాల్వలో 1,200 క్యూసెక్కుల నీటి ప్రవాహ కొనసాగుతుండగా మధ్యలోనే లీకేజీలతో చివరకు నీరు చేరే సరికి సగానికి తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెంటనే లైనింగ్ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు విన్నవించారు. దీంతో ఎట్టకేలకు లైనింగ్ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. లైనింగ్ పూర్తయితే 3వేల క్యూసెక్కుల నీటితో 1.5 టీఎంసీల నీటి సామర్థ్యం పానగల్ రిజర్వాయర్ను నిండడానికి పది, పదిహేను రోజులే పట్టనుంది. ప్రధాన కాల్వ సీసీ లైనింగ్ వల్ల సుమారు 2.20లక్షల ఎకరాల్లోని ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు కూడా సాగు నీరందుతుందని అధికారులు భావిస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ పాలనా ఉత్తర్వులు ఇచ్చినందుకు గాను సీఎం అనుముల రేవంత్రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూ.442 కోట్ల నిధులతో పరిపాలనా అనుమతులు ఉత్తర్వులు జారీ చేసిన నీటిపారుదల శాఖ త్వరలోనే టెండర్లకు ఆహ్వానం సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి -
మళ్లీ తెరపైకి ‘రాచకొండ’ రిజర్వాయర్లు
సంస్థాన్ నారాయణపురం: రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మించి శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ల ద్వారా ఆ ప్రాజెక్టులను నింపుతామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సోమవారం సంస్థాన్ నారాయణపురంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ప్రకటించారు. యాద్రాది భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో రాష్ట్ర రాజధానికి చేరువలో రాచకొండ ప్రాంతం విస్తరించి ఉంది. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో ఒకటి, చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో మరొక రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధవుతున్నాయి. ఈ రిజర్వాయర్ల నిర్మాణంపై నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి విన్నవించారు. నీళ్లు ఉంటేనే రాచకొండ అభివృద్ధి.. హైదరాబాద్కు అతి చేరువులో యాద్రాది భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో సుమారు 35వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతం రాచకొండ. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములున్నాయి. ఈ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం, ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, స్మార్ట్ సిటీ, పవన విద్యుత్ ఉత్పత్తి లాంటివి ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ఈ మేరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ ప్రాంతంలో సరైన నీటి వసతి లేక ప్రతిపాదనలు మూలనపడ్డాయి. రైతుల్లో చిగురిస్తున్న ఆశలు.. ఓ వైపు ఫ్లోరైడ్తో, మరోవైపు సాగుజలాలు లేక బీడు భూములుగా మారిన చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా, కరువు పరిస్థితులు భవిష్యత్ అవసరాలకు రిజర్వాయర్లు ఎంతో దోహదం చేస్తాయి. రాచకొండలో ప్రకృతి అందాలతో ఉన్నప్పటికి వేసవి కాలం వస్తే మోడుబారిన చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ రిజర్వాయర్లు నిర్మిస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందాడానికి అవకాశం ఉంది. రాచకొండ అటవీ ప్రాంతంలోని మూగ జీవాల దాహార్తి కూడా తీరుతుంది. రిజర్వాయర్ల నిర్మాణంతో బీడు భూములు సస్యశ్యామలం అవుతాయని, భూగర్భజలాలు వృద్ధి చెందుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ప్రాంత స్వరూపం, ఇక్కడి ప్రజల జీవనశైలి కూడా మారిపోనుంది. ఫ చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో ఒకటి, నారాయణపురం మండలం రాచకొండ ప్రాంతంలో మరొకటి నిర్మించాలని యోచన ఫ శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ల ద్వారా ఈ రిజర్వాయర్లు నింపాలని ప్రభుత్వం ప్రతిపాదన ఫ ఉమ్మడి జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఫ పదేళ్ల క్రితమే రాచకొండలో 4 రిజర్వాయర్ల నిర్మాణానికి సర్వే చేసిన అప్పటి ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మించి నీళ్లు ఇవ్వాలి గత కొన్నేళ్లుగా రాచకొండ ప్రాంతంలో రిజర్వాయర్లు నిర్మిస్తామని చెబుతున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదు. ఇక్కడ రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు అందించి రైతుల కష్టాలు తీర్చాలి. వర్షాలు వస్తేనే పంట దిగుబడి లేకపోతే పంటలు ఎండి నష్టపోవడం మాకు పరిపాటిగా మారింది. ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా రిజర్వాయర్ల నిర్మాణాన్ని ఆచరణలో సాధ్యం చేయాలి. – నాగులపల్లి సత్తయ్య, రైతు, ఆరెగూడెం, సంస్థాన్ నారాయణపురం మండలం 10 సంవత్సరాల కిందటే సర్వే..సాగు నీటి అవసరాలు, గ్రేటర్ హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాచకొండ ప్రాంతంలో 4 రిజర్వాయర్లు నిర్మించాలని పదేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. నీటిని నిల్వ చేసేలా రిజర్వాయర్లు నిర్మించాలని హైదారాబాద్ జలమండలి అధికారులు, నిపుణులు మూడుసార్లు రాచకొండ ప్రాంతంలో పర్యటించారు. 40టీఎంసీల నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో 2, చౌటుప్పల్ మండలం డి.నాగారం చెరువు వెనుక భాగంలో ఒకటి, మల్కాపురం శివారులో మరొకటి రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రాథమికంగా 5వేల ఎకరాల భూమి అవసరమని అంచనాలు రూపొందించారు. రాచకొండ గుట్టల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ సమగ్ర నివేదికను రూపొందించే బాధ్యతలను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. నివేదక ఆధారంగా రూ.1,960కోట్ల అంచనా వ్యయంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. నివేదిక మూలనపడింది. -
వరంగల్ భద్రకాళికి పోచంపల్లి పట్టువస్త్రాలు
భూదాన్పోచంపల్లి: వరంగల్లోని శ్రీభద్రకాళి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 2న నిర్వహించే కల్యాణోత్సవానికి పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రుద్ర శ్రీశైలం, రుద్ర చెన్నకేశవులు, రుద్ర పాండురంగశాస్త్రి కుటుంబ సభ్యులు మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టువస్త్రాలను తయారు చేశారు. 15 రోజుల పాటు శ్రమించి అమ్మవారికి చిలుకపచ్చ, సాఫ్రాన్ రంగు కల్గిన రెండు ఇక్కత్ పట్టుచీరలతో పాటు స్వామివారికి పట్టు పంచెలను తయారుచేశారు. కల్యాణం రోజు ప్రదర్శనగా వెళ్లి పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలను ఈఓ కె. శేషుభారతికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తిదారుల సంఘం మాజీ అధ్యక్షుడు రుద్ర శ్రీశైలం మాట్లాడుతూ.. తాము గత ఐదు సంవత్సరాలుగా భద్రకాళి అమ్మవారికి, భద్రేశ్వర స్వామికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన దేవస్థాన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
బ్యాగేజ్ స్కానర్ ప్రారంభం
యాదగిరిగుట్ట ఆలయంలోని ధర్మ దర్శనం క్యూలైన్లో ఎక్స్రే బ్యాగేజ్ ఇన్స్పెక్షన్ స్కానర్ను ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శేషగిరిరావు, బీటీ టీం ఆర్ఎస్ఐ శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఇటీవల జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో యాదగిరిగుట్టలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ స్కానర్ ద్వారా భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులను స్కాన్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు స్కానర్లను సైతం త్వరలోనే వీఐపీ ప్రొటోకాల్ కార్యాలయం వద్ద లిఫ్టులో, ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు.. వ్యక్తి దుర్మరణం
వేములపల్లి: బైక్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్పల్లి–అద్దంకి రహదారిపై వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ డి. వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డకు చెందిన మందడి వేణుగోపాల్రెడ్డి(47) మంగళవారం ఉదయం బైక్పై నల్లగొండ సమీపంలోని మర్రిగూడలో ఉంటున్న తన బంధువు ఇంటికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి మిర్యాలగూడకు వస్తుండగా.. వేములపల్లి మండల కేంద్రంలోకి రాగానే స్థానిక జెడ్పీ హైస్కూల్ పక్క వీధి నుంచి ఒక్కసారిగా బ్లాక్ స్కార్పియో కారు వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్రెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మందడి ప్రణీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది. -
యాదగిరిగుట్ట ఆలయం అద్భుతం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం గొప్ప విషయమని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన తన స్నేహితులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం ఫలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషానిచ్చిందన్నారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రతిఒక్కరికి అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.41కోట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను మంగళవారం కొండ కింద గల శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం హాల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో భాగంగా నగదు రూ.2,41,35,238, మిశ్రమ బంగారం 143 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 250 గ్రాములు వచ్చిందని ఈఓ వెల్లడించారు. ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, సౌదీ అరేబియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ తదితర దేశాలకు సంబంధించిన కరెన్సీని సైతం భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. ఈ హుండీ ఆదాయం 34రోజులదని ఈఓ తెలిపారు. -
ప్రయాణికులను కుటుంబ సభ్యులుగా భావించాలి
యాదగిరిగుట్ట: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడిని సిబ్బంది తమ కుటుంబ సభ్యులుగా భావించి గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో మంగళవారం నల్లగొండ రీజియన్ త్రైమాసిక ప్రగతి చక్ర పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రీజియన్లోని 7 డిపోల్లో ఈ త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లతో పాటు గ్యారేజీ ఉద్యోగులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతి డ్రైవర్ బస్సులు నడపాలన్నారు. కండక్టర్లు ప్రయాణికులతో మంచిగా ప్రవర్తించాలన్నారు. గ్యారేజీలో మెకానిక్లు బస్సులను మంచి కండీషన్లో ఉంచేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆపరేషన్ సుచరిత, డిప్యూటీ రీజినయల్ మేనేజర్ మెకానికల్ ఎస్. భీమ్రెడ్డి, ఆయా డిపోల మేనేజర్లు మురళీకృష్ణ, శ్రీనాథ్, రామ్మోహన్రెడ్డి, ఎస్. లక్ష్మీనారాయణ, బి. శ్రీనివాస్, యాదగిరిగుట్ట డిపో అసిస్టెంట్ మేనేజర్ ఎం. ప్రవీణ్, రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానిక్ ఆర్. హనుమాన్ నాయక్, ఎల్. జయప్రకాష్ తదితరులున్నారు. ఫ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి ఫ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, గ్యారేజీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత -
ఖబరస్థాన్లో బయటపడ్డ పురాతన శాసనాలు
కోదాడరూరల్: కోదాడలోని రామాలయం పక్కన గల ఖబరస్థాన్లో మంగళవారం ఓ వ్యక్తిని ఖననం చేసేందుకు ముస్లింలు గొయ్యి తవ్వుతుండగా పురాతన శాసనాలు బయటపడ్డాయి. వక్ఫ్బోర్డు సభ్యులు, పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని శాసనాలను స్వాధీనం చేసుకొని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తమిళంతో పాటు పలు భాషల్లో ఉన్న రాగి పలకలు బయటపడినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిని పురావస్తు శాఖ కార్యాలయానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తహసీల్దార్ వాజిద్ అలీ, పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐ రంజిత్రెడ్డి, ఆర్ఐ రాజేష్ ఉన్నారు. -
ట్రావెల్స్ బస్సు ఢీకొని గేదెలు మృతి
నేరేడుచర్ల: ట్రావెల్స్ బస్సు ఢీకొని మూడు పాడి గేదెలు మృతి చెందాయి. ఈ ఘటన మంగళవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం నుంచి తులసీ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. మార్గమధ్యలో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోని వీవీఆర్ స్కూల్ వద్దకు రాగానే బస్సు నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెం వాసి మన్నెం వెంకన్నకు చెందిన మూడు పాడి గేదెలను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాయి. సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వడదెబ్బతో కూలీ మృతిఆత్మకూర్.ఎస్(సూర్యాపేట): ఎండల తీవ్రతతో వడదెబ్బ తగిలి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని గట్టికల్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కూలీ తలారి నరసయ్య(59) మృతిచెందాడు. సోమవారం ఉపాధి హామీ పనికి వెళ్లిన నరసయ్య రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని కుటుంబ సభ్యులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే రాత్రి మృతిచెందాడు. -
సేంద్రియ ఎరువులే పంటకు బలం
ఉపయోగాలు ఇవే.. సేంద్రియ ఎరువుల వినియోగంతో నేలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సేంద్రియ పదార్థం భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతుంది. నీరు కూడా ఇంకుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధీకరిస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువకాలం పట్టి ఉంచుకొని పంటను బెట్టకు గురికాకుండా చేస్తుంది. అలాగే నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది. నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేందుకు తోడ్పడే సూక్ష్మజీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది.నడిగూడెం : మొక్కలు, జంతువుల అవశేషాల నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులను పంటలకు తక్కువ మంది రైతులు వినియోగిస్తుంటారు. అయితే సేంద్రియ ఎరువుల వినియోగంతో పంటలకు చాలా ఉపయోగం. చాలా వరకు పంటలకు పురుగులు, తెగుళ్లు తగ్గడంతోపాటు, పురుగు మందు ఖర్చూ తగ్గుతుందని పలు పరిశోధనల్లోనూ, కొందరు రైతులు తమస్వీయ పర్యవేక్షణలో తెలుసుకున్నారు. అందుకే చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ సాగుపై నడిగూడెం మండల వ్యవసాయాధికారి రాయపు దేవప్రసాద్ సూచనలు. పశువుల ఎరువు పశువుల ఎరువు రైతులు అనాదిగా వినియోగిస్తున్న ఎరువే. అయితే రాను రాను వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో పశు సంతతి తగ్గి పశువుల ఎరువు అందుబాటులో లేకుండా పోయింది. పంటలకు ఉపయోగించే ఎరువుల్లో ఇది చాలా ముఖ్యమైంది. ప్రాథమికంగా పశువుల ఎరువు ఏ పంట సాగులోనైనా వేసి తీరాల్సిందే. పంటలకు పోషకాలను అందించడంతో పాటు పొలంలో కురిసిన వాన నీటిని ఒడిసి పట్టి పంటలకు అందించడంలో పశువుల పేడ కీలక పాత్ర పోషిస్తుంది. మిగతా ఎరువులను పంటకు అందించాలన్నా ఈ ఎరువు తరువాత ఏదైనా పొలంలో ఒక వరుస మట్టి, ఆ తరువాత పశువుల ఎరువు మరో పొరమట్టి, పశువుల ఎరువు ఇంకో పొర ఆకులు, అలములు, పశువుల మేత వేయగా తొక్కి పడేసిన చెత్త చెదారాలను తొలకరి వర్షాలు కురవగానే వెంటనే ఆ కుప్పలోని ఎరువు మట్టిని చిన్నచిన్న కుప్పలుగా పోసి పొలమంతా చల్లితే మంచి ఫలితం ఉంటుంది. కంపోస్టు ఎరువు గ్రామాల్లో లభ్యమయ్యే చెత్త, రాలిన ఆకులు, ఇతర కలుపు మొక్కలు కుళ్లి కూరగాయలు, వేరుశనగ కాయల పొట్టును కలిపి పశువుల పేడ, మూత్రంతో కుప్పగా వేసి, కుళ్లింపజేస్తే కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఇలా చేయడం వల్ల సేంద్రియ ఎరువు బాగా కుళ్లిపోతుంది. దీనిని కూరగాయల పంటలకు, ఇతర పంటలకు వేస్తే మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు, చీడ పీడలు లేకుండా ఆశించిన దిగుబడి వస్తుంది. కోళ్ల ఎరువుకోళ్ల ఫారాల్లో కోళ్ల కింద వేసిన పొట్టు, మల మూత్రాలతో సేంద్రియ ఎరువు తయారవుతుంది. దాదాపు 40 కోళ్ల నుంచి ఏడాదికి టన్ను ఎరువు వస్తుంది. ఈ కోళ్ల ఎరువులో 3 శాతం నత్రజని, 2 శాతం భాస్వరం, 2 శాతం పొటాష్ పోషకాలు ఉంటాయి. తేమ తగ్గేకొద్ది పోషక శాతం పెరుగుతుంది. పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువుతో అధిక దిగుబడులు -
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
యాదగిరిగుట్ట : యువతను విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ పిలుపునిచ్చారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా రెండవ మహాసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువ వికాసం పథకానికి 10లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వారందరికి వెంటనే డబ్బులు అకౌంట్లలో వేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో వ్యవసాయ దళిత ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ.. మతోన్మాదానికి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత నడుం బిగించవలసిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు యాదగిరిగుట్ట పట్టణంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, కొండూరు వెంకటేష్, మొగుళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మహాసభలో పలు నివేదికను జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మహమ్మద్ నయీమ్, బద్దుల శ్రీనివాస్, సుద్దాల సాయికుమార్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, జిల్లా సమితి సభ్యుడు బబ్బురి శ్రీధర్, సీపీఐ మండల కార్యదర్శి కల్లేపల్లి మహేందర్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు చెక్క వెంకటేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, మహాసభ ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఫ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ -
మళ్లీ తెరపైకి ‘రాచకొండ’
రాచకొండ ప్రాంతంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. - IIలోహైదరాబాద్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు భువనగిరిటౌన్ : మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుళ్లలో గాయపడిన కార్మికులను మొదటగా భువనగిరికి తీసుకువచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స పొందుతున్న ముగ్గురిని, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరిని వేర్వేరు అంబులెన్సుల్లో హైదరాబాద్కు తరలించారు. క్షతగాత్రుల్లో రాజబోయిన శ్రీకాంత్ (చాడ), బుగ్గ లింగస్వామి (పులిగిల్ల), నరేష్ (ఆత్మకూర్), బర్ల శ్రీకాంత్ (ఆలేరు), నల్ల మహేష్ (అనాజపురం)తో పాటు మరో కార్మికుడు ఉన్నాడు. భువనగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మహేందర్ అనే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. -
ఎక్స్ప్లోజివ్స్లో తరచూ పేలుళ్లు
బుధవారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025పంచాయతీ కార్మికుల విధుల్లో సడలింపుభువనగిరిటౌన్ : ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం పంచాయతీ కార్మికులైన పారిశుద్ధ్య సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్ల విధుల్లో సడలింపు ఇచ్చింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు పనులు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలో పనులు పూర్తి కాకపోతే సాయంత్రం సమయంలో చేయించుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చింది. యాదగిరి క్షేత్రంలో విశేష పూజలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా నిర్వహించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు జరిపించారు. ఆర్టీసీ బస్టాండ్ పరిశీలనభువనగిరి: డిప్యూటీ ఆర్ఎంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుచరిత మంగళవారం భువనగిరి బస్టాండ్ను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ఉన్న దుకాణాల్లో తినుబండారాలు, కూల్డ్రింక్స్ను ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని డీఎంను ఆదేఽశించారు. ఆమె వెంట యాదగిరిగుట్ట డీఎం వెంకటయ్య, కంట్రోలర్ సోమరాజు, టీఐ శ్రీనివాస్, మణికంఠ ఉన్నారు. వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్ల వేలంభువనగిరిటౌన్ : వచ్చే నెలలో చిన్న తరహా ఖనిజాల బ్లాక్ల వేలం పాట నిర్వహిస్తున్నట్లు గనుల, భూగర్భ శాఖ సహాయ సంచాలకుడు గోవిందరాజు తెలిపారు. వేలానికి సంబంధించి మంగళవారం కలెక్టరేట్లో గనులు, భూగర్భ శాఖ హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏమైన సందేహాలు ఉంటే 98666 33414 నంబర్ను సంప్రదించాలని కోరారు. నేడు మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలుభువనగిరిటౌన్ : కలెక్టరేట్లో బుధవారం మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి యాదయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10:00 గంటలకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హనుమంతరావు పాల్గొంటారని తెలిపారు. యాదగిరిగుట్ట: ఎక్స్ప్లోజివ్ కంపెనీల్లో కార్మికులకు భద్రత లేకుండా పోతోంది. పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు కనీస రక్షణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. పరిశ్రమల్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వెరసి భారీ ప్రమాదాలు సంభవించి కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మంగళవారం మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో సంభవించిన భారీ పేలుడు ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీ.. యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూర్, బొమ్మలరామారం, టంగుటూరు, మొటకొండూర్ మండలం కాటేపల్లిలో పేలుడు పదార్థాల (ఎక్స్ ప్లోజివ్స్) కంపెనీలు ఉన్నాయి. ఆయా ఎక్స్ప్లోజివ్ పరిశ్రమల్లో తయారు చేసిన డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లు, డీఆర్డీఏ, శ్రీహరికోటతో పాటు ఆర్మీ, నావికాదళం వంటి సంస్థలతో పాటు ఇక్కడి నుంచి పేలుడు పదార్థాలను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. దీంతో ఆయా కంపెనీల్లో కార్మికులు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తుంటారు. కంపెనీల యాజమాన్యాలు సైతం వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులతో పాటు, జిల్లా అధికారులు, కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అధికారులు తనిఖీలు చేపట్టాలి. అయితే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీ చేయడానికి వస్తున్న అధికారులు.. పటిష్ట చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించడంలో అంతగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు ఇలా.. ఫ 2012లో పెద్దకందుకూర్లోని ఎక్స్ప్లోజివ్ కంపెనీలో సీ– 6 బ్లాక్ లో మొదటిసారిగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆలేరు ప్రాంతానికి చెందిన ఎల్లయ్య, వంగపల్లి ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్ అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఫ 2019లో జరిగిన మరో పేలుడు ఘటనలో పెద్దకందుకూరు గ్రామానికి చెందిన జయపాల్ అనే కార్మికుడు మృతి చెందాడు. ఫ 2020లో పరిశ్రమలోని ఫ్యూరింగ్ బిల్డింగ్ లో పేలుడు ప్రమాదం సంభవించగా, అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా.. రెండు సార్లు పీఆర్డీసీ బ్లాక్ లోనే ప్రమాదాలు కావడం గమనార్హం. ఫ ఈ ఏడాది జనవరి 4న పెద్దకందుకూర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడులో ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో బయట పడగా.. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివాహమై ఆరు నెలలు .. మోటకొండూర్: ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుళ్లలో కాటేపల్లి గ్రామానికి చెందిన గునుగుంట్ల సందీప్(30) మృతిచెందాడు. ఇతడి వివాహం గత నవంబర్లో జరగగా.. ఆరు నెలలు కాకుండానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. అతడి భార్య మూడు నెలల గర్భిణి. కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజీవ్స్ కంపెనీ ప్రారంభం నుంచి సందీప్ అక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. కాగా.. సందీప్ తండ్రి శ్రీనివాస్ గత మూడు సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను, కుమారుడిని కోల్పోయిన మంగమ్మ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.ఆత్మకూరు(ఎం)లో విషాదఛాయలు ఆత్మకూరు(ఎం): ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో జరిగిన పేలుళ్లలో ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన కల్వల నరేష్(32) మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మండల కేంద్రానికి చెందిన కల్వల అంజయ్య– లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు నరేష్ ఉన్నాడు. ఇతడికి వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన యువతితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. నరేష్ గత రెండు సంవత్సరాలుగా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్లో పని చేస్తున్నాడు. మంగళవారం పగలు డ్యూటీ కావడంతో ఉదయమే వెళ్లాడు. పేలుళ్లతో తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఒక్క కొడుకూ.. మృతిచెందడంతో.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన బుజ్జమ్మ కుమారుడు దేవిచరణ్. కొంత కాలం క్రితమే భర్తను కోల్పోవడంతో కుట్టుమిషన్ కుడుతూ కుమారుడిని ఇంటర్ వరకూ చదివించింది. అనంతరం దేవిచరణ్ కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న సమయంలో కుమారుడు మృతిచెందడంతో తల్లి బుజ్జమ్మ రోదనకు అంతులేకుండా పోయింది. భువనగిరి పట్టణంలోని కుమ్మరివాడ మీదుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మట్టి పాత్రలను చూసి అక్కడ కొద్దిసేపు ఆగారు. అక్కడే వంట పాత్రలను కొనుగోలు చేశారు. మట్టి పాత్రల్లో ఏ వంట చేసినా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. – భువనగిరిటౌన్ రామన్నపేట నుంచి కక్కిరేణి మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు సర్వీస్ను ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రయాణికులతో కలిసి బస్సులో కొద్దిదూరం ప్రయాణించారు. – రామన్నపేట మట్టి పాత్రలు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య బస్సు సర్వీస్ ప్రారంభించిన అనంతరం అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే వీరేశం న్యూస్రీల్ఫ కనీస రక్షణ చర్యలు చేపట్టని కంపెనీల యాజమాన్యాలు ఫ తనిఖీలు చేపట్టని అధికారులు ఫ గాల్లో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు ఫ తాజాగా మోటకొండూర్ మండలం కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్లో పేలుడు ఫ ముగ్గురు కార్మికులు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు -
రూ.50కోట్లు వాపస్
సాక్షి, యాదాద్రి: నృసింహసాగర్ (బస్వాపురం) రిజర్వాయర్ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు పునరావాసం, పరిహారం అందడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 16 ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన రిజర్వాయర్లో భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపూర్తోపాటు మరో రెండు తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. బీఎన్ తిమ్మాపూర్కు పరిహారం కింద రూ.109 కోట్లు ఇవ్వాలి. గత డిసెంబర్లో ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. ఇవి నిర్వాసితులకు సరిపోకపోవడంతో పూర్తి నిధులు వచ్చాక పంపిణీ చేద్దామని అధికారులు వేచిచూశారు. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగియడంతో వచ్చిన నిధులు వెనక్కి వెళ్లాయి. నత్తనడకన లేఅవుట్ అభివృద్ధి పనులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా భువనగిరి హుస్సేనాబాద్లో (బీఎన్ తిమ్మాపూర్) 28 ఎకరాల లేఅవుట్లో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.80 కోట్లు మంజూరు చేసినా పనులు కావడంలేదు. 1047 మందికి ప్లాట్లు పంపిణీ చేశారు. నూతన లేఅవుట్లో మౌలిక వసతుల కోసం తొలుత రూ.35 కోట్లు, రెండవ విడతలో రూ.45 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాలు, పార్కులు, మంచినీటి సరఫరా, రోడ్లు నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయి. లేఅవుట్లో ట్యాంకులు నిర్మించి, అంతర్గత పైప్లైన్ వేసి, బోర్లు వేసి ఏడాదిన్నర కావస్తున్నా నీరివ్వలేకపోతున్నారు. మురుగు కాల్వల నిర్మాణం, పార్కులు, సీసీరోడ్లు, బీటీ రోడ్లు, ప్రభుత్వం భవనాల నిర్మాణం ప్రారంభం కాలేదు. బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు ఇక్కడ ఒక్కో కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.7.61 లక్షల నగదును ఇచ్చారు. కొందరు సొంత డబ్బులతో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కోర్టుకు అఫిడవిట్ సమర్పించినా.. బీఎన్ తిమ్మాపూర్, జంగంపల్లి, బస్వాపూర్, వడపర్తి, లప్పానాయక్తండా, రుస్తాపూర్ భూనిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద బీఎన్ తిమ్మాపూర్, లప్పానాయక్ తండా, చోక్లాతండాల్లో ముంపు బాధితులకు మౌలిక సదుపాయాలకుగాను డబ్బులు ఇస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. మూడు విడతల్లో రూ.598.67 కోట్ల పరిహారం అందిస్తామని అప్పట్లో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారంపై ఆలస్యం చేస్తుండడంతో హైకోర్టు రెండు సంవత్సరాల క్రితం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్వాసితులను ఆదుకోవాలి ముంపు గ్రామమైన తిమ్మపురం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. సుమారు రూ.400 కోట్లు ఇస్తే భూ నిర్వాసితులు, ముంపు గ్రామ బాధితులకు పరిహారం అందుతుంది. సకాలంలో నిధులు పంపిణీ చేయకపోవడంతో వచ్చిన రూ.50కోట్ల నిధులు వాపస్ పోయాయి. మొత్తం పరిహారం ఇవ్వాలి. – ఎడ్ల సత్తిరెడ్డి, బీఎన్ తిమ్మాపూర్ పరిహారం అందిస్తాం బీఎన్ తిమ్మాపూర్ నిర్వాసితులకు పరిహారం కింద రూ.109 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం రూ.50 కోట్లు విడుదల చేసింది. పరిహారం పంపిణీ కోసం చర్యలు తీసుకుంటున్నాం. ఆర్అండ్ఆర్ కాలనీలో విద్యుత్ సౌకర్యం కల్పించాం. త్వరలో మంచినీటి సమస్య తీరనుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే పరిహారం పంపిణీ చేస్తాం. – కృష్ణారెడ్డి, ఆర్డీఓ, భువనగిరి ఫ బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు పరిహారం కింద వచ్చిన డబ్బులు వెనక్కి ఫ పంపిణీలో ఆలస్యం, ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు వాపస్ ఫ ఆర్అండ్ఆర్ లే అవుట్లో చేపట్టిన పనుల్లో జాప్యం ఫ ప్రారంభం కాని మురుగు కాల్వలు, సీసీ, బీటీ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు -
రైతుల సంక్షేమాభివృద్ధికే భూభారతి
తుర్కపల్లి: రైతుల సంక్షేమాభివృద్ధి కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండల పరిధిలోని పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భూభారతి చట్టం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. భూవివాదాల సమస్యల పరిష్కరానికి భూభారతి చట్టం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గంధమల్ల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రికా ర్డుల్లో తప్పుల సవరణకు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. కొత్త చట్టం పై రైతులకు అవగాహన కల్పించేందుకు పది రోజులగా సదస్సులు ఏర్పాటు చేసి రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు తెలిపారు. భూసమస్యలు పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, తహసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ ఝన్సీలక్ష్మి బాయి, ఏసీపీ రమేష్ కుమార్, డి ప్యూటీ తహసీల్దార్ కల్పన, దనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్ రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అరులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం తుర్కపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణ పనులకు ఎంపీ కిరణ్ కుమార్తో కలసి శంకుస్థాపన చేశారు. అనంతరం పల్లెపహాడ్ స్టేజీ నుంచి బాబునాయక్తండా మీదుగా పర్రెబాయితండా వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య -
పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదు
సాక్షి,యాదాద్రి: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ కేడర్ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, ప్రమోద్ కుమార్, తంగెల్లపల్లి రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో కొద్దిమందికే ప్రాధాన్యత లభిస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీలో కనబడకుండా చేస్తున్నారని పార్టీ పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాలకు కనీసం సమాచారం ఇవ్వడంలేదని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. అయితే గ్రామ, మండల, బ్లాక్, డీసీసీ అధ్యక్ష పదవులను కొత్తవారితో భర్తీ చేస్తామని జిల్లా ఇన్చార్జ్లు ధనవంతి, డాక్టర్ అనిల్కుమార్ ప్రకటించారు. ఎవరెవరు పోటీలో ఉంటారో ముందుకు రావాలని కోరారు. కార్యకర్తలకు అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఫ కాంగ్రెస్ జిల్లా సమీక్షా సమావేశంలో పార్టీ ముఖ్య కార్యకర్తల ఆవేదన -
కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలి
వలిగొండ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండ తీవ్రతతో రైతులు ఇబ్బందులు పడకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హనుమంత రావు సూచించారు. మంగళవారం వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతులకు తాగు నీరు, టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తొందరగా తూకాలు చేసి వెంటనే ఎగుమతులు చేయాలని అన్నారు. ఆదర్శ రైతు వెంకటేష్ సహకారంతో అందజేసిన మజ్జిగను కలెక్టర్ రైతులకు పంపిణీ చేశారు. రైతులకు ఇబ్బందులు రానీయొద్దు రామన్నపేట: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది రానీయొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం రామన్నపేట మండలంలోని బోగారం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ధాన్యం రాశులు, తేమను శాతాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు, ఎగుమతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయనవెంట వ్యవసాయ విస్తరణాధికారి కీర్తన ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంత రావు -
యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
సంస్థాన్ నారాయణపురం : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు తీరనున్నాయని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంస్థాన్నారాయణపురంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తన కుంటుంబసభ్యుల కొసం ధరణి చట్టం తీసుకొస్తే, పేద రైతుల భూములు పోవద్దని, భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగొద్దనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. రాచకొండ ప్రాంతంలో ఎన్నో రకాల భూ సమస్యలు ఉన్నాయన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఆధికారులు జలగల్లా రైతులను పీక్కుతున్నారని, అవినీతికి తావుండరాదన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం మండలాలను సస్యశ్యామలం చేస్తానన్నారు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని 33 ముక్కలుగా విభజించాని విమర్శించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ రాచకొండలో ప్రభుత్వ భూములు ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారని అరో పించారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మే 1నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్యే అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీని వాస్రెడ్డి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ యాదవరెడ్డి, మాజీ ఎంపీపీలు గుత్త ఉమాదేవిప్రేమ్చందర్రెడ్డి, బుజ్జి, ప్రభాకర్రెడ్డి, మార్కెట్ డైరక్టర్లు లోడే రఘు, మెగావత్ బిచ్చానాయక్, బచ్చనగోని గాలయ్య, గౌసొద్దిన్ ఖురేషి తదితరలు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి -
కిష్టాపురంలో పోలీసుల కార్డన్ సెర్చ్
హుజూర్నగర్ (చింతలపాలెం): చింతలపాలెం మండలం కిష్టాపురంలో సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని 210 ఇళ్లలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఒక ఆటోను సీజ్ చేశారు. అనంతరం సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోదాడ రూరల్ సీఐ రజిత మాట్లాడుతూ.. గ్రామంలో వర్గాలుగా ఏర్పడి గొడవలు పడుతూ ఉంటే గ్రామం ఎప్పటికీ అభివృద్ధి చెందన్నారు. కార్యక్రమంలో ఎస్ఐలు అనిల్ రెడ్డి, పరమేష్, నవీన్కుమార్, హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కళాబృందం ఇన్చార్జి ఎల్లయ్య, గోపయ్య, గురులింగం, నాగార్జున, కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 58 బైక్లు, ఆటో సీజ్ -
ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం
నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ఉమ్మడి నల్లగొండను సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. నల్లగొండ జిల్లాలోని బక్కతాయికుంట (రూ.20.22 కోట్లు), మునుగోడు (రూ.6.08కోట్లు), నర్సింగ్బట్ల (రూ.19.95 కోట్లు) ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్కు ఎదుల ద్వారా నీరందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, జిల్లా నుంచి పిలిిప్పిన్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి.. వెంకట్రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్ అదనపు బ్లాక్, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్ సరిపోవడం లేదన్నారు. అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్కు తీసుకొస్తామన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే కార్యాలయాల్లో ఎక్కువ సమయం ఉంటారని, సౌ కర్యవంతంగా ఉండేలా భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, మందుల సామేల్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఎస్పీ శరత్చంద్రపవార్, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్కుమార్, నీటిపారుదల సీఈ అజయ్కుమార్, డీఆర్ఓ అశోక్రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈఈ సతీష్చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ సాగునీటి ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష ఫ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఫ రూ.1,600 కోట్లతో రోడ్ల నిర్మాణం సాగుతోంది : మంత్రి కోమటిరెడ్డి ఫ నల్లగొండ కలెక్టరేట్లో అదనపు భవన సముదాయం, లిఫ్టు పనులకు శంకుస్థాపన -
ధాన్యం కొనాలని రైతుల ఆందోళన
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20రోజులు గడిచినా కాంటా ప్రారంభించడం లేదన్నారు. హమాలీల కొరతను కేంద్రాల నిర్వాహకులు సాకుగా చూపుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నామని, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. రేపటిలోగా కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైతులకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట ఐకేపీ కేంద్రం నిర్వాహకులతో పాటు బీజేపీ వలిగొండ మండల శాఖ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్, నాయకులు రాచకొండ కృష్ణ, శీల పాండు, అనిల్మార్, దోగిపర్తి సంతోష్, సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పాల్గొన్నారు. -
కోతుల దాడిలో వృద్ధుడికి గాయాలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సండ్ర అవిలయ్య కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం అవిలయ్య తన ఇంటి బయట మంచంపై కూర్చొని ఉండగా కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి అతడిపై దాడి చేయడంతో శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలయ్యయి. చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం అవిలయ్యను సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారని, ఇప్పటికై నా అధికారులు కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోదాడలో పిచ్చి కుక్క స్వైర విహారం ● 10 మందిపై దాడి ● ఓ బాలుడికి తీవ్రగాయాలు కోదాడరూరల్ : కోదాడ పట్టణంలో సోమవారం ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి గాయపర్చింది. పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్ 18వ వార్డులో నివాసముంటున్న కొండపల్లి రవికుమార్ కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే కుక్క గణేష్నగర్, తిలక్నగర్, ఖమ్మం క్రాస్రోడ్ ఏరియాల్లో 10 మందిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి మునుగోడు: మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన పత్తిపాటి హజరత్(40) ఇరవై ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామానికి వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన కంభంపాటి లక్ష్మమ్మని 18 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని స్థానికంగానే నివాసం ఉంటూ తాపీ మేసీ్త్ర పని చేస్తున్నాడు. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన హజరత్ తిరిగి రాలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా ఆదివారం కల్వలపల్లి గ్రామ శివారులోని ముత్మాలమ్మ దేవాలయ సమీపంలో హజరత్ విగతజీవిగా కనిపించాడు. హజరత్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పత్తిపాటి ఈరమ్మ పోలీసులకు ఫిర్యాధు చేయగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. -
కేసీఆర్ ప్రభంజనం తట్టుకోలేక ఆరోపణలు
నకిరేకల్: వరంగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రభంజనం చూసి తట్టుకోలేక ఆయనపై కాంగ్రెస్ మంత్రులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజతోత్సవ సభ అయిపోయిన వెంటనే కేసీఆర్పై కాంగ్రెస్ మంత్రులు పొగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయలేదని కేసీఆర్ సభలో ఎండగట్టారన్నారు. ప్రజలను దగా చేసి బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీలను అమలుచేయలేక గ్రామాల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వణుకు పుడుతుందన్నారు. ఈ వణుకు చూసే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక కాంగ్రెస్ పార్టీ చేతులేత్తింసిందన్నారు. రజతోత్సవ సభను అడ్డుకోవడం కోసం పోలీస్ యంత్రాంగం ప్రయత్నించిందన్నారు. సభకు వెళ్లిన వాహనాలకు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించారు. మళ్లీ రెండెళ్లలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతుందన్నారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన నకిరేకల్ నియోజకర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు చిరుమర్తి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, పార్టీ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గుర్రం గణేష్, రాచకొండ వెంకన్నగౌడ్, నాయకులు పెండెం సదానందం, పల్లె విజయ్, వంటల చేతన్, రావిరాల మల్లయ్య, దైద పరమేశం, సామ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
బాల్య వివాహాలు నేరం
భువనగిరిటౌన్ : బాల్యవివాహాలు నేరమని, పెళ్లిళ్ల సీజన్ కావడంతో నిఘా ఉంటుందని జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారి నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 30న సామూహిక వివాహాలు జరిపే సంప్రదాయం ఉంటుందని, మైనర్ల వివాహాలు చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పురోహితులు, మత పెద్దలు, టెంట్ హౌస్లు, ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు జాగ్రత్త వహించి బాల్యవివాహాలు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరయ్యే అతిథులు కూడా శిక్షార్హులన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి భువనగిరి : ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ రైతులకు సూచించారు. సోమవారం భువనగిరిలోని హుస్నేబాద్లోని కోనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు, హమాలీలతో మాట్లాడారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు ఉండాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. శివపార్వతులకు సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. ఆశతో వచ్చి.. నిరాశగా వెనుదిరిగి భువనగిరిటౌన్ : కలెక్టర్లో సోమవారం జరగాల్సిన ప్రజవాణి కార్యక్రమాన్ని భూ భారతి అవగాహన సదస్సుల వల్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రజావాణి రద్దయిన విషయం చాలా మందికి తెలియక ఎప్పటి మాదిరిగానే తరలివచ్చారు. ఎండకు అవస్థలు పడుతూ సుదూర ప్రాంతాల నుంచి నిరీక్షించారు. అధికారుల సూచన మేరకు అర్జీలను ఇన్వార్డులో అందజేసి వెళ్లారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. -
నష్టం రూ.10 కోట్లపైనే!
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు సాక్షి, యాదాద్రి : వరుస వర్షాలు అన్నదాతను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏప్రిల్ ఒక్క నెలలోనే ఎనిమిది పర్యాయాలు కురిసిన వర్షాలకు వరి, ఉద్యాన తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయి. మామిడి రాలి పోయాయి. జిల్లా వ్యాప్తంగా 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా 1,525 మంది రైతులు అకాల వర్షాలతో నష్టపోయారు. మొత్తం రూ.10కోట్లకు పైనే నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఏటా ఇవే కష్టాలు జిల్లాలో ఏటా ఇదే సమయంలో అకాల వర్షాలు కురువడం పరపాటిగా మారింది. ఈ ఏడు కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ ఒక్క నెలలోనే 3, 10,15, 18,19, 20,21,27 తేదీల్లో వర్షాలు కురిశాయి. వర్షాలకు తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, రామన్నపేట, మోటకొండూరు, భూదాన్పోచంపల్లి, బొమ్మలరామారం, అడ్డగూడూరు, అత్మకూర్(ఎం), గుండాల మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది. నష్టంపై ప్రాథమిక అంచనా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా నష్టాన్ని అంచనా వేశారు. అత్యధికంగా వరి 2,050 ఎకరాల్లో రూ.8.50 కోట్లు, ఆ తరువాత మామిడికి 250 ఎకరాల్లో రూ.2.52 కోట్ల మేర నష్టం జరిగినట్లు లెక్కక ట్టారు. నష్టంపై నివేదిక రూపొందించి పరిహారం కోసం ప్రభుత్వానికి పంపించారు. ప్రాణ, ఆస్తినష్టం పిడుగు పాటుకు మూగజీవాలు మృత్యువాత పడి యజమానులు నష్టపోయారు. రాజాపేట మండలం రేణికుంటలో బండిమల్లయ్యకు చెందిన 40 మేకలు, 10 గొర్రెలు, చల్లూరులో ఎర్ర నర్సయ్యకు చెందిన పాడిగేదె, పాడి ఆవు, బీబీనగర్ మండలం పడమటి సోమారంలో రెండు పాడి అవులు మృత్యువాత పడ్డాయి. మోటకొండూరు మండల తేర్యాలకు బాలగాని రాజు 18 ఎకరాల వరి సాగు చేశాడు. ఇదులో 12 ఎకరాలు సొత భూమి కాగా, ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సుమారు రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాడు. మూడు రోజుల్లో కోతకు సిద్ధం అవుతుండగా వడగండ్ల వాన కురిసింది. దీంతో వరి కంకులు పెద్దెత్తున నేలరాలాయి. ఉన్న పంటను కోయగా ఎకరాకు 20 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు వాపోయాడు. ఫ 2,050 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడికి నష్టం ఫ నష్టాన్ని అంచనా వేసిన అధికారులు ఫ ప్రభుత్వానికి నివేదిక అందజేత ట్రాక్టర్ వడ్లు రాలాయి ఏడు ఎకరాల్లో వరి వేశాను. మూడెకరాలు నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రంలో పోశాను. స్థలం లేదని మిగిలిన పొలం కోయలేదు. ఈనెల 15వ తేదీన కురిసిన వడగండ్ల వానకు కోయని పొలంలో దాదాపు ట్రాక్టర్ వడ్లు రాలిపోయాయి. ప్రభుత్వపరంగా ఆదుకోవాలి. –ఆవుల లక్ష్మీనారాయణ, నీర్నెముల -
సాగునీటి కల్పనకు మొదటి ప్రాధాన్యం
రామన్నపేట, శాలిగౌరారం: కాలువల ఆధునీకరణ, మరమ్మతులు చేయడం ద్వారా సాగునీటి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం రామన్నపేట మండలం పల్లివాడ గ్రామ శివారులో మూసీ నదిపై గల శాలిగౌరారం ప్రాజెక్టు కాలువ హెడ్ రెగ్యూలేటరీని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుతో కలిసి ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న కత్వ, హెడ్ రెగ్యులేటరీ గేట్లను, బాచుప్పల, సూరారం, తుర్కపల్లి గ్రామాల వెంట శాలిగౌరారం ప్రాజెక్టు కాలువను పరిశీలించారు. మూసీలో హెడ్ రెగ్యులేటరీకి అడ్డుగా ఉన్నటువంటి గుర్రపుడెక్కను నిరంతరాయంగా తొలగించుటకు, దెబ్బతిన్న కత్వ మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రెగ్యులేటరీ తలుపులను ఆపరేట్ చేయడానికి వారం రోజుల వ్యవధిలో గేర్ బాక్స్లను బిగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. 27కి.మీ. పొడవైన కాలువలో ఇప్పటి వరకు 14కి.మీ. వరకే షీల్ట్ను తీశారని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. శాలిగౌరారం ప్రాజెక్టు అభివృద్ధికి మంజూరైన నిధులు, జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ప్రాజెక్టు అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్పై ఎంపీ, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని అధికారులను, కాంట్రాక్టర్ను ప్రశ్నించారు. హెడ్రెగ్యూలేటర్ షట్టర్లు బిగించడం, రాచకాల్వలో పేరుకుపోయిన చెత్తచెదారాన్ని తొలగించే పనులను పదిరోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. పనులు పూర్తిచేయకుంటే సంబంధిత కాంట్రాక్టర్ను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుర్కపల్లి దగ్గర రాచకాల్వపై ఉన్న షట్టర్లను, శాలిగౌరారం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు. వారి వెంట తిరుమలగిరి నీటిపారుదలశాఖ ఈఈ జె. సత్యనారాయణ, డీఈఈ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మాజీ సర్పంచులు గంగుల వెంకటరాజిరెడ్డి, కడారి సత్తయ్య, గుత్తా నర్సింహారెడ్డి, కడమంచి సంధ్యస్వామి, ఎండీ రెహాన్, నాయకులు అక్రం, గోదాసు పృథ్వీరాజ్, గాదె శోభారాణి, మేకల మల్లేశం, నాగులంచె నరేష్, దూదిమెట్ల లింగస్వామి, మేడి మల్లయ్య, అయ్యాడపు నర్సిరెడ్డి, ఎండీ జమీరొద్దీన్, గడ్డం యాదగిరి, ఏఈలు విక్రమ్, అమర్, వర్క్ ఇన్స్పెపెక్టర్ రజినీకాంత్, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చామల మహేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, కార్యదర్శి గూని వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నాయకులు చామల వెంకటరమణారెడ్డి, జయపాల్రెడ్డి, చాడ రమేశ్చందర్రెడ్డి, దండ అశోక్రెడ్డి, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, రైతులు తదితరులు ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి -
నిస్సహాయులుగా గీత కార్మికులు
బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా మంజూరైనా చేతికిరాని చెక్కులురూ.2.77 కోట్లు రావాలి జిల్లాలో తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందిన, గాయపడిన గీత కార్మికులకు ఎక్స్గ్రేషి యా రూ. 2.77 కోట్లు రా వాల్సి ఉంది. పరిహా రం మంజూరైనా బాధితుల చేతికి అందలేదు. అధికారులను సంప్రదిస్తే బడ్జెట్ లేదని చెబుతున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని, ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. బాధితులకు ఎక్స్గ్రేషియా డబ్బులు ఇవ్వనట్లయితే అందోళన కార్యక్రమాలు చేపడుతాం. –బోలగాని జయరాములు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బడ్జెట్ లేకపోవడంతో ఆలస్యం గీత కార్మికుల ఎక్స్గ్రేషియా మంజూరైంది వాస్తవమే. బడ్జెట్ లేకపోవడంతో చెక్కులు అందచేయలేకపోయాం. జిల్లాలో 79 మంది బాధితులున్నారు. ప్రస్తుతం ముగ్గురికి రూ.5 లక్షల చొప్పున, ఇద్దరికి రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేస్తాం. మూడు నెలలకు ఒకసారి బడ్జెట్ వస్తుంది. వచ్చె నెల అందరికీ చెక్కులు ఇవ్వడానికి సిద్ధం చేశాం. బడ్జెట్ వస్తేనే అందజేస్తాం. –విష్ణుమూర్తి, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆత్మకూరు(ఎం) మండలం తుర్కల రేపాకకు చెందిన మూల ఆదినారాయణగౌడ్ వృత్తిలో భాగంగా 2023 నవంబర్ 3న కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందడ్డాడు. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ఏడాది క్రితం అతని భార్య శోభ అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు. రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా నిధులు మంజూరైనా చేతికి చెక్కు రాలేదు.మోదుబావిగూడేనికి చెందిన వంగాల రమేష్ 20 ఏళ్లకు పైగా గీత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. 2017లో భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఇతనికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరి వివాహం అయింది. వృత్తిలో భాగంగా 2023 నవంబర్ 28న కల్లు తీయడానికి తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. చికిత్స నిమిత్తం రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. కొంత అప్పు తెచ్చాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బంగారు నగలు కూడా అమ్మాడు. కుటుంబం గడవడం కోసం చిరువ్యాపారం నిర్వహిస్తున్నాడు. రూ. 5లక్షల ఎక్స్గ్రేషియా మంజూరైనా చేతికి రాలేదని రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆత్మకూరు(ఎం) : తాటిచెట్లపై నుంచి పడి మృతిచెందిన, గాయపడి వైకల్యం చెందిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకును వెళ్లదీస్తున్న గీత కార్మికులు ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో తీవ్ర గాయాలతో వృత్తిని కొనసాగించలేకపోతున్నారు. కుటుంబ పెద్ద మరణించడం, గాయపడి మంచం పట్టడంతో ఆ కుటుంబం ఉపాధి కోల్పోతుంది. ఇటువంటి సందర్భాల్లో గీత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎకై ్సజ్శాఖ ద్వారా ఎక్స్గ్రేషియా అందజేస్తుంది. కానీ, జిల్లాలో రెండేళ్లుగా ఎక్స్గ్రేషియా అందక బాధిత కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మృతులు, గాయపడిన కార్మికులు.. జిల్లాలో 14,262 మంది గీత కార్మికులు ఉన్నారు. వృత్తిలో భాగంగా గడిచిన రెండేళ్లలో 13 మంది చనిపోయారు. 42 మంది శాశ్వత, 24 మంది తాత్కాలిక వైకల్యం చెందారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.5 లక్షలు, శాశ్వత వైకల్యం చెందితే రూ.5లక్షలు ఎక్స్గ్రేషియా, తాత్కాలిక అంగవైకల్యం చెంది వానికి ప్రభుత్వ రూ.10వేలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంది. రూ. 2.77 కోట్లు మంజూరైనా బాధిత కుటుంబాలకు అందలేదు. గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా, సీఎం రేవంత్రెడ్డికి, ఉన్నతాధికారులకు విన్నపాలు అందజేసినా ఫలితం లేకపోయింది. -
మఠంపల్లిలో పందెం గిత్తల జోరు
● కొనసాగుతున్న ఎద్దుల పందేలుమఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా స్థానిక మాంట్ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలతో బండలాడే పోటీలను ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన ఆరు పండ్ల విభాగంలో ఏపీలోని బెస్తవారిపేటకు చెందిన గిత్తలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన శివక్రిష్ణచౌదరి, మోహన్రావుకు చెందిన గిత్తలు, మూడో బహుమతిని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్ గిత్తలు గెలుపొందాయి. ప్రతి విభాగంలో 10 జతల గిత్తలకు నగదు బహుమతులు, షీల్డులు దాతల సహయంతో అందజేస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆదూరి స్రవంతి కిషోర్రెడ్డి, గ్రేగోల్డ్ సిమెంట్స్ పీఎం శ్రీనివాసరెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, థామస్రెడ్డి, లూర్ధురెడ్డి, సునీల్రెడ్డి, రవీందర్రెడ్డి, లూర్ధుమారెడ్డి, విక్టర్రెడ్డి, బాలరెడ్డి, జార్జిరెడ్డి, సక్రునాయక్, ఎల్లారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం శివారులో, చిట్యాల పట్టణంలో సోమవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో బస్టాండ్కు వెళ్లే దారిలో సోమవారం రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని భువనగిరి నుంచి నార్కట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు యువకుడిని అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బైక్ అదుపుతప్పి.. చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి శంకర్, దొడ్డి మనోజ్ ద్విచక్ర వాహనంపై పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఆరెగూడెం వెపు వెళ్తూ.. ప్రగతి కాటన్ మిల్లు ఎదురుగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుర్మరణం
సూర్యాపేట టౌన్: బైక్పై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సూర్యాపేట పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం తొగర్రాయికి చెందిన లిక్కి రామారావు(46) దురాజ్పల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదివారం రాత్రి బైక్పై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో గల అండర్ పాస్ నుంచి కొత్త బస్టాండ్కు వెళ్తుండగా.. కారు ఢీకొట్టింది. రామారావుకు తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరరాఘవులు తెలిపారు. గుండెపోటుతో చేనేత కార్మికుడు మృతి రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు పున్న నర్సింహ (47) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. పున్న నర్సింహ మధ్యాహ్నం అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
భద్రతా చర్యలతోనే ప్రమాదాల నివారణ
చౌటుప్పల్ : పరిశ్రమల్లో భద్రతకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రమదాలను నివారించవచ్చని పరిశ్రమల శాఖ డైరెక్టర్ బి.రాజగోపాల్రావు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ వై.మోహన్బాబు పేర్కొన్నారు. వరల్డ్ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎట్ వర్క్–2025ను పురస్కరించుకొని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో భద్రత అంశంపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చౌటుప్పల్పట్టణ పరిధిలోని లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమ ఉద్యోగులు సేఫ్రీ డ్రాయింగ్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి, సేఫ్టీ పద్య పోటీల్లో ద్వితీయ బహుమతి కై వసం చేసుకున్నారు. బహుమతుల ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. భద్రత విషయంలో రాజీపడద్దన్నారు. భద్రత ప్రమాణాలు పాటించడం వల్ల కంపెనీ ఉత్పత్తులు పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. బహుమతులు సాధించిన దివీస్ ఉద్యోగులను వారు అభినందించారు. -
వరి కొయ్యలను కాల్చొద్దు
గరిడేపల్లి: వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చడం వలన పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయని రైతుల అభిప్రాయపడుతుంటారని, కానీ అలా చేయడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నాశనవుతాయని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డి. నరేష్ అంటున్నారు. వరి కొయ్యలను నేలలో కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన పేర్కొంటున్నారు. వరి కొయ్యలను కాల్చడం వలన జరిగే నష్టాలు ఆయన మాటల్లోనే.. ● రైతులు వరి కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వరికోత యంత్రాలు వరి కంకి మొదలు భాగాన కాకుండా 30సెం.మీ. ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కొయ్యల రూపంలో పొలంలోనే మిగిలిపోతుంది. వరి కొయ్యలను రైతులు తగలబెట్టడం వలన ఒక టన్నుకు 60కిలోల మోనాకై ్సడ్తో పాటు 1400 కిలోల కార్బన్డైయాకై ్సడ్ గాలిలోకి విడుదల అవుతుంది. ఇదే కాకుండా సూక్ష్మధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. నేల పొరల్లో తేమ శాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ● ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్ కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలను కూడా తీసుకుంటుంది. అందువలన వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. వరిని కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో వ్యర్ధపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50కిలోల సూపర్ పాస్పేట్ వేయడం వలన వరి కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరి కొయ్యలను నేలలో కలియదున్నటం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడమే కాకుండా దిగుబడి సైతం 8–10 శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్డైయాక్సెడ్ సాంద్రత తగ్గించాలన్నా నేలలో కార్బన్ శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకి చేర్చడం ఉత్తమైన పద్ధతి. నేలలో కలియ దున్నితే అధిక లాభాలు గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేష్ -
అకాల వర్షం.. ఆగమాగం
ఫ పలు మండలాల్లో భారీ వర్షం ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం చౌటుప్పల్ : వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదా తను కొలుకోకుండా చేస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం రైతులకు తీవ్రనష్టాన్ని మిగిల్చింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పదుల సంఖ్యలో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే కొట్టుకుపోతుండగా కొందరు రైతులు విలపించారు. మాయిశ్చర్ వచ్చి తూకం వేయాల్సిన ధాన్యం కూడా తడిసి ముద్దయ్యింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరారు. చౌటుప్పల్ రూరల్ : పెద్దకొండూరుతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. మ్యాయిచర్ కోసం ఎండబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బూర్గు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భూదాన్పోచంపల్లి : శివారెడ్డిగూడెం, గౌస్కొండ గ్రామాల్లో ధాన్యం పాక్షికంగా తడిసింది. రేవనపల్లి శివారులో చేతికొచ్చిన వరిచేను నేలకొరిగింది. బీజేపీ, సీపీఎం నాయకులు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బొమ్మలరామారం : మండలంలోని హాజీపూర్, నాగినేనిపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరడంతో రైతులు అవస్థలు పడ్డారు. కొనుగోలు ప్రారంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండ : చాలా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. జాప్యం చేయకుండా కొనుగోళ్లు ప్రారంభించాలని, తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. సంస్థాన్ నారాయణపురం: మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల కిందికి వర్షపు నీరు చేరింది. ఉదయం ఏడు గంటల సమయంలో వర్షం కురవడం, రైతులు వడ్లకుప్పలపై పట్టాలు కప్పి ఉండచంతో పెద్దగా నష్టం జరగలేదు. -
గుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ భాస్కర్రావు బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి ఎస్.వెంకట్రావ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రావ్ గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జేసీగా, భువనగిరి జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేశారు. ఆతరువాత మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళ్లారు. మొదటిసారి ఐఏఎస్ అధికారియాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఐఏఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) హోదాలోనే దేవాదాయశాఖ నుంచి అధికారులను నియమించారు. వెంకట్రావ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్, జాయింట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను దేవాదాయశాఖ డైరెక్టర్గా బదిలీ చేసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఈఓగా నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 14 నెలల్లో అనేక సంస్కరణలు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా భాస్కర్రావు గత ఏడాది మార్చి 16వ తేదీన బాధ్యతలు చేపట్టారు. 14 నెలల కాలంలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపర్చారు. –దివ్య విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు పూర్తి చేయించారు. 40 ఏళ్ల తరువాత 31వ మధురకవి రామానుజ జీయర్స్వామిని తీసుకువచ్చి సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా స్వర్ణవిమాన గోపురాన్ని ఆవిష్కరింపజేశారు. ● కొండపైన భక్తులు నిద్ర చేసేందుకు డార్మిటరీ హాల్, వేసవిలో ఎండకు ఇబ్బందులు పడకుండా జర్మనీ హంగర్ టెంట్లు ఏర్పాటు. ● కొండపైన సాంస్కృతిక వేదిక, రూ.150 టికెట్ క్యూలైన్ ఏర్పాటు. ● బ్రేక్ దర్శనం, వివిధ పూజాధి కార్యక్రమాల్లో భక్తులు సంప్రదాయ దుస్తువులు ధరించాలనే నిబంధన అమలు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో ఫుట్ఫాత్ టైల్స్, విద్యుత్ దీపాల ఏర్పాటు. గిరిప్రదక్షిణ గురించి వివిధ రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం. స్వాతి నక్షత్రం రోజు వెయ్యి మంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటుండగా.. ఈఓ కృషి తోఆ సంఖ్య 6నుంచి 8వేలకు చేరింది. ● శ్రీస్వామి వారి కైంకర్యాలు భక్తులు వీక్షించేలా ఆలయ మాడ వీధుల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు. ● భక్తులు శ్రీస్వామి వారిని కనులారా వీక్షించి దర్శనం చేసుకునేలా గర్భాలయం ముందు ర్యాంప్ నిర్మాణం. ● భక్తులకు శఠారీ, కుంకుమ పెట్టే పద్ధతులు అమలు. ● కొండపై ఉన్న విష్ణు పుష్కరిణి తిరిగి ప్రారంభం. ● అవకతవకలకు తావులేకుండా ప్రసాద విక్రయశాలలో ఆన్లైన్ విధానం.ఈఓ పదవి తృప్తినిచ్చింది సాక్షి, యాదాద్రి : ‘యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీస్వామివారి అనుగ్రహంతో అనేక సంస్కరణలు తీసుకువచ్చా. భక్తులకు వసతులు మెరుగుపర్చాను.. 14నెలల పదవీకాలం చాలా సంతృప్తినిచ్చిందని..’ ఈఓ భాస్కర్రావు తెలిపారు. బదిలీ అయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశాను. ముఖ్యంగా తన హయాంలో ఆలయ విమానగోపురం స్వర్ణతాపడం పనులు పూర్తి చేయడం, గిరి ప్రదర్శనను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మరి చిలోనివి. ఆటో కార్మికులకు అండగా నిలిచా. ప్రభుత్వ, ఆలయ అధికారులు, ఉ ద్యోగులు, అర్చకులు, సిబ్బంది సహకారం మరువలేనిది. వారందరికీ కృతజ్ఞతలు. -
ప్రశాంతంగా మోడల్ స్కూళ్ల పరీక్ష
భువనగిరి : మోడల్ స్కూళ్లలో 6,7,8,9,10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం అదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 973 మంది విద్యార్థులకు గాను 659 మంది హాజరయ్యారు. 314 మంది గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి సంస్థాన్నారాయణపురం : జిల్లా యువజన, క్రీడల శాఖ, సంస్థాన్నారాయణపురం స్పోర్ట్స్ క్లబ్ సంయుక్తంగా ఇచ్చే వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొవాలని క్లబ్ వ్యవస్థాపక ఆధ్యక్షుడు సిలివేరు సైదులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీ బాల్, యోగా, తైక్వాండ్లో మే 1వ తేదీనుంచి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు బాల, బాలికలు శిక్షణకు అర్హులన్నారు. జూన్ 6వ తేదీ వరకు శిక్షణ శిబిరం కొనసాగుతుందన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆ తరువాత గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర తుర్కపల్లి : రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అదనపు కలెక్టర్ (రెవె న్యూ) వీరారెడ్డి సూచించారు. తుర్కపల్లి మండలం పెద్దతండా, మాదాపురం, పల్లెపహాడ్లో కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. బీసీ గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు భువనగిరి : జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల(బాలురు) డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జెల్ల స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, బీజెడ్సీ, బీకాం సీఏ, బీఏ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా రూ.200 ఫీజు చెల్లించి మే5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫోటోభూదాన్పోచంపల్లి : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఆదివారం భూదాన్పోచంపల్లి, జూలూరులో కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 372 కొనుగోలు కేంద్రాలకు గాను 342 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. జూలూరు, బీబీనగర్ మండలం రాఘవాపూర్లో పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో సెంటర్ల బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీడ, తాగునీటి సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం కన్పించందన్నారు. ఎండల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో దాతల సహకారంతో చల్లని నీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోళ్లపై రోజువారీగా అధికారులతో సమీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి బిహార్ హమాలీలు సరైన సమయానికి రాకపోవడంతో ధాన్యం కాంటా చేయడం ఆలస్యమైందన్నారు. ధాన్యం కాంటా చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, ఏఎస్ఓ రోజా, డీటీ సీఎస్ బాలమణి, ఏఓ శైలజ, పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
రైతులకు సోలార్ ప్లాంట్లు
పీఎం–కుసుమ్ పథకం కింద యూనిట్ల స్థాపన హుజూర్నగర్ : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా పీఎం–కుసుమ్ (ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి 874 మంది రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 874 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 192 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. కాగా వారిలో 123 మందికి టీఎస్ రెడ్కో అధికారులు ఎల్ఓ (లెటర్ ఆఫ్ అవార్డు) అందజేశారు. దీర్ఘకాలిక ఆదాయ వనరు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్ను రూ.3.15 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిస్కంలతో ఒప్పందం 25ఏళ్ల పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు తమ సాగు యోగ్యంకాని భూముల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. సబ్స్టేషన్కు ఐదు కిలోమీటర్ల దూరం.. వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ ఉపకేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది. మూడున్నర ఎకరాల పట్టా భూమి, లేదా పోడుభూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన అర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఫ కర్షకుల ఆదాయం పెంచేలా ప్రభుత్వ ప్రణాళిక ఫ మూడున్నర ఎకరాల పట్టా భూమి ఉన్న రైతులు అర్హులు ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 మంది దరఖాస్తు ఫ ఈఎండీ చెల్లింపునకు నెలాఖరు వరకు గడువు జిల్లా అర్జీలు ఈఎండీ ఎల్ఓ చెల్లింపులు ఇచ్చింది నల్లగొండ 365 91 68 సూర్యాపేట 285 43 24యాదాద్రి 224 58 31 -
నీళ్లు లేవు.. నీడా లేదు!
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కొరత వాచ్మన్ కూడా లేడు గుండాల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోశాం. రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదు. ఎండలకు అవస్థలు పడుతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. తాగునీటి కోసం సమీపంలోని వాటర్ప్లాంటుకు వెళ్తున్నాం. నీడ సౌకర్యం లేకపోవడంతో పక్కనే ఉన్న ఆలయానికి వెళ్లి సేద దీరుతున్నాం. నైట్ వాచ్మన్ను లేకపోవడంతో రాత్రి వేళలో ధాన్యం వద్దే కాపలా కాయాల్సి వస్తోంది. –మచ్చ మధిరమ్మ, గుండాల గన్నీ బ్యాగులు ఇవ్వలేదు పది రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చా. ఇంత వరకు కొనుగోలు చేయలేదు. గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. ఎండలు మండిపోతున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. టార్పాలిన్న్లతో చిన్నపాటి గుడారం ఏర్పాటు చేశారు. కానీ, టార్పాలిన్లు ప్లాస్టిక్వి కావడంతో సేదదీరే పరిస్థితి లేదు. –జొన్నవాడ భాస్కర్రెడ్డి, భట్టుగూడెం సాక్షి, యాదాద్రి : యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాత నానా యాతన పడుతున్నాడు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడిచినా ఇంకా సౌకర్యాలే కల్పించలేదు. చాలా చోట్ల తాగునీటి వసతి లేకపోవడంతో మండుటెండలకు రైతులు దాహార్తితో అల్లాడుతున్నారు. నీడ సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో చెట్లను ఆశ్రయిస్తున్నారు. కూర్చోడానికి కుర్చీలూ లేవు. మరుగుదొడ్లు, టాయిలెట్లు అరకొరగా ఉన్నాయి.వీటితో పాటు టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు, ధాన్యం తేమ చూసేందుకు మాయిశ్చర్ యంత్రాలు, తూర్పార పట్టేందుకు ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 372 కొనుగోలకు గాను ఇప్పటి వరకు 342 కేంద్రాలు ప్రారంభించారు. కానీ ఏ ఒక్క చోట పూర్తిస్థాయి సౌకర్యాలు కనిపించడం లేదు. ఓ వైపు అకాల వర్షాలు, మరోవైపు కేంద్రాల్లో సమస్యలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ● బీబీనగర్ మండలం భట్టుగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వందకు పైగా వడ్ల రాశులు నిల్వ ఉన్నాయి. కేంద్రాన్ని వారం రోజుల క్రితం ప్రారంభించారు. కానీ, కొనుగోళ్లు చేయడం లేదు. నీరు, నీడ సౌకర్యం లేదు. ● వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం సమకూర్చిన ప్యాడీ క్లీనర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో రైతులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అద్దెకు తీసుకుంటున్నారు. మహిళా రైతులకు టాయిలెట్ సౌకర్యం లేదు. అక్కంపల్లి ఐకేపీ సెంటర్లో నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయలేదు. సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడం లేదు. టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. ● మోత్కూరు మండలం పాటిమట్ల ఐకేపీ కేంద్రంలో నీడ సౌకర్యం లేదు. కొనుగోళ్లు మందకొడిగాసాగుతున్నాయి. ● ఆలేరు మండలం టంగుటూరులో డ్రమ్ములు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. ఎండ వేడికి నీరు వేడెక్కుతుండడంతో రైతులు తాగలేకపోతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచలేదు. టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో చెట్లను ఆశ్రయిస్తున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో కిరాయికి తెచ్చుకుంటున్నారు. ఫ తాగునీటికి కటకట, చెట్ల నీడే దిక్కు ఫ ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, టార్పాలిన్లకూ అవస్థలు ఫ కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఫ వర్షాలకు తడస్తున్న ధాన్యం ఫ నష్టపోతున్న రైతులు కేంద్రం ప్రారంభించడంతోనే సరి..బొమ్మలరామారం మండలం హాజీపూర్ కొనుగోలు కేంద్రానికి 20 రోజుల నుంచే ధాన్యం రాక మొదలైంది. 22వ తేదీన కేంద్రాన్ని ప్రా రంభించారు. కానీ, ఇప్పటి వరకు కొనుగోళ్లు మొదలుకాలేదు. ఈనెల 25వ తేదీ నాటికి 30 మంది రైతుల ధాన్యం కుప్పలు కేంద్రంలో ఉన్నాయి. తాగడానికి కేవలం రెండు క్యాన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడం, తూర్పార పట్టే మిషన్లు లేకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు గాను తూర్పారపట్టే యంత్రాంగానికి గంటలకు రూ.1400 వరకు చెల్లిస్తున్నారు. ఇక నీడ సౌకర్యం లేకపోవడంతో కొనుగోలు కేంద్రంలో ఉన్న వేప చెట్టు కింద రైతులు సేదదీరుతున్నారు. -
తైక్వాండో చాంపియన్షిప్లో బంగారు పతకం
నేరేడుచర్ల: తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం, ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మొదటి ఇండో–నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్–2025లో నేరేడుచర్ల పట్టణానికి చెందిన కొణతం గమన్రెడ్డి పాల్గొని బంగారు పతకం సాధించాడు. గమన్రెడ్డి హైదరాబాద్లోని అల్కాపూర్ టౌన్షిప్ స్కాలర్స్ అకాడమీలో ఐదో తరగతి చదువుతున్నాడు. గమన్రెడ్డి కోచ్ సుబ్బారావు శిక్షణలో ఎస్ఐటీఎస్ సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందుతున్ననాడని అతడి తాత, నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గమన్రెడ్డి ఐదు బంగారు పతకాలు, మూడు వెండి పతకాలు సాధించాడని పేర్కొన్నారు. గమన్రెడ్డి బంగారు పతకం సాధించడంతో అతడి తల్లిదండ్రులు ఉదయ్కుమార్రెడ్డి–శోభన, నాయణమ్మ కొణతం విజయలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బస్ టిక్కెట్పై తప్పుడు తేదీ, సమయం ముద్రణ
మోత్కూరు: ఆర్టీసీ బస్సులో జారీ చేసే టిక్కెట్లపై తప్పుడు తేదీ, సమయం ముద్రించడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మోత్కూరుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూదగాని యాదగిరి తన భార్యతో కలిసి ఆదివారం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్లోని ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్ద తొర్రూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు(టీఎస్ 03 జెడ్ 0457) ఎక్కారు. అక్కడి నుంచి మోత్కూరు వరకు రెండు బస్ టిక్కెట్లు తీసుకున్నారు. ఒక్కోటి రూ.190తో ముద్రించిన టిక్కెట్ను డ్రైవర్ యాదగిరికి ఇవ్వగా.. దానిపై తేది: 02–10–68, సమయం: 8.37నిమిషాలుగా ముద్రించి ఉండటం గమనించి డ్రైవర్ను అడగగా.. టిక్కెట్లు ఇచ్చే మిషన్లో అలాగే వస్తుందని డ్రైవర్ యాదగిరికి సమాధానం ఇచ్చాడు. తాము ప్రయాణించిన బస్సు ఏదైనా ఊహించని ప్రమాదానికి గురైతే తమకు ఎలా ఆధారం అని, టిక్కెట్పై తేదీ, సమయం తప్పుగా ముద్రిస్తే ఎలా అని యాదగిరి అంటున్నారు. -
ఆదర్శం.. ఆ అధికారి
కోదాడ: కోదాడ ఆర్డీఓ తన ఇద్దరు కుమారులను ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వారు కూడా ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 95 శాతానికి పైగా మార్కులు సాఽధించి తండ్రికి తగ్గ తనయులు అనిపించారు. కోదాడ ఆర్డీఓగా సూర్యనారాయణ రెండు సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఆయన పెద్దకుమారుడు షణ్ముఖనాయుడు, చిన్నకుమారుడు యోషిత్నాయుడిని కోదాడలోని కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాడు. వారిద్దరూ ఆర్ట్స్ విభాగానికి చెందిన హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పెద్ద కుమారుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 960 మార్కులు సాధించగా, చిన్న కుమారుడు ఫస్టియర్లో 500 మార్కులకు 490 మార్కులు సాధించి జిల్లా టాపర్స్గా నిలిచారు.ఉన్నత ఉద్యోగమే లక్ష్యంఉన్నత ఉద్యోగం సాధించడమే లక్ష్యం. ఇంటర్ ఫస్టియర్లో 500కు 490 మార్కులను సాధించడం ఆనందంగా ఉంది. మానాన్న చూపిన బాటలో నడిచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మా అన్న కన్నా ఎక్కువ మార్కులు సాధించేందుకు కృషి చేస్తా. – యోషిత్నాయుడు డిగ్రీ కూడా ప్రభుత్వ కాలేజీలోనే..ఇంటర్ హెచ్ఈసీలో 960 మార్కులను సాధించడం ఆనందంగా ఉంది. డిగ్రీ కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదువుతా. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా నా చదువును కొనసాగిస్తాను. మానాన్నే నాకు ఆదర్శం. ఆయన మాట నిలబెడతా. – షణ్ముఖనాయుడు తన కుమారులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తున్న కోదాడ ఆర్డీఓ ఇంటర్ ఫలితాల్లో 95 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు -
కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోటీచేస్తే ప్రతిపక్షాలు ఉండవు
మునుగోడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీచేస్తే మునుగోడు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కావడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంకు ఆదివారం మునుగోడులో నిర్వహించిన అభినందన సభకు రాజగోపాల్రెడ్డి హాజరై మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మునుగోడు, కొత్తగూడెం స్థానాలను కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించిదన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా.. బీజేపీతో ఉన్న తాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిక మేరకు కాంగ్రెస్లో చేరడంతో తనకు మునుగోడు టికెట్ ఇచ్చిందన్నారు. ఆ సమయంలో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, అలాగే తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని.. ఈ మేరకు సత్యంకు ఎమ్మెల్సీ ఇచ్చిందన్నారు. ఈ ప్రాంతం పట్ల అవగాహన కలిగిన సత్యం ఎమ్మెల్సీగా ఎన్నికకావడం ఆనందంగా ఉందన్నారు. తామిద్దరం కలిసి మునుగోడుని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభత్వం మునుగోడుని పూర్తిగా విస్మరించినదని, దీంతో నేటికీ ఈ ప్రాంతంలో సాగునీరు సౌకర్యం కరువైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వారికే కాంగ్రెస్ హయాంలో పదవులు ఇచ్చారన్నారు. చర్లగూడెం, కిష్టరాయిన్పల్లి రిజర్వాయిర్ పనులను పూర్తిచేయించి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని, నిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాదయాత్రలు, ఆందోళనలు చేస్తూ ప్రజల కోసమే పనిచేశానన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఒక బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డితో కలిసి మునుగోడును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం సత్యంను పూలమాల, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు పల్లా దేవేందర్రెడ్డి, శ్రవణ్కుమార్, గుర్జ రామచంద్రం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు. ఫ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీపీఐకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అన్నారు. అభినందన సభలో వెంకట్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐకి ఎమ్మెల్సీ పదవితోపాటు రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మునుగోడు అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సత్యం, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఐక్యంగా పనిచేస్తూ వెనుకబడిన మునుగోడు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు. -
హోరాహోరీగా ఎద్దుల పందేలు
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో రెండో రోజైన ఆదివారం సాయంత్రం ఆరు పండ్ల విభాగంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు కొనసాగాయి. అదేవిధంగా శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు జరిగిన నాలుగు పండ్ల విభాగంలో గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గిత్తలు ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. రెండో బహుమతిని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తుర్లపాడుకు చెందిన మనివిరెడ్డి ఎడ్ల జత కై వసం చేసుకున్నాయి. మూడో బహుమతి కృష్ణా జిల్లా మల్లపల్లికి చెందిన అక్కినేని సాన్విచౌదరి గిత్తలు గెలుపొందాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతితో పాటు షీల్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి, నాయకులు ఆదూరి కిషోర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, టీఆర్బాలశౌరిరెడ్డి, గాలి చిన్నపురెడ్డి, గాదె లూర్ధుమారెడ్డి, పవన్రెడ్డి, బాలరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి, రాజేష్రెడ్డి, అఖిల్రెడ్డి, రంజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిన్నరగా ఎదురుచూపులు
త్వరలో నోటిఫికేషన్ జారీ ఉమ్మడి జిల్లాలో ఆలయాల్లో పాలకవర్గాల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ జారీ అవుతుంది. గతంలో 83 వరకు ఆలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశాం. అందులో 40 వరకు ఆలయాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు చేసుకోని ఆలయాలకు మళ్లీ నోటిఫికేషన్ ద్వారా పాలకవర్గాలు ఏర్పాటు జరుగుతుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. – కె. భాస్కర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఫ ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు పాలకవర్గాలు లేక కుంటుపడుతున్న అభివృద్ధి ఫ ప్రముఖ ఆలయాల్లో ఈఓలు, సిబ్బందితో కష్టతరంగా నిర్వహణరామగిరి(నల్లగొండ): ఉమ్మడి జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలకు ఏడాదిన్నరగా పాలకవర్గాలు లేక ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కుంటుపడుతోంది. ఏటా వివిధ మాసాల్లో నిర్వహించే ఉత్సవాల్లో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో ఈఓలు, సిబ్బందితో దేవాలయాలను నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఒక్కో ఈఓ మూడు, నాలుగు దేవాలయాలకు ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పూర్తిగా ఒకే ఆలయంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. పండుగలు, విశేష రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయాల్లో భక్తులు వేసిన కానుకలు, హుండీ ఆదాయంపై ఉన్న శ్రద్ధ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై దేవాదాయ శాఖ దృష్టి సారించకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఏడాదిన్నర క్రితం గత ప్రభుత్వ పాలనలో ఆలయాల పాలకవర్గం పదవీకాలం ముగిసిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటవుతుందని ఎదురుచూశారు. ఇంతలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల అనంతరం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు నోటిఫికేషన్ రావడంలో జాప్యమైంది. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దేవాలయాల్లో పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చినా అవి మధ్యలోనే ఆగిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధిత అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి చొరవ తీసుకుని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 83 ఆలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 40 ఆలయాల నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మిగతా ఆలయాల నుంచి దరఖాస్తులు రాలేదు. చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి, మఠంపల్లి మండలం స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, తుమ్మడం కోటమైసమ్మ దేవాలయం, నల్లగొండ రామగిరి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాలకు పాలకవర్గం లేకపోవడంతో ఆలయాల నిర్వహణ కష్టతరంగా మారింది. ఆలయాల్లో ఉత్సవాల సమయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు మొదలు పూజాధికార్యాలకు ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గం ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయించే అవకాశం ఉంటుంది. -
ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’
భూదాన్పోచంపల్లి: జాతీయ ఉపాధి హామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీలకు అదనపు ఆదాయం వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ‘ఉన్నతి’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కూలీలకు స్వల్పకాలిక స్వయం ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలు మండలాల్లో శిక్షణ ఇచ్చారు. తాజాగా భూదాన్పోచంపల్లి మండలంలోని జలాల్పురం, భీమనపల్లి, మెహర్నగర్ గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంలో వంద రోజులు పని దినాలను పూర్తి చేసుకొన్న 35 మంది కూలీలను గుర్తించారు. వీరికి జలాల్పురంలోని రైతువేదిక భవనంలో ఎస్బీఐ ఆర్థిక సహకారంతో, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో 12 రోజుల పాటు అగర్బత్తీలు, దూప్స్టిక్, కుంకుమ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. యూనిట్ల స్థాపనకు సహకారం.. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఉపాధి కూలీలకు శిక్షణ కాలంలో రోజుకు రూ.300 వేతనం, భోజన వసతి, ఉచితంగా యూనిఫామ్, మెటీరియల్స్, సర్టిఫికెట్లు అందజేస్తారు. తదనంతరం స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటుకు సీ్త్రశక్తి లేదా బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ద్వారా ముద్ర రుణాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. దాంతో సొంతూరిలోనే స్వయంగా యూనిట్లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందే వీలుంది. అంతేకాక వీరు తయారు చేసిన ఉత్పత్తులను తామే స్వయంగా లోకల్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. లేదంటే ఉత్పత్తులను విక్రయానికి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు.. ఉపాధిహామీ పథకంలో ఈ 2024–25 సంవత్సరానికి గాను ఉన్నతి పథకం ద్వారా జిల్లాలో 175 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో నారాయణపురం మండలం జనగాంలో జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. వలిగొండ మండలం రెడ్లరేపాక, మోటకొండూర్ మండలం మాటూర్, రామన్నపేటలో మాత్రం ఉపాధి కూలీలకు డెయిరీ, వర్మీ కంపోస్ట్లో శిక్షణ అందించారు. ఇలా కూలీలకు డెయిరీ, అగర్బత్తీలు, జ్యూట్బ్యాగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఉపాధి కూలీలకు అదనపు ఆదాయం చేకూర్చేలా కొత్త పథకం కూలి పనులు లేని సమయంలో స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పటికే నాలుగు మండలాల్లో పూర్తి పోచంపల్లి మండలం జలాల్పురంలో కొనసాగుతున్న శిక్షణ శిక్షణ అనంతరం యూనిట్ల ఏర్పాటుకూ రుణాలుఉపాధి కూలీలకు వరం ఉన్నతి పథకం ఉపాధి కూలీలకు వరం లాంటిది. అదనపు ఆదాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అమలు చేస్తోంది. జిల్లాలో ఇప్పటికే కొందరికి శిక్షణ ఇచ్చాం. పోచంపల్లిలో అగర్బత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నాం. యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందజేస్తాం. – కేపీ రాజు, జాబ్స్ జిల్లా మేనేజర్ -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
మునగాల: లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పొన్నగండ్ల జ్యోతి(49) మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్లింది. తిరిగి శనివారం రాత్రి తన అల్లుడు గాదె నరేందర్రెడ్డి కారులో స్వగ్రామానికి బయల్దేరింది. మార్గమధ్యలో అర్ధరాత్రి సమయంలో మునగాల శివారులోని కెనరా బ్యాంకు ఎదురుగా రోడ్డు పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. కారు ముందు సీటులో కూర్చున్న జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి వెంకటరత్నం తెలిపారు. భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యఅర్వపల్లి: మద్యానికి బానిసైన వ్యక్తి భార్యతో గొడవపడి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి జరిగింది. అర్వపల్లి ఎస్ఐ సీహెచ్. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన నవ్య, సూర్యాపేట మండలం గాంధీనగర్కు చెందిన జక్కలి జనార్దన్(30) తొమ్మిదేళ్ల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. జనార్దన్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన జనార్దన్ తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. నవ్య ఉగాది పండుగకు తన పిల్లలతో కలిసి తల్లిగారి ఊరైన కొమ్మాలకు వచ్చింది. అప్పటి నుంచి తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. మూడు రోజుల కిందట జనార్దన్ కూడా అత్తగారింటికి వచ్చాడు. ఈ క్రమంలో మద్యం తాగుతూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటాక జనార్దన్ తన అత్తగారి ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రెండు కార్లు ఢీ.. ఒకరికి గాయాలుఅర్వపల్లి: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై అర్వపల్లిలో ఆదివారం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ వైపు నుంచి రెండు కార్లు సూర్యాపేట వైపు వెళ్తున్నాయి. అర్వపల్లిలోని వైజంక్షన్ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ముందు వెళ్తున్న కారు వైజంక్షన్ వద్ద ఓ టీస్టాల్ బోర్డుకు తగిలి తోపుడుబండ్ల పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడే నిలిపి ఉన్న కర్కాని రమేష్కు చెందిన బైక్ ధ్వంసమైంది. తోపుడు బండ్ల వద్ద ఉన్న మహిళలు సావిత్రి, సువర్ణ అక్కడి నుంచి పరుగు తీసి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు కార్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ముందు కారు నడుపుతున్న ఆరోగ్యరెడ్డి గాయపడగా.. అతడిని 108 అంబులెన్స్లో సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
వరంగల్కు గులాబీ దండు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధం సాక్షి ప్రతినిధి, నల్లగొండ, సాక్షి యాదాద్రి : వరంగల్లో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సన్నద్ధ్దమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో బస్సులు, కార్లు, జీపులలో ఆదివారం ఉదయమే తరలివెళ్లనున్నారు. వరంగల్ జిల్లాకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల్లో ఆదివారం ఉదయం జెండాలు ఆవిష్కరించి సభకు బయలుదేరుతారు. వినూత్న రీతిలో.. వరంగల్ సభకు ఉమ్మడి నల్లగొండ నుంచి లక్ష మందిని తరలించేలా టార్గెట్ పెట్టుకున్నారు. అందులో సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచే సగం మంది ప్రజలు, రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని గతంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతృత్వంలో జనం తరలించేందుకు చర్యలు చేపట్టారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వినూత్న రీతిలో ఎడ్ల బండ్లలో ఈ నెల 22న పార్టీ శ్రేణులు వెళ్లగా, శుక్రవారం సైకిళ్లపై కూడా తరలివెళ్లారు. ఆదివారం ఉదయం వెళ్లేందుకు వందకు పైగా డీసీఎంలు, మరో వంద వరకు బస్సులు, వందల సంఖ్యలో అద్దె కార్లు, సొంత కార్లలో వెళ్లనున్నారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 13,500 మందిని బీఆర్ఎస్ సభకు తరలించాలని నిర్ణయించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని మరీ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో 135 డీసీఎంలు, 100 బొలేరోలు, 20 బస్సులు, తూపాన్ వాహనాల్లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభ విజయవంతానికి మండలాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. భువనగిరి నియోజకవర్గం నుంచి... భువనగిరి నియోజకవర్గం నుంచి 15 వేల మందిని తరలించేందుకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఏర్పాట్లు చేశారు. 200 బస్సులతో పాటు 150 వరకు కార్లు ఏర్పాటు చేశారు. రెండు గ్రామాలకు ఒక బస్సు చొప్పున వెళ్లనున్నాయి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లేలా సన్నద్ధ్దం చేశారు. పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి కూడా సభకు పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలేరులో గ్రామానికో బస్సు.. ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామానికి ఒక బస్సు పెట్టారు. కార్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. వరంగల్కు దగ్గరగా ఉన్నందున ఆ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో 15వేల మంది వరకు తరలించనున్నారు. సన్నాహక సమావేశాలు, పాదయాత్రలు యాదాద్రి జిల్లాలో జనసమీకరణ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీతామహేందర్రెడ్డి, గ్యాదరి కిశోర్కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి అధిష్టా నం అప్పగించింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా మాజీ కోఆర్డినేట్ కొలుపుల అమరేందర్తో పాటు పలువురు సీనియర్ నేతలు సభను విజయవంతం చేయడానికి నెలరోజుల పాటు శ్రమించారు. మండల కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా బీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో వలిగొండ నుంచి యాదగిరిగుట్ట వరకు, రాయగిరి నుంచి యాదగిగుట్ట వరకుపాదయాత్రలు చేశారు. ఫ ఉమ్మడి జిల్లా నుంచి బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో ఓరుగల్లుకు.. ఫ మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఏర్పాట్లు ఫ సూర్యాపేట, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నుంచే ఎక్కువ మంది.. ఫ ఇప్పటికే సూర్యాపేట నుంచి ఎడ్లబడ్లపై వెళ్లిన రైతులు, పార్టీ శ్రేణులు -
యాదాద్రి భువనగిరి
39° /24°Iగరిష్టం/కనిష్టంవాతావరణం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.ఆదివారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025భద్రత కల్పించడమే లక్ష్యం రైతుల భూములకు భద్రత కల్పించడానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి అన్నారు. - IIIలోపోటెత్తిన భక్తులుయాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. 30వేల మందికి పైగా దర్శించుకున్నారు. - IIలో -
ప్రత్యేక తరగతులు.. పరీక్షలు
ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం కార్యాచరణ భువనగిరి: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైన ప్రభుత్వ కళాశాలలపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మే 22నుంచి ప్రారంభంకానున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. దీన్ని ఈనెల 22వ తేదీనుంచి అమలు చేయనున్నారు. అన్ని కాలేజీల్లో 82శాతం లోపే ఉత్తీర్ణత జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 11 ఉన్నాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడినప్పటికీ.. ఏ ఒక్క కాలేజీలో 90 శాతం ఉత్తీర్ణత మించలేదు. ప్రథమ సంవత్సరం గత ఏడాది 34.8 శాతం, ఈ సారి 42.1 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ గత ఏడాది 52 శాతం, ఈసారి 63.11 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సబ్జెక్టుల్లో అధికంగా ఫెయిల్ ఎంపీసీ విభాగంలో గణితం, కెమిస్ట్రీ, బైపీసీ విభాగంలో కెమిస్ట్రీ, ఫిజిక్స్, సీఈసీ విభాగంలో ఎకానమిక్స్లో ఎక్కువగా ఫెయిల్ అయ్యారు. వీటితో పాటు ఇంగ్లిష్లో కూడా చాలా మంది తప్పినట్లు తెలుస్తోంది. కళాశాలల వారీగా ఉత్తీర్ణత ఇలా.. కళాశాలప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం హాజరు/ఉత్తీర్ణత శాతం హాజరు/ఉత్తీర్ణత శాతం రామన్నపేట 164/113 68.9 208/172 82.7మోత్కూర్ 159/109 68.6 105/91 86.7భువనగిరి 65/39 60.0 100/76 76.0చౌటుప్పల్ 101/60 59.4 117/64 54.7పోచంపల్లి 126/67 53.2 124/94 75.8నారాయణపురం 135/59 43.7 127/79 62.2భువనగిరి 145/54 37.2 126/62 49.2యాదగిరిగుట్ట 80/19 23.8 109/67 61.5వలిగొండ 111/26 23.4 124/49 39.5బి.రామారం 34/06 17.7 40/12 30.0ఆలేరు 115/19 16.5 116/52 44.8కార్యాచరణ ఇదీ.. ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైన కళాశాలల్లోని విద్యార్థులకు జిల్లా ఇంటర్మీడియట్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 20 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ● 30 శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణత సాధించిన కళాశాలల్లో విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ● ప్రత్యేక తరగతులకు హాజరుకాని విద్యార్థులకు జూమ్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. ● రెండు లేదా మూడు రోజులకు ఒకసారి ఆయా టెస్టులు నిర్వహిస్తారు. ● ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రధాన సబ్జెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ● ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే చదివిస్తారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 30 వరకు గడువు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22నుంచి ప్రారంభంకానున్నాయి. ఫీజు చెల్లింపునకు ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. తప్పనిసరిగా హాజరుకావాలి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తరగతులతో పాటు టెస్ట్లు నిర్వహిస్తాం. విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. –రమణి, డీఐఈఓ ఫ 28వ తేదీ నుంచి అమలు ఫ మే 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ.. -
పహల్గాం మృతులకు నివాళి
యాదగిరిగుట్ట: కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన పర్యాటకుల ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడిలో గా యపడిన వారు త్వరగా కోలుకోవాలని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ కల్లెపల్లి శ్రీశైలం, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరిగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పక్షులే ప్రాణంగా!
ఆయన ఇల్లంతా కిలకిలరాగాలు ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు పక్షుల కిలకిల రావాలు.. రామచిలుకల కిచకిచలు ఆహ్లాదం కలిగిస్తాయి. ఊర పిచ్చుకల సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది. పక్షి ప్రేమికుడైన ప్రదీప్ చిన్ననాటి హాబీ అయిన పక్షుల పెంపకమే నేడు ఫాం హౌస్గా మారింది. ప్రస్తుతం వివిధ దేశ విదేశాలకు చెందిన 500 రకాల పక్షులను ఇక్కడ సాకుతున్నాడు. తన లాంటి పక్షి ప్రేమికులకు వాటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాడు. – నకిరేకల్ ఫ పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న ప్రదీప్ ఫ పక్షుల కోసం ప్రత్యేక ఫాంహౌస్ ఏర్పాటు ఫ ఇక్కడ వివిధ రకాల 500 పక్షుల సంరక్షణ ఫ విదేశీ రంగురంగుల పక్షులు సైతం లభ్యం ఫ ఎక్కడ కొత్త రకం పక్షి కనిపించినా.. తెప్పించడమే పని ఫ వాటి దాణాకే నెలకు రూ.15 వేలకుపైగా ఖర్చు ఇతర దేశాల పక్షులు కూడా.. ప్రదీప్ బాల్యం నుంచి పక్షుల పెంపకాన్ని హబీగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పక్షులను సంరక్షిస్తున్నాడు. ప్రస్తుతం షెడ్డులో పెద్దపెద్ద జాలీ బోన్లు ఏర్పాటు చేసి పక్షులను సాకుతున్నాడు. ఇప్పుడు సుమారు 50 నుంచి 100 రకాల పక్షులను 500పైగానే పెంచుతున్నాడు. విదేశీ పక్షులు ఎక్కువగా చైన్నె, బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాల్లో పెంచుతారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుకున్న ప్రదీప్ వాటిని ఇక్కడికి తెప్పిస్తున్నాడు. దేశంలో ఎక్కడ డిఫెరెంట్ పక్షులు కనిపించినా వాటిని తెచ్చుకుని సంరక్షించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ మనకు మాట్లాడే రామచిలుకలు, పావురాలు, ఇతర రకాల అందమైన పక్షుల కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే ఒక్కో పక్షి రూ.600 నుంచి రూ.60 వేల పైనే ధర పలుకుతాయి. పక్షుల జీవిత కాలం ఏడాదిన్నర నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన రాపోలు లింగయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు. నకిరేకల్లోని మూసీ రోడ్డులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన కుమారుడు రాపోలు ప్రదీప్కు చిన్నతనం నుంచి పక్షులంటే ఎనలేని ప్రేమ. ప్రదీప్ 17 ఏళ్ల క్రితం నుంచి మూసీ రోడ్డులోని తన ఇంట్లో 100 పక్షులతో పెంపకాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏడేళ్ల క్రితం నకిరేకల్లోని చీమలగడ్డలో 500 గజాల స్థలంలో రూ.10 లక్షల వ్యయంతో రేకుల షెడ్లు వేసి పక్షుల ఫాంహౌస్ ఏర్పాటు చేశాడు. ఆ పరిసర ప్రాంతమంతా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాడు. షెడ్డుపైన జమ్ము వేసి.. స్ప్రింక్లర్ల ద్వారా నిరంతరం నీటితో తడుపుతూ ఎండ నుంచి పక్షులకు రక్షణ కల్పిస్తున్నాడు. ఫాం హౌస్లో పక్షుల సంరక్షణే ఆయన దిన చర్చ. పనిమీద ఎక్కడికై నా వెళ్లినా.. సాయంత్రానికి ఫాంహౌస్ చేరుకుని వాటిని సంరక్షిస్తుంటాడు. పక్షుల షెడ్డులో రాపోలు ప్రదీప్ 500 పక్షులు పెంచుతున్నా.. చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగాను. అప్పటి నుంచే నాకు పక్షులంటే ప్రాణం. చిన్నతనంలో కనిపించిన ఒకటి రెండు పక్షులను తెచ్చుకున్నాను. ఆ తరువాత పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్నాను. ఇప్పుడు 500 పక్షుల వరకు పెంచుతున్నాను. పక్షులు అవసరమైన వారికి వస్తే లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా సాయంత్రంలోగా పక్షుల ఫాం హౌస్కు చేరుకుంటాను. చిన్న పిల్లల మాదిరిగా వాటిని సంరక్షిస్తాను. – రాపోలు ప్రదీప్,పక్షి ప్రేమికుడు, నకిరేకల్హైదరాబాద్, గుజరాత్ నుంచి దాణా ప్రదీప్ తన పక్షుల కోసం ప్రతి నెలా రూ.15 వేలపైనే దాణా కోసం ఖర్చు చేస్తున్నారు. సూర్యాపేట, హైదరాబాద్, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాల నుంచి దాణా తెప్పిస్తున్నాడు. వాటికి కొర్రలు, రాగులు, వేరుశనగ, పెసర్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ తదితర పదార్థాలను ఆహారంగా ఇస్తున్నాడు. పశు వైద్యుల సలహాలు తీసుకోవడంతోపాటు పక్షులకు వైద్యం చేయిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. -
28న ప్రజావాణి రద్దు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో ఈనెల 28వ తేదీన జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో ఉన్నతాధికారులు పాల్గొంటారని, ఈ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సమస్యలపై వినతులు అందజసేందుకు కలెక్టరేట్కు రావద్దని, అధికారులకు సహకరించాలని కోరారు. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి బియ్యంసాక్షి, యాదాద్రి : కొత్తరేషన్ కార్డుదారులకు మే నెల నుంచి సన్న బియ్యం పంపి ణీ చేస్తామని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెలలో కొత్తగా 419 రేషన్ కార్డులు మంజూ రయ్యాయని, వీటిపై 30,188 యూనిట్లకు బియ్యం సరఫరా చేస్తామన్నారు. ఏప్రిల్ నెలలో 2,16, 904 కార్డులకు గాను 6,76,188 యూ నిట్ల (లబ్ధిదారులకు) బియ్యం ఇచ్చామన్నారు. మే నెలనుంచి పెరిగిన వాటితో కలిపి 2,17,323 కార్డులకు 7,06,368 యూనిట్ల బియ్యం సరఫరా చేస్తామన్నారు. బొమ్మలరామారం నిప్పులకొలిమి భువనగిరిటౌన్ : జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం బొమ్మలరామారం మండలంలో ఏకంగా 44.1 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరింది. గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో ఈస్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా మండలాల్లోనూ 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రానున్న మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ బదిలీ భువనగిరి : జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం వైద్యారోగ్య శాఖనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న రాజారావు 8 నెలల కిత్రం ఇక్కడికి వచ్చారు. ఆయన స్థానంలో ఆర్థోపెడిక్ సర్జరీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లకు ఇంచార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర్లను డాక్టర్ రాజారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేష్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు, డీసీహెచ్ఎస్ చిన్ననాయక్ సన్మానించారు. -
మలేరియా రహిత జిల్లాగా మారుద్దాం
భువనగిరి : మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి మలేరియాను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించిందన్నారు.ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి మందులు అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా ప్రోగ్రాం అధికారి సాయిశోభ, ప్రోగాం అధికారులు డాక్టర్ శిల్పిని, వీణ, సుమన్ కళ్యాణ్, మాస్ మీడియా జిల్లా అంజయ్య, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు.అంతకుముందు ప్రధానాలయంలో నిత్యపూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ప్రాకార మండపపం, ముఖ మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ బదిలీ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) హెడ్ కాని స్టెబుల్స్, కానిస్టేబుల్స్ బదిలీ అయ్యారు. ఇందులో ఐదుగురు హెడ్ కానిస్టెబుల్స్, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నట్లు ఆర్ఎస్ఐ శేషగిరిరావు తెలిపారు. ఐదుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుల్స్ను వరంగల్, ఒక కానిస్టేబుల్ను హైదరాబాద్క బదిలీ చేసినట్లు వెల్లడించారు. వీరి స్థానంలో కొత్తవారు రానున్నారని, త్వరలో విధుల్లో చేరుతారని పేర్కొన్నారు. యాదగిరి కొండపై తనిఖీలుయాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఆలయ పరిసరాల్లో శుక్రవారం బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. క్యూలైన్లు, ఉచిత దర్శన మార్గం, ఆలయ పరిసరాల్లో తనిఖీలు చేశాయి. అనుమానితుల లగేజీ బ్యాగులను పరిశీలించాయి. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఘటన నేపథ్యంలో రాచకొండ సీపీ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణం భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. ముందుగా వేకువజామున సుప్రభాత సేవల, తోమాల సేవ, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కుంకుమార్చన నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన భువనగిరి : మండలంలోని బస్వాపురం ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి నెల రోజులు కావస్తుందని, ఇప్పటి వరకు కాంటా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి, పగలు వడ్లకుప్పల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని, త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రైతులు విజయ్కుమార్, సత్యనారాయణ, మంగమ్మ తదితరులు ఉన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలిసూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. -
చిన పిల్లల రక్షణ ఇలా..
వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగితే పిల్లలు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, నిమ్మరసం, కీర దోస, పుదీన నీరు తాగించాలి. తెల్లని వదులైన కాటన్ దుస్తులు వేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి పంపవద్దు. తలనొప్పి, తలతిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక చెమట, అదిక దాహం కలిగితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, నల్లగొండ -
మండే ఎండల్లో జర భద్రం
నిరుపయోగంగా ఆస్పత్రి భవనం మోటకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంఆవరణలో నిర్మించిన 30 పడకల భవనం నిరుపయోగంగా ఉంది.జైలును పరిశుభ్రంగా ఉంచాలి జైలును పరిశుభ్రంగా ఉంచాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అక్తర్ జైలు సిబ్బందికి సూచించారు.- IIIలోశనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- IIలోఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదులకు జాగ్రత్తలు తప్పనిసరి ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండల తీవ్రత మొదలవుతోంది. రాత్రి 10 గంటలకు కూడా వాతావరణం చల్లబడడం లేదు. ఎండల దాటికి ప్రజలు ఇళ్లనుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిస్తే ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉంది. లేదంటే మే నెలలో 46 డిగ్రీలకు మించే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండడంతోపాటు చెట్లను, జీవరాశులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు బాగా తాగాలి. – రమణ, జనరల్ ఫిజిషియన్, సూర్యాపేట నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు. కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధి అధికారులు. ● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి. ● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి. ● గ్రీన్మ్యాట్పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి. ● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి. ● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి. ● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు. కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి. ● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి. ● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు. ● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి. ● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి. ● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. ● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్లను తాగించాలి. ● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి. ● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి. మొక్కలకు నీరు పోస్తున్న దాత్రక్ పద్మ సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో పాల్గొనాలి వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్లో అందరూ భాగస్వాములు కావాలి. – కనుకుంట్ల విద్యాసాగర్రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్ న్యూస్రీల్కిచెన్, టెర్రస్ గార్డెన్లను కాపాడుకోండి ఇలా.. పెంపుడు జంతువులు – జాగ్రత్తలు.. -
ఉక్కపోత.. చిన్నారుల వెత!
ఫ అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల లేమి ఫ చాలా చోట్ల ఫ్యాన్లు కూడా లేని దయనీయ స్థితి ఫ ఎండతీవ్రతకు ఉక్కిరిబిక్కిరి ఆలేరు రూరల్ : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే తన ప్రతాపం ప్రదర్శిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరువయ్యాయి. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వగా అంగన్వాడీ కేంద్రాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రాల్లో సౌకర్యాలు కొరవడటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా కేంద్రాల్లో కనీసం ఫ్యాన్లు కూడా లేవని, ఎండవేడిమికి కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఉక్కపోతకు ఉండలేకపోతున్నారు. ఎండతీవ్రత కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపాలంటే జంకుతున్నారు. జిల్లాలో 901 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కలిపి 25వేల మందికి పైనే ఉన్నారు. ఎండతీవ్రత వల్ల కేంద్రాలకు చిన్నారుల హాజరుశాతం తగ్గుతోంది. కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఫ్యాన్లు లేని కేంద్రాలే అధికం ఆలేరు ప్రాజెక్టు పరిధిలో 219 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కేవలం 56 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. 116 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోని ఇరుకు గదులు, వరండాల్లో నిర్వహిస్తున్నారు. 47 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిలో మరుగుదొడ్లు లేనివి 111, మంచినీటి సౌకర్య లేనివి 70, విద్యుత్, ఫ్యాన్ వసతి లేని కేంద్రాలు 96 వరకు ఉన్నాయి. గాలి, వెలుతురు రాకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, వానొస్తే కురువడం, బండలు పగిలిపోయి ఎలుకలు, పాములకు నిలయంగా మారుతున్నాయి. ఆరు కేంద్రాలకు నూతన భవనాలు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. రఘునాథపురం, మల్లాపురం, మంచిరోనిమామిళ్లు గ్రామంలో గోతులు తీసి వదిలేయగా.. టంగుటూరు, మాసాయిపేట, మోటకొండూర్లో పనులే మొదలుకాలేదు. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి. -
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి,యాదాద్రి : తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్, నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ, ఇండియన్ పౌల్ట్రీ ఎక్యూప్మెంట్ మాన్యుఫాక్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్లెక్సీకి పాలభిషేకం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టర్ల ద్వారా కుండా పౌల్ట్రీ యజమానుల ద్వారా జరగాలని సీఎం రేవంత్రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. పౌల్ట్రీ రైతులను ఆదుకోవడానికి ముందుకువచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు కాసర్ల మోహన్రెడ్డి, పౌల్ట్రీ ఇండియా ఫౌండర్ అనిల్ధుమాల్, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్రావు, పౌల్ట్రీ ఇండియా డైరెక్టర్ పొట్లూరి చక్రధర్రావు, పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు. -
నీటిసంపులో పడి బాలుడు మృతి
చింతపల్లి: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గండికోట మురళి– సరస్వతిలకు కుమారుడు గండికోట సతీష్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు. వేసవి సెలవులు కావడంతో సతీష్ ఇంటి వద్దే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో జారి పడ్డాడు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం వెతికారు. సతీష్ నీటి సంపులో విగతజీవుడిగా పడి ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలానికి చెందిన వంగాల లవయ్య (48) ద్విచక్రవాహనంపై దేవరకొండలో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో లవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వంగాల మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. -
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
నల్లగొండ : ఖైదీలకు వసతులు కల్పించడంతోపాటు జైలును పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీం అక్తర్ సూచించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును ఆయన సందర్శించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జైలులోని వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను జస్టిస్ షమీం అక్తర్ పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల వివరాలు, సౌకర్యాలు, ఏర్పాట్లు తదితర వివరాలను జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ వివరించారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, సంక్షేమ హాస్టళ్ల ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతి నిధులతో మాట్లాడారు. జిల్లా జైలులో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నారని, అందులో 21 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం జైలును నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జైలర్ బాలకృష్ణ, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరామిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్లు ఉన్నారు. ఫ ఖైదీలకు వసతులు కల్పించాలి ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఫ నల్లగొండ జిల్లా జైలును సందర్శించిన జస్టిస్ షమీమ్అక్తర్ -
అంతర్జాతీయ స్థాయికి తూరు్పగూడెం వాసి
తుంగతుర్తి : లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ మారుమూల ప్రాంత వాసి. నిరుపేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి వరకూ చేరుకున్నాడు. తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన తల్లాడ రామకోటయ్య, కమలమ్మ దంపతుల కుమారుడు తల్లాడ భాస్కర్ భోపాల్ లోని సీఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్– ఏఎంపీఆర్ఐ) డైరెక్టర్గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన సీఎస్ఐఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సీఎస్ఐఆర్ – ఐఐపీ డెహ్రాడూన్లో చీఫ్ సైంటిస్ట్గా, మెటీరియల్స్ రిసోర్స్ ఎఫీషిఝెన్సీ డివిజన్ హెడ్గా పని చేస్తున్నారు. ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల్లో ఒకరుగా.. తల్లాడ భాస్కర్ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ మొదటి నుంచి చదువులో రాణిస్తూ ఉండేవారు. సంవత్సరం క్రితం భాస్కర్ తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు గ్రామంలో ఇంటి స్థలం కూడా లేదు. ప్రాథమిక విద్య తూర్పు గూడెంలో, ఆరు, ఏడవ తరగతి గుమ్మడవెల్లిలో, 8, 9వ తరగతి తుంగతుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, పదో తరగతి సూర్యాపేట జెడ్పీ బాలుర పాఠశాలలో 1986–87 లో ఇంటర్మీడియట్ సూర్యాపేటలో చదివారు. నాడు తుంగతుర్తి, గుమ్మడవెల్లి గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ (2022– 2024 )ప్రకారం ఆయన ఎనర్జీ రంగంలో ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల్లో ఒకరుగా నిలిచారు. చదువే ప్రధానం : డాక్టర్ తల్లాడ భాస్కర్ చదువుకుంటేనే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న కుటుంబం కాదు. నేను చదువుకొని ముందుకు వెళ్తే ఏదో ఒకటి లభిస్తుందని ఉన్నతంగా చదువుతున్నా. ఫ నిరుపేద కుటుంబంలో జన్మించి శాస్త్రవేత్తగా ఎదిగిన తల్లాడ భాస్కర్ ఫ సీఎస్ఐఆర్– ఏఎంపీఆర్ఐ డైరెక్టర్గా నియామకం ఫ సూర్యాపేటలోనే ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం -
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
సూర్యాపేటటౌన్ : మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ రెండు రోజుల జైలు శిక్ష విధించారు. సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఆరుగురు పట్టుబడినట్లు తెలిపారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా సూర్యాపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా, మిగతా ఐదుగురికి రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకుల దుర్మరణంమునుగోడు: బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం మునుగోడు మండలంలోని ఊకొండి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మర్రి మురళి (21), బింగి మచ్చగిరి(20) ఇరువురు స్నేహితులు. మురళి హైదరాబాద్లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు వివాహానికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉండగా చిట్యాలలోని పౌల్ట్రీ ఫామ్లో పనిచేస్తున్న అతడి స్నేహితుడు మచ్చగిరితో కలిసి చిట్యాల వరకు బైక్పై వెళ్లి, అక్కడి నుంచి బస్సులో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో ఊకొండి నుంచి ఇద్దరు కలిసి బైక్పై సాయంత్రం సమయంలో బయలుదేరారు. గ్రామ శివారులోని సెల్టవర్ సమీపంలోని మూలమలుపు వద్ద విద్యుత్స్తంభానికి బైక్ బలంగా ఢీ కొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మునుగోడు ఎస్సై రవి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చేతికి వచ్చిన కుమారులు అర్ధాంతరంగా మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లు సీజ్ కోదాడరూరల్ : అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్న ఐదు టిప్పర్లను, మట్టి తవ్వుతున్న జేసీబీని మైనింగ్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 633లో అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారనే సమాచారం మేరకు మైనింగ్ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. మట్టి తవ్వుతున్న జేసీబీతో పాటు ఐదు టిప్పర్లను సీజ్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అదేవిధంగా గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 615లో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 4వరకు మట్టి తవ్వేందుకు అనుమతి తీసుకొని దానిని జూన్ 4వరకు గడువు ఉన్నట్లుగా ఫోర్జరీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈమేరకు వానికి జరిమానా విధించనున్నట్లు మైనింగ్ ఏడీ విజయరామరాజు, ఆర్ఐ జగదీష్ తెలిపారు. జూదరుల అరెస్ట్త్రిపురారం : త్రిపురారం గ్రామ శివారులోని పంట పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదం ఆడుతున్న వారిపై శుక్రవారం త్రిపురారం పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారయ్యారు. ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని పొలాల్లో జూదం ఆడుతున్నట్లు సమాచారం రావడంతో ఆకస్మికంగా దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు పారిపోయినట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ.7200 నగదు, నాలుగు సెల్ఫోన్లు, ఆరు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బోరు మోటార్ల చోరీ నిందితుల అరెస్ట్
నార్కట్పల్లి : వ్యవసాయ మోటార్ల చోరీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం డీఎస్పీ శివరాంరెడ్డి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 9న రాత్రి సమయంలో షాపల్లి గ్రామంలోని కన్నెబోయిన శ్రీను వ్యవసాయ బోరు మోటారు చోరీకి గురైంది. ఈమేరకు బాధితుడు నార్కట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మాగి నాగరాజుపై అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం పక్క సమాచారంతో మండల కేంద్రంలోని అమ్మనబోలు రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై అనుమానాస్పదంగా ఉన్న నలుగురిలో మాగి నాగరాజు ఉండడంతో అతడిని పట్టుకుని విచారించారు. గత రెండు సంవత్సరాల నుంచి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి షాపల్లి, తొండల్వాయి, నక్కలపల్లి, కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, నారెగూడెం, వివిధ గ్రామాల్లో వ్యవసాయ భూముల వద్ద బోరుమోటార్లు చోరీ చేసినట్లు అంగీకరించాడు. దీంతో వారిని విచారించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రూ.9.60 లక్షల విలువైన 24 బోరు మోటార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో నార్కట్పల్లి మండలం షాపల్లి గ్రామానికి చెందిన మాగి నాగరాజు (ఎ–1), సుద్దాల నర్సింహ(ఎ–2), బకరం శేఖర్(ఎ–3), బాషపాక సైదులు(ఎ–4), నల్లమాద లింగయ్య(ఎ–5), బాషపాక లింగయ్య(ఎ–6)గా ఉన్నారని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. వీరంతా ఉదయం ఎక్కడెక్కడ బోరు మోటార్లు ఉన్నాయని రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యండిండి: మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శుక్రవారం డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని పీహెచ్సీ ప్రహరీ వద్ద ఉన్న చెట్లపొదల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని పీహెచ్సీ సిబ్బంది, చుట్టు పక్కల ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు దాదాపు 50 సంవత్సరాల వరకు ఉంటుందని, గోధుమ రంగు షర్ట్, బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. తెలిసిన వారు 8712675544, 8712670223 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫ 24 బోరు మోటార్లు, రెండు బైక్లు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి -
టైర్ల షాపులో అగ్నిప్రమాదం
మిర్యాలగూడ అర్బన్: ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి టైర్ రీ ట్రేడింగ్ వర్క్ షాపు పూర్తిగా దగ్ధమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్పేటలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు మచ్చ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ విజయలక్ష్మి టైర్ రీ ట్రేడింగ్ వర్క్ షాపు లోపలి నుంచి పొగలు వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు షాపు యజమాని మచ్చ శ్రీనివాస్కు సమాచారం అందించారు. షాపు వద్దకు వచ్చిన శ్రీనివాస్ తాళం తీసి చూడగా అప్పటికే టైర్లకు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ వ్యాపించింది. విషయం తెలుసుకున్న ఫైర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో వందకు పైగా రీ బాటమ్ చేసిన టైర్లు దగ్ధం కాగా వర్క్ షాపులోని మిగతా సామగ్రి మొత్తం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో మొత్తం రూ.16 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
బైక్ను ఢీకొట్టిన డీసీఎం.. భార్య మృతి
చౌటుప్పల్ రూరల్: బంధువుల అంత్యక్రియలకు బైక్పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి డీసీఎం ఢీకొనడంతో తీవ్ర గాయాలతో భార్య మృతి చెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ స్టేజీ వద్ద గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొండె జంగయ్య తన భార్య హైమావతి(39)తో కలిసి చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో తమ బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బైక్పై వస్తున్నారు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం రెడ్డిబాయి గ్రామ స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైమావతి తీవ్రంగా గాయపడింది. జంగయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. హైమావతిని చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంగయ్య రైల్వే డిపార్ట్మెంట్లో గ్యాంగ్మెన్గా పని చేస్తున్నాడు. వీరికి బీటెక్ చదివే కుమారుడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. ఫ భర్తకు గాయాలు -
డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 2400 స్పాస్మో ట్యాబ్లెట్లు, ఒక బైక్, రూ.22,000 నగదు, రెండు సెల్ఫోన్లు, మెడికల్ షాప్ లైసెన్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ రాజశేఖర్రెడ్డితో కలిసి డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 11గంటల సమయంలో నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని మునుగోడు రోడ్డులో వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్రెడ్డి, పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్కచెల్మ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా వసీముద్దీన్ అలియాస్ వసీం అక్రం బైక్పై బ్యాగుతో అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా అందులో 288 మత్తు కల్గించే స్పాస్మో ట్యాబ్లెట్ షీట్లు లభించాయి. అతడి నుంచి ట్యాబ్లెట్ల షీట్లతో పాటు బైక్, సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వసీముద్దీన్తో పాటు అక్కచెల్మ ప్రాంతానికే చెందిన అతడి స్నేహితులు ఖాజా షోయబ్, షేక్ అమేర్ కొంతకాలంగా స్పాస్మో ట్యాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసయ్యారని డీఎస్పీ పేర్కొన్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలని వీరు ముగ్గురు స్థానికంగా మెడికల్ షాపుల్లో ఈ స్పాస్మో ట్యాబ్లెట్లు అమ్మట్లేదని తెలుసుకుని, గత ఆరు నెలల నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడు కొప్పురవారి యశ్వంత్ మణిదీప్ శ్రీనివాసరావు దగ్గరకు బైక్పై వెళ్లి స్పాస్మో ట్యాబ్లెట్లు కొనుగోలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఒక్కో షీట్ను రూ.100కు కొని వారి అవసరం మేరకు వినియోగించగా.. మిగిలిన ట్యాబ్లెట్లను ఒక్కో షీట్ రూ.180కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టుబడిన వసీముద్దీన్ను తీసుకొని పిడుగురాళ్లకు వెళ్లి ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడు మణిదీప్ శ్రీనివాసరావును పట్టుకున్నట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి 15 షీట్ల స్పాస్మో ట్యాబ్లెట్లు, సెల్ఫోన్, మెడికల్ షాపు లైసెన్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. వసీముద్దీన్, మణిదీప్ శ్రీనివాసరావును రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఖాజా షోయబ్, షేక్ అమేర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎస్ఐలు శంకర్, సందీప్రెడ్డి, కానిస్టేబుళ్లు రబ్బాని వెంకటనారాయణ, కిరణ్, షకీల్, శ్రీకాంత్, సైదులును ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్టు అమ్మొద్దు.. మెడికల్ షాపుల నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్లు అమ్మొద్దని డీఎస్పీ శివరాంరెడ్డి సూచించారు. ఒకవేళ అధిక డబ్బులకు ఆశపడి అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా స్పాస్మా టాబ్లెట్ల కోసం మెడికల్ షాపుల వద్దకు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఫ 2400 స్పాస్మో ట్యాబ్లెట్లు, బైక్, రూ.22,000 నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి -
చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలి
నకిరేకల్: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యంతో చదవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఉద్దీపన(వీవీఎం ఎయిడెడ్) స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం రాత్రి స్థానిక జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో స్కూల్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను కూడా చిన్నతనం నుంచే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని మందుకు సాగానని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమకు ఇష్టమైన ఆటల్లో ప్రోత్సహించాలన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సారథ్యంలో ఉద్దీపన స్కూల్లో కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుండడం అభినందనీయమన్నారు. నకిరేకల్ జెడ్పీహెచ్ఎస్ను పోలీస్ శాఖ దత్తత తీసుకుని ఎన్రోల్మెంట్ కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హెచ్ఎం గంగాధర భద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్కూల్ సలహాదారుడు డాక్టర్ ఆనందన్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, ట్రస్మా గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు మంజుల, రజితాశ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీలు చామల శ్రీనివాస్, బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, వివిధ మండలాల ఎంఈఓలు మేకల నాగయ్య, అంబటి అంజయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ, చెరుకు సతీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫ నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ -
నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీని ఆదుకోవాలి
ఆలేరురూరల్: నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి రూ.50 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆలేరులోని వైఎస్ఎన్ గార్డెన్లో జరిగిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. మదర్, విజయ, కరీంనగర్, ముల్కనూర్ డెయిరీలతో పాటు ప్రైవేట్ డెయిరీలు తక్కువ రేటుకే పాల సేకరణ చేసి రైతులకు నష్ట చేకుర్చుతున్నారన్నారు. మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకపోయిందని ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమన్నారు. నష్టాలకు కారణం రైతులు కాదని పాలకవర్గాలు చేసిన తప్పిదాలేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లీటర్ పాల ధరకు రూ.5 ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమిలేని వారికి, వ్యవసాయ కార్మికులకు 90 శాతం సబ్సిడీపై పాడి పశువులను పంపిణీ చేయాలని కోరారు. పాల రైతులకు రూ.3 లక్షలు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య, నర్సింహులు, పోతిరెడ్డి సుదర్శన్, తీగల సాగర్, బొంతల చంద్రారెడ్డి, జంగారెడ్డి, మేక అశోక్, బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సంజీవ్రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, భిక్షపతి, సత్తిరెడ్డి, పోశెట్టి, భాస్కర్, నాగరాజు, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి -
30 ఏళ్ల ముందుచూపుతో..
ఆలేరురూరల్: ఆలేరు మున్సిపాలిటీలో ముప్పై ఏళ్ల వరకు ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేలా ముందుచూపుతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన రెండు ట్యాంకులు, 14 కిలోమీటర మేర పైపులైన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు 2023 సెప్టెంబర్లోనే పాలన అనుమతులు లభించగా 2024 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. 20 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది. పనులు పూర్తయితే మున్సిపాలిటీలో ముప్పైఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండదు. ఆలేరును రెండు జోన్లుగా విభజించి.. ఆలేరు మున్సిపాలిటీని రెండు జోన్లుగా విభజించి పనులు చేపట్టారు. జోన్–1 రైల్వే ట్రాక్ ఉత్తర దిశలో నూతనంగా 7 లక్షల లీటర్లు, జోన్–2లో రైల్వే ట్రాక్కు దక్షిణ దిశలో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను నిర్మిస్తున్నారు. ఈరెండింటి నిర్మాణానికి రూ.2.97 కోట్లు కాగా ఇంటింటికి నీటి సరఫరాకు అవసరమైన పైప్లైన్ల నిర్మాణాలకు రూ.1.63 కోట్లును కేటాయించారు. ఇతర పనులు, జీఎస్టీ తదితర చెల్లింపులకు రూ.6.49 కోట్లు, ఐదు సంవత్సరాల పాటు నీటి పథకాల నిర్వహణకు 87లక్షల రూపాయలు కేటాయించారు. ట్యాంకుల నిర్మాణం ఎక్కడెక్కడంటే.. అమృత్–2 పథకం కింది ఆలేరు మున్సిపాలిటీలో రెండు భారీ నీటి ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, రెండోది కొలనుపాక రోడ్డు పాత మున్సిపాలిటీ భవనం వద్ద నిర్మిస్తున్నారు. కళాశాలలో ట్యాంకు నిర్మాణ పనులు పూర్తికావొస్తుండగా పాత మున్సిపల్ భవనం వద్ద నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతున్నాయి. త్వరలోనే పనులు పూర్తిచేస్తాం ఆలేరు ప్రజలకు అమృత్ పథకం 2.0 కింద తాగనీరు అందించడానికి రెండు భారీ ట్యాంకులు నిర్మిస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తి చేసి ట్యాంకులను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తాం. దీంతో 30 ఏళ్ల వరకు తాగునీరు సమస్య ఉండదు. – బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఆలేరు ఫ ఆలేరు మున్సిపాలిటీలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులు ఫ రెండు చోట్ల భారీ నీటి ట్యాంకులు ఫ 14 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం ఫ త్వరలోనే పూర్తికానున్న పనులు ఫ మున్సిపాలిటీలో తీరనున్న నీటికష్టాలు నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో..) మంజూరైన నిధులు 12 ట్యాంకుల నిర్మాణానికి 2.97 పైప్లైన్ పనులకు 1.63 మరో ఏడు రకాల పనులకు 3.75 ఇతర చెల్లింపులకు 2.74 పథకం నిర్వహణకు 87లక్షలుఆలేరు మున్సిపాలిటీ వివరాలు మొత్తం వార్డులు 12 నివాసగృహాలు 4,877 నల్లా కనెక్షన్లు 4,650 నీళ్ల ట్యాంకులు 27 మున్సిపల్ బోర్లు 49 అద్దె బోర్లు 06 నీటి సరఫరా 1.6 ఎంఎల్డీ -
అర్హులకే ఇళు్ల వచ్చేలా..
ఇంటింటి సర్వే ప్రారంభించిన అధికారులు సాక్షి, యాదాద్రి : నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వేను వేగవంతం చేసింది. అయితే ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా ఇందులో 17 గ్రామాలను ఎంపిక చేసి 724 ఇళ్లను ఇప్పటికే మంజూరు చేసింది. గ్రామాల్లో మిగతా ఇళ్లకు లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈనె 22 నుంచి గెజిటెడ్ అధికారులతో మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా దరఖాస్తుదారుల ఇళ్లలో విచారణ (సర్వే) ప్రారంభించింది. ఈ సర్వే ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామాల్లోని ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాలను జిల్లా కలెక్టర్కు అందజేయగా అత్యంత నిరుపేదలకు ముందుగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో గ్రామానికి ఐదుగురు అధికారులు ఒక్కో గెజిటెడ్ అధికారికి 200 ఇళ్ల విచారణ బాధ్యతలు అప్పగించారు. ఎల్–1, ఎల్–2, ఎల్–3 జాబితాల ఆధారంగా ఒక్కో గ్రామానికి నలుగురు నుంచి ఐదుగురు అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీఓలు, ఎంపీఓలు, పీఆర్ జేఈలు, ఏఓలు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు 200 ఇళ్ల పరిశీలన చేస్తున్నారు. గుడిసెలు, ఇంటిపై టార్పాలిన్ కవర్లు కప్పుకున్న వారు, పెంకుటిల్లు ఉన్నవారు, కిరాయికి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అనంతరం అర్హుల జాబితాలను పంచాయతీ, మున్సిపాలిటీల నోటీస్ బోర్డుల్లో అతికిస్తారు. అనంతరం కలెక్టర్కు అందజేస్తారు. మే మొదటి వారంలో లబ్ధిదారుల జాబితా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మే మొదటి వారంలో ఇళ్లు మంజూరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందిరమ్మ కమిటీలు ఇచ్చిన జాబితాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. అధికారులు సర్వే అధారంగా ఇచ్చిన జాబితాలను కలెక్టర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రికి సమర్పించి ఆయన నుంచి మంజూరు తీసుకుంటారు. అనంతరం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఇవీ అనర్హతలు.. ఫ ఆర్సీసీ ఇల్లు ఉన్న వారికి ఇవ్వరు. ఫ రెండున్నర ఎకరాల కంటే ఎక్కువ సాగు భూమి, లేదా 5 ఎకరాల నీటిపారుదల లేని భూమి ఉండొద్దు. ఫ నాలుగు చక్రాల వాహనం, వ్యవసాయ అనుబంధ 3బై4 చక్రాల వాహనం ఉండొద్దు. ఫ రూ.50 వేల కంటే ఎక్కువ కిసాన్ క్రెడిట్ కార్డు పరపతి ఉండొద్దు. ఫ ఇన్కం టాక్స్ చెల్లించే వారు అనర్హులు. ఫ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఫ ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఉండకూడదు. ఫ ప్రస్తుతం ఉన్న ఇంటికి అనుబంధంగా మరో నిర్మాణం, లేదా ఉమ్మడిగా ఇంటి నిర్మాణం చేసే వారికి పథకం వర్తించదు. ఫ ఒక్కో అధికారికి 200 ఇళ్లు కేటాయింపు ఫ పక్కాగా నిబంధనల అమలుపై దృష్టి ఫ అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఫ నెలాఖరు వరకు పూర్తికానున్న సర్వే నిబంధనలు ఇలా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం లబ్ధిదారు ఉంటున్న ఇంటి పైకప్పు, గోడల రకం, కచ్చా లేదా పక్కా నిర్మాణమా చూపాలి. లబ్ధిదారు ఉంటున్న ఇల్లు అద్దె లేదా సొంతమా.. ఇంటి నిర్మాణ స్థలం ఉంటే దానిరకం (పట్టా, రిజిస్టర్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకం, స్థలం పంచుకుంటే దానికి సంబంధించిన రుజువులు) ఉండాలి. ఇంటి స్థలం 60 గజాల కంటే ఎక్కువ ఉందా.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు, మున్సిపాలిటీల్లో నెలకు రూ.25 వేల కంటే తక్కువగా ఆదాయం ఉండాలి. లబ్ధిదారు గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండాలి. మున్సిపాలిటీలో ఐదేళ్లకు మించి నివాసముండాలి. 400 నుంచి 600 చదరపు అడుగుల్లో రెండు గదులు, ప్రత్యేకంగా వంట గది, టాయిలెట్తో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంది. -
ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎలుకల నివారణ చర్యలు ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండా రోజూ శుభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్ మెష్ మూతలు అమర్చాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. పెద్దవూర: యాసంగి వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఎలా భద్రపర్చుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ఆరుగాలం శ్రమించి అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసి పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకోవడం రైతులకు సవాలుగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుంచి 20 శాతం నష్టపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్. ధాన్యం నిల్వ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే.. ధాన్యం నూర్పిన తర్వాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. సాధారణంగా వరికోతల సమయంలో ధాన్యంలో 20శాతం తేమ ఉంటుంది. గతంలో కూలీలచే వరి కోతలు కోపించేవారు. కూలీల కొరత ఒకవైపు, అకాల వర్షాల భయంతో పంట చేతికి వచ్చేదాకా రైతులకు భరోసా లేకుండా పోతుంది. కూలీలచే వరి పంటను కోసిన తర్వాత వరి పసలను ఆరబెట్టడం వల్ల 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతానికి తేమ ఉంటే బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం రైతులు వరికోత యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పంట పచ్చగా ఉన్నప్పుడే వరి కోతలు కోస్తున్నారు. దీంతో ధాన్యంలో మరింత తేమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి తేమ శాతం 14లోపు వచ్చేదాక చూసుకోవాలి. ధాన్యాన్ని నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగచేస్తాయి. అంతేకాక ఎలుకలు ధాన్యాన్ని తినడమేకాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాలు ఫ ముక్క పురుగు : పంట కోయడానికి ముందు నుంచి ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుంచి వెలువడే కొవ్వు పదార్థంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. లార్వా ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది. ఫ వడ్ల చిలుక: ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే ధాన్యం చెడువాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌఢ దశకు చేరిన తరువాత ఆ రంధ్రం ద్వారా వడ్ల చిలుక బయటకు వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది. ఫ నుసి పురుగు: దీనినే పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నదిగా 3 మి.మీ పొడవు ఉంటుంది. ప్రౌఢ కీడకం ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజ పైపొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది. ధాన్యం నిల్వ చేసే పద్ధతి రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల్లో నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాములు లేదా గిడ్డంగులను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షం నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచుల పైన, లోపల మలాథియాన్ లేదా ఎండో సల్ఫాన్ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో ఆరబెట్టాలి. -
వృద్ధురాలికి గాయాలు
అడ్డగూడూరు: వలింగొడ–తొర్రూర్ జాతీయ రహదారిపై అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామంలో తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా.. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం గ్రామ స్టేజీ వద్ద ఎదరుగా వస్తున్న డీసీఎం తప్పించే క్రమంలో డివైడర్ను ఢీకొట్టారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న పెండెం గౌరమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలపిపారు. నాణ్యత పాటించని హోటళ్లకు జరిమానా సూర్యాపేట అర్బన్: సూర్యాపేట పట్టణంలో నాణ్యత పాటించని పలు హోటళ్లకు గురువారం మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. వివరాలు.. పట్టణంలోని డీమార్ట్ సమీపంలోని కావేరి రెస్టారెంట్లో మాంసం, చికెన్ ఫ్రిజ్లో నిల్వ ఉంచి వినియోగిస్తున్నందన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రూ.5000 జరిమానా విధించారు. ఈ రెస్టారెంట్ పక్కనే గల దిల్కుష్ బేకరీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచనందుకు రూ.500, నిల్వ ఉంచిన పదార్ధాలతో ఫాస్ట్ఫుడ్ చేస్తున్న గాయత్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్, స్సైసీ ఫాస్ట్ఫుడ్ సెంటర్కు రూ.1000 చొప్పున జరిమానా విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ తెలిపారు. తనిఖీల్లో హెల్త్ అసిస్టెంట్ మస్కాపురం సురేష్, సిబ్బంది బాషుమియా, యాదగిరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
శుభవార్త చర్చి వార్షికోత్సవాలు ప్రారంభం
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలను గురువారం సాయంత్రం ఫాదర్ మార్టిన్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం చర్చిలో జరిగే దివ్యబలి పూజలకు నల్లగొండ మేత్రాసన పీఠాదిపతి దమన్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సందేశమిస్తారన్నారు. అదేవిధంగా సాయంత్రం మేరీమాత ప్రతిమతో పురవీధుల్లో ఊరేగింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫాదర్ అల్లం బాల, చర్చి కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఎద్దుల పందేలకు ఏర్పాట్లు పూర్తి శుభవార్త చర్చి వార్షికోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శుభోదయ యువజన సంఘం, చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు నిర్వహించనున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలకు స్థానిక మాంట్ఫోర్డ్ స్కూల్ మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఎద్దుల పందేలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రారంభిస్తారని యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్రెడ్డి న్నారు. -
ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు
రాజాపేట: కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా గురువారం రాజాపేటలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి, రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతుందని విమర్శించారు. వరంగల్ ఎల్కతుర్తిలో జరగనున్న బహిరంగ సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తిరుమలేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గోపాల్ గౌడ్, నాయకులు భాస్కర్ గౌడ్, సంతోష్ గౌడ్, గుంటి కృష్ణ, రామచంద్రారెడ్డి, కటుకం స్వామి, రామిండ్ల నరేందర్, వీరేశం, ఉప్పలయ్య గౌడ్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. -
మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు
భువనగిరిటౌన్ : భానుడి భగభగలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రివేళల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి వాతావరణం నమోదవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా గురువారం నారాయపురంలో 43.1 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గుండాల 42.8, రామన్నపేట 42.7, చౌటుప్పుల్ 42, బీబీనగర్ 42, మోత్కుర్ 41,7, వలిగొండ 41.5, ఆత్మకూర్, మోటకొండూర్, రాజాపేట 41.5, ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, యాదగిరిగుట్ట 41 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంభూదాన్పోచంపల్లి: ఈ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 2.45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పెట్టుకొన్నామని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ అన్నారు. గురువారం భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో జూలూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 216 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 214 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అందెల లింగంయాదవ్, మార్కెట్కమిటీ డైరెక్టర్ రేనిగుంట లాలయ్యయాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ పెంటయ్య, మాజీ ఎంపీటీసీ చిలుక బుచ్చయ్య, కాంగ్రెస్పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మోటె బాలరాజు, జిల్లా నాయకులు చేగూరి ప్రభాకర్, జడల అంజయ్య, గణేశ్, పర్వతం అశోక్, సీఈఓ రెబ్బాస్ నర్సింహ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్భువనగిరిటౌన్ : చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 691 చెక్ బౌన్స్ కేసులను గుర్తించినట్లు, ఈ కేసులలో నోటీసులు కూడా జారీ చేసే ప్రక్రియ ప్రారంభం అయ్యిందని పేర్కొన్నారు. ప్రత్యేక కౌన్సెలింగ్ కోసం మే 5 నుంచి 19వ తేదీ వరకు ప్రీ సిట్టింగ్లు నిర్వహించబడుతాయని తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించడానికి భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదాద్రి కోర్టుల న్యాయమూర్తులకు తగిన సూచనలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కూంబింగ్ ప్రక్రియను నిలిపివేయాలి భువనగిరిటౌన్ : ములుగు జిల్లాలోని కర్రె గుట్టల్లో కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్ కూంబింగ్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, ఎండీ జహంగీర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు కాశపాక మహేష్ డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేసే ప్రక్రియలో భాగంగా అమాయక ఆదివాసీ గిరిజన ప్రజలను కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మావోయిస్టు పార్టీ ప్రతిపాదన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు కొనసాగించి అమాయక ఆదివాసీలకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, టీపీఎఫ్, డీటీఎఫ్, ఐద్వా నాయకులు ఏశాల అశోక్, కొంమడుగు నర్సింహ, ఎండీ ఇమ్రాన్, బట్టుపల్లి అనురాధ, రాసాల నర్సింహ, దాసరి పాండు, మాయ కృష్ణ, పుట్ట రమేష్, జి.శ్రీనివాసాచారి, లక్ష్మయ్య, వెంకటేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
మోత్కూరు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా చేయాలని కలెక్టర్ వి.హనుమంతరావు ఆదేశించారు. మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ధాన్యంలోని తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేయాలన్నారు. కేంద్రాలలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ మోత్కూరు మార్కెట్ యార్డులో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి సందర్శించారు. ధాన్యం రాశులను పరిశీలించారు. వారివెంట అధికారులు వడ్డేమాన్ కీర్తి, తుంగ గోపినాథ్, ముక్కాముల అశోక్, సింగిల్విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, సీఈఓ వరలక్ష్మి తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
‘భూ భారతి’తో సాదాబైనామాలకు మోక్షం
భూదాన్పోచంపల్లి : భూ భారతి చట్టంతో సాదాౖబైనామాలకు మోక్షం లభించనుందని, తద్వారా 10 లక్షల మందికి మేలు జరుగుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతితో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన భూదాన్పోచంపల్లిని పైలట్ మండలంగా ఎంపిక చేయాలని కలెక్టర్ను కోరారు. అనంతరం మండలంలో 67 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, మండల ప్రత్యేకాధికారిణి రమణి, పోచంపల్లి ఇన్చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఆర్ఐ వెంకట్రెడ్డి, భువనగిరి వ్యవసాయ మార్కెట్కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పాక మల్లేశ్యాదవ్, భారత లవకుమార్, జిల్లా నాయకులు తడక వెంకటేశం, సామ మధుసూధన్రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్రెడ్డి, మార్కెట్కమిటీ డైరెక్టర్లు కుక్క దానయ్య, మద్ది అంజిరెడ్డి, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేశ్గౌడ్, ఏర్పుల శ్రీనివాస్, తోట శ్రీనివాస్, పక్కీరు నర్సిరెడ్డి, కాసుల అంజయ్య, ఉపునూతుల వెంకటేశం, గునిగంటి వెంకటేశ్, కుక్క కుమార్, చెన్నబత్తిని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. రైల్వే ఏఎస్ఐ బి. సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందంకు చెందిన చల్లా లింగయ్య కుమారుడు చల్లా కళ్యాణ్(27) తనకు పెళ్లి కావడం లేదని కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. బుధవారం వారి బంధువుల పెళ్లికి హాజరైన కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం బైక్పై మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల వద్దకు చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఏఎస్ఐ తెలిపారు. అప్పుల బాధతో .. రాజాపేట: అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం కొండ్రెడ్డిచెర్వులో గురువారం రాత్రి జరిగింది. కొండ్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన కర్రె మహేష్(28)కు అదే గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మహేష్ తన కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లాకు వలస వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో గిరాకీలు తగ్గడంతో ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఆటోలో గ్రామానికి చెందిన కూలీలతో కలిసి నిత్యం కూలీ పనికి వెళ్తూ తనకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేసేవాడు. 5 బోర్లు వేయడం, ఇల్లు కట్టడం, కొత్త ప్యాసింజర్ ఆటో కొనడం వంటి వాటికి రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఎకరంన్నర భూమి అమ్మాడు. పంట దిగుబడి రాక, ఆటో నడవక అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మహేష్ భార్య కళ్యాణి అదే గ్రామంలో ఉన్న తన తల్లిగారింటికి వెళ్లింది. పనికి వెళ్లిన మహేష్ రాత్రయినా కళ్యాణి వాళ్ల తల్లిగారింటికి రాకపోయేసరికి, కళ్యాణి తమ ఇంటికి వెళ్లి చూడగా.. మహేష్ ఉరేసుకుని కనిపించాడు. అనారోగ్యంతో వృద్ధుడు.. అడ్డగూడూరు: అనారోగంతో బాధపడుతున్న వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం కోటమర్తిలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటమర్తి గ్రామానికి చెందిన కొంపెల్లి నారాయణ(60) కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన నారాయణ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రయినా నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నారాయణ మనవడు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ చెట్టుకు ఉరేసుకుని నారాయణ ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా సబ్ కలెక్టర్ ఆదేశాలతో తనిఖీ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ హరిబాబు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని బకల్వాడ ఉన్నత పాఠశాలలో ఓపెన్ టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసిన గువ్వల శ్రీనివాస్కు స్థానికంగా బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్ పడింది. గువ్వల శ్రీనివాస్కు బదులుగా అప్పాముల శ్రీనివాస్ అనే మరో విద్యార్థి గురువారం సాంఘిక శాస్త్రం పరీక్ష రాస్తుండగా.. విషయం తెలుసుకున్న ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ను కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన సబ్ కలెక్టర్ తహసీల్దార్ హరిబాబు, ఎంఈఓ బాలునాయక్ను పరీక్షా కేంద్రానికి పంపి తనిఖీ చేయాలని ఆదేశించారు. రూం నంబర్ 8లో 166 రూల్ నంబర్తో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, కోర్డినేటర్లపై విచారణ చేసి నివేదికను డీఈఓకు పంపుతామని ఎంఈఓ బాలునాయక్ తెలిపారు. కాగా గురువారం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాలను డీఈఓ భిక్షపతి తనిఖీ చేశారు. ఈ ఘటనపై విలేకరులు డీఈఓను ప్రశ్నించగా.. ఓపెన్ పరీక్షలు ఓపెన్గానే జరుగుతాయని సమాధానం చెప్పడం గమనార్హం. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వస్కుల మట్టయ్య సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్కు ఫిర్యాదు చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ధర్మానాయక్, సెంటిమేరీ పాఠశాలలో దశరథ్నాయక్, బకల్వాడ పాఠశాలలో రాజు, బాలికల ఉన్నత పాఠశాలలో బాలునాయక్ పరీక్షల్లో కాపీ చేయించేందుకు గాను విద్యార్థుల నుంచి రూ.2500 నుంచి రూ.4వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్షలు రాసేందుకు గాను రూ.5వేల నుంచి రూ.8వేలు వసూలు చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. ఫ మిర్యాలగూడ బాలికల జెడ్పీహెచ్ఎస్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఫ సబ్ కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ తనిఖీ ఫ ఇద్దరిపై కేసు నమోదు -
పెళ్లింట పసిడి గుబులు
రూ.లక్షకు చేరిన తులం బంగారం ధర ఫ సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఆందోళన ఫ కట్న, కానుకల కింద ఇచ్చే బంగారం తగ్గించుకునే ఆలోచన ఫ జిల్లా వ్యాప్తంగా తగ్గిన కొనుగోళ్లు ఫ వెలవెలబోతున్న జ్యువెలరీ, బంగారం షాపులుసాక్షి, యాదాద్రి : ‘పెళ్లికి మా అమ్మాయికి ఎన్ని తు లాల బంగారం పెడతారు’ ఏయే నగలు ఇస్తారు?.. ‘మా అబ్బాయికి మీరెన్ని తులాలు పెడతారో చెప్పండి?’ పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టిపోతల విషయంలో జరిగే చర్చల్లో సర్వసాధారణంగా వినిపించే మాటలివి.. కానీ, ఇప్పుడు పెళ్లి బడ్జెట్లో బంగారం ప్రస్తావన తెస్తేనే దడ పుడుతోంది. తులం బంగారం లక్ష రూపాయలకు చేరడంతో అన్ని వర్గాల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పసిడి పేరెత్తినే అమ్మో అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన బంగారం ధర ఆయా వర్గాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వివాహాది శుభకార్యాలకు సిద్ధమవుతున్న కుటుంబాలు ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే అవకాశం ఉంది. ఆడపిల్ల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం వచ్చే నెలనుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న కుటుంబాలు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. కట్నం కింద బంగారు ఆభరణాలు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో బంగార ధర తులం రూ.లక్షకు చేరడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో గుబులు మొదలైంది. త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ప్రధానంగా ఆడపిల్లల తల్లిదండ్రలు వేదన వర్ణణాతీతం. ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేయలేకపోయామని మదనపడుతున్నారు. భారీగా తగ్గిన కొనుగోళ్లు బంగారం కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా 300కు పైగా బంగారం, జ్యువెలరీ షాపులు ఉన్నాయి. ధర తక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దుకాణంలో రోజుకు సగటున పది తులాల బంగారం విక్రయించేవారు. ఇప్పుడు అందులో సగం కూడా వ్యాపారం జరగడం లేదని యజమానులు చెబుతున్నారు. -
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా వరంగల్కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నుంచి 12,500 చొప్పున 50వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనసమీకరణ వివరాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోంది. ఇది బీఆర్ఎస్ సభనా, లేక టీఆర్ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్రెడీ బీఆర్ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు. ఎడ్లబండ్ల యాత్ర మొదలైంది ఎడ్లబండ్లు, సైకిల్, పాద యాత్రలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ప్రారంభమైంది. నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేసి రైతులు ర్యాలీని ప్రారంభించారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను గుర్తుగా 16 బండ్లతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్లారు. అర్వపల్లి నుంచి సైకిళ్ల మీద యాత్రగా వెళతామని యువత ముందుకు వస్తే రెండు రోజులు ఆగాలని చెప్పాను. పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆగాలని సూచించాం. జనాల్లో అలాంటి వాతావరణం వస్తే సభ విజయవంతమవుద్దనేది కచ్చితమైంది. మేము పేరుకే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ప్రజల ఆలోచన వేరే ఉంది. వారే పెద్ద ఎత్తున బయల్దేరి సభకు రావాలని చూస్తున్నారు. వరంగల్ సభ పండుగ వాతావరణంలో జరగబోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అప్పుడే సభకు ఏ విధంగా నైనా హాజరు కావాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంది. చరిత్రలో నిలిచిపోనుంది రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్లో అలజడి మొదలైంది. సభపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. సభ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్పై మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయాందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే సభపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఫ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ ఫ నాలుగు నియోజకవర్గాల నుంచే సగం మంది ఫ మిగతా చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో తరలిస్తాం ఫ కేసీఆర్ చెప్పేది వినేందుకు ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వస్తామంటుండ్రు ఫ కాంగ్రెస్కు ఓటేసినోళ్లే కసిగా సభకు రావడానికి సిద్ధమవుతుండ్రు ఫ ఎక్కడ చూసినా సభపైనే చర్చ ఫ సభ పేరు వింటేనే అధికార పక్షం జంకుతుంది ఏ నోట విన్నా సభపైనే చర్చ ఏ పెళ్లిలో, ఏ చావుకెళ్లినా బీఆర్ఎస్ సభ గురించి చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు మమ్ముల చూసి పక్కకు పోయినోళ్లు కూడా ఇయ్యాల మా దగ్గరకు వస్తుండ్రు. సభకు రావాలని చూస్తుండ్రు. కాంగ్రెస్కు ఓటేసిన నేతలే కసిగా వరంగల్ సభకు వచ్చేందుకు సిద్ధమవుతుండ్రు. జనాలకు కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలతో ఇంకా ఏమైనా రుణమాఫీ, రూ.2,500 వస్తుందనే ఆశతో కాంగ్రెస్కు ఓటేసిండ్రు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు చెప్పిన మాయ మాటలకు నిరుద్యోగులు ఎట్రాక్టు అయినరు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. దాంతో నిరుద్యోగులు ఎట్రాక్టు అయ్యిండ్రు. తల్లిదండ్రులకు కూడా యువతే చెప్పుకుంది. రుణమాఫీ ఇస్తే సరిపోతుందా..ఉద్యోగాలు కూడా రావాలనడంతో వారు ఆలోచనలో పడి ఓటేశారు. అలాంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ మోసాలు సంవత్సరంలో తెలుసుకున్నరు. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే భర్తీ చేసిందని దాంతో నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకున్నారు.వరంగల్ సభకు వాళ్లే ముందు నడవబోతున్నారు. కేసీఆర్కు ఓటేయక పొరపాటు జరిగిన విషయాన్ని గమనించి సభకు రావాలని చూస్తున్నారు. -
పీసీసీ పరిశీలకులొస్తున్నారు!
సాక్షి,యాదాద్రి : నేతలు, ప్రజాప్రతినిధులు, శ్రేణులను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు వరంగల్ జెడ్పీ మాజీ చైర్మన్ లకావత్ ధనవంతి, డాక్టర్ పులి అనిల్కుమార్ నియమించింది. పరిశీలకుల బాధ్యతలు జిల్లా పరిశీలకులుగా నియమితులైన ధనవంతి, పులి అనిల్కుమార్ త్వరలో బాధ్యతలు స్వీకరించ నున్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ, పీసీసీ డెలిగేట్స్, డీసీసీ మాజీ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, సీని యర్ నేతలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అధిష్టానానికి నివేదికలు అందజేస్తారు. వీటి అధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు దక్కనున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. భదాద్రి కొత్తగూడెం జిల్లాకు పోత్నక్ ప్రమోద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిశీలకుడిగా భువనగిరి పట్టణానికి చెందిన పోత్నక్ ప్రమోద్కుమార్ను నియమించారు. ప్రస్తుతం పీసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రమోద్కుమార్ గతంలోనే పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.ఫ జిల్లాకు ఇద్దరి నియామకం ఫ లకావత్ ధనవంతి, పులి అనిల్కుమార్కు బాధ్యతలు -
ఆర్పీల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందకు గాను ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ) ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి, అర్హత కలిగిన ఉపాధ్యాయులు నమూనా ఫారంలో పూర్తిచేసి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 24న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు. వివరాల కోసం కో ఆర్డినేటర్ సెల్ నంబర్ 98487 07758ను సంప్రదించాలని కోరారు. యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా చేపట్టారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం చేసి తులసీదళ, సహస్ర నామార్చనతో కొలిచారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. నారాయణపురం@43.1 భువనగిరిటౌన్ : ఎండలు మండిపోతున్నాయి.ఉదయం 8 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరడంతో జనం ఎండ వేడిమిని తాళలేకపోతున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు నమోదవుతుండడమే దీనికి నిదర్శనం. బుధవారం అత్యధికంగా సంస్థాన్నారాయణపురంలో 43.1, రామన్నపేటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తరువాత గుండాల 42.5, రాజాపేట 42.4, వలిగొండ 42.4, మోత్కూరు 42.2, చౌటుప్పల్ 42.2, ఆలేరు 42.0, అడ్డగూడూరు 42.0, ఆత్మకూర్(ఎం) లో 42 డిగ్రీలుగా నమోదైంది. ఎండనుంచి ఉపశమనం పొందడానికి గొడుగులు, టోపీలు ధరిస్తున్నారు. జిల్లాను వాతావరణ శాఖ ఆరెంజ్ జోన్గా ప్రకటించింది. -
ఇంటికి మూడు డ్రమ్ములే సరఫరా
అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నా నీఇ సమస్య పూర్తిస్థాయిలో పరిష్కా రం కావడం లేదు. ఈ క్రమంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఇంటికి మూడు డ్రమ్ముల చొప్పున అందజేస్తున్నారు. ఇవి కూడా క్రమం తప్పకుండా సరఫరా చేయకపోవడంతో జనం నీటి కోసం అల్లాడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ట్యాంకర్కు రూ.500 నుంచి రూ.600 వరకు వెచ్చిస్తున్నారు. హోటళ్లు, బేకరీలు, దుకాణా లకు మున్సిపాలిటీ నీటి సరఫరా మూడు నెలలుగా నిలిచిపోయింది. ఇందుకు ట్యాంకర్కు రూ.1000నుంచి రూ.1200 వరకు చెల్లి స్తున్నట్లు నిర్వాహకులు వాపోతున్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి,యాదాద్రి : అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో సమావేశం అయ్యారు. ఎల్ఆర్ఎస్ ఆవశ్యకత, ఫీజు రాయితీ గురించి వివరించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. 25 శాతం రాయితీతో ఫీజు చెల్లించేందుకు ఈనెల 30వరకు గడువు ఉందని, మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేకపోచ్చన్నారు. రెగ్యులరైజ్ చేసుకోని భూముల్లో రిజిస్ట్రేషన్లు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీఓలు కష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, డీపీఓ సునంద పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
ట్యాంకరొస్తేనే గొంతు తడిచేది!
చౌటుప్పల్ : పట్టణంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. డిమాండ్కు అనుగుణంగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, మరో వైపు ఎండలకు మంచినీటి పథకాలు అడుగంటడంతో పరిస్థితి దయనీయంగా మారింది. మున్సిపల్ యంత్రాంగం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో సమస్య తీర్చలేకపోతోంది. భగీరథ నీళ్లు సగం లోపే.. రోజురోజుకూ పట్టణ విస్తరణతో పాటు జనాభా పె రుగుతోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు, 31,202 మంది జనాభా ఉంది. రోజుకు 6.5 ఎంఎల్డీల (65లక్షల లీటర్లు) నీరు అవసరం. ప్రస్తుతం కేవలం 2.5 ఎంఎల్డీల(25లక్షల లీటర్లు) నీళ్లు మాత్రమే వస్తున్నాయి. పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగకపోవడంతో ఉన్నంతలో పొదుపుగా వార్డులకు పంపిణీ చేస్తున్నారు. స్థానిక బోర్లనుంచి అరకొరగా వస్తున్న నీటితో కలిసి వంతుల వారీగా సరఫరా చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో సమస్య తీవ్రం ప్రధానంగా 09,16,17,18,20వ వార్డు పరిధిలోని బంగారిగడ్డ, హనుమాన్నగర్, రత్నానగర్, సుందరయ్యకాలనీ, అంజనసాయి మెడోస్, బస్టాండ్ ఏరి యాతో పాటు మరికొన్ని కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో మేనెలలో ఎద్దడి ఏర్పడగా ..ఈసారి ఫిబ్రవరిలోనే మొదలైంది.రోజుకు రూ.1200 వెచ్చిస్తున్నాం గతంలో మే నెలలో తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచే నీటి కష్టాలు వచ్చాయి. మా హోట ల్కు మూడు నెలలుగా మున్సిపాలిటీ నల్లా నీరు నిలిచిపోయింది. మా సొంత బోరు కూడా ఎండిపోయింది. దీంతో రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నాం. ఇందుకోసం రోజుకు రూ.1200 వరకు ఖర్చు చేస్తున్నాం. హోటళ్లకు కూడా ఎంతోకొంత మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకోవాలి. –గోపాలకృష్ణ శెట్టి, ప్రసాద్ ఉడిపి హోటల్ నిర్వాహకుడు, చౌటుప్పల్ చౌటుప్పల్లో తాగునీటికి కటకట ఫ డిమాండ్కు అనుగుణంగా అందని మిషన్ భగీరథ నీళ్లు ఫ ఎండలకు అడుగంటిన స్కీం బోర్లు ఫ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ఫ సరిపోక ప్రైవేట్గా కొనుగోలు చేస్తున్న జనం -
వీడని తల్లి, కుమార్తె మరణం మిస్టరీ..?
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన తల్లి, కుమార్తె మరణ మిస్టరీ 11 రోజులవుతున్నా ఇంకా వీడలేదు. ఈ నెల 12వ తేదీన వారిద్దరు ఇంట్లో మృతిచెందగా.. ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్గా బదిలీపై 15 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చి మిర్యాలగూడలో నివాసముంటున్నారు. ఈ నెల 10వ తేదీన సీతారాంరెడ్డి కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో హైదరాబాద్కు వెళ్లి.. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి చిన్న కుమార్తె వేద సాయిశ్రీ గొంతుపై కత్తిగాటుతో, భార్య రాజేశ్వరి బెడ్రూంలో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. నాలుగు బృందాలతో దర్యాప్తు.. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు నాలుగు బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఒక బృందం ఏపీలోని జమ్మలమడుగు, రొంపిచెర్ల, కుంబంపాడు, దాచేపల్లి, నకిరేకల్ ప్రాంతాలలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలు సేకరించినా.. మరో బృందం స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు, సెల్ఫోన్స్ సిగ్నల్స్ వంటి అంశాలపై కూపీ లాగినా.. మరో బృందం మృతుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించినప్పటికీ, ఘటన జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ తాను నిద్రలో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని చెప్పడంతో కేసు మిస్టరీ వీడడంలేదు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ ఎలాంటి క్లూ దొరకలేదా..? ఒకవేళ దొరికినా.. ఆ విషయాలను ఇన్ని రోజులు పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో సేకరించిన విషయాలను పోల్చి చూసుకునేందుకు ఫోరెన్సిక్ నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఫ నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫ 11 రోజులవుతున్నా కొలిక్కి రాని కేసు -
రేపు మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రాక
నల్లగొండ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరి 10గంటలకు నల్లగొండలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 11:30గంటలకు జిల్లా జైలుఖానాను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆర్అండ్బీ అతిథి గృహంలో భోజనం చేసి రాత్రి 7గంటలకు తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. బుద్ధ జయంతికి రావాలని మంత్రి జూపల్లికి ఆహ్వానంనాగారం: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మే 12న నిర్వహించనున్న బుద్ధ జయంతి వేడుకలకు రావాలని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్లో కలిసి ఆహ్వాన పత్రం అందించినట్లు బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు పులిగిల్ల వీరమల్లుయాదవ్ తెలిపారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో వీరమల్లుయాదవ్ మాట్లాడుతూ... ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా బుద్ధ జయంతి రోజున ప్రపంచ సుందరీమణులతో హెరిటేజ్ వాచ్ కార్యక్రమం నిర్వహించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి జపాల్లోని హిరోషిమా ప్రభుత్వంతో బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాలని నిర్ణయించడం సంతోషదాయకమన్నారు. కుటుంబ తగాదాలతో దాడి ● ఇద్దరికి గాయాలునకిరేకల్: కుటంబ తగదాల కారణంగా అత్త, ఆమె తమ్ముడిపై అల్లుడు దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని తాటికల్ రోడ్డులో నివాసముంటున్న బోయింద జానమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను సూర్యాపేటకు చెందిన పెరుమాళ్ల రవికి ఇచ్చి వివాహం చేసింది. భార్యాభర్తల మధ్య తగదాలు రావడంతో జానమ్మ నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లో అల్లుడిపై మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో అల్లుడు రవితో పాటు మరో వ్యక్తి చింతమల్ల రాహుల్ జానమ్మ ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఆమె తమ్ముడు ఎడ్ల ప్రకాష్పై దాడి చేసి గాయర్చారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చారి తెలిపారు. సీహెచ్సీని సందర్శించిన వరల్డ్ బ్యాంక్ బృందంఆలేరురూరల్: ఆలేరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు డాక్టర్ రమణ, డాక్టర్ కృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులుకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కేసుల గురించి వివరాలు అడిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, మంచి ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుమన్, కళ్యాణ్, డాక్టర్ యశోదా, డాక్టర్ శిల్ప, డీపీఓ నెహ్రూ, సీహెచ్సీ సూపరింటెండెంట్ స్వప్న, రజిని, రామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
చాడలో బౌద్ధ చరిత్ర
ఫ గతేడాదిగా పురావస్తు శాఖ తవ్వకాలు ఫ పెద్ద ఎత్తున బయటపడుతున్న బౌద్ధం ఆనవాళ్లు ఫ ఏడు రోజుల క్రితం తవ్వకాల పనులను పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంఏడు రోజుల క్రితం చాడ గ్రామాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ కో–కన్వీనర్ భద్రగిరీష్, సభ్యులు ఎం. రవి, కుండె గణేష్, ఎండీ ఇమ్రాన్ సందర్శించారు. తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన సంపదను పరిశీలించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న వారిలో తెలంగాణ వారసత్వశాఖ అధికారులు పి. నాగరాజు, సాగర్, పూణా దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ ఘన్వీర్ శ్రీకాంత్, ఇతర సిబ్బంది ఉన్నారు. తవ్వకాల్లో దాదాపు 80మంది పాల్గొంటున్నారు. చాడను సందర్శించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందంతవ్వకాలను పరిశీలిస్తున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి తర్వాత అతిపెద్ద బౌద్ధ స్థూపం ఆనవాళ్లు ఇక్కడ వెలుగు చూస్తున్నాయి. ఇందులో బుద్ధ విగ్రహాలు, శిల్పాల శకలాలు, మట్టిపూసలు, బొక్కగాజులు, శాతవాహన కాలం నాటి డిజైన్న్ పెంకులు, పొడవైన పెద్ద ఇటుకలు, బౌద్ధ విహార గోడలు బయల్పడుతున్నాయి. 2003లోనే గుర్తింపు.. 2003లోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చాడ గ్రామంలో బౌద్ధం ఆనవాళ్లు గుర్తించింది. అంతేకాకుండా 2010లో గ్రామానికి చెందిన భూమయ్యగౌడ్ పొలం దున్నుతుండగా పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. దీంతో పురాతన చరిత్రను బయటకు తీయడానికి పురావస్తు శాఖ పూనుకుంది. ఈ గ్రామంలో ఎన్నో బౌద్ధ మత ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు వాటిని దేవతామూర్తులుగా పూజిస్తారు. 2024లో చాడ గ్రామంలో ఆర్కియాలజీ శాఖ తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. భూమయ్యగౌడ్కు చెందిన రెండు ఎకరాల్లో ఈ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం వేసవిలో చేసిన విధంగానే ఈసారి కూడా ఆర్కియాలజీ శాఖ అధికారులు, విద్యార్థులు తవ్వకాలను పరిశీలిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలతో తవ్వకాలు ప్రారంభించారు. దొరికిన ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి భద్రపరుస్తున్నారు. గతేడాది బయటపడిన శాసనం 2024లో జరిపిన తవ్వకాల్లో బ్రహ్మీ లిపిలో ఉన్న శాసనం బయటపడింది. ఈ శాసనంలో చాడ పేరు సదరిక అని ఉంది. సదరిక క్రమంగా వాడుకలోంచి చాడగా మారిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. చాడ శాసనం గురించిన వివరాలు ఎపీగ్రఫీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె. మునిరత్నంరెడ్డి గతంలోనే వెల్లడించారు. బిక్కేరు వాగు బౌద్ధం నుంచే.. ఆలేరు వాగు కాస్తా చాడ వరకు వచ్చేసరికి బిక్కేరు వాగుగా మారుతుంది. అప్పట్లో బౌద్ధ భిక్షువులు ఉండే ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి బిక్కేరు అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ లభించిన నిలబడి ఉన్న బౌద్ధ విగ్రహం నల్లగొండలోని పానగల్ మ్యూజియంలో ఉంది. 2024 నుంచి జరుపుతున్న తవ్వకాల్లో మరికొన్ని విగ్రహాలు దొరికినా వాటి వివరాలు ఆర్కియాలజీ శాఖ అధికారులు బయటకు చెప్పడం లేదు. ఇక్కడ లభిస్తున్న వస్తువులు, మట్టిపొరలు, గాజులు, పూసలు, విగ్రహాలు, నాణేలు తదితర బౌద్ధం ఆనవాళ్లను ఆర్కియాలజికల్ విద్యార్థులు గ్రేడింగ్ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపానికి సంబంధించిన ఇటుకల కుప్పలు ఇప్పుడు లేవు. ప్రస్తుతం అవి చెదిరిపోయాయి. తవ్వకాల్లో ఇంకా బౌద్ధ శిల్పాలు బయటపడే అవకాశం ఉంది. ఎకరం రెండు ఎకరాల్లో కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో తవ్వకాలు జరిగితే మరింత చరిత్ర బయటపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫణిగిరిలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బౌద్ధం ఆనవాళ్లను అక్కడే భద్రపరిచారు. అయితే చాడలో లభిస్తున్న వాటిని ఇక్కడే భద్రపర్చాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి చరిత్ర మరో ప్రాంతానికి తరలిపోకుండా ఇక్కడే మ్యూజియం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత విడుదల చేసే సంపూర్ణ నివేదిక వచ్చినప్పుడు ఇక్కడి ప్రాముఖ్యత, విశిష్టత వెలుగు చూస్తుందని పురావస్తుశాఖ అధికారులు అంటున్నారు. గాంధార శిల్ప సంపదఇక్కడ దొరికిన బౌద్ధ శిల్పాలలో గాంధార శైలికి చెందిన బుద్ధుడి స్థానక భంగిమ శిల్పాలు, అర్ధ శిల్పాలు, బుద్ధ విగ్రహాల తలలు, విగ్రహాల శకలాలు, క్రీ.పూ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దపు నాణేలు, టెర్రకోట బొమ్మలు, దంతపు గాజుల ముక్కలు, శాతవాహన కాలం నాటి కుండ పెంకులు, శాతవాహనకాలం నాటి ఇటికెలు, పూసలు అనేకం వెలుగుచూస్తున్నాయి. -
తమ్ముడి మృతి తట్టుకోలేక అన్న ఆత్మహత్య
భువనగిరిటౌన్, భూదాన్పోచంపల్లి: తమ్ముడు మృతి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన అన్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం తుక్కాపూర్లోని ఓ వెంచర్లో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన పర్వతం ఆంజనేయులు, అండాలు దంపతులకు ఇద్దరు కుమారులు కిరణ్కుమార్(25), సాయితో పాటు ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబం పదేళ్ల క్రితం ఆలేరుకు వలస వెళ్లి అక్కడ పాత ఇనుప సామాను వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే చిన్న కుమారుడు సాయి మూడు నెలల క్రితం ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ కుటుంబం అక్కడ నుంచి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లికి వచ్చి ఉంటున్నారు. తమ్ముడి మృతి తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన కిరణ్కుమార్ తనకు బతకడం ఇష్టంలేదని తాను చనిపోతానంటూ తరచూ తల్లికి చెప్పేవాడు. కాగా మంగళవారం రాత్రి కిరణ్కుమార్ తనకు పని ఉందని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తన సోదరికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అనంతరం భువనగిరి మండలం తుక్కాపూర్లోని ఓ వెంచర్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం కిరణ్కుమార్ మృతదేహాన్ని పెద్దరావులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
చిట్యాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన దాసరి యోగేంద్ర విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చిట్యాల పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద ప్రమాదాలు జరగకుండా వాహదారులకు సూచనలు చేసేందుకు గాను కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. బుధవారం పాలకేంద్రం సమీపంలో విధులు నిర్వహిస్తున్న యోగేంద్రను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అంబులెన్స్లో నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
మర్రిగూడ: ప్రభుత్వ ఆస్పతుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు కృషిచేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కె. అజయ్కుమార్ అన్నారు. బుధవారం మర్రిగూడ మండల కేంద్రంలోని కమ్యూటనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రూ.3లక్షల విలువైన రెండు ఆక్సిజనేటర్ మిషన్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలోనే ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు డయాలసిస్ సెంటర్ను, రోగులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూను పరిశీలించారు. ఓపీ థియేటర్ను ఉపయోగంలోకి తేవాలన్నారు. ఆస్పత్రికి సంబంధించిన ఇంక్యూబేషన్ అన్నిరకాల పరికరాలు కూడా అందుబాటులోకి తేవాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ మాత్రునాయక్, సూపరింటెండెంట్ శంకర్నాయక్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఫ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ -
కల్యాణ కట్ట పంచాయితీ
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు యాదగిరిగుట్ట ఆలయంలో 20 మంది నాయీ బ్రాహ్మణులను కొత్తగా నియమించడానికి కోర్టు ఆర్డర్ ఉందని ఈఓ చెబితే అది చూపెట్టాలని అడిగాం. కల్యాణ కట్టకు కొత్తగా ఎవరినైనా కేటాయిస్తే దేవస్థానం ఆధ్వర్యంలో మా సంఘానికి లెటర్ ఇస్తారు. కానీ ఎలాంటి కాపీ ఇవ్వలేదు. ఈఓతో పాటు కొంతమంది అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్డర్ తయారు చేసి 20 మందిని నియమించారు. – రాచకొండ జానకిరాము, రాష్ట్ర దేవాలయ కల్యాణ కట్ట అధ్యక్షుడు మా కల నెరవేరింది కల్యాణ కట్టలో విధుల్లో చేరడంతో మా కల నెరవేరింది. కల్యాణ కట్టలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు మా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. తిరిగి మేము కూడా హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఈఓకు ఇచ్చాం. దీంతో విధుల్లో చేర్చుకునేందుకు ఈఓ ఆదేశించారు. తోటి నాయీ బ్రాహ్మణులతో కలిసి పనిచేస్తాం. – జంపాల రాజు, యాదగిరిగుట్ట నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణుల మధ్య పాత.. కొత్త పంచాయితీ నెలకొంది. ప్రస్తుతం దేవస్థానం కల్యాణ కట్టలో 96మంది నాయీ బ్రాహ్మణులు కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరో 20మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించే విధంగా దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులతో ఈఓ భాస్కర్రావు నియమించారు. ఆ 20మంది నాయీ బ్రాహ్మణులు బుధవారం విధుల్లో హాజరయ్యేందుకు కల్యాణ కట్టకు చేరుకున్నారు. దీంతో అప్పటికే కొనసాగుతున్న 96మంది వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ ఏఈఓతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ఉండటంతో నూతనంగా 20 మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించేందుకు అనుమతించామని ఏఈఓ వివరించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడి చేరుకొని సముదాయించారు. అనంతరం కోర్టు ఆర్డర్, దేవాదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపెట్టిన తర్వాత 20 మంది ఉద్యోగంలో చేరారు. ఉత్తర్వుల కాపీలో ఇలా.. దేవాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన 33 మంది నాయీ బ్రాహ్మణులకు కల్యాణ కట్టలో పని కల్పించేందుకు కమిషన్ పద్ధతిలో తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ మేరకు 20 మందిని అదనంగా నియమించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫ యాదగిరిగుట్ట క్షేత్రం కల్యాణ కట్టలో కొత్తగా 20 మంది నాయీ బ్రాహ్మణుల నియామకం ఫ ఇప్పటికే పనిచేస్తున్న వారి నుంచి అభ్యంతరం ఫ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
నూతనకల్: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి.. మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకన్న–సుమలత దపంతుల రెండో కుమార్తె వైష్ణవి ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ఎంపీసీ విభాగంలో 467మార్కులు సాధించడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వైష్ణవిని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగం జయసుధ, మండల పార్టీ అధ్యక్షుడు నాగం సుధాకర్రెడ్డి, జెన్నారెడ్డి వివేక్రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఫ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
ఇక నుంచి డ్రోన్ ద్వారా పెట్రోలింగ్
భువనగిరిటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఎస్సీ కంకణాల రాహుల్రెడ్డి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించేందుకు భువనగిరి పట్టణ శివారు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం డ్రోన్ను ప్రయోగాత్మకంగా ఎగురవేశారు. డ్రోన్ద్వారా పరిశీలించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వ్యక్తులను పట్టుకు న్నారు. ఈ సందర్భంగా అదన పు ఎస్పీ మాట్లాడుతూ.. విజి బుల్ పోలీసింగ్, సత్వర స్పందన, టెక్నాలజీకి.. ఈ మూడింటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలి పారు. ప్రతి ఏరియాలో బ్లూ కోల్ట్స్, పెట్రోకార్, సైకిల్ పెట్రోలింగ్తో పాటు డ్రోన్ ద్వారా పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తొలుత భువనగిరి పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రోన్లను ప్రయోగించి ఎటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయో పరిశీలిస్తామన్నారు. టెక్నాలజీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ఫ రాచకొండ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా.. ఫ పైలెట్ ప్రాజెక్టుగా భువనగిరి ఫ వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ రాహుల్రెడ్డి -
మహాశివుడికి బిల్వార్చన, అభిషేకం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామికి అనుబంధంగా ఉన్నా శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం చేసి తులసీపత్రాలతో అర్చించారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపం, ముఖ మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
కాంగ్రెస్ ప్రజావిశ్వాసం కోల్పోయింది
భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి విమర్శించారు. సోమవారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్టాడారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. భువనగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి క్యామ మల్లేశం, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఖాజా అజీమోద్దీన్, దిడ్డికాడి భగత్, కుశంగుల రాజు, చెన్న మహేష్, కడారి వినోద్, తుమ్మల పాండు, సిద్దుల పద్మ, సుదగాని రాజు, రత్నపురం పద్మ, ఎనబోయిన జహంగీర్, తాడూరి భిక్షపత్తి, తాడెం రాజశేఖర్, పాల్గొన్నారు.ఫ భువనగిరి మాజీ ఎమ్మెల్యే శేఖర్రెడ్డి -
కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష
గుండాల : రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల కేంద్రంలోని నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. అమలుకు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంతో ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నారని పేర్కొన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఏ ఒక్కరు అధైర్యపడవద్దన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నీళ్ల అయిలయ్య కాదు.. భూ కబ్జాల అయిలయ్య అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు ఎండీ ఖలీల్, నాయకులు ఎం.రామకృష్ణారెడ్డి, ఎం.బాల్రెడ్డి, మహేందర్రెడ్డి, రాములు, జి.శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, అట్ల రంజిత్రెడ్డి, రాజు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత -
వీడని వర్షం.. తీరని నష్టం
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఫ ఈదురు గాలులకు నేలకొరిగిన వరి ఫ మామిడి, సపోట తోటలకు నష్టం ఫ పంట దక్కలేదని రైతుల ఆందోళన ఫ పలు చోట్ల ఆస్తినష్టం మోత్కూరు : రైతులను అకాల వర్షాలు వీడడం లేదు. ఆదివారం రాత్రి ఈదురుగాలుతో కూడిన వర్షానికి పంట, ఆస్తినష్టం వాటిల్లింది. పొడిచేడులో వడగండ్లు పడటంతో కప్ప మల్లేష్ వరి చేలో ధాన్యం పెద్ద ఎత్తున రాలిపోయింది. పైరు నేలకొరిగింది. దాచారంలో పది విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ముంత లక్ష్మి ఇంటిపై చెట్టు విరిగి పడి రేకులు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో లక్ష్మి ఇంట్లోనే ఉండడంతో ఆమెకు గాయాలయ్యాయి. గాదె నర్సయ్య ఇంటి పైకప్పు రేకులు గాలికి లేచిపోయాయి. పెంకులు పగలడంతో నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. కొంతమంది రైతుల వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. అనాజిపురంలో కొల్లు శంకర్ మామిడి తోటలో కాయలు రాలిపోయాయి. వలిగొండ : పహిల్వాన్పురం, టేకులసోమారంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులకు దెబ్బతిన్న మామిడి తోటలను చౌటుప్పల్ డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కవిత సోమవారం పరిశీలించారు. రెండు గ్రామాల్లో ఎనిమిదిన్నర ఎకరాల్లో మామిడికి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. నివేదికను అధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. రాజాపేట : మండలంలోని మల్లగూడెంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగండ్ల వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వడగండ్ల వానకు వరి చేలలో ధాన్యం నేలరాలింది. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతులు కోరారు. గుండాల : మండలంలోని రామారంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు గ్రామానికి చెందిన మల్లెపాక శ్రీకాంత్, మల్లెపాక సాంబయ్య, బండారు ముత్తయ్యల రేకుల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన తమను ఆదుకోవాలని బాధితులు అధికారులను కోరారు. తుర్కపల్లి : మండలంలోని తిర్మలాపూర్, వీరారెడ్డిపల్లిలో వడగండ్ల వాన, ఈదురు గాలులకు వరి చేలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల మామిడి కాయలు నేలరాలాయి. ఆస్తినష్టం వాటిల్లింది. -
హరిత హననం!
అడవులు, పొలాలు, రోడ్ల వెంట భారీ వృక్షాలు నరికివేత మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు హరితహారం, వన మహోత్సవం పేరుతో నాటిన లక్షల కొద్దీ మొక్కలు బొగ్గవుతున్నాయి. ఎదిగిన చెట్లను అక్రమార్కులు తమ స్వార్థం కోసం నరికి బొగ్గుబట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడవులతోపాటు పొలాలు, రహదారుల వెంట ఉన్న భారీ వృక్షాలు గొడ్డలి వేటకు గురవుతున్నాయి. ఫలితంగా కోట్లాది మొక్కలు నాటినా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన బొగ్గు బట్టీలు విచ్చలవిడిగా రాజుకుంటున్నా అధికారులు నోరుమెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది.నెలనెలా లక్షలాది రూపాయలు చేతులు మారడమేనన్న ఆరోపణలున్నాయి. ఎదిగిన చెట్లు ఎదిగినట్లే నరికివేత.. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని 24నుంచి 33 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేలు, నియోజకవర్గంలో 40 లక్షల చొప్పున మొక్కలు నాటుతున్నారు. 10 విడతలుగా చేపట్టిన హరితహారం, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు 6 కోట్ల వరకు మొక్కలు నాటారు. అందులో మొదటి ఆరు విడతల్లో నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగాయి. ఎదిగిన చెట్లను ఎప్పటికప్పుడు నరికి బొగ్గు బట్టీలకు తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బట్టీలు అటవీ శాఖ ఇచ్చిన అనుమతులను కాదని బట్టీల్లో విలువైన కర్రను కాల్చి బొగ్గు చేస్తున్నారు.సర్కారు తుమ్మకు మాత్రమే బొగ్గు బట్టీలకు అనుమతి ఉంది. కానీ వేప, చింత, కానుగు, మోదుగు ఇలా ప్రతి చెట్టు బట్టీల్లో కాల్చేస్తున్నారు. మోత్కూరు మండలం పనకబండ, దత్తప్పగూడెం, దాచారం, కమ్మగూడెం,అనాజిపురం, సూరారం, అడ్డగూడూరు మండలం అజీంపేట, లక్ష్మ్మీదేవికాలువ, వెల్దేవి, మానాయికుంట, గుండాల మండలం వెల్మజాల, వస్తాకొండూరు, మరిపడగ, మోటకొండూరు మండలం బొగ్గుబట్టీలు అధికంగా ఉన్నాయి. కమిటీలు ఎక్కడ? సహజ వనరులకు సంరక్షించేందుకు గతంలో రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ, వీఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన కమిటీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే కలపను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. రైల్వే బొగ్గు కంటే చౌక కర్ర బొగ్గు రైల్వే బొగ్గు కంటే తక్కువ ధరకు లభిస్తోంది. బొగ్గు తయారైన అనంతరం సంచుల్లో నింపి హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరుతో పాటు ఒడిశాకు లారీల ద్వారా తరలిస్తున్నారు. రైల్వే బొగ్గు కంటే చౌకగా లభిస్తుండడంతో కర్ర బొగ్గును ఆర్డర్లపై కొనుగోలు చేస్తారు. వివిధ కంపెనీలు, హోటళ్లలకు కర్ర బొగ్గు సరఫరా చేస్తున్నారు. నాటిన మొక్కలు విడతల వారీగా (లక్షల్లో) విడత సంవత్సరం మొక్కలు మొదటి 2015 33.627 రెండవ 2016 73.038 మూడవ 2017 114.98 నాల్గవ 2018 85.948 ఐదవ 2019 70.11ఆరవ 2020 49.62ఏడవ 2021 27.82 ఎనిమిదవ 2022 30.89తొమ్మిదవ 2023 22.99 హరితహారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు గత ప్రభుత్వ హయాంలో పది విడతలుగా హరితహారం నిర్వహించగా సుమారు 5.85 కోట్ల మొక్కలు నాటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్లో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 11.45 లక్షల మొక్కలు నాటారు. అందులో చాలా చెట్లు కనుమరుగయ్యాయి. న్యూస్రీల్ఫ బొగ్గుబట్టీలకు తరలుతోన్న కలప ఫ ఓవైపు నాటుడు.. మరోవైపు నరుకుడు ఫ దెబ్బతింటున్న పర్యావరణం ఫ నిర్లిప్తంగా అటవీశాఖ అధికారులు -
వార్షికోత్సవానికి ‘శుభవార్త’ ముస్తాబు
మఠంపల్లి: మఠంపల్లిలోని శుభవార్త చర్చి వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 24, 25 తేదీల్లో వేడుకలు నిర్వహించేందుకు చర్చిని విద్యుద్దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. మఠంపల్లిలో శుభవార్త చర్చిని 1908 నుంచి 1915 మధ్యకాలంలో నిర్మించారు. దీనిని 110 ఏళ్ల క్రితం మొదటి రెవరెండ్ ఫాదర్ ఫాస్కలీ స్థానిక క్రైస్తవుల సహకారంతో ప్రారంభించారు. చర్చి ప్రాంగణంలోని కొలనులో ఆరోగ్యమాత(మేరీమాత) విగ్రహం ఉంది. శిథిలావస్థకు చేరిన ఈ చర్చిని 1984లో స్థానిక క్రైస్తవ పెద్దలు సుమారు రూ.50లక్షలతో 100 అడుగుల ఎత్తు గల రెండు గోపురాలతో అద్భుతంగా పునఃనిర్మించారు. మొదటి ఫాదర్ ఫాస్కలీ అనాథలు, వృద్ధులకు ఆశ్రయమిచ్చేందుకు స్థానికంగా అన్నమ్మ(మేరీమాత) పేరుతో మఠం స్థాపించారు. దీంతో అనేక మంది సిస్టర్స్ ఇక్కడికి వచ్చి పేదలు, వృద్ధులకు సేవలందిస్తున్నారు. అన్నమ్మ మఠం ద్వారా వైద్యశాల, సెయింట్ మేరీస్ పేరుతో ఉన్నత పాఠశాలను స్థాపించడంతో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. శుభవార్త చర్చి ద్వారా మఠంపల్లి నుంచి వెళ్లిన అనేక మంది మత గురువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో సేవలందిస్తున్నారు. ప్రతి ఏడాది చర్చి వార్షికోత్సవంలో భాగంగా ఏప్రిల్ 25న నిర్వహించే శుభవార్త చర్చి జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మత గురువులు, బిషప్లతో పాటు దేశవిదేశాల్లోని క్రైస్తవులు కూడా హాజరవుతుంటారు. మంగళవార్త దేవాలయం నుంచి శుభవార్త చర్చిగా..మఠంపల్లిలోని శుభవార్త చర్చికి గతంలో మంగళవార్త దేవాలయంగా పేరుండేది. అయితే కన్య మరియమాత గర్భంలో బాలయేసు జన్మించనున్నాడని గాబ్రియేల్(దేవదూత) దూత పలికిన శుభసూచికమైన వార్తనే శుభవార్తగా భావించి ఈ చర్చికి శుభవార్త చర్చిగా నామకరణం చేసినట్లు క్రైస్తవులు చెబుతున్నారు. 26నుంచి ఎద్దుల పందేలు.. చర్చి వార్షికోత్సవం సందర్భంగా స్థానిక శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో చర్చి కమిటీ సహకారంతో ఈ నెల 26 నుంచి 29 వరకు మాంట్ఫోర్డ్ హైస్కూల్ మైదానంలో రోజూ రాత్రి 10గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎద్దుల పందేలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దులకు అన్నివిభాగాల్లో కలిపి రూ.8.78లక్షల నగదు బహుమతులతో పాటు షీల్డ్లు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 24, 25 తేదీల్లో వేడుకలు -
పిడుగుపడి పత్తి లోడు లారీ దగ్ధం
నేరేడుచర్ల: పిడుగుపడి పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం చింతపల్లిలోని కవిత కాటన్ ఇండస్ట్రీస్ నుంచి 24 టన్నుల పత్తి లోడుతో లారీ బయల్దేరి తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టిలోని మహావిష్ణు స్పిన్నింగ్ మిల్లుకు వెళ్తోంది. మార్గమధ్యలో రాత్రి 11.30గంటల సమయంలో లారీ నేరేడుచర్లకు రాగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో రహదారి పక్కన పిడుగు పడడంతో నిప్పు రవ్వ ఎగిరి లారీలోని పత్తిపై పడింది. చిల్లేపల్లి వద్దకు రాగానే లారీలోని పత్తి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. వెనుక నుంచి వస్తున్న వాహనాదారులు మంటలు గమనించి లారీ డ్రైవర్ రమేష్కు చెప్పడంతో అతడు లారీని రోడ్డు పక్కన ఆపి కిందకు దిగాడు. స్థానికులు నేరేడుచర్ల పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. జేసీబీ సహాయంతో లారీలో నుంచి కొంత పత్తిని తొలగించడంతో మంటలు తగ్గుముఖం పట్టాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది 8గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీతో పాటు అందులోని పత్తి దగ్ధం కావడంతో సుమారు రూ.80లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్నాయక్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో ట్రాఫిక్కు అంతరాయం కల్గకుండా చూశారు. 8గంటలు శ్రమించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది -
పోగొట్టుకున్న బ్యాగు బాధితుడికి అప్పగింత
నిడమనూరు: వెండి వస్తువులు గల బ్యాగును ఆటో మర్చిపోగా.. నిడమనూరు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి బ్యాగును బాధితుడికి అందజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండల కేంద్రానికి చెందిన అన్నెబోయిన శివకుమార్ తన ఇంట్లో శుభకార్యానికి కావాల్సిన 25 తులాల వెండి వస్తువులను హైదరాబాద్లో కొనుగోలు చేసి బ్యాగులో పెట్టుకొని నిడమనూరుకు వస్తున్నాడు. అలీనగర్ (14వ మైలు) దగ్గర ఆటో దిగి నిడమనూరుకు వెళ్తూ.. ఆటోలో శివకుమార్ తన బ్యాగును మరిచిపోయాడు. వెంటనే నిడమనూరు పోలీసులను ఆశ్రయించగా.. సీసీ కెమెరాల సహాయంతో ఆటోను గుర్తించి బ్యాగును బాధితుడు శివకుమార్కు అందజేసినట్లు ఎస్ఐ వి. నరేష్ తెలిపారు. -
కోతకు గురైన రహదారికి మరమ్మతులు
శాలిగౌరారం: శాలిగౌరారం మండలంలో కోతకు గురైన 365వ నంబర్ జాతీయ రహదారి అంచులను సంబంధిత అధికారులు మట్టితో పూడ్చివేయించారు. ‘పగుళ్లతో ప్రమాదకరంగా 365వ నంబర్ హైవే’ అనే శీర్షికన ఈ నెల 19న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు స్పందించి అంచులు కోతకు గురైన చోట మట్టిపోసి పూడ్చే పనులు చేపట్టారు. సమస్యను పరిష్కారమయ్యేలా కృషి చేసిన ‘సాక్షి’కి వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు. మందుబాబులకు జైలు శిక్ష, జరిమానాసూర్యాపేటటౌన్: సూర్యాపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 13మందిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్షతో పాటు రూ.2వేల చొప్పున జరిమానా, మరో తొమ్మిది మందికి రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి బీవీ రమణ తీర్పు వెలువరించినట్లు పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తెలిపారు. మద్యం సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ ● ముగ్గురు ప్రయాణికులకు గాయాలు చౌటుప్పల్: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తోంది. ఏపీకి చెందిన మరో ఆర్టీసీ బస్సుకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ శివారులోకి రాగానే అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో బస్సు డ్రైవర్ నక్క శ్రీనివాస్ ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండానే ఒక్కసారిగా బస్సును రోడ్డు కిందికి దింపాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సత్తుపల్లి డిపో బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు మేఘన, సాయిప్రియాంక, మోహన్రావుకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సత్తుపల్లి డిపో బస్సు డ్రైవర్ నరేంద్రకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధం
కేతేపల్లి: ఇంజన్లో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్లో నివాసముంటున్న వి. వెంకట్రావు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. వెంకట్రావు సోమవారం తన భార్యతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరాడు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం కొర్లపహాడ్ వద్దకు రాగానే కారు ఏసీలో నుంచి నుంచి పొగలు వచ్చాయి. ఇది గమనించిన వెంకట్రావు దంపతులు కారును రోడ్డు పక్కకు నిలిపి కిందకు దిగారు. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే కారుకు మొత్తం అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. నకిరేకల్ ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. -
నీటి సంపులో దూకి వివాహిత ఆత్మహత్య
సంస్థాన్ నారాయణపురం: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వివాహిత నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా జూలకల్లు మండల కేంద్రానికి చెందిన జంజనం వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ దంపతులు 30ఏళ్ల క్రితం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వారి కుమారుడు మల్లికార్జున్ గుంటూరు జిల్లా మంగళగిరిలో నివాసముంటూ జ్యూయలరీ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మల్లికార్జున్కు పల్నాడు జిల్లా కూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన నాగమణి(25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో సరైన పనిలేక మల్లికార్జున్ పుట్టపాకలో తన తండ్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంటి పనులను చూసుకోవడానికి భార్య నాగమణితో కలిసి వారం క్రితం వచ్చాడు. వీరి కుటుంబంతో కొంతకాలంగా పలు విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగమణి నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ జగన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. నాగమణిని తన తల్లింద్రడుల దగ్గరకి పంపించకపోవడం, ఆమెకు సెల్ఫోన్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై సంపులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 8మంది రిమాండ్
హుజూర్నగర్: ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను హుజూర్నగర్ సీఐ చరమంద రాజు సోమవారం విలేకరులకు వెల్లడించారు. హుజూర్నగర్కు చెందిన షేక్ ఖలీముద్దీన్, షేక్ అయూబ్ పాషా, పొట్టేపంగు కాటయ్య, తిరుమలశెట్టి రామమోహన్రావు, సామల నర్సింహారెడ్డి, మేళ్లచెరువు మండలం నల్ల బండగూడేనికి చెందిన తోడేటి గోపికృష్ణ, గరిడేపల్లి మండలం రాయినిగూడేనికి చెందిన వాడపల్లి నర్సింహారావు, ఏపీలోని విజయవాడకు చెందిన పొట్టి కోటయ్య సులువుగా డబ్బులు సంపాదించాలని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఆన్లైన్లో ఐపీఎల్ మ్యాచ్లకు బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్ పెట్టగా వచ్చిన డబ్బులు పంచుకుందామని వీరు ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని ఓ దుకాణం వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్ఫోన్లు, రూ.3,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి బెట్టింగ్ యాప్లలో ఉన్న రూ.66,067ను ఫ్రీజ్ చేసి, సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ ముత్తయ్య, ఏఎస్ఐ బలరాంరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర
చాలా సంతోషంగా ఉందిఅమ్మానాన్నతో మాట్లాడాలని అనిపించినప్పుడు మా వద్ద ఫోన్ లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు పాఠశాలలో ఫోన్ బాక్స్లు ఏర్పాటు కావడంతో అమ్మానాన్నతో ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. – జోత్స్న, 7వ తరగతి, ఎస్సీ గురుకుల పాఠశాల, బీబీనగర్ విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయితల్లిదండ్రులతో విద్యార్థులు మాట్లాడుకోవడానికి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో టెలిఫోన్ బాక్స్లు ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఇప్పటి వరకు విద్యార్థులు తమ హౌస్ మాస్టర్ అయిన టీచర్ ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడేవారు. ఇప్పుడు విద్యార్థులకు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. – రూప, ప్రిన్సిపాల్, ఎస్సీ గురుకుల పాఠశాల, బీబీనగర్● ప్రతి పాఠశాలలో 10 టెలిఫోన్ బాక్స్లు ఏర్పాటు ● విద్యార్థులే నేరుగా ఫోన్లో తమ తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ● ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు బీబీనగర్: ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఫోన్ మిత్ర పేరిట ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గురుకులాల్లో చదివే తమ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలంటే ఫోన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ఏదైనా అత్యవసరం ఉంటే టీచర్ ఫోన్కు చేయడం తప్పితే.. సాధారణంగా మాట్లాడాలంటే తల్లిదండ్రులు హాస్టల్కు రావాల్సిందే. కానీ ఈ ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు కావాల్సినప్పుడల్లా తమ తల్లిదండ్రులతో నేరుగా ఫోన్లో మాట్లాడుకునే సౌకర్యం ప్రభుత్వ కల్పిస్తోంది. 10 టెలిఫోన్ బాక్సులు ఏర్పాటుఫోన్ మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎస్సీ గురుకుల పాఠశాలలో గరిష్టంగా 10 టెలిఫోన్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా.. 15వేలకు పైగా విద్యార్థులు వాటిల్లో చదువుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా.. బీబీనగర్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో 720 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాల్లో టెలిఫోన్ బాక్స్లను విడతల వారీగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేక యాక్సిస్ కార్డుతో..విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు ఆయా పాఠశాలల్లోని టెలిఫోన్ బాక్స్లలో నిక్షిప్తమై ఉంటాయి. తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా పంపిణీ చేసే యాక్సిస్ కార్డులను స్వైప్ చేసి ఉచితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే అది కూడా అత్యవసరమైతేనే 40మంది విద్యార్థులకు కలిపి ఉండే హౌస్ మాస్టర్ అయిన టీచర్ను అడిగి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఫోన్ భాక్స్లు ఏర్పాటు కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
మునగాల: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ముకుందాపురం శివారులో సోమవారం రాత్రి జరిగింది. ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మునగాల మండల కేంద్రానికి చెందిన నారగాని రాంబాబు(40) కోదాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై కోదాడ నుంచి మునగాలకు వస్తుండగా.. మార్గమధ్యలో ముకుందాపురం వద్ద ముందు ఉన్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదలో రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.యువకుడి అదృశ్యం.. కేసు నమోదుచౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంట్లగూడెం గ్రామానికి చెందిన కానుగు శ్రీకాంత్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తన భార్య విజయలక్ష్మిని చౌటుప్పల్ పట్టణంలోని ఆమె తల్లిగారి ఇంటి వద్ద దింపిన శ్రీకాంత్ తిరిగి కుంట్లగూడెం వెళ్తానని చెప్పి బయల్దేరాడు. రాత్రి అయినా కూడా శ్రీకాంత్ ఇంటికి చేరుకోకపోవడంతో అతడి తమ్ముడు సాయి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా శ్రీకాంత్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. శ్రీకాంత్ నలుపు, లేత నీలం రంగు చొక్కా, తెలుపు రంగు ప్యాంట్ ధరించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వేసవిలో ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి ● టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములుసూర్యాపేటటౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వేసవి సెలవుల్లో పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీమన ఊరు–మన బడ్ఙి పథకంలో పూర్తిచేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తిచేయించేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో పనిచేసే సర్వీస్ పర్సనన్స్కు వేతన బకాయిలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే ప్రకటించాలని, నూతన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి. శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి జి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు ఆర్. దామోదర్, ఎన్. నాగేశ్వరరావు, వి. రమేష్, డి. లాలు, కె. జ్యోతి, డి. శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు
ఆలేరురూరల్ : మండలంలోని కొలనుపాక చర్చిలో ఈస్టర్ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాదిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొ ని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. మరణాన్ని జయించి తిరిగి సజీవుడైన దేవుడు ఏసుక్రీస్తు అని పేర్కొన్నారు. యుగయుగాలకు ఏసయ్య సజీవుడై ఉంటాడన్నారు. క్రీస్తు సమాధిలోనుంచి లేచివచ్చిన శుభవేళ ఈస్టర్ పండుగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్రెడ్డి, నాయకులు వెంకటేశ్వరరాజు, నీలం పద్మ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఐలు జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : ఆలిండియా లాయర్స్ యూని యన్ (ఐలు) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం భువనగిరిలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కుక్కదువ సోమయ్య, అధ్యక్షుడిగా బొల్లపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులుగా తడక మోహన్, పాల్వంచ జగతయ్య, ఎండీ నేహాల్ సహాయ కార్యదర్శులుగా సీసా శ్రీనివాస్, సూదగాని శ్రీహరి, చింతల రాజశేఖర్రెడ్డి, కోశాధికారిగా బొడ్డు కిషన్తో పాటు మరో పది మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో జేల్లా రమేష్, ఎండీ ఖయ్యూం, యాదాసు యాదయ్య, ఆకుల మల్లే శం, పిడుగు ఐలయ్య, గదగాని శంకర్, జిట్టా భాస్కర్రెడ్డి, ఎస్కే హమీద్, కుక్కదువ సాయి, సునీల్కుమార్, చింతల రాజు, వెన్నెల, భీమగాని శ్రీనివాస్, పారునంది రవికుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలుభువనగిరి : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రశాతంగా ప్రారంభమయ్యాయి. ఓపెన్ టెన్త్ పరీక్షలకు జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 408 విద్యార్థులకు గాను 362 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ ఇంటర్కు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,006 మంది విద్యార్థులకు 882 మంది హాజరయ్యారు. 124 మంది గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. జర్మనీలో ఉద్యోగావకాశాలు భువనగిరి : జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రిపుల్ విన్ ప్రాజెక్టు కింద ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పానాధికారి సాహితీ తెలిపారు. గుర్తింపు పొందిన నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, 21 నుంచి 38 ఏళ్లలోపువారు అర్హులన్నారు. జర్మనీ భాషలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 25లోపు బయోడేటా పంపాలని, వివరాలకు 9440051581, 9440048500ను సంప్రదించాలని కోరారు. నేడు ప్రజావాణి రద్దు భువనగిరిటౌన్ : కలెక్టరేట్లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి పోర్టల్పై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని, అందుకే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సామాజిక సేవతో గుర్తింపు ఆలేరురూరల్ : సామాజిక సేవతో సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తుందని నేత్ర, అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖుర్షిద్ పాషా పేర్కొన్నారు. ఆలేరుకు చెందిన సినియర్ సిటిజన్ మొరిగాడి సర్వయ్య తన మరణానంతరం భౌతికదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ ఆదివారం హామీపత్రం అందజేశారు. సమాజహితం కోసం తన కుటుంబసభ్యులను ఒప్పించి, వైద్య విద్యార్థుల ప్రయోగాల కోసం సర్వయ్య తన శరీరాన్ని దానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మో హన్రావు, మొరిగాడి మహేష్, ముల్లెక్కల ర వికుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నేళ్లకెన్నాళ్లకు..!
బొల్లేపల్లి కాల్వ నిర్వాసితుల గుర్తింపునకు కదిలిన యంత్రాంగం● 2022లో 80 ఎకరాలకు పైగా భూ సేకరణ ● రెండు దశాబ్దాలు గడిచినా అందని పరిహారం ● రైతుల వినతులు, పోరాటాలతో కదలిక ● ప్రారంభమైన సర్వేబీబీనగర్ : సాగునీటి కాల్వ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. 20 ఏళ్లలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, అధికారులకు వినతులు, ప్రజాప్రతినిధుల నిలదీతలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల్లో కదలిక వచ్చింది. కాల్వ కోసం రైతులు ఇచ్చిన భూములను గుర్తించేందుకు సర్వే ప్రారంభించారు. కాల్వ స్వరూపం ఇదీ.. బీబీనగర్, భువనగిరి మండలాల పరిధిలోని ఎనిమిది గ్రామాలతో పాటు ఐదు గిరిజన తండాలకు బీబీనగర్ మండలం రాఘవాపురం చెరువు నుంచి సాగునీరు అందజేయాలని 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం రాఘవాపురం చెరువు వద్ద నుంచి భువనగిరి మండలం బొల్లేపల్లి వరకు 21 కిలో మీటర్ల మేర కాలువ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. అదే సంవత్సరం కాల్వ పనులను ప్రారంభించి 2002లో పూర్తి చేశారు. ఈ కాల్వ ద్వారా రాఘవాపురం, లక్ష్మీదేవిగూడెం, బ్రాహ్మణపల్లి, రామునిగుండ్లతండా, పెద పలుగుతండా, జంపల్లి, బొల్లేపల్లితో పాటు మరో ఆరు గ్రామాల పరిధిలో సుమారు 2వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 80 ఎకరాల మేర భూ సేకరణకాల్వ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించగా నేటికీ వారికి పరిహారం మాత్రం అందలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు. గతంలో సేకరించిన భూ మికి హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలువ 16.5 మీటర్ల వెడల్పు ఉంది. కుడివైపు 10 మీటర్లు, ఎడమ వైపు 6.5 మీటర్లు వెడల్పు ఉండేలా హద్దురాళ్లు పెడుతున్నారు. మొత్తం 80 ఎకరాల మేర భూ సేకరణ జరగనుంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో సర్వే రైతుల పోరాటాలు, ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి చొరవతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో పది రోజుల క్రితం సర్వే ప్రారంభించారు. గ్రామాల వారీగా ఎంత భూమి పోయింది, రైతులు ఏమేరకు నష్టపోయారో గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.త్వరగా పరిహారం అందజేయాలి బొల్లేపల్లి కాల్వ ద్వారా భూములు కొల్పోయిన రైతులకు రెండు దశాబ్దాలు గడిచినా నష్టపరి హా రం అందలేదు, దీని పై గతంలో నేను కోర్టును ఆశ్రయించడం జరిగింది. సర్వే నివేదిక ప్రకారం రైతులందరికీ త్వరగా పరిహారం అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – కొమ్మిడి నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణపల్లి, బీబీనగర్ మండలంకాల్వలో రెండు ఎకరాలు పోయింది బొలేపల్లి కాల్వలో రెండు ఎకరాల భూమి పోయింది. 25 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు పరిహారం రాలేదు. మొన్నటి నుంచి అధికారులు సర్వే చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి. – ముక్కెర వెంకటేష్ యాదవ్, బట్టుగూడం 9 కిలో మీటర్లు సర్వే జరగాల్సి ఉంది బొల్లేపల్లి కాల్వ మొత్తం 21కిలో మీటర్ల పొడవు ఉంది. ఇప్పటి వరకు భూ సేకరణకు సంబంధించి 12 కిలో మీటర్ల మేర సర్వే పూర్తి చేశాం. మరో తొమ్మిది కిలో మీటర్లు సర్వే చేయాల్సి ఉంది. సర్వే కొనసాగుతోంది. పూర్తయ్యాక ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. – శ్రీనివాస్, నీటిపారుదల శాఖ ఏఈ, బీబీనగర్ మండలం -
పరిశీలన.. తప్పుల సవరణ
672 పాఠశాలలు ఎంపికజిల్లాలో 715 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సర్వే కోసం 672 పాఠశాలలను ఎంపిక చేశారు. నల్లగొండ డైట్ విద్యార్థులతో పాటు భువనగిరిలోని మదర్ థెరిస్సా, స్టాన్ఫోర్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చౌటుప్పల్లోని ఏఎంఆర్ బీఈడీ కళాశాలలకు చెందిన 63 మంది విద్యార్థులకు సర్వే బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి 10 పాఠశాలలు కేటాయించారు. రోజూ రెండు పాఠశాలల్లో సర్వే చేస్తున్నారు. వీరికి క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు సహకరిస్తున్నారు. యూడైస్లో తప్పులు ఉంటే వాటిని సవరించి తుది నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అందజేయనున్నారు. ఈనెల 15న మొదలైన సర్వే 21వ తేదీ వరకు కొనసాగనుంది.భువనగిరి : పాఠశాలలకు సంబంధించి యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)లో నమోదు చేసిన సమగ్ర సమాచారాన్ని విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తోంది. ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు పారదర్శకంగా ఉన్నాయా, లేదా.. అని థర్డ్ పార్టీ వ్యక్తులు నేరుగా పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పాఠశాలలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించనుంది. బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వేపాఠశాలల సమగ్ర సమాచారాన్ని ఉపాధ్యాయులు ఏటా యూడైస్లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరించి ఎంఈఓలకు నివేదిక అందజేస్తారు. ఎంఈఓల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు నిధుల కేటాయింపు, పథకాల అమలుకు ఈ నివేదిక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలకు, పాఠశాలల్లోని రికార్డులకు సరిపోలక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పులను సవరించేందుకు విద్యాశా ఖ బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే చేయిస్తోంది. ఈ అంశాలపై సర్వేపాఠశాలల్లో నమోదైన విద్యార్థులు, వారంతా అదే స్కూల్లో చదువుతున్నారా, ఉపాధ్యాయుల సంఖ్య, తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి వసతి, వంటగది, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, గ్రంథాయాలు, డిజిటల్ తరగతి గదులు, క్రీడా మై దానం, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందాయా, క్రీడా మైదానం ఉందా, తరగతి గదులెన్ని, ఇంకా ఎన్ని అవసరం తదితర వివరాలను యూడైస్లో నమోదు చేశారు. థర్డ్ పార్టీ వ్యక్తులు స్కూళ్లకు వెళ్లి సరిపోల్చి చూస్తున్నారు.‘యూడైస్’పై థర్డ్ పార్టీతో సర్వే పాఠశాలలకు వెళ్లి పరిశీలిస్తున్న బీఈడీ, డీఈడీ విద్యార్థులు నేడు విద్యాశాఖకు నివేదిక అందజేత దీని ఆధారంగానే బడులకు బడ్జెట్పారదర్శకత కోసమే సర్వే పాఠశాలల్లోని సమగ్ర సమాచారాన్ని ప్రతి విద్యా సంవత్సరం యూడైస్లో నమోదు చేస్తాం. వివరాలు సరిగా ఉన్నాయా లేదా సరిపోల్చేందుకు విద్యాశాఖ తొలిసారిగా థర్డ్ పార్టీతో సర్వే చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఈడీ, డీఈడీ విద్యార్థులతో సర్వే చేయిస్తున్నాం. – సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి -
హమాలీల కొరతతో కొనుగోళ్లు జాప్యం
బొమ్మలరామారం : హమాలీల కొరత వల్ల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఏర్పడిందని, సోమవారం నుంచి అన్ని కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కాంటా వేస్తామని పీఏసీఎస్ చైర్మన్ బాల్ నర్సింహ తెలిపారు. బొమ్మలరామారం మండల వ్యాప్తంగా పది కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు ఒక్క కేంద్రాన్ని ప్రారంభించకపోవడం, 20 రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్ద ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘20 రోజులైనా గింజ కొనలే’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు పీఏసీఎస్ చైర్మన్ నాగినేనిపల్లి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. హమాలీల సమస్యను అధిగమించేందుకు స్థానిక కూలీలతో పాటు బిహార్ కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. సోమవారం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఫ 21 నుంచి అన్ని కేంద్రాల్లో ప్రారంభిస్తాం ఫ పీఏసీఎస్ చైర్మన్ బాల్ నర్సింహ -
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మోటకొండూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అనతికాలంలోనే ప్రజావ్యతిరేకత మూటగట్టుకుందని, రానున్నది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు. శనివారం మోటకొండూరులో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆచరణకు సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సబ్బండ వర్గాలకు ఇచ్చిన 420 హామీల్లో ఏఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది న్నరకాలంలోనే రాష్ట్రంలో 500 మంది రైతులు, 80 మంది నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, అనేక మంది గీతకార్మికులు తాటిచెట్ల పైనుంచి పడి మృతిచెందారని, వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే భూకబ్జాలకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్లను పార్టీ కార్యాలయాలుగా మార్చారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డిపై ప్రజల్లో నమ్మకం పో యిందని, ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఆలేరు నియోజకవర్గ ప్రజలతో జనసంద్రం కావాలని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య, లింగాల శ్రీకర్రెడ్డి, ప ల్లా వెంకట్రెడ్డి, దూదిపాల రవీందర్రెడ్డి, నాయిని రామచంద్రారెడ్డి, బాల్ద లింగం, బీస కృష్ణంరాజు, పన్నాల నవీన్రెడ్డి, చామకూర అమరేందర్రెడ్డి, భూమండ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఫ రజతోత్సవ సభతో సత్తా చాటుదాం ఫ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత -
ఆర్థిక భద్రత కల్పించేందుకే శిక్షణ
భూదాన్పోచంపల్లి : ఉపాధి హామీ కూలీ జీవనోపాదులు మెరుగుపర్చి, వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి స్వయం ఉపాధిలో శిక్షణ అందిస్తున్నామని డీఆర్డీఓ నాగిరెడ్డి తెలిపారు. భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలో డీఆర్డీఓ, ఎస్బీఐ, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకంలో వంద రోజుల పనిదినాలు పూర్తయిన కూలీలకు అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. శనివారం శిక్షణ శిబిరాన్ని సందర్శించి వారికి యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం కూలి పనులపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధితో ఆర్థిక ప్రగతి సాధించాలన్న ఉద్దేశంతో అగరుబత్తీల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు యూనిట్ల స్థాపనకు బ్యాంకులు, సీ్త్రనిధి ద్వారా రుణ సహాయం అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధిహామీకూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ రఘుపతి, ఎంపీడీఓ భాస్కర్, జాబ్స్ జిల్లా మేనేజర్ కేపీ రాజు, ఏపీఓ కృష్ణమూర్తి, ఏపీఎం నీరజ, కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ట్రైనర్ శంకర్రావు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, టీఏ కృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ అమృత, జెఆర్సీ పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యయాదగిరిగుట్టరూరల్: ప్రభు త్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ సత్యనారాయణ అన్నారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలోని ఎంపీపీఎస్, పీఎంశ్రీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం, స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో పీఎంశ్రీ పథకానికి ఐదు పాఠశాలలు ఎంపికవగా అందులో మల్లాపురం కూడా ఉందన్నారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలోఉన్నత విలువలతో కూడిన విద్య అందుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం కసిరెడ్డి కొండల్రెడ్డి, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీహరి అయ్యంగార్, ఎంఈఓ శరత్యామిని, రాములు, పుచ్చుల సంధ్య, ముత్యం రాములు, మంగు భాస్కర్, రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పని ఏదైనా.. చేసేది వారే!
ఈ ఫొటోలోని ఇద్దరు మిర్యాలగూడ పట్టణంలోని టాకా రోడ్డులో హెయిర్ స్టూడియోలో పని చేస్తున్న ఢిల్లీకి చెందిన మున్నా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖాీసీం. రెండేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక దగ్గరే పని చేస్తుండటంతో స్నేహితులుగా మారారు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటూ షాపునకు వెళ్లి వస్తుంటారు. ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల జీతం వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల వలస కూలీలు ఎక్కడ చూసినా వారే.. హోటళ్ల నుంచి వరినాట్ల వరకు పనులు చక్కబెడుతున్నారు రైస్ మిల్లులు.. మార్కెట్లలో హమాలీలుగా వారే అధికం తోటలు, డెయిరీఫామ్లు, సెలూన్లలో సైతం.. కష్టం ఎక్కువ.. కూలి తక్కువ కావడంతో ఈ రాష్ట్రాల కూలీలతో పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా ఇక్కడి కూలీల కంటే.. ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ మంది కనిపిస్తారు. ఫబిహార్, బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు ఇటుక బట్టీలు, మార్కెట్లు, తోటలు, రైస్ మిల్లులు, డెయిరీ ఫామ్, భవన నిర్మాణం, సెంట్రింగ్, పీఓపీ, వ్యవసాయం, పౌల్ట్రీఫాం, సెక్యూరిటీ గార్డ్ పనుల్లో ఉన్నారు. ఫ ఉత్తరప్రదేశ్కు చెందిన వారు మగ్గం వర్క్లు, పాల్ సీలింగ్, పెయింటింగ్, హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, కరెంట్ ఫిట్టింగ్, సోఫాల తయారీ, పెళ్లి మండపాల తయారీలో పని చేస్తున్నారు. ఫ రాజస్థాన్కు చెందిన వారు టీస్టాళ్లు, వస్త్ర వ్యాపారం, హోటళ్లు, ఐస్క్రీమ్, ఎలక్టిక్ షాపులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ రంగంలో చూసినా ఇతర రాష్ట్రాల వారే కీలకంగా మారారు. పనివాడిగా, కూలీగా, మేసీ్త్రలుగా, యజమానులుగా, వ్యాపారులుగా మారి వివిధ రంగాల్లో పనులను చక్కబెడుతున్నారు. వారి ప్రాంతాల్లో పనుల్లేక, వలస వచ్చిన వారు ఇక్కడ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. తక్కువ కూలితో, ఎక్కువ సమయం పనిచేస్తున్న వీరిని ఇక్కడి ప్రజలు సైతం అక్కున చేర్చుకుంటున్నారు. వరినాట్లు వేయడానికి కూడా బిహార్ నుంచి కూలీలను తీసుకొస్తున్నారంటే వీరి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. వలస కూలీలు ఇక్కడ భాషను నేర్చుకొని స్థానికులతో మమైకమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,42,686 మంది కూలీలు ఉండగా.. అందులో దాదాపు 32 వేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఫ నల్లగొండ జిల్లాలో 46,030 మంది కూలీలు ఉండగా, అందులో దాదాపు 10 వేల మంది ఇతర రాష్ట్రాల వారే. ఫ సూర్యాపేట జిల్లాలో 79,329 మంది కూలీలకు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 18 వేల మంది ఉన్నట్లు అంచనా. ఫ యాదాద్రి భువనగిరి జిల్లాలో 17,327 మంది కూలీలు ఉండగా, అందులో ఇతర రాష్ట్రాల వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.భువనగిరి– చిట్యాల రోడ్డులో వలిగొండ సమీపంలో చెరుకు రసం విక్రయిస్తున్న ఇతను అనిల్ చౌహాన్. ఈయన రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇదే వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 32 వేల మంది -
జేఈఈ మెయిన్స్లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి
సూర్యాపేటటౌన్: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. కళాశాలకు చెందిన 58 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాల విద్యార్థులు కన్నా ఉజ్వన్ గణితంలో 99.969 పర్సంటైల్ సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జి.తేజశ్రీ ఆలిండియా 1622వ ర్యాంకు, కె.ఉజ్వన్ 2254వ ర్యాంకు, వి.బిందుమాధవి 2541వ ర్యాంకు, సీహెచ్.హన్షితశ్రీ 2651వ ర్యాంకు, బి.శివమణి 2769వ ర్యాంకు, జె.మేనక 8319వ ర్యాంకు, డి.జగదీషారాజు 9498వ ర్యాంకు, పి. ప్రేమ్చందర్ 9863వ ర్యాంకు సాధించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ జయవేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందించారు. ‘ప్రగతి’ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులునల్లగొండ: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు వి. శ్రీనిధి రాథోడ్ 79వ ర్యాంకు, జంపాల అభినవ్ 155వ ర్యాంకు, కల్లేపల్లి సమీరా 4738వ ర్యాంకు, రమావత్ సందీప్ 4854వ ర్యాంకు, కె. స్టాలిన్ 13,358వ ర్యాంకు, టి. కార్తీక్ 13,822వ ర్యాంకు, బి. భవాని 14,118వ ర్యాంకు, డి. సునీల్నాయక్ 19,990వ ర్యాంకు సాధించారు. తమ కళాశాల నుంచి 95 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఇంటర్లో అధిక మార్కులతో పాటు జేఈఈలో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేంద్రబాబు, ఎ. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్రెడ్డి అభినందించారు. ‘గౌతమి’ విద్యార్థుల ప్రభంజనంనల్లగొండ: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు జి. నితీష్రెడ్డి 370వ ర్యాంకు, ఎం. శివాజి 2396వ ర్యాంకు, ఐ. రికిత్ 5582వ ర్యాంకు, జి. తేజస్విని 6,174వ ర్యాంకు, ఆర్. శ్రీకర్ 6,916వ ర్యాంకు, ఎ. శశివంత్ 8,468వ ర్యాంకు, పి. రాజశేఖర్ 9,241వ ర్యాంకు, ఎం. సింహాద్రి 10,497వ ర్యాంకు, ఎం. శ్రీను 10,769వ ర్యాంకు, డి. పూజిత 11,444వ ర్యాంకు, కె. జయచంద్ర 12,233వ ర్యాంకు, ఎస్. భావన 13,706వ ర్యాంకు, జె. చంద్రకోటి 14,923వ ర్యాంకు, ఎం. సాత్విక్రెడ్డి 15,558వ ర్యాంకు, బి. శశిధర్ 15,688వ ర్యాంకు, కె. ప్రణయ్ 17,535వ ర్యాంకు, ఆర్. శివతేజ 18,385వ ర్యాంకు, ఎం. అక్షయ్ వర్షిత్ 18,797వ ర్యాంకు, ఆర్. అభినవ్ రాథోడ్ 19,137వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిరెడ్డి రఘుపాల్రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయం
● డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి నల్లగొండ టౌన్: 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాభివృద్ధికి సహకార వ్యవస్థ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ సహకార వ్యవస్థ పురోగతికి సహకార సంఘాలు, డీసీఓ వ్యవస్థ, బ్యాంకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వ్యాపారంలో, లాభాలు గడించడంలో, ఎన్పీఏలు తగ్గించడంలో ముందుందన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, కొండ సైదయ్య, గుడిపాటి సైదయ్య, వంగూరి రంగాచారి, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్, వీరస్వామి, శ్రవణ్కుమార్, సీఈఓ శంకర్రావు పాల్గొన్నారు. ఎంజీయూ పీజీ, ఎంసీఏ ఫలితాలు విడుదల నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీజీ మూడో సెమిస్టర్, ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను శనివారం యూనివర్సిటీ చీఫ్ ఆఫీసర్ ఆప్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. పీజీ, ఐపీసీ అండ్ ఐఎంఏఈలో 72.61 శాతం, ఎంసీఏలో 76.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతి పెద్దఅడిశర్లపల్లి: మిషన్ భగీరథ ప్లాంట్లోని భవనంలో లీకేజీకి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శనివారం జరిగింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం అబ్బనబోయినగూడెం గ్రామానికి చెందిన నర్ర నర్సింహ(50) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ సమీపంలో మిషన్ భగీరథ ప్లాంట్లోని పంప్ హౌజ్ ఫేస్–1 భవనంలో ఏర్పడిన లీకేజీకి గత మూడు రోజులుగా అతడు మరమ్మతులు చేస్తున్నాడు. శనివారం మరమ్మతు పనులు పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద జారిపడ్డాడు. దీంతో నర్సింహ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా..
కోదాడరూరల్: మార్కెట్లో మామిడికాయలు అమ్ముకొని తిరిగి ట్రాక్టర్పై ఇంటికి వెళ్తుండగా.. లారీ ఢీకొనడంతో తండ్రి మృతిచెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన రైతు, పీఏసీఎస్ డైరెక్టర్ నేరళ్ల సైదులు(57) తన కుమారుడు సాయితో కలిసి శుక్రవారం ట్రాక్టర్లో మామిడికాయలను లోడ్ చేసుకుని సూర్యాపేట మార్కెట్లో అమ్ముకొని రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో వై–జంక్షన్ వద్దకు రాగానే ట్రాక్టర్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో సైదులుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి కుమారుడు సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు -
రేవంత్రెడ్డితోనే మాదిగలకు న్యాయం జరిగింది
● ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిచండూరు: తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి వలన మాదిగలకు న్యాయం జరిగిందని, ఆంధ్రాలో మాత్రం మంద కృష్ణమాదిగ వల్ల అన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. రాష్ట్రంలో మాదిగలకు 9శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా చండూరులో శనివారం నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో త్వరలో నిర్వహించబోయే వర్గీకరణ విజయోత్సవ సభకు ప్రతిఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. రోస్టర్ పాయింట్ 6శాతం కాకుండా 7శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మంద కృష్ణమాదిగ కృషిచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వర్గీకరణ జీఓ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా జిల్లాల వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. 30 సంవత్సరాల మాదిగల నిర్విరామ పోరాట ఫలితంగా 9శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, ఓయూ అధ్యక్షుడు జోగు గణేష్, సంజీవ, విజయ్, జంగయ్య, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వం చాటుకున్న ‘మాచన’
శాలిగౌరారం: పుట్టుకతో దివ్యాంగుడైన ఆ బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఆ సమయంలో రెండేళ్ల వయస్సున్న అతడిని తల్లి వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆ బాలుడిని తాతయ్య, నానమ్మ, బాబాయి చేరదీసి సాకుతున్నారు. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం నల్లగొండ కల్టెరేట్కు రాగా.. వీరి పరిస్థితి తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వైద్య పరంగా ఆ బాలుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వివరాలు.. శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ముక్కాంల సృజన్ పుట్టుకతో దివ్యాంగుడు. సృజన్ తండ్రి 2019 మే 11న గొర్రెలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. అప్పుడు సృజన్ వయస్సు రెండు సంవత్సరాలు. భర్త మృతిచెందడం, కుమారుడు దివ్యాంగుడు కావడంతో సృజన్ తల్లి అతడిని తాతయ్య, నానమ్మ వద్ద వదిలిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సృజన్ అనాథగా మారాడు. దివ్యాంగుడైన సృజన్ను తాత, నానమ్మ ముక్కాంల భిక్షమయ్య, సత్తమ్మతో పాటు బాబాయి నరేశ్ సాకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వికలాంగుల పింఛన్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు శనివారం సృజన్ను తీసుకొని నానమ్మ సత్తమ్మ, బాబాయి నరేశ్ కలిసి నల్లగొండ కలెక్టరేట్కు వెళ్లారు. కలెక్టరేట్లో విధి నిర్వహణలో ఉన్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వారిని గమనించి అల్పాహారం తినేందుకు సృజన్ను పిలిచాడు. సృజన్ నడవలేడని, తల్లిదండ్రులు కూడా లేరని బాబాయి నరేశ్ రఘునందన్కు తెలిపాడు. దీంతో చలించిపోయిన రఘునందన్ సృజన్కు ఉచితంగా వైద్యం చేయిస్తానని నానమ్మ, బాబాయికి హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్లో ఉన్న న్యూ లైఫ్ హోమియోకేర్ వైద్యుడు గద్దె సుభాష్చందర్తో ఫోన్లో మాట్లాడి సృజన్ పరిస్థితిని వివరించాడు. దీంతో సోమవారం హాస్పిటల్కు రావాలని వైద్యుడు సూచించడంతో.. రఘునందన్కు సృజన్ నానమ్మ కృతజ్ఞతలు తెలిపింది. దివ్యాంగుడైన సృజన్ పరిస్థితి చూసి చలించి సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచన రఘునందన్ తెలిపారు. దివ్యాంగుడైన బాలుడికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ -
యువతకు ఉపయోగపడని యూత్ హాస్టల్
నాగార్జునసాగర్: యువతకు ఉపయోగపడేలా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గతంలో దేశవ్యాప్తంగా 143 యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేయగా.. అందులో భాగంగా తెలంగాణలో మూడు ఏర్పాటు చేశారు. ఈ మూడింటిలో ఒక దానిని నాగార్జునసాగర్లో సుమారు ఐదెకరాలలో నిర్మించారు. ఈ యూత్ హాస్టల్ నిర్మాణానికి 1997లో శంకుస్థాపన చేసి.. 2003లో ప్రారంభించారు. ఇది నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట ఉంది. ఇందులో ఏడు డార్మెట్లు ఉండగా 3 మహిళలు, 4 పురుషులు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. 100మంది వరకు బస చేయవచ్చు. యువత విహారయాత్రకు వచ్చినప్పుడు గ్రూపులుగా ఒకే చోట కలుసుకునేందుకు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్కు ఉపయోగపడేలా దీనిని నిర్మించారు. గతంలో ఇందులో బస చేసేందుకు ఒక్కరికి ఒకరోజుకు కేవలం రూ.30 అద్దె ఉండేది. తర్వాత రూ.50 చేయగా.. ప్రస్తుతం రూ.80 చేశారు. ఇందులో రెండు గదులు కూడా ఉండగా.. వాటికి అద్దె ప్రారంభంలో రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.500 ఉంది. అయితే ఈ యూత్ హాస్టల్ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి కేవలం లాడ్జీలుగా ఉపయోగపడ్డాయి. 2015 వరకు ఇందులో పనిచేసే కేర్టేకర్, తోటమాలి, స్వీపర్లకు వేతనాలు పోగా రూ.14,86,000 నగదు నిల్వలు ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నాగార్జునసాగర్లో శిక్షణ ఇచ్చిన సమయంలో ఆ డబ్బులను ఖర్చు చేసి గతంలో ఉన్న బెడ్లు, బెడ్షీట్లు మార్చేందుకు, తదితర ఖర్చులకు వినియోగించారు. ఈ యూత్ హాస్టల్ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ రంగులు కూడా వేయలేదు. గత 54నెలలుగా ఇందులో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వలేదు. ఏమైనా అద్దెలు వస్తే సుమారు రూ.50వేలు జమ అయితే ఒకటి, రెండు నెలలకు చెక్కులు రాసి వేతనాలు అందిస్తుంటారు. నెహ్రూ యువకేంద్రం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఈ యూత్ హాస్టల్కు మేజనేజర్గా వ్యవరిస్తుండగా.. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. ఇలాంటి యూత్ హాస్టళ్లు తెలంగాణలో సికింద్రాబాద్లోని బోట్స్ క్లబ్లో, హనుమకొండలో ఉన్నాయి. లీజుకు అడిగిన పర్యాటక అభివృద్ధి సంస్థఇటీవల తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ యూత్ హాస్టల్ను సందర్శించింది. దీనిని ఆధునీకరించి వినియోగంలోకి తీసుకొస్తే పర్యాటకులు బస చేసేందుకు ఉపయోగపడుతుందని లీజుకు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. అప్పట్లో నాగార్జునసాగర్ డ్యాంపై సీఆర్పీఎఫ్ సిబ్బంది పహారాగా ఉన్నారు. వారు బస ఇందులో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారు తెలంగాణ వైపు పహారా విధుల నుంచి విరమించుకొని వెళ్లిపోయారు. దీంతో ఈ యూత్ హాస్టల్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీనిని పర్యాటక అభివృద్ధి సంస్థకు లీజుకు ఇస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జిల్లా అధికారులు సమాలోచనలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ యూత్ హాస్టల్ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో డ్యాం భద్రతకు వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ హాస్టల్ కేటాయింపు వారు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే.. ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి -
న్యాయవాదుల చట్ట సవరణను పునఃసమీక్షించాలి
భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల న్యాయవాదుల చట్టం–1961ను సవరించడం వలన న్యాయవాద వృత్తి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, ఈ చట్ట సవరణపై కేంద్రం పునఃసమీక్షించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో మామిడి వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదుల చట్టంను సవరించడం వలన బార్ కౌన్సిల్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా విదేశీ లాయర్లను కేసులు వాదించేందుకు అనుమతించడం సరికాదన్నారు. వెంటనే సవరణ బిల్లును రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. 2019 తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ చేసుకున్న అడ్వకేట్లందరికీ హెల్త్కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న జడ్జిల ఇళ్లోలో డబ్బుల సంచులు దొరకడం అవమానకరమని, ఆవిధంగా దొరికిన వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, తడక మోహన్, సహాయ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, కోశాధికారి బొడ్డు కిషన్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ నేహాల్, యాదసు యాదయ్య, జెల్లా రమేష్, ఎండీ ఖయ్యూం, గాదపాక శంకర్, ఆకుల మల్లేశం, పిడుగు ఐలయ్య, జిట్టా భాస్కర్రెడ్డి, ఎస్కే హమీద్ తదితరులు ఉన్నారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి -
పరిశోధనకు మూలం ప్రశ్నావళి
నల్లగొండ టూటౌన్: పరిశోధనకు మూలం ప్రశ్నావళి తయారీ అని ఐపీఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శని వారం నిర్వహించిన ‘అకడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్’ వర్క్షాప్లో ఆయన పాల్గొని డేటా కలెక్షన్, ఎనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనే అంశాలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్డీ చేసే విద్యార్థులు డేటా కలెక్షన్కు వెళ్లే ముందు ప్రశ్నావళి తయారు చేయడంలో ఉపయోగించే స్కేల్స్ తో పాటు వాటిని ఎనాలసిస్ చేయడానికి ఉపయోగించే ఎక్సెల్ షీట్పై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ గ్రంథాలయ అసోసియేట్ ప్రొఫెసర్ చక్రవర్తి, ఎంజీయూ ప్రొఫెసర్ అంజిరెడ్డి, ఆకుల రవి, శ్రీదేవి, రవిచంద్ర, పీహెచ్డీ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరీశుడికి వెండి కలశాలు, పాత్రలు బహూకరణ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం హైదరాబాద్కు చెందిన భక్తులు వెండి కలశాలు, వెండి పాత్రలు బహూకరించారు. హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్కు చెందిన బిరదవోలు వరశ్రీ కుటుంబ సభ్యులు సుమారు 7కిలోల వెండితో తయారు చేసిన 11 వెండి కలశాలు, ఒక ఏక హారతి, ఒక ధూప హారతి పాత్రలను ఈఓ భాస్కర్రావుకు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్కే చెందిన డాక్టర్ బీవీఎస్ రాంప్రసాద్ కిలో వెండితో తయారుచేసిన 2 వెండి కలశాలను ఈఓకు అందించారు. అంతకుముందు వారు గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరి పంట కోయనీయడంలేదని ఆత్మహత్యనాగారం: వరి పంట కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన వట్టె భద్రమ్మ(61), ముత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరికి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద కుమారుడు 20ఏళ్ల క్రితమే మృతి చెందాడు. భర్త మృతిచెందిన తర్వాత పెద్ద కోడలు విజయ తన పుట్టింటికి వెళ్లి జీవనం కొనసాగిస్తోంది. దీంతో భద్రమ్మ తన మనవరాలు(విజయ కుమార్తె) పేరిట రూ.10లక్షల విలువైన ఇంటి స్థలం, రెండెకరాల పొలం రాసిచ్చింది. అయితే తన భర్త వాటా కింద రావాల్సిన మిగతా ఎకరంన్నర పొలం తమ పేరిట రాసివ్వాలని విజయ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. అంతేకాకుండా ఆ ఎకరంన్నరలో పండించిన వరిని కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన భద్రమ్మ శనివారం వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చిన్న కుమారుడు పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్రెడ్డి తెలిపారు. ఈతకు వెళ్లి బావిలో బాలుడు గల్లంతుసూర్యాపేటటౌన్: ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు బావిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసారం గ్రామానికి చెందిన పల్లె వెంకన్న, లలిత దంపతుల కుమారుడు మహేందర్(11)తో పాటు అతడి స్నేహితులు వేణు, అభిలాష్, దినేష్ ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లారు. దినేష్ బావి ఒడ్డున కూర్చొని ఉండగా మిగిలిన ముగ్గురు బావిలోకి దూకారు. మహేందర్, వేణుకు ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా బావిలో ఉన్న అభిలాష్ వారి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే మొదట వేణును బయటకు తీసుకొచ్చి వెంటనే మహేందర్ను కాపాడేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు బావిలో మునిగిపోయాడు. బావి లోతుగా ఉండటంతో కాపాడలేకపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ బాలునాయక్, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు చైనా మోటార్లు, రెండు ట్రాక్టర్ మోటార్లతో నీటిని తోడుతున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మనోహర్ సూచించారు. అసంక్రమిత వ్యాధులు, రెబీస్ నివారణ, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ ఆపీసర్లు, ఎంఎల్హెచ్పీలకు కలెక్టరేట్లో గురువారం శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, ఎండకు బయటకు వెళ్లిన వారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉప్పు, చక్కెర స్థాయికి మించి తీసుకోవడం వల్లే మధుమేహం వస్తుందని, వ్యాధిగ్రస్తులు జొన్న, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు. సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు సంబంధించిన రెబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. అనంతరం అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. అదే విధంగా హిమోఫిలియో దినోత్సవం సందర్భంగా హిమోఫిలియోపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ యధోద, డాక్టర్లు సత్యేంద్రనాథ్, అనిల్, అశ్విన్కుమార్, హేమంత్కుమార్, సుమన్కళ్యాణ్, శిల్పిని, రామకృష్ణ, సాయిశోభ, వీణ, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు. ఫ డీఎంహెచ్ఓ మనోహర్ -
అధికారుల అండదండలతోనే..
ఆలేరు మండలం కొలనుపాక, రాజనగరం, ధర్మారెడ్డిగుడెం, మంతపురి, సాయిగుడెం, తూర్పుగుడెం, గొలనుకొండ వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల సాకుతో అక్రమార్కులు ఇసుక దందా సాగిస్తున్నారు. రెండుమూడు డీడీలు తీసి పది ట్రాక్టర్ల వరకు ఇసుక తరలిస్తున్నారు. రహస్యప్రాంతాల్లో డంప్ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్కు లారీల్లో చేరవేస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.5వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారుల అండదండలతోనే అక్రమ దందా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. అక్రమార్కులు తమ సంపాదనంలో నెలనెలా వారికి కొంత ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. -
వాగులను తోడేస్తున్నారు!
జోరుగా ఇసుక అక్రమ రవాణా ధర్మారెడ్డిగూడెం టు కాచారం, హైదరాబాద్ యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం పరిధిలోని వాగు నుంచి రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ అక్రమ దందా సాగిస్తున్నారు. రాత్రి సమయంలో అక్రమార్కులు జేసీబీల ద్వారా ఇసుక తోడి కాచారం ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు అమ్ముతున్నారు. రోజూ సుమారు 30 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు. వాగు వెంట ఉన్న రైతులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా సైదాపురం–మాసాయి పేట, మైలార్గూడెంను కలుపుతూ వలిగొండ చెరువు వరకు ఉన్న వాగు రూపురేఖలు లేకుండాపోయింది. వాగులో ఇసుక తరలించడంతో పాటు పరీవాహకంలో అక్రమార్కులు ఫిల్టర్ ఇసుక కూడా తయారు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫ ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పేరిట దందా ఫ ట్రాక్టర్ రూ.3000 వరకు విక్రయం ఫ లారీల్లో హైదరాబాద్కు తరలింపు ఫ మొక్కుబడిగా తనిఖీలు ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండాపోతోంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లను అవకాశంగా మలుచుకుని అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. వాగులనుంచి ట్రాక్టర్ల ద్వారా రహస్య ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి లారీలు, టిప్పర్ల ద్వారా హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ప్రధానంగా ఆలేరు, యాదగిరిగుట్ట, ఆత్మకూర్(ఎం), అడ్డగూడూరు, రాజాపేట మండలాల్లో విస్తరించిన వాగులను అక్రమార్కులు టార్గెట్ చేస్తున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగుతున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. –యాదగిరిగుట్ట రూరల్, ఆలేరు రూరల్, రాజాపేట -
ముగిసిన ఎస్ఏ–2 పరీక్షలు
భువనగిరి : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఎస్ఏ–2 వార్షిక పరీక్షలు గురువారం ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 715 పాఠశాలల్లోని 35వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి, 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 23న తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. అందజేయనున్నారు. తాగునీటి సమస్య రావొద్దు యాదగిరిగుట్ట రూరల్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని జెడ్పీ సీఈఓ శోభారాణి ఆదేశించారు. యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమై తాగునీటి సరఫరాపై సమీక్షించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళా సమాఖ్య సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లోన్లు ఇచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నవీన్కుమార్, ఏపీఎం సుధాకర్, ఉద్యోగులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరింపజేయాలినల్లగొండ టౌన్: బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరింపజేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికం బోర్డు సలహా సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆ దిశగా ఽఅధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అయినప్పుడే టెలికం రంగం అభివృద్ధిపదంలో పయనిస్తుందన్నారు. అంతకు ముందు ఎంపీ రవిచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవిప్రసాద్, మురళికుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్కు ఎంపిక సంస్థాన్ నారాయణపురం : మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన కర్నాటి అక్షిత జాతీయ అర్చరీ స్పోర్ట్స్ మీట్కు ఎంపికై ంది. హైదరాబాద్లో ఈనెల 15నుంచి 17వ తేదీ వరకు జరిగిన రీజినల్ స్పోర్ట్స్ మీట్–2025 ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో 70, 60, 50, 30 మీటర్ల విభాగాల్లో అక్షిత విజేతగా నిలవడంతో నేషనల్ స్పోర్ట్స్ మీట్కు ఎంపిక చేశారు. అక్షిత హైదరాబాద్లోని కంచన్బాగ్ కేంద్రీయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి పూర్తి చేసింది. గత ఏడాది కూడా జాతీయస్థాయిలో మెడల్ సాధించింది. ఈ సందర్భంగా అక్షిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్మెడల్ సాధించడం తన లక్ష్యమన్నారు. జాతీయ స్థాయి పోటీల కోసం తన తండ్రి అప్పు చేసి 20 రోజుల పాటు శిక్షణ ఇప్పించారని, ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. -
వరి గడ్డి ధర రెట్టింపు
భువనగిరి, రామన్నపేట : వరి గడ్డి బంగారంగా మారింది. భూగర్భ జలాలు అడుగంటడంతో వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. దీంతో వానాకాలం సీజన్ పూర్తయ్యే దాకా ఎండుగడ్డిని భద్రపరుచుకునే అవసరం పాడి రైతులకు ఏర్పడింది. ముందు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. 2,91,000 ఎకరాల్లో వరి సాగు యాసంగిలో 2,91,000 ఎకరాల్లో వరిసాగు చేశారు. మూసీ పరీవాహకంలో వరి నాట్లు కొంత ఆలస్యం కాగా.. మూసీ పరివాహకేతర ప్రాంతాల్లో ముందుగానే నాట్లు వేశారు. దీంతో మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో 15 రోజుల క్రితం నుంచే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బావులు, బోర్లు వట్టిపోయి సాగునీరందక వేలాది ఎకరాల్లో వరి చేలు ఎండిపోయాయి. ఎండిన పంటను రైతులు పశువులు, జీవాలకు వదిలారు. దీంతో ఎండుగడ్డికి డిమాండ్ ఏర్పడింది. గత ఏడాది, ఈసారి ధర ఇలా.. వర్షాలు సమృద్ధిగా కురిసిన సంవత్సరం ఎండుగడ్డికి అంతగా డిమాండ్ ఉండదు. చాలామంది రైతులు అమ అవసరాలకు కొంత నిల్వ చేసుకుని, మిగతా గడ్డిని పొలంలోనే కలియదున్నేవారు. కానీ, ఈ యాసంగి సీజన్లో నెలకొన్న పరిస్థితుల వల్ల ఎండుగడ్డికి డిమాండ్ పెరిగింది. గత ఏడాది యాసంగిలో ఎకరం గడ్డి రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయించారు. ప్రస్తుతం ఎకరం గడ్డి రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. కట్టలెక్కన గతంలో రూ.100 ఉండగా ప్రస్తుతం రూ.150 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు. ప్రధానంగా మూసీ పరివాహకేత ప్రాంతాల్లో బోరు బావుల కింద పండే వరి గడ్డిని పశువులు ఎక్కువగా మేస్తాయి. దీంతో ఈ గడ్డికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంగా మారిన గడ్డి ఎండుగడ్డి వ్యాపారంగా మారింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారుల అవతారం ఎత్తారు. వరి కోతలు ప్రారంభించకముందే వ్యాపారులు ముందుగానే గడ్డి బుక్ చేసుకుంటున్నారు. ఆ తరువాత వివిధ ప్రాంతాల రైతులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇది వ్యాపారులకు ఉపాధిగా మారింది. ధర పెరిగింది బోరు అడుగంటడంతో యాసంగిలో సాగు చేసిన వరి చేను పూర్తిగా ఎండిపోయింది. దీంతో పశువులకు గడ్డి కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలం గడ్డి వచ్చే వరకు సుమారు 3 ఎకరాల గడ్డి అవసరం అవుతుంది. కొనుగోలు చేసేందుకు వెళ్తే ఎకరానికి రూ.వెయ్యికి పైనే చెబుతున్నారు. గతంలో ఎకరం గడ్డి రూ.500లకే వచ్చేది. –వనగంటి రవీందర్, రైతు పహిల్వాన్పురం ఫ అడుగంటిన భూగర్భ జలాలు.. వేలాది ఎకరాల్లో ఎండిన చేలు ఫ ముందస్తు జాగ్రత్తగా గడ్డి కొనుగోలు చేస్తున్న పాడి రైతులు ఫ ఎకరం విస్తీర్ణంలోని గ్రాసానికి రూ.1,000 నుంచి రూ.1,200 వరకు డిమాండ్ఇతర జిల్లాల నుంచి.. ఆత్మకూర్(ఎం), మోత్కూరు, ఆలేరు, రాజాపేట, అడ్డగూడూరు, గుండాల, భువనగిరి, వలిగొండ, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక్కడి గడ్డి నాణ్యవంతంగా ఉంటుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న సిద్ధిపేట, మెదక్, మేడ్చల్ జిల్లాల రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్లు, డీసీఎంలు, ఆటోల్లో తరలిస్తున్నారు. -
యాదగిరి నృసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలు నేత్రపర్వంగా చేపట్టారు. గురువారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చాన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు స్వామి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం, నిత్యకల్యాణం, జోడు సేవత్సంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
‘భూ భారతితో’ భూ సమస్యలకు చెక్
ఆత్మకూరు(ఎం) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గురువారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. రైతుల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణిని రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. ఇకపై భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభించనుందన్నారు. ప్రతి రైతుకూ భూధార్ కార్డు : కలెక్టర్ హనుమంతరావు ఆధార్ కార్డు తరహాలోనే ప్రతి రైతుకు భూధార్ కార్డు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. భూభారతి చట్టం 36 ఆప్షన్లతో రైతులకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు భాషలో ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సీ కాలనీలో కూరెళ్ల అనిల్ ఇంట్లో సన్నబియ్యంతో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ రాములునాయక్, మార్కెట్ డైరెక్టర్ పాశం వినోద, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మంగమ్మ, మాజీ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా పాల్గొన్నారు.ఫ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య -
విద్యుదాఘాతంతో ప్లంబర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన సంస్థాన్నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన కొల్లూరి పవన్(19) ప్లంబర్గా పనిచేస్తున్నాడు. కొత్తగూడెం గ్రామంలో నూతన ఇంటిలో జరుగుతున్న ప్లంబర్ పనికి వెళ్లాడు. ప్లంబింగ్ మిషన్కు ఎర్తు రావడంతో పవన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పవన్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్ తెలిపారు.