ప్రధాన వార్తలు

మా ప్రయాణం అద్భుతం ఒలింపిక్ పతకమే లక్ష్యం
భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రాటుదేలుతూ వస్తోంది. గతేడాది పారిస్ ఒలింపిక్స్ అవకాశం తృటిలో కోల్పోయినా... ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్–10లోకి దూసుకొచ్చింది. 9వ ర్యాంకుతో ఈ ఘనతకెక్కిన తొలి భారత మహిళల జంటగా నిలిచింది. బిజీగా గడిచిన గత సీజన్లో విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచితే... వరల్డ్ టూర్ ఫైనల్స్ లాంటి మేజర్ టోర్నీలు పాఠాలు నేర్పాయని ఇద్దరు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు తాము జోడీకట్టిన తీరు నుంచి విజయాలు, సాఫల్యాల దాకా తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. 2021లో మొదలైన మీ ప్రయాణం ఎలా సాగుతోంది? గాయత్రి: మొదట్లో నేను సింగిల్స్ ఆడేదాన్ని. కానీ డబుల్స్ అయితే ఇంకా బాగా ఆడతాననిపించింది. దీంతో ట్రెసాతో జోడీ కట్టాను. నేను అనుకున్నట్లుగానే కొన్ని టోర్నీల్లోనే డబుల్స్లో రాణించగలగడం మరింత ఆనందాన్నిచ్చింది. తర్వాత ఏడాదే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ (2022) ఆడి సెమీస్ చేరాం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇంత త్వరగా ఆడతామనుకోలేదు. అక్కడి నుంచే మా జోడీ మరింత బలపడింది. మా పయనం అద్భుతంగా సాగుతోంది. మేటి ప్రత్యర్థులతో ఎన్నో మ్యాచ్లు గెలిచాం. ఎంతో నేర్చుకున్నాం. ట్రెసా: 2021లో మేమిద్దరం కలిసి ఆడటం మొదలుపెట్టాం. అప్పటినుంచే గాయత్రి గురించి తెలుసుకున్నాను. కోర్టులో జోడీగా, కోర్టు బయట స్నేహితులుగా మా బంధం పటిష్టమైంది. ఆటలోనే కాదు... అవసరమైన ప్రతీసారి నాకు చాలా మద్దతుగా నిలుస్తుంది. నాకు ఏదైనా సాయం అవసరమైనా గాయత్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. గతేడాది సాధించిన సయ్యద్ మోడి టైటిల్ ఎలాంటి సంతృప్తినిచ్చింది? గాయత్రి: బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో భాగమైన సయ్యద్ మోడి టైటిల్ను సాధించేవరకు తెలియదు... మేమే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళల జోడీ అని! అందుకే ఆ విజయం ఎప్పటికీ ప్రత్యేకమైంది. దేశానికి ట్రోఫీ తెచ్చిపెట్టడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ విజయానందంలో మేమిద్దరం భావోద్వేగానికి గురయ్యాం. అది ఇప్పటికీ గుర్తుంది. ట్రెసా: ఇలాంటి మేజర్ టోర్నీ టైటిల్స్ గెలుపొందాలన్నదే మా ఉమ్మడి కల. ఫైనల్లో గెలిచి... పోడియంపై నిలిచి... గర్వంగా బంగారు పతకాల్ని అందుకోవడం మంచి అనుభూతినిచి్చంది. ఇలాంటి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. పారిస్ ఒలింపిక్స్ అవకాశాన్ని కోల్పోయిన మీరు లాస్ ఏంజెలిస్ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? గాయత్రి: పారిస్ ఛాన్స్ చేజార్చుకోవడంతోనే మా ఒలింపిక్స్ కల అంతమవలేదు. మా మనోధైర్యం కోల్పోలేదు. తదుపరి లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ రూపంలో మరో అవకాశముంది. మరింత కష్టపడతాం. ప్రతి టోర్నీని అనుకూలంగా మలచుకుంటాం. ఒక్క ఒలింపిక్సే టోర్నమెంట్ కాదు. ఎన్నో ముఖ్యమైన టోర్నీలూ ఉన్నాయి. అన్నింటా సత్తా చాటడమే మా లక్ష్యం. ట్రెసా: అవును... ఆ ఒలింపిక్స్కు దూరమయ్యాం. మేం అర్హత సాధించలేకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. కానీ వచ్చే ఒలింపిక్స్ కోసం ఇప్పటినుంచే శ్రమిస్తాం. ప్రతి క్యాలెండర్ ఇయర్లోని టోర్నీలన్నీ ఆడటం ద్వారా ర్యాంకింగ్కు మెరుగుపర్చుకొని అర్హత సాధిస్తాం. గతేడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ అనుభవం గురించి చెబుతారా? గాయత్రి: హాంగ్జౌలో జరిగిన ఈ టోర్నీలో తొలి పోరులో చైనాకు చెందిన లియు–తన్ జంటను ఎదుర్కొన్న మాకు పరాజయం తప్పలేదు. అయితే రెండో మ్యాచ్లో మలేసియన్ జోడీ పిర్లి తన్–తినాలపై గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ మూడో మ్యాచ్లో నమీ మత్సుయమ–చిహరు షిదా (జపాన్) జోడీ చేతిలో ఓడటంతో ముందుకెళ్లే అవకాశాల్ని కోల్పోయాం. అయితే అనుభవ పాఠాలైతే నేర్చుకోగలిగాం. ట్రెసా: సీజన్ ముగింపు టోర్నీలో అంతా మేటి ప్రత్యర్థులే ఎదురవుతారు. రెడ్ మ్యాట్పై ఆడే మ్యాచ్ల్ని టీవీల్లో చూశాను. గతేడాది ప్రత్యక్షంగా ఆడాను. చైనాలోని స్టేడియాలు, మ్యాచ్లపై ఉండే అంచనాలు నిజంగా గొప్పగా ఉంటాయి. అక్కడ మేం ఆడిన మ్యాచ్లు, అనుభవం చాలా దోహదపడుతుందని అనుకుంటున్నా. గుత్తా జోడీ ర్యాంకింగ్ను అధిగమించడం ఎలా అనిపిస్తోంది?గాయత్రి: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్పల 10వ ర్యాంకును అధిగమించిన భారత మహిళల ద్వయంగా నిలువడం చాలా ఆనందాన్నిచ్చింది. మొదట ఈ ర్యాంకు ఘనత తెలియదు. నిజానికి మా లక్ష్యం గుత్తా జోడీ ర్యాంకింగ్ను చెరిపేయడం కాదు. మేం టాప్–10లోకి దూసుకెళ్లడం. మొత్తానికి భారత మహిళల డబుల్స్లో ఇలా మెరుగైన ర్యాంకింగ్ సాధించడం మా శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. ట్రెసా: నిజానికి గత క్యాలెండర్ ఇయర్ చాలా బిజీగా గడిచింది. అందుకే కఠినమైన టోర్నీలను ఎంపిక చేసుకొని ఆడటం. విజయాలు సాధించడం వల్లే మా ర్యాంకుల్లో మెరుగుదల కనిపించింది. ఇలాంటి మైలురాళ్లు ఎవరికైనా ఆనందాన్నే ఇస్తాయి.

‘హ్యాట్రిక్’పై భారత్ గురి
కొలంబో: ముక్కోణపు వన్డే సిరీస్లో వరుస విజయాల ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఆతిథ్య శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లను ఓడించిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. టోర్నీలో భాగంగా ఆదివారం భారత అమ్మాయిల జట్టు... లంకతో తలపడనుంది. వన్డే క్రికెట్లో వరుసగా 8 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన టీమిండియాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓడించడమంటే లంకకు శక్తికి మించిని పనే అవుతుంది. ఈ నేపథ్యంలో భారత్కు ‘హ్యాట్రిక్’ కష్టం కాకపోవచ్చు. అన్ని రంగాల్లో ఆధిపత్యం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోను భారత్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్లో ఓపెనర్లు ప్రతీక, స్మృతి మంధాన ఫామ్లో ఉన్నారు. వన్డౌన్లో హర్లీన్ డియోల్ నిలకడగా రాణిస్తుండగా, కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్లతో కూడిన మిడిలార్డర్ దీటుగా ఉంది. బౌలింగ్ విభాగంలో ప్రత్యేకించి ఈ సిరీస్లో మాత్రం స్పిన్ విభాగం ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. దీప్తిశర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణిల ఉచ్చులో బ్యాటర్లు చిత్తవుతున్నారు. పేసర్లు కాశ్వీ గౌతమ్, అరుంధతీ పరుగుల పరంగా కట్టడి చేస్తున్నారు. ఇక ఈ టోర్నీలో సఫారీలాంటి గట్టి ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ల కంటే కూడా మన ఫీల్డింగే ఎంతో మెరుగ్గా ఉంది. దీంతో భారత్ ఎదురు లేని విజయాలతో దూసుకెళుతోంది. సఫారీపై గెలిచిన ఉత్సాహంతో... మరోవైపు ఆతిథ్య లంక జట్టు గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై గెలిచిన ఉత్సాహంతో ఉంది. హాసిని పెరీరా, హర్షిత, కవిశా దిల్హరి అర్ధసెంచరీలతో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్నందుకున్న శ్రీలంక... ఇదే పట్టుదలను భారత్పై కనబరచాలని భావిస్తోంది. కెపె్టన్ చమరి ఆటపట్టు, విష్మీ గుణరత్నేలు టాపార్డర్లో రాణిస్తే కాస్త మెరుగైన స్కోరు చేయగలుగుతుంది. బౌలింగ్ దళంలో మాల్కి మదర, సుగంధిక కుమారి, దేవ్మి విహంగ, ఐనొక రణవీర నిలకడగా వికెట్లను పడగొడుతున్నారు. అయితే వీరంతా భారత్లాంటి మేటి ప్రత్యర్థిపై ఏమేరకు రాణిస్తారనే దానిపై ఆతిథ్య జట్టు విజయావకాశాలు ఆధారపడివున్నాయి. తుది జట్లు (అంచనా) భారత్: ప్రతిక, స్మృతి, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, కాశ్వీ గౌతమ్, అరుంధతి, స్నేహ్ రాణా, శ్రీచరణి. శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), హాసిని, విష్మీ, హర్షిత, కవీశ, నీలాక్షిక సిల్వా, అనుష్క సంజీవని, దేవ్మి, మాల్కి మదర, సుగంధిక, ఐనొక రణవీర.

బెంగళూరు బ్రహ్మాండంగా...
బెంగళూరు: కోహ్లి ఉన్న బెంగళూరు, ధోని ఆడుతున్న చెన్నై మధ్య మ్యాచ్ ఎలా జరిగితే బాగుంటుందో అలా జరిగిందీ మ్యాచ్. పెద్ద స్కోర్లు... మెరుపు ఇన్నింగ్స్లు, ఆఖరి ఓవర్ ఉత్కంఠ ఇవన్నీ కలగలిపి ప్రేక్షకులకు క్రికెట్ విందు ఇచ్చిన ఐపీఎల్ పోరులో యశ్ దయాళ్ ఆఖరి 3 బంతులే చెన్నై సూపర్కింగ్స్ను ఓడించాయి. 3 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన చెన్నైకి యశ్ చెక్ పెట్టి 3 సింగిల్సే ఇవ్వడం విశేషం. ఒత్తిడిని జయించిన అతని బౌలింగే చివరకు బెంగళూరును 2 పరుగుల తేడాతో గెలిపించింది. ముందుగా ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (14 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్లు) ఉప్పెనల్లే ఉరిమాడు. ఓపెనర్లు కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్స్లు), జాకబ్ బెథెల్ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేశారు. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి ఓడింది. ఆయుశ్ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్స్లు), జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు.బెథెల్, కోహ్లిల ‘పవర్’ ప్లే బెంగళూరు ఓపెనర్లు బెథెల్, కోహ్లి మెరుపులు మెరిపించడంతో ‘పవర్ ప్లే’ పరుగెత్తిపోయింది. ఇద్దరి జోరుకు 4.3 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. 6 ఓవర్లలో 73/0 స్కోరు చేసింది. బెథెల్ 28 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. ఓపెనర్లు తొలి వికెట్కు 97 పరుగులు జతచేశారు. ఆ తర్వాత కోహ్లి 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. ఒకే ఓవర్లో 33 పరుగులు... 18 ఓవర్లలో స్కోరు 159/5. ఆ తర్వాత ఒకే ఒక్కడి వీరబాదుడుతో స్టేడియమంతా ఊగిపోయింది. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో ప్రతీ బంతిని దంచికొట్టిన షెఫర్డ్ 4 సిక్స్లు, 2 బౌండరీలతో 32 పరుగులు (6, 6, 4, 6, 6 నోబాల్, 0, 4) బాదేశాడు. నోబాల్తో కలిపి మొత్తం 33 పరుగులు వచ్చాయి. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో కూడా షెఫర్డ్ దంచుడుకు 4, 0, 4, 6, 6లతో 21 పరుగులు వచ్చాయి. ఈ రెండు ఓవర్లలోనే 54 పరుగులు వచ్చాయి. చెన్నై శరవేగంగా... సూపర్కింగ్స్ పరుగుల వేట మూడో ఓవర్ నుంచి ఊపందుకుంది. భువనేశ్వర్ నాలుగో ఓవర్లో ఆయుశ్ 5 ఫోర్లు, ఓ సిక్స్తో 26 పరుగులు వచ్చాయి. 4.1 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది. స్వల్ప వ్యవధిలో షేక్ రషీద్ (14), స్యామ్ కరన్ (5) అవుటైనా... ఆయుశ్కు జడేజా జతయ్యాక చెన్నై శరవేగంగా లక్ష్యం వైపు సాగిపోయింది. 25 బంతుల్లోనే ఆయుశ్ ఫిఫ్టీ పూర్తయ్యింది. 29 బంతుల్లో అతని అర్ధసెంచరీ సాధించాడు. ఆయుశ్ జోరుకు ఇన్గిడి కళ్లెం వేయగా, మరుసటి బంతికి బ్రెవిస్ (0) ఎల్బీ అయ్యాడు. అక్కడినుంచి ఫలితం ఇరు జట్లతో దోబూచులాడింది. యశ్ దయాళ్ 2 సింగిల్స్ ఇచ్చి ధోని (12)ని అవుట్ చేశాడు. శివమ్ దూబే (8 నాటౌట్) వచ్చీ రాగానే సిక్సర్ బాదాడు. నోబాల్ కావడంతో అదనంగా మరో పరుగు, ఓ బంతి కలిసొచ్చినా...దయాళ్ ఆఖరి 3 బంతుల్ని అద్భుతంగా వేయడంతో దూబే, జడేజాలు సింగిల్స్ మాత్రమే తీయగలిగారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) బ్రెవిస్ (బి) పతిరణ 55; కోహ్లి (సి) అహ్మద్ (బి) స్యామ్ కరన్ 62; పడిక్కల్ (సి) జడేజా (బి) పతిరణ 17; పటిదార్ (సి) స్యామ్ కరన్ (బి) పతిరణ 11; జితేశ్ (సి) బ్రెవిస్ (బి) నూర్ అహ్మద్ 7; టిమ్ డేవిడ్ నాటౌట్ 2; షెఫర్డ్ నాటౌట్ 53; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–97, 2–121, 3–144, 4–154, 5–157. బౌలింగ్: ఖలీల్ 3–0–65–0, అన్షుల్ 3–0–25–0, నూర్ 4–0–26–1, జడేజా 3–0–26 –0, కరన్ 3–0–34–1, పతిరణ 4–0–36–3. చెన్నై సూపర్కింగ్స్ ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) కృనాల్ (బి) ఇన్గిడి 94; రషీద్ (సి) షెఫర్డ్ (బి) కృనాల్ 14; కరన్ (సి) జితేశ్ (బి) ఇన్గిడి 5; జడేజా నాటౌట్ 77; బ్రెవిస్ (ఎల్బీ) (బి) ఇన్గిడి 0; ధోని (ఎల్బీ) (బి) దయాళ్ 12; దూబే నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–51, 2–58, 3–172, 4–172, 5–201 బౌలింగ్: కృనాల్ 3–0–24–1, భువనేశ్వర్ 4–0–55–0, దయాళ్ 4–0–41–1, ఇన్గిడి 4–0–30–3, సుయశ్ 4–0–43–0, షెఫర్డ్ 1–0–18–0. ఆలస్యంగా అప్పీల్ చేసి... అద్భుతంగా ఆడుతున్న ఆయుశ్ వెనుదిరిగిన తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ క్రీజ్లోకి వచ్చాడు. విజయానికి 22 బంతుల్లో 42 పరుగులు కావాలి. దూకుడుకు మారుపేరైన బ్రెవిస్ చెలరేగితే చెన్నై గెలిచేందుకు మంచి అవకాశాలున్నాయి. ఇన్గిడి వేసిన బంతి అతని ప్యాడ్స్కు తాకడంతో అంపైర్ అవుట్గా ప్రకటించాడు.సందేహంగా ఉండటంతో వెంటనే అతను ‘రివ్యూ’ కోరాల్సింది. కానీ సింగిల్ కూడా పూర్తి చేసిన అతను ఆ తర్వాత కాస్త ఆలోచించి ‘రివ్యూ’ కోసం సైగ చేశాడు. కానీ అప్పటికే నిర్ణీత 15 సెకన్లు పూర్తి అయిపోయాయి. దాంతో అంపైర్ నితిన్ మేనన్ ఆ రివ్యూను తిరస్కరించాడు. అయితే తర్వాతి రీప్లేలో అది ‘అంపైర్స్ కాల్’గా చూపించింది. అంటే రివ్యూ తీసుకున్నా బ్రెవిస్ అవుటయ్యేవాడే! 14 అర్ధ సెంచరీకి షెఫర్డ్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో యశస్వి జైస్వాల్ 13 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా... కేఎల్ రాహుల్, ప్యాట్ కమిన్స్ కూడా 14 బంతుల్లోనే ఈ మార్క్ను అందుకున్నారు. 62 ఐపీఎల్లో కోహ్లి అర్ధ సెంచరీల సంఖ్య. వార్నర్ (62)తో సమంగా అగ్రస్థానానికి చేరాడు. ఐపీఎల్లో నేడుకోల్కతా X రాజస్తాన్ వేదిక: కోల్కతామధ్యాహ్నం 3: 30 గంటల నుంచి పంజాబ్ X లక్నో వేదిక: ధర్మశాల రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: ఉత్కంఠ పోరు.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. అయితే 20 ఓవర్ వేసిన యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి దయాల్ సిక్స్ ఇచ్చాడు. అంతకు తోడు ఆ బంతి నో బాల్ కావడంతో మ్యాచ్ సీఎస్కే వైపు మలుపు తిరిగింది. చివరి మూడు బంతుల్లో సీఎస్కే విజయానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ సమయంలో దయాల్ అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీఎస్కే బ్యాటర్లలో యువ ఆటగాడు అయూష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 94) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.అతడితో పాటు రవీంద్ర జడేజా(77 నాటౌట్) రాణించాడు. సీఎస్కే ఓడిపోవడంతో వీరిద్దరి ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా.. దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.కోహ్లి, షెపెర్డ్ మెరుపు ఇన్నింగ్స్లు..ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి చేరుకుంది.

IPL 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు..
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఖాలీల్ అహ్మద్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఖాలీల్ అహ్మద్ను ఆర్సీబీ బ్యాటర్లు ఊతికారేశాడు. తొలుత అతడిని జాకబ్ బెతల్ టార్గెట్ చేయగా.. ఆఖరిలో రొమరియో షెపర్డ్ చుక్కలు చూపించాడు. 19 ఓవర్ వేసిన ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో షెఫర్డ్ 4 సిక్స్లు, 2 ఫోర్లు కొట్టి 33 పరుగులు పిండుకున్నాడు. ఖాలీల్ ఓవరాల్గా 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో ఖాలీల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్తో పాటు టీ20 క్రికెట్లో 3 ఓవర్లలోనే 65 పరుగులిచ్చిన బౌలర్గా చెత్త రికార్డు నెలకొల్పాడు. అదేవిధంగా ఐపీఎల్-2025లో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్ కూడా అహ్మద్నే కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.

రొమారియో షెపర్డ్ విధ్వంసం.. సెకెండ్ ఫాస్టెస్ట్ ఫిప్టీ
ఐపీఎల్-2025లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు.సీఎస్కే బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా సీఎస్కే బౌలర్ ఖాలీల్ అహ్మద్కు చుక్కలు చూపించాడు. 19వ ఓవర్ వేసిన ఖాలీల్ బౌలింగ్లో షెఫర్డ్ 4 సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంతవేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ప్లేయర్గా కేఎల్ రాహుల్, కమ్మిన్స్ సరసన షెపర్డ్ నిలిచాడు. రాహుల్, కమ్మిన్స్ కూడా 14 బంతుల్లోనే ఆర్ధ శతకం సాధించాడు.ఈ ఫీట్ సాధించిన జాబితాలో యశస్వి జైశ్వాల్(13 బంతులు) అగ్రస్దానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో షెపర్డ్ ఓవరాల్గా 6 సిక్స్లు, రెండు ఫోర్లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదేవిధంగా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు బాదిన నాలుగో ప్లేయర్గా రొమారియో నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా UNREAL HITTING! 💪🔥#RomarioShepherd blitzkrieg hits Chinnaswamy! ⚡He smashes a jaw-dropping 53 off just 14 balls,equaling the 2nd fastest fifty in IPL history! Worthy of this epic clash #Kohli vs #Dhoni - one last time? 🙌🏻Watch the LIVE action in Haryanvi commentary ➡… pic.twitter.com/cOReV8qcPT— Star Sports (@StarSportsIndia) May 3, 2025

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఐపీఎల్-2025లో టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో మరో హాఫ్ సెంచరీని కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు కింగ్ కోహ్లి బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..👉ఐపీఎల్లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 1146 పరుగలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ పంజాబ్ కింగ్స్పై 1134 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా సీఎస్కేపై అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్పటివరకు సీఎస్కేపై 10 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ సీఎస్కేపై 9 సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు నమోదు చేశాడు.👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకే జట్టు తరపున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్(263) ఉన్నాడు.👉టీ20 క్రికెట్లో ఒకే వేదికలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్నస్వామి స్టేడియంలో 151 కొట్టాడు.👉ఐపీఎల్లో 8500 పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులెక్కాడు.చదవండి: #Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్కు దూరం?

#Kagiso Rabada: కగిసో రబాడపై సస్పెన్షన్ వేటు.. ఐపీఎల్కు దూరం?
దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐపీఎల్-2025 మధ్యలోనే తన స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో రబాడ సౌతాఫ్రికా వెళ్లినట్లు గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. దాదాపు 20 రోజులు అవుతున్నప్పటికి రబాడ తిరిగి భారత్కు మళ్లీ రాలేదు.ఈ క్రమంలో తన స్వదేశానికి వెళ్లిపోవడానికి అస్సలు కారణాన్ని రబాడ వెల్లడించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సమయంలో నిషేదిత డ్రగ్ వాడడంతో తనపై తాత్కలిక సస్పెన్షన్ వేటు పడినట్లు రబాడ తెలిపాడు. అందుకే ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగనట్లు ఈ స్పీడ్ స్టార్ స్పష్టం చేశాడు. దీంతో ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్లకు కూడా రబాడ దూరం కానున్నాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా తరపున కూడా రబాడ అడేది సందేహంగా మారింది.నేను ఐపీఎల్లో ఆడకుండా వ్యక్తిగత కారణాల వల్ల తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చానని ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఓ ప్రకటన చేసింది. అయితే నిషేధిత డ్రగ్ వాడడంతో సౌతాఫ్రికా క్రికెట్ నాపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. అందుకే ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ తప్పు చేసినందుకు అందరికి క్షమాపణలు తెలుపుతున్నాను. క్రికెట్ ఆడే అవకాశాన్ని ఎల్లప్పుడూ నేను అరుదైన గౌరవంగా భావిస్తాను. తిరిగి నాకు ఇష్టమైన ఆట ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఈ కఠిన సమయంలో సపోర్ట్గా నిలిచిన నా ఏజెంట్, సౌతాఫ్రికా క్రికెట్, గుజరాత్ టైటాన్స్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని ఓ ప్రకటనలో రబాడ పేర్కొన్నాడు.

ఉత్కంపోరులో సీఎస్కే ఓటమి..
IPL 2025 RCB vs CSK Live Updates: ఉత్కంపోరులో సీఎస్కే ఓటమి..ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠపోరులో 2 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేయగల్గింది. ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. అయితే 20 ఓవర్ వేసిన యశ్ దయాల్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతుల సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బంతికి ధోనిని ఔట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి దయాల్ సిక్స్ ఇచ్చాడు. అంతకు తోడు ఆ బంతి నో బాల్ కావడంతో మ్యాచ్ సీఎస్కే వైపు మలుపు తిరిగింది. చివరి మూడు బంతుల్లో సీఎస్కే విజయానికి కేవలం 6 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ సమయంలో దయాల్ అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. మూడు బంతుల్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీఎస్కే బ్యాటర్లలో యువ ఆటగాడు అయూష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 94) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా(77 నాటౌట్) రాణించాడు. సీఎస్కే ఓడిపోవడంతో వీరిద్దరి ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడీ మూడు వికెట్లు పడగొట్టగా.. దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు. విజయానికి చేరువలో సీఎస్కే..సీఎస్కే విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(75), ధోని(11) ఉన్నారు.సీఎస్కే మూడో వికెట్ డౌన్..ఆయూష్ మాత్రే రూపంలో సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 94 పరుగులతో అద్బతమైన ఇన్నింగ్స్ ఆడిన మాత్రే.. లుంగీ ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు. సీఎస్కే విజయానికి 22 బంతుల్లో 42 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(59) ఉన్నాడు.దంచి కొడుతున్న సీఎస్కే బ్యాటర్లు..భారీ లక్ష్య చేధనలో సీఎస్కే అదరగొడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో మాత్రే(91), జడేజా(50) పరుగులతో ఉన్నారు.సీఎస్కే రెండో వికెట్ డౌన్..సామ్ కుర్రాన్ రూపంలో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన కుర్రాన్.. లుంగీ ఎంగిడీ బౌలింగ్లో ఔటయ్యాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.దూకుడుగా ఆడుతున్న అయూష్..సీఎస్కే యువ ఓపెనర్ అయూష్ మాత్రే దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో మాత్రే.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 26 పరుగులు రాబాట్టాడు. మాత్రే 47 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. సీఎస్కే తొలి వికెట్ డౌన్214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన షేక్ రషీద్.. కృనాల్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు సీఎస్కే స్కోర్:57/1కోహ్లి, షెఫర్డ్ మెరుపులు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్గా నిలవగా.. జాకబ్ బెతల్(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. సీఎస్కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.షెఫర్డ్ విధ్వంసం..19 ఓవర్ వేసిన ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో ఆర్సీబీ బ్యాటర్ షెఫర్డ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగు సిక్స్లు, రెండు ఫోర్లతో ఏకంగా 33 పరుగులు రాబాట్టాడు. 19 ఓవర్లు ముగిసే ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.రెండు వికెట్లు డౌన్..ఆర్సీబీ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. జితేష్ శర్మ(7) నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔట్ కాగా.. పాటిదార్(11) పతిరాన బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 18 ఓవర్లకు ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్..విరాట్ కోహ్లి రూపంలో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసిన కోహ్లి.. సామ్ కుర్రాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(150, పాటిదార్(7) ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లి 62 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్..జాకబ్ బెతల్ రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 55 పరుగులు చేసిన బెతల్.. పతిరాన బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 114 పరుగులు చేసింది.జాకబ్ బెతల్ హాఫ్ సెంచరీ..ఆర్సీబీ యువ ఆటగాడు జాకబ్ బెతల్ తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కేవలం 28 బంతుల్లో బెతల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. క్రీజులో బెతల్(54), కోహ్లి(40) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఆర్సీబీ ఓపెనర్లు జాకబ్ బెతల్(28) , విరాట్ కోహ్లి(18) ఉన్నారు.ఐపీఎల్-2025లో ఆసక్తికరపోరుకు తెరలేచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సీఎస్కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ మాత్రం ఈ మ్యాచ్లో గెలిచి తమ ప్లే ఆఫ్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్కు ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ దూరమయ్యాడు. అతడి స్ధానంలో లుంగీ ఎంగిడీ జట్టులో వచ్చాడు. సీఎస్కే మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, యశ్ దయాల్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ఎంఎస్ ధోని(కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరానా

సచిన్ రికార్డుపై కన్నేసిన టీమిండియా ఓపెనర్..
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత జట్టు కీలక పోరు సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా శ్రీలకంతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని హర్మన్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా యువ ఓపెనర్ ప్రతీక రావల్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్లోర్లు సాధించిన భారత బ్యాటర్గా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ను అధిగమించేందుకు ప్రతీక అడుగుదూరంలో నిలిచింది. ప్రస్తుతం ప్రతీక వరుసగా ఐదు సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించి సచిన్, ద్రవిడ్తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్లో రావల్ మరో హాఫ్ సెంచరీ సాధిస్తే ఈ దిగ్గజ క్రికెటర్ల రికార్డును బ్రేక్ చేస్తోంది. అయితే ప్రతీక ఉన్న ఫామ్కు ఈ రికార్డు బద్దలు కావడం ఖాయమన్పిస్తోంది.నయా సంచలనం..కాగా భారత క్రికెట్లో ప్రతీక రావల్ పేరు మారుమ్రోగిపోతుంది. గతేడాది డిసెంబర్లో భారత జట్టు తరపున వన్డే అరంగేట్రం చేసిన రావల్.. వరుస హాఫ్ సెంచరీలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన ప్రతీక 81.7 సగటుతో 572 పరుగుల చేసింది. అందులో ఒక సెంచరీ, ఐదు ఆర్ధశతకాలు ఉన్నాయి.ప్రతీక ఆఖరి ఐదు వన్డే స్కోర్లు ఇవే..89 వర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)67 వర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)154 వర్సెస్ ఐర్లాండ్( రాజ్ కోట్)50 నాటౌట్ -వర్సెస్ శ్రీలంక(కొలంబో)78 వర్సెస్ దక్షిణాఫ్రికా(కొలంబో)చదవండి: నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి

ఏడాదిన్నర క్రితమే విడాకులు.. డేటింగ్ రూమర్స్పై క్లారిటీ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, లండన్ ఒలింపిక్స్...

‘టాప్స్’లో జ్యోతి సురేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ...

భారత బాక్సర్ల పసిడి పంచ్
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా జూనియర్ బాక్సింగ్ టో...

మళ్లీ ఓడిన భారత బ్యాడ్మింటన్ జట్టు
ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీ...

సచిన్ రికార్డుపై కన్నేసిన టీమిండియా ఓపెనర్..
మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత జట్టు క...

నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్య...

అతడొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస ...

‘ఇలాంటివి మన ఆడతనాన్ని దూరం చేయలేవు’
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయంపై భారత ...
క్రీడలు


శిఖర్ ధావన్తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)


CSK vs PBKS : చహల్ హ్యాట్రిక్, చెన్నై ఖేల్ ఖతం (ఫోటోలు)


శ్రేయాంకతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్ (ఫొటోలు)


హ్యాపీ బర్త్డే హిట్మ్యాన్... రోహిత్ శర్మ అరుదైన ఫొటోలు


KKR Vs DC: కీలక విజయం సాధించిన కోలకతా నైట్ రైడర్స్, మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)


సతీసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (ఫోటోలు)


సెంచరీతో కుమ్మేసిన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (ఫోటోలు)
LSG Vs MI: లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం


సన్రైజర్స్ vs చెన్నై మ్యాచ్లో సందడి చేసిన హీరో అజిత్, శివ కార్తికేయన్ (ఫొటోలు)
వీడియోలు


హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్


IPL 2025: ముంబై అంపైర్లను కొనేసిందా?


ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం


ఐపీఎల్ లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం


Vaibhav Suryavanshi: అమ్మా నాన్నల త్యాగం సూర్యవంశీ ఎమోషనల్


బుమ్రా కొడుకుపై ట్రోలింగ్ ఇచ్చిపడేసిన భార్య సంజన


IPLలో గుజరాత్ పై రాజస్థాన్ ఘన విజయం


టీమిండియా స్టార్లతో ? కోహ్లి తన్నులాట విరాట్ కు ఏమైంది


ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం


చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో నెగ్గిన SRH