National
-
‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్’
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్-పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి అదే పాటపాడారు. భారత్-పాకిస్తాన్ సీజ్ఫైర్లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్.రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోదీ గొప్ప వ్యక్తి ఆయనతో రాత్రి మట్లాడా. గత రాత్రే భారత్ - అమెరికా ట్రేడ్ గురించి ఆయనతో మాట్లాడాను’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
‘కబుర్ల దేవత’ కేంద్ర బాల సాహిత్య పురస్కారం
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది. -
ఈ నేషనల్ హైవేలపై బీకేర్ఫుల్!
నేషనల్ హైవేలపై రయ్ అంటూ దూసుకుపోతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షల్లో క్షతగాత్రులవుతున్నారు. సుదూర ప్రాంతాలను కలిపే జాతీయ రహదారులపైనా జరుగుతున్న యాక్సిడెంట్లు ఎంతో మందిని బలితీసుకుంటున్నాయి. 2022 కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. నేషనల్ హైవేలపై 1,51,997 యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. అదే ఏడాది మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 1,68,491 మరణాలు నమోదయ్యాయి. జాతీయ రహదారులపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 61,038.మోస్ట్ డేంజర్.. ఎన్హెచ్-44 అయితే జాతీయ రహదారుల్లో కొన్ని అత్యంత ప్రమాదకరంగా మారాయని సేవ్లైఫ్ ఫౌండేషన్ వెల్లడించింది. 2023 ప్రమాదాల గణాంకాల ప్రకారం 100 హైవేలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చినట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి, దేశంలోని అతి పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ఎన్హెచ్-44 అత్యంత ప్రమాదకరమైన హైవేగా తేలింది. హరియాణా, ఢిల్లీలో 44వ నంబరు జాతీయ రహదారిపై 2023లో జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించినట్టు వెల్లడైంది.కిలోమీటర్కు 3 మరణాలుఎన్హెచ్-44 హరియాణాలో 266 కిలోమీటర్లు విస్తర్తించి ఉంది. 2023లో ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో 715 మంది దుర్మరణం పాలయ్యారు. అంటే కిలోమీటర్కు మూడు మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 30 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైవేపై 63 మంది మృత్యువాత పడ్డారు. కిలోమీటర్కు దాదాపు 2 మరణాలు నమోదయ్యాయి. ముకర్బా చౌక్- సంఘూ బోర్డర్, ఆశారాం- బహదూర్పూర్ డేంజర్ స్పాట్లగా గుర్తించారు. హరియాణా పరిధిలో 85 కిలోమీటర్ల మేర ఎన్హెచ్-48 విస్తరించివుంది. ఈ రూట్లో గుర్గావ్- రాజస్థాన్ బోర్డర్ను మూడో డేంజర్ జోన్గా పేర్కొంటున్నారు.చదవండి: 6 వారాల్లో 3 హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది?జాతీయ రహదారులపై ఎక్కడెక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయో గుర్తించి, వాటిని నివారించడానికి చేపట్టాల్సిన చర్యలు చేపట్టడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. రక్షణ చర్యల కోసం హైవే బిల్డర్లు, ఆపరేటర్లను ఆదేశించడానికి ఈ గణాంకాలు దోహదపడతాయన్నారు. -
ఇది 20 ఏళ్ల కల.. కొడుకుతోపాటే కానిస్టేబుల్ జాబ్ కొట్టాడు
అతనికి పోలీస్ కావాలనే కల. చదువుకునే టైంలో కష్టపడ్డప్పటికీ ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఈలోపు కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. ఆర్మీ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. కట్ చేస్తే.. ఇరవై ఏళ్ల తర్వాత తన కన్నకొడుకుతో కలిసి పోలీస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యాడు. కఠోర శ్రమ తర్వాత కొడుకుతో పాటే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉత్తర ప్రదేశ్లో రెండేళ్ల కిందట(2023 డిసెంబర్లో) 60 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆ పరీక్షలో యశ్పాల్ అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి(41) ఎంపికయ్యాడు. అయితే ఇదే నోటిఫికేషన్లో ఆయన కొడుకు శేఖర్(21)కు కూడా ఉద్యోగం వచ్చింది. అందుకే లక్నో జరిగిన ఈవెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఇద్దరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇప్పించారు ఈ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్. అందుకు ప్రత్యేకంగా కారణం ఉంది.యశ్పాల్ స్వస్థలం హపూర్ జిల్లా ధౌలానా తాలుకా ఉదయ్పూర్ ఉదయ్రాంపూర్ నంగ్లా గ్రామం. రెండు దశాబ్దాల కిందట కానిస్టేబుల్ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. రెండు అటెంప్ట్లలో జాబ్ కొట్టలేకపోయాడు. ఆపై 2003లో ఆర్మీలో చేరాడు. 16 ఏళ్ల సర్వీస్ తర్వాత వలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని.. ఢిల్లీ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్లో పని చేస్తూ వచ్చారు. ఈలోపు యూపీలో మెగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలదైంది. అప్పటికి ఇంటర్ పూర్తి చేసిన యశ్ పాల్ పెద్ద కొడుకు శేఖర్ ఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. భోజనాల దగ్గర తరచూ ఈ మాట ఆ తండ్రి చెవిన పడింది. తనకు పరీక్షకు ప్రిపేర్ అవ్వాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆ మాటతో భార్య అనిత సంతోషించింది. రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగులకు వయోపరిమితి సడలింపుతో ఇలాంటి ఉద్యోగాలకు అనుమతిస్తారని తెలుసు కదా. అలా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యశ్పాల్ భావించాడు. మొత్తం 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట్లో శేఖర్ తన తండ్రితో కలిసి పరీక్షకు ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే యశ్పాల్కు జీకేతో పాటు పలు సబ్జెక్టులలో విపరీతమైన నాలెడ్జ్ ఉంది. అది గమనించి తండ్రి నుంచి తన అనుమానాలను నివృత్తి చేసుకునేవాడట. అలాగే తన తండ్రికి లాజికల్, న్యూమరికల్ రీజనింగ్ సాయం చేస్తూ.. ఇద్దరూ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు. లోకల్గా ఉన్న లైబ్రరీకి కలిసి వెళ్లి చదువుకునేవాళ్లు. అలా రెండేళ్ల ప్రిపరేషన్తో.. యూపీ కానిస్టేబుల్ పరీక్షతో పాటు సీడీఎస్, ఎస్సై ఎగ్జామ్లు కూడా రాశారు. 2024 ఆగష్టులో రాతపరీక్ష జరిగింది. ఈలోపు పేపర్లీక్ వ్యవహారంతో ఈ తండ్రీకొడుకుల నెత్తిన పిడుగుపడ్డట్లు అయ్యింది. అయితే తమ శ్రమనే నమ్ముకున్న ఆ తండ్రీకొడుకులు.. తమ ప్రిపరేషన్ను మాత్రం ఆపలేదు. అదే ఏడాది చివర్లో ఫిజికల్ టెస్టులూ జరిగాయి. ఫలితాల్లో.. కొడుకుతో పాటే ఆ తండ్రీ కూడా జాబ్ కొట్టాడు. దీంతో భార్యాపిల్లలు మాత్రమే కాదు.. వాళ్లు ఉంటున్న వాడంతా సంబురాలు చేసుకుంది. లక్నోలో తాజాగా(జూన్ 15వ తేదీన) జరిగిన గ్రాండ్ ఈవెంట్లో అమిత్షా చేతుల మీదుగా ఆ తండ్రీకొడుకులు అపాయింట్మెంట్ లెటర్ అందుకున్నారు. శిక్షణ కోసం షాహ్జహాన్పూర్కు యశ్పాల్, బరేలీకి శేఖర్ వెళ్లారు. రెండు దశాబ్దాల తర్వాత తన కల నెరవేరినందుకు యశ్పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
అన్నంలో విషం కలిపి.. భర్తపై నవవధువు ‘కాఠిన్యం’
గర్హ్వా: మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ల కథనం మరువకముందే జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఇదే తరహా దారుణం చోటుచేసుకుంది. హనీమూన్ కేసులో సోనమ్ తన భర్తను అంతమొందించేందుకు కాంట్రాక్టు కిల్లర్లను ఆశ్రయిస్తే, జార్ఖండ్కు చెందిన నవ వధువు సునీతా దేవి భర్తను చంపేందుకు అన్నంలో విషం కలిపింది.జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో ఒక నవ వధువు తన భర్తకు విషం ఇచ్చినందుకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రాంకా ప్రాంతానికి చెందిన సునీతా దేవి జూన్ 15న రాత్రి భర్త బుద్ధనాథ్ సింగ్(24)కు పురుగుల మందు కలిపిన ఆహారాన్ని వడ్డించింది. మరుసటి రోజు ఉదయం అతను మృతిచెందాడు. ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయ అవసరాలకు పురుగుమందు అవసరమంటూ భర్త చేత సునీత పురుగుమందు కొనిపించిందని పోలీసులు తెలిపారు. బుద్ధనాథ్ సింగ్ తల్లి రాజమతి దేవి తన కోడలు తన కుమారునిపై విషప్రయోగం చేసిందని ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేసింది.రంగంలోకి దిగిన రాంకా పోలీసులు సునీతను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బుద్ధనాథ్ సింగ్ మృతికి గల కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సునీత పోలీసుల ముందు అత్తపై పలు ఆరోపణలు చేస్తూ , కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ తరువాత భర్త భోజనంలో తానే విషం కలిపానని,అందుకే భర్త చనిపోయాడని తెలిపింది. బహోకుందర్ గ్రామానికి చెందిన బుద్ధనాథ్ సింగ్, ఛత్తీస్గఢ్కు చెందిన సునీతలకు 2025, మే 11న వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు -
‘నాన్న ముఖంపై దిండుతో అదిమి..’ తల్లి దారుణాన్ని బయటపెట్టిన బాలుడు
అల్వార్: రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ కాంట్రాక్ట్ కిల్లర్ల సాయంతో భర్తను హత్య చేసింది. అయితే ఈ కేసులో ఆ మహిళ తొమ్మిదేళ్ల కుమారుడే సాక్షిగా నిలవడం విశేషం. అల్వార్లోని ఖేర్లి ప్రాంతంలో ఈ హత్యోదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన వీరు అలియాస్ మాన్ సింగ్ జాతవ్ ఇంట్లో మృతి చెందాడు. అతని భార్య అనిత తన భర్త అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది. అయితే వారి కుమారుడు పోలీసులకు ఇంటిలో జరిగిన విషయమంతా చెప్పడంతో 48 గంటల్లో నిజానిజాలు వెలుగు చూశాయి.పోలీసులకు ఆ పిల్లాడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోజు రాత్రి అతని తల్లి ఇంటి ప్రధాన గేటును తెరచివుంచింది. ఇంతలో ఆ బాలుడు ‘అంకుల్’(కాశీరామ్ ప్రజాపతి) అని పిలిచే వ్యక్తితో పాటు నలుగురు ఇంటిలోనికి ప్రవేశించారు. తరువాత వారంతా కలిసి.. మంచంపై పడుకున్న వీరు ముఖంపై తలగడ అదిమిపెట్టి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ పక్కనే నిద్రిస్తున్నట్లు నటించిన ఆ బాలుడు జరిగిన ఘటనను గమనించాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనిత, కాశీరామ్ ముందుగానే వీరు హత్యకు ప్లాన్ చేశారు. తమ వివాహేతర సంబంధానికి వీరు అడ్డుగా ఉన్నాడని భావించి, ఈ దారుణానికి పాల్పడ్డారు. అనిత స్థానికంగా ఒక చిన్న జనరల్ స్టోర్ నిర్వహిస్తుండగా, కాశీరామ్ కచోరీలు విక్రయిస్తుంటాడు. అతను తరచూ అనిత దుకాణానికి వస్తుండేవాడు. ఈ నేపధ్యంలో ఇద్దరూ దగ్గరయ్యారు. అనిత, కాశీరామ్లు.. కాంట్రాక్ట్ కిల్లర్లకు రూ.రెండు లక్షలు ఇచ్చి, వీరును హత్య చేయించారనే ఆరోపణలున్నాయి.వీరు మృతిచెందాక, అతను అనారోగ్యంతో మరణించాడని అనిత బంధువులకు చెప్పింది. అయితే వారు అనుమానంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షల అనంతరం వీరు హత్యకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని 100 కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్లను పరిశీలించారు. కాల్ డేటా రికార్డులను విశ్లేషించారు. అనిత, కాశీరామ్లతో పాటు కాంట్రాక్ట్ కిల్లర్లలో ఒకరైన బ్రిజేష్ జాతవ్ను అరెస్టు చేసిన పోలీసులు మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’ -
భర్తను కలవాలి, ఎవరికైనా మంత్రాలు తెలుసా?
అన్నానగర్(తమిళనాడు): నెల్లై జిల్లాలోని పనగుడి సమీపం పళవూర్ మదన్పిళ్లై ధర్మం గ్రామానికి చెందిన శివలింగదురై కుమార్తె కయల్విళి (28). ఆమె వివాహం చేసుకుని భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులతో నివశిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 5న ఆలయానికి వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిన కయల్విళి అదృశ్యమైంది. ఫిర్యాదు ఆధారంగా పళవూరు పోలీసులు గత 8 నెలలుగా కేసు నమోదు చేసి వెతుకుతున్నారు. ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల రికార్డింగులను పరిశీలించినప్పుడు, కన్యాకుమారి జిల్లాలోని కొట్టారం ప్రాంతానికి చెందిన శివ స్వామి అనే పూజారి కయల్విళిని కారులో తీసుకెళ్లినట్లు వెల్లడైంది. దీని తరువాత అతన్ని అరెస్టు చేసి విచారించారు. అతను తన సహచరులతో కలిసి కయల్విళి మెడలో ఉన్న 7 సవర్ల బంగారు చైన్ కోసం ఆమెను గొంతు నులిమి హత్య చేసి, 80 అడుగుల కోయ మహాదేవి కాలువలోకి విసిరేసినట్లు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలువడ్డాయి. కాలువ నుండి కయల్విళి అస్థిపంజరాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఖైదీలను విచారించగా దిగ్భ్రాంతికరమైన సమాచారం వెల్లడైంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె 2022లో బెంగళూరులో పనిచేస్తున్న యువకుడిని వివాహం చేసుకుంది. ఆమె ఫిబ్రవరి 2024లో తన భర్త నుండి విడిపోయింది. కయల్విళి తన భర్తతో తిరిగి కలవాలని ప్రార్థించడానికి అనేక దేవాలయాలను సందర్శిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమె ఫేస్బుక్లో తన భర్తతో కలపటానికి మంత్రం బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని పోస్ట్ చేసింది. మాయాండి రాజా మొదట ఈ విషయంపై కయల్విళిని సంప్రదించాడు. వారు ఆమెను మంత్రవిద్య చేసే శివస్వామి వద్దకు తీసుకెళ్లి, ఆమె నుండి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. దీని ప్రకారం శివస్వామి, మాయాండి వీరు కయల్విళిని నుంచి అనేక వాయిదాలలో మొత్తం రూ.5 లక్షలు చెల్లించాడు. ఆమెను మళ్లీ ఆమె భర్తతో కలిసి జీవించనిస్తానని చెప్పాడు. ఒకానొక సమయంలో, వారు మోసం చేస్తున్నారని తెలిసిన కయల్విళి వారిని తన డబ్బు తిరిగి ఇవ్వమని కోరింది. మాయాండి, శివస్వామి, అతని కుమారుడు శివ, సంఘటన జరిగిన రోజున కయల్విళికి ఫోన్ చేసి, డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారు. తరువాత మాయాండి రాజా, అతని సోదరి కుమారుడు, వీరవనల్లూరుకు చెందిన కన్నన్, శివనేశ్వరి సహా నలుగురు హత్య చేశారు. తరువాత ఆమె ధరించిన 7 తులాల నగలను తీసుకొని, కయల్విళి మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి, చేరన్మాదేవి పక్కన ఉన్న గంగానకుళం సమీపంలోని 80 అడుగుల కాలువలో విసిరేసి, సాధారణ జీవితాన్ని గడిపారని తేలింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. తదనంతరం, శివనేశ్వరిని కొక్కిరాకుళం మహిళా జైలుకు, మిగిలిన ముగ్గురిని పాలైయంగోటై సెంట్రల్ జైలుకు తరలించారు. -
తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం.. ఏడీజీపీ జయరామ్కు ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడు అడిషనల్ డీజీపీ హెచ్ఎం జయరామ్(HM Jayaram)కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్టు వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు తీరుపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. కిడ్నాప్ కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయాలని ఆదేశించడం ఏమేర సహేతకమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అదే సమయంలో ఆయనపై సస్పెన్షన్ను వేటును ఎత్తేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.మద్రాస్ హైకోర్టు(Madras HC) తన అరెస్ట్కు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయరామ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిన్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. జయరామ్ తరఫు న్యాయవాది పలు అంశాలను ప్రస్తావించారు. తన క్లయింట్ జయరామ్ను అరెస్ట్ అయిన వెంటనే కస్టడీలోకి తీసుకున్నారని, సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేసిన 24 గంటల తర్వాతే విడుదల(జూన్ 17న) చేశారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక అధికారిని అయోమయమైన ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేయమని చెప్పడం ఏంటి?. ఇది ఎటువంటి న్యాయ ప్రక్రియకు సరిపోతుంది?. ఇది పరిపాలనా వ్యవస్థపైనా ప్రభావం చూపించే అంశమే కదా. అధికారులపై ఇలాంటి చర్యలు మానసికంగా దెబ్బతీసేలా ఉంటాయి’’అని అభిప్రాయపడింది.అదే సమయంలో ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వంపైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది?. విచారణకు సహకరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడం ఏంటి?.. సస్పెన్షన్ ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకోండి.. అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏడీజీపీ జయరామ్ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు వద్ద బాలుడి కిడ్నాప్ కేసులో గత సోమవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తిపై కూడా ఆరోపణలున్నాయి. కోర్టు విచారణకు జయరామ్ హాజరు కాగా.. ఆ ప్రాంగణంలోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం ఏడీజీపీ జయరామన్ను హోంశాఖ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ సమయంలో.. ఈ కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యే, పోలీస్ ఉన్నతాధికారి తీరుపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజా ప్రతినిధులు న్యాయస్థానాలను (Kangaroo Courts)నడిపించడమేంటని? జగన్మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేసింది.అలాగే.. ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. జగన్మూర్తి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.జరిగింది ఇదే.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ధనుష్(22) అనే యువకుడ్ని ఓ యువతి వివాహం చేసుకుంది. ఆ యువకుడిని పట్టుకుని తన కూతురిని తిరిగి తనకు అప్పగించాలంటూ ఆమె తండ్రి వనరాజా మాజీ కానిస్టేబుల్ అయిన మహేశ్వరి సాయం కోరాడు. దీంతో ఆమె ఏడీజీపీ జయరామ్ను సంప్రదించింది. ఆపై ఆ పంచాయితీ పురట్చి భారతం పార్టీకి చెందిన కేవీ కుప్పం నియోజవకవర్గ ఎమ్మెల్యే జగన్మూర్తి చెంతకు చేరింది. ఈ క్రమంలో ధనుష్ కనిపించకపోవడంతో అతని 16 ఏళ్ల సోదరుడిని అమ్మాయి కుటుంబం కిడ్నాప్ చేశారు. అయితే ఈ కేసులో ఒత్తిళ్ల నేపథ్యంలో చివరకు ఆ బాలుడిని ఓ హెటల్ వద్ద వదిలేసి వెళ్లారు. అయితే ఆ బాలుడ్ని వదిలేసిన వాహనం ఏడీజీపీ జయరామ్ అధికారిక వాహనం కావడం, పైగా అందులో వనరాజా, మహేశ్వరి ఉండడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. -
Maharashtra: ‘ఇకపై హిందీ తప్పనిసరి కాదు’
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో హిందీని తప్పనిసరి బోధన నుంచి ఉపసంహరించారు. మరాఠీ, ఇంగ్లీష్ తర్వాత మూడవ భాషగా హిందీని పరిగణిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు హిందీని మూడవ భాషగా తప్పనిసరిగా బోధించడాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నూతన నోటిఫికేషన్ జారీ చేసింది.ఒక తరగతిలో 20కి మించిన విద్యార్థులు హిందీకి బదులుగా మరొక భాష నేర్చుకోవాలనుకుంటే, సంబంధిత ఉపాధ్యాయుణ్ణి అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర పాఠశాల విద్యా ప్రణాళిక- 2024 ప్రకారం మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతులకు హిందీ ఇకపై మూడవ భాషగా ఉంటుంది. అయితే ఈ విద్యార్థులు హిందీకి బదులుగా ఇతర భారతీయ భాషలలో ఒకదాన్ని మూడవ భాషగా నేర్చుకోవాలనుకుంటే వారికి అందుకు అనుమతి కల్పిస్తారు. మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లోనూ మరాఠీ భాషను తప్పనిసరి చేశారు.ఇది కూడా చదవండి: Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి -
Uttar Pradesh: మూడు రోడ్డు ప్రమాదాలు.. 11 మంది మృతి
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఢిల్లీ నుండి బీహార్కు వెళ్తున్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025బులంద్షహర్ జిల్లాలో జహంగీరాబాద్-బులంద్షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం సమీపంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, అనంతరం బోల్తా పడి, మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బులంద్షహర్ ఎస్పీ (గ్రామీణ) తేజ్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బుదౌన్లో జరిగిన వివాహానికి హాజరైన పెళ్లి బృందం ఢిల్లీలోని మాలవీయ నగర్కు తిరిగి వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.ఆగ్రాలో జరిగిన మరో విషాదకర ఘటనలో ఒక పికప్ వాహనం బ్యాలెన్స్ కోల్పోయి సహద్ర ఫ్లైఓవర్పై నుంచి కింద పడింది. అది నేరుగా మార్నింగ్ వాకర్స్పై పడిపోవడంతో నలుగురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు అధికారి హేమంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పికప్ వాహనం మామిడి పండ్లను రవాణా చేస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా మృతిచెందాడు. అతని సహాయకుని పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు కేసులను నమోదు చేసుకున్న ఆయా ప్రాంతాల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Uttar Pradesh: Two people died, around 15 injured after the bus they were in, collided with a truck on Agra-Lucknow Expressway in Fatehabad area of Agra district. The injured have been sent to hospital for treatment. The bus was going from Delhi to Bihar. (Video: Agra… pic.twitter.com/VwhjAd25wu— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 18, 2025ఇది కూడా చదవండి: శుభాంశు రోదసియాత్ర మళ్లీ వాయిదా -
భయంతో కేకలు.. ప్రమాదం వేళ యువతులు ఎలా తప్పించుకున్నారంటే..
అహ్మదాబాద్: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిన అనంతరం బీజే మెడికల్ కాలేజీ(బీజేఎంసీ)క్యాంపస్లో భీతిల్లిన విద్యార్థులకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. భవనంలో మంటలు చెలరేగడం చూసిన రెండు, మూడు అంతస్తుల్లో ఉన్న విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలు వేయగా, కొందరు దుప్పట్లు, ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందికి దిగడం, మరికొందరు దూకేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందులో ఉంది.విమానం కూలిన ప్రాంతంలో కొన్ని మీటర్ల దూరంలోనే మంటలు వ్యాపిస్తుండటం చూసిన ఓ యువతి కేవలం రెయిలింగ్ సాయంతోనే కిందికి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్న మరో ఓ వీడియోలో రికార్డయింది. క్యాంపస్ వెలుపలి గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు.. కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ వేస్తున్న కేకలు సైతం వినిపించాయి. మరో వ్యక్తి కూడా అదే రెయిలింగ్ ద్వారా కిందికి దిగేందుకు ప్రయత్నించారు. #Watch | A horrifying plane crash struck the BJ Medical College UG hostel mess in Meghani Nagar, claiming the lives of several MBBS students. Heart-wrenching videos have surfaced from the moment of the crash, showing hostel students desperately trying to escape through the… pic.twitter.com/tmDxB3XfdJ— The Daily Jagran (@TheDailyJagran) June 17, 2025 Shocking video from #AhmedabadCrash: As the plane hit the medical college hostel, students jumped from windows to save their lives. Video shot moments after impact. pic.twitter.com/1CvGMV7iZ8— Neha Bhan🇮🇳 (@neha_journo) June 17, 2025మెడికల్ కాలేజీ హాస్టల్ మూడో అంతస్తు వరకు నిచ్చెనలు వేసుకుని ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించినట్లుగా మరో వీడియోలో ఉంది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 29 మంది ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. విమాన ప్రమాదంతో మెడికల్ కాలేజీకి సంబంధించిన నాలుగు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.Removal of the aft fuselage section of the Air India Boeing 787-8(VT-ANB) from the BJ Medical College, Ahmedabad.#AirIndiaCrash #Ahmedabad #AirindiaPlane #BreakingNews pic.twitter.com/kGkxtK0WFt— The Metropolitan Times (@times66982) June 17, 2025 Black day for India 💔Visuals from inside of the BJ Medical College UG Boys hostel mess in Meghani Nagar, Amdavad, Gujarat where Air India London bound flight crashedEngine tore the walls of the hostel. Many students are feared to be dead as it was lunch time #PlaneCrash https://t.co/zJyrnyJAVB pic.twitter.com/nRps7cXAbM— Karnataka Weather (@BengaluruRains_) June 12, 2025 -
Ahmedabad Plane Crash: భద్రతకు ఢోకాలేదు.. కానీ.. ‘వాచ్డాగ్’ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు దారితీసిన అంశాలపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ వాచ్డాగ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ఎయిర్ ఇండియాకు చెందిన 24.. 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల సమీక్ష చేపట్టింది. దీనిలో పాల్గొన్న డీజీసీఏ.. 24 బోయింగ్ 787 విమానాలతో ఎటువంటి భద్రతా సమస్యలు లేవని తెలిపింది. అయితే ఇంజనీరింగ్, ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ యూనిట్లలో అంతర్గత సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఎయిర్ ఇండియాకు సూచించింది.తాజాగా ఎయిర్ ఇండియా తన దగ్గరున్న మొత్తం 33 బీ 787-8/9 విమానాలలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తోంది. వీటిలో 24 విమానాల తనిఖీలు పూర్తయ్యాయి. జూన్ 12- 17 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా మొత్తం 514 విమానాలను నడిపింది. వాటిలో 83 రద్దు అయ్యాయి. వీటిలో 66 రద్దులు బోయింగ్ 787 విమానాల విమానాలకు సంబంధించినవి. అత్యధిక సంఖ్యలో డ్రీమ్లైనర్లు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు సంయుక్తంగా దేశీయ, అంతర్జాతీయంగా ప్రతిరోజూ వెయ్యికి పైగా విమానాలను నడుపుతున్నాయి.ఇది కూడా చదవండి: G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా.. -
భాషల ఆధారంగా దేశాన్ని విభజించలేం: ఉపరాష్ట్రపతి
పుదుచ్చేరి: ప్రపంచంలోనే ఆదర్శప్రాయమైన మన దేశం భాషల విషయంలో విభజనకు గురవడం భరించలేని విషయమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని, అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)–2020 అమలు దేశ విద్యారంగానికి మేలిమలుపు వంటిదని ఆయన అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ మంగళవారం పాండిచ్చేరి యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ‘ఎన్ఈపీ ఏదో ఒక ప్రభుత్వ విధానం కాదు. అన్ని భాషలకు సముచిత స్థానం కల్పిస్తూ మన యువత శక్తిసామర్థ్యాలను ప్రతిభను చాటుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తుంది’అని పేర్కొన్నారు. భాషలను బట్టి వేరుగా ఉందామా?అని ప్రశ్నించారు. హిందీని తమపై రుద్దే ఎన్ఈపీని కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అమలు చేయడాన్ని వ్యతిరేకించే వారిని ఉద్దేశించి ఆయనీ మాటలన్నారు. పార్లమెంట్లో సభ్యులు 22 భాషల్లో మాట్లాడే అవకాశముందని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాతలు మనకు బోధించినవి గందరగోళానికి, ఘర్షణలకు, అవాంతరాలకు తావులేని విధానాలన్న విషయాన్ని రాజకీయ నాయకత్వాలు గుర్తుంచుకోవాలని పరోక్షంగా అధికార పార్టీ డీఎంకేకు ఆయన సూచించారు. -
కాంతివేగంతో డేటా
ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత సురక్షితమైన సమాచార బదిలీ విధానమైన క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో భారత్ తన సత్తా చాటింది. తొలిసారిగా అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేష్ను విజయవంతంగా పరీక్షించామని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–ఢిల్లీ సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో డేటా హ్యాకింగ్కు ఎలాంటి అవకాశంలేని విధానాన్ని భారత్ తన రహస్య సమాచారమార్పిడి కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభించింది.ఢిల్లీ క్యాంపస్లో ఫ్రీ–స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఈ వివరాలను రక్షణ శాఖ వెల్లడించింది. సెకన్కు 250 బిట్స్ సెక్యూర్ కీ రేటుతో ఈ విధానాన్ని పరీక్షించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అభినందించారు.ఏమిటీ క్వాంటమ్ కమ్యూనికేషన్?క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది సాధారణ ప్రజలు అస్సలు నమ్మలేనంతటి, గమ్మతైన సమాచార మార్పిడి విధానం. సాధారణభాషలో చెప్పాలంటే.. ఇద్దరు స్నేహితుల వద్ద చెరో వాకీటాకీ ఉందనుకుందాం. వాకీటాకీ అనేది కాస్తంత దూరాలకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ స్నేహితుల్లో ఒకడు చంద్రమండలం మీద ఉన్నాసరే అతను మాట్లాడేది ఇతని వాకీటాకీలో వినిపిస్తే ఎలా ఉంటుంది?. మధ్యలో ఎవ్వరూ వీరి మాటలను ట్రాక్ చేయడంగానీ, హ్యాక్చేయడంగానీ కుదరకపోతే!. అద్భుతమే కదా. ఆ అద్భుతాన్ని సుసాధ్యంచేసే ప్రక్రియే క్వాంటమ్ కమ్యూనికేషన్. విశ్వంలోనే అత్యంత సూక్ష్మమైన కాంతి అణువు(ఫొటాన్)ల సాయంతో పూర్తి సురక్షితంగా సమాచారాన్ని చేరవేయవచ్చు. ఇదంతా క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ మహిమ!క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ దృగ్విషయం కారణంగా ఇలా అతిసూక్ష్మస్థాయిలో డేటాను మరోచోటుకు బదిలీచేయొచ్చు. దూరంతో సంబంధంలేకుండా ఎంతటి దూరాల మధ్యనున్న అణువుల మధ్య కూడా ఒక మార్మికమైన బంధం, బదిలీ సాధ్యమవుతుంది. దీనినే క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ అంటారు. కిలోమీటర్ దూరంలోని అణువుల మధ్య డేటా ట్రాన్స్ఫర్ను డీఆర్డీవో, ఐఐటీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. దీనిని సింపుల్గా చెప్పాలంటే... 1990 దశకంలో పెద్ద హిట్ అయిన హీరో నాగార్జున సినిమా ‘హలో బ్రదర్’ చూసే ఉంటారు.అందులో కవల సోదరుల్లో ఒకరు ఎలా డ్యాన్స్చేస్తే మరొకరు అలాగే కాలుకదపడం, ఎలా ఫైట్చేస్తే అలాగే డిష్యుండిష్యుం పోరాటం చేయడం చూసే ఉంటారు. క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్లో కూడా అచ్చం ఇలాగే ఒక అణువుపై మనం సమాచారాన్ని నిక్షిప్లం చేస్తే ‘క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్’ ద్వారా దానితో అదృశ్యబంధం ఏర్పర్చుకున్న ఫొటాన్ కణం మీద సైతం అదే సమాచారం ఠక్కున ప్రత్యక్షమవుతుంది.పాత సినిమాల్లో మంత్రదండం సాయంతో మాంత్రికుడు ఒకచోట మాయమై మరోచోట ప్రత్యక్షమైనట్లు డేటా సైతం ఒక చోట నుంచి మరో చోటుకు కాంతివేగంతో ప్రసారమవుతుంది. నేటి సైబర్ ప్రపంచంలో దాదాపు ప్రతీ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఇది అసాధ్యం. ఒకవేళ అత్యంత నిపుణుడైన హ్యాకర్ ఈ జంట మధ్య డేటాచోరీకి యత్నిస్తే వెంటనే ఈ సెండర్, రిసీవర్లకు తెల్సిపోతుంది.ఫ్రీ–స్పేస్ ద్వారా..ఫ్రీ–స్పేస్ అంటే బహిరంగంగా ఈ సమాచార బదిలీ జరుగుతుంది. ఇందులో ఎలాంటి కేబుళ్లకు, వైర్లకు పనిలేదు. వేల కిలోమీటర్లదూరంలోని రెండు భవంతుల మధ్య, రెండు శాటిలైట్ల మధ్య కూడా క్వాంటమ్ కమ్యూనికేషన్ను ఉపయోగించవచ్చు. సైనిక రహస్యాల స్థాయిలో అత్యంత సురక్షితంగా డేటాను పంపించడానికి ఇçప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ టూల్స్ కంటే క్వాంటమ్ కమ్యూని కేషన్ అనేది మెరుగైంది. ఈ విధానంలో పంపే సమాచారాన్ని మూడో వ్యక్తి పసిగట్టలేరు. భారత్లో భవిష్యత్తులో క్వాంటమ్ నెట్వర్క్ లు, అల్ట్రా సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్లకు ఈ విధానం బాటలువేయనుంది. ఎన్క్రిప్షన్ ద్వారా జాతీయ భద్రత, రక్షణ, ఆర్థిక, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో భవిష్యత్తులో ఈ సాంకేతికతను విరివిగా వాడుకోవచ్చు. -
ఎయిరిండియా రద్దుల పర్వం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్/కోల్కతా: అహ్మదా బాద్ ఘోర ప్రమాదం తర్వాత డ్రీమ్లైనర్ రకం విమానాలతో కొనసాగుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ‘క్యాన్సిల్’ మచ్చ అంటుకుంది. మంగళవారం ఏడు ఎయిర్ఇండియా విమా నాలు రద్దుకాగా వాటిలో ఆరు విమానాలు డ్రీమ్ లైనర్ 787–8 రకానికి చెందినవి ఉండడం గమనార్హం. సాంకేతికలోపం సహా ఇతరత్రా కారణాలతో డ్రీమ్లైనర్లు గాల్లో చక్కర్లుకొట్టడం మానేసి పార్కింగ్ ప్రాంతానికే పరిమితమయ్యాయి. సాంకేతికలోపంతో..ఢిల్లీ నుంచి పారిస్కు వెళ్లాల్సిన డ్రీమ్లైనర్ విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో దానిని రద్దుచేశారు. ఇలాంటి మరో విమానం అందుబాటులో లేకపోవడంతో అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమాన సర్వీస్ క్యాన్సిల్ అయింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ఇండియా సంస్థ తన విమానాలను క్షణ్ణంగా తనిఖీలు చేశాక రాకపోకలకు పంపిస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ విమానాలు క్యాన్సిలేషన్ బారినప డుతున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతు న్నారు. మంగళవారం అధిక సంఖ్యలో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.దీనిపై ఎయిర్ఇండియా స్పందించింది. ‘‘రద్దయిన విమాన ప్రయాణికులను హోటల్ వసతులు, లేదంటే టికెట్ క్యాన్సిలేషన్పై 100 శాతం రీఫండ్ లేదంటే తదుపరి రీషెడ్యూలింగ్కు వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని ఎయిర్ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అహ్మదాబాద్ నుంచి ‘తొలి’విమానం రద్దుఅహ్మదాబాద్ దుర్ఘటన తర్వాత అదే ఎయిర్పోర్ట్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్కు బయల్దేరి వెళ్లాల్సిన ఎయిర్ఇండియా వారి ఏఐ159 విమానం రద్దయింది. విమానప్రమాదం తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్న తొలి ఎయిర్ఇండియా అహ్మదాబాద్–లండన్ సర్వీస్ విమానం ఇదే. మరోవైపు ఢిల్లీ నుంచి ఫ్రాన్స్లోని పారిస్ ఛార్లెస్ డీ గాలే ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సిన ఏఐ143 విమానం సైతం రద్దయింది.ఎయిరిండియా విమానంలో పనిచేయని ఇంజన్శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి ముంబైకి రావాల్సిన ఎయిర్ఇండియా విమా నం సాంకేతిక లోపంతో కోల్కతాలో ఆగిపోయింది. దీంతో ఈ సర్వీసును రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 211 మంది ప్రయాణికులతో శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన బోయింగ్ 777–200ఎల్ఆర్ విమానం ముంబైకి చేరుకో వాల్సి ఉంది. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వస్తూ పాకిస్తాన్ గగనతలం మీదుగా ముంబైకి చేరుకో వాల్సి ఉంటుంది.అయితే, పాక్ తన గగనతలాన్ని భారతీయ సర్వీసులకు మూసి వేసిన కారణంగా ఈ విమానం నేరుగా రావడం కుదర్లేదు. దాంతో చుట్టూతిరిగి తొలుత కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రాత్రి 2 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజన్ మొరాయించింది. ఇంజనీర్లు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోవడంతో ఆ సర్వీస్ను రద్దుచేశారు. కొందరిని ఇతర విమానాల్లో ముంబైకి పంపించారు.ఇండిగో విమానానికి బాంబు బెదిరింపుముంబై: మస్కట్–ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో, విమానాన్ని అధికారులు నాగ్పూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయించి, తనిఖీలు చేపట్టారు. బెదిరింపు వట్టిదేనని ధ్రువీకరించుకున్నాక విమానం తిరిగి గమ్యస్థానానికి చేరుకుంది. మస్కట్లో బయలు దేరిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విమానం కోచిలో ల్యాండయ్యింది. తిరిగి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. -
ఇప్పుడే వద్దు! ఇద్దరు చాలు!!
‘ఉద్యోగం / వ్యాపారంలో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’.. ఇంతేగా ఓ సగటు యువతీ, యువకుడి ఆలోచన. ఇదంతా పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత వారి ఆలోచనల్లో చాలా మార్పులొస్తున్నాయి. ఇప్పుడే వద్దు అని చెప్పేవారు కొందరైతే.. ఇద్దరిని మించి పెంచలేం బాబోయ్ అంటున్నవారు మరికొందరు. పిల్లలను వద్దనుకోవడానికి లేదా వాయిదా వేయడానికే మొగ్గుచూపుతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా విద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఆర్థిక, అనారోగ్య సమస్యలే పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అనారోగ్య సమస్యలు వంధ్యత్వం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు భారత్లో 13 శాతం, అమెరికాలో 16 శాతం మంది వెల్లడించారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, ఊబకాయం వంటివి సంతానోత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. సమయపాలన లేని ఆహారపుటలవాట్లు; విధులు, ఉద్యోగంలో భాగంగా గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేమి, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. గర్భధారణ సమయంలో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం కారణమని భారత్లో 14 శాతం, యూఎస్లో 8 శాతం మంది తెలిపారు. గర్భం వచ్చిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించడంతోపాటు, మందులు వాడాలి. ఈ ప్రక్రియను ఆర్థికంగా భారంగా భావించడమో, లేదా వైద్య సౌకర్యాలు లేకపోవడమో కారణంగా.. మాతృత్వాన్ని కాదనుకోవడమో, వాయిదా వేయడమో చేస్తున్నారు.చూసుకునేవారు లేక..తగినంత/నాణ్యమైన పిల్లల సంరక్షణ అవకాశాలు లేకపోవడం కారణమని భారత్లో 18 శాతం, అమెరికాలో 12 శాతం మంది తెలిపారు. అంటే పిల్లలను చూసుకోవడానికి పెద్దవారు అందుబాటులో లేకపోవడం, సంరక్షణ కేంద్రాల లేమి.. కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను చూసుకునేవారు లేకపోతే తల్లిదండ్రులు పని చేయడం కష్టతరం అవుతుంది. వారి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలకు దూరం కావడానికి దారితీస్తుంది. ఇలాంటి కారణాలతో భాగస్వామి తక్కువ మంది పిల్లలను కోరుకోవడమూ ప్రధాన కారణమని భారత్, యూఎస్లలో 19 శాతం మంది వెల్లడించారు.మనదేశంలో జననాల రేటు 1960లలో సగటున ఒక్కో మహిళకు సుమారు 6గురు పిల్లలుగా ఉండేది. ఇప్పుడు ఇది 1.9కి పడిపోయింది. అంటే ఇద్దరు పిల్లలు కూడా కాదన్నమాట. ప్రపంచ సగటు 2.2తో పోలిస్తే ఇది తక్కువే. ఇందుకు ఆర్థిక పరిమితులు, ఉద్యోగ అభద్రత, అనారోగ్య సమస్యలు... ఇలా ఎన్నో కారణాలు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ జనాభాలో 37 శాతం మంది ఉన్న భారత్, అమెరికా వంటి 14 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.ఇద్దరు చాలంటున్నారుఎంతమంది పిల్లలు కావాలని అడిగితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చెప్పిన సమాధానం.. ఇద్దరు! మనదేశంలో అసలు పిల్లలే వద్దన్నవారు సగటున 5 శాతం కాగా, ఇది అమెరికాలో సుమారు 14 శాతం కావడం గమనార్హం. ఒక్కరే చాలని మనదేశంలో సగటున 14 శాతం మంది చెబితే.. అమెరికాలో కేవలం 7 శాతం మందే ఇలా కోరుకున్నారు. ఇద్దరు బిడ్డలు కావాలని మనదేశంలో పురుషుల్లో 33 శాతం, మహిళల్లో 41 శాతం మంది చెప్పారు. అమెరికాలో ఇలా కావాలన్నవారి సగటు కేవలం 26 శాతమే. మనదేశంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కావాలన్నవారు స్త్రీ, పురుషుల్లో గరిష్ఠంగా 6 శాతాన్ని కూడా మించలేదు. ఆసక్తికరంగా అమెరికాలో ఇలా కావాలన్నవారు దాదాపు 16 శాతం.ఆర్థిక పరిమితులుభారత్, అమెరికాలో ఆర్థిక పరిమితులే ప్రధానంగా మాతృత్వానికి అడ్డంకిగా ఉన్నాయని 38 శాతం మంది వెల్లడించారు. ఆదాయ అసమానతలు, అప్పులు పేరుకుపోవడం, ఊహించని ఖర్చులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, నిరుద్యోగం, పొదుపు లేకపోవడం లేదా సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వంటి ఆర్థిక పరిమితులు చుట్టుముడుతున్నాయి. ఈ సవాళ్లే కుటుంబ జీవితంలోని వివిధ అంశాలను.. ప్రధానంగా బిడ్డలను కనాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను వద్దనుకోవడానికి.. నిరుద్యోగం లేదా ఉద్యోగం పోతుందేమోనన్న అభద్రతాభావం కారణమని 21 శాతం భారతీయులు, 17 శాతం అమెరికన్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో అనిశ్చితి ఒకవైపు.. ఏఐ వంటి నూతన సాంకేతికత రాకతో కొన్ని రంగాలకు చెందిన పలు విభాగాల్లో ఉద్యోగుల తీసివేతలు మరోవైపు.. వెరసి యువతకు ఉద్యోగాలు, కొత్త అవకాశాల వేట తప్పడం లేదు. ఇవన్నీ కూడా పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. -
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో మరో ట్విస్ట్
షిల్లాంగ్ : సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పథకం ప్రకారం భర్త రాజా రఘు వంశీని చంపించిన భార్య సోనమ్ రఘువంశీని ఓ పదునైన ఆయుధం పోలీసులకు పట్టించింది. అయితే, ఈ హత్య చేసేందుకు ఒక్క ఆయుధం కాదని, మరో ఆయుధాన్ని వినియోగించినట్లు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్లో గుర్తించారు.ఇక ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన సిట్ బృందం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు నిందితుల్ని ఇవాళ (జూన్ 17) ఘటన జరిగిన సోహ్రాలోని వీ సావ్డాంగ్ జలపాత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఈ సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితులు రాజా రఘువంశీని హతమార్చేందుకు రెండు మారణాయుధాల్ని వినియోగించినట్లు గుర్తించామని ఈస్ట్ కాశీ హిల్స్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ వివేక్ సియాం వెల్లడించారు.#WATCH राजा रघुवंशी हत्याकांड में क्राइम सीन रिक्रिएशन पर एसपी ईस्ट खासी हिल्स विवेक सियेम ने कहा, "हमने क्राइम सीन रिक्रिट किया कि आरोपियों ने यह कैसे किया होगा। हमने पार्किंग स्थल से शुरुआत की, जहां उन्होंने अपने स्कूटी वाहन रखी थी..हम व्यूपॉइंट पर गए और पता लगाया कि हत्या से… pic.twitter.com/U6xg1KOIIa— ANI_HindiNews (@AHindinews) June 17, 2025మరి మరో ఆయుధం ఎక్కడ?సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్య జరిగిన రోజు నిందితులు ఎక్కడ ఏం చేశారు? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఏం చేశారు? వంటి వివరాల్ని సేకరించాం. వాళ్లు చెప్పిన వివరాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే హత్య కోసం రెండు ఆయుధాల్ని వినియోగించినట్లు తేలింది. ఇప్పటికే ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో ఆయుధం గురించి అన్వేషణ కొనసాగుతోందన్నారు. సోనమ్ సైగ.. రాజాపై విశాల్ కత్తితో దాడినిందితుల్ని మేం హత్య జరిగిన వ్యూపాయింట్కు తీసుకెళ్లాము. అక్కడ ఎవరి పొజిషన్ ఎలా ఉందో? ఎలా దాడి చేశారో? నిర్ధారించాం. నిజానికి, ఇద్దరు నిందితులు వేర్వేరు ఆయుధాల్ని ఉపయోగించారు. రెండో ఆయుధం కోసం వెతుకుతున్నాం. హత్య అనంతరం రాజా రఘువంశీని ఏ లోయలో పడేశారో అక్కడే ఆకాష్ తన చొక్కాను పడేశాడు. తన భర్త రాజా రఘువంశీని హత్య చేయమని సోనమ్ నిందితులకు సైగ చేసింది. ఆ సైగతో రాజా రఘువంశీనీ విశాల్ చౌహాన్ కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాజా నేలకొరిగాడు. రాజా హత్యను సోనమ్ కళ్లారా చూసింది‘సోనమ్ నేరాన్ని అంగీకరించింది. నేడు మేము క్రైం సీన్ను రిక్రియేట్ చేశాము. ఆమె ఎక్కడ నిల్చుంది? హత్యకేసులో ఆమె పాత్ర ఏమిటో గుర్తించాం. రాజాను ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. హత్యను అక్కడే నిల్చొని సోనమ్ కళ్లారా చూశారు. ఆమె తన ఫోన్ను ధ్వంసం చేసింది. ఇది ముందే ప్లాన్ ప్రకారం చేసిన హత్యే. హత్య అనంతరం ఆ ముగ్గురు రాజా శరీరాన్ని లోయలో పడేశారు’. వీరు హత్యకు వెయ్ సవ్దాంగ్ను ఎంచుకున్న కారణం అక్కడ ఎవ్వరూ ఉండరని. వీరందరు మేఘాలయకు రావడం ఇదే తొలిసారిమా టీమ్ ఇప్పటికే ఇండోర్లో ఉంది. కేసు నిమిత్తం మరికొందరిని విచారిస్తున్నారు’ అని చెప్పారు.పెళ్లైన 12రోజులకే భర్తను హత మార్చిన భార్యఏప్రిల్ 23న రాజా రఘువంశీ,సోనమ్ రఘువంశీల వివాహం జరిగింది.పెళ్లైన 12 రోజులకే ప్రియుడుతో కలిసి జీవించేందుకు సోనమ్ కుట్ర చేసింది. తన భర్త రాజ రఘవంశీ హత్య చేయాలనుకుంది. ఇందుకోసం సోనమ్ తన ప్రియుడు సాయంతో విశాల్ చౌహాన్,ఆనంద్ కుమార్,కాష్ రాజ్పుత్లకు సుపారీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం.. రాజా రఘువంశీని హతమార్చి తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని వీ సావ్డాంగ్ హిల్స్లో పడేశారు. జూన్ 2న దే జలపాతం వద్ద గుర్తు పట్టలేని విధంగా ఉన్న రాజ రఘువంశీ మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్ ఇండియాకు షాక్ల మీద షాక్లు!
న్యూఢిల్లీ: భారతదేశ ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్ ఇండియాకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈరోజు(మంగళవారం, జూన్ 17) వరుసపెట్టి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. మంగళవారం ఆరు ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. రద్దయిన ఆరు ఎయిర్ ఇండియా విమానాలు కూడా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానాలే కావడం గమనార్హం. AI 153(ఢిల్లీ-వియన్నా), AI 143(ఢిల్లీ-పారిస్), AI 159 (అహ్మదాబాద్-లండన్), AI 133 (బెంగళూరు-లండన్), AI 170 (లండన్-అమృత్సర్)లతో పాటు శాన్ఫ్రానిస్కక్ష నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు ఉదయమే రద్దయ్యింది. అధునాతన టెక్నాలజీతో నడిచే బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తలెత్తడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో విమాన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన ఆరు బోయింగ్ విమానాల్లో సమస్యలు కనిపించడంతో ప్రయాణికుల్లో ఆందోళన కనబడుతోంది. విమానం మాట ఎత్తితేనే హడలిపోతున్న ప్రయాణికులు.. బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం అంటే వామ్మో అని పరిస్థితికి వచ్చారు. -
Air India Incident: దర్యాప్తులో RAT కీలక పాత్ర పోషించనుందా?
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జూన్ 12వ తేదీన జరిగిన విమాన ప్రమాదం అతి పెద్ద విషాదంగా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. అయితే ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో విమానంలో ఒకేసారి రెండు ఇంజన్లు పనిచేయకపోవడం ఆసక్తికరంగా మారింది. అసలు డ్యుయల్ ఇంజన్తో నడిచే విమానాల్లో ఒక ఇంజన్ పని చేయని పక్షంలో మరో ఇంజన్ పునరుద్ధరించబడుతోంది. ఇది సెకన్లలో జరిగే ప్రక్రియ. ఇందుకు RAT(Ram Air Turbine) దోహదం చేస్తుంది. ఇప్పుడు దీనిపైనే సర్వత్రా చర్చ నెలకొంది. రెండు ఇంజన్లలో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని అధిక శాతం మంది విమాన రంగ నిపుణులు చెబుతున్నప్పటికీ, ఇలా జరిగినప్పుడు RAT ఎంతవరకూ పని చేసిందనేది మరో కోణంలో చర్చకు తెరలేపింది. ఎయిర్లైన్స్లో RAT అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (Ram Air Turbine). ఇది విమానంలో ఒక చిన్న టర్బైన్, ఇది విమానం యొక్క ప్రాథమిక శక్తి వనరులు విఫలమైనప్పుడు ఉపయోగించబడుతుంది. ఇది విమాన నియంత్రణ వ్యవస్థలతో పాట ఇతర ముఖ్యమైన భాగాలకు శక్తిని అందించి తిరిగి గాడిలో పడేందుకు ఉపకరిస్తుంది. విమానంలో ఆటోమేటిక్గా పని చేసే RAT.. డ్యూయల్ ఇంజిన్ వైఫల్యం, విద్యుత్ వైఫల్యం లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ RAT ఎంతవరకూ పని చేసిందనేది ప్రధాన ప్రశ్న. గేర్లను విస్తరించడానికి లేదా ఉపసంహరించుకోవడంతో పాటు విద్యుత్ శక్తిని పునరుద్ధరిస్తుంది. కీలకమైన విద్యుత్ వ్యవస్థలను నిర్వహించడంలో సహాయపడటానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడిన RAT.. ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది. విమాన ప్రమాదం జరిగే సమయంలో RAT యాక్టివేట్ అయ్యిందనే చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రమాద ఘటన వీడియోల్లో కూడా కనిపించింది. అయితే విమానం గాల్లోకి టేకాఫ్ తీసుకున్న సెకన్ల వ్యవధిలోనే కూలిపోవడంతో RAT యాక్టివేట్ అయినా అది విఫలంగానే మిగిలిపోయిందనేది మరో వాదన. టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు -
టెన్షన్.. టెన్షన్.. మరో ఎయిర్ ఇండియా విమానం రద్దు
ఢిల్లీ: మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం బయటపడింది. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్ల్సాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. ముందుస్తు తనిఖీల్లో భాగంగా ఢిల్లీ-పారిస్ విమానంలో సమస్య ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు కాగా, తాజాగా ఢిల్లీ-పారిస్ విమానాన్ని రద్దు చేశారు. మంగళవారం(జూన్ 17) నాడే మూడు ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం గమనార్హం. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం, ఆ తర్వాత అహ్మదాబాద్- లండన్ ఎయిర్ ఇండియా విమానం, ఇప్పుడు ఢిల్లీ-పారిస్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో రద్దు చేయాల్సి వస్తుంది. ఇటీవల జూన్ 12వ తేదీన విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాప్ అయిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ విమానం బీజే మెడికల్ హాస్టల్పై కూలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమాన ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. అందుకు తగ్గట్టే ఆ సర్వీసుల్లోనే వరుసగా సాంకేతిక లోపాలు బయటపడటంతో మరింత భయం పుట్టిస్తోంది ప్రయాణికుల్లో. గత 48 గంటల్లో వరుసగా 9 విమానాల్లో సాంకేతిక లోపాల్ని గుర్తించారు. -
Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్క్రాఫ్ట్లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్ సమావేశం నిర్వహించింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్ చీఫ్కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్-లండన్ సర్వీస్ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్ సర్వీస్ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అదే రూట్.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు -
ఎయిరిండియా ఘటన: అయ్యో! ప్రాణాల కోసం..
దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదం దుర్ఘటనలో భయానక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూన్ 12న మేఘానీ నగర్ బీజే మెడికల్ కాలేజీకి చెందిన ఐదంతస్తుల భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగే సమయంలో విమాన ప్రమాద భయం నుంచి తప్పించుకునేందుకు మెడికల్ కాలేజీ క్యాంపస్లోని మూడో అంతస్తునుంచి విద్యార్థులు కిందకి దూకి తప్పించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి. బీజే మెడికల్ కాలేజీ భవనాన్ని ఎయిరిండియా విమానం ఢీకొన్నాక వెలువడిన దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో మూడో భవనంలో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో హాస్టల్ బాల్కనీ నుంచి కిందకి దూకారు. తమ ప్రాణాల్ని రక్షించుకునే ప్రయత్నం చేశారు.మెస్లో భోజనం చేస్తుండగా ఎయిరిండియా విమానం ఢీ కొట్టడంతో.. అప్రమత్తమైన విద్యార్థులు హాస్టల్ బాల్కనీ నుంచి బెడ్ షీట్లను వేలాదీస్తూ కిందకు దూకి ప్రాణాల్ని రక్షించుకునే భయనక దృశ్యాలు ప్రమాద తీవ్రతను గుర్తు చేస్తున్నాయి. A distressing video has emerged showing medical students at BJ Medical College hostel in #Ahmedabad desperately jumping from balconies to escape following the catastrophic Air India #planecrash crash on June 12!!Although no media is highlighting this..#MedTwitter pic.twitter.com/iBAqn8xngc— Indian Doctor🇮🇳 (@Indian__doctor) June 17, 2025మాటలకందని పెనువిషాదం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన. గత గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది.ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో రెండు భవనాలూ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటితో పాటు పరిసరాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాలు కూడా మంటలంటుకుని కాలిపోయాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలామంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వారితో పాటు హాస్టల్వాసుల్లో కూడా పలువురు ప్రమాదంలో గాయపడ్డారు.వారిలో కనీసం 25 మంది మరణించినట్టు చెబుతున్నారు! ఒక వైద్యుడు, నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, వైద్యుని భార్య మృతిని ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ‘‘60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి’’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. -
Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్ఫీల్డ్లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు. -
‘హనీమూన్’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్తో పాటు ప్రియుడు..
షిల్లాంగ్: మధ్యప్రదేశ్కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్ల హనీమూన్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. నాడు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (Scene Reconstruction) చేశారు.సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్లో ఉండగా, ఒక పథకం ప్రకారం రాజా రఘువంశీ హత్య జరిగింది. రాజా మృతదేహం దొరికిన ఆరు రోజులకు సోనమ్ యూపీలోని ఘాజీపూర్లో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో సోనమ్ తన భర్త హత్యలో తన పాత్రను అంగీకరించింది. అయితే ఆమెపై ఉన్న అభియోగాలను నిరూపించే ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించాలి. ఇందుకోసం వారు సోనమ్ను మేఘాలయ తీసుకువచ్చారు.మేఘాలయలోని సోహ్రాలో నేరాల రేటు అతి తక్కువ. గత కొన్ని దశాబ్దాలుగా ఈ పర్యాటక ప్రదేశంలో ఎటువంటి హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు ఈ కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించారు. నిందితులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మేఘాలయ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్రాంగ్ అన్నారు. అందుకే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విచారణ కోసం సోనమ్ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నామన్నారు.ఇది కూడా చదవండి: అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’ -
అంబులెన్స్లో కేదార్నాథ్.. బెడిసికొట్టిన ‘ప్లాన్’
డెహ్రాడూన్: అతి తెలివి అనర్థాలకు దారితీస్తుందంటారు. ఈ మాటను పెడచెవిన పెట్టినవారు ఇబ్బందుల్లో పడటాన్ని మనం చూస్తుంటాం. ఇదే కోవలో ట్రాఫిక్ను తప్పించుకునేందుకు, కొందరు టూరిస్టులు ఎంతో తెలివిగా వేసిన ప్లాన్ చివరికి బెడిసికొట్టింది. వారు చేసిన పని పోలీసుల వరకూ చేరింది. విషయం తెలిసినవారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు.హరిద్వార్ నుండి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి బయలు దేరిన కొందరు టూరిస్టులు రెండు అంబులెన్స్లను బుక్ చేసుకుని ,వాటిని టాక్సీలుగా మార్చివేశారు. ట్రాఫిక్ను తప్పించుకునేందుకే వారు ఈ పని చేశారు. అయితే చివరికి వారు పోలీసుల దృష్టి మళ్లించలేకపోయారు. వారు టాక్సీలుగా ఉపయోగించిన రెండు అంబులెన్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి డ్రైవర్లకు చలానా వడ్డించారు.జూన్ 14న కొందరు భక్తులు హరిద్వార్ నుండి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయానికి వెళ్లేందుకు రెండు అంబులెన్స్లను బుక్ చేసుకున్నారు. వాటిలో వెళితే ట్రాఫిక్ బారినపడకుండా సులభంగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చనుకున్నారు. రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఉపయోగించే అత్యవసర సేవా వాహనం అయిన అంబులెన్స్ను పోలీసులు అడ్డుకోరని వారు భావించారు. తరువాత వారంతా అంబులెన్స్లలో ఎక్కి, సైరన్లను ఆన్ చేసి, ప్రయాణాన్ని మొదలుపెట్టారు.సోన్ప్రయాగ్ వరకూ వారు అన్ని చెక్పోస్టులను దాటారు. అయితే సోన్ప్రయాగ్లోని చెక్పోస్టు సిబ్బందికి ఆ మార్గంలో రెండు అంబులెన్స్లు వస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదు. దీంతో వారు ఆ అంబులెన్స్లను అడ్డుకున్నారు. వాటిలో కేదార్నాథ్కు వెళ్లే భక్తులు ఉండటాన్ని వారు గమనించారు. వాటిలోని ఒక అంబులెన్స్ రాజస్థాన్ నంబర్తో ఉండగా, రెండవది హరిద్వార్ నంబర్తో ఉంది. ఈ రెండు వాహనాలను మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాల డ్రైవర్లకు జరిమానా విధించారు. కేదార్నాథ్ ద్వారాలు మే 2న తెరిచారు. నవంబర్లో జరిగే ముగింపు వేడుక వరకు ఆలయం తెరచి ఉంటుంది. ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి -
అందుకే లండన్ విమానం రద్దు చేశాం: ఎయిరిండియా క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానాలు హడలెత్తిస్తున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత బయట పడుతున్న సాంకేతిక లోపాల ఘటనలు ‘వామ్మో.. ఎయిరిండియా’ అనేలా చేస్తున్నాయి. తాజాగా.. మంగళవారం మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి రద్దయ్యిందనే వార్తలు రాగా.. ఎయిరిండియా అందులో నిజం లేదని వివరణ ఇచ్చుకుంది. ఆంగ్ల మీడియా సంస్థల కథనం ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరియిండియా విమానంలో సాంకేతిక సమస్య బయటపడింది. మధ్యాహ్నం 1.10 గంటలకు AI 159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరాల్సి ఉండగా.. పైలట్ టేకాఫ్ కంటే ముందు సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో విమానంలోని 200 మంది ప్రయాణికులను దించేశారు. తొలుత సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు.. చివరకు ఫ్లైట్ సర్వీసును తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జూన్ 12వ తేదీన ఇదే రూట్లో ప్రయాణించే ఎయిరింయా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో ఏఐ 171 విమానాన్ని పూర్తిగా రద్దు చేసింది ఎయిరిండియా. దాని స్థానంలోనే AI 159 విమానానికి తీసుకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా.. ఇవాళ ఆ విమానంలోనూ సాంకేతిక సమస్య తలెత్తడం.. టేకాఫ్కి ముందే ఆ సమస్యను గుర్తించడం.. చివరకు సర్వీస్ రద్దు కావడం జరిగిపోయాయి. విమాన రద్దు నిర్ణయంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏఐ 159 విమాన రద్దుపై ఎయిరిండియా వివరణ ఇచ్చుకుంది. విమానం సిద్ధంగా లేకపోవడంతోనే రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది. ప్రయాణికులకు హోటల్లో వసతు కల్పిస్తున్నామని, అడిగిన వారికి డబ్బులు సైతం వెనక్కి ఇస్తున్నామని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని ఎయిరిండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. Air India crashed after taking off. The plane was seen struggling to gain altitude before crashing into a fire ball.. Over 200 people were on board..#AirIndiaCrash pic.twitter.com/xacH20AlSe— Sudhir Byaruhanga (@Sudhirntv) June 12, 2025 -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
నాగపూర్: విమానాలకు బాంబు బెరిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళవారం ఉదయం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో నాగపూర్లో ఇండిగో ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. నాగపూర్లో ఇండిగో విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. ప్రయాణీకులందరినీ సురక్షితంగా తరలించారు. ఈ బెదిరింపు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.కాగా, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజుల క్రితం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానం బాంబు బెదిరింపుల నేపథ్యంలో యూటర్న్ తీసుకుంది. తిరిగి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎల్హెచ్752 విమానం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం జర్మనీ నుంచి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది.కానీ, ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ విమానాశ్రయానికి బాంబు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ల్యాండింగ్కు నిరాకరించారు. భద్రతా దృష్ట్యా, విమానాన్ని తిరిగి బయల్దేరిన విమానాశ్రయానికి లేదా సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలని సూచించారు. దీంతో.. లుఫ్తాన్సా విమానం తిరిగి ఫ్రాంక్ఫర్ట్కు చేరుకుంది. శుక్రవారం ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం బాంబు బెదిరింపు కారణంగా థాయిలాండ్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. -
పైలట్ సుమీత్ సభర్వాల్ అంత్యక్రియలు పూర్తి
ముంబై: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూసిన పైలట్ సుమీత్ సభర్వాల్ మృతదేహాన్ని ముంబైలోని అతని స్వగృహానికి తరలించారు. పోవైలోగల జల్ వాయు విహార్కు మంగళవారం ఉదయం అతని మృతదేహం చేరుకోగానే, అక్కడ గంభీరమైన నిశ్శబ్ద వాతావరణం అలముకుంది. గత వారం అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ ఏI-171 ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలట్ సుమీత్ సభర్వాల్ ప్రాణాలు కోల్పోయారు.పైలట్ సుమీత్ సభర్వాల్కు అంతిమ వీడ్కోలు పలికేందుకు అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు అతని ఇంటికి చేరుకున్నారు. సుమీత్ మృతదేహానికి అతని తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ల కెప్టెన్ సభర్వాల్ అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకునేందుకు ముందుగానే పదవీ విరమణ చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది.చిన్నప్పటి నుంచి సభర్వాల్ను తెలిసిన పొరుగువారు మాట్లాడుతూ ‘సబర్వాల్ కుటుంబం దశాబ్దాలుగా ఇక్కడేవుంటోంది. సబర్వాల్ ఎంతో ధైర్యవంతుడు. విమానం ప్రమాదంలో పడిన సమయంలో అతను విమానంలోని ప్రయాణికులను కాపాడేందుకు చివరి క్షణం వరకు ప్రయత్నించి ఉంటారు. వారి కుటుంబానికి ఇది తీరని నష్టం. సబర్వాల్ అందరి మనసుల్లో ఎప్పటికీ నిలిచి వుంటారు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి -
Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి
మండి: హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఈరోజు(మంగళవారం) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీసుకువచ్చి, అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. #WATCH | Himachal Pradesh: 17 people injured when their bus fell into a gorge in Patrighat of Mandi district. Rescue and relief operations underway. The injured are being rushed to a hospital. The bus was going from Jahu to Mandi. (Video: District Administration Mandi, Himachal… pic.twitter.com/Gl2SL6cpTi— ANI (@ANI) June 17, 2025తీవ్రంగా గాయపడిన వారిని మండి ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగా బస్సు అదుపుతప్పి లోయిలో పడిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మండి జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైందని డీఎస్పీ సర్కాఘాట్ సంజీవ్ గౌతమ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ఉన్నారు. ఇది బస్సు సీటింగ్ సామర్థ్యం కంటే అధికం. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణంకావచ్చని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది? -
నమ్మించి గొంతుకోసి.. కారు ప్రమాదంగా చిత్రీకరించి..
సంగీత ప్రపంచంలో పాపులారిటీ సంపాదించుకుంటోందనుకున్న సమయంలోనే.. ఆమె రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెది ప్రమాదం కాదని.. హత్య చేశారనే విషయం బయటపడడంతో అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్రముఖ హర్యానా మోడల్ శీతల్ చౌద్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి.. గొంతుకోసి హత్య చేశాడని క్రైమ్బ్రాంచ్ పోలీసులు నిర్ధారించారు. ఆపై ఘటనను ఓ కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. నిందితుడు సునీల్ తన నేరం ఒప్పుకోవడంతో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. హర్యానా మోడల్ అయిన శీతల్ చౌద్రీ.. అక్కడి మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమె తన బంధువుల అమ్మాయిలతో పానిపట్ సత్కర్తర్ కాలనీలో నివసించసాగింది. అయితే జూన్14వ తేదీన ఓ ఆల్బమ్ షూట్కు వెళ్లిన ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మాత్లౌదా పీఎస్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఆచూకీని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈలోపు.. ఆదివారం(జూన్ 15న) ఓ కాలువలో ఆమె ప్రయాణించిన కారు కొట్టుకువచ్చింది. అయితే అందులో ఆమె మృతదేహాం లేదు. ఆ మరుసటిరోజు.. కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహామేనని నిర్ధారించుకున్నారు. ఈలోపు.. ఆమె ప్రియుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ సునీల్ చెప్పిన మాటల్ని అంతా నమ్మారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోస్ట్మార్టం నివేదికలో ఆమె గొంతు, శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయని, ఆ గాయాల కారణంగానే ఆమె మరణించిందని తేలింది. లోతుగా దర్యాప్తు చేపట్టిన హర్యానా క్రైమ్ బ్రాంచ్ విభాగం.. చివరగా ఆమె కారులో వెళ్లిన ప్రియుడు సునీల్ను గట్టిగా విచారించడంతో విషయం బయటకు వచ్చింది. శీతల్ గతంలో సునీల్ పని చేసిన ఓ హోటల్లో రిసెప్షనిస్ట్గా పని చేసింది. వీళ్ల మధ్య ఆరేళ్లుగా పరిచయం ఉంది. శీతల్ ఐదు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తాబిడ్డలను వదిలేసి తనను వివాహం చేసుకోవాలని సునీల్ శీతల్కు ప్రపోజ్ పెట్టారు. ఈలోపు సునీల్కు ఇదివరకే పెళ్లైందని.. ఇద్దరు బిడ్డలకు తండ్రి అనే విషయం శీతల్కు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. తన పరువును బజారున పడేస్తుందన్న భయంతో.. మాట్లాడుకుందామని శీతల్ను పిలిచాడు సునీల్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆ మృతదేహాన్ని కారులో ఉంచి కాలువలోకి నెట్టేశాడు. నిందితుడు సునీల్ నేరం అంగీకరించడంతో.. పోలీసులు అతన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 14వ తేదీ.. పానిపట్లో శీతల్ ఆల్బమ్ షూటింగ్.. ఆపై సునీల్తో ఔటింగ్. అర్ధరాత్రి దాకా కలిసి తాగిన శీతల్-సునీల్. ఆపై తన సోదరికి కాల్ చేసి సునీల్ దాడి చేస్తున్నాడని చెప్పిన శీతల్. కాల్ కట్ కావడంతో కంగారుపడిపోయిన శీతల్ సోదరి. జూన్ 15వ తేదీ.. మిస్సింగ్ కేసు నమోదు. పోలీసులు ఎంక్వైరీ. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ను ప్రశ్నించిన పోలీసులు. తాము కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, తాను ఈత కొడుతూ బయటకు వచ్చి ఆస్పత్రిలో చేరానని, శీతల్ కారుతో సహా కొట్టుకుపోయిందని సునీల్ వాంగ్మూలం. శీతల్ ప్రయాణించిన కారు స్వాధీనం.జూన్ 16వ తేదీ.. శీతల్ మృతదేహాం లభ్యం. పోస్ట్మార్టం నివేదికలో హత్య జరిగిందని నిర్ధారణ.జూన్ 17వ తేదీ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సునీల్ నేరాంగీకరణ. ఉదయాన్నే మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధింపు.CCTV Footage में आखिरी बार अपने Boyfriend के साथ दिखी Haryana Model sheetal । India News Haryana #haryananews #crimenews #cctv #model #sheetalchaudhary #mudercase #boyfriendexpose #boyfriendgirlfriend #viralvideo #ytshorts #breakingnews #latest pic.twitter.com/0yGuANnWns— India News Haryana (@indianews_hr) June 17, 2025Video Credits: India News Haryana -
ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు.. ఏం జరుగుతోంది?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ క్రాష్లు లేదా అత్యవసర ల్యాండింగ్ల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం(జూన్ 15) జరిగిన బెల్ 407 హెలికాప్టర్ క్రాష్ ఏడుగురు ప్రాణాలను బలిగొంది. ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఈ హెలికాప్టర్ గౌరీకుండ్- త్రియుగినారాయణ్ మధ్య గౌరీ మై ఖార్క్ అడవులలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి, పైలట్తో సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి పుణ్యక్షేత్రాలకు వెళ్లే చార్ ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. గడచిన ఆరు వారాల్లో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 30న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి యాత్రా మార్గంలో ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు సంభవించాయి.పైలట్కు గాయాలుజూన్ 7న కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపై అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పైలట్ గాయపడ్డారు. విమానంలోని ఐదుగురు భక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. జనావాసాలకు దగ్గరగా ఉన్న రోడ్డుపై హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ చేయడంతో అది అక్కడ నిలిపివుంచిన కారును ఢీకొంది.ఆరుగురు మృతిమే 8న ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి ధామ్కు వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఉత్తరకాశీ జిల్లాలోని గంగ్నాని సమీపంలో గంగోత్రి ఆలయానికి వెళుతుండగా ఈ హెలికాప్టర్ కూలిపోయింది.ఆట స్థలంలో అత్యవసర ల్యాండింగ్మే 12న, బద్రీనాథ్ నుండి సెర్సికి యాత్రికులతో వస్తున్న హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దృశ్యమానత తక్కువగా ఉన్న కారణంగా ఈ హెలికాప్టర్ను ఉఖిమత్లోని ఒక పాఠశాల ఆట స్థలంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో యాత్రికులకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. వాతావరణం మెరుగుపడ్డాక, ఒక గంట అనంతరం హెలికాప్టర్ తిరిగి బయలుదేరింది.వెనుక భాగం దెబ్బతినడంతో..మే 17న ఎయిమ్స్ రిషికేశ్ నుండి వచ్చిన హెలి అంబులెన్స్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ హెలిప్యాడ్ సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్ వెనుక భాగం దెబ్బతినడంతో ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్లోని వైద్యుడు, పైలట్, మరో వ్యక్తి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.రిస్కీ సర్క్యూట్ కారణంగా..ఉత్తరాఖండ్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) లేదని, వాతావరణ కేంద్రం, అత్యవసర ల్యాండింగ్ సైట్ కూడా లేదని, దీంతో ఉత్తరాఖండ్ రిస్కీ సర్క్యూట్లో పైలట్లు అతి తక్కువ రియల్ టైమ్ వాతావరణ మధ్య హెలికాప్టర్ నడుపుతారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ప్రాంతంలో వాతావరణం అనూహ్యంగా మారుతుందని ఒక పైలట్ పేర్కొన్నారు. ఏటీసీ ఏర్పాటుతోపాటు పలు సమస్యలను పరిష్కరించే వరకు ఈ ప్రాంతంలో హెలికాప్టర్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: ‘వాటర్ మెట్రో’లో బీహార్ రాజకీయాలు -
కిడ్నాప్ కేసులో హైకోర్టు కన్నెర్ర
సాక్షి, చెన్నై: కిడ్నాప్ కేసులో మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. కేవీ కుప్పం ఎమ్మెల్యే జగన్మూర్తికి తీవ్రంగా అక్షింతలు వేయడమే కాకుండా ఏడీజీపీ జయరామన్ అరెస్టుకు ఆదేశాలు ఇచ్చింది. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు సమీపంలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్మూర్తి ఇంటి వద్ద గత రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంటూ వస్తోంది.ఈ కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు భావించిన పోలీసులు అరెస్టు కసరత్తులు విస్తృతంగా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కేసు విచారణ న్యాయమూర్తి వేల్మురగన్ బెంచ్లో జరిగింది. విచారణ నిమిత్తం హాజరు కావాలని జగన్మూర్తికి ఆదేశాలు ఇవ్వడంతో మధ్యాహ్నం ఆయన కోర్టుకు వచ్చారు. తెరపైకి ఏడీజీపీ ఈ కేసు విచారణ సమయంలో సాగిన వాదనలు మరో ట్విస్టుకు దారి తీశాయి. ఈ కేసులో ఏడీజీపీ జయరామన్ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఆయన హస్తం కూడా ఉందని ప్రభుత్వ తరఫున న్యాయవాదులు కోర్టు ముందు ఉంచడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో ఏడీజీపీ జయరామన్కు సంబంధం లేదంటూ జగన్మూర్తి తరఫు న్యాయవాదులు వాదించడం మరింత చర్చకు దారి తీసింది. వాదనల అనంతరం ఈ కిడ్నాప్ వ్యవహారంలో న్యాయమూర్తి వేల్మురుగన్ తీవ్రంగా స్పందించారు. ఏడీజీపీ జయరామన్ను అరెస్టు చేసి పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు. బాధ్యత గల పదవిలో ఉన్న ఎమ్మెల్యే అందరికీ ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. అయితే, ఇలాంటి వ్యవహారాల కారణంగా చిక్కులు ఎదుర్కోక తప్పదన్నారు. ఈ కేసు విచారణకు సంపూర్ణ సహకారం అందించాలని, పోలీసులు విచారణకు వెళ్లే సమయంలో మందీ మార్బలంతో వెళ్ల కూడదని, ప్రజలకు ఇబ్బందులు కలుగ కుండా బా«ధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు తిరువేలాంగాడు పోలీసు స్టేషన్కు రాత్రి సమయంలో ఏడీజీపీ జయరామన్ వెళ్లడంతో ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను అరెస్టుచేసి తమ కస్టడీలో ఉంచుకునే దిశగా పోలీసులు కసరత్తులు చేశారు. -
‘వాటర్ మెట్రో’లో బీహార్ రాజకీయాలు
పట్నా: బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీలన్నీ తమ ప్రణాళికల్లో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో రాజధాని పట్నాలో ‘వాటర్ మెట్రో’ సేవలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయంటూ షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. పట్నా పట్టణం జల రవాణా వ్యవస్థకు కేంద్రంగా మారనున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వెలువడిన ఈ ప్రకటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లలో లోతట్టు జల రవాణా అభివృద్ధిపై పట్నాలో జరిగిన ఒక సమావేశంలో సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ కార్గో, పర్యాటకం, స్థానిక జీవనోపాధి కోసం నదీ వ్యవస్థల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ‘వాటర్ మెట్రో’ పట్నాకు మరో ఆధునిక రవాణా వ్యవస్థను అందించనున్నదన్నారు. దీనిని నేషనల్ ఇన్లాండ్ నావిగేషన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయనున్నదని తెలిపారు. గంగా నది ఒడ్డున ఉన్న బీహార్.. దేశంలో అంతర్గత జలమార్గ రవాణా కేంద్రంగా ఉద్భవించనున్నదని ఆయన అన్నారు.వారణాసి నుండి హల్దియా వరకు 1,390 కి.మీ.ల పొడవున విస్తరించి ఉన్న జాతీయ జలమార్గం వన్లో ఉన్న బీహార్లోని పట్నాలో రెండు టెర్మినల్స్ ఏర్పాటు కానున్నాయని అన్నారు. అలాగే గంగా నది వెంబడి నౌకల మరమ్మతు, తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నదని తెలిపారు. గంగా నది వెంబడి ఉన్న 12 జిల్లాల్లో అంతర్గత నావిగేషన్, జల ఆధారిత వాణిజ్యం కోసం మరిన్ని అవకాశాలను అన్వేషించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు కానున్నదని తెలిపారు.బీహార్లో త్వరలో ప్రారంభం కాబోయే ‘వాటర్ మెట్రో’ అక్కడి ఎన్డీఏ ప్రభుత్వానికి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసివచ్చే అంశం కానున్నదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే ఈ వాటర్ మెట్రో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనున్నదనే వాదన వినిపిస్తోంది. తద్వారా ఇక్కడి యువత ఎన్డీఏవైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. జల రవాణా వ్యవస్థకు పట్నా కేంద్రంగా మారనున్నదని ప్రభుత్వం ప్రకటించడంతో స్థానికులు బీజేపీపై గంపెడు ఆశలు పెట్టుకున్నారనే మాట వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: టెహ్రాన్లో దారుణ పరిస్థితులు.. భారత విద్యార్థుల తిరుగుముఖం -
సైప్రస్ అధ్యక్షుడికి మోదీ బహుమతులు
న్యూఢిల్లీ: సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్కు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పలు బహమతులు అందజేశారు. చేతితో తయారు చేసిన కాశ్మీరీ సిల్క్ కార్పెట్తోపాటు ఆంధ్రప్రదేశ్ కళాకారులు రూపొందించిన వెండి పర్సును బహూకరించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి నేతలకు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెప్పే బహమతులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.సైప్రస్ అధ్యక్షుడికి ఇచ్చిన కాశ్మీరీ సిల్క్ కార్పెట్కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. కాశ్మీర్ లోయలోని కళాకారులు శతాబ్దాల నాటి కుట్టు నైపుణ్యాలను ఉపయోగించి, దీన్ని తయారు చేశారని చెప్పారు. అసలు సిసలైన మల్బరీ పట్టు, సహజసిద్ధమైన రంగులు వాడినట్లు పేర్కొన్నారు.ఇక వెండి క్లచ్ పర్సు కూడా విలువైందేనని అన్నారు. సంప్రదాయ లోహపు పనితనం, ఆధునిక రీతులను మేళవించి దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. పర్సుపై ఉన్న పూల డిజైన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని స్పష్టంచేశారు. -
హడలెత్తించిన మరో ఎయిరిండియా విమానం
కోల్కతా: అహ్మదాబాద్ విషాద ఘటన మరవకముందే.. ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత శనివారం.. గువాహటి– కోల్కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికులు కలవరపాటుకు గురైన సంగతి తెలిసిందే. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు.తాజాగా, మరో విమానంలో సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికులు హడలెత్తిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబైకి వెళ్తోన్న ఎయిరిండియా విమానం (AI 180).. మంగళవారం అర్ధరాత్రి 12:45 గంటలకు కోల్కతా ఎయిర్పోర్ట్కు చేసుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తగా.. సిబ్బంది వెంటనే గుర్తించి అలర్ట్ అయ్యారు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి దించేశారు.An Air India flight from San Francisco to Mumbai via Kolkata suffered a technical snag in one of its engines, requiring passengers to be deplaned during a scheduled halt at the city airport early on Tuesday.#AirIndia #Kolkata #Mumbai #SanFrancisco #Ahmedabad pic.twitter.com/Sbj0JjHMlG— Diksha singh (@DikshaSingh7522) June 17, 2025కాగా, నిన్న(సోమవారం) కూడా.. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్లో సాంకేతిక లోపం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో టేకాఫ్ అయిన గంట తరువాత సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. విమానం హాంకాంగ్లో క్షేమంగా ల్యాండయ్యిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ315 స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.16 గంటలకు హాకాంగ్ నుంచి బయలుదేరింది.8.50కి టేకాఫ్ కావాల్సిన విమానం.. అప్పటికే మూడున్నర గంలు ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్ అయిన గంట తరువాత విమానం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు విమానాన్ని హాంకాంగ్లో ల్యాండ్చేశారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ సమస్య ఎయిర్పోర్ట్ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. అహ్మదాబాద్లో ఎయిరిండియా ప్రమాదం తర్వాత బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్తో సంబంధం ఉన్న జెట్ వెనక్కి తిరిగి వెళ్లడం ఇది రెండోసారి. ఆదివారం.. చెన్నైకి వస్తున్న బ్రిటన్ ఎయిర్వేస్ డ్రీమ్లైనర్ కూడా సాంకేతిక సమస్య కారణంగా లండన్కు తిరిగి వెళ్లింది. -
పామును ముద్దాడేందుకు యత్నం.. కాటేసిన విషసర్పం
మొరాదాబాద్:(యూపీ): నాగుపామును ముద్దాడుతూ తీసిన వీడియోను ఆన్లైన్లో ఉంచి సెన్సేషన్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం బెడిసికొట్టింది. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ జిల్లా హైబత్పూర్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్(50) ఓ చిన్నపాటి రైతు. గ్రామంలోని ఓ ఇంటి గోడలో ఉన్న విష సర్పాన్ని శుక్రవారం సాయంత్రం అతడు పట్టుకున్నాడు. దాన్తో విన్యాసాలు చేసిన వీడియోలను ఆన్లైన్లో పెట్టాలని అతడి ఆశ. అందుకే అందరూ చూస్తుండగా దాన్ని మెడలో వేసుకున్నాడు. ఆ తర్వాత దాని తలను నెమ్మదిగా తన నోటి వద్దకు తీసుకువచ్చాడు. ముద్దు పెట్టుకునే ప్రయత్నంలో నాలుకను బయట పెట్టాడు. అనూహ్యంగా అతడి నాలుకపై పాము కాటేసింది. చూస్తున్న వారంతా హాహాకారాలు చేశారు. కొద్దిసేపటికే అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న జితేంద్ర కుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. స్టంట్ సమయంలో జితేంద్ర కుమార్ మద్యం మత్తులో ఉన్నాడని, పొగతాగుతూనే పాముతో ఆటలాడాడని స్థానికులు అంటున్నారు. కాటేసిన వెంటనే జితేంద్ర కుమార్ పామును వదిలేయడంతో అది పొదల్లోకి జారుకుందని చెబుతున్నారు. उत्तर प्रदेश के अमरोहा जिले के इस व्यक्ति ने सांप को पकड़ा,फिर सांप के साथ खेलने लगा,सांप से खुद की जीभ पर किस कराने जैसे करतब दिखाना शुरू किया,अचानक सांप ने उसे जीभ पर ही काट लिया.हालत गंभीर,व्यक्ति अस्पताल में भर्ती है. pic.twitter.com/8roTgeI0ni— Priyanshu Mishra 🎭 (@Apka_Priyanshu) June 15, 2025 -
బైక్ను లారీ ఢీ.. డ్యాన్సర్లు మృతి
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): నృత్య వేడుకలో ప్రదర్శన ఇచ్చి బైక్ పై ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు యువ డాన్సర్లకు అదే చివరి ప్రయాణమైంది. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన నెలమంగల కుణిగల్ బైపాస్లో సోమవారం వేకువన జరిగింది. బెంగళూరు శ్రీరాంపుర కు చెందిన ప్రజ్వల్ (22), సహన (21) ఇద్దరూ సినిమాల్లో డాన్సర్లుగా నటించడంతో పాటు వేడుకలలో పాల్గొని ప్రదర్శనలిచ్చేవారు. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో స్నేహంగా ఉండేవారు. ఆదివారంనాడు కుణిగల్లో జరిగిన ఈవెంట్లో పాల్గొని తెల్లవారుజామున బైక్పై తిరిగి వస్తున్నారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలై ఇద్దరూ అక్కడే మరణించారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించిన ఆస్పత్రి..
ముంబై: అస్థవ్యస్థమైన ఆరోగ్య వ్యవస్థ అత ని కూతురు ప్రాణాలు తీసింది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో తల్లి కడుపులోనే బిడ్డ ప్రాణాలు పోయాయి. పసికందు శవాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడానికి ఆస్ప త్రి వర్గాలు నిరాకరించాయి. కూతురు మృతదేహాన్ని సంచిలో వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించాడు మహారాష్ట్రకు చెందిన ఓ గిరిజనుడు. జూన్ 12న నాసిక్ జిల్లాలో జరిగి న అత్యంత అమానవీయ ఘటన సోమవా రం వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్ జిల్లాలోని జోగల్వాడి కుగ్రామానికి చెందిన సఖారామ్ కవార్ భార్య అవిత జూన్ 11న ప్రసవ వేదనకు గురైంది. సమీపంలోని ఖోడాలా ప్రాథ మిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి అంబులెన్స్ దొరకలేదు. 108కు కాల్ చేస్తే స్పందన రాలేదు. ప్రైవేట్ వాహనంలో పీహెచ్సీకి తీసుకెళ్లారు. గంటసేపు ఎదురుచూసినా డాక్టర్లు రాలేదు. సమీపంలోని మోఖడా గ్రా మీణ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు లు నాసిక్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్ అందుబాటులో లేక మళ్లీ ఆలస్యమైంది. జూన్11న అర్ధరాత్రి దాటిన తరువాత ఆస్పత్రికి చేరుకుంది. తెల్లవారుజామున ఆమెకు చనిపోయిన ఆడ శిశువును ప్రసవించింది. ఆస్పత్రి జూన్ 12న శిశువు మృతదేహాన్ని సఖారామ్కు అప్పగించింది. కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. బిడ్డను బట్టలో చుట్టుకుని, బస్టాండ్కు వెళ్లి.. రూ. 20 క్యారీ బ్యాగ్ కొనుక్కుని, అందులో పెట్టుకుని ఎమ్ఎస్ఆర్టీసీ బస్సులో దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఏమి మోసుకెళ్తున్నావని ఆయనను ఎవరూ అడగలేదు. ఆ దుఃఖాన్ని ఆయన కూడా ఎవరితో పంచుకోలేదు. అదే రోజు శిశువును ఖననం చేసి.. జూన్ 13న మళ్లీ ఆస్పత్రిలో ఉన్న భార్యకోసం నాసిక్కు తిరిగి వచ్చాడు. ఈసారి కూడా అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు. పచి్చబాలింత అయిన భార్యను.. బస్సులోనే ఇంటికి తీసుకెళ్లాడు. ‘ఆస్పత్రి ఉదాసీనత వల్ల నేను బిడ్డను కోల్పోయాను. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి బాధ ఎదురు కాకూడదు’అంటూ నిస్సహాయతతో కూడిన బాధతో చెప్పాడు సఖారామ్. -
మోదీ సైప్రస్ యాత్ర...తుర్కియేకు గట్టి హెచ్చరిక!
ప్రపంచ దేశాల్లో మనవారెవరు, పరాయివారెవరు అన్నదానిపై ఆపరేషన్ సిందూర్తో భారత్కు బాగా స్పష్టత వచ్చింది. ముఖ్యంగా తుర్కియే నైజం పూర్తిస్థాయిలో బయటపడింది. అప్పట్లో భూకంపంతో కకావికలమైన వేళ అందరికంటే ముందుగా స్పందించి అన్నివిధాలైన సాయం పంపి ఆదుకున్న భారత్ పట్ల సిందూర్ వేళ తుర్కియే అక్షరాలా విషం కక్కింది. పాకిస్తాన్కు డ్రోన్లతో పాటు అన్నివిధాలా సాయుధ సాయం చేసి మనపట్ల కృతఘ్నత ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సిందూర్ తర్వాత తన తొలి విదేశీ పర్యటనకు అనూహ్యంగా సైప్రస్ను ఎంచుకోవడం ఆశ్చర్యపరిచింది. ఇది యాదృచ్చికమేమీ కాదని విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ చర్య ద్వారా తుర్కియేకు గట్టి సందేశమే ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. ఆదివారం మోదీ సైప్రస్లో పర్యటించారు. ఒక భారత ప్రధాని ఆ దేశానికి వెళ్లడం 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఎంపిక వెనక పలు భౌగోళిక, రాజకీయ ప్రాథమ్యాలు దాగున్నాయి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు మోదీ ఈ యాత్ర చేపట్టారు. అంతేగాక విమానాశ్రయంలో మోదీని ఆయన స్వయంగా స్వాగతించారు. సైప్రస్ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. తద్వారా భారత్తో మైత్రీ బంధానికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరపడమే గాక వ్యాపార దిగ్గజాల సదస్సులో కూడా పాల్గొన్నారు. ప్రధాని సైప్రస్ యాత్రకు పలు రకాలుగా ప్రాధాన్యముంది. ఉగ్రపోరులో దన్ను కశ్మీర్ విషయంలో తుర్కియే తొలి నుంచీ పాక్కు మద్దతిస్తూ వస్తోంది. ఇక ఇరుదేశాల మధ్య ఘర్షణలు తలెత్తితే తను ఎటువైపో సిందూర్ వేళ కుండబద్దలు కొట్టింది. ఉగ్రవాదం పట్ల కూడా దానిది తొలినుంచీ మెతక వైఖరే. కానీ సైప్రస్ అలా కాదు. కశ్మీర్ విషయంలో ఎప్పుడూ భారత్కు మద్దతుగా ఉంటూ వస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించాల్సిందేనన్న మన వైఖరికి మొదటినుంచీ పూర్తిగా దన్నుగా నిలిచింది. పహల్గాం ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించింది. అంతేగాక పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని యూరోపియన్ యూనియన్ వేదికపై ఎండగడతానని హమీ ఇచ్చింది. ఈ విషయమై ఈయూ దేశాల నుంచి మనకు మద్దతు కూడగట్టింది. 2026లో ఈయూ సారథ్య బాధ్యతలు కూడా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సైప్రస్ మద్దతు భారత్కు చాలా కీలకం. అంతేగాక ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతోంది. భారత్–అమెరికా పౌర అణు ఒప్పందానికి కూడా మద్దతుదారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్కు సైప్రస్ పూర్తిగా నమ్మదగ్గ మిత్రుడని విదేశాంగ శాఖ పేర్కొనడంలో అంతరార్థం కూడా అదే. పహల్గాం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరులో భారత్కు తోడు నిలిచిన మిత్ర దేశాలకు కృతజ్ఞత తెలిపేందుకు తాజా మూడు దేశాల పర్యటన చక్కని అవకాశమని మోదీ ప్రకటించారు కూడా. తుర్కియేతో వైరం వీటికి తోడు తుర్కియేతో సైప్రస్కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాటి నడుమ విభేదాలు ఈనాటివి కావు. సైప్రస్ను ఆక్రమించాలని గ్రీస్ ఎప్పటినుంచో ప్రయతి్నస్తోంది. 1974లో అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు గ్రీస్ పూర్తిగా సహకరించింది. అదే అదనుగా తుర్కియే మరోవైపు నుంచి సైప్రస్పై దండెత్తింది. నాడు ఆక్రమించిన భూభాగాల నుంచి నేటికీ వైదొలగలేదు. వర్తక పరంగానూ... అంతేగాక మోదీ పర్యటన సందర్భంలో వర్తక, ఇంధన తదితర రంగాల్లో భారత్తో సైప్రస్ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనికి తోడు భారత్–పశ్చిమాసియా–యూరప్ ఆర్థిక కారిడార్లో భౌగోళికంగా సైప్రస్ అత్యంత వ్యూహాత్మక స్థానంలో ఉంది. ఆ దేశంలో అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యూరో బ్యాంక్ ముంబైలో ప్రాతినిధ్య కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సానుకూల పన్నుల వ్యవస్థ, అద్భుతమైన ఆర్థిక సేవల రంగం, బాగా అభివృద్ధి చెందిన షిప్పింగ్ రంగం మనకు వర్తకపరంగా బాగా అనుకూలించే విషయాలు. తూర్పు మధ్యధరా ప్రాంతంలో సహజ వాయువు వెలికితీత ప్రాజెక్టుల్లో సైప్రస్ కీలక భాగస్వామి కూడా. -
కులగణన ఉంటుంది: కేంద్రం
న్యూఢిల్లీ: జనగణనలో భాగంగా ఈసారి కులగణన కచ్చితంగా ఉంటుందని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ‘సోమవారం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావన లేదని, ఆ కసరత్తు ఉండబోదని తప్పుదోవ పట్టించే ప్రచారం జరుగుతోంది. దాన్ని నమ్మొద్దు‘ అని ఒక ప్రకటనలో పేర్కొంది. గెజిట్ లో కులగణన ప్రస్తావనే లేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఇది మోదీ సర్కారు యూ టర్న్ అని విమర్శలు గుప్పించింది. అనంతరం కేంద్ర హోం శాఖ ప్రకటన చేసింది. కేవలం కులగణనకే పరిమితం కారాదని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘ఈ విషయంలో తెలంగాణ మోడల్ ను అనుసరించాలి. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన సమగ్ర వివరాలను కూడా కులాలవారీగా పొందుపరచాలి‘ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. -
అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్: ఈసీ
న్యూఢిల్లీ: ఓటింగ్ సమయంలో పోలింగ్ ప్రక్రియపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి వందశాతానికి పెంచనుంది. అయితే, వెబ్కాస్టింగ్ డేటా ఈసీ వినియోగానికి మాత్రమే పరిమితం. ఈ విధానాన్ని ఈ ఏడాదిలో బిహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా అమలు పర్చనుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న అన్ని పోలింగ్ బూత్లలోనూ వెబ్కాస్టింగ్ అమలు చేయాలని ఈసీ తాజాగా రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు తెలిపింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో వీడియో గ్రఫీ, ఫొటో గ్రఫీ వంటివాటిని వాడుకోవాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు 50 శాతం పోలింగ్ కేంద్రాల్లోనూ, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నవాటిలోనూ ప్రస్తుతం వెబ్కాస్టింగ్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. -
రెండు దశల్లో జనగణన
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖలోని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైనట్లైంది. రెండు దశల్లో జరుగనున్న ఈ 16వ జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నారు. చివరి జనగణన 2011లో జరిగింది. మళ్లీ 16 ఏళ్లకు, అంటే 2027 మార్చి 1 తేదీకి ఆ కసరత్తు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. శీతాకాలంలో పూర్తిగా మంచుమయంగా మారే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్కు 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా కేంద్రం పేర్కొంది. ఆ నాటికల్లా అక్కడ జన, కులగణన ప్రక్రియ పూర్తవుతుంది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1కి పూర్తవుతుంది. ఈ మొత్తం జనాభా లెక్కల ప్రక్రియ దాదాపు 21 నెలల్లో పూర్తికానుంది. జనగణన రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఆవాస నమోదు కార్యక్రమం (హౌస్ లిస్టింగ్ ఆపరేషన్–హెచ్ఎల్ఓ) జరుగుతుంది. ప్రతి ఇంటి నివాస స్థితి, ఆస్తులు, సౌకర్యాలు తదితర వివరాలు సేకరిస్తారు. తరవాత, రెండో దశలో జనాభా నమోదు (పీఈ– పాపులేషన్ ఎన్యుమరేషన్) కార్యక్రమం చేపడతారు. ఇందులో ప్రతి ఇంటిలోని ప్రతి వ్యక్తి లెక్కలు, సామాజిక–ఆర్థిక, సాంస్కృతిక తదితర వివరాలు సేకరిస్తారు. జనగణన చట్టం, 1948 (అధ్యాయం 3) కింద లభించిన అధికారాల ద్వారా 2019 నాటి జనగణన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, అప్పటి వరకు అమలైన చర్యలు ఇకపై కూడా అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. దాదాపు 34 లక్షల మంది గణనదారులు, పర్యవేక్షకులు... దాదాపు 1.3 లక్షల జనాభా లెక్కల సిబ్బంది జనగణనలో భాగం కానున్నారు. వీరు మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి డిజిటల్ మా ర్గాల ద్వారా జగగణన నిర్వహిస్తారు. ప్రభుత్వం ప్రకటించే పోర్టళ్లు, యాప్ల ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకొనే అవకాశాన్ని ఇవ్వనున్నారు. ఈ భారీ కసరత్తుకు దాదాపు రూ. 13 వేల కోట్లు వ్యయం కానుంది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్కు మార్గం సుగమం!జనగణనపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు, రాష్ట్రాల మధ్య ఉత్తర– దక్షిణ రగడకు దారితీసేలా ఉన్న నియోజకవర్గాల పునర్విభజనకు కూడా మార్గం సుగమం కానుంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు ప్రత్యేకించే బిల్లుకు ఇప్పటికే ఆమోదం లభించడం తెలిసిందే.ఎన్సీఆర్ కూడా..2021లో కులగణనతో పా టే జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్సీఆర్)ను కూడా అప్డేట్ చేయాలని నిర్ణయించారు. తాజా కసరత్తులో దాన్ని చేపట్టేదీ లేనిదీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎన్సీఆర్ను అప్డేట్ చేస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.2011లోనూ కులగణన జరిగినా...2011 జనగణన సందర్భంగా కూడా కులగణన కసరత్తు జరిగింది. ఈ అంశాన్ని కేబినెట్ పరిశీలిస్తుందని 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ లోక్సభలో ప్రకటించారు. చాలా పార్టీలు కులగణనకు డిమాండ్ చేశాయి. కానీ నాటి యూపీఏ ప్రభుత్వం కులగణ నకు బదులు ’సామాజిక, ఆర్థిక, కులగణన (ఎస్ఈసీసీ)’ పేరిట 2011లో సర్వే జరిపింది. అలా అప్పుడు కుల సంబంధిత గణాంకాలు సేకరించిన వాటిని ఎప్పుడూ వెల్లడించలేదు, ఉపయోగించలేదు. గత మూడేళ్లలో బిహార్, తెలంగాణ కులగణన జరిపాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఈ కసరత్తు చేసినా, ‘వాటిలో పారదర్శకత లోపించింది. కొన్ని సర్వేలు ఫక్తు రాజకీయ కోణం నుంచి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ఉద్దేశంతో జరిపారు‘ అని కేంద్రం పేర్కొంది.అక్టోబర్ నుంచే శిక్షణ→ జనగణన కసరత్తుకు ముందు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లూ, ఇతర సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. ఇది వచ్చే అక్టోబర్ నుంచే మొదలవుతుంది.→ కేంద్రంలో అత్యున్నత స్థాయిలో కనీసం 100 మంది జాతీయ శిక్షకులు ఉంటారు. వారికి జనగణనతో పాటు ట్రైనర్ డెవలప్మెంట్ నైపుణ్యాలపై కూడా శిక్షణ ఇస్తారు.→ తర్వాత వారు దాదాపు 1,800 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు.→ వీరు 45,000 పై చిలుకు క్షేత్రస్థాయి ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. వీరు అంతిమంగా కింది స్థాయి సిబ్బంది అయిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లూ, ఇతర సిబ్బందికి శిక్షణ ఇస్తారు.3 డజన్ల ప్రశ్నలుజన, కులగణనలో భాగంగా ప్రతి పౌరుడు 36 ప్రశ్నలకు బదులివ్వాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని...→ టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నాయా?→ వాడుతున్న వాహనం→ ప్రధాన ఆహారం→ నీటి వనరులు→ ఎలాంటి ఇల్లు→ ఇంటి యజమాని మహిళనా?ఇవీ విశేషాలు→ జనగణన ప్రక్రియకు స్వీయ–గణన ఎంపిక ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.→ ఈసారి ప్రక్రియను డిజిటల్గా నిర్వహించనున్నారు.→ రాతకోతల అవసరం లేకుండా సిబ్బంది టాబ్ల ద్వారా సమాచారం నమోదు చేసుకుంటారు.→ సేకరణ, ప్రసారం నిల్వ సమయంలో డేటా భద్రతను నిర్ధారించడానికి చాలా కఠినమైన డేటా భద్రతా చర్యలు అమలు చేయనున్నారు.→ భారత రిజిస్ట్రార్ జనరల్ (ఓఆర్జీఐ) కార్యాలయం ఇప్పటికే సెల్ఫ్ ఎన్యూమరేషన్ (ఎస్ఈ) పోర్టల్ను అభివృద్ధి చేసింది.→ దీనిద్వారా వ్యక్తులు తమ ఇంటి సభ్యుల సమాచారాన్ని వీక్షించడానికి, అప్డేట్ చేయడానికి వీలవుతుంది.→ చివరగా 2011లో జరిగిన జనగణన ప్రకారం దేశ మొత్తం జనాభా 121.19 కోట్లు.→ వారిలో పురుషులు 62.372 కోట్లు (51.54 శాతం)→ స్త్రీలు 58.646 కోట్ల మంది (48.46 శాతం).+ 2021 జనగణనకు 2020లోనే సర్వం సిద్ధమైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.1931లో చివరి కులగణనస్వాతంత్య్రం అనంతరం దేశంలో కుల గణన చేపడుతుండటం ఇదే తొలిసారి. భారత్లో తొలి కులగణన 1881లో బ్రిటిష్ హయాంలో జరిగింది. అప్పుడు కుల గణన కూడా జరిపి డేటా విడుదల చేశారు. తర్వాత ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరిగింది. 1931 వరకు ప్రతి జనగణనలోనూ కులాలవారీ డేటా కూడా విడుదలయ్యింది. 1941 జనగణనలో కులాల వారీగా డేటా సేకరించినప్పటికీ ఆ గణాంకాలను విడుదల చేయలేదు. దేశంలో 2011 వరకు ఎటువంటి అంతరాయం లేకుండా జనగణన ప్రక్రియ కొనసాగింది. అయితే, కరోనా కారణంగా 2021లో విడుదల చేయాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతి జనాభా గణనలోనూ, ప్రభుత్వం కేవలం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కుల ఆధారిత డేటాను మాత్రమే విడుదల చేసింది. 1931 తర్వాత ఇతర కులాలకు సంబంధించిన గణాంకాలను ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.→ ఇది మొత్తమ్మీద 16వ కులగణన. స్వాతంత్య్రం వచ్చాక 8వది.→ ఈసారి కులగణన కూడా జరపాలని గత ఏప్రిల్ 30న ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. -
యుద్ధాల యుగం కాదు
నికోసియా: పశ్చియాసియా, యూరప్లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు. భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాలపై సంప్రదింపులు జరిగాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమాసియా, యూరప్లో కొనసాగుతున్న యుద్ధాల ప్రభావం ప్రపంచమంతటా ఉంటుందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. సంఘర్షణలకు తెరదించడానికి చర్చలు, సంప్రదింపులే మార్గమని పునరుద్ఘాటించారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించిన సైప్రస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్–సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని లిఖించడానికి ఈ పర్యటన తనకు ఒక సువర్ణ అవకాశమని మోదీ వ్యాఖ్యానించారు. రెండు దేశాల సంబంధాలకు ప్రజాస్వామ్యం పట్ల పరస్పర విశ్వాసం, చట్టబద్ధమైన పాలనే పునాది అని స్పష్టంచేశారు. భారత్లో పర్యటించాలని సైప్రస్ అధ్యక్షుడిని మోదీ ఆహా్వనించారు. దురాక్రమణకు చరమగీతం పాడాలి: నికోస్ భారత్–సైప్రస్ మధ్య చరిత్రాత్మక స్నేహ సంబంధాలు ఉన్నాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ గుర్తుచేశారు. విశ్వాసమే ప్రాతిపదికగా రెండు దేశాల నడుమ ఆతీ్మయ సంబంధాలు కొనసాగుతున్నాయని వివరించారు. ఏప్రిల్ 22న జమ్మూకశీ్మర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినట్లు గుర్తుచేశారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కు చేరుకున్న మోదీ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగాకౌన్సిల్ ఆఫ్ నికోసియా సభ్యుడు మైఖేలా ఖైత్రియోటి మలాపా.. మోదీ పాదాలకు నమస్కరించారు. వ్యాపారాభివృద్ధికి అద్భుత అవకాశాలు భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని నరేంద్ర మోదీ వెల్లడించారు. వ్యాపారాభివృద్ధికి తమ దేశంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులతో ముందుకు రావాలని సైప్రస్ ఇన్వెస్టర్లకు, పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సైప్రస్ దక్షిణ కోస్తాతీరంలోని లిమాసోల్ సిటీలో బిజినెస్ రౌండ్టేబుల్ సమావేశంలో మోదీ మాట్లాడారు. గత 11 ఏళ్లలో ఇండియా సాధించిన ఆర్థిక ప్రగతిని వివరించారు.మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని మోదీని సైప్రస్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్–3’ని మోదీకి ప్రదానం చేశారు. భారత్–సైప్రస్ మధ్య స్నేహబంధానికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని అభివరి్ణంచారు. వసుధైక కుటుంబం అనే భావనకు ఈ పురస్కారం ఒక ప్రతీక అన్నారు. రాబోయే రోజుల్లో మన రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్న విశ్వాసం తనకు ఉందని చెప్పారు. -
..మా ఊరొచ్చింది ఏనుగు!
‘ఏనుగమ్మ ఏనుగు.. మా ఊరొచ్చింది ఏనుగు’ అని భలే సంబరపడిపోతున్నారు అమెరికన్లు. చూడటానికి పరిమాణంలోనూ, రాజసంలోనూ అచ్చం గజరాజుల్లా జీవం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఇవన్నీ చెక్కతో చేసినవి. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 100 బొమ్మలు! ఆసియాలో వన్యప్రాణుల పరిరక్షణకు పనిచేస్తున్న యూకేకు చెందిన ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్’ పేరుతో వినూత్నంగా నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కుంజర సమూహం యూఎస్లోని ప్రముఖ నగర వీధుల్లో జనానికి వింత అనుభూతిని కలిగిస్తోంది. ప్రదర్శన మాత్రమే కదా, గొప్ప ఏముంది అని కొట్టిపారేయకండి.. ఎందుకంటే ఇవి మనదేశంలోనే రూపుదిద్దుకున్నాయి.మనదేశంలోని ఆసియా ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవి. అలాంటి ఏనుగులు రైలు ఢీకొట్టడం, విద్యాదాఘాతాల వంటివాటి వల్ల మరణించడం చూసి తట్టుకోలేక వాటికోసం 2002లో అప్పటి జైపూర్ రాజకుటుంబం, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫైన్షాయర్ సర్ ఎవలిన్ డి రాస్చైల్డ్ సంయుక్తంగా ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ని ఏర్పాటుచేశాయి. ఈ సంస్థ ఏనుగుల సంరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒకటి ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’. ఈ ప్రాజెక్టు కోసం.. భారత్లో తయారైన ఈ భారీ ఏనుగుల బొమ్మలు ఇప్పుడు అమెరికన్లు కట్టిపడేస్తున్నాయి.ఖరీదు కాస్త ఎక్కువే!ప్రదర్శన అంటే కేవలం చూడటమే కాదు.. ఔత్సాహికులు తమకు నచ్చిన బొమ్మను బుక్ చేసుకోవచ్చు కూడా. ఏనుగు పిల్ల నుంచి భారీ కరిరాజు వరకు శిల్పులు నాలుగు రకాల బొమ్మలు తయారుచేశారు. వీటి ధరలు రూ.6,88,000లతో మొదలై రూ.18,92,000 వరకు ఉన్నాయి. బొమ్మ తయారుచేసి, ఇవ్వడానికి 4–6 నెలల సమయం పడుతుందని ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ చెబుతోంది. తమిళనాడు నీలగిరిలోని గూడలూర్కు చెందిన 200 మంది స్థానిక గిరిజన కళాకారుల సంఘం ‘కో ఎగ్జిస్టెన్ ్స కలెక్టివ్’ చేతిలో ఇవి రూపుదిద్దుకున్నాయి. నీలగిరి ప్రాంతంలో తిరిగే ఏనుగులను పోలిన ఈ బొమ్మలను.. శిల్పులు అయిదేళ్లు శ్రమించి తీర్చిదిద్దారు.నగరాల వారీగా..గజరాజుల శిల్పాలను అమెరికా అంతటా తిప్పి, ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2024 జూలైలో న్యూపోర్ట్తో మొదలై న్యూయార్క్ సిటీ, మియామీ బీచ్, హ్యూస్టన్ లలో ఎగ్జిబిషన్ జరిగింది. మోంటానాలోని బ్రౌనింగ్లో జూన్ 4న ప్రారంభమైన ప్రదర్శన జూన్ 16తో ముగిసింది. పశ్చిమ యూఎస్ వయోమింగ్లోని జాక్సన్ హోల్లో మే 17 నుంచి జూన్ 20 వరకు జరుగుతుంది. జులై 1 నుంచి ఈ గజరాజులు కాలిఫోర్నియా వాసులకు కనువిందు చేయనున్నాయి.సంచరించడానికి స్థలం..లాంటానా కామరా పుష్పించే ఈ కలుపు మొక్క వేగంగా వ్యాపిస్తుంది. జలావరణాల్లో ఇవి వేగంగా విస్తరించడం వల్ల జంతువులు జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే, ఈ మొక్కలను ఏనుగు బొమ్మల తయారీకి వాడటం ద్వారా.. వన్యప్రాణుల సంచారానికి ఎక్కువ స్థలం ఉంటుందని, అటవీ పునరుద్ధరణకు దోహదపడుతుందనేది ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ ఆలోచన. ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’ ద్వారా సేకరించే నిధులను.. మానవులు, వన్యప్రాణుల సామరస్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. -
‘ఐపీఎల్ ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశాం’
న్యూఢిల్లీ: భారత్లో ఏం జరిగినా అది తామే చేశామని పదే పదే చెప్పుకుంటూ మళ్లీ అభాసుపాలయ్యారు పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్. గతంలో భారత రక్షణ వ్యవస్థలోని కీలక సమాచారాన్ని హ్యాక్ చేశామని చెప్పుకున్న ఖవాజా అసిఫ్.. ఈసారి ఐపీఎల్ మీద పడ్డారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఎడిషన్లో ఫ్లడ్లైట్లను కూడా ఒకానొక సందర్భంలో హ్యాక్ చేశామని పాక్ అసెంబ్లీ(పార్లమెంట్) సాక్షిగా డబ్బా కొట్టుకున్నారు. మే 8వ తేదీన పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో భాగంగా ఫ్లడ్లైట్లను తమ దేశానికే చెందిన హ్యాకర్లు హ్యాక్ చేశారన్నారు. అసలు పాకిస్తాన్లో ఇంత టెక్నాలజీ ఉందా అనే భారతే ఆశ్చర్యపోతుందంటూ ఏదో చెప్పే యత్నం చేశారు. దీనిపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. ‘మీరు హ్యాక్ చేయడానికి ఫ్లడ్లైట్లు ఏమీ వైఫై కనెక్షన్ మీద నడవలేదు. కట్టుదిట్టమైన ఎలక్రికల్ సిస్టమ్లో నడిచాయి. ఇప్పుడు పాకిస్తాన్లో సైబర్ సబ్జెక్ట్ఃను ఏమైనా ప్రవేశపెట్టారా? అని సెటైర్ వేయగా, ‘మీరు స్కూలింగ్ ఎక్కడ చదివారో.. సైన్స్ అండ్ టెక్నాలజీని భలే చెబుతున్నారు’ అంటూ మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు‘ఈసారి ఒక పని చేయండి.. ఫ్లడ్లైట్లను కాదు.. స్కోరు బోర్డును హ్యాక్ చేయండి’ అంటూ మరొక యూజర్ వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఇలా పాకిస్తాన్ రక్షణమంత్రిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా అసిఫ్ ఇలా దొరికిపోవడం తొలిసారి కాదు.. గతంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా తాము భారత్ జెట్ విమానాలను కూల్చివేశామని, దానికి సోషల్ మీడియానే సాక్షి అంటూ AI క్రియేట్ చేసిన వీడియోలు గురించి మాట్లాడారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్ల బెట్టారు ఖవాజా అసిఫ్.Pakistan Defence Minister: Our Cyber warriors did Wonder during this War with India - We Switched off FLOOD LIGHTS during IPL Match pic.twitter.com/k4eMe0uCMA— Megh Updates 🚨™ (@MeghUpdates) June 14, 2025 -
విశ్వాస్ కుమార్ రమేష్ నిజంగా మృత్యుంజయుడే.. మరో వీడియోలో
గాంధీ నగర్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్కు చెందిన మరో వీడియో వైరల్గా మారింది. తాజాగా, వెలుగులోకి వచ్చిన వీడియోలో బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా విమానం ఢీకొట్టడంతో అగ్నికిలలు ఎగిసిపడున్నాయి. ఆ ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఏదో అద్భుతం జరిగినట్లుగా అగ్నికోళం బద్దలైనప్పుడు మంటలు ఏ విధంగా ఎగిసిపడతాయో.. ఆ విధంగా మంటలు ఎగిసిపడుతున్నా 11ఏ సీటులో కూర్చున్న రమేష్, బీజే మెడికల్ కాలేజ్ క్యాంపస్ నుండి బయటకు వస్తూ కనిపిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అతన్ని గమనించి, అతని చెయ్యి పట్టుకుని ప్రమాదం స్థలం నుంచి దూరంగా తీసుకెళ్లాడు.ఏప్రిల్ 12న అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ బిల్డింగ్ను ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ఢీకొట్టింది. ఈపెను విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242మందిలో మృత్యుంజయుడు ఒక్కడే సురక్షితంగా బయటపడ్డాడు.తాజా సమాచారం మేరకు ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది, మెడికల్ కాలేజీ క్యాంపస్ బాధితులతో కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడతో మృతదేహాల్ని గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల డీఎన్ఏల ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. Unbelievable! New video of lone survivor, Viswashkumar Ramesh has emerged, showing him walking out from the crash site.He is seen wearing a white t-shirt and holding his phone in left hand.#AirIndia #AhmedabadPlaneCrash pic.twitter.com/xV83t2yjGX— Ishani K (@IshaniKrishnaa) June 16, 2025 -
భర్తకు తుది వీడ్కోలు: కన్నీరుమున్నీరైన అంజలీ రూపానీ
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని కడసారి దర్శించుకున్న భార్య అంజలి రూపానీ కన్నీంటి పర్యంత మయ్యారు. సోమవారం జరిగే అంత్యక్రియల సందర్భంగా ఆయన భౌతికకాయాన్ని గౌరవ సూచికంగా త్రివర్ణ పతాకం కప్పి ఊరేగింపు నిర్వహించారు. ఆయనకు కడసారి నివాళులర్పిస్తున్న సమయంలో ఆయన భార్య అంజలి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిని అక్కడే ఉన్న ఆమె కుమారుడు ఆమెను ఓదార్చిన దృశ్యాలు చూసిన వారి కళ్లు చెమర్చకమానవు.విజయ్కుమారుడు రుషాభ్ రూపానీ తన తండ్రి అంత్యక్రియల సమయంలో దుఃఖిస్తున్న తల్లిని ఓదార్చిన హృదయ విదారకమైన దృశ్యాలు నెటిజన్లు, పార్టీ శ్రేణులను కంట కన్నీరుపెట్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, విజయ్ రూపానీ మరణం పట్ల గుజరాత్ మొత్తం సంతాపం వ్యక్తం చేసింది.#WATCH | Ahmedabad | Former CM Vijay Rupani's wife, Anjali Rupani, bids an emotional farewell to her husband pic.twitter.com/5FkneNWKG4— ANI (@ANI) June 16, 2025తండ్రి అకాలమరణంపై కుమారుడు రుషాభ్ రూపానీ మాట్లాడుతూ, ఇది తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ విషాదకరమైన సంఘటనలో ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబానికి కూడా దుఃఖకరమైన సమయం అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి విజయ్ గురించి మాట్లాడుతూ, 50-55 సంవత్సరాలుగా, తన తండ్రి ప్రజల కోసం పనిచేశారని, వారందరూ తమ కష్ట సమయంలో తమకు అండగా వారి పక్కనే ఉన్నారని రుషాభ్ పేర్కొన్నారు.#WATCH | Former Gujarat CM Vijay Rupani's last rites begin with state honours in Rajkot. He died in the #AirIndiaPlaneCrash that occurred on June 12.. pic.twitter.com/mDIVSHQuoQ— ANI (@ANI) June 16, 2025 కాగ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఒకరు. ఆరు నెలల తర్వాత తన భార్య అంజలిని భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి లండన్కు వెళ్తున్న సమయంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్యవిజయ్ రూపానీ - అంజలి రూపానీ విజయ్ రూపానీ- అంజలి రూపానీ ఇద్దరూ తమ కెరీర్ ప్రారంభంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పనిచేశారు. ఈ పరిచయం నేపథ్యంలోనే అంజలి, విజయ్ 1980లో సాంప్రదాయ హిందూ వేడుకలో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అంజలి అధికారికంగా ఎలాంటి బాధ్యతల్లో లేనప్పటికీ, బీజేపీ మహిళా మోర్చాకు సీనియర్ నాయకురాలిగా రాజకీయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. వీరి చిన్న కుమారుడు పూజిత్ 3ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో మరణించాడు. ఇపుడీ వయసులో భర్త దూరం కావడంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
ఛాతికి గురిపెట్టి.. కటకటాల్లోకి రివాల్వర్ రాణి
డబ్బు ఉందనే పొగరు.. అధికారం ఉందనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందితో కొందరు వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తుంటుంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. కారు దిగమని మంచిమాటగా చెప్పినందుకు.. పెట్రోల్ బంకు సిబ్బందిపైనే ఓ కుటుంబం దౌర్జన్యానికి దిగింది. ఆ ఇంటి బిడ్డ అయితే ఏకంగా తుపాకీతో సిబ్బందినే చంపుతానంటూ బెదిరించింది. వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్ హర్దోయ్లో(Hardoi Viral Video) జరిగిన ఘటన తాలుకా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇషాన్ ఖాన్ అనే వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి కారులో బయటకు వచ్చాడు. బిల్గ్రామ్ ఏరియాలోని ఓ సీఎన్జీ పెట్రోల్ పంప్ దగ్గర వాళ్ల కారు ఆగింది. అయితే.. గ్యాస్ నింపుతున్న టైంలో కారు దిగాలంటూ ఇషాన్ను మర్యాదపూర్వకంగా అక్కడి సిబ్బంది కోరారు. దీంతో.. ఊగిపోతూ నన్నే కారు దిగమంటావా? అంటూ దుర్భాషలాడుతూ సిబ్బందితో గొడవకు దిగాడు ఇషాన్. ఈలోపు.. అతని భార్య, కూతురు కూడా బయటకు వచ్చి ఆ గొడవలో చేరారు. కూతురు సురుష్ఖాన్(అరిబా) కారు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో ఉన్న రివాల్వర్ను బయటకు తీసుకొచ్చింది. నేరుగా అక్కడి సిబ్బంది ఛాతీకి గురిపెట్టి ‘‘కాల్చేయమంటావా?’’ అంటూ బెదిరింపులకు దిగింది. ఈలోపు.. అక్కడున్న జనం వాళ్లను దూరం తీసుకెళ్లి సర్దిచెప్పి పంపించి వేశారు. అయితే అక్కుడున్న సీసీ ఫుటేజీలో ఆ వీడియో అంతా రికార్డయ్యింది.'इतनी गोली मारूंगी की परिवार वाले...' यूपी में 'रिवॉल्वर रानी' की दबंगई का वीडियो वायरलउत्तर प्रदेश के हरदोई जिले से एक सनसनीखेज़ मामला सामने आया है, जहां सीएनजी पंप पर कहासुनी के बाद एक लड़की ने कर्मचारी पर लाइसेंसी रिवॉल्वर तान दी. घटना उस वक्त हुई जब एहसान ख़ान नाम का शख्स… pic.twitter.com/tVNOM5IfJb— NDTV India (@ndtvindia) June 16, 2025ఘటనపై బాధితుడు రజనీష్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ భార్యభర్తలతో కూడా ఆ రివాల్వర్ రాణిని కూడా అరెస్ట్ చేశారు. రివాల్వర్తో పాటు 25 క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ రివాల్వర్ ఇషాన్ లైసెన్స్డ్ ఆయుధంగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే దురుసుగా ర్తించడంతో పాటు చంపుతామని బెదిరించినందుకుగానూ ఆ కుటుంబంపై మొత్తానికి కేసు నమోదయ్యింది. #HardoiPoliceथाना बिलग्राम पुलिस द्वारा मु0अ0सं0 268/25 धारा 115(2)/352/351(3) बीएनएस व धारा 30 आर्म्स एक्ट से संबंधित कृत कार्यवाही के संबंध में-#UPPolice pic.twitter.com/hsYiegkb1v— Hardoi Police (@hardoipolice) June 16, 2025 -
రెచ్చిపోయిన ర్యాపిడో డ్రైవర్.. మహిళకు చెంపదెబ్బ.. వీడియో వైరల్
సాక్షి,బెంగళూరు: సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నారు. సిగ్నల్ ఎందుకు జంప్ చేస్తున్నారని ప్రశ్నించిన పాపానికి మహిళ ప్యాసింజర్పై దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జూన్ 14న చోటు చేసుకుంది. జ్వులెరీ షాపులో విధులు నిర్వహిస్తున్న బాధితురాలు ఘటన జరిగిన రోజు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో బుక్ చేసుకుంది.ర్యాపిడో కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరింది. మార్గం మధ్యలో ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాదు సిగ్నల్ జంప్ కూడా చేశాడు. ఇదే విషయాన్ని బాధితురాలు సదరు ర్యాపిడో డ్రైవర్ను ప్రశ్నించింది. దీంతో కోపోద్రికుడైన ర్యాపిడో డ్రైవర్ జయనగర్లోని ఓ ప్రాంతంలో బైక్ను ఆపేశాడు. డబ్బులు చెల్లించాలని తగువు పెట్టుకున్నాడు.అందుకు మహిళ ఒప్పు కోలేదు. డ్రైవింగ్లో నిర్లక్ష్యం వహించారని మండిపడింది. తాను డబ్బులు,హెల్మెట్ ఇవ్వనంటూ బాధితురాలు ఇంగ్లీష్లో సమాధానం ఇస్తుండగా.. నిందితుడు మాత్రం కన్నడంలోనే సమాధానం ఇస్తున్నాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరడంతో స్థానికులు వాళ్ళిద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇరువురి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో ర్యాపిడో డ్రైవర్ మహిళా ప్యాసింజర్పై చేయి చేసుకున్నాడు. ఆ మహిళ ఫిర్యాదుతో సదరు ర్యాపిడో డ్రైవర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కానీ ఆమె ఈ వివాదాన్ని కొనసాగించడానికి ఇష్టపడలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్లో కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ కారణాల్ని ఎత్తి చూపుతూ ద్విచక్ర వాహన ట్యాక్సీ సేవల్ని నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘మూడు నెలల క్రితం, కోర్టు బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని కోర్టు నిర్ణయించింది. అమలుకు ఆరు వారాల సమయం ఇచ్చారు. మళ్ళీ, గడువు పొడగించాలని ప్రభుత్వం అభ్యర్ధించడంతో మరో ఆరు వారాల సమయం పొడిగించింది. ఇప్పుడు, 12 వారాలు ముగిశాయి. అగ్రిగేటర్లు హైకోర్టు ఆదేశాన్ని పాటించాలి’అని కర్ణాటక రవాణా మంత్రి రామలింగ రెడ్డి అన్నారు.దేశంలోని టెక్ హబ్ అయిన బెంగళూరులో భారీ బైక్ టాక్సీలు ఉన్నాయి. మార్కెట్ వాటాలో ర్యాపిడో 60శాతం వాటాను కలిగి ఉంది. రోజుకు 16.5 లక్షల రైడ్ సర్వీస్లను అందిస్తుంది. బైక్ టాక్సీలు రాష్ట్రవ్యాప్తంగా కనీసం 1.5 లక్షల మంది గిగ్ కార్మికులను నియమించాయి.A #Rapido driver in Jayanagar, #Bengaluru, attacked a woman after she confronted him about reckless driving. He slapped her so hard that she fell to the ground. The police have initiated an investigation. pic.twitter.com/fzoSfd9RI4— Indian News Network (@INNChannelNews) June 16, 2025 -
బైక్పై యువజంట వికృత చేష్టలు.. రూ. 53,500 జరిమానా
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు యువతీ యువకులు రోడ్లపై విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపధ్యంలో ఈ జంటపై చర్యలు తీసుకోవాలని పోలీసులను పలువురు కోరారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా వైరల్ అయిన ఈ ఐదు సెకన్ల క్లిప్లో ఒక యువకుడు బైక్ నడుపుతుండగా, ఒక యువతి పెట్రోల్ ట్యాంక్పై అతనికి రివర్స్ పొజిషన్లో కూర్చుని, తన కాళ్లను అతనికి వెనుకవైపుగా ఉంచింది. నిత్యం రద్దీగా ఉండే ఎక్స్ప్రెస్వేపై వారిద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. అయితే, ఆ మహిళ చేతిలో హెల్మెట్ ఉంది. అక్కడి సీసీటీవీ కెమెరాలలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది. नोएडा पुलिस ने इस "इशकजादे" का 53500 रुपए का चालान व्हीकल एक्ट में काटकर "प्रेम पत्र" घर भिजवा दिया है !! pic.twitter.com/Dw3gqS46Z8— Sachin Gupta (@SachinGuptaUP) June 16, 2025ఈ వీడియోను గమనించిన తాము, ఆ వాహనం నంబరు ఆధారంగా బైక్ను గుర్తించి మోటారు వాహనాల చట్టంలోని సంబంధిత విభాగాల కింద రూ.53,500 చలానా జారీ చేశామని నోయిడా (ట్రాఫిక్) డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లకన్ సింగ్ యాదవ్ మీడియాకు పారు. ఈ సంఘటన సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ప్రమాదకరమైన డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం తదితర నేరాల కింద మోటార్ వాహనాల చట్టంలోని వివిధ విభాగాల కింద పోలీసులు ఆ వాహనానికి చలానా జారీ చేశారు.ఇది కూడా చదవండి: జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే.. -
లైకులు, వ్యూస్ కోసం ఇంత దిగజారాలా?
ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.కొమ్మి వ్యాస్.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్ తన కుటుంబానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. ‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మా పాప మిరాయ్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్ చేసి కొందరు వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్ కుల్దీప్ భట్ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. వ్యాస్ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి కంటెంట్ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్ను తెర మీదకు తీసుకొచ్చి షేర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విటర్)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు. -
నిలకడగా సోనియా గాంధీ ఆరోగ్యం
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక, ఆదివారం ఉదయం అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో సోనియా గాంధీ చేరిన విషయం తెలిసిందే.తాజాగా సోనియా గాంధీ ఆరోగ్యంపై గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ గ్యాస్ కారణంగా కడుపు నొప్పి కారణంగా బాధ పడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యులు నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. According to Dr. Ajay Swaroop, Chairman, Sir Ganga Ram Hospital, Smt. Sonia Gandhi was admitted to Sir Ganga Ram Hospital at 9:00 PM Sunday under Department of Surgical Gastroenterology for stomach related issue. She is currently stable anddoctors is closely monitoring her health pic.twitter.com/iGOALuOBbH— Healthwire (@HealthwireMedia) June 16, 2025 -
అహ్మదాబాద్కు ‘బోయింగ్’ నిపుణులు.. ప్రమాదంపై విశ్లేషణ
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై అన్నివైపుల నుంచి దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ప్రమాదంపై విశ్లేషించేందుకు ‘బోయింగ్’ నిపుణులు సోమవారం అహ్మదాబాద్కు చేరుకున్నారు. 242 మందితో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ కొద్ది క్షణాల్లోనే అహ్మదాబాద్లోని ఒక వైద్య కళాశాలపై కూలిపోయింది.ఈ ప్రమాదంలో 11 ఏ సీటులో కూర్చున్న ప్రయాణికుడు మినహా మిగిలిన అందరూ మృతిచెందారు. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ను 2023 జూన్లో సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో తిరిగి సమగ్ర తనిఖీలు చేయాల్సివుందని అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరికిందని ధృవీకరించారు. ఇది ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించడంలో వారికి సహాయపడనుంది. #AhmedabadPlaneCrash || PK Mishra, Principal Secretary to @PMOIndia, visits the plane crash site in Ahmedabad and reviews the ongoing operations. pic.twitter.com/fBQ98M9xT1— All India Radio News (@airnewsalerts) June 15, 2025ఆదివారం బీజే ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పికె మిశ్రాకు అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. విమానంలో కీలకమైన డేటాను రికార్డ్ చేసే పరికరం హాస్టల్ పైకప్పుపై లభ్యమయ్యింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) ప్రమాదంపై దర్యాప్తును ప్రారంభించింది. యూఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అంతర్జాతీయ ప్రోటోకాల్ల కింద సమాంతర దర్యాప్తును నిర్వహిస్తోంది.ఇది కూడా చదవండి: 2027 మార్చి ఒకటి నుంచి జనగణన.. ప్రక్రియ ఇదే.. -
ఫోన్ పౌచులు అమ్మి.. నీట్ విజేతగా..
కష్టే ఫలి. శ్రమయేవ జయతే.. అని అన్నారు పెద్దలు. ఇక్కడో కుర్రాడి సక్సెస్ను చూస్తే ఆ మాట ఒప్పుకుని తీరాల్సిందే. కరోనా టైంలో తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న యువకుడు.. రేయింబవలు కష్టపడ్డాడు. తాను అనుకున్నది సాధించి.. ఇప్పుడు నీట్ విజేతగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నాడు.జార్ఖండ్కు చెందిన రోహిత్ కుమార్(Jharkhand Rohit Kumar).. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలో 549 మార్కులతో ఆల్ ఇండియాలో 12,484 ర్యాంక్ సాధించాడు(కేటగిరీ వైజ్గా 1,312 ర్యాంక్). ఫిజిక్స్ వాలాగా పేరుకున్న అలఖ్ పాండే.. తాజాగా ఈ యువకుడిని పలకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోహిత్ కుమార్ తండ్రి స్థానికంగా కూరగాయలు అమ్మేవాడు. 12 తరగతి పూర్తయ్యాక పూర్తిగా నీట్ మీద దృష్టి పెట్టేందుకు పైచదువులు మానేశాడు రోహిత్. ఆపై కరోనా టైంలో ఓ మెడికల్ షాపులో పని చేసే సమయంలో ఎలాగైనా వైద్య వృత్తిలో స్థిరపడాలనే కసి మొదలైంది. ఆపై సెల్ ఫోన్ పౌచులు అమ్మకునే దుకాణం తెరిచి.. రెండు పడవలపై ప్రయాణం చేస్తూ వచ్చాడు.ఉదయం 7గం. నిద్రలేచే రోహిత్ కుమార్.. పగలంతా తన బండి మీద సెల్ ఫోన్ పౌచులు అమ్ముకున్నాడు. ఆపై రాత్రి వేళలో ఇంటికి చేరి పుస్తకాలతో కుస్తీ పడుతూ వచ్చాడు. అలా అలా.. అర్ధరాత్రి 3గం. చదివేవాడు. ఇదే అతని రోజూవారీ చర్యగా మారింది. నీట్లో ర్యాంకుతో రోహిత్ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు వచ్చిన ర్యాంకుకు.. సొంత రాష్ట్రంలోనే సీటు రావాలని ఆశలు పెట్టుకున్నాడతను. చివరగా.. వెళ్తూ వెళ్తూ ఫిజిక్స్ వాలా అలఖ్ పాండే ఆ కుర్రాడికి డాక్టర్ కోటును బహుకరించాడు. కాబోయే డాక్టర్గా ఆ వైట్ కోట్ను ధరించి మురిసిపోయిన ఫొటో, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah)ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 22.09 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది కొంచెం తక్కువే. ఫలితాల్లో.. ఈ ఏడాది రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ 99.09999547 శాతంతో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ ఫిమేల్ టాపర్గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా లక్షా 70 వేల మంది అర్హత సాధించగా.. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. -
జనగణన నోటిఫికేషన్ జారీ.. లెక్కల ప్రక్రియ ఇదే..
న్యూఢిల్లీ: దేశంలోని జనాభాను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా ఈరోజు(జూన్ 16) జన గణనపై కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది(2026) అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనగణన చేపడతారు. 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టబోతున్నారు. ప్రతీ రాష్ట్రంలోనూ రెండు దశల్లో జనాభా గణన చేపడతారు. ఆదివారం జనగణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. తదనంతరం జనాభా లెక్కలను గణించే తేదీలను ఖరారు చేశారు. జనగణనతో పాటు కులగణన చేయాలని ఇదివరకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.భారతదేశంలో జనాభా గణన 12 ఏళ్ల తరువాత జరుగుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో జరుగుతున్న జనగనణ పలు కీలక అంశాలను వెల్లడించనుంది. 1948 జనాభా గణన చట్టం ప్రకారం దీనిని నిర్వహించనున్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జనాభా గణన కమిషనర్ కార్యాలయం జనగణన ప్రక్రియను చేపట్టనుంది.జనాభా గణన రెండు ప్రధాన దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహ జాబితా, గృహ గణన (2026) ఉంటుంది. దీనిలో జనాభాకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు శాశ్వత లేదా తాత్కాలిక గృహాల డేటాను సేకరిస్తారు. ఈ దశ సమగ్ర చిరునామా రిజిస్టర్ను రూపొందించేందుకు సహాయపడుతుంది. రెండవ దశలో వ్యక్తులకు సంబంధించిన వివరణాత్మక సమాచారం సేకరిస్తారు. అంటే పేరు, వయస్సు, లింగం, మతం, కులం, విద్య, వృత్తి, వలస మొదలైనవి నమోదు చేస్తారు.దేశంలో తొలిసారిగా జనాభా గణన డిజిటల్గా ఉండనుంది. ఇందుకోసం 16 భాషలలో కూడిన మొబైల్ యాప్లను వినియోగించనున్నారు. పౌరులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీయ గణనను కూడా ఎంచుకోవచ్చు. 2027 జనాభా గణనలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే కాకుండా ఓబీసీలు సహా అన్ని కుల సమూహాలను కవర్ చేసేలా కులగణన కూడా ఉండనుంది. ప్రభుత్వ విధాన రూపకల్పన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన, వ్యాపార ప్రణాళికలకు జనగణన ఎంతగానో ఉపయోగపడనుంది.ఇది కూడా చదవండి: అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం -
‘భయంతో చచ్చిపోతున్నాం’.. భారతీయుల తరలింపునకు కేంద్రం ఆపరేషన్!
సాక్షి, ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడుల కారణంగా భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు.. ఇజ్రాయెల్లో ఉన్న వివిధ దేశాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయులకు తరలించేందుకు కేంద్రం ఆపరేషన్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న వేళ ఇరాన్లో విదేశీయుల తరలింపునకు ఆ దేశ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టనుంది. ఇరాన్లో సుమారు పదివేల మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ పేరుతో ఖరారు చేయాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం గగనతలం మూసివేసినందున.. భూసరిహద్దుల మీదుగా విదేశీయులకు తీసుకెళ్లొచ్చని ఇరాన్ విదేశీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్లో తమ పరిస్థితి దినదినగండంగా ఉందని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి వైద్య విద్యార్థి ఇంతిసాల్ మొహిదీన్ మాట్లాడుతూ..‘శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు శబ్దాలతో నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచా. నాతోపాటు చాలామంది బేస్మెంట్కు పరుగులు తీశాం. అప్పటినుంచి మాకు నిద్ర లేని రాత్రులే మిగిలాయి. Indian Embassy in Iran issues an advisory for all Indian nationals and persons of Indian origin currently residing in #Iran.The advisory issued in view of the current situation in Iran.All Indian nationals and Persons of Indian Origin have been asked to follow the Embassy's… pic.twitter.com/aggk1YGaRj— All India Radio News (@airnewsalerts) June 15, 2025ప్రతి రాత్రి పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మేం ఉంటున్న ప్రాంతానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించినట్లు తెలిసింది. టెహ్రాన్లోని షాహిద్ యూనివర్సిటీలో నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాతో పాటు దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ, మేం చాలా భయపడుతున్నాం. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నాం. పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని కోరాడు.మరోవైపు.. ఇరాన్లో తాజా పరిణామాలపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. ఈ సందర్భంగా..‘ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితిని టెహ్రాన్లో భారత ఎంబసీ నిరంతరం గమనిస్తోంది. అక్కడి భారతీయ విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. మిగతా వారి పరిస్థితిని కూడా ఎంబసీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య
దేశ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధితుల సంఖ్య రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా తన భర్త, చిత్ర నిర్మాత కనిపించడంలేదంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా సందేహాల మధ్య కుటుంబం DNA నమూనాలను సమర్పించింది . మరోవైపు అతని మొబైల్ ఫోన్ చివరిగా భయంకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుండి కేవలం 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు.నరోడా-నివాసి మహేష్ కలవాడియా, మహేష్ జిరావాలా (Mahesh Jirawala) అని కూడా పిలుస్తారు. సంగీత ఆల్బమ్లకు దర్శకత్వం వహిస్తాడు. లా గార్డెన్ ప్రాంతంలో ఒకరిని కలవడానికి వెళ్లి, అదృశ్యమైనాడని అతని భార్య హేతల్ ఫిర్యాదు చేసింది."నా భర్త మధ్యాహ్నం 1.14 గంటలకు నాకు ఫోన్ చేసి తన సమావేశం ముగిసిందని, ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో, నేను అతని ఫోన్కు కాల్ చేసాను కానీ అది స్విచ్ ఆఫ్ అయింది. అతని స్కూటర్ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత, అతని మొబైల్ ఫోన్ చివరిగా అతను క్రాష్ సైట్ నుండి 700 మీటర్ల దూరంలో ఉన్నట్లు చూపించింది" అని ఆమె ఆందోళన చెందుతోంది. సాధారణంగా తన భర్త ఈ మార్గంలో ఎపుడూ రాడని, ఏమైందో అర్థం కావడంలేదని హేతల్ తెలిపింది.కాగా గుజరాత్లోని అహ్మదాబాద్లోసర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే మేఘనినగర్లోని ఒక వైద్య కళాశాల ప్రాంగణంలోకి విమానం కూలిపోయింది. AI-171 విషాదకరమైన ప్రమాదం జరిగి మూడు రోజుల తరువాత, ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆసుపత్రి అధికారులు ఆదివారం DNA మ్యాచింగ్ ద్వారా 47 మంది బాధితులను గుర్తించినట్లు నిర్ధారించారు. అధికారులు 24 మృతదేహాలను బాధితుల కుటుంబాలకు అప్పగించారని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. భయంకరమైన విషాదంలో బాధితుల గుర్తించేందుకు ధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
లక్నో: తప్పిన ఘోర విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన మరువక ముందే.. వరుస ఉదంతాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా లక్నో ఎయిర్పోర్టులో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. విమానం టైర్ భాగం నుంచి నిప్పు కణికలు ఎగసి పడ్డాయి. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో 250 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన విమానం హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉదయం లక్నో ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే.. ల్యాడింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ నుంచి నిప్పు కణికలు ఎగసి పడడం సిబ్బంది గమనించారు. విమానం ట్యాక్సీ వేకి చేరుకోగానే.. ప్రయాణికులందరినీ దించేశారు. #BREAKİNG लखनऊ एयरपोर्ट पर बड़ा हादसा टला सऊदी से आए विमान में तकनीकी खराबी लखनऊ एयरपोर्ट पर लैंडिंग के वक्त खराबी लैंडिंग के वक्त विमान के पहिए से निकली चिंगारी#LUCKNOW #LucknowAirport #SV3112 #JeddahToLucknow #planecrash #flightaccident #SaudiArabia pic.twitter.com/GALwi6Q78g— Ritika Rajora (Tv100 News) (@Rrajora07) June 16, 2025ఎడమ టైర్ వద్ద ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించారు. ఆ వెంటనే ఆర్పేశారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని.. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.జూన్ 12వ తేదీన అహ్మబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలి పేలిపోయింది. విమానంలోని 241 మందితో పాటు కింద జనావాసాలపై కూలడంతో మరో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నివ్వెర పోయేలా చేసింది. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో భారత ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. -
‘స్మార్ట్ సిటీ’ చీటింగ్: 70 వేలమంది నుంచి రూ. 2,700 కోట్లు సేకరించి..
జైపూర్: రాజస్థాన్లో ‘స్మార్ట్ సిటీ’ పేరిట భారీ మోసం చోటుచేసుకుంది. సుభాష్ బిజ్రానీ, రణవీర్ బిజ్రానీ అనే సోదరులు వారి భాగస్వాములతో కలసి, సుమారు 70,000 మంది నుంచి రూ. 2,676 కోట్లను సేకరించి, మోసానికి పాల్పడ్డారు. సికార్ జిల్లాకు చెందిన వీరు ‘నెక్సా ఎవర్గ్రీన్’ అనే కంపెనీని స్థాపించారు. ‘ధోలేరా స్మార్ట్ సిటీ’లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, వేలమందిని మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తొలుత వీరు ‘ధోలేరా స్మార్ట్ సిటీ’ పేరుతో ప్రాజక్టు చిత్రాలను రూపొందించి, పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు. ఈ పథకంలోని ప్రతీ స్థాయిలో మంచి ఆదాయం, కమిషన్లు, ఇతర బహుమతులను ఉంటాయని నమ్మబలికారు. వినియోగదారులు తమ పెట్టుబడుల విషయంలో కొన్ని స్థాయిలు దాటిన తరువాత వారికి ల్యాప్టాప్లు, బైక్లు, కార్లు తదితర రివార్డులు అందిస్తామని తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రత్యేక ఐడీ ఇచ్చి, ఈ పథకంలో మరింతమందిని చేర్చుకోగలిగితే, అదనపు కమిషన్లు కూడా ఇస్తామని సుభాష్ బిజ్రానీ, రణవీర్ బిజ్రానీలు హామీ ఇచ్చారు.ఈ ప్రాజెక్టు కోసం రణ్వీర్ బిజారాణి 2014లో ధోలేరాలో భూమిని కొనుగోలు చేశాడు. తరువాత అతని సోదరుడు సుభాష్ బిజ్రానీ ఈ పథకంలో రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ ‘నెక్సా ఎవర్గ్రీన్’ను స్థాపించి, దానిని 2021లో అహ్మదాబాద్లో రిజిస్టర్ చేయించారు. తమ కంపెనీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ధోలేరా స్మార్ట్ సిటీ' ప్రాజెక్టు చేపట్టిందని అందరికీ చెప్పారు. దీనిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చబోతున్నామని వివరించారు. ఈ నేపధ్యంలో 70 వేల మందికి పైగా జనం వీరి పెట్టుబడి పథకాలలో చేరగా, సుమారు రూ.2,676 కోట్లు ఈ సోదరుల ఖాతాలో జమ అయ్యాయి.ఈ మొత్తంతో వారు రాజస్థాన్లో లగ్జరీ కార్లు, గనులు, హోటళ్ళు, అహ్మదాబాద్లో ఫ్లాట్లు, గోవాలో 25 రిసార్ట్లను కొనుగోలు చేశారు. వారు రూ.250 కోట్ల నగదు ఖర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఇంతలో వీరు మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చిన దరిమిలా, ఈ ఇద్దరు సోదరులు తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసి పరారయ్యారు. దీనిపై రాజస్థాన్లోని జోధ్పూర్లోని పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ‘నెక్సా ఎవర్గ్రీన్’కు చెందిన మనీలాండరింగ్పై దర్యాప్తు చేపట్టిన, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జైపూర్, సికార్, జున్జును, అహ్మదాబాద్లోని 25 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. కాగా ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది కేంద్రం, గుజరాత్ సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు. దీనిలో అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీల కార్యాలయాలను నిర్మిస్తున్నారు. దీనిని 2042 నాటికి పూర్తిచేయాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు -
‘శ్రీహరి కోట’కు బాంబు బెదిరింపు.. ముమ్మర తనిఖీలు
శ్రీహరి కోట: ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం ‘షార్’కు ఈరోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. తమిళానాడు కంమాండ్ కంట్రోల్కు ఈ బెదిరింపు ఫోను కాల్ అందింది. ఈ నేపధ్యంలో అంతరిక్ష కేంద్రంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఇటీవల భారత్ , పాక్ మధ్య దాడులు జరిగిన సమయంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే పోర్టులు ఎయిర్ పోర్టులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో ఆయా ప్రాంతాల్లో భద్రతను మరింతగా పెంచారు. ఇదే సమయంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం ‘షార్’ వద్ద భద్రతా దళాలును మొహరించారు. ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
Air India plane crash: భార్య చెప్పిందని.. ప్రమాదం నుంచి తప్పించుకున్న వైద్యుడు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న గుజరాత్కు చెందిన ఒక వైద్యుడు తన భార్య, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఇంటిలోనివారి మాట కాదని, ఒకవేళ అతను ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణించి ఉంటే, ఇప్పుడు మన మధ్య ఉండేవాడు కాదు.ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందారు. గుజరాత్కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులతో పాటు మే 24న గుజరాత్లోని మహిసాగర్కు వచ్చారు. భారతదేశంలో తన కుటుంబాన్ని ఉంచి, జూన్ 12న బ్రిటన్లోని నార్తాంప్టన్కు తిరిగి వెళ్లాలని ఆయన అనుకున్నారు. (Air India Plane Crash: నా భర్త కనిపించడం లేదు : ఫిల్మ్ మేకర్ భార్య)‘నేను జూన్ 12న ఒక్కడినే లండన్ వెళ్లవలసి ఉంది. అయితే జూన్ 9న నాకు తీవ్ర జ్వరం వచ్చింది. మరుసటి రోజు ఉదయానికి జ్వరం మరింతగా పెరిగింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన నా భార్య.. జూన్ 12న బుక్ చేసుకున్న విమానం టికెట్ను రద్దు చేసుకుని, ఆరోగ్యం కుదుటపడేవరకూ ఇక్కడే ఉండమని కోరింది. దీంతో నేను విమానం టిక్కెట్ రద్దు చేసుకున్నాను. తరువాత జూన్ 15కి తిరిగి టికెట్ బుక్ చేసుకున్నాను. ఇప్పుడు విమాన ప్రమాద వార్త వినగానే దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆ దేవుడే నన్ను కాపాడాడు. విమాన ప్రమాదంలో మరణించినవారికి భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని డాక్టర్ ఉమాంగ్ పటేల్ అన్నారు. ఆయన గత ఐదేళ్లుగా నార్తాంప్టన్లో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
వాడితో తిరగడం మానుకో బిడ్డా.. ఇంతలోనే..
సాక్షి, రాయచూరు: ప్రేమించిన పాపానికి అమ్మాయిని ఆరు నెలల క్రితం హత్య చేసి పాతిపెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన కారణంగానే హత్య చేసినట్టు ప్రియుడు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గదగ్ తాలూకా నారాయణపుర గ్రామంలో మధుశ్రీ (21) అనే యువతిని సతీష్ హిరేమఠ (22) అనే యువకుడు ప్రేమించాడు. ప్రేమ పేరుతో షికార్లకు తీసుకెళ్లాడు. ఐదేళ్ల నుంచి ఈ ప్రేమాయణం సాగుతోంది. ఇది నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు హిరేమఠతో తిరగడం మానుకోవాలని ఆమెను హెచ్చరించి గదగ్లోని బంధువుల ఇంట్లో ఉంచారు. గత ఏడాది డిసెంబర్ 16న గదగ్ నుంచి మధుశ్రీ వెళ్లిపోయింది. ఈ ఏడాది జనవరి 12న బెటగేరి పోలీస్ స్టేషన్లో కనబడుట లేదనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సతీష్ హిరేమఠ్పై అనుమానంతో పోలీసుల విచారణ జరిపారు.పెళ్లి చేసుకోమనడంతో..ఇద్దరూ బైక్లో వెళ్తున్నట్లు గదగ్లో కొన్ని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టిగా విచారించగా నిందితుడు నిజం కక్కాడు. పెళ్లి చేసుకోవాలని మధుశ్రీ ఒత్తిడి చేసింది.. తనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపి, వాగులో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపాడు. అనంతరం, గదగ్ యస్ఐ మారుతి, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా యువతి అస్తిపంజరం కనిపించింది. ప్రేమోన్మాది చేతిలో బలయ్యావా తల్లీ అని తల్లిదండ్రులు విలపించారు. -
పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ
న్యూఢిల్లీ: కాంగ్రెస్- బీజేపీల మధ్య మరోమారు దుమారం చెలరేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన సైనిక కవాతుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను అమెరికా ఆహ్వానించిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. అమెరికా ఈ నకిలీ వార్తలను ఖండించిందని పేర్కొన్న బీజేపీ.. పాకిస్తాన్న్కు కాంగ్రెస్ మౌత్పీస్గా మారిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ వైఖరి అంతర్జాతీయ వేదికపై భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిందని పేర్కొంది.పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ పేర్కొన్నారని, దీనిపై విలేకరుల సమావేశంలో ప్రస్తావించారని, అయితే మునీర్ అమెరికా వెళ్లడం లేదని తేలిందని బీజేపీ నేత చెందిన నిషికాంత్ దూబే మీడియాకు తెలిపారు. కాంగ్రెస్.. పాక్కు మౌత్ పీస్ మాదిరిగా ప్రవర్తిస్తూ, ప్రజలను ఇలా తప్పుదారి పట్టిస్తున్నదని, పాకిస్తాన్ ముస్లిం లీగ్- జైరామ్ రమేష్ మధ్య తేడా ఏమిటని దూబే ప్రశ్నించారు. पाकिस्तान मुस्लिम लीग और कांग्रेस पार्टी में कोई अंतर है तो हमें ज़रूर बताएँ https://t.co/DhjDypN3Fa— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 15, 2025ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం, ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ పరిణామాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల విదేశాంగ విధానమే కారణమని దూబే ఆరోపించారు. దీనికి ఉదాహరణగా 1970లనాటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న కెనడా కేసును ఆయన ఉదహరించారు. 1970- 1984 మధ్య కాలంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఖలిస్తానీలపై చర్య తీసుకోవాలని కోరుతూ, కెనడా ప్రధాని పియరీ ఎలియట్ ట్రూడోకు ఏడు లేఖలు రాశారని, అయితే వాటిపై ఎటువంటి అర్థవంతమైన స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఇరాన్ వరుస క్షిపణి దాడులు.. ఇజ్రాయెల్లో నిరంతర హెచ్చరిక సైరన్లు -
గల్వాన్ గాయానికి ఐదేళ్లు.. కల్నల్ సంతోష్ సహా 20 మంది వీరమరణం
సాక్షి, నేషనల్ డెస్క్: గల్వాన్ లోయ ఘర్షణ. నిరాయుధులైన భారత జవాన్లపై చైనా సైనికులు చేసిన సాయుధ దాడి. మూడు వందలకు పైగా సైనికులు దొంగ దెబ్బ తీసినా.. భారత జవాన్లు వెన్ను చూపలేదు. ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు. ఈ వీరోచిత పోరాటంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కో ల్పోయారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ గల్వాన్ ఘర్షణ జరిగి జూన్ 15తో ఐదేళ్లయింది. ఇది భారత్, చైనా మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మన సరిహద్దు రక్షణ, వ్యూహాల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సరిహద్దులో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడమే కాదు.. సైనిక సంసిద్ధతను కూడా భారత్ పెంచింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కాస్త మెరుగుపడ్డాయి.ఐదేళ్లలో అభివృద్ధి గల్వాన్ ఘటన తరువాత మన ఆర్మీ వాస్తవా«దీన రేఖ వెంబడి, ప్రత్యేకించి తూర్పు లడఖ్లో సాయుధ దళాలను అధిక మొత్తంలో పెంచింది. అలాగే.. యుద్ధ పరికరాలను కూడా మహరించింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. గల్వాన్ సంఘటన ముఖ్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ జరిగింది. కేంద్రం 2024లోనే రూ.2,236 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే కంటే 9.53% ఎక్కువ. ఇందులో రూ.7,146 కోట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)కు కేటాయించారు.వీటితో లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మించారు. వీటిలో ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మోటారు రహదారి నిర్మాణంతోపాటు ప్రస్తుతం నిర్మిస్తున్న న్యోమా ఎయిర్ఫీల్డ్, షింకు లా మధ్య సొరంగం కూడా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ వెంబడి డిజిటల్ ల్యాండ్స్కేప్ కూడా మారిపోయింది. భారత సైన్యం, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా గల్వాన్, డెమ్చోక్తో సహా లడఖ్లోని మారుమూల గ్రామాలను 4జీ నెట్వర్క్ను అనుసంధానించారు. ఇది టెలిమెడిసిన్, డిజిటల్ విద్య, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి తోడ్పడింది. అంతేకాదు.. దీనివల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెంది, స్థానికుల జీవనోపాధిని మెరుగుపడింది.దౌత్యంలో పురోగతి... దౌత్య పరంగానూ ఇరు దేశాలు పురోగతిని సాధించాయి. 2020 నుంచి ఇప్పటివరకూ వివిధ స్థాయిల్లో 30 దశలకు పైగా చర్చలు జరిగాయి. అనేక ఘర్షణ పాయింట్ల నుంచి సైనాన్ని ఉపసంహరించుకున్నారు. జూలై 2020లో గల్వాన్, ఫిబ్రవరి 2021లో పాంగోంగ్ త్సో, ఆగస్టు 2021లో పీపీ17ఏ (గోగ్రా–హాట్ స్ప్రింగ్స్), సెపె్టంబర్ 2022లో పీపీ15, అక్టోబర్ 2024లో డెమ్చోక్, డెప్సాంగ్లలో చైనా తమ శిబిరాలను తొలగించింది. వీటితోపాటు అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలు జరిగాయి. ఈ ఫలితంగా మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభమైంది.ఇక ఈనెల 12న భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్తో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా చర్చించారు. వీసాను సులభతరం చేయడంతోపాటు మీడియా మార్పిడి, 75 సంవత్సరాల భారతదేశం–చైనా దౌత్య సంబంధాల స్మారక వేడుకలపైనా చర్చించారు. అయితే... ఆయా ప్రాంతాల నుంచి సైన్యాన్ని పాక్షికంగా ఉపసంహరించి నప్పటికీ భారత్ అప్రమత్తంగానే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి నిఘా కొనసాగిస్తోంది. ఆరోజు ఏం జరిగింది?..భారత్–చైనా సరిహద్దులోని గల్వాన్ నది కీలకమైన ప్రాంతం. ఇక్కడ చైనా బలగాలు వాస్తవా«దీన రేఖను దాటి ముందుకొచ్చాయి. వారిని మన జవాన్లు అడ్డుకోవడంతో పలుమార్లు ఘర్షణ జరిగింది. పరిస్థితి తీవ్రమవ్వడంతో సమావేశమైన ఇరు దేశాల ఆర్మీ అధికారులు బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. గల్వాన్లోని భారత భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి, తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు జవాన్లతో కలిసి వెళ్లారు. చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్ బృందం వాటిని నేలమట్టం చేసింది. దాంతో చైనా సైనికులు మన జవాన్లపై దాడికి దిగారు. వంద మంది కూడా లేని భారత జవాన్లపై 300 మందికి పైగా చైనా సైనికులు దాడికి తెగబడ్డారు. అయినా ఈ దొంగ దెబ్బను మనవాళ్లు తెగువతో ఎదుర్కొన్నారు. జూన్15న సాయంత్రం మొదలైన మారణకాండ అర్ధరాత్రి దాకా సాగింది. అక్కడ ఆయుధాలు వాడకూడదన్న ప్రోటోకాల్ను మన సైనికులు పాటించగా చైనా ముష్కరులు మాత్రం ముందే ఏర్పాటు చేసుకున్న ఇనుప రాడ్లతో దాడికి దిగారు. గాయపడ్డ మన సైనికులను గల్వాన్ నదిలో తోసేశారు. ఈ క్రమంలో కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ తీవ్ర గాయాలపాలయ్యారు. అయినా యుద్ధమైదానం వీడలేదు. తోటి జవాన్లను వెన్నంటి నడిపించారు. ఈ ఘర్షణలో ఆయనతో పాటు 20 మంది జవాన్లు ప్రాణాలరి్పంచారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఆ సంఖ్యను అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు. 41 మంది గాయపడ్డారని ప్రకటించింది. చైనా 41 మంది సైనికులను కోల్పోయినట్టు రష్యా, ఆ్రస్టేలియా పరిశోధన తేల్చింది. -
విద్యార్థులతో గుంజిళ్లు.. టీచర్కు సర్కార్ నోటీసు
తిరువనంతపురం: విద్యార్థినుల చేత గుంజిళ్లు తీయించినందుకు ప్రభుత్వం ఉపాధ్యాయురాలికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన కేరళలోని కాటన్హిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. పాఠశాల ముగిసిన అనంతరం జాతీయ గీతం ఆలపిస్తారు. కార్యక్రమం జరుగుతుండగానే కొందరు విద్యార్థినులు తరగతి గదినుంచి బయటికి వెళ్లిపోయారు. అది చూసిన టీచర్ వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. జాతీయగీతం పాడుతుండగా వెళ్లిపోయిన విద్యార్థినులను గుంజిళ్లు తీయించారు. దీంతో ఆయా విద్యార్థినులు స్కూల్ బస్సును మిస్సయ్యారు. తమ పిల్లలు రోజూకంటే ఆలస్యంగా ఇంటికి రావడంతో వారిని ప్రశ్నించిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది. ఇది విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఎలాంటి వివరణ లేకుండానే విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి ఆదివారం ఉపాద్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. జిల్లా విద్యాశాఖాధికారి నివేదిక మేరకు.. నోటీసులు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. -
సైప్రస్ చేరుకున్న ప్రధాని మోదీ
నికోసియా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం సైప్రస్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడ్స్తో ఆయన చర్చలు జరుపుతారు. లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అధ్యక్షుడు క్రిస్టోడౌలిడ్స్ స్వయంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని ఒకరు సైప్రస్లో పర్యటించడం రెండు దశాబ్దాల కాలంలో ఇదే ప్రథమం.సైప్రస్ అధ్యక్షుడితో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల వంటి రంగాల్లో బంధాన్ని దృఢతరం చేసుకునేందుకు అవకాశముందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో తెలిపారు. ప్రధాని మోదీ తమ దేశానికి రావడం చారిత్రక సందర్భమని క్రిస్టోడౌలిడ్స్ తెలిపారు. స్థానిక హోటల్లో ప్రధాని మోదీ బస చేశారు. ఈ సందర్భంగా ‘వందే మాతరం, భారత్ మాతా జీ జై’ అంటూ భారత సంతతి ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాలో జరిగే జీ7 శిఖరాగ్రానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. -
47మృతదేహాల గుర్తింపు
అహ్మదాబాద్: ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆదివారానికి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ సహా 47 మంది మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. 24 మృతదేహాలను సంబందీకులకు అప్పగించారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేశారు. ఎయిరిండియా డ్రీమ్లైనర్ గురువారం కుప్పకూలిన ఘటనలో రుపానీ సహా 242 మంది ప్రయాణికులు మృత్యువాతపడగా ఒకే ఒక్క వ్యక్తి సజీవంగా బయటపడటం తెల్సిందే. విమానం పడిన ప్రాంతంలో ఉన్న ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా 33 మంది సైతం ప్రాణాలు కోల్పోయారు.గుర్తు పట్టలేనంతంగా మాడి మసవ్వడంతో అధికారులు సంబందీకుల నుంచి సేకరించిన డీఎన్ఏ ద్వారా మృతదేహాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. 230 మంది ప్రయాణికుల చిరునామాలు సేకరించారు. మృతి చెందిన ప్రయాణికుల్లో ముగ్గురి సంబం«దీకులు మాత్రం ఇప్పటి వరకు డీఎన్ఏ నమూనాలను ఇవ్వలేదని చెప్పారు. మిగతా వారి విషయంలో సంబందీకులకు డెత్ సర్టీఫికెట్లను సైతం అందజేస్తున్నామన్నారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఆదివారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఘటనా క్రమాన్ని అధికారులు ఆయనకు వివరించారు.క్షతగాత్రులను పీకే మిశ్రా పరామర్శించారు. విమాన ప్రమాదానికి కారణాలపై ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రధానంగా దర్యాప్తు జరుపుతోంది. ఆదివారం ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన విదేశీ బృందానికి అహ్మదాబాద్ ఫైర్ బ్రిగేడ్ అధికారులు వివరాలను అందించారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ఢిల్లీలో మొదటిసారిగా సమావేశం కానుంది. మూడు నెలల్లోగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనుంది. -
సాంకేతిక లోపంతో రన్వేపై ఆగింది!
గువాహటి: అహ్మదాబాద్ ప్రమాదాన్ని మరవకముందే గువాహటి– కోల్కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికుల్ని హడలెత్తించింది. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు. శనివారం రాత్రి 9.20 గంటలకు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో రన్వేపై ఆపేశారు. ప్రయాణికులు రెండుసార్లు విమానం దిగాల్సి వచ్చింది.దీనిపై దుమ్మెత్తిపోసతఊ వారు పోస్ట్ చేసిన వీడియోలు వైరలయ్యాయి. ‘‘అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో మమ్మల్ని కిందికి దిగమన్నారు. చౌక హోటల్లో వసతి కల్పించారు. కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. ఆదివారం ఉదయం 9.30కు విమానం ఎక్కించి, కాసేపటికే మళ్లీ దించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.34కు మరో విమానంలో కోల్కతా బయలుదేరాం’’ అని ఓ ప్రయాణికుడు తెలిపారు. వారి ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. ‘‘నగరంలోని బెస్ట్ హోటల్లో వసతి కల్పించాం. మా సిబ్బందీ అందులోనే ఉన్నారు’’ అని చెప్పింది. సమస్యలేమిటో మాత్రం వెల్లడించలేదు. -
దాడులే దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/జెరూసలేం: ఇజ్రాయెల్, ఇరాన్ ఆదివారం వరసగా మూడో రోజూ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు గ్యాస్, చమురు శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేసింది. క్షిపణి దాడులతో టెహ్రాన్ దద్దరిల్లిపోయింది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు తదితరాల జోలికి రావొద్దని ఇరాన్ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. వాటిపై దాడులు చేస్తే కనీవినీ ఎరగని రీతిలో సైనిక శక్తిని ప్రయోగించి ఇరాన్ను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు. తక్షణం దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటేనే దాడులు తగ్గుముఖం పడతాయని పునరుద్ఘాటించారు.ఊపిరి సలపనివ్వని ఇజ్రాయెల్ ఇరాన్కు ఏమాత్రం సమయమివ్వకుండా టెహ్రాన్, సమీప ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. టెహ్రాన్లో పౌర భవన సముదాయంపై దాడిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది చిన్నారులే! ఇప్పటిదాకా 406 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ‘ది సౌత్ పార్స్’ సహజవాయువు ప్రాసెసింగ్ ప్లాంట్ దాడిలో దారుణంగా దెబ్బతింది.పర్షియన్ గల్ఫ్లో బుషెహర్ ప్రావిన్సులోని చమురుశుద్ది కర్మాగారమూ మంటల్లో చిక్కుకుంది. షహ్రాన్ ఆయిల్ డిపోపైనా దాడులు జరిగాయి. ‘‘ఆయుధాల ఉత్పత్తి కేంద్రాల నుంచి సిబ్బంది పారిపోండి. వాటిపై దాడులు చేయబోతున్నాం. అణు విద్యుత్కేంద్రాల సమీప ప్రాంతాల పౌరులూ పారిపొండి’’ అని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇస్ఫహాన్ అణువిద్యుత్ కేంద్రంపై మరోసారి దాడులు చేసినట్టు ప్రకటించింది.క్షిపణులతో హోరెత్తించిన ఇరాన్ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. యుద్ధవిమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. హైఫా సిటీలో చమురుశుద్ది కర్మాగారంపై దాడులు చేయడంతో పైప్, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నాయి. దాడుల్లో ఇప్పటిదాకా 14 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 390 మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. టెల్అవీవ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వరుసగా మూడోరోజు మూసేశారు. టెల్అవీవ్ వీధుల్లో కుప్పకూలిన భవనాలు, కాలిపోయిన కార్లు, బద్దలైన కిటికీలు, తలుపులూ దర్శనమిస్తున్నాయని అసోసియేటెట్ ప్రెస్ రిపోర్టర్ తెలిపారు.టెల్ అవీవ్కు దక్షిణాన బాట్యామ్ ప్రాంతంలోని 8 అంతస్తుల అపార్ట్మెంట్ క్షిపణి దాడుల్లో ధ్వంసమైంది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా 35 మంది జాడ గల్లంతైంది. పలువురిని రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి కాపాడాయి. ఘటనాస్థలిని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సందర్శించారు. ఇరాన్ కావాలనే జనావాసాలపైనే దాడులు చేస్తోందని మండిపడ్డారు.దీనికి భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధం నేపథ్యంలో కుమారుడు అవ్నర్ వివాహ వేడుకను వాయిదా వేసుకుంటున్నట్టు నెతన్యాహూ వెల్లడించారు. అటు హమాస్, ఇటు ఇరాన్ దాడులతో దేశమంతా యుద్ధంలో మునిగి తేలుతుంతే ఇంట్లో పెళ్లి సంబరాలు చేసుకుంటారా అంటూ విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఖమేనీ హత్యకు ప్లాన్!వారించిన ట్రంప్ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు సమాచారం! అమెరికా ఈ మేరకు వెల్లడించింది. ‘‘అందుకు సర్వం సిద్ధమైంది. వద్దంటూ అధ్యక్షుడు ట్రంప్ వారించడంతో వెనక్కు తగ్గింది’’అని లేదంటే ఖమేనీని చంపడం పెద్ద పని కాదని ఇజ్రాయెల్ వర్గాలు అన్నాయి.వెంటనే ఆపగలను: ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణను ఇప్పటికిప్పుడు ఆపేయగలనని ట్రంప్ చెప్పుకున్నారు. ‘‘ఆ దేశాలను నిలువరించి ఈ రక్తపాతాన్ని ఆపడం నాకు చాలా తేలిక. ఈ రగడతో అమెరికాకు సంబంధం లేదు. ఇజ్రాయెల్కు మేం ఎలాంటి సాయమూ చేయడం లేదు’’ అని చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరాయి.మీరు ఆపితే మేమూ ఆపుతాందాడులవేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపితే తామూ దాడులను నిలిపేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ‘‘మాకు యుద్ధ విస్తరణ కాంక్ష లేదు. కానీ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోంది. అందుకే బుషెహర్ ప్రావిన్సులో ఖతార్తో కలిసి ఇరాన్ నిర్వహిస్తున్న అసాలుయే ఆయిల్ రిఫైనరీపై దాడి చేసింది’’ అంటూ మండిపడ్డారు.తమ ఆర్థికమూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని దుయ్య బట్టారు. ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య ఆదివారం జరగాల్సిన ఆరో విడత కీలక అణు చర్చలు రద్దయ్యాయి. ఇజ్రాయెల్ను తమపైకి ఎగదోస్తున్న అమెరికా చర్చలు అర్ధరహితమని ఇరాన్ ప్రకటించింది. చర్చలకు సాయపడేందుకు బ్రిటన్, ఫ్రాన్స్తో పాటు తామూ సిద్ధమని జర్మనీ పేర్కొంది. -
కుప్పకూలిన హెలికాప్టర్
రుద్రప్రయాగ్/న్యూఢిల్లీ: భక్తిశ్రద్ధలతో చార్ధామ్ యాత్ర చేస్తున్న యాత్రికులను ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున హిమ సానువుల్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకుని తిరిగొస్తున్న భక్తులు హెలికాప్టర్ కూలి ప్రాణాలు కోల్పోయారు. గౌరీకుండ్ అడవుల్లో ఈ దారుణం జరిగింది. రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి నందన్ సింగ్ రజ్వార్ వివరాలను వెల్లడించారు. ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన బెల్ 407 హెలికాప్టర్ ఉదయం 5.19 గంటలకు కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ బయల్దేరింది.కాసేపటికే కేదార్ఘాటీలో గౌరీకుండ్, త్రిజుగ్ నారాయణ్ ప్రాంతాల మధ్య అడవిలో కుప్పకూలింది. అందులోని ఏడుగురూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన జంట, వారి రెండేళ్ల పాప, పైలట్తో పాటు బద్రీనాథ్–కేదార్నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు విక్రమ్ సింగ్ రావత్ కూడా ఉన్నారు. పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ ఆర్మీలో 15 ఏళ్లపాటు పైలట్గా చేశారు.కేదార్నాథ్లో హెలికాప్టర్లు అటూ ఇటూ ఎత్తైన పర్వతాల మధ్య లోయ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతికూల వాతావరణం, మేఘావృతమైన పొగమంచు గుండా ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ప్రమాదానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలవారు.నెలన్నరలో ఐదో ప్రమాదంఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర మొదలైనప్పటి నుంచి హెలికాప్టర్లు కూలిపోవడం ఐదోసారి. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలను రెండు రోజులు నిలిపేస్తున్నట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్యన్ ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేస్తూ డీజీసీఏ ఆదేశాలిచ్చింది. కేదార్నాథ్ లోయలో రాకపోకలు సాగించే అన్ని హెలికాప్టర్ల నాణ్యత, సామర్థ్యాలను తక్షణం సమీక్షించేందుకు అధికారులను పంపుతోంది.దుర్ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) సమగ్ర దర్యాప్తు చేయనుంది. ‘‘ఇలాంటి ఘటనల్లో జవాబుదారీతనం పెంచాలి. దర్యాప్తు, భద్రతా ప్రమాణాల అంశంలో కేంద్ర, రాష్ట్రాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. -
ఎండ ప్రచండం!
జూన్ 14 వరకు తీవ్రమైన వడగాడ్పులు.. వాయవ్య భారతానికి వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక.పంజాబ్, హరియాణాలకు రెడ్ అలర్డ్. వచ్చే 48 గంటల్లో భానుడి ఉగ్రరూపం అంటూ జూన్ 12న ఐఎండీ మరో హెచ్చరిక.వేసవి వెళ్లిపోయింది. ఉష్ణోగ్రత ఉండిపోయింది! దేశంలోని అన్ని ప్రాంతాలను వడగాడ్పులు చుట్టు ముట్టాయి. ఇది ప్రస్తుతం.– సాక్షి, స్పెషల్ డెస్క్2030 నాటికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, వంటి నగరాల్లో వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే రెట్టింపు కానుందట. టైర్ –1, 2 సిటీల్లో 72 శాతం వాటికి తీవ్ర వేడిమి, భారీ వర్షాల ముప్పు పొంచి ఉందట. ఐపీఈ గ్లోబల్ – ఎస్రి ఇండియా సంయుక్త అధ్యయనం ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.భానుడి ప్రతాపానికి పంజాబ్, హరియాణా, రాజస్తాన్ తల్లడిల్లిపోతున్నాయి. ఢిల్లీలో రెడ్ అలెర్ట్. స్కూళ్లు బంద్. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుండి జూన్ 10 వరకు దాదాపు 700 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ చరిత్రలోనే ‘హాటెస్ట్ ఇయర్’గా 2024 నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో భారత్లో సెగలు రేగుతున్నాయి. భవిష్యత్తుల్లో వేసవి కాలం.. మరిన్ని రోజులు ఉండనుందట. వడగాడ్పుల తీవ్రత మరింత పెరగనుందట. ఒకపక్క భారీ వర్షాలు.. మరోపక్క పిడుగుల వర్షం కురవనుంది. మానవాభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాల్లో పనిచేసే ఐపీఈ గ్లోబల్; భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)పై పనిచేసే ఎస్రి ఇండియా సంయుక్తంగా దేశంలో తీవ్ర వేడి, అత్యంత వర్షపాతం అంశాలపై అధ్యయనం చేశాయి. జిల్లా స్థాయిలో సమస్య తీవ్రతను మ్యాపింగ్ చేశాయి. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ప్రజారోగ్య వ్యవస్థలను పర్యావరణ ఉత్పాతాలను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.పదింట 8 జిల్లాల్లో...1993 నుంచి చూస్తే.. వేసవిలో తీవ్రమైన వడగాడ్పులు ఉండే రోజులు 15 రెట్లు పెరిగాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వేడి, భారీ వర్షాలు.. ఇలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2040 నాటికి.. ప్రతి 10 కోస్తా జిల్లాల్లోనూ 8 జిల్లాల్లో వేసవి ముగిసినా తీవ్ర వేడి, ఉక్కపోత వంటివి వర్షాకాలంలో కూడా నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా.. రియల్టైమ్లో వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఒక క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ) ఏర్పాటును ఈ అధ్యయనం సూచించింది. జీడీపీలో 4.5 శాతం తగ్గుదలఎండ దెబ్బకు ఆర్థిక నష్టం కూడా పెరిగే ముప్పు పొంచి ఉంది. 2030 నాటికి భారతదేశం అంచనా వేసుకున్న 8 కోట్ల ప్రపంచ ఉద్యోగాలలో 3 కోట్ల 40 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా పని గంటల్ని కోల్పోయే పరిస్థితి ఉండటంతో ఈ దశాబ్దంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో 4.5 శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది.తీవ్రం.. సాధారణం!తీవ్రమైన వాతావరణం అన్నది ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది. దీన్ని కనిపెట్టి, మార్చుకోవాలంటే మనకు భౌగోళిక ఉపకరణాలు చాలా అవసరం. – అజేంద్రకుమార్, ఎమ్.డి., ఎస్రివాతావరణ అస్థిరతలు పసిగట్టాలివాతావరణం, అభివృద్ధి అనేవి పరస్పర అవినాభావ సంబంధం ఉన్నవి. భారత్ సహా గ్లోబల్ సౌత్గా పిలిచే దేశాలన్నింటి ముందూ ఇప్పుడు ఒక సమస్య ఉంది. అదేంటంటే.. వాతావరణ అస్థిరతలను పసిగట్టి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలనూ పెంచాలి. – అశ్వజిత్ సింగ్, వ్యవస్థాపకుడు, ఎమ్.డి., ఐపీఈ గ్లోబల్కోస్తా ప్రాంతాల్లోనే ఎక్కువభారతదేశం అంతటా వడగాడ్పులు వీచే రోజులు 2030, 2040 నాటికి గణనీయంగా పెరుగుతాయని అంచనా. ప్రాంతాల వారీగా వడగాడ్పు రోజుల సంఖ్యలో పెరుగుదల అంచనాలు.. -
ఇంతింతై.. కాస్తంతై..
భారత ఐటీ పరిశ్రమలోని 5 అగ్రశ్రేణి సంస్థల్లోని మొత్తం ఉద్యోగుల్లో.. నాలుగింట మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో మొత్తం మహిళా ఉద్యోగుల సంఖ్య మూడింట పెరిగింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువే ఉంది. కానీ సీనియర్ స్థాయిల్లో మాత్రం బాగా తగ్గింది. ఐటీ కంపెనీల్లో స్త్రీ, పురుష ఉద్యోగుల మధ్య వేతన అంతరం కూడా ఎక్కువగా ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశీయ ఐటీ రంగంలో మహిళలు గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. మనదేశంలోని అగ్రశ్రేణి 5 కంపెనీల్లో నాలుగు సంస్థలు 2024–25లో తమ ఉద్యోగుల్లో మహిళల వాటా తగ్గినట్లు నివేదించాయి. మొత్తం మీద ఈ ఐదు కంపెనీలు 2024 మార్చి నుండి 2025 మార్చి వరకు నికరంగా 27,000 మందికిపైగా మహిళలను కొత్తగా చేర్చుకున్నట్లు వెల్లడించాయి.విప్రో మినహా...: మహిళా సిబ్బంది వాటా 2023–24లో 35.6 శాతం నుండి 2024–25లో 35.3 శాతానికి తగ్గిందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నివేదించింది. ఇన్ఫోసిస్లో ఈ సంఖ్య 39.3 నుండి 39 శాతానికి వచ్చి చేరింది. హెచ్సీఎల్ టెక్లో మహిళా ఉద్యోగుల వాటా 29.1 నుండి 28.8 శాతానికి తగ్గింది.క్యాలెండర్ ఇయర్ అకౌంటింగ్ (జనవరి–డిసెంబర్)ను అనుసరించే కాగ్నిజెంట్లో మొత్తం ఉద్యోగుల్లో మహిళా సిబ్బంది వాటా 2023లో 38.8 నుంచి 2024లో 38 శాతానికి పరిమితమైంది. విప్రో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు. ఈ సంస్థలో మహిళామణుల సంఖ్య 2023–24తో పోలిస్తే 36.6 నుండి గత ఆర్థిక సంవత్సరంలో 37.1 శాతానికి పెరిగింది. సీనియర్ స్థాయిల్లో తగ్గుతోంది..: మన సమాజంలోని లింగ అసమానతలు, సాంస్కృతిక సవాళ్ల కారణంగా మహిళా ఉద్యోగుల వాటా స్తబ్దుగా ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ చెబుతోంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నప్పటికీ.. సీనియర్ స్థాయిల్లో వారి సంఖ్య బాగా తగ్గుతోందని వెల్లడించింది. సీనియర్ నాయకత్వం విషయంలో చాలా సంస్థలలో మహిళల నిష్పత్తి సింగిల్ డిజిట్లోనే ఉంది. టీసీఎస్లో అగ్రశ్రేణి జట్టులో మహిళలు 3.6 శాతం మాత్రమే ఉన్నారు. కాగ్నిజెంట్ ఈ విషయంలో 20 శాతం మార్కును దాటింది. చాలా సంస్థలు శ్రామిక శక్తిలో మహిళల వాటా విషయంలో మూడింట ఒక వంతు (33 శాతం) సంఖ్యకు కట్టుబడి ఉన్నాయి. సాంకేతిక రంగంలో సందర్భం, మార్కెట్ తీరు, యజమానుల విచక్షణపైనే మహిళల నియామకాలు ఉంటాయని స్టాఫింగ్ కంపెనీ ఎక్స్ఫెనో అంటోంది. వేతనాల్లోనూ అంతరమే..స్త్రీ, పురుష నిష్పత్తితోపాటు ఐటీ కంపెనీల్లో వేతన అంతరం కూడా పెద్ద ఎత్తున ఉంది. టీసీఎస్లో బోర్డు సభ్యులు, సీనియర్ మేనేజ్మెంట్ మినహా మహిళా ఉద్యోగుల సగటు వార్షిక జీతం 2024–25లో రూ.10.6 లక్షలు మాత్రమే. ఈ కంపెనీలో ఇదే స్థాయి ఉద్యోగాల్లో పురుషులకు ఏకంగా రూ.16.7 లక్షల వేతనం ఉంది. అలాగే ఇన్ఫోసిస్లో మహిళా ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.8 లక్షలు ఉంది. పురుష సహోద్యోగులకు ఇది రూ.11 లక్షలు. ఇతర దిగ్గజ కంపెనీల్లో ఇలా..యాక్సెంచర్, క్యాప్జెమినె వంటి గ్లోబల్ కంపెనీలలో మహిళా ప్రాతినిధ్యం బలంగా ఉంది. 2024లో యాక్సెంచర్ మొత్తం సిబ్బందిలో మహిళా సిబ్బంది వాటా 48 శాతం కావడం విశేషం. క్యాప్జెమినైలో మహిళా సిబ్బంది వాటా 38.8 శాతం నుండి 39.7 శాతానికి పెరిగింది. మేనేజర్ స్థాయి రోల్స్లోకి వెళ్లే అవకాశాలు పురుషుల కంటే మహిళలకు 2.1 రెట్లు తక్కువగా ఉన్నాయని క్వెస్ చెబుతోంది. కరోనా మహమ్మారి తరువాత వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మహిళా ఉద్యోగులకు లాభిస్తుందని భావించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదని నిపుణులు అంటున్నారు. ఇంటి నుంచే పని వల్ల ఇంటి పని భారం మరింత పెరిగిందని.. దానివల్ల వృత్తి, ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టడం చాలామందికి కష్టమైందని చెబుతున్నారు. టాప్–5 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య -
తాబేలుకు ఫాదర్స్ డే
మనకు తెలిసి ఈ భూమ్మీద అత్యంత ఎక్కువ కాలం బతికే జీవి తాబేలు. దాదాపు 300 ఏళ్లు బతుకుతుందని అంచనా. అలాంటి ఓ తాబేలు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఉన్న మయామీ జూలో ఓ తాబేలు 135వ బర్త్డేను, మొదటి ఫాదర్స్డేను కూడా జరుపుకొంది. వృద్ధాప్యంలో మొదటిసారి తండ్రయిన తాబేలుగా గిన్నిస్ రికార్డులకూ ఎక్కనుంది. 234 కిలోల బరువున్న గాలాపాగోస్కు చెందిన ఈ తాబేలు పేరు గోలియత్. ఇది 1890లో జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ జాతి తాబేళ్లు అంతరించిపోతున్న సరీసృపాల్లో ఉన్నాయి. గోలియత్ను 1929లో బ్రోంక్స్ జూకు, ఆ తరువాత 1981లో మయామి జూకు తరలించారు. ఇన్నేళ్ల తరువాత.. స్వీట్ పీ అనే వందేళ్ల తాబేలు వల్ల గోలియత్కు తండ్రి స్థానం లభించింది. జనవరి 27న స్వీట్ పీ ఎనిమిది గుడ్లు పెట్టగా.. 128 రోజులు పొదిగిన తరువాత ఒక్కటి మాత్రమే తాబేలు పిల్లగా మారింది. ఇన్నేళ్లలో గోలియత్కు ఇదే తొలి సంతానం కావడం విశేషం! ఈ జూలో మొట్టమొదటి గాలాపాగోస్ జాతి తాబేలు పిల్ల కూడా. తాబేళ్లు పుట్టుకతోనే స్వతంత్రంగా ఉంటాయని, ఈ తాబేలు పిల్లను ప్రత్యేక స్థలానికి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక జూ నిర్వాహకులు ఆదివారం గోలియత్ పుట్టిన రోజుతోపా టు, మొదటి ఫాదర్స్డేను కూడా నిర్వహించారు. వృద్ధాప్యంలో మొదటి సారి తండ్రయిన తాబేలుగా గోలియత్కు గిన్నిస్ రికార్డ్ కోసం దరఖాస్తు చేసినట్లు జూ నిర్వాహకులు తెలిపారు. 135 ఏళ్లు గోలియిత్ రికార్డును కచి్చతంగా సొంతం చేసుకుంటుందని ఆశిస్తూ ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జిప్లైన్ కేబుల్ తెగి 30 అడుగుల లోతులో కిందపడ్డ త్రిష..వీడియో వైరల్
ధర్మశాల: హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం విషాదం నెలకొంది. మనాలి అందాలను వీక్షించేందుకు జిప్లైన్ కేబుల్ ద్వారా వెళ్తున్న సమయంలో 10ఏళ్ల బాలిక 30 అడుగుల లోతులో పడింది. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.జూన్ 8న నాగపూర్కు చెందిన ప్రపుల్లా బిజ్వే, అతని భార్య,కుమార్తె త్రిషా బిజ్వే కుటుంబం మనాలిలో ప్రకృతి అందాల్ని వీక్షించేందుకు వెళ్లింది. జూన్8న జిప్లైన్ కేబుల్ ద్వారా అటు వైపు నుంచి ఇటువైపుకు వచ్చే సమయంలో త్రిషా బిజ్వే మధ్యలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. జిప్లైన్ ఊడిపోయి 30 అడుగుల లోతులో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేవు. ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి సహయక చర్యలు అందలేదని తెలిపారు. త్రిషకు మనాలీలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం చండీగఢ్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె నాగ్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.బిజ్వే కుటుంబం ఆ ప్రమాదం జరిగిన దృశ్యాలను మీడియాకు వెల్లడించారు. ఆ వీడియోలో జిప్లైన్ హార్నెస్ ఒక్కసారిగా తెగిన దృశ్యం కనిపిస్తుంది. ఈ దుర్ఘటనలో నిర్లక్క్ష్యం వహించిన జిప్లైన్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి అడ్వెంచర్ టూరిజం సెంటర్లలో భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.A 12-year-old girl from Maharashtra's Nagpur suffered severe injuries after she plunged 30 feet during a zipline ride in Manali, Himachal Pradesh.Trisha Bijwe fell while riding a zipline after the rope connected to her harness snapped. pic.twitter.com/P1QwnFyrQZ— The Siasat Daily (@TheSiasatDaily) June 15, 2025 -
‘అన్నదమ్ములు.. స్మార్ట్ సిటీ పేరుతో 70 వేల మందిని భలే మోసం చేశారు’
జైపూర్: ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారనే నానుడిని ఈ ఇద్దరు అన్నదమ్ములు నిజం చేశారు. నమ్మకమే పెట్టుబడిగా బిజినెస్ను ప్రారంభించి అతి తక్కువ సమయంలో 70వేల మందిని ముంచారు. సుమారు 3వేల కోట్ల మేర టోపీ పెట్టారు.రాజస్థాన్ రాష్ట్రం సికార్ జిల్లాకు చెందిన సుభాష్ బిజరణి,రణవీర్ బిజరణిలు అన్నదమ్ములు. వారిలో సుభాష్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. రణవీర్ ఏం చేసేవారని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వీళ్లిద్దరికి రాత్రికిరాత్రే కోటీశ్వరులవ్వాలనే అత్యాస పుట్టింది. ఇందుకోసం ఏం చేయాలి? జనాల్ని ఎలా మోసం చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్పై కన్నుఅప్పుడే వీళ్లద్దరూ ప్రస్తుతం కేంద్రం,గుజారాత్ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దేశంలోని తొలిసారి నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్పై కన్నుపడింది. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దొలేరా స్మార్ట్ సిటీకి ఏమాంత్రం సంబంధం లేని 110కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్లో 2014లో ప్లాటును కొనుగోలు చేశారు. మీరు కూడా ధొలేరా స్మార్ట్ సిటీలో ప్లాటు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? ఇందుకోసం మా నెక్సా ఎవర్గ్రీన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టండి అంటూ ఓ డమ్మీ కంపెనీని ప్రారంభించారు.విలువైన బహుమతుల్ని ఎరగా వేసినెక్సా ఎవర్గ్రీన్ కంపెనీ పేరుతో కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ధోలేరా స్మార్ట్ సిటీ ఒరిజినల్ ఫొటోలతో ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా 70,000 మందిని మోసం చేసి, ఏకంగా రూ.2,676 కోట్ల మేర డబ్బు వసూలు చేశారు. ధొలేరాలో ప్రాజెక్టులు ఉన్నాయంటూ ఫేక్ ఫొటోలు చూపిస్తూ, ప్రజలను బిల్డింగులు, ప్లాట్లు, హై రిటర్న్స్ పేరుతో ఆకర్షించారు. అంతేకాదు ఇతరులను రిఫర్ చేస్తే లాప్టాప్లు, బైకులు, కార్లు అంటూ బహుమతులు ఆశచూపించారు. రెఫరల్ ప్రోగ్రామ్ పేరిట లెవెల్ వైజ్ కమిషన్లు, ఆదాయం అంటూ కోట్ల రూపాయలను ప్రజల నుండి సేకరించారు. ఈ మొత్తం స్కామ్లో దాదాపు రూ.1,500 కోట్లు కమిషన్ల రూపంలో పంపిణీ చేశారు.ఆస్తుల్ని పోగేసి చివరికిఆ తర్వాత జనాల్ని మోసం చేయగా వచ్చిన వేల కోట్లతో లగ్జరీ కార్లు, హోటళ్లు, గోవాలో 25 రిసార్టులు, రాజస్థాన్లో మైన్స్ను కొనుగోలు చేశారు. మొత్తంగా రూ.250 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారు. మిగిలిన డబ్బును 27 షెల్ కంపెనీలకు మళ్లించారు. చివరికి కంపెనీ బోర్డు తిప్పేశారు. పరారయ్యారు. కంపెనీ కార్యాలయాలు మూసివేయడంతో పెట్టుబడి దారుల్లో ఆందోళన మొదలైంది. రోజులు గడుస్తున్నా నిందితుల జాడ తెలియలేదు. తాము మోసపోయామని భావించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జోధ్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈడీ సైతం 25 చోట్ల సోదాలు నిర్వహించడంతో అన్నదమ్ములు భాగోతం వెలుగులోకి వచ్చింది. ధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్టుధొలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం కలసి నిర్మిస్తున్నాయి. దేశంలోని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఢిల్లీ కంటే రెండింతలు పెద్దది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అనేక విదేశీ కంపెనీల కార్యాలయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2042 నాటికి వినియోగంలోకి రానుంది. నిజమైన ధొలేరా ప్రాజెక్టును అడ్డుగా పెట్టుకొని వేల మందిని మోసం చేసిన ఈ స్కామ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇక ముందుగా ఇలాంటి స్కామ్స్కు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
indrayani river bridge collapses: పూణెలో ఘోర ప్రమాదం
మహరాష్ట్ర: పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రాయణి నదిపై (indrayani river bridge collapses) పురాతన కూలిన వంతెన కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 25మంది గల్లంతయ్యారు.పోలీసుల సమాచారం మేరకు.. పుణె జిల్లాలోని మావళ్ తాలూకాలోని తలెగావ్ దాభాడే వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం కుండమళా వద్ద ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో ఇంద్రాయణి నదిపై ఉన్న పాత బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 20 నుంచి 25మంది బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో గల్లంతయ్యినట్లు తెలుస్తోంది.Pune: Many Tourists Feared Drowned After Old Bridge Collapses Over Indrayani River at Kund MalaRead in detail here: https://t.co/CuDeeJOuZo pic.twitter.com/7YKBkIJeCR— Punekar News (@punekarnews) June 15, 2025పర్యాటక ప్రాంతం కావడంతో వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు. అయితే, రెండు రోజులు పాటు భారీగా కురిసిన వర్షాలకు పురాతన బ్రిడ్జి నానింది. పర్యాటకులు రావడంతో బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కింద ప్రవహిస్తున్న ఇంద్రాయణి నదిలో జారీ పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకు ఎన్డీఆర్ఫ్ బృందాలు బాధితుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఐదుగురు పర్యాటకుల్ని రక్షించారు. ఈ దుర్ఘటనతో పింప్రి-చించ్వడ్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని తలెగావ్ దాభాడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికార యంత్రాంగం, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. #Maval Bridge collapsed ,5 tourist feared to be dead.On weekend huge #ITcrowd visit these places we pray for everyones saftey . Morethan 25 are missing .30We hope govt should audit all tourist hot spot to ensure everyones saftey .#IndrayaniRiver #Kundamala #BridgeCollapse pic.twitter.com/IOU6XJj0Fy— Forum For IT Employees - FITE (@FITEMaharashtra) June 15, 2025 -
Plane Crash: నా భార్యకింకా తెలియదు..!
అహ్మదాబాద్: ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం బీజే మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఓ టీ స్టాల్ వెనక కూలింది. ఆ టీ కొట్టు నడిపే సీతాబెన్ అనే మహిళ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. కాలిన గాయాలతో బతికి బయటపడింది. చెట్టుకింద టీస్టాల్లో నిద్రపోతున్న 14 ఏళ్ల కుమారుడు ఆకాశ్ మాత్రం మంటలకు బలయ్యాడు. తన వెనకగా చెలరేగుతున్న మంటల నుంచి సీతాబెన్ తప్పించుకుని పరుగెత్తుకుంటూ వస్తున్న వీడియో వైరల్గా మారింది. ఐసీయూలో కోలుకుంటున్న ఆమె మీడియాతో మాట్లాడింది. ‘‘నేను విమానాన్ని చూడలేదు. కానీ భారీ శబ్దం విన్పించింది. వెంటనే మంటలు, పొగ కమ్ము కుంటుండటంతో ఏమీ కన్పించకుండా పోయింది. భయపడి పరుగులు తీశాను’’ అంటూ గుర్తు చేసుకుంది.నా భార్యకింకా తెలియదుసీతాబెన్ భర్త సురేశ్కుమార్ కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ‘‘ప్రమాద సమ యంలో నేను ఇంట్లో ఉన్నా. టీ స్టాల్లో ఉన్న నా భార్యకు ఆకాశ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లాడు. తర్వాత అక్కడే పడుకుని ప్రమాదానికి బలైపో యాడు’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘ఈ ఘోరం గురించి నా భార్యకు ఇంకా చెప్పలేదు. నా కొడుకు మృతదేహం గుర్తించలేనంతగా కాలిపోయింది. దాంతో పరీక్షల నిమిత్తం నా డీఎన్ఏ నమూనా ఇచ్చా’’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య
లక్నో: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉత్తర ప్రదేశ్ నుంచి కోల్కతా బయల్దేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది ప్రయాణాన్ని నిలిపివేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం (జూన్15)న ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని హిండన్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియాకు చెందిన ఎయిరిండియా (IX 1511) విమానం కోల్కతాకు బయల్దేరాల్సి ఉంది.అయితే,ఎయిర్పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవ్వాల్సి ఉండగా.. సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. సాంకేతిక లోపంపై సమాచారం అందుకున్న ఇంజినీర్లు విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలోపడ్డారు. ఫలితంగా, భద్రతా కారణాల దృష్ట్యా టేకాఫ్ వాయిదా పడింది. తిరిగి విమాన కార్యకలాపాలపై అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానం కోసం పడిగాపులు కాస్తున్నారు. -
Air India plane crash: దొరికిన మాజీ సీఎం విజయ్ రూపానీ భౌతికఖాయం
గాంధీ నగర్: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్ బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం విజయ్ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్ కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.At around 11:10 AM today, his DNA matched with the recovered remains.A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025 -
Air India Plane Crashed: వీరంతా మృత్యువును తప్పించుకున్నారిలా..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం చరిత్రలో పెను విషాదంగా నిలిచిపోనుంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతి చెందారు. విశ్వాస్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రం ప్రమాదం నుంచి బయపడ్డారు. అయితే తల్లి మాట కారణంగా యమన్ వ్యాస్, సరైన పత్రాలు లేక జామిని, ప్రియా పటేల్, ట్రాఫిక్లో చిక్కుకుపోయి భూమి చౌహాన్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం జరిగిన జూన్ 12న గుజరాత్కు చెందిన యమన్ వ్యాస్ అదే విమానంలో ఎక్కేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. కుమారునికి వీడ్కోలు పలికే సమయంలో వ్యాస్ తల్లి భావోద్వేగానికి లోనయ్యింది. ‘కొన్ని రోజులు ఇక్కడే ఉండవచ్చు కదా’ అని అడిగింది. అంతే తల్లి ప్రేమకు తలొగ్గిన వ్యాస్ వెంటనే తన విమాన టికెట్ను రద్దు చేసుకున్నాడు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకెన్లకే నేల కూలింది. విమాన ప్రమాదం వార్త వినగానే యమన్ దిగ్బ్రాంతికి లోనయ్యారు. తన తల్లే తనను కాపాడిందని ఆయన మీడియాకు తెలిపారు.యమన్ వ్యాస్ కొన్నేళ్లుగా యూకేలో పనిచేస్తున్నారు. రెండేళ్ల తర్వాత వడోదర వచ్చారు. తన కుటుంబంతో కొన్ని రోజులు ఉన్నాక, తిరిగి లండన్కు బయలుదేరారు. అయితే అతని తల్లి పట్టుబట్టడంతో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అహ్మదాబాద్లోని చంద్లోడియాకు చెందిన జామిని, ప్రియా పటేల్ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు తమ స్నేహితుని ఆహ్వానం మేరకు ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరు విజిటర్ వీసాపై ప్రయాణానికి బయలుదేరారు. అయితే వీరి దగ్గర కొన్ని పత్రాలు లేని కారణంగా, విమానం ఎక్కేందుకు అనుమతి లభించలేదు. దీంతో నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విమాన ప్రమాదం గురించి వారికి తెలిసింది. ఇదేవిధంగా భారత్కు వచ్చిన బ్రిటన్ నివాసి భూమి చౌహాన్ అహ్మదాబాద్లో భారీ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీంతో ఆమె విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమైంది. దీంతో ఆమె విమానం ఎక్కలేకపోయారు. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం -
Varanasi: నిషేధిత జోన్లో తేజ్ ప్రతాప్.. విచారణకు ఆదేశాలు
వారణాసి: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు, బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మరోమారు వార్తల్లో నిలిచారు. వారణాసిలోని విశ్వనాథుని ఆలయంలోని నిషేధిత ‘రెడ్ జోన్’ లోపలికి తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రవేశించడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాశీ విశ్వనాథ ఆలయ పరిపాలన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హై-సెక్యూరిటీ జోన్లో కాశీ విశ్వనాథ్ కారిడార్లోని గర్భగుడి ప్రాంగణం కూడా ఉంది. ఇక్కడికి అనధికారిక ప్రవేశాన్ని నిషేధించారు. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ జోన్లలో తిరుగాడుతున్నట్లు ఉన్న వీడియో గురువారం సోషల్ మీడియాలో కనిపించింది. बाबा विश्वनाथ का आशीर्वाद हो,माँ गंगा का निर्मल पवित्र घाट हो,पूरी दुनिया को मैं भूल जाऊं औरबनारस में मेरा भोला मुझे याद हो हर हर महादेव बोलना ही होगा। ...#Varanasi pic.twitter.com/Uq5tS32evB— Tej Pratap Yadav (@TejYadav14) June 13, 2025దీనిపై కాశీ విశ్వనాథ ఆలయ సీఈవో విశ్వ భూషణ్ మిశ్రా మాట్లాడుతూ ఆన్లైన్లో కనిపించిన ఈ వీడియోను ఆలయ అధికారులు గమనించారని అన్నారు. వారు దీనిని కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)తో స్థానిక పోలీసులకు తెలియజేశారన్నారు. వారు సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇటీవలి కాలంలో తేజ్ ప్రతాప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. మే 25న అతని తండ్రి లాలూ ప్రసాద్ అతన్ని రాష్ట్రీయ జనతాదళ్ నుండి బహిష్కరించారు. అతనికి తమ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని తేజ్ ప్రతాప్ సోషల్ మీడియాలో తెలియజేశారు. మరోవైపు తేజ్ ప్రతాప్ విడాకులపై కోర్టులో విచారణ కొనసాగుతోంది. అలాగే తేజ్ ప్రతాప్ 12 ఏళ్లుగా ఒక మహిళతో సంబంధంలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. #WATCH | Ghaziabad, UP | On Tej Pratap Yadav's viral reel from the Kashi Vishwanath Temple premises, CEO of Kashi Vishwanath Temple, Vishwa Bhushan Mishra, says, "The area inside the temple is a restricted area. One cannot take a mobile phone or a camera there. However, we… pic.twitter.com/qatUGV0NDL— ANI (@ANI) June 14, 2025ఇది కూడా చదవండి: Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం -
Air India Plane Crashed: 31 మృతదేహాల నిర్థారణ.. డీఎన్ఏ పరీక్షలు ముమ్మరం
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం దరిమిలా మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 31 మృతదేహాలను ధృవీకరించారు. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్ వెళ్తున్న ఏI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక మెడికల్ కాలేజీ కాంప్లెక్స్పై కూలిపోయింది.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో 31 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించారని ఒక అధికారి తెలిపారు. వీటిలో 12 మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు వచ్చారని తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు, సంబంధీకులకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాధితులను సంప్రదించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ 31 మంది మృతదేహాలు సంబంధీకుల డీఎన్ఏతో సరిపోలాయని, వీటిలో 12 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ సరిపోలిక ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించిన వెంటనే మీడియాకు తెలియజేస్తామని డాక్టర్ పటేల్ పేర్కొన్నారు.ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాలకే విమానం కూలిపోయింది. అధికారులు తెలిపిన ప్రకారం ఆ రోజు విమానంలో ప్రయాణించినవారి చెక్-ఇన్ లగేజీ సురక్షితంగా ఉందని, గుజరాత్ పోలీసులు ఈ లగేజినంతటినీ ఎయిర్ ఇండియాకు అప్పగించనున్నారు. ఆ తరువాత బ్యాగేజ్ స్టిక్కర్ల ఆధారంగా మృతుల కుటుంబాలకు లగేజీని అందజేయనున్నారు.ఇది కూడా చదవండి: ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్తో సంబంధాన్ని ఖండించిన టర్కీ -
మాతృప్రేమను పంచకుండానే ప్రాణం పోయింది
దొడ్డబళ్లాపురం: పండంటి బిడ్డను పొత్తిళ్లలో ఉంచుకొని మాతృప్రేమను పంచుతుండగానే బాలింత ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సిజేరియన్ చేసిన రెండో రోజే బాలింత మృతిచెందగా ఇందుకు వైద్యుల నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. దుర్గమ్మ(21) అనే గర్భిణి కాన్పు కోసం విజయనగర జిల్లా హరపనహళ్లిలోని తన పుట్టింటికి వచ్చింది. మూడు రోజుల క్రితం నొప్పులు రావడంతో తల్లితండ్రులు సమీపంలోని హరపనహళ్లి తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. అయితే డెలివరీ తరువాత ఆరోగ్యం క్షీణించడంతో దుర్గమ్మను చిగటేరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ 12 బాటిళ్ల రక్తం ఎక్కిచి గర్భసంచి తొలగించారు. అయినా దుర్గమ్మ మృతి చెందింది. హరపనహళ్లి ఆస్పత్రిలో వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడం వల్లే తమ కుమార్తె మృతిచెందినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న జై భీమ్ ఆర్మీ కార్యకర్తలు ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. దుర్గమ్మ మృతికి కారణమైన వైద్యులపై కేసు నమోదు చేయాలని, మృతురాలి కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తీవ్ర రక్తస్రావం జరిగింది చిగటేరి జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరిండెంట్ మాట్లాడుతూ సిజేరియన్ తరువాత దుర్గమ్మకు తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు. ఆస్పత్రికి వచ్చేటప్పటికే ఆబీపీ డౌన్ అయ్యిందన్నారు. రక్తస్రావాన్ని ఆపడానికి గర్భసంచి తొలగించామన్నారు. 15 యూనిట్ల బ్లడ్ ప్లేట్ లెట్లు ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందన్నారు. పోస్టుమార్టం తరువాత ఏం జరిగిందనేది తెలుస్తుందన్నారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. -
ఆస్తినంతా ప్రియురాలికి ఇచ్చాడు
కర్ణాటక: వారం రోజుల క్రితం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో భార్య కారణాలను వెల్లడించింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47) నిద్రపోతుండగా భార్య కవిత (44) పెట్రోలు పోసి తగలబెట్టడంతో చనిపోయాడు.పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారించారు. తమకు పెళ్లి జరిగి 22 ఏళ్లు అయ్యిందని, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారని, తమకు ఆస్తి, డబ్బు, నగలు అన్నీ ఉన్నాయని, కుటుంబంతో బాగానే ఉన్నామని తెలిపింది.అయితే భర్త కూలి పని చేసే చోట మరో మహిళ మంజులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఇంట్లో ఉన్న నగలు మంజులకు అందజేశాడు. ఆస్తిని విక్రయించి ఆమెకు ముట్టజెప్పాడని తెలిపింది. రోజూ తాగి వచ్చి అందంగా లేవని నన్ను దూషించేవాడని, దీంతో హత్య చేశానని చెప్పింది. కాగా తండ్రి మరణించి, తల్లి జైలుకెళ్లి ముగ్గురు పిల్లలు బోరుమని విలపించారు. -
Air India Plane Crashed: మనవరాళ్లతో ఆడుకునేందుకు లండన్ బయలుదేరి..
అహ్మదాబాద్: దేశంలో సంభవించిన అత్యంత ఘోర విమాన ప్రమాదాలలో గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. గుజరాత్లోని ఆనంద్కు చెందిన వ్యాపారవేత్త బద్రుద్దీన్ హలానీ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లండన్లోని తన ముద్దుల మనవరాళ్లలో ఆనందంగా ఆడుకోవాలనే ఆశతో బయలుదేరిన ఆయన అంతలోనే అనంతవాయువుల్లో కలిసిపోయారు.బద్రుద్దీన్ హలానీ తన భార్య యాస్మిన్, వదిన మాలెక్తో కలిసి విమానంలో లండన్ బయలుదేరారు. అక్కడ తన మనవరాళ్లతో కలసి ఆడుకుంటూ కాలం గడపాలని ఎన్నో కలలుగన్నారు. అలాగే తన కలల ప్రాజెక్ట్ అయిన సిల్వాసాలోని ఆర్ఎస్ఎస్ఎస్ అనుబంధ సైనిక్ స్కూల్ కోసం నిధులు సేకరించేందుకు అమెరికా వెళ్లాలని కూడా బద్రుద్దీన్ హలానీ ప్లాన్ చేసుకున్నారు. అతని సోదరుడు రాజుభాయ్ హలానీ మీడియాతో మాట్లాడుతూ.. తన అన్న సామాజిక సేవ చేయడంలో ముందుంటారని, సిల్వాసాలోని సైనిక్ స్కూల్ నెలకొల్పాలని అనుకున్నారన్నారు. లండన్లో తన మనవరాళ్లతో ఆనందంగా కాలం గడపాలని అనుకున్నారని తెలిపారు.ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బద్రుద్దీన్ కుమారుడు అసిమ్ హలానీ లండన్ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారు. తన తండ్రి మృతదేహాన్ని గుర్తించేందుకు తన డీఎన్ఏ నమూనాను ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా ఇద్దరు కుమార్తెలు.. తాతనాన్నమ్మ లండన్ వస్తున్నారని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాత కోసం గ్రీటింగ్ కార్డులు కూడా తయారు చేశారు. ఇప్పుడు ఆ కార్డులను ఎవరికి ఇస్తారు? మా కుటుంబానికి తట్టుకోలోని పరిస్థితి ఎదురయ్యింది. మా నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. నేను ఏ బొమ్మ అడిగితే, అది కొనిచ్చారు. అదే ప్రేమ మనవరాళ్లకు కూడా ఇస్తారని అనుకున్నాను’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే.. -
భారత్లో 7400 కోవిడ్ కేసులు.. 24 గంటల్లో 9 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసుల 7,400కు చేరింది. గత 24 గంటల్లో 269 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. కర్ణాటకలో అత్యధికంగా ఒక్కరోజులోనే 132 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 79, కేరళలో 54, మధ్యప్రదేశ్లో 20, సిక్కింలో 11, తమిళనాడులో 12, హర్యానాలో 9తోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, లద్దాఖ్, మిజోరం, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడులలో ఒక్కొక్కరు మరణించారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 87కు చేరుకుంది. కోవిడ్కు అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా కేరళ ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,109గా ఉంది. తరువాత స్థానాల్లో గుజరాత్ 1,437, ఢిల్లీ 672, మహారాష్ట్ర 613, కర్ణాటక 527, ఉత్తరప్రదేశ్ 248, తమిళనాడు 232, రాజస్థాన్ 180, ఆంధ్రప్రదేశ్ 102 ఉన్నాయి. మణిపూర్, రాజస్థాన్లలోనూ కేసులు పెరిగాయి. -
వివాదంలో డీఎస్పీ సతీమణి.. పార్టీ ఇలా కూడా చేసుకుంటారా?
రాయ్పూర్: ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ.. బాధ్యత మరిచిపోయి ఓవరాక్షన్ చేసింది. డీఎస్పీ సతీమణి.. తన పుట్టినరోజు సందర్భంగా చేసిన తప్పిదం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె.. ప్రభుత్వ వాహనం బ్యానెట్పై కూర్చుని కేక్ కట్ చేస్తూ.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వ వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో తరచుగా కనిపిస్తూనే ఉంది. తాజాగా ఛత్తీస్గఢ్లోని జంజ్గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా.. పోలీసు శాఖకు చెందిన వాహనం బ్యానెట్పై కూర్చొని కేక్ కట్ చేసింది.ఇక, కేక్ కటింగ్ సందర్భంగా.. “స్నో స్ప్రే” తో వాహనం అద్దంపై “32” అని రాసింది. తరువాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్స్తో దాన్ని తుడిచేశాడు. అనంతరం ఆమె మళ్లీ “33” అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇదే సమయంలో కారు బ్యానెట్పై కేక్, పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. ఈ రీల్ వీడియోను సరగానా రిసార్ట్(Saragana Resort)లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక కారు అలా ముందుకు పోతుంటే బ్యానెట్పై డీఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సదరు పోలీసు వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు. వారంతా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది.DSP की पत्नी ने नीली बत्ती वाली कार के बोनट पर बैठकर मनाया बर्थडे, वायरल हुआ वीडियो छत्तीसगढ़ के बलरामपुर जिले में पुलिस बटालियन में तैनाच डीएसपी तस्लीम आरिफ की पत्नी नीली बत्ती लगी सरकारी कार के बोनट पर बैठकर अपना बर्थडे मना रही है. यह वीडियो सोशल मीडिया पर खूब वायरल हो रहा… pic.twitter.com/iarwZ1j71f— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) June 13, 2025అయితే, సదరు అధికారి భార్య తన పుట్టినరోజు వేడుకలకు ప్రభుత్వ వాహనం ఉపయోగించడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారిక వాహనాలు కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి. వ్యక్తిగత వేడుకల కోసం ఇటువంటి వాహనాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. ముఖ్యంగా బ్లూ బీకాన్(blue beacon) వంటి అధికార గుర్తింపు చిహ్నాలున్న వాహనాలను వినియోగించడం నేరంగా పరిగణిస్తారు. దీంతో, పలువురు నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు సంబంధిత డీఎస్పీపై ఎలాంటి అధికారిక చర్య తీసుకోకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Brut India (@brut.india) -
Air India Plane Crashed: ప్రమాదాన్ని తొలుత చూసింది ఇతనే.. వెంటనే ఏం చేశారంటే..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయినవారిని పోగొట్టుకున్నవారి ఆవేదన వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదాన్ని తొలుత ఎవరు చూశారు? ఎలా స్పందించారు?.. అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.108 అంబులెన్స్ డ్రైవర్ సతీందర్ సింగ్ సంధు మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్లో భోజనం చేస్తుండగా, అతనికి భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే క్యాంపస్లోని హాస్టళ్లవైపు దృష్టి సారించి, హడలెత్తిపోయాడు. దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడాన్ని గమనించాడు. ఆ ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమవడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై, అంబులెన్స్ సర్వీస్ మేనేజర్ జితేంద్ర షాహికి ఫోన్ చేశాడు. ‘ఇక్కడ విమాన ప్రమాదం జరిగినట్లుంది. అగ్నిమాపక దళాన్ని వెంటనే పంపండి’ అని కోరాడు.ప్రమాద స్థలంలో తీవ్రంగా కాలిపోయిన భద్రతా సిబ్బందిని సంధు తొలుత చూశాడు. అలాగే విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి (విశ్వాస్ కుమార్ రమేష్)ని కూడా చూశాడు.. రమేష్ అదే విమానంలో ఉన్న తన బంధువును కాపాడేందుకు ప్రయత్నించడాన్ని కూడా తాను చూశానని సంధు మీడియాకు తెలిపారు. తరువాత అతనిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.46 గంటలకు ఐదు 108 అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయని, తొలుత తాము హాస్టల్ నుండి బయటకు వస్తున్న 20 మంది బాధితులను ఆస్పత్రులకు తరలించామని షాహి తెలిపారు.ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో.. -
ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్.. ఏడుగురు మృతి
డెహ్రాడూన్: అహ్మాదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. సదరు హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం హెలికాప్టర్ కూలిపోయింది. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్టర్ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ఉండగా.. పైలట్తో సహా అందరూ మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. Uttarakhand helicopter crash | Today, at around 5:20 am, a helicopter, which was going from Shri Kedarnath Dham to Guptkashi, has been reported to have crashed near Gaurikund. There were six passengers, including the pilot (5 adults and 1 child). The passengers in the helicopter… pic.twitter.com/AVGtuxWKGj— ANI (@ANI) June 15, 2025మృతుల వివరాలు..రాజ్వీర్- పైలట్. విక్రమ్ రావత్,వినోద్, త్రిష్టి సింగ్, రాజ్కుమార్, శ్రద్దా, రాశి(10).. #UPDATE | Uttarakhand helicopter crash: The helicopter that crashed had taken off for Gaurikund after taking devotees to Kedarnath. There were seven people on board. The place where this accident took place is a very remote area. Police and SDRF teams have left for the spot: IG…— ANI (@ANI) June 15, 2025మరోవైపు.. హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా..‘రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. Chopper Crash in Gaurikund, UttarakhandIt is a very serious situation: Harshvardhan, Aviation Expert tells @anchoramitawTimes Now's Abhishek Sinha & @RishabhMPratap share more details. pic.twitter.com/cMazWahTM4— TIMES NOW (@TimesNow) June 15, 2025 #UPDATE | The helicopter that went missing in Gaurikund has crashed. There were six people on board the crashed helicopter. More details awaited: Uttarakhand ADG Law and Order, Dr V Murugeshan https://t.co/vDaSNjtSva— ANI (@ANI) June 15, 2025 -
‘171’ నంబర్కు బైబై.. నంబర్లు మార్చేసిన ఎయిర్ ఇండియా
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో ‘ఏఐ171’అనే నంబర్ కలిగిన బోయింగ్ 787–8 విమానం కూలిపోవడం, 270 మంది మరణించడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ విమానాలకు ఏఐ171, ఐఎక్స్ 171 పేర్లను తొలగించాయి.ఇక, అహ్మదాబాద్–లండన్ మధ్య నడిచే విమానాన్ని ఈ నెల 17వ తేదీ నుంచి ‘ఏఐ159’ అనే కొత్త నంబర్తో పిలువనున్నట్లు ఎయిర్ ఇండియా వర్గాలు శనివారం వెల్లడించాయి. ఈ మేరకు టికెట్ల బుకింగ్ వ్యవస్థలో శుక్రవారం నుంచే మార్పులు చేసినట్లు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సైతం తమ విమానానికి ‘ఐఎక్స్171’నంబర్ను వదులుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త నంబర్ను ఇంకా ప్రకటించలేదు. ప్రమాదానికి గురైన విమానం నంబర్ను మార్చడం కొత్తేమీ కాదు. ప్రమాదంలో మరణించినవారికి నివాళిగా పాత నంబర్ను వదిలేసుకోవడం చాలా ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానంలోని ఎయిర్ ఇండియా పైలట్ చివరి మాటలు బయటకు వచ్చాయి. విమానం పైకి ఎగరడం లేదు. కిందికి పడిపోతోంది. ఇప్పుడు కమ్యూనికేషన్ లైన్ బలహీనంగా ఉంది. మేడే అని.. విమానం కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)కు పైలట్ చివరి సందేశం చేరవేశాడు. ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతోందని ఈ సందేశాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఏఐ171 విమానం కొన్ని క్షణాల వ్యవధిలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. -
ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఉన్నత స్థాయి బృందం దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శనివారం ఎయిర్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఢిల్లీలోని ఉడాన్ భవన్లో మీడియాతో మంత్రి మాట్లాడారు. మీడియా సమావేశానికి ముందు అక్కడి వారంతా మృతులకు సంతాపసూచికగా ఒక నిమిషం మౌనం పాటించారు. ‘‘ఉన్నత స్థాయి బృందంలో హోంశాఖ కార్యదర్శి, పౌర విమానయాన శాఖ కార్యదర్శి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ నియమించాం. అవసరమైతే మరి కొందరిని కమిటీలోకి తీసుకుంటాం. మూడు నెలల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుందని భావిస్తున్నాం’’అని మంత్రి తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయన్నారు. ‘‘బోయింగ్787–8 డ్రీమ్లైనర్ విమానంలోని బ్లాక్బాక్స్ శుక్రవారం సాయంత్రం దొరికింది. దానిని డీకోడ్ చేసి అందులోని సమాచారాన్ని సమగ్రస్థాయిలో విశ్లేషించిన తర్వాతే మీడియాకు అదనపు సమాచారం అందజేస్తాం. బోయింగ్ 787 సిరీస్ విమానాల భద్రతపై దర్యాప్తునకు ఆదేశించాం. ప్రస్తుతం బోయింగ్787 సిరీస్లో 33 విమానాలు ఉన్నాయి. వీటిలో ఏడు విమానాల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించా. ఈ సిరీస్ విమానాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించాం. ఉన్నత స్థాయి బృందం సోమవారం భేటీ అవుతుంది’’అని మంత్రి పేర్కొన్నారు. ఆ బాధ నాకూ తెలుసు.. ఈ విమాన ప్రమాదం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రామ్మోహన్ అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ‘రోడ్డు ప్రమాదంలో నా తండ్రిని కోల్పోయా.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు’అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని, మృతదేహాలను వీలైనంత తొందరగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. -
దురదృష్టంగా భావించే సీటే ఇప్పుడు హాట్ కేకు
11ఏ. ఎయిరిండియా విమాన ప్రమాదం తరువాత ఎక్కడ చూసినా ఈ సీట్ నంబర్ గురించిన చర్చే. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ప్రయాణికుడు రమేశ్ కూచున్నది ఆ సీట్లోనే కావడం తెలిసిందే. సాధారణంగా 11ఏను దురదృష్టకరమైన నంబర్గా పిలుస్తారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే ఉంటుంది. బిజినెస్ క్లాస్ పూర్తవగానే మొదలయ్యే ఎకానమీ క్లాసులో ఉంటుంది గనుక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ సీటు పక్కనే వస్తుంది. దాంతో 11ఏ సీటుకు కిటికీ ఉండదు. చాలామంది అందమైన మేఘాలను, భూమిపై బుల్లిగా కనిపించే ఊళ్లు, పట్టణాలను చూసే ఆసక్తితో విండో సీటే కోరుకుంటారు. ఆ అవకాశం ఉండదు గనుక 11ఏను ఎవరూ అంతగా ఇష్టపడరు. కానీ రమేశ్ విషయంలో ఈ దురదృష్టకరమైన సీటే ప్రాణదాతగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే సీటు ఊడిపోవడమే గాక పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్ విరిగిపోయింది. దాంతో వెంటనే కిందికి దిగి ప్రాణాలతో బయటపడ్డాడు.అప్పుడూ 11ఏ సీటే27 ఏళ్ల కిందట థాయ్ ఎయిర్వేస్ విమానం కూలిపోయినప్పుడు కూడా అచ్చు ఇలాగే జరిగింది. 1998 డిసెంబర్ 11న దక్షిణ థాయ్లాండ్లో ల్యాండయ్యే క్రమంలో అది చిత్తడి నేలల్లో పడిపోయింది. విమానంలోని 146 మందిలో 101 మంది మరణించారు. కానీ 11ఏ సీట్లో కూర్చున్న థాయ్ నటుడు–గాయకుడు రువాంగ్సాక్ లోయ్చుసాక్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఎయిరిండియా ప్రమాదంలోనూ సరిగ్గా అదే నంబర్ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు క్షేమంగా బయట పడ్డట్టు తెలిసి ఎంతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారాయన. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ‘‘నాకు రెండో జీవితం దక్కింది బహుశా 11ఏలో కూచోవడం వల్లేనేమో. నాటి బోర్డింగ్ పాస్ నా దగ్గర లేదు. కానీ నా సీట్ నంబర్ అప్పుడు పత్రికలన్నింట్లోనూ వచ్చింది. ఆ ప్రమాదం దెబ్బకు దశాబ్దం పాటు నేను విమాన ప్రయాణం చేయలేదు’’ అని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.ఆ సీటుపై ఆసక్తిఎయిరిండియా విమాన ప్రమా దం తరువాత వాణిజ్య విమానాల్లో ఎమ ర్జెన్సీ ఎగ్జిట్ సీట్లపై ఆసక్తి పెరిగింది. 11ఏ సీట్నే బుక్ చేసుకోవాలను కుంటున్నట్టు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రమేశ్ ఉదంతంతో ఈ సీట్ చాలా సురక్షితమని భావిస్తున్నారు. కానీ అది నిజమనేందుకు ఎలాంటి సాంకేతిక ఆధారాలూ లేవు. ఒక్కో ప్రమాదం ఒక్కోలా జరుగుతుంది గనుక ఫలానా సీటు సురక్షితమని చెప్పలేమని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ అన్నారు. విమానంలో ముందుకంటే వెనక వైపు సీట్లు ఎక్కువ సురక్షితమని 1971 నుంచి జరిగిన ప్రమాదాలపై 2007లో పాపులర్ మెకానిక్స్ చేసిన అధ్యయనంలో తేలింది. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగే కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు, జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్లో జరిగే జీ7 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలక ప్రపంచ సమస్యలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలతో ఆయన పంచుకోనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అందేగాక పలువురు జీ7, ఇతర దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ తరువాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఖలిస్తానీ సమస్య కారణంగా కెనడాతో దౌత్య సంబంధాలు క్షీణించాక ఆ దేశంలో పర్యటిస్తుండటమూ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దౌత్య బంధాలు మెరుగవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇటీవలే చెప్పారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య జరగడం తెలిసిందే. అందులో భారత ఏజెంట్ల ప్రమేయముందని నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేగాక అప్పటి భారత హై కమిషనర్ సంజయ్ వర్మతో సహా అనేక మంది మన దౌత్యవేత్తలకు నిజ్జర్ హత్యతో సంబంధముందని కూడా కెనడా ఆరోపించింది. వీటిపై భారత్ మండిపడింది. ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంతో కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ట్రూడో తప్పుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో మార్క్ కార్నీ ప్రధాని కావడంతో కొన్ని నెలలుగా, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త హైకమిషనర్లను నియమించే అవకాశాలను రెండు దేశాలూ పరిశీలిస్తున్నాయి. భారత్కు ప్రాధాన్యం భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా 12వసారి పాల్గొంటోంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతుండటం ఇది వరుసగా ఆరోసారి. 1975లో ఫ్రాన్స్ ప్రారంభించిన జీ7కు ఇది 50వ సంవత్సరం. ఫ్రాన్స్తో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్య దేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా జీ7కు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, దేశాల నడుమ సహకారం, అంతర్జాతీయ నేరాల కట్టడికి ఉమ్మడి చర్యలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువత, ఉపాధి అవకాశాలు తదితరాలపై జీ7 దృష్టి సారిస్తుంది. భారత్ వంటి దేశాలను ‘ప్రచార భాగస్వామి’గా జీ7 ఏటా ఆహ్వానిస్తోంది. సైప్రస్, క్రొయేషియాలకు తొలిసారి మోదీ ఆదివారం తొలుత సైప్రస్ వెళ్తారు. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్తో పలు అంశాలపై చర్చిస్తారు. గత 20 ఏళ్లలో అక్కడ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం మోదీ కెనడాలో జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 18న క్రొయేషియా వెళ్తారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. క్రొయేషియా ప్రధాని ఆంద్రే ప్లెంకోవిక్తో పాటు అధ్యక్షుడు జొరాన్ మిలానోవిక్తో కూడా మోదీ భేటీ అవుతారు. -
274కు పెరిగిన మృతుల సంఖ్య
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కు పెరిగింది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మినహా అంతా దుర్మరణం పాలవడం తెలిసిందే. విమానం రన్వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంటీన్, బాయ్స్ హాస్టల్ భవనాలపై పడి పేలిపోవడమే గాక మరో రెండు పరిసర భవనాలకు కూడా నిప్పంటుకుంది. దాంతో వాటిలో ఉన్నవారిలోనూ చాలామంది చనిపోయారు. వారి సంఖ్య 33గా శనివారం తేలింది. ఇదే తుది సంఖ్యా, లేక మృతుల సంఖ్య మరింత పెరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రమాద సమయంలో మెస్, హాస్టల్ భవనాల్లో కనీసం 40 మందికి పైగా వైద్య విద్యార్థులున్నట్టు కాలేజీ వర్గాలు శనివారం తెలిపాయి. వారికి తోడు పలువురు స్థానికులు కూడా ఉన్నట్టు వెల్లడించాయి. అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి ఇప్పటిదాకా 270 మృతదేహాలు వచ్చినట్టు బీజే మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేతీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులని గురువారమే తేలడం తెలిసిందే. అక్కడ టీ స్టాల్ నడిపే కుటుంబానికి చెందిన ఆకాశ్ పాట్నీ అనే 14 ఏళ్ల బాలుడు కూడా చనిపోయినట్టు తాజాగా ధ్రువీకరణ అయింది. మిగతా 27 మందిలో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతరులు ఎంతమంది అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదంలో నాలుగు భవనాలు బాగా దెబ్బతిన్నట్టు కాలేజీ డీన్ మీనాక్షీ పారిఖ్ వెల్లడించారు. ‘‘దర్యాప్తు నిమిత్తం బాయ్స్ హాస్టల్ భవనాలను ఖాళీ చేయిస్తున్నాం. ఇప్పటికే 200 మంది విద్యార్థులకు పైగా ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న, జరగబోయే ఎంబీబీఎస్ ఇంటర్నల్ పరీక్షలను వాయిదా వేస్తున్నాం’’అని ప్రకటించారు. హాస్టల్ భవనంపై చిక్కిన విమానం తోక భాగం నుంచి శనివారం ఉదయం ఒక మృతదేహాన్ని వెలికితీశారు. అది ఎయిర్హోస్టెస్దిగా తేల్చారు. కొనసాగుతున్న డీఎన్ఏ పరీక్షలు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయిపోవడం తెలిసిందే. గుర్తుపట్టే స్థితిలో ఉన్న 8 మృతదేహాలను ఇప్పటికే కుటుంబీకులకు అప్పగించారు. మిగతా వాటికి డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారానికి 11 మృతదేహాలను గుర్తించారు. మృతుల కుటుంబాలకు సాంత్వన కలిగించేందుకు కౌన్సెలర్లను అందుబాటులో ఉంచారు. మరణించిన విమాన ప్రయాణికుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే. బోయింగ్ విమానాల్లో భద్రతా తనిఖీలుప్రమాదం నేపథ్యంలో డీజీసీఏ ఆదేశాల మేరకు 26 బోయింగ్ 787–8, ఏడు 787–9 సిరీస్ విమానాలను భద్రతాపరంగా క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ఇప్పటిదాకా 9 విమానాల్లో తనిఖీలు పూర్తయినట్టు వెల్లడించింది. తనిఖీల కారణంగా పలు ఎయిరిండియా విమానాల రాకపోకలు ఆలస్యమవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787–8 విమానానికి వచ్చే డిసెంబర్లో సమగ్ర తనిఖీలు జరగాల్సి ఉంది. దాన్ని చివరిసారిగా 2023 జూన్లో క్షుణ్నంగా తనిఖీ చేశారు. కుడివైపు ఇంజన్ను గత మార్చిలో ఓవరాలింగ్ చేశారు.వీడియో తీసిన టీనేజర్ను విచారించిన పోలీసులు ఎయిరిండియా విమాన ప్రమాద వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. ఆర్యన్ 17 ఏళ్ల బాలుడు తన మొబైల్తో ఆ వీడియో తీశాడు. దర్యాప్తులో భాగంగా సాక్షిగా అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అతని స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. తాను వీడియో రికార్డు చేయడం మొదలు పెట్టిన 24 సెకన్లలోనే విమానం కూలినట్టు ఆర్యన్ మీడియాకు తెలిపాడు. ‘‘కళ్లముందే జరిగిన ప్రమాదంతో విపరీతంగా భయపడిపోయా. చాలాసేపటిదాకా కనీసం సరిగా మాట్లాడలేకపోయా. వీడియోను మొదట నా సోదరికి చూపించా. తర్వాత మా నాన్నకు చెప్పా. కళ్లు మూసినా, తెరిచినా విమాన ప్రమాదమే గుర్తుకొస్తోంది. మేముండే ఈ ప్రాంతం ప్రమాదకరమైనదిగా కనిపిస్తోంది. ఇక్కడ ఉండాలని లేదు’’అని చెప్పుకొచ్చాడు. ఆర్యన్ ఆ రోజంతా ఏమీ తినలేదని, రాత్రంతా నిద్ర కూడా పోలేకపోయాడని అతని తల్లి చెప్పింది. రెండుసార్లు వాయిదా వేసుకుని.. రూపానీ మృత్యుప్రయాణం! విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ వాస్తవానికి మే 19నే లండన్ వెళ్లాల్సింది. అసెంబ్లీ ఉప ఎన్నిక పనుల కారణంగా టికెట్ రద్దు చేసుకుని ప్రయాణాన్ని జూన్ 5కు వాయిదా వేసుకున్నారు. తర్వాత అదీ రద్దు చేసుకుని జూన్ 12న ప్రమాదం బారిన పడిన ఏఐ171లోనే టికెట్ బుక్ చేసుకున్నారు. అలా విధి ఆయనను మృత్యుముఖానికి నడిపించింది. 2డి నంబర్ సీట్లో కూచున్న ఆయన ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో చిక్కి మరణించారు. -
ఆదాయం ఆశల పల్లకీలో..
దేశంలోని 74 శాతం గ్రామీణ కుటుంబాలు రాబోయే ఒక ఏడాదిలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు ‘నాబార్’్డ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) తాజా సర్వే వెల్లడించింది. 2025 మే నెలలో జరిగిన ఆ సర్వే ప్రకారం – ఈ 74 శాతం అన్నది గత మార్చిలో 72 శాతంగా నమోదైంది. 2024 సెప్టెంబర్లో నాబార్డ్ ద్వైమాసిక ‘రూరల్ ఎకనమిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే (ఆర్.ఇ.సి.ఎస్.ఎస్.) ప్రారంభం అయినప్పటి నుంచి – రానున్న ఒక సంవత్సరంలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్న వారి శాతంలో ఇదే అత్యధికం. – సాక్షి, స్పెషల్ డెస్క్నైరుతితో చిగురించిన ఆశలు600 గ్రామాల్లో.. ప్రతి నమూనా గ్రామం నుంచి 10 కుటుంబాలను ఎంపిక చేసుకుని 6,000 మందితో నాబార్డ్ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది మే నెలలో ఐదవ విడత సర్వే పూర్తయింది. సర్వే ఫలితాలను బట్టి గ్రామీణ ప్రాంతాలలో తమ ఆదాయంలో పెరుగుదలను ఆశించే వారి సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా, తమ ఆదాయం క్షీణించవచ్చునని మునుపు అనుకున్న వారి సంఖ్య సర్వే మొదటి విడతలోని 7.3 నుంచి 6.7 శాతానికి తగ్గటం విశేషం. గ్రామీణ కుటుంబాలలో ఆదాయం వృద్ధి గురించి పెరుగుతున్న ఆశావాదం.. గత కొన్ని నెలలుగా గ్రామీణ రంగం పుంజుకుంటోందన్న సానుకూల ఆలోచనలకు అనుగుణంగా ఉంది. 2025లో ‘సాధారణం కంటే ఎక్కువ’గా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందన్న అంచనా గ్రామీణ రంగంలో సానుకూల మార్పునకు దోహదపడింది. ఆ సానుకూలత గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిని, కొనుగోలు శక్తిని పెంచుతుందన్న ఆశలు రేపింది. పెరగనున్న వాస్తవ వేతనాలుఇటీవలి ‘ఇండియా రేటింగ్స్’ నివేదిక ప్రకారం కూడా అనుకూల రుతుపవనాల వ్యవసాయ వృద్ధి కారణంగా 2025–26 లో వాస్తవ వేతనాలు (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగినవి) స్థిరంగా 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వృద్ధి చెందుతాయని అంచనా. ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సంఘటనలు, రుతుపవనాల పురోగతిలో అంతరాయం, వాణిజ్యం లేదా భౌగోళిక రాజకీయ సమస్యలు సంభవిస్తే మాత్రం వాస్తవ వేతన వృద్ధి రేటు తగ్గవచ్చని కూడా నివేదిక సూచించింది. కాగా, నాబార్డ్ నివేదిక ప్రకారం.. ఆదాయం పెరుగుదలపై మే నెలలో స్వల్పంగా గ్రామీణ కుటుంబాల ఆశలు చిగురించాయి. 53.8 శాతం మంది మెరుగైన ఆదాయాలు వస్తాయని భావిస్తున్నారు. 2025 మార్చిలో ఈ ఆశ 52.5 శాతంగా మాత్రమే ఉంది. ఉపాధి లభ్యతపై సానుకూలతవచ్చే త్రైమాసికంలో లభించనున్న ఉపాధి అవకాశాలపై అంచనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో 53.5 శాతం కుటుంబాలు ఉపాధి పరిస్థితుల్లో మెరుగుదలను ఆశించగా, 2024 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక ఆశావహ శాతం. కేవలం 8 శాతం మంది మాత్రమే తగ్గుదలను అంచనా వేశారు, ఫలితంగా నికర సానుకూలత 45.4కు చేరుకుందని నాబార్డ్ సర్వే వెల్లడించింది. 2025 జనవరిలో స్వల్పంగా తగ్గిన ఆశలు తిరిగి స్థిరంగా కోలుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో కుటుంబ ఆదాయాలు స్వల్ప మెరుగుదలను చూపించాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 37.4 శాతం మంది గత సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. మార్చిలో ఇది 34.8 శాతంగా ఉంది. అయితే 21.4 శాతం మంది తమ ఆదాయం తగ్గిందని, 41.3 శాతం మంది ‘ఏమో చెప్పలేం’ అని సమాధానం ఇచ్చారు.పొదుపు ఆలోచన కొంత తగ్గింది!నాబార్డ్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయాలు కూడా బలంగానే ఉన్నాయి. 79.1 శాతం కుటుంబాలు తమ ఖర్చు పెరిగినట్లు తెలిపాయి. ఇది మార్చి నెలతో పోలిస్తే (79.9 శాతం) స్వల్పంగా తగ్గినప్పటికీ , నికరంగా 74.6 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధోరణి గ్రామీణ కుటుంబాలలోని నిరంతర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా, పొదుపు చేయాలన్న ఆలోచన తగ్గిపోయింది. కేవలం 18.8 శాతం కుటుంబాలు మాత్రమే తమ పొదుపు మొత్తాలు పెరిగినట్లు చెప్పగా, 28.7 శాతం కుటుంబాలు తగ్గాయని తెలిపాయి. ఫలితంగా 9.9 శాతం నికరమైన ప్రతికూలత కనిపించింది. మార్చి (–11.9) నుంచి ఇది స్వల్ప మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, సర్వేలో వరుసగా ఐదవ విడతలో సైతం పొదుపు బలహీనంగానే ఉంది. -
దేశాన్ని బట్టి నిద్ర!
ఆరోగ్యవంతులు చక్కగా నిద్రపోతారు. చక్కగా నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు? మంచి ఆరోగ్యానికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని ఏళ్లుగా డాక్టర్లు చెబుతూ వస్తున్నదే. అయితే అలాంటి పట్టింపు అవసరం లేదని, జీవన శైలిని బట్టి కాస్త తక్కువగానో ఎక్కువగానో నిద్రించవచ్చని కెనడాలోని విక్టోరియా, బ్రిటన్లోని కొలంబియా విశ్వ విద్యాలయాల పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో వెల్లడించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్10 గంటల నిద్ర అనారోగ్యమే!ప్రతి దేశంలోనూ సంస్కృతికి అనుగుణం కాని నిద్ర గంటల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని కూడా క్రిస్టీన్ బృందం తమ అధ్యయనంలో కనుగొంది. అంటే చాలా తక్కువ నిద్రపోవడం లేదా చాలా ఎక్కువ నిద్రపోవడం అని కాకుండా, వారి సంస్కృతిని అనుసరించి నిద్ర పోవటం అన్నదే వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. బ్రిటన్ పౌరులు కొందరు 10 గంటల 26 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయిన కారణంగా.. అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నారని క్రిస్టీన్ బృందం పేర్కొంది. అమెరికాలో 8 గంటల 13 నిమిషాలు నిద్రపోయే వారిలో కూడా ఈ సమస్య కనిపించింది. క్రిస్టీన్ బృందం తమ అధ్యయనంలో పోషకాహారం, సంపద, అసమానత, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలను చేర్చలేదు. కాబట్టి నిద్ర గంటలకు, ఆరోగ్యంపై నిద్ర చూపే ప్రత్యక్ష ప్రభావంపై తీర్మానాలేవీ చేయలేకపోయారు. ‘ఎవరైనా ఎన్ని గంటలు నిద్రపోవాలన్న ప్రశ్నకు సమాధానం నిజంగా చాలా సంక్లిష్టమైనది. మనిషికి రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం అనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. మీ నిద్ర, ఆరోగ్యం విషయంలో మీ సంస్కృతిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కీలే విశ్వవిద్యాలయంలోని స్లీప్ సైకాలజిస్ట్ డాక్టర్ దల్జిందర్ చామర్స్ సూచించారు.దేశానికొక ‘తగినంత నిద్ర’నిద్ర కేవలం దేహధర్మం మాత్రమే కాదని, ఆ దేశ అలవాట్లు, సంస్కృతి, పని వేళలు, అక్కడి వాతావరణం, సూర్యరశ్మి తగిలేలా ఉండటం, సామాజిక నిబంధనల వంటి అనేక కారకాలు నిద్ర పోయే సమయాన్ని ప్రభావితం చేస్తాయని ‘విక్టోరియా స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ క్రిస్టీన్ చెబుతున్నారు. ‘‘ఒక దేశంలో ‘తగినంత’ నిద్రగా పరిగణన పొందేది, మరొక దేశంలో అతి నిద్ర కావచ్చు, లేదా చాలినంత నిద్ర కాకనూ పోవచ్చు’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న క్రిస్టీన్ అంటున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా తదితర 20 దేశాలలో ఈ అధ్యయనం కోసం ఆన్లైన్ ప్రశ్నపత్రాన్ని పూర్తి చేసిన దాదాపు 5,000 మంది వ్యక్తుల నిద్ర అలవాట్లు, ఆరోగ్య డేటాను విశ్లేషించి క్రిస్టీన్ బృందం ఈ ముగింపునకు వచ్చింది. నిద్రా సమయంపై గతంలోనూ అనేక సుప్రసిద్ధ సంస్థలు ఎన్నో అధ్యయనాలు చేశాయి. అలా జరిగిన 14 అధ్యయనాల నుండి అదనపు సమాచారాన్ని కూడా ప్రస్తుతం బృందం సేకరించింది. అంతేకాకుండా ఆయుర్దాయం, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి వాటికీ, నిద్రపోయే గంటలకు మధ్య ఉన్న సంబంధాన్ని లెక్కలోకి తీసుకుని పరిశోధకులు ఈ ఫలితాలను వెల్లడించారు. ఫ్రాన్స్లో ఎక్కువ... జపాన్లో తక్కువతాజా అధ్యయనం ప్రకారం.. భారతీయులు సగటున 7 గంటల 15 నిమిషాలు నిద్రపోతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు కూడా మన నిద్రా సమయంతో సమానంగా ఉండటం విశేషం. ఫ్రాన్స్ జాతీయులు తక్కిన దేశస్థుల కన్నా ఎక్కువ సమయం నిద్రిస్తున్నారు. ప్రశ్నపత్రం పూరించిన ముందు రోజు రాత్రి సగటున వారు 7.52 గంటలు నిద్రించారు. ఇక అందరికన్నా తక్కువగా నిద్రపోయిన వారు జపనీయులు. వారు 6.18 గంటలు మాత్రమే నిద్రపోయారు. బ్రిటన్ వాళ్లు 7 గంటల 33 నిమిషాలు నిద్రపోతే, అమెరికాలో నిద్రా సమయం 7 గంటల 2 నిమిషాలే. క్రిస్టీన్ బృందం మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా కనుగొంది. ఆరోగ్యకారకమైన ‘ఆదర్శ’ నిద్రా సమయం అంటూ ఏ దేశంలోనూ లేదు! తక్కువ సగటు నిద్ర వ్యవధి ఉన్న దేశాల వారిని ఎక్కువసేపు నిద్రపోయే దేశాలలోని వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు వాళ్ల ఆరోగ్యం అధ్వానంగా ఉందని చెప్పటానికి ఈ బృందానికేమీ ఆధారాలు కనిపించలేదు. దేశ సంస్కృతికి అనుగుణమైన నిద్ర గంటలు.. ఆదర్శ నిద్ర గంటల కంటే ఆరోగ్యంగా ఉంచుతున్నాయని అధ్యయనం పేర్కొంది. -
‘నాన్నా.. నేను మాత్రం బ్రతికాను.. తమ్ముడు ఏమయ్యాడో తెలీదు’
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం జూన్ 12వ తేదీ సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు.ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే బ్రతికానన్న ఆనందం అతనికి ఒకవైపు ఉండగా.. తన వెంట వచ్చిన సోదరుడు దుర్మరణం చెందాడన్న దుఃఖం మరొకవైపు కలచివేస్తోంది. రమేశ్ విశ్వాస్ కుమార్తో పాటు అతని సోదరుడు కూడా లండన్ బయల్దేరాడు. కానీ రమేశ్ విశ్వాస్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, సోదరుడు మాత్రం చనిపోయిన 241 మందిలో ఒకడయ్యాడు. ఇది రమేశ్ను అతని కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది.విమానం కూలి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత రమేశ్ తన తండ్రికి ఫోన్ చేసిన విషయాన్ని రమేశ్ మరో సోదరుడు నయన్ కుమార్ రమేశ్ స్కై న్యూస్క వెల్లడించాడు. ‘ మా నాన్నకు రమేశ్ విశ్వాస్ ఫోన్ చేశాడు. విమానం కూలిపోయిందన్నాడు. నేనొక్కడినే బయటపడ్డా. మిగతా ఎవరూ నాకు అక్కడ కనిపించలేదు. తమ్ముడు ఎక్కడ అనే విషయం కూడా తెలీదు. అసలు విమానం ఎలా కూలిపోయిందో నాకైతే అర్థం కాలేదు’ అని చెప్పినట్లు నయన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రమేశ్ ప్రాణాలతో బ్రతికాడన్న సంతోషం ఒకవైపు, ఉన్న మరొక సోదరుడ్ని కోల్పోవడం మాత్రం తీవ్ర వేదనకు గురిచేస్తుందన్నాడు. What Is Mayday Call: AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే! -
AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్లో ఐదు సెకన్ల పాటు రికార్డ్ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్.. నో త్రస్ట్.. గోయింగ్ డౌన్ ఇవి కెప్టెన్ సబర్వాల్ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు. మే డే కాల్కు శతాబ్ధానికి పైగా చరిత్ర!సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్కు సమానార్ధకం. ఫ్రెంచ్లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.మేడే కాల్ వస్తే..!ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. కాగా, జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. -
ఆ భగవద్గీత ఈమెదే!
అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన దుర్ఘటన.. ఎంతో మంది కుటుంబాల్లో తీరని విషాదాలు నింపింది. ప్రమాద సమయంలో 230 ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉండగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు సజీవంగా బయటపడి మృత్యుంజయుడయ్యాడు. విమాన ప్రయాణికులు సజీవ దహనమైపోవటంతో పాటు విమానం కూలిన భవనంలోని వాళ్లు ప్రాణాలు కోల్పోవటం.. దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే..ఈ దుర్ఘటనలో కన్నీటి కథలు.. ఎన్నో భావోద్వేగ గాథలు వెలుగుచూస్తూ గుండెల్ని మెలిపెడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. విమాన ప్రమాదం జరిగిన స్థలంలో భగవద్గీత దొరికిందని.. విమానం మొత్తం కాలిబూడిదైనా ఆ పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి . అయితే.. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి మనుషులంతా కాలి సజీవ దహనమైతే.. భగవద్గీత మాత్రం కాలిపోకుండా ఎలా ఉంది అనే కుతూహలం ఒకవైపు వ్యక్తమవుతుంటే.. మరోవైపు, అసలు ఆ భగవద్గీత ఎవరిదీ..? ఫ్లైట్లో ఎందుకుంది..? అని ప్రశ్నలు మొదలయ్యాయి.సాగర్ అమీన్ అనే వలంటీర్ విమాన ప్రమాదం గురైన స్థలంలో శిథిలాల తొలగింపు జరుగుతుండగా ఆ భగవద్గీతను కనిపెట్టారు. ఈలోపు.. ఆ గ్రంథం ఎవరనేదానిపై రకరకాల కథనాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ భగవద్గీత జయశ్రీ పటేల్(27)కు చెందిందన్నది ఓ ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ కథన సారాంశం. అందులోని వివరాల ప్రకారం..గుజరాత్ ఆరావళి జిల్లా కంభిసర్కు చెందిన జయశ్రీ పటేల్ శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు. ఎప్పుడూ ఆమె తన వెంట కృష్ణుడి చిన్న విగ్రహం, భగవద్గీతను తీసుకెళ్తుందట. ఈ ఏడాది జనవరిలో ఆమెకు వివాహం అయ్యింది. భర్త లండన్లో ఉద్యోగం. దీంతో ఆమె అక్కడికి బయల్దేరింది. అలా వివాహం అయిన మొదటిసారి.. ఆమె ప్రయాణంలోనూ వాటిని తీసుకెళ్లిందని, ప్రమాదంలో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లతో చెప్పినట్లు ఆ ఆంగ్ల మీడియా కథనం ఇచ్చింది. మరోవైపు ఆ భగవద్గీత ఓ ఎయిర్హోస్టెస్దంటూ మరో కథనం వైరల్ అవుతోంది. Bhagavad Gita was found from the debris of the plane crash. The surprising thing is that the book did not burn even in the midst of such a fierce fire. Jai Shree Krishna 🙏🌸Om Shanti#Ahmedabad | #Planecrash | #AirIndia | #BlackBox #planecrashahmedabad #bhagavadgita pic.twitter.com/ypdrm2JP2i— DivineDiva ❤️ (@potus021) June 13, 2025 -
‘మై లవ్..’గర్ల్ఫ్రెండ్ కోసం ఒంటరిగా కుమిలి కుమిలి : వైరల్ వీడియో
Air India Plane crash అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అందరినీ దుఃఖంలో ముంచెత్తింది. భయంకరమైన ప్రమాదంలో తన ప్రియురాలిని కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా రోదిస్తున్న వీడియో వైరల్గా మారింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావద్దేశాన్ని దిగ్భ్రాతిలో ముంచెత్తింది. ఈ ఘోర ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన వారు రోదిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ అయ్యాయి. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తన ప్రియురాలి మృతదేహం కోసం మౌనంగా రోదిస్తున్నాడు. గుండెలు పగిలే దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో పలువురి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు కార్చుతున్న అతణ్ని ఎవరికోసం ఎదురు చూస్తున్నారని అక్కడి అధికారి అడిగినపుడు, ‘మై లవ్ అంటూ సమాధానం చెప్పడంతో పలువురి కంట నీళ్లు తెప్పించింది. ప్రమాదం జరిగిన వెంటనే ముంబై నుండి ఇక్కడికి చేరుకున్నాడు. తన ప్రియురాలి మృతదేహం కోసం ఆసుపత్రిలో ఎదురు చూస్తున్న ఒంటరి వ్యక్తి, ఇలాంటి దృశ్యాలను చూడటం నిజంగా హృదయ విదారకంగా అంటూ జర్నలిస్ట్ వీడియోను షేర్ చేశారు. జూన్ 12, 2025న జరిగిన విమాన ప్రమాదంలో AI171 అహ్మదాబాద్ నుండి లండన్కు వెళుతుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి B.J. మెడికల్ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు , స్థానికులు సహా 272 మంది మరణించారు. At hospital waiting room, we found this young man. The body was yet to be handed over. He quietly sat there and wept on his own. He lost his girlfriend. No one by his side but a whole bundle of memories that he has to live with for the rest of his life. “Who are you waiting… pic.twitter.com/pdxsZhBPPN— Tamal Saha (@Tamal0401) June 13, 2025 -
Indian Students: మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. !
ఇజ్రాయిల్ నిన్న(శుక్రవారం) చేసిన దాడుల తర్వాత ఇరాన్లో ఉంటున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఇజ్రాయిల్ విరుచుకుపడటంతో ఇరాన్లో భారీ నష్టమే వాటిల్లింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించిన తర్వాత ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భీకర దాడుల్లో ఇరాన్ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. అయితే దీనికి ప్రతిగా ఇజ్రాయిల్పై ఈరోజు(శనివారం) ఇరాన్ మెరుపు దాడులు చేసింది. ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ఇజ్రాయిల్లో సైతం భారీ నష్టమే వాటిల్లినట్లే తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్లో ఉన్న భారత విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ సమయంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ వేడుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం ఇక్కడ అంతా బాగానే ఉందని, మీరంతా సురక్షితంగా ఉన్నారనే భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ భారత విద్యార్థులు మాత్రం ఈ దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని, తమకు ఒకానొక సమయంలో భారీగా భూమి కంపించినట్లు అనిపించిందని, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం చేయాలని విన్నవిస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఏది సురక్షిత ప్రాంతమనేది కూడా ఆ యూనివర్శిటీ అధికారులు చెప్పలేకపోతున్నారు. తమకు ఫలానా ప్రాంతం సురక్షితమైనదనే సమాచారం ఏదీ లేదని, మీరు దయచేసి సంయమనం పాటించాలని అంటున్నారు. ‘ మనమంతా సేఫ్ ప్లేస్లో ఉన్నాం. దయచేసి మీరు కామ్గా ఉండండి’ అంటూ టెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టీయూఎంఎస్) అధికారులు చెప్పినట్లు కశ్మీర్ నుంచి వెళ్లి అక్కడ ఎంబీబీఎస్ రెండో ఏడాది చదువుతున్న తబియా జహ్రా పేర్కొన్నారు.ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెళ్లిన అలిషా రిజ్వీ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం మా డేటాను అధికారులు సేకరిస్తున్నారు. మా ఈ మెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మమ్మల్ని తరలించే అవసరం ఏర్పడితే అందుకు ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నారు’ ని ఆమె పేర్కొన్నారు. వీరిద్దరి 5.5 ఎంబీఎస్ ప్రోగ్రామ్లో భాగంగా ఇరాన్లోని టెహ్రాన్కు 2023లో రాగా, ఇప్పటికి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదే తరహాలో చాలామంది విద్యార్థులు ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితుల నడుమ భయాందోళనలతో ఉన్నారు. ఇదిలా ఉంచితే, జమ్మూ కశ్మీర్ విద్యార్థి సంఘం.. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ను కలిసింది. భారత స్టూడెంట్లు అక్కడ ప్రస్తుత భయానక పరిస్ధితుల్లో ఉన్నారని, వారికి పదేపదే యుద్ధ సైరన్లు వినిపించడంతో వారు బెంబేలెత్తిపోతున్నారని జై శంకర్కు సదరు అసోసియేషన్ పెద్దలు విజ్తిప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇరాన్లో చదువుతున్న తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మరొకవైపు ఇరాన్లోని భారతీయుల కోసం అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అడ్వైజరీలో పేర్కొంది. అయితే ఇప్పుడు తాము ఉన్న ప్రదేశంలో ఉండలేకపోతున్నామనే ఆందోళన భారత విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. -
తాజ్మహల్ను మైమరిపించే ఇల్లు.. ఆ మాటలకు ఫిదా కావాల్సిందే!
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థల ఓనర్ కమ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇక్కడో పెద్దాయన అట్లాంటి డైలాగులేవీ పేల్చడం లేదు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ను మోడల్గా తీసుకుని ఏకంగా ఇంటినే నిర్మించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించకపోవచ్చు. కానీ, ఆయన చెప్పిన విధానం మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటోంది.మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో తాజ్ మహల్ను తలపించేలా నాలుగు బెడ్రూమ్లో ఓ భవనం ఉంది. స్థానికంగా విద్యా సంస్థను నడిపించే ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ నివాసం అది. 2021లో ఈయనగారు ఈ ఇంటితో నేషన మీడియా దృష్టిని ఆకర్షించారు. నాలుగు బెడ్రూమ్లు, ఓ కిచెన్, ఓ మీడియేషన్ రూం.. ఇందులో ఉంటాయి. ఆ ఇంటిని ఆనుకునే ఆ హైటెక్ గురుకుల్ కూడా ఉంది. తాజ్మహల్ పరిమాణంలో మూడింట ఒకటో వంతు ఉందట ఆ ఇల్లు. ఓ వ్లోగర్ ఆ జంటను పరిచయం చేసుకుని ఆ ఇంటిని పరిశీలించడం ఆ వీడియోలో ఉంది.👉మా తాజ్ మహల్.. నాలుగు బెడ్రూమ్ల ఇల్లు. అసలైన తాజ్ మహల్ ప్రేమకు సమాధి. ఇదేమో నా భార్యకు ప్రేమతో కట్టించిన ఇల్లు.. అంతే తేడా👉చిన్నతనంలో ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాడిని. గర్వం తలకెక్కించుకోకు అని గుర్తు చేయడానికి గృహ ప్రవేశం సమయంలో ఈ ఇంటి మధ్యలో ఇలా గేదె బొమ్మను ఉంచాను. ఇది ఎప్పుడూ నా మూలాలను గుర్తు చేస్తుంటుంది👉నా భార్య మెడిసిన్ వదిలేయాల్సి వచ్చింది. నేను ఇంజినీరింగ్ చేయలేకపోయాను. అందుకే పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అలా దేశంలోనే మోస్ట్ హైటెక్ గురుకుల్ను నడిపిస్తున్నాం. 2200 మంది పిల్లలు. వాళ్లే మా కుటుంబం.👉దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్కటే.. ప్రేమ. అన్నట్లు ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ విద్యావేత్త మాత్రమే కాదు, తరచూ దాతృత్వ కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. మోటివేషనల్ స్పీకర్గానూ ఆయన వీడియోలు కొన్ని అక్కడ వైరల్ అవుతుంటాయి. View this post on Instagram A post shared by Priyam Saraswat (@priyamsaraswat) -
ఉన్నత చదువులకు ఫస్ట్ ఫ్లైట్ అదే లాస్ట్..: ఆటో డ్రైవర్ కుమార్తె విషాదాంతం
Air India Plane Crash : అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరిదీ ఒక్కో విసాదం. ఉన్నత చదువులు చదివి, కుటుంబాన్ని ఆదుకోవాలని కోటి ఆశలతో తొలిసారి విమానం ఎక్కిన ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపిందిగుజరాత్లోని హిమత్నగర్కు చెందిన పాయల్ ఖాతిక్ (Payal Khatik) తొలిసారి విమానం ఎక్కింది. భవిష్యత్ కలలతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా బయలుదేరింది. కానీ అదే అదే చివరికి అవుతుందని అస్సలు ఊహించలేదు. ఆమె తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతాడు. MTech చదవడానికి లండన్ వెళ్లేందుకు గురువారం ఉదయం ఉత్సాహంగా బయలుదేరింది. నిజం చెప్పాలంటే ఆ కుటుంబంలో విమానం ఎక్కిన తొలి వ్యక్తి కూడా ఆమెనే. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని బాగా చూసుకోవాలని, పేదరికం నుండి విముక్తి చేయాలని ఎన్నో కలలు కంది. కానీ ఆ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.ఉదయపూర్లో బిటెక్ పూర్తి చేసిన ఆమె ఇంజనీరింగ్ , టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి యునైటెడ్ కింగ్డమ్కు పయనమైంది.ఉదయం తమ ప్రియమైన కుమార్తెకు హృదయపూర్వక వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లింది, ఆమె లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఆమె చదువులో రాణిస్తుందని కొండంత నమ్మకం వాళ్లకి. అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విమానంతో పాటు, వీరి ఆశలు కూడా గల్లంతైపోయాయి."ఆమె కళాశాల పూర్తి చేసిన తర్వాత, మాతోనే ఉంది ...లండన్లో పై చదువులు చదువు కోవాలనుకుంది. ఇందుకోసం మేం రుణం తీసుకుసి పంపాం.." అంటూ ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ దుఃఖంతో చెప్పారు.#WATCH | Sabarkantha, Gujarat | Relative of a deceased passenger of AI-171 plane crash, Suresh Khatik says, "...After completing her college, she used to stay with us. Then she wanted to study in London. We took out loans to support her education there...My DNA sample has been… pic.twitter.com/G35tZaWJha— ANI (@ANI) June 13, 2025పాయిల్ చాలా మంచి అమ్మాయి అని ఆమె స్నేహితులు తెలిపారు. బీటెక్ పూర్తైన తరువాత ట్యూషన్లు చెప్పి, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండేదని బంధువు పాయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం పాయల్ ఖాతిక్ను చివరిసారిగా కలిశానని, గత ఆరేళ్లుగా తన కుమారుడికి ట్యూషన్ చెబుతోందనీ, పాఠక్ దంపతులు తెలిపారు. -
11A సీట్.. 1998లో అచ్చం ఇలాగే.. మరో జన్మ ఎత్తిన సింగర్!
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు. నా విషయంలోనూ ఇదే మిరాకిల్ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.రెండో జన్మ..ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.1998లో విషాదం1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.మాటలకందని విషాదంజూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది? -
నీట్ యూజీ-2025 ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించిన నీట్ యూజీ-2025 ఫలితాలు ఈ రోజు (జూన్ 14)విడుదలయ్యాయి. తుది సమాధానపు కీని కూడా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా నీట్ యూజీ- 2025 ఫలితాలను తెలుసుకోవచ్చు.ఇందుకోసం అభ్యర్థులకు వారి అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ అవసరమవుతుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి కటాఫ్ మార్కులను కూడా ఈ ఫలితాలతో పాటు విడుదల చేశారు. గత సంవత్సరం నీట్ పరీక్ష కటాఫ్ గణనీయంగా ఎక్కువగా ఉంది. 2024లో జనరల్, ఆర్థికంగా వర్గాలవారికి కటాఫ్ 162 మార్కులుగా ప్రకటించారు. గత సంవత్సరాల ట్రెండ్లు, ఈ ఏడాది పరీక్ష స్థాయిని పరిగణనలోకి తీసుకున్న దరిమిలా కటాఫ్ కొద్దిగా తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ సంవత్సరం 20 లక్షలకు పైగా అభ్యర్థులు ‘నీట్’కు హాజరుకాగా, ఈ పరీక్ష 2025, మే 4న జరిగింది. -
Air India crash: విమానంలో ‘11ఏ’ సురక్షితమా? రమేష్ని అదే కాపాడిందా?
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విస్వాస్ కుమార్ రమేష్ ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. మిగిలిన 241 మంది మృతిచెందారు. దీంతో విస్వాస్ కుమార్ రమేష్ మృత్యుంజయుడని అంటున్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానంలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వష్ కుమార్ రమేష్ ‘11ఏ’ సీటులో కూర్చున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని అందరూ మృతిచెందగా, 40 ఏళ్ల వ్యాపారవేత్త విస్వాస్ కుమార్ రమేష్ శిథిలాల మధ్య నుండి బయటకు నడుచుకుంటూ వచ్చి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. రక్తంతో తడిసిన షర్టుతో కనిపించాడు. తాను ఈ ప్రమాదం నుంచి దాని నుండి ఎలా సజీవంగా బయటపడ్డానో తనకే తెలియడం లేదని ఆయన ‘దూరదర్శన్’కు చెప్పాడు.రమేష్ ప్రాణాలతో బయటపడిన దరిమిలా అతను కూర్చున్న ‘11ఏ’ సీటు సురక్షితమైనదంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రమేష్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడంటూ చెబుతున్నారు. ఈ నేపధ్యంలో విమానయాన నిపుణుడు అంగద్ సింగ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. వివిధ విమాన ప్రమాదాల గణాంకాల ప్రకారం, విమానంలో కొన్ని సురక్షితమైన సీట్లు ఉంటాయి. మధ్యలో ఉన్న సీట్ల కంటే చివర లేదా కుడి ముందు భాగంలో ఉన్న సీట్లు సురక్షితమైనవని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అందుకు భిన్నంగా జరిగిందన్నారు. సీటు 11ఏ విమానం మధ్యలో, రెక్క ముందు ఉందన్నారు. ఈ ఘటన అద్భుతమని, ఇంకా చెప్పేందుకు మరో పదం లేదన్నారు.విమానాలకు సంబంధించి ప్రతి ప్రమాదం భిన్నంగా ఉంటుందని, సీటు స్థానం ఆధారంగా సురక్షితమనేది తేల్చిచెప్పడం అసాధ్యమని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ పేర్కొన్నారు. కాగా మీడియా నివేదికల ప్రకారం 2007 పాపులర్ మెకానిక్స్ అధ్యయనం ప్రకారం విమానం వెనుక వైపు ఉన్న సీట్లు సురక్షితమైనవని తేలింది. కొంతమంది నిపుణులు రెక్కల దగ్గరుస్న సీట్లు సురక్షితమైనవని చెబుతుంటారు. కాగా ఈ ప్రమాదంపై దర్యాప్తునకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు.ఇది కూడా చదవండి: Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట.. -
భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
కర్ణాటక: భర్త వివాహేతర సంబంధాన్ని భరించలేని భార్య నిద్రిస్తున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో భర్త ఆస్పత్రిలో చనిపోయాడు. కావేరిపట్టణం వద్ద ఈ సంఘ టన జరిగింది. వివరాల మేరకు క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని తిమ్మాపురం ప్రాం తానికి చెందిన కూలికార్మికుడు రంగస్వామి (47), అతని భార్య కవిత(44). ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సూర్య (23) కొడుకు న్నాడు.రంగస్వామి తాగుడుకు అలవాటు పడ డంతో పాటు గత మూడేళ్లుగా ధర్మపురి జిల్లా కారిమంగలం ప్రాంతానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. దీం తో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. 9వ తేదీన రాత్రి మిద్దెపై నిద్రిస్తున్న రంగస్వా మిపై భార్య పెట్రోలు పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలేర్పడిన అతన్ని కొడుకు సూర్య చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకె ళ్లాడు. ఆస్పత్రిలో చికిత్స ఫలితంలేక బుధవారం రాత్రి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
Air India crash: ‘నువ్వెళ్లు.. నేను జాయిన్ అవుతా’.. అదే స్నేహితుని చివరి మాట..
అహ్మదాబాద్: జూన్ 12 మధ్యాహ్నం రెండు గంటలు.. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం వైపు దూసుకువస్తోంది.. ఈ అకస్మాత్తు పరిణామాన్ని గ్రహించని ఇద్దరు వైద్య విద్యార్థులు మెస్లో అప్పుడే భోజనం ముగించారు. తన స్నేహితునికి మొబైల్ ఫోన్ ఇచ్చిన 20 ఏళ్ల ఆర్యన్.. చేతులు కడుక్కుంటూ ‘నువ్వెళ్లు.. నేను నీతో జాయిన్ అవుతాను’ అని అన్నాడు. ఆ స్నేహితుడు బయటకు వెళ్లిపోయాడు.ఆర్యన్ చేతులు కడుక్కనే పనిలో ఉన్నాడు. ఆ క్షణంలో విమానం భవనాన్ని ఢీకొని కుప్పకూలింది. వెంటనే ఆ ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. 10 నిమిషాలకు తేరుకున్న ఆ స్నేహితుడు తన చేతిలోని ఆర్యన్ ఫోన్తో గ్వాలియర్లోని అతని బంధువులకు ఫోన్ చేశాడు. ‘మీరు త్వరగా రండి, ఆర్యన్ తీవ్రగాయాలతో ఐసీయూలో ఉన్నాడు’ అని చెప్పాడు. ఆర్యన్ కుటుంబ సభ్యులు అహ్మదాబాద్కు వెంటనే బయలుదేరారు. వారు వచ్చే సమయానికే ఆర్యన్ మృతిచెందాడు.జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (ఫైమా) సభ్యుడు డాక్టర్ ధవల్ ఘమేటి మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్యన్ రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి. విమానం కూలిపోయినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలొదిలాడు. అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు’అని తెలిపారు. ఆర్యన్ ఎంతో తెలివైన విద్యార్థి. నీట్ కోచింగ్ తీసుకోకుండానే ఈ పరీక్షలో 720 కి 700 స్కోర్ చేశాడు. అదికూడా మొదటి ప్రయత్నింలోనే ఈ ఘనత సాధించాడు. ఇంటర్నెట్లో దొరికిన స్టడీ మెటీరియల్ సాయంతో నీట్ క్రాక్ చేశాడు. ఆర్యన్ తండ్రి రామ్హెట్ రాజ్పుత్ మాట్లాడుతూ తన చిన్న కొడుకును డాక్టర్గా చూడాలనే తన కల భగ్నమయ్యిందన్నారు. తన పెద్ద కుమారుడు సివిల్ సర్వీసెస్కు సిద్ధమవుతున్నాడని తెలిపారు.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై.. -
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర.. ఇస్రో కీలక ప్రకటన
ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 19వ తేదీన శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేపట్టనున్నారు. యాక్సియం-4 మిషన్ కింద మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి ఆయన నింగిలోకి వెళ్లనున్నారు. అయితే, తొలుత మే 29న ప్రయోగం జరగాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలతో పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో కొత్త తేదీని ప్రకటించింది.ఇదిలా ఉండగా.. అంతకుముందు శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసియాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యతో యాత్రను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ఎక్స్ తెలిపింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా ప్రయోగం వాయిదా పడినట్లు ‘ఎక్స్’లో పేర్కొంది. మరమ్మతులకు సమయం పడుతుందని.. త్వరలోనే కొత్త లాంచ్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. ప్రయోగ వాయిదా విషయాన్ని భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ధ్రువీకరించింది. ప్రయోగానికి ముందు బూస్టర్ టెస్టును తనిఖీ చేస్తుండగా ఈ సమస్యను గుర్తించినట్లు తెలిపింది. తొలుత లీక్ సమస్యను పరిష్కరించి పరీక్షించిన తర్వాత ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్ను ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్ పైలట్ బాధ్యతలు నిర్వహిస్తారు. BREAKING 🚨#Ax4 Mission with India’s Shubhanshu Shukla to launch on June 19, #ISRO says pic.twitter.com/XTX3wQE7kg— Sibu Tripathi 🪂 (@imsktripathi) June 14, 2025 -
నేనే రెండు కోట్లిస్తా.. నా తండ్రిని ప్రాణాలతో తెస్తారా?
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు టాటా గ్రూప్ సంస్థ భారీగా పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో మహిళ టాటా గ్రూప్ వాళ్లకే రెండు కోట్ల రూపాయలు ఎదురిస్తానంటోంది. బదులుగా.. చనిపోయిన తన తండ్రిని ప్రాణాలతో తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. నవ్వుతూ నిత్యం తమ మధ్య తిరిగిన తండ్రి.. తాజా ఘటనలో దుర్మరణం పాలై మృతదేహాం జాడ కూడా లేని స్థితిలో ఉన్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.‘‘నా తండ్రే పోయాక మీ పరిహారం ఎవరికి కావాలి. నేను వాళ్లకు రెండు కోట్ల రూపాయిలిస్తా. బదులుగా చనిపోయిన నా తండ్రిని బతికించి తీసుకురండి. వాళ్లు ఇచ్చే పరిహారం నా తండ్రిని వెనక్కి తెస్తుందా?.. నాకు నా తండ్రి, ఆప్యాయతలు కావాలి. వాటి కోసం వాళ్లలా ఎంతైనా నేను ప్రకటిస్తా’’ అంటూ ఫాల్గూని అనే మహిళ కన్నీరు పెట్టుకుంది. ఫాల్గునితో పాటు బాధిత కుటుంబాలు అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఘటనలో మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో కాలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రెండోరోజూ డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. అధికారులు బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శాంపిల్స్ సేకరణ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నాం. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెబుతున్నారు. ఎప్పుడు ఆ ఫలితాలు వచ్చేది?. . ఎప్పుడు మా వాళ్లను అప్పగించేది? అని ఫాల్గునితోపాటు మరికొందరు అధికారులను నిలదీశారు.మరోవైపు.. అధికారులు మాత్రం తమ బృందాలు అహర్నిశలు పని చేస్తున్నాయని చెబుతున్నారు. ‘‘దాదాపుగా బంధువుల నుంచి శాంపిల్స్ సేకరించాం. ఇప్పటికే 240 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాం. డీఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి కాగానే.. వీలైనంత త్వరగా మృతదేహాలు అప్పగిస్తాం’’ అని ఓ అధికారి వెల్లడించారు. -
Updates: ఎయిరిండియా కీలక నిర్ణయం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటనకు సంబంధించిన దర్యాప్తు వేగం పెరిగింది. డీజీసీఏతో పాటు దర్యాప్తు సంస్థలు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలనలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన శకలాలను తొలగించకూడదని గుజరాత్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్లీనియంగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.AI-171 విమానం నుంచి చివరి సందేశంవిమానంలో పవర్ కట్ అయిందని..కిందకి పడిపోతున్నట్టు మెసేజ్ఎయిర్ ఇండియా విమానం నుంచి ఏటీసీకి మేడే కాల్లో ఆడియోవిమానంలో పవర్ కోల్పోయామని ఏటీసీకి వెల్లడించిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఐదు సెకన్ల ఆడియో మేడే.. మేడే.. మేడే.. నో పవర్.. నో థ్రస్ట్.. గోయింగ్ డౌన్ అని చెప్పిన కెప్టెన్ సబర్వాల్ఏటీసీ వద్ద రికార్డయిన ఐదు సెకన్ల ఆడియోఎయిరిండియా కీలక నిర్ణయంఅహ్మాదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయంవిమానంలో ప్రయాణిస్తున్నన 241 మంది దుర్మరణంభవనంపై విమానం కూలి మెడికోలు, ఇతరులు మృతిమొత్తం మృతుల సంఖ్య 274ఇక నుంచి ఏఐ-171 విమాన సర్వీస్ నిలిపివేతదానికి బదులు ఎయిరిండియా- 159 విమానంఇక నుంచి లండన్కు వెళ్లనున్న ఏఐ-159 సర్వీస్ విమానం ప్రమాదంపై విచారణ జరుగుతోంది: రామ్మోహన్నాయుడుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పౌర విమానయాన శాఖ జరిపిన సమీక్ష వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుపైలట్ మే డే కాల్ చేశారుఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే ప్రమాదం జరిగిందిఅహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగిందిరెస్క్యూ ఆపరేషన్కు గుజరాత్ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందిబ్లాక్ బాక్స్ దొరికింది.. డీకోడ్ చేస్తున్నారుబ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా ఏం జరిగిందనేది తెలుస్తుందిహైలెవల్ కమిటీతో ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందినివేదిక వచ్చాకే బాధ్యులపై చర్యలు ఉంటాయివిమాన ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది787 సిరీస్ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశాలిచ్చాండీఎన్ఏ పరీక్షలు పూర్తైన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తాంపౌర విమానయాన శాఖ సమీక్ష వివరాలు వెల్లడిఎయిరిండియా విమాన ప్రమాదంపై పౌరవిమానయాన శాఖ సమీక్షవివరాలు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ అధికారులుAircraft Accident Investigation Bureau (AAIB) దర్యాప్తు కొనసాగుతోందని తెలిపిన అధికారులువిమానం 650 అడుగుల ఎత్తు ఎగిరాక కూలిపోయిందిపైలట్ చివరిసారిగా మే డే కాల్ అన్నారుఆ తర్వాత ఎలాంటి సిగ్నల్ అందలేదుమూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించాంరంగంలోకి ఎన్ఐఏఅహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలికి జాతీయ దర్యాప్తు సంస్థకుట్ర కోణం నేపథ్యంతో విచారణ జరుపుతున్న ఎన్ఐఏక్షుణ్ణంగా పరిశీలనలు జరుపుతున్న బృందంబోయింగ్ ట్రాజెడీ పాపం ఎవరిది?తనిఖీ, నిర్వహణ లోపమే కారణమా?డీజీసీఏ హెచ్చరికలను ఎయిరిండియా పట్టించుకోలేదా? వైమానిక ఇంధనం కలుషితం అయ్యిందా? ఎందుకు గాల్లో ఎగరలేక పోయింది? టేకాఫ్ సెట్టింగుల్లో లోపం, పైలట్ తప్పిదమే కారణం?ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అంతు చిక్కడం లేదా? దర్యాప్తులో తేలాల్సిన విషయాలెన్నోక్లిక్ చేయండి: రెండు ఇంజన్లు విఫలమవడం అత్యంత అసాధారణం! అహ్మదాబాద్ ప్రమాద ఘటన.. మరికాసేపట్లో పౌర విమానయాన శాఖ సమీక్షకీలకంగా డిజిటల్ ఆధారాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుభవన శిథిలాల నుంచి ఇప్పటికే బ్లాక్ బాక్స్ స్వాధీనంబ్లాక్ బాక్స్ విశ్లేషిస్తే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలిసే అవకాశండిజిటల్ వీడియో రికార్డర్ను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ఏటీఎస్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబ్కు డీవీఆర్ను పంపిన అధికారులుబోయింగ్ ట్రాజెడీ ఫైల్స్అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తుప్రాథమికంగా.. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ కమిటీ దర్యాప్తుకేంద్రం తరఫున.. నిపుణులతో హైలెవల్ కమిటీ దర్యాప్తుడీజీసీఏ విచారణ కూడాభారత్లో బోయింగ్ విమానాల తనిఖీలుప్రత్యేక అడిటింగ్కు ఆదేశించిన కేంద్రం👉ప్రమాదంలో విమానంలో ఉన్నవాళ్లతో పాటు.. విమానం నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని వాళ్లు కూడా మరణించారు. దర్యాప్తు నేపథ్యంలో మెడికల్ కాలేజీ భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు. 👉ఎయిరిండియా బోయింగ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం ఉదయానికి 274కి చేరింది. 👉విమానంలో సిబ్బందితో సహా 242 మంది ఉండగా.. 241 మంది మరణించారు. విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రుడు రమేష్ను ప్రధాని మోదీ సైతం పరామర్శించారు. 👉గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం (AI171) అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి లండన్ గాట్విక్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన కొద్ది సెకన్లకే మెఘాని ప్రాంతంలో జనావాసాలపై కుప్పకూలిపోయింది. 👉మే డే కాల్ ఇచ్చిన పైలట్ ఆ వెంటనే విమానాన్ని క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ ధాటికి విమానం భారీ శబ్దం చేస్తూ పేలిపోగా.. 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ధాటికి ప్రయాణికులు ఖాళీ మసైపోయారు. 👉ప్రయాణికులతో పాటు జనావాసాలపై కుప్పకూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది👉విమాన ప్రమాదం ఎందుకు జరిగిందనేదానిపై కొనసాగుతున్న విచారణ -
Air India Crash: నాడు ‘ఎంపరర్ అశోక’.. నేడు ‘డ్రీమ్ లైనర్’.. అదే విషాదం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారి విషాద గాథలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ, ఈ ప్రమాదంతో ముడిపడిన అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం 1978 నాటి ‘ఎంపరర్ అశోక’ విషాదాన్ని పోలివుందనే కథనాలు తెరమీదకు వస్తున్నాయి. నాడుముంబైకి మూడు కి.మీ దూరంలో జరిగిన ‘ఎంపరర్ అశోక’ ప్రమాదంలో విమానంలోని 213 మంది కన్నుమూశారు. ఈ రెండు ఘటనల్లో విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే అవి కూలిపోయాయి.1978, నూతన సంవత్సరం తొలిరోజున..గురువారం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నివాస భవనాలపై ఎయిర్ ఇండియా విమానం ఏI 171, బోయింగ్ 787-8 ‘డ్రీమ్లైనర్’ కూలిపోయింది. ఈ ప్రమాదం దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ముంబై నుండి అరేబియా సముద్రంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం ఏI 855, ‘ఎంపరర్ అశోక’ఘటనను పోలి ఉందని నిపుణులు చెబుతున్నారు. 1978, జనవరి 1.. నూతన సంవత్సరం తొలిరోజున ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747 అయిన ‘ఎంపరర్ అశోక’ ముంబైలోని శాంటా క్రజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం) నుండి దుబాయ్కి బయలుదేరింది. 190 మంది ప్రయాణికులు, 23 మంది సిబ్బందితో బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన ఒక నిమిషం తర్వాత, ఎనిమిది వేల అడుగుల ఎత్తునకు చేరేందుకు అనుమతి లభించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా ప్రయాణం సాగిస్తోంది. అయితే ఇంతలో అత్యంత ముఖ్యమైన యాటిట్యూడ్ డైరెక్టర్ ఇండికేటర్ (ఏడీఐ)పనిచేయలేదు.నాడు సముద్రంలో.. నేడు జనావాసాల్లో..దాదాపు 18 వేల విమాన గంటలు నడిపిన కెప్టెన్, మదన్ లాల్ కుకర్(51) వెంటనే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ విమానంలో మాజీ భారత వైమానిక దళ కమాండర్ ఇందు విర్మాణి(43) కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలోని అత్యంత సీనియర్ ఇంజనీర్లలో వారు ఒకరు. అలాగే అనుభవజ్ఞులైన ఫ్లైట్ ఇంజనీర్ ఆల్ఫ్రెడో ఫారియాకూడా విమానంలో ఉన్నారు. విమానం రాత్రిపూట అరేబియా సముద్రం మీదుగా ఉన్నందున, దృశ్య హోరిజోన్ సూచన లేకపోవడంతో కెప్టెన్ కుకర్ ఎడమ నియంత్రణ ఇన్పుట్లను ఉపయోగించి కుడి ఒడ్డును సరిచేశారు. విమానం 108 డిగ్రీల కోణంలో ఎడమవైపుకు తిరుగుతూనే దాదాపు 2,000 అడుగుల నుండి నిటారుగా దాదాపు 35-40 డిగ్రీల కోణంలో కిందకు పడిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇది జరిగిన 47 ఏళ్ల తర్వాత మొన్నటి జూన్ 12న మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం AI 171, బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ‘ఎంపరర్ అశోక’ మాదిరిగానే ‘డ్రీమ్లైనర్’ కూడా విమానాశ్రయానికి సమీపంలోనే కూలిపోయింది. అయితే ఈసారి జనావాస ప్రాంతంలోకూలిపోయి, పెను విషాదాన్ని మిగిల్చింది.ఇది కూడా చదవండి: Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై.. -
బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుశిక్ష.. ఐదు లక్షల జరిమానా
సాక్షి, చెన్నై: తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేస్తున్న నేపథ్యంలో బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. వివరాల ప్రకారం.. తమిళనాడులో కొన్ని రుణసంస్థలు బెదిరించి అప్పు వసూలు చేయడం, ఆస్తులు స్వాధీనం చేసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి అడ్డుకట్టేందుకు స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శాసనసభలో చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బలవంతంగా అప్పు వసూలు చేసినా, రుణగ్రహీతల ఆస్తులు స్వాధీనం చేసుకున్నా ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించేలా ఈ బిల్లును రూపొందించారు.కాగా, బలవంతంగా అప్పు వసూలు చేసి రుణగ్రహీత బలవన్మరణానికి పాల్పడితే సదరు రుణసంస్థ బలవన్మరణానికి ప్రేరేపించినట్లు భావించేలా, బెయిల్ లభించని విధంగా జైలుశిక్ష విధించేలా బిల్లును రూపొందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లును సభలో ఆమోదించారు. అనంతరం, బిల్లును గవర్నర్ ఆర్.ఎన్.రవికి పంపించగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు.బయో మెడికల్ వ్యర్థాలను డంపింగ్ చేస్తే జైలుకే..అదేవిధంగా, తమిళనాడులో బయోమెడికల్ వ్యర్థాలను డంప్ చేసినందుకు విచారణ లేకుండా ప్రత్యక్ష జైలు శిక్ష విధించే బిల్లును మార్చి 24న శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును మాజీ న్యాయ మంత్రి రఘుపతి ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 29న దీని చర్చ జరిపిన తరువాత ఆమోదించారు. అనంతరం, గవర్నర్కు పంపించడంతో.. ఈ బిల్లుకు కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా బయో మెడికల్ వ్యర్థాలను సేకరించిన లేదా పొరుగు రాష్ట్రాల నుండి తమిళనాడులో వైద్య వ్యర్థాలను డంప్ చేసిన ఎవరైనా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నియమాలను ఉల్లంఘించినట్లు పరిగణించబడతారు. దీంతో, విచారణ లేకుండానే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. -
Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్కు తరలివచ్చారు. ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.దీనికి ఎవరు బాధ్యులు?తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11 ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.‘అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్’మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్ జరగాల్సివుంది. మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు. మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని ఇంతియాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు.. -
పరిహార భారం ఎయిర్ ఇండియాదే
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్ డ్రీమ్లైనర్ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. అహ్మదాబాద్ ప్రమాదంలో ఎయిర్ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్డీఆర్ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్డీఆర్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) గతంలోనే ఖరారు చేసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. మాంట్రియల్ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్డీఆర్లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్గా చెల్లించాలి. మాంట్రియల్ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది. -
మెడికల్ కాలేజీ మృతులెందరు?
అహ్మదాబాద్: ఎయిరిండియా విమానానికి సంభవించిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై గురువారం అర్ధరాత్రికే స్పష్టత వచ్చింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందికి గాను ఒక్కరు మినహా అందరూ దుర్మరణం పాలయ్యారు. 241 మంది మరణించినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫైన 33 సెకన్లకే రన్వే సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ మెస్, హాస్టల్పై పడి పేలిపోవడం తెలిసిందే. ఆ సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అత్యంత భారీ పేలుడు సంభవించింది. దాంతో మెస్, హాస్టల్ ధ్వంసమవడమే గాక పరిసర భవనాలకూ నిప్పంటుకుని కాలిపోయాయి. కానీ అక్కడి వారిలో ఎందరు చనిపోయారన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై గుజరాత్ ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు. కనీసం 24 మంది మరణించినట్టు గురువారమే వార్తలొచ్చాయి. గురువారం అర్ధరాత్రికే ఆస్పత్రికి 265 మృతదేహాలు వచ్చినట్టు డీఎస్పీ కనన్ దేశాయ్ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చింది. నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు, ఒక వైద్యుడు, మరో వైద్యుడి భార్య మృతిని కాలేజీ వర్గాలు గురువారం రాత్రి ధ్రువీకరించాయి. మరో 60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డట్టు ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించింది. అంతేగాక ఇద్దరు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్ డాక్టర్ మీనాక్షీ పారిఖ్ తెలిపారు. వీరి పరిస్థితి ఏమిటన్నది మాత్రం శుక్రవారం అర్ధరాత్రి దాకా తెలియరాలేదు. ప్రమాదస్థలి వద్ద భవనాల శిథిలాలు తదితరాలను తొలగించేందుకు ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నట్టు సంస్థ డీజీ హరి ఓం గాంధీ శుక్రవారం తెలిపారు. మృతులపై మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. దాంతో మొత్తం మృతుల సంఖ్యపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. శుక్రవారం మరో నలుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల మృతదేహాలు లభించాయని, మొత్తం మృతుల సంఖ్య 325కి చేరిందని వార్తలొచ్చాయి. గుజరాత్ పోలీసులు కూడా మృతుల సంఖ్య 294కు చేరినట్టు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. కానీ, ‘240 మందికి పైగా మరణించార’ంటూ సాయంత్రానికల్లా సవరణ ప్రకటన చేశారు! మెడికల్ కాలేజీ మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు గుట్టుగా ఉంచుతున్నదీ అంతుబట్టడంలేదు. -
వెయ్యి డిగ్రీల వేడిలోనూ బ్లాక్ బాక్స్ భద్రం
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్(డీవీడీ) అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1,000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్). ఎఫ్డీఆర్లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజన్ పనితీరును ఇది రికార్డు చేస్తుంది. కాక్పిట్లోని శబ్ధాలు, సంభాషణలు సీవీఆర్లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో బ్లాక్బాక్స్ తయారు చేస్తారు. ఇది 1,100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతోపాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్ప్రూఫ్. నీటిలో 6 వేల మీటర్ల లోతున కూడా 30 రోజులపాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులోని నుంచి సంకేతాలు వెలువడుతుంటాయి. డీవీఆర్ అనేది బ్లాక్బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ఇందులో ఉంటుంది. విమానం కాక్పిట్, కేబిన్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, డీవీఆర్ డేటాను ప్రత్యేక ల్యాబ్ల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి, డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. -
ఒకరు మానేద్దామనుకున్నారు.. ఇంకొకరు ఇప్పుడే మొదలెట్టారు!
ముంబై: ప్రమాదానికి గురైన బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పైలట్ సుమీత్ సభర్వాల్(56), కో పైలట్ క్లైవ్ కుందర్లది విభిన్నమైన నేపథ్యం. ఒకరు ఎంతో అనుభవశాలి కాగా, మరొకరు ఇప్పుడిప్పుడే కెరీర్ను మొదలుపెట్టారు. సభర్వాల్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే యోచనలో ఉండగా, క్లైవ్ కుందర్ భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ఫ్లయింగ్ అనుభవం వీరిద్దరిదీ కలిపి 9,300 గంటలు కాగా, ఇందులో సభర్వాల్ ఒక్కరికే 8,200 గంటల అనుభవముంది. పైలట్ సుమీత్ సభర్వాల్(56) ముంబైలోని పొవై ప్రాంతానికి చెందిన జల్ వాయు విహార్లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన సుమీత్కు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటారని పేరుంది. ‘వింగ్ కమాండర్గా రిటైరయ్యాను. ఎయిరిడింయా సిబ్బందితో కలిసి సుదీర్ఘ కాలం పనిచేశాను. కెప్టెన్ సుమీత్ ఎంతో మంచివారు. అనుభవశాలి అయిన పైలట్. ఆయన మరణం ఎయిరిండియాకు తీరని లోటు’అని సుమీత్ ఫ్యామిలీ ఫ్రెండ్ సంజీవ్ పాయ్ చెప్పారు. ‘సుమీత్ పనితీరుపై గానీ, ప్రజలతో వ్యవహరించే తీరుపైగానీ ఎన్నడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. ఆయన ఎంతో సౌమ్యుడు. శాంతిస్వభావి’అని పాయ్ అన్నారు. ‘సుమీత్ తండ్రి డీజీసీఎ అధికారిగా పనిచేసి, రిటైరయ్యారు. ఆయన కుటుంబంలోని మరో ఇద్దరు సైతం పైలట్లుగా ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సుమీత్ పైలట్ అయ్యారు. అయితే, 82 ఏళ్ల వృద్ధుడైన తండ్రి బాగోగులను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితం సుమీత్ నాతో అన్నారు’అని పాయ్ వివరించారు.కో–పైలట్ క్లైవ్ కుందర్కు 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవముంది. క్లైవ్ తల్లి ఫ్లయిట్ క్రూ సభ్యురాలు. ముంబై జుహులోని బాంబే ఫ్లయింగ్ క్లబ్లో క్లైవ్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సు పూర్తి చేశారు. ఏరోనాటికల్ ఇంజినీర్గా ఏడాదికి పైగా పనిచేశారు. కలినాలోని ఎయిరిండియా కాలనీలో క్లైవ్ పెరిగాడు. అనంతరం వీరి కుటుంబం బొరివలికి మకాం మార్చింది. కుందర్ పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ఎయిరిండియాలో చేరారని పొరుగునుండే ఫ్లాయిడ్ డిసౌజా చెప్పారు. ఎంతో సరదాగా అందరినీ నవ్విస్తుండే క్లైవ్ కుందర్కు, ఆయన తండ్రి క్లిఫ్పర్డ్కు ఆటలంటే ఎంతో ఇష్టమని తెలిపారు. క్లైవ్ ఖాళీ దొరికితే చాలు క్రికెట్ ఆడేవారని చెప్పారు. విషాదం తెల్సిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న క్లైవ్ సోదరి క్లైన్, తల్లి రేఖ ఇండియాకు బయలుదేరారని ఫ్లాయిడ్ అన్నారు. క్లైవ్ కుందర్ మృతిపై నటుడు విక్రాంత్ మస్సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. -
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు. 20 నిమిషాల పాటు ఇక్కడే ఉన్నారు. విమానం కూలిపోవడంతో ధ్వంసమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘావీ ఉన్నారు. ప్రమాదం గురించి వారు ప్రధానమంత్రికి తెలియజేశారు. మెడికల్ కాలేజీ హాస్టల్, మెస్ ధ్వంసమైన తీరును వివరించారు. అనంతరం మోదీ సిటీ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. విమాన ప్రమాదంలో గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్న విశ్వాస్ కుమార్ రమేశ్ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 25 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న సీ7 వార్డును మోదీ సందర్శించారు. అక్కడున్న డాక్టర్లతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విజయ్ రూపానీ కుటుంబానికి ఓదార్పు విమాన ప్రమాదంలో మృతిచెందిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఓదార్చారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని గుజ్సెయిల్ కార్యాలయంలో విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో గుండె నిబ్బరం కోల్పోవొద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అధికారులతో సమీక్ష ప్రధాని మోదీ గుజ్సెయిల్ ఆఫీసులో గుజరాత్ ప్రభుత్వ అధికారులతో, పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విమాన ప్రమా దం, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. -
పార్లమెంట్ భేటీకి ముందే బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, న్యూఢిల్లీ: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికను వచ్చే నెల జరుగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ముగించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ఆరంభమయ్యే ముందునాటికే జాతీయ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసేలా ఎన్నికల ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించాలని పార్టీ యోచిస్తోంది. ఆగస్టు 15 నుంచి బిహార్ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే అవకాశాల దృష్ట్యా, కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే ఎన్నికలను ఎదుర్కొనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక పదేపదే వాయిదా పడుతూ వస్తుంది. మే నెలలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావించినా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దీనిని వాయిదా వేశారు. అధ్యక్ష బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లపైనా పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రధాన పోటీదారుల జాబితాలో కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్, జి.కిషన్రెడ్డిలతో పాటు పార్టీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ తదితరులు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లో బిహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబర్లోగా ఎన్డీఏ కూటమి పక్షాలతో సీట్ల పంపకాలు, పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై ఓ అవగాహనకు రావాల్సి ఉంది. ఇది జరగాలంటే ఆగస్టు నుంచే బిహార్ ఎన్నికలపై ఆగస్టు నుంచే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాల్సి ఉంది. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరుగనున్నాయి. పార్టీ కీలక నేతంలతా సమావేశాల్లో బిజీగా ఉండే నేపథ్యంలో, సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కొత్త అధ్యక్షుడిని ఎంపిక చే యాలని, అలా అయితేనే ఆయన సారథ్యంలో బిహార్ ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చనే భావనలో పార్టీ ఉంది. దీనికై ఈ నెల చివరి వారంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాల్సి ఉంది. పార్టీ నియమావళి ప్రకారం జాతీయ అధ్యక్షుడి ప్రకటనకు ముందే సగానికి పైగా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపికను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటిì చాలా రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. వీరిని త్వరలోనే ప్రకటించే దిశగా ఇప్పటికే కీలక చర్చలు ముగిశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరి ప్రకటన ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయితే ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ మూడేళ్ల కాలంలో యూపీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ వంటి కీలక రాష్ట్రాలతో పాటు మొత్తంగా 12 రాష్ట్రాల ఎన్నికలు ఈయన సారధ్యంలోనే జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు సైతం కొత్త అధ్యక్షుడి హాయంలోనే ఉండనున్నాయి. -
లండన్కు చేరాక ఫోన్ చేస్తా..
ముంబై: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద మృతుల హృదయవిదారక విషాద గాథలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎయిరిండియా డ్రీమ్లైనర్ క్యాబిన్ క్రూలో పనిచేసే మైథిలీ పాటిల్(23) తన తండ్రి మోరేశ్వర్ పాటిల్కు గురువారం మధ్యాహ్నం చివరిసారిగా ఫోన్ చేశారు. లండన్ చేరుకున్నాక మళ్లీ చేస్తానంటూ ఆయన్ను అనునయించారు. కానీ, కొద్ది గంటల్లోనే ఘోరం జరిగిపోయింది. ఆమె తన మాట నెరవేర్చకుండానే తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయారు. డ్రీమ్లైనర్లో క్రూ సిబ్బందిలో ప్రాణాలు కోల్పోయిన 12 మందిలో మైథిలి ఒకరు. అంతేకాదు, వీరిలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది క్రూ సిబ్బంది మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. నవా గ్రామానికి చెందిన మైథిలి రెండేళ్ల క్రితం ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈమె తండ్రి మోరేశ్వర్పాటిల్ ఓఎన్జీసీ లేబర్ కాంట్రాక్టర్గా ఉన్నారు. లండన్ చేరుకున్న వెంటనే ఫోన్ చేస్తానంటూ మైథిలి దుర్ఘటనకు కొద్దిసేపటి ముందే తండ్రికి ఫోన్ చేసి చెప్పారని ఆమె బంధువు, నవా గ్రామ మాజీ సర్పంచి జితేంద్ర మాత్రే చెప్పారు. క్యాబిన్ క్రూ మరో సభ్యుడు దీపక్ పాఠక్ థానె పక్కనే ఉన్న బద్లాపూర్ నివాసి. ఎయిరిండియాలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న పాఠక్ లండన్ వెళ్లేముందుకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడారని ఆయన సోదరి చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన క్రూ సభ్యుడు అపర్ణా మహదిక్(43)కి కూడా ముంబై సమీప గోరెగావ్ ప్రాంతమే. ఈమె భర్త కూడా ఎయిరిండియా క్రూ సభ్యుడిగా పనిచేస్తున్నారు. అపర్ణకు ఎన్సీపీ నేత సునీల్ తత్కారేకు బంధువు. విమానం క్రూ సభ్యుల్లో ఒకరైన ఇర్ఫాన్ సమీర్ షేక్(22) రెండేళ్ల క్రితమే ఎయిరిండియాలో జాయినయ్యారు. ఈయన ఎన్నో కలలు కన్నారని కుటుంబసభ్యులు కన్నీరమున్నీరవుతున్నారు. షేక్ కుటుంబం పుణె నగరం పింప్రి చించ్వాడీలో ఉంటోంది. క్రూలో మరో సభ్యురాలు శ్రద్ధా ధావన్ది ములుండ్లోని వైశాలి నగర్. ధావన్ మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబసభ్యులు డీఎన్ఏ నమూనాలు ఇచ్చేందుకు అహ్మదాబాద్కు వెళ్లారు. విమాన క్యాబిన్ క్రూ సభ్యుల్లో రోష్ని రాజేంద్ర సొంఘారె డొంబివిలి ప్రాంతంలో ఉంటుండగా, సాయినీత చక్రవర్తి జుహు కొలివాడకు చెందిన వారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిన సొంఘారేకు ఇన్స్టాలో 54 వేలకు పైగా ఫాలోయర్లున్నారు. ప్రమాదంలో చనిపోయిన పైలట్ సుమీత్ పుష్కరాజ్ సభర్వాల్(56) ముంబైలోని పొవైలో జల్ వాయు విహార్లో వృద్ధులైన తల్లిదండ్రులతో ఉంటున్నారు. విమానం కో–పైలట్ క్లైవ్ కుందర్ది కూడా ముంబైనే. శాంటాక్రుజ్ ప్రాంతంలోని కలినాలో జెరోమ్ అపార్టుమెంట్లో నివసిస్తున్నారు. భర్తతో కలిసి గడపాలని.. గుజరాత్లోని మెహ్సనాకు చెందిన అంకితా పటేల్ది మరో విషాదం. ఈమెకు గతేడాది డిసెంబర్లో పెళ్లయింది. భర్త వసంత్ లండన్లో ప్రొవిజన్ స్టోర్ యజమాని. ఈ నూతన దంపతులు కలిసి గడిపింది కేవలం 12 రోజులు మాత్రమే. వసంత్ లండన్ వెళ్లిపోవడంతో, తనూ అక్కడికి వెళ్లి భర్తతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు, సోదరుడితోపాటు వసంత్ సోదరితో కలిసి వీసా కోసం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. అంకితను లండన్ పంపించేందుకు వీరంతా గురువారం విమానాశ్రయానికి వచ్చారు. ఆమెకు గుడ్ బై చెప్పి మెహ్సనాకు బయలుదేరిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయిందని వసంత్ సోదరి ఆశాబెన్ పటేల్ చెప్పారు. వెంటనే తిరిగి వచ్చామన్నారు. గాట్విక్ విమానాశ్రయంలో భార్యకు ఘనస్వాగతం పలకాల్సిన వసంత్..బదులుగా ఆమె అవశేషాలను తీసుకునేందుకు వస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు అంకిత సోదరుడి డీఎన్ఏ నమూనాలు తీసుకున్నట్లు వివరించారు. ప్రయాణాలంటే ఎంతో సరదా.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన నీరజ్ లవానియా(50), అపర్ణ దంపతులకు ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో లండన్ వెళ్లాలనుకున్నారు. వీరితోపాటు 18 ఏళ్ల కుమార్తె కూడా వెళ్లాల్సి ఉంది. అయితే, ఒంటరిగా ఉండే 70 ఏళ్ల నీరజ్ తల్లిని చూసుకునేందుకని ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానమెక్కిన లవానియా దంపతులు ప్రాణాలు కోల్పోయారు. డిగ్రీ ఫైనలియర్ చదువుకుంటున్న వీరి కూతురు తల్లిదండ్రుల అవశేషాలను గుర్తుపట్టేందుకు అహ్మదాబాద్ వెళ్లి అధికారులకు డీఎన్ఏ నమూనా ఇచ్చారు. ఆగ్రాలోని అకోలాకు చెందిన నీరజ్ 1995లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ కోసమని వడోదరకు మకాం మార్చారు. చుట్టుపక్కల వారితో ఎంతో కలుపుగోలుగా ఉండే నీరజ్ మరణ వార్త విని అకోలా వాసులు సైతం విషాదంలో మునిగిపోయారు. విమాన ప్రయాణానికి కొద్దిసేపటి ముందే 1.30 గంటల సమయంలో తనతో నీరజ్ మాట్లాడాడని సోదరుడు సతీశ్ చెప్పారు. టీవీలో వచ్చిన వార్తను చూసి షాక్కు గురయ్యానన్నారు.కుమారుడి వద్ద గడిపేందుకని..డ్రీమ్లైనర్ ప్రమాద మృతుల్లో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వాసి మహదేవ్ పవార్(68), ఆశా(60) దంపతులు కూడా ఉన్నారు. సంగోలా తెహశీల్లోని హటిడ్ గ్రామానికి చెందిన మహదేవ్ గుజరాత్లోని నడియాడ్లోని టెక్స్టైల్ మిల్లులో పని చేసేవారు. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు అహ్మదాబాద్లో, మరొకరు లండన్లో ఉంటున్నారు. లండన్లో నివసిస్తున్న కుమారుడి వద్దకని బయలుదేరిన ఈ దంపతులు విమాన ప్రమాదం బారినపడ్డారు. వీరు అహ్మదాబాద్లో 15 ఏళ్లుగా నివసిస్తున్నారని సోలాపూర్ జిల్లా అధికారి ఒకరు తెలిపారు. ఈ దంపతులు ఇటీవలే హటిడ్లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చి వెళ్లారని చెప్పారు.భర్త బర్త్డే కోసం.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన హర్ప్రీత్ కౌర్ హొరొ(28) ఐటీ నిపుణురాలిగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఈమె భర్త రొబ్బీ హొరా లండన్లోని ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఈనెల 16న రొబ్బీ పుట్టినరోజు. వాస్తవానికి హర్ప్రీత్ ఈ నెల 19న లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, భర్త పుట్టిన రోజు వేడుక కోసమని ముందుగానే ఎయిరిండియా డ్రీమ్లైనర్లో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. లండన్ వెళ్లాక దంపతులు యూరప్ టూర్ కూడా ప్లాన్ చేసుకున్నారని బంధువులు చెప్పారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని, వీరి కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిపోయాయని బంధువులు చెప్పారు.టీస్టాల్ యజమాని 14 ఏళ్ల కుమారుడు.. డ్రీమ్లైనర్ ప్రమాదం అహ్మదాబాద్ మెఘానీనగర్ ప్రాంతం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు సమీపంలోని చెట్టు కింద టీకొట్టు నడుపుకునే కుటుంబంలో తీరని విషాదం నింపింది. విమానం కూలిన సమయంలో సీతా బెన్ టీ తయారు చేస్తుండగా ఆమె కుమారుడు 14 ఏళ్ల ఆకాశ్ పట్ని పక్కనే నిద్రిస్తున్నాడు. కూలిన విమాన లోహ శకలం ఒకటి వచ్చి ఆకాశ్ తలను తాకింది. ఆ వెంటనే చెలరేగిన మంటల్లో ఆకాశ్ మాడి మసయ్యాడు ఆకాశ్. కుమారుడిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో తల్లి సీతా బెన్ తీవ్రంగా గాయపడి ఆస్ప త్రిలో చికిత్స పొందుతోంది.అంతా బాగుందని చెప్పి అంతలోనే.. గుజరాత్లోని ఆనంద్లో ఉండే సురేశ్ మిస్త్రీ అహ్మదాబాద్ బీజే మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వద్ద డీఎన్ఏ నమూనా ఇచ్చేందుకు క్యూలో ఉన్నారు. ఈయన కుమార్తె 21 ఏళ్ల క్రినా మిస్త్రీ విమాన ప్రమాదంలో చనిపోయింది. వర్క్ వీసా రావడంతో ఏడాది క్రితం లండన్ వెళ్లిన క్రినా ఇటీవలే ఆనంద్కు తిరిగి వచ్చింది. వైద్య చికిత్స అనంతరం డ్రీమ్లైనర్లో లండన్ తిరిగి పయనమయ్యింది. విమానం ఎక్కాక కూడా తండ్రికి ఫోన్ చేసి నిశ్చింతగా ఇంటికి వెళ్లండంటూ ధైర్యం చెప్పింది. ఇంటికి వెళ్లాక దుర్వార్త తెలిసిందని, క్రినా ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు సురేశ్ గద్గద స్వరంతో చెప్పారు.తిరిగొచ్చాక భారీగా వేడుక చేద్దామని..గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విషాదంలో అసువులు బాసిన వారిలో భవిక్ మహేశ్వరి(26) అనే నవ వరుడు కూడా ఉన్నారు. లండన్లో పనిచేసే భవిక్ 15 రోజులక్రితమే వడోదరకు వచ్చారు. పెళ్లి చేసుకున్నాకే తిరిగి లండన్ వెళ్లాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో వారి కోరిక మేరకు జూన్ 10న ఓ యువతితో చాలా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత నవ వధువును లండన్ పంపేందుకు ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి. మరోసారి వివాహ వేడుకను భారీగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నారు. నూతన వధువు సహా కుటుంబసభ్యులంతా గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో భవిక్కు వీడ్కోలు పలికారు. వారి తిరిగి ఇళ్లకు చేరుకున్నారో లేదో ఘోరం జరిగిపోయింది. ఈ విషాదాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని బంధువొకరు తెలిపారు.ఏకైక కెనడియన్ నిరాలీ పటేల్..అహ్మదాబాద్ విషాద బాధితుల్లో కెనడా పౌరురాలు ఒకరుండటం తెల్సిందే. ఈమె భారత సంతతికి చెందిన నిరాలీ పటేల్(32). టొరంటోని ఎటోబికోక్లో ఉండే నిరాలీ సోషల్ ట్రిప్లో భాగంగా భారత్కు వచ్చారు. నిరాలీ మరణవార్త తెల్సిన భర్త, ఏడాది వయస్సున్న కుమార్తెతో భారత్కు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఈమె తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబం బ్రాంప్టన్లో నివస్తున్నారు. భారత్లో 2016లో దంత వైద్యంలో డ్రిగీ పొందిన నిరాలీ 2019లో కెనడా వెళ్లారు. మిస్సిస్సౌగాలో డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. నిరాలీ మృతి పట్ల కెనడా ప్రధాని మార్క్ కార్నీ, విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ సంతాపం ప్రకటించారు. అంత్యక్రియలకు బయల్దేరి అనంతలోకాలకు అహ్మదాబాద్/నాగ్పూర్: అహ్మదాబాద్ నుంచి లండన్కు అంత్యక్రియల కోసం వెళ్తున్న కుటుంబంలోని ముగ్గురు విమాన ప్రమాదంలో మరణించారు. నాగపూర్కు చెందిన 32 ఏళ్ల యశా కామ్దార్కు నాలుగేళ్ల కిందట అహ్మదాబాద్కు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి ఆమె అహ్మదాబాద్లోనే నివసిస్తున్నారు. మామ కిషోర్ మోదా చాలాకాలంగా లండన్లో ఉంటున్నారు. ఆయన అంత్యక్రియల కోసం ఒకటిన్నరేళ్ల కొడుకు, 58 ఏళ్ల అత్త రక్షతో కలిసి ఆమె లండన్ బయల్దేరి ముగ్గురూ ప్రమాదానికి బలయ్యారు. దాంతో యశా కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగపూర్లోని ఆమె తల్లిదండ్రులు అహ్మదాబాద్ బయలుదేరారు.లండన్ నుంచి పూర్తిగా వచ్చేయాలనుకుని.. కోచి: విమాన ప్రమాదంతో మరణించిన 39 ఏళ్ల కేరళ నర్సు రంజితది మరో విషాద గాధ. కేరళ ప్రభుత్వ నర్సుగా చేసిన ఆమె సెలవు పెట్టి కొంతకాలం ఒమన్లో పని చేశాక బ్రిటన్ వెళ్లింది. లండన్లో నర్సుగా చేస్తోంది. కేరళలో కొత్తిల్లు కట్టుకుని కుటుంబానికి కొత్త జీవితం ఇవ్వాలని కలలు కంది. లండన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి శాశ్వతంగా భారత్కు వచ్చేయాలనుకుంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిని రంజిత తల్లి చూసుకుంటోంది. నాలుగు రోజుల క్రితమే కేరళ వచ్చింది. అక్కడ మళ్లీ తన ప్రభుత్వోద్యోగంలో చేరడానికి లాంఛనాలు పూర్తి చేసింది. లండన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి సర్టిఫికెట్లు, సామగ్రి తెచ్చుకోవడానికి గురువారం చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లింది. లండన్కు ఎయిరిండియా విమానమెక్కి తిరిగిరాని లోకాలకు చేరింది. దాంతో పిల్లలు, తల్లి దిక్కులేనివారయ్యారు. కాగా, రంజితను కులపరంగా, లైంగికంగా వేధిస్తూ ఆన్లైన్లో అసభ్య పోస్టులు పెట్టిన కాసరగోడ్ జిల్లా వెల్లరికుందు డిప్యూటీ తహశీల్దార్ పవిత్రన్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అతడు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడని, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. -
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్గా మారింది. బ్లాక్బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పశ్చిమాసియా రణరంగం
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియా మరోసారి రణరంగమైంది. అమెరికా ఆశీస్సులతో ఇరాన్పై ఇజ్రయెల్ భీకర వైమానిక దాడులు చేసింది. అణు కర్మాగారాలే లక్ష్యంగా విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి మొదలుకుని శుక్రవారం రాత్రిదాకా పలు విడతల్లో దేశవ్యాప్తంగా 200కు పైగా అణు, సైనిక లక్ష్యాలపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముందస్తుగానే ఇరాన్లోకి చేరవేసి ఉంచిన డ్రోన్లు కూడా కూడా అదే సమయంలో వాటిపై దాడులకు దిగాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా పూర్తిగా కుప్పకూల్చాయి. దాంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులను అడ్డుకోవడం ఇరాన్కు అసాధ్యంగా మారింది. రోజంతా విడతలవారీగా జరిగిన ఈ దాడుల్లో ఇరాన్ కనీవినీ ఎరగని నష్టాలు చవిచూసింది.ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పదేపదే భారీ క్షిపణులు, బాంబులతో చేసిన దాడుల్లో నతాంజ్లోని ప్రధాన అణుశుధ్ధి కర్మాగారం భస్మీపటలమైంది. ఆరుగురు అణు శాస్త్రవేత్తలతో పాటు సైనిక ముఖ్యుల్లో దాదాపుగా అందరూ దాడులకు బలయ్యారు! మృతుల్లో ఇరాన్ సైన్యాధిపతి మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ, బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం చీఫ్ అమీర్ అలీ హజిజాదే, ఫెరేడౌన్ అబ్బాసీ దవానీ, మహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, పలువురు వాయుసేన అత్యున్నతాధికారులతో పాటు దేశ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ సలహాదారు అలీ షంఖానీ తదితరులు కూడా ఉన్నారు. ఇరాన్ అంతటా కూలిన భవనాలు, శిథిలాల దిబ్బలు, వాటినుంచి వెలువడ్డ పొగ ఆకాశాన్ని కమ్ముకుంటున్న దృశ్యాలు వైరల్గా మారాయి. గురిచూసి ఇరాన్ గుండెలపై కొట్టామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు.ఆర్మీ చీఫ్తో పాటు తమవారి మృతిని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ధ్రువీకరించారు. భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. కాసేపటికే ఇజ్రాయెల్పై ఇరాన్ 100కు పైగా డ్రోన్లతో దాడికి దిగింది. శుక్రవారం రాత్రి క్షిపణులు కూడా ప్రయోగించింది. 1980ల్లో ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్పై జరిగిన అతి పెద్ద దాడి ఇదే. ప్రాంతీయ ప్రత్యర్థుల పోరు యుద్ధానికి దారితీసేలా కన్పిస్తోంది. గాజాపై ఏడాదిన్నరకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఇరాన్పైనా ఇజ్రాయెల్ కయ్యానికి కాలుదువ్వడం విశేషం. ఇరాన్కు జరిగిన భారీ నష్టాలకు లెబనాన్కు చెందిన ఉగ్ర సంస్థ హెజ్బొల్లా సంతాపం తెలిపింది. అయితే ఇరాన్కు దన్నుగా ఇజ్రాయెల్పై దాడికి దిగే దిశగా ప్రకటనేమీ చేయలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో కనీసం 70 మందికి పైగా మరణించారని, 350 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీఇరాన్ ప్రతి దాడుల హెచ్చరికలతో ఇజ్రాయెల్ జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, హోమ్ ఫ్రంట్ కమాండ్, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది. దాంతో జనం నిత్యావసరాలను నిల్వ చేసి పెట్టుకునేందుకు సూపర్ మార్కెట్లకేసి పరుగులు తీశారు. అన్ని సరిహద్దుల వద్దా తమ సైనికులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని మిలిటరీ చీఫ్ ఇయాల్ జమీర్ హెచ్చరించారు. తమను సవాలు చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రాడార్ కేంద్రాలతో పాటు డజన్ల కొద్దీ క్షిపణి ప్రయోగ వ్యవస్థలను కూడా నేలమట్టం చేసినట్టు తెలిపారు.టెల్ అవీవ్లోని బెన్గురియన్ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. నెతన్యాహును తీవ్రంగా వ్యతిరేకించే విపక్ష నేత యైర్ లపిడ్తో పాటు ప్రత్యర్థి పార్టీలు, శక్తులు కూడా ఇరాన్పై దాడికి పూర్తి మద్దతు తెలపడం విశేషం. తమ మనుగడకు ఇరాన్ ప్రబల ముప్పన్న అభిప్రాయం ఇజ్రాయెలీలందరిలోనూ ఉంది. ఇది నెతన్యాహుకు అతి పెద్ద సానుకూలాంశమని చెబుతున్నారు. మరోవైపు ఇరాన్లో కూడా ఎమర్జెన్సీని మించిన పరిస్థితి కొనసాగుతోంది.అణు ముప్పును తిప్పికొట్టేందుకే: నెతన్యాహుఇరాన్పై తమ తొలి దెబ్బ అదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్ మనుగడను సవాలు చేసే ఇరాన్ అణు ముప్పును రూపుమాపేందుకే తిప్పికొట్టడానికి దాడులు ప్రారంభించాం. అవి చాలా రోజులు కొనసాగుతాయి. ముప్పు తొలగేదాకా వెనకంజ వేసేది లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఇజ్రాయెల్ను నాశనం చేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటనలు చేస్తోంది. అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది.ఇటీవల ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంతో 9 అణుబాంబులను తయారు చేయొచ్చు. ఇరాన్ను ఇప్పుడు నిలువరించకపోతే ఇజ్రాయెల్కు పెనుప్రమాదం. నాజీ హోలోకాస్ట్ మారణకాండ నుంచి మేం పాఠాలు నేర్చుకున్నాం. మరోసారి బాధితులుగా మిగిలిలేందుకు సిద్ధంగా లేం’’ అని స్పష్టం చేశారు. ‘‘మా పోరు ఇరానీలతో కాదు. వారిని 46 ఏళ్లుగా అణచివేస్తున్న నియంతలతో. వారి బారినుంచి ఇరానీలకు విముక్తి కల్పించే రోజు ఎంతో దూరం లేదు’’ అని చెప్పారు.ఫైటర్లకు గాల్లోనే ఇంధనంఇరాన్పై దాడుల సందర్భంగా ఇజ్రాయెల్ తన వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో ప్రదర్శించింది. దాని యుద్ధ విమానాలు మధ్యలో వెనక్కు వచ్చే అవసరం లేకుండా వాటికి అవసరమైన ఇంధనాన్ని రీఫ్యూ యలర్ల ద్వారా గాల్లోనే ఎప్పటి కప్పుడు అందజేస్తూ వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు ఇరాన్ గగనతలం లోపలికి చొచ్చు కెళ్లాయా, లేక సమీప దేశాల నుంచే క్షిపణులు ప్రయోగించాయా అన్నదానిపై స్పష్టత లేదు. తమ ప్రాంతాల మీదుగా దూసుకు పోతున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను ఇరాక్ ప్రజలు ఊపిరి బిగబట్టి వీక్షించారు.ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేనీ ప్రకటించారు. దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వెంటనే 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేశారు. వాటిని ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. చాలా డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలను, గగన తలాన్ని మూసివేసింది. పక్క దేశం ఇరాక్ కూడా గగనతలాన్ని మూసేసింది. అన్ని విమానాశ్రయాలలో విమాన రాకపోకలను నిలిపివేసింది. దాంతో ఇరాన్, ఇరాక్ మీదుగా వెళ్లే అనేక విమానాలు దారిమళ్లించుకోవాల్సి వచ్చింది. మరికొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ కారణంగా భారత్కు సంబంధించిన పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి.దాడులు ఎక్కడెక్కడ?రాజధాని టెహ్రాన్ మొదలుకుని ఇరాన్వ్యాప్తంగా పలు నగరాలు, ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. తబ్రీజ్, కెర్మన్ షా సైనిక స్థావరాలతో పాటు అరక్, బుషెహ్ర్ అణు స్థావరాలు వీటిలో ఉన్నాయి. టెహ్రాన్లో పలు ప్రాంతాలు దాడుల్లో నేలమట్టమ య్యాయి. అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నేతృత్వం వహి స్తున్న శాస్త్రవేత్తలు, సీనియర్ అధికా రులను ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడులను అంతర్జాతీయ అణుఇంధన సంస్థ ధ్రువీకరించింది. రేడియేషన్ స్థాయిని గమని స్తున్నట్టు పేర్కొంది.దాడుల గురించి ముందే తెలుసు: ట్రంప్ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ప్రకటించారు. అయితే వాటిలో తమ ప్రమేయం లేదన్నారు. ఇకనైనా అణ్వాయుధ కలలను పక్కన పెట్టాలని ఇరాన్ను హెచ్చరించారు. ‘‘దౌత్యపరమైన పరిష్కారానికి ముందుకు రావాలి. కాదని ప్రతీకార దాడులకు పాల్పడితే ఎదుర్కొనేందుకు మా సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉంది. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడుతుంది. మాతో ఇరాన్ తక్షణం అణు ఒప్పందానికి రావాలి. అదొక్కటే దారి. లేదంటే మరిన్ని తీవ్ర పర్యవసానాలు తప్పవు’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. ‘‘తదుపరి దశలో మరింత తీవ్రమైన దాడులకు ప్రణాళికలు సిద్ధమైపో యాయి.ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కాలాతీతం కాకముందే తెలివైన నిర్ణయం తీసుకోండి. భారీ జన హననాన్ని తప్పించండి. ఇరాన్ అనే దేశమే లేకుండా పోయే పరిస్థితి రాకుండా చూసుకోండి’’ అంటూ అల్టిమేటమిచ్చారు. జాతీయ భద్రతా మండలి చీఫ్ తదితరులతో వైట్హౌస్ సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులను సమీక్షించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చర్యలు ఏకపక్షమైనవని, తమ ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.శాంతి నెలకొనాలి: మోదీపశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ తక్షణం శాంతి, సుస్థిరత నెలకొ నాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ఆయనకు ఫోన్ చేశారు. ఇరాన్పై దాడులకు దారితీసిన పరిస్థితు లను వివరించారు. ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాల్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. ఇజ్రాయెల్, ఇరాన్ ఇరు దేశాలతోనూ భారత్కు సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసింది. వాటికి అవసరమైన ఎలాంటి సాయానిౖనా సిద్ధమని పేర్కొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి పట్ల రష్యాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి. -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఐదుగురు బలి
సాక్షి బెంగళూరు/కార్వేటినగరం: కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ఏపీ వాసులు మృతిచెందారు. ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు–2 డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు గురువారం రాత్రి తిరుపతి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. బస్సు శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరు శివారులోని హోసకోటె–కోలారు జాతీయ రహదారిపై గొట్టిపుర గేట్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ వేగంగా వెళుతూ ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు అదుపు తప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో 18 మందిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లె పంచాయతి మారేడుపల్లె గ్రామానికి విశ్వనాథరెడ్డి భార్య శారద(40), వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామానికి చెందిన కె.కేశవులురెడ్డి(45), అతని తమ్ముడు జనార్దన్రెడ్డి కుమారుడు 45 రోజుల చిన్నారి, శ్రీరంగరాజపురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామానికి చెందిన తులసి (22), తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం తిమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన హరిబాబు, రోహిణి దంపతుల కుమార్తె ప్రణతి(4)గా గుర్తించారు. ప్రణతి తండ్రి బెంగళూరులో ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు. క్షతగాత్రులను సిలికాన్ సిటీ, ఎంవీజే ఆస్పత్రుల్లో చేర్పిం చి చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోపాటు అతి వేగంతో లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయతి్నంచడమే ఈ ప్రమాదానికి కారణమని హోసకోటె పోలీసులు తెలిపారు. బెంగళూరు రూరల్ జిల్లా ఎస్పీ సీకే బాబా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఆదరా బాదరాగా..!
వడోదరా: అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చిపోయింది. పలు కుటుంబాల్లో దీనగాథను నింపేసింది. 241 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ ప్రమాదం అనంతరం తడిమే కొద్దీ వర్ణణాతీతమైన గాథలే కనిపిస్తున్నాయి. తాజాగా పెళ్లైన రెండు రోజులకే లండన్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అది ఆ కుటుంబంలో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వడోదరాకు చెందిన భావిక్ మహేశ్వరి(26).. రెండు రోజుల క్రితం చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి నిమిత్తం రెండు వారాల క్రితం లండన్ నుంచి భారత్కు వచ్చిన భావిక్.. జూన్ 10వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. అనంతరం లండన్లో పని చేస్తున్న భావిక్,.. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. అంతే అదే అతని ఆఖరి మజిలీ అయ్యింది. తండ్రితో మాట్లాడిన మాటలే ఆఖరి మాటలు అయ్యాయి. ఈ విషయాన్ని పదే పదే తలుచుకుని తండ్రి అర్జున్ మహేశ్వరి కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ నా తనయుడు మళ్లీ వస్తానన్నాడు.. లండన్ వెళ్లాక ఫోన్ చేస్తానన్నాడు. టేకాఫ్ టైం అవుతుంది నాన్న అన్నాడు’అని చివరిసారి మాట్లాడిన మాటలు తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. తన కుమారుడు లండన్లో చదువుకని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడని, పెళ్లి నిమిత్తం వచ్చి ఇలా మృత్యువాత పడ్డాడని తండ్రి శోకతప్త హృదయంతో మాట్లాడారు. -
Plane Crash: ఉద్యోగులకు టాటా గ్రూప్ చైర్మన్ లేఖ
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ అనేది టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఎయిర్ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్.. తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారాయన. ‘నిన్న(గురువారం, జూన్ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఆ దుర్ఘటనతో ఇంకా షాక్లోనే ఉన్నాం. ఒక్క ప్రాణంపోతేనే విషాదం అంటాం. మరి ఇంతమంది ప్రాణనష్టం జరిగితే ఏమనాలి. ఇది కచ్చితంగా అపారమైన ప్రాణనష్టమే. ఇది మా గ్రూప్ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోతుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఎయిర్ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. #AirIndiaFlightCrash | Tata Group Head Natarajan Chandrasekaran writes to his colleagues, "What occurred yesterday was inexplicable, and we are in shock and mourning. To lose a single person we know is a tragedy, but for so many deaths to occur at once is incomprehensible. This… pic.twitter.com/XboB94W6DG— ANI (@ANI) June 13, 2025 కాగా, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గురువారం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా, 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రయాణికుడు.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో లేడు. -
‘మా అమ్మ ఆచూకీ తెలిస్తే చెప్పండన్న’.. కూలిన ఎయిరిండియా విమానం కింద..
గాంధీ నగర్: ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీలో హృదయ విదారక దృశ్యాలు మనసులను మెలిపెడుతున్నాయి. విమాన ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్లో తన తల్లి శార్లాబెన్ ఠాకూర్, రెండేళ్ల కుమార్తె ఆధ్య ఉన్నారు. పెను విషాదంపై సమాచారం అందుకున్న బాధితుడు తన అమ్మ, కుమార్తెతో పాటు అక్క ఆచూకీ కోసం వెతుకుతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.ప్రమాదంలో చెల్లాచెదురైన ప్రయాణికుల మృత దేహాల్ని గుర్తిస్తున్న అధికారుల్ని.. తనని నవ మాసాలు కనిపెంచిన అమ్మ.. తాను కన్న కూతురు, అక్క చనిపోయారని ఓవైపు కీడు శంకిస్తున్నా ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఖాన్ని దిగమింగుకుంటూ బాధితుడు ..‘సార్ .. మా అమ్మ, కూతురు,అక్క ఎక్కడ ఉన్నారో.. ఏమో? వాళ్ల ఆచూకీ తెలిస్తే చెప్పండన్నా అంటూ అమాయకంగా.. బాధతో ప్రాధేయపడుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితుడి వేడుకోలుతో అధికారులు అతని తల్లి,కుమార్తె ఆచూకీ గుర్తించే పనిలో పడ్డారు.VIDEO | Ahmedabad air crash: Ravindra Thakore mourns the loss of his mother and daughter, who were working at the canteen of the medical college hostel on which the ill-fated aircraft crashed. He says, “I want the authorities to check inside the building. I want to go by myself.… pic.twitter.com/9b5FRVHJWr— Press Trust of India (@PTI_News) June 13, 2025 ఎయిరిండియా కుప్పకూలిన హాస్టల్ భవనాలు కింద వైద్య విద్యార్థులు, ఆస్పత్రి సిబ్బంది తదితరులు చిక్కుకున్నారు. బాధితుడి తల్లి బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు, ప్రొఫెసర్లకు భోజనం వండేది. భోజనం, చపాతీలు, గుజరాతీ వంటలు చేయగా.. వాటిని, ఆమె కుమారుడు ప్రతీ రోజు కళాశాల క్యాంపస్లో డెలివరీ చేసేవాడు. తిరిగి బీజే మెడికల్ కాలేజీ హాస్టల్కు వచ్చేవారు. ఎప్పటిలాగే కుమార్తెను తన తల్లి దగ్గర వదిలేసి పక్కనే ఉన్న సివిల్ ఆస్పత్రిలో లంచ్ బాక్స్లు ఇచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి ఈ ఘోరం జరిగింది. ఈ విషాదంపై శార్లాబెన్ కుమారుడు రవీ మాట్లాడుతూ.. విమాన ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్కు టిఫిన్ బాక్సులు అందించటానికి వెళ్లాను. ఎప్పటిలాగే ప్రతి రోజు భోజనం ఇచ్చినట్లుగా జూన్ 12న నేను మధ్యాహ్నం 1 గంటకు హాస్పిటల్ సిబ్బందికి, హాస్టల్కు భోజనం అందించడానికి వెళ్లాను. తిరిగి రావడంతో ఓ విమానం మెస్లో దూసుకొచ్చిందని విన్నాను. విమానం కూలిన ప్రదేశంలో మా అమ్మ కూర్చుంది. ఆ ప్రదేశం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మా అమ్మ, కుమర్తె, అక్కడ ఉన్నారని కంటతడి పెడుతూ మీడియాతో మాట్లాడారు. గంటలు గడుస్తున్నాయి. వాళ్ల ఆచూకీ లభించలేదు. అయినప్పటికీ వారి ఆచూకీ గుర్తించేందుకు మరో 72 గంటలు వేచి చూడాలని చెప్పారని వాపోయారు. This Baby Girl and her mother both are missing from mess building since plane crash Guys I know her father personally Please Contact me through Comments if found 🙏🙏🙏 Ahmedabad Gujarat pic.twitter.com/oJLEn6nr77— DTS (@Sharma17_05) June 13, 2025ప్రమాదం జరిగిన ఒక రోజు తరువాత సివిల్ హాస్పిటల్లో వైద్యులు మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యుల నుండి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు. మరోవైపు జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. బాధితుడు రవి చెప్పిన ప్రాంతం అంతా మనుషుల శరీర భాగాలు గుర్తు పట్టలేని విధంగా ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు బాధితుల కుటుంబసభ్యుల డీఎన్ఏని సేకరిస్తున్నారు. బాధితుడి రవి కూడా తన వాళ్ల ఆచూకీ దొరుకుతుందేమోనని విషాదం నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నాడు. -
ఎయిరిండియా పెను విషాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదంతో భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎయిర్లైన్స్ డ్రీమ్లైనర్ విమానాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లోని 787 విమానాల్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్ని పరిశీలించిన వెంటనే నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. గురువారం గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. వందల మందిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తర్వాతే డీజీసీఏ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. In light of the AI-171 accident on 12.06.2025, DGCA issues directives to Air India to carry out additional maintenance actions on B787-8/9 aircraft equipped with Genx engines with immediate effect.@RamMNK @mohol_murlidhar @dgca pic.twitter.com/L8YCJ1FVVT— MoCA_GoI (@MoCA_GoI) June 13, 2025 -
‘ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి’
ఢిల్లీ: ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. ఇందుకు అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై టీడీపీ నేతల అత్యాచారానికి పాల్పడిన ఘటనలే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ‘అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాము. హరికృష్ణ పై దాడికి సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సాక్షి మీడియాను నిర్వీర్యం చేసేందుకు, ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించారు. కొమ్మినేని శ్రీనివాస్ పై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టింది. విశ్లేషకుడు చెప్పిన వ్యాఖ్యలకు కొమ్మినేనికి ఆపాదించడం సరికాదు కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది శుభపరిణామం’ అని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు.ఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలుఏపీలో మహిళలపై తీవ్రమైన అఘాయిత్యాలు జరుగుతున్నాయని అరకు ఎంపీ తనుజారాణి పేర్కొన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో చిన్న చిన్న బాలికలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ తనుజా రాణి తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలను ఏపీ పోలీసులు టార్గెట్ చేస్తున్నారని, చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. -
అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్
గాంధీ నగర్: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాక ఈ ఘటనలో అధికారికంగా దాదాపు 265 మంది దాక మరణించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఏదో అద్భుతం జరిగనట్లుగా బయటపడింది రమేష్ ఒక్కడే అన్న సంగతి విధితమే. దీంతోపాటు మరో విచిత్రం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ.. ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం మరో అద్భుతాన్ని ప్రపంచానికి చూపించింది. ఆ ఎయిర్ ఇండియా శిథిలాల మధ్య పవిత్ర గ్రంథం భగవద్గీత ఆ అగ్ని కీలలకు కొంచెం కూడా చెక్కుచెదరకుండా కనిపించి ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.కాగా, ఈ విషాద ఘటనపై సమగ్రంగా విచారణ జరపాల్సిన బాధ్యతను ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు అప్పగించారు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:(చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..) -
ఎయిరిండియా విమాన ప్రమాదం.. సీసీ కెమెరాలో భయంకర దృశ్యాలు
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా విమానం పెను ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి చెందారు. రాకేష్,ఆర్యన్,మనవ్ జయ్ ప్రకాష్లు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో ఎయిరిండియా విమానం కూలడంతో బీజే మెడికల్ కాలేజీలో మరణాల సంఖ్య 28కి చేరింది. అయితే, ఈ ప్రమాదం జరిగే సమయంలో మెడికల్ కాలేజీ ముందున్న సీసీ కెమెరాలో భయంకరమైన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురవారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. ఎయిర్పోర్టు నుంచి మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లో అందరూ చూస్తుండగానే మేఘానీనగర్లో బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలింది. విమమానం కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరే బ్రతికారు.బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో 24మంది మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం మరో నలుగురు విద్యార్ధులు మరణించారు.మరోవైపు తాజాగా ఎయిరిండియా విమానం బీజేపీ మెడికల్ కాలేజీపై కూలిన సమయంలో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలు మెడికల్ కాలేజీ హాస్టల్ ముందు ఉన్న భవనం సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఆ సీసీ టీవీ ఫుటేజీల్లో విమానం కూలినప్పుడు విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అణు బీభత్సం ఎలా ఉంటుందో.. విమానం కూలే సమయంలో అంతే ప్రమాద స్థాయి కనిపించింది. దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికంగా పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతమంతా బీతావాహ పరిస్థితి నెలకొంది. ఇక హాస్టల్ భవనంపై విమానం కూలిపోవడంతో లోపల వైద్య విద్యార్థులు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి. ఓ విద్యార్థి విమానం బిల్డింగ్పై పడడంతో ఎగిరిపడుతున్న విమాన శకలాలు, బిల్డింగ్ శకలాల నుంచి తనని తాను రక్షించుకునేందుకు హాస్టల్లో లోపల ఉన్న టేబుల్ కింద పరిగెత్తుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. -
Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్పోర్ట్కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. ఇందులో 230 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. లండన్కు వెళ్లాల్సిన గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్కు చెందిన భూమి చౌహాన్ అనే మహిళ.. అహ్మదాబాద్లో ట్రాఫిక్లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్ మిస్ అయ్యిపోయిపోతుందేమోనని గాబరా గాబరాగా ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్ ఎక్కలేదు. బోర్డింగ్ ప్రాసెస్కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్ మిస్ చేసుకుని బ్రతికిపోయింది. ‘నేను ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది. అది నేను వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 బోయింగ్ విమానం. ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్లోనే ఉన్నా. ఆ ఫ్లైట్ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్ అవుతుంది. బోర్డింగ్ ప్రోసెస్ అంతా 12.10 కల్లా కంప్లీట్ చేయాలి. #WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025కానీ నేను 12.20కి ఎయిర్పోర్ట్కి వచ్చా. నేను చెక్ ఇన్ గెట్ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్ చేశా. మొత్తం ప్రొసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్పోర్ట్ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్ కూలిపోయింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. ఇక భూమి తల్లి మాట్లాడుతూ.. ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది. నా కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని పేర్కొన్నారు.భూమి చౌహాన్ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్తో నా కూతురు ఎయిర్పోర్ట్కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్ ప్రాసెస్కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్ చేసినా వారు అనుమతించలేదు. ఆ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు. -
'మిరాకిల్ సీట్ 11A'..! కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే..?
విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీటు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఈ భయానక విమాన ప్రమాద ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరసులో ఉండే 11A విండ్ సీటు అని, దీని వెనుకే ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీటు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటుని విమానంలో ఎవ్వరు ఇష్టపడని చెత్త సీటుగా చెబుతుంటారు. అంతలా ఇష్టపడని 11A సీటు ఆ ప్రమాద ఘటనలో ఒకేఒక్కడిగా ప్రాణాలతో బయటపడ్డ ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ ఆ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్తసీటుగా ప్రయాణికులు భావిస్తారు..?అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుజయుడిలా యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేశ్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11ఏ కాస్తా మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా..ఎందుకంటే ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ.. తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశానని, అక్కడ చిన్న గ్యాప్ ఉందని, దాని గుండా దూకానని చెప్పుకొచ్చాడు రమేష్. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా వొంపు తిరిగి ఉంటాయి, అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ బోయింగ్ 787లో ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.రీజన్ ఏంటంటే..'ది విండో సీట్ 11A' అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్లు లేదా స్ట్రక్చరల్ రీన్ఫోర్స్మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా, కొన్ని సీట్లు ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు - పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 737-900 విమానంలో కూడా ఉంటుందట. చాలామంది ప్రయాణికులు ఈ సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట. ఎందుకంటే..? బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీటులుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండానే విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీటంటే హడలిపోతారట. అస్సలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు ఈ మృత్యుంజయడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీటుకి డిమాండ్ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం. (చదవండి: Seat 11A: ఆ సీటులో ఉంటే భద్రమేనా?) -
ఎయిరిండియా ప్రమాదం.. దొరికిన బ్లాక్ బాక్స్
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) ఎయిరిండియా విమాన ప్రమాద విచారణలో పురోగతి చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంతకు ముందు.. బ్లాక్బాక్స్ దొరికిందంటూ ప్రచారం జరగ్గా.. అధికారులు కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం కూలిన బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై ఆరంజె కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ఏ171 బ్లాక్ బాక్స్ బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంనతరం, బ్లాక్ బాక్స్ను విశ్లేషించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఈ బ్లాక్ బాక్స్లో సీవీఆర్, ఎఫ్డీఆర్ భాగాలుంటాయి. వీటిల్లో విమాన డేటా రికార్డింగ్, వేగం, ఎత్తు గురించి తెలుసుకునే అవకాశం ఉంది. సీవీఆర్లో రికార్డయిన చివరి రెండు గంటల పైలెట్, కోపైలెట్ల మధ్య సంభాషణ వినొచ్చు. గురువారం మధ్యాహ్నాం లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యే బృందం దర్యాప్తు జరుపుతోంది.ఇదీ చదవండి: బ్లాక్బాక్స్తో ఏం చేస్తారో తెలుసా? -
భారత వాయుసేన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వారంలో రెండోసారి..
ఛండీగఢ్: భారత వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో, పంజాబ్లోని పఠాన్కోట్లో ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. పంజాబ్లోని పఠాన్కోట్ (Pathankot)లో భారత వాయుసేన అపాచీ హెలికాప్టర్-M17 అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నంగాల్పుర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో శుక్రవారం భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగానే అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. JK: Air Force #Apache helicopter #M17 makes emergency landing in Pathankot....... pic.twitter.com/dQSNmP6NYa— Devesh , वनवासी (@Devesh81403955) June 13, 2025అయితే, వారం రోజుల వ్యవధిలో భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి. జూన్ 6న, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ సమీపంలోని ఒక పొలంలో ఇలాగే వాయుసేన హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలో పైలట్లు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. -
రోహిణి, రూపా బదిలీ
బొమ్మనహళ్లి: ఐఏఎస్ అధికారిణి డి.రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి.రూపాతో పాటు పలువురు ఉన్నతాధికారులను సర్కారు బదిలీ చేసింది. ఇందులో రోహిణి, రూపా ఇద్దరు తగవులు పడుతూ కేసులు పెట్టుకోవడం తెలిసిందే.కర్ణాటకలో పలువురు అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంటు బోర్డు ఎండీగా ఉన్న రూపాను బెంగళూరు మెట్రో పాలిటన్ టాస్క్ఫోర్స్ అదనపు డిజీపీగా బదిలీ చేశారు. రోహిణిని వ్యవసాయ శాఖ, ఆహార సంస్కరణల విభాగం కార్యదర్శి స్థానం నుంచి కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎస్బీ శెట్టణ్నవర్ను బెళగావి స్థానిక కమిషనర్గా, అక్రం పాషాను ఆర్టీసీ ఎండీగా నియమించారు.వీరి మధ్య వివాదం ఇలా.. ఇదిలా ఉండగా.. ఒక మహిళా ఐఏఎస్.. ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది. కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వీరి వ్యవహారంపై కేసు కూడా నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్రపరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్- రిలయన్స్ జియోలకు ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా ఐపీఎస్ రూపా మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.ఐపీఎస్ రూపా విచారణకు హాజరుకాకుండా జాప్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో ఈ నెల ఆరంభంలో విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.రాజీ కుదరలేదు..!వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది. కాగా, సుమారు రెండేళ్ల క్రితంఐఏఎస్ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్ రూపా ఫేస్బుక్లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా అంటున్నారు. -
ఎలా బతికానో కూడా తెలియదు
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మందికి(ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారం) మరణించారు. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఆయన నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. .. ‘‘నమ్మలేకపోతున్నా.. ఎలా బతికానో కూడా తెలియట్లేదు’’ అంటూ అతను చెబుతున్నాడు. విమానంలో 11ఏ సీట్లో కూర్చున్న రమేష్.. ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారంటూ తొలుత పోలీసులు చెప్పారు. అతని సోదరుడు ధీరేంద్ర సోమ్బాయ్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రమేష్ మాత్రం జరిగింది అది కాదని స్పష్టత ఇచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని, తమ విమానం నేలకూలుతుందన్న విషయం తనకు అర్థమైంది. ఆ వెంటనే విమానం కిందకు వచ్చి ముక్కలై.. పేలిపోయిందని.. ప్రమాద క్షణాలను గుర్తు చేసుకున్నారు.40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ అయిన విశ్వాష్ కుమార్ రమేష్.. ఏదో అద్భుతం జరిగినట్లే ప్రమాదం నుంచి బయటడ్డారు. ప్రమాద సమయంలో విమానం నేలను తాకి రెండు ముక్కలైంది. ఆ సమయంలో సీటు ఎగిరి కాస్త దూరం పడిపోయింది. ఈ క్రమంలోనే నాకు గాయాలయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో అసలు ఎలా బతికానో కూడా తెలియదు అని రమేష్ ప్రధాని మోదీ సహా తనను పలకరించిన వారికల్లా చెబుతున్నాడు.‘‘ప్రమాదం జరిగాక నేను బతకడం కష్టమనే అనుకున్నా. అయితే నా సీటు దగ్గర్లో విమాన ప్రధాన భాగం ఉందని కనిపించింది. అక్కడ కొంచెం సందు కనిపించింది. నా సీటు బెల్ట్ను నెమ్మదిగా తొలగించి.. పాకుంటూ బయటకు వచ్చా. నా చుట్టుపక్కల వాళ్లలో కొందరు చనిపోయి ఉన్నారు. కొందరికి ఊపిరి ఆగిపోతున్న పరిస్థితి. అది చూశాక.. ఎలా తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చాక.. విమానం పేలిపోయిందని ఏదో భాషలో(గుజరాతీ) అంతా అరుస్తున్నారు. ఆ గందరగోళ వాతావరణంలోనే నడుచుకుంటూ వచ్చి ఆంబులెన్స్ ఎక్కాను’’ అని రమేష్ తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్న రమేష్ను.. త్వరలో పోలీసులు, దర్యాప్తు కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది. -
ఆ సీటులో ఉంటే భద్రమేనా?
అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి రమేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11ఏ సీటులో కూర్చున్న రమేశ్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలో ఈ సీటు ఎకానమీ క్లాస్ కేబిన్లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే రెండు వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోరు వెనుకే 11ఏ సీటు ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేశ్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. 11ఏ సీటు (Seat 11A) సురక్షితమని భావిస్తున్నారు.హాట్లైన్ నెంబర్మరోవైపు విమాన ప్రమాదంతోపాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800 5691 444 హాట్లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం +91 8062779200 నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.విమానం కొత్తదే! న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం కుప్పకూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం మరీ పాతదేమీ కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ విమానం 2013లో సేవలు ప్రారంభించిందని వెల్లడించారు. 12 సంవత్సరాల నుంచి ఇది వాణిజ్య సేవలు అందిస్తోంది. పౌర విమానయాన రంగంలో 12 సంవత్సరాలు అంటే దాదాపు కొత్త విమానం కిందే లెక్క అని నిపుణులు తెలిపారు. ఈ విమానం వీటీ–ఏఎన్బీ పేరుతో రిజిస్టర్ అయ్యింది. ఎయిర్ ఇండియా సంస్థ వద్ద ఉన్న బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ రకానికి చెందిన 27 విమానాల్లో ఇదీ ఒకటి. ఈ రకానికి చెందిన ఒక విమానం ప్రమాదంలో పూర్తిగా ధ్వంసం కావటం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 2020లో కాసరగోడ్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కూలిపోయిన ఘటన తర్వాత దేశంలో అతిపెద్ద విమాన ప్రమాదం కూడా ఇదే.చదవండి: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే.. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, ఢిల్లీ: అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోనే లేదు. ఇంతలో మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఎయిర్ ఇండియా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా AI-379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి.. విమానంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BIG BREAKING NEWS 🚨 Air India flight AI 379 makes emergency landing in Thailand after bomb threat. Thailand Official said "Passengers being escorted from the plane, flight AI 379, in line with emergency plans"There were 156 passengers on the flight, and the bomb threat was… pic.twitter.com/ollnR7ltxa— Times Algebra (@TimesAlgebraIND) June 13, 2025 -
పైలట్ సుమీత్: నాన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే..
ఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మాటలకందని పెను విషాదాన్ని నింపింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా మిగిలింది. తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా పైలెట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మృతి చెందారు. కెప్టెన్ సుమీత్కు సంబంధించిన కుటుంబ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని, పైలట్ ఉద్యోగం మానేసి చూసుకుంటానని కెప్టెన్ సుమీత్ సబర్వాల్ మాట ఇచ్చారు. కానీ ప్రమాదవశాత్తు తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండానే విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. తండ్రికి మాట ఇచ్చిన విషయాన్ని బంధువులు తెలిపారు.లండన్కు విమాన ప్రయాణానికి ముందు కూడా సమీత్ తన తండ్రికి ఫోన్ చేశారు. "తాను లండన్ చేరుకున్న తర్వాత మీకు కాల్ చేస్తానని చెప్పాడు.. కానీ ఇంతలోనే తీవ్ర విషాదం జరిగిపోయింది. ముంబయిలోని పోవై ప్రాంతంలో సుమీత్ తండ్రి ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఆయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో బాధ్యతలు నిర్వర్తించి రిటైర్ అయ్యారు.కాగా, అహ్మదాబాద్లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా 787–8 డ్రీమ్లైనర్ విమానాన్ని నడిపిన పైలట్లకు సర్వీస్లో సుదీర్ఘ అనుభవం ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. ఈ విమానాన్ని ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందర్ నడిపారు. ప్రయాణీకుల విమానాలు నడపడంలో సుమీత్కు ఏకంగా 8,200 గంటల అనుభవం ఉంది. కో పైలట్ క్లైవ్కు 1,100 గంటల అనుభవం ఉంది. ఇద్దరికి కలిసి 9,300 గంటలపాటు వినిమానం నడిపిన అనుభవం ఉందని డిజిసిఎ వెల్లడించింది. -
కర్ణాటకలో APSRTC బస్సుకి ప్రమాదం.. చిత్తూరువాసుల మృతి
బెంగళూరు: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు, ఓ లారీ ఢీ కొట్టడంతో నలుగురు స్పాట్లోనే మరణించారు. 16 మందికి గాయాలు కాగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చిత్తూరు వాసులుగా తెలుస్తోంది.తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్ 0190 నెంబర్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా హోసాకోట్లోని పుట్టిపురా గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్షతగాత్రులను స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలుకేశవరెడ్డి(44)తులసి(21)ప్రణతి(5)ఏడాదిన్నర వయసున్న చిన్నారి -
రామ్మోహనా.. రీల్స్ చేయడానికి వెళ్లావా..?
సాక్షి, తాడేపల్లి: నిన్న(గురువారం) భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు. అయితే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిన్న ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వీడియోను రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. వీడియోకు బ్యాక్ గ్రౌండ్ ఆడియో కలిపి పోస్టు చేయడంపై ట్రోల్ అవుతోంది. ఘటన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లారా? రీల్స్ చేయడానికా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.This is Aviation minister RamMohan Naidu.Instead of taking the responsibility for #planecrash he's literally uploading reels.There is music in the video, there are multiple cuts & video effects.This reel-fever of Modi cabinet is disgusting.pic.twitter.com/vUDcYfBhps— Tarun Gautam (@TARUNspeakss) June 12, 2025 -
విమాన ప్రమాద సమయంలో జరిగింది ఇదేనా?
ప్రమాద సమయంలో ఎయిరిండియా విమానం గేర్ రాడ్ మూసుకోలేదు. దానికి తోడు రెక్కల వెనక భాగం (ఫ్లాప్) ముడుచుపోయి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసాధారణ పరిస్థితిపై వైమానిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత తక్కువ ఎత్తులో ఉన్న ప్పుడు ముఖ్యంగా టేకాఫ్ సమయంలో ఈ పరిస్థితి విమానానికి ప్రాణాంతక మేనని చెబుతున్నారు.సాధారణంగా విమానం టేకాపైన వెంటనే, అంటే 600 అడుగుల ఎత్తుకు చేరడానికి ముందే గేర్ రాడ్ విధిగా మూసుకోవాలి. ఇక విమానం చెప్పుకోదగ్గ ఎత్తుకు ఎగిరేదాకా ఫ్లాప్స్ రెండూ విచ్చుకునే ఉండాలి. విమానం పైకి వెళ్తున్న కొద్దీ అవి క్రమంగా లోనికి ముడుచుకుంటాయి. కానీ, ఎయిరిండియా విమానం టేకాఫ్ కాగాన్ లాండింగ్ గేర్ తొలుత కొంతమేరకు ముడుచుకున్నా వెంటనే తిరిగి బయటికి వచ్చింది. "బహుగా విమానానికి కావాల్సిన వేగం (థ్రస్ట్) లోపించడమో, పవర్ ఫెయిల్యూర్ చోటుచేసుకోవడమో జరిగి ఉండాలి. అది గమనించి పైలట్ ముందు జాగ్రత్తగా లాండింగ్ గేర్ను తెరిచి ఉంటారు. దాంతో పాటే కిందకు పడిపోతున్న విమానాన్ని వెంటనే పైకి లేపేపేందుకు కావాల్సిన థ్రస్ట్ కోసం ఫ్లాప్ను ఒక్కసారిగా మూసేందుకు ప్రయత్నించి ఉంటాడు" అని వైమానిక నిపుణులు అభిప్రాయపడ్డారు."కానీ 800 అడుగుల ఎత్తులో ఇది చాలా రిస్క్. ఇలాంటప్పుడు విమానం అటూ ఇటూ ఉగిపోతుంది. ఎయిరిండియా విమానం మాత్రం ఇలాంటి పరిస్థితుల్లోనూ కూలేదాకా సజావుగానే ప్రయాణించింది. అందుకు పైలట్ సామర్థ్యమే కారణం కావచ్చు. దీంతో పాటు రైట్ రడ్డర్ సమస్య తలెత్తిన సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇది లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్యూర్కు సంకేతం, ఇవన్నీ కలగలిసి విమానాన్ని ఢీకొనడానికి ముందే సకాలంలో పైకి లేపడంలో పైలట్ విఫలమై ఉంటారు" అని వారు విశ్లేషించారు. అంతేగాక పక్షులు ఇంజన్ను ఢీకొనడం కూడా ప్రమాదానికి కారణం కావచ్చుంటున్నారు. "ఎయిర్పోర్ట్ను ఆనుకుని ఆవాస ప్రాంతాలున్నాయి. కనుక అక్కడ చాలా పక్షులుంటాయి. అనేక పక్షులు ఢీకొని రెండు ఇంజన్లూ శక్తిని కోల్పోయి ఉంటాయి. అందువల్లే టేకాఫ్ అనంతరం విమానం నిర్దిష్ట అందుకోలేకపోయి ఉంటాయి" అని వారన్నారు. -
ఇరాన్ ఎఫెక్ట్.. ఎయిర్ ఇండియాకు తప్పిన ముప్పు.. విమానాల దారి మళ్లింపు
ఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ముంబై నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. మూడు గంటల ప్రయాణం తర్వాత వెనక్కి వచ్చింది. దీంతో, ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబై నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. మూడు గంటల ప్రయాణం తర్వాత రాడార్లో సిగ్నల్స్ సమస్య తలెత్తింది. దీంతో, సదరు విమానం తిరిగి వెనక్కి వచ్చేసింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయం నిర్ధరణ అయ్యింది. రాడార్ సిగ్నల్స్ సమస్య కారణంగానే విమానం వెనక్కి మళ్లినట్లు సమాచారం.Air India flight bound for London returns to Mumbai after 3 hours in air, says Flightradar24 pic.twitter.com/YcaxXG0lh2— NDTV (@ndtv) June 13, 2025ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్.. తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో, పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులపై ఈ ప్రభావం పడింది. అనేక విమాన సర్వీసులకు దారి మళ్లిస్తున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలను కూడా దారి మళ్లిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా స్పందిస్తూ..‘ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. ప్రయాణీకులకు వసతి కల్పించడంతో సహా అన్ని వసతులు కల్పలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.విమాన సర్వీసుల వివరాలు:AI130 - లండన్ హీత్రో-ముంబై - వియన్నాకు మళ్లించబడిందిAI102 - న్యూయార్క్-ఢిల్లీ - షార్జాకు మళ్లించబడిందిAI116 - న్యూయార్క్-ముంబై - జెడ్డాకు మళ్లించబడిందిAI2018 - లండన్ హీత్రో-ఢిల్లీ - ముంబైకి మళ్లించబడిందిAI129 - ముంబై-లండన్ హీత్రో - ముంబైకి తిరిగి వెళ్ళడంAI119 - ముంబై-న్యూయార్క్ - ముంబైకి తిరిగి వెళ్ళడంAI103 - ఢిల్లీ-వాషింగ్టన్ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI106 - న్యూవార్క్-ఢిల్లీ - ఢిల్లీకి తిరిగి వెళ్ళడంAI188 - వాంకోవర్-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI101 - ఢిల్లీ-న్యూయార్క్ - ఫ్రాంక్ఫర్ట్/మిలన్కు మళ్లించడంAI126 - చికాగో-ఢిల్లీ - జెడ్డాకు మళ్లించడంAI132 - లండన్ హీత్రో-బెంగళూరు - షార్జాకు మళ్లించబడిందిAI2016 - లండన్ హీత్రో-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI104 - వాషింగ్టన్-ఢిల్లీ - వియన్నాకు మళ్లించబడిందిAI190 - టొరంటో-ఢిల్లీ - ఫ్రాంక్ఫర్ట్కు మళ్లించబడిందిAI189 - ఢిల్లీ-టొరంటో - ఢిల్లీకి తిరిగి రాక. #TravelAdvisoryDue to the emerging situation in Iran, the subsequent closure of its airspace and in view of the safety of our passengers, the following Air India flights are either being diverted or returning to their origin:AI130 – London Heathrow-Mumbai – Diverted to Vienna…— Air India (@airindia) June 13, 2025 -
‘ఇజ్రాయెల్ దాడులు’.. ఇరాన్లోని భారతీయులకు అడ్వైజరీ
ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్ భయానక దాడులు చేస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ విడుదల చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులకు కీలక సూచనలు చేసింది. ట్విట్టర్ వేదికగా.. ‘ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించండి. ఎప్పటికప్పుడు ఎంబసీల సోషల్ మీడియా ఖాతాలను అనుసరించి తాజా సమాచారం తెలుసుకోండి. అనవసర ప్రయాణాలు చేయొద్దు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకొనేందుకు సిద్ధంగా ఉండండి’ అడ్వైజరీలో పేర్కొంది.The Embassy of India in Iran posts an advisory for Indian nationals living in Iran."In view of the current situation in Iran, all Indian nationals & persons of Indian origin in Iran are requested to remain vigilant, avoid all unnecessary movements, follow the Embassy’s Social… pic.twitter.com/nxgvL0AtDZ— ANI (@ANI) June 13, 2025మరోవైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ విమాన రాకపోకలపై పడింది. ఇరాన్, ఇరాక్ గగనతలంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పొరుగు దేశాలకు, ప్రాంతాలకు వెళ్లే విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు సంబంధిత ఎయిర్ లైన్స్ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్పోర్టు అధికారులు సూచించారు. -
విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారం..
Ahmedabad Incident Updates..బ్లాక్ బాక్స్ రికవరీ నివేదికలు ఊహాగానాలు మాత్రమే: ఎయిర్ ఇండియాఅహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్పై ఫేక్ ప్రచారంబ్లాక్ బాక్స్ దొరికిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం.తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఎయిర్ ఇండియా.బ్లాక్ బాక్స్పై ఎంత దొరకలేదని స్పష్టం చేసిన ఎయిర్ ఇండియా.Till now, the black box is not recovered from the plane.The black box is located in the tail section of the aircraft.The tail of the aircraft is stuck into the building.To access the blackbox safely, the tail needs to be removed from the building.But the work regarding… pic.twitter.com/c9B62v10Ce— Kapil (@kapsology) June 13, 2025మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లుడీఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.ప్రమాదంలో మృతదేహాలన్ని కూడా మాంసపు ముద్దల్లా మారిపోయాయి.తీవ్రంగా కాలిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించి వారిని గుర్తించనున్నారు.డీఎన్ఏ కోసం శాంపిళ్ల సేకరణవిమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ కోసం అధికారులు శాంపిళ్లను సేకరించారు.డీఎన్ఏ పరీక్షల అనంతరం మృతుదేహాలను గుర్తించి వారి కుటుంబీకులకు అప్పగించనున్నారు. విమాన ప్రమాదంపై మోదీ స్పందన..విమాన ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. ఇంత మంది ప్రాణాలు కోల్పోయిన బాధను మాటల్లో చెప్పలేను.ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అహ్మదాబాద్ విమానాశ్రయంలో మోదీ సమీక్షఅహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీఅహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని సమీక్షసమీక్షలో అధికారులు, సహా మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ.ఆసుపత్రిలో క్షతగాత్రులను ప్రధాని మోదీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిన అడిగి తెలుసుకున్నారు. #WATCH | PM Modi meets and enquires about the health condition of those injured in the Air India plane crash in Ahmedabad pic.twitter.com/QCFrmdSEXx— ANI (@ANI) June 13, 2025 #WATCH | PM Modi visits Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 plane crash pic.twitter.com/ebUFXSTT8o— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. #WATCH | The wreckage of the AI-171 plane hangs from BJ Medical College's building, which it crashed into soon after take-off from Ahmedabad airport yesterdayPM Modi visited the plane crash site today to assess the ground situation.(video source: DD) pic.twitter.com/ScTDNv5nYz— ANI (@ANI) June 13, 2025ప్రమాద స్థలికి చేరుకున్న మోదీ.. ప్రధాని మోదీ విమాన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలను మోదీ పరామర్శ. ఇప్పటికే టాటా గ్రూప్ చైర్మన్తో మాట్లాడిన మోదీ. విమాన ప్రమాదంతో తీవ్ర విషాదం#WATCH | PM Modi visits the site of AI-171 flight crash in Ahmedabad The crash claimed the lives of 241 people, including 12 crew members onboard. pic.twitter.com/gCvP229Vcs— ANI (@ANI) June 13, 2025 ఘటనా స్థలికి ఫోరెన్సిక్ బృందం.. విమాన ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిన్ నిపుణుల బృందం#WATCH | A forensic team arrives at the #AirIndiaPlaneCrash site, in Ahmedabad. pic.twitter.com/d49Bnxdjgl— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరగాలి..AI-171 విమాన ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుడి ఆవేదన..అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వద్ద ఓ వ్యక్తి ఆగ్రహం..ఈ సంఘటన ఎలా జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.మా ప్రాణాలకు విలువ లేదా?కఠిన చర్య తీసుకోవడం ఎయిర్ ఇండియా బాధ్యత.#WATCH | On the AI-171 plane crash, a local at Ahmedabad Civil Hospital says, "There should be a thorough investigation into how this incident happened. Does life have no value?? It is Air India's responsibility to take action." pic.twitter.com/MPbmkHdelr— ANI (@ANI) June 13, 2025అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీప్రధాని మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం ప్రమాదానికి గురైన స్థలాన్ని పరిశీలించనున్నారు. PM Narendra Modi will be visiting Gujarat's Ahmedabad today.#AhmedabadPlaneCrash pic.twitter.com/4fN7dla4va— ANI (@ANI) June 13, 2025ప్రమాద ఘటనా స్థలానికి ఎయిరిండియా సీఈవోఅహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన చోటుకి ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంపుబెల్ విల్సన్ చేరుకున్నారు.ఘటనా స్థలాన్ని పరిశీలించారు.మరోవైపు.. ఘటన స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI— ANI (@ANI) June 13, 2025విమాన ప్రమాదం.. ఈవెంట్లు రద్దుఅహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంఈ ఘటనపై ప్రముఖులు దిగ్భ్రాంతిపలు సినిమా ఈవెంట్లు రద్దుగుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది.#WATCH | Visuals from AI-171 crash site in Ahmedabad, GujaratAir India has confirmed the loss of 241 lives of the 242 passengers on board the aircraft, which crashed soon after takeoff yesterday pic.twitter.com/1alznlNj40— ANI (@ANI) June 13, 2025కేవలం 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానీనగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు.230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్వాసులు, ఏడుగురు పోర్చుగల్వాసులు, ఒకరు కెనడా పౌరుడు. వీరితో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ రమేశ్ విశ్వాస్కుమార్ బుచర్వాడ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. -
పది నిమిషాల ఆలస్యం.. నేను ప్రాణాలతో ఉన్నా: భూమి చౌహాన్
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ప్రమాద సమయంలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే పది నిమిషాల ఆలస్యం ఓ యువతి ప్రాణాలను నిలబెట్టింది. విమాన ప్రమాదం నుంచి తనను దేవుడే రక్షించాడని ఆమె చెప్పుకొచ్చింది.వివరాల ప్రకారం.. భూమి చౌహాన్ అనే యువతి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లడానికి ఎయిరిండియా (Air India) ఫ్లైట్ AI171 బుక్ చేసుకున్నారు. విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో ఆమె ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. దీంతో ఆమెకు పదినిమిషాల ఆలస్యం అయింది. అప్పటికే ఆ ఫ్లైట్ టేకాఫ్ అయి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. దీంతో, ఈ ప్రమాదంపై భూమి చౌహన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా..‘ట్రాఫిక్ కారణంగా నేను విమానం మిస్ అయ్యాను. ఇదే సమయంలో నేను వెళ్లాల్సిన విమానం కుప్పకూలిందనే విషయం తెలిసిన వెంటనే షాక్కు గురయ్యా. ఆ ఘటన గురించి తలుచుకుంటే నా శరీరం వణుకుతోంది. ఈ ప్రమాద ఘటనపై మాట్లాడలేకపోతున్నా. నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ దేవుడికి ధన్యవాదాలు. గణపతి బప్పానే నన్ను కాపాడాడు. పది నిమిషాలు ఆలస్యం కావడం వల్ల నేను విమానం ఎక్కలేకపోయాను. విమాన ప్రమాద విషయాన్ని ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు.#WATCH | Bhoomi Chauhan, a resident of Gujarat's Bharuch, missed yesterday's flight, AI-171, which crashed and 241 of 242 on board, including crew members, lost their lives.Bhoomi Chauhan says, "...We arrived at the check-in gate 10 minutes late, but they didn't allow me, and I… pic.twitter.com/T1AqU9SSz0— ANI (@ANI) June 13, 2025ఇక, పది నిమిషాల ఆలస్యంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం చేరుకున్న చౌహాన్.. మధ్యాహ్నం 1.30 గంటకు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది. 1.38 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని నివాసప్రాంతంలో కుప్పకూలింది. లండన్లో భర్తతో కలిసి ఉంటున్న భూమి చౌహాన్ రెండేళ్ల అనంతరం వెకేషన్ కోసం ఇండియా వచ్చింది.ఇదిలా ఉండగా.. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ171 విమానం టేకాఫైన 39 సెకన్లలోనే కుప్పకూలింది. విమానం మెడికోలు ఉంటున్న భవనంపై పడడంతో అందులో ఉంటున్న 24 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. -
దిగ్విజయాల నుంచి దిగంతాలకు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ ప్రస్తుతం మయన్మార్గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్లో చేరారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గానూ పనిచేశారు. 1987లో రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్కోట్ మేయర్గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు. 2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్కు ఛైర్మన్గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్కోట్ వెస్ట్లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.లక్కీనంబర్ 1206 నాడే...1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. -
ఘోర విషాదాలు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశ ప్రజలను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది కూడా ఒకటని చెబుతున్నారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానం చేరకుండానే కన్నుమూశారు. చాలావరకు సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు మానవ తప్పిదాలు సైతం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. → 2020 ఆగస్టు 7: కేరళలోని కోజికోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రన్వేపై ఎయిర్ ఇండియా 1344 విమానం ల్యాండవుతున్న సమయంలో అదుపు తప్పింది. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. విమానం రెండు ముక్కలు కావడంతో అందులో ఉన్న 190 మంది ప్రయాణికుల్లో 21 మంది మృతిచెందారు. భారీ వర్షం, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పైలట్లు సైతం ఉన్నారు. → 2010 మే 22: కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737–800 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. విమానంలో వెంటనే మంటలు చెలరేగడంలో 158 మంది మరణించారు. ఇది టేబుల్టాప్ రన్వే కావడంతో విమానాన్ని ల్యాండింగ్ చేయడంలో పైలట్ తడబడినట్లు గుర్తించారు. → 2000 జూలై 17: బిహార్ రాజధాని పాటా్నలో అలయెన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 జనావాసాలపై కుప్పకూలింది. 60 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 55 మంది విమాన ప్రయాణికులు కాగా, ఐదుగురు ఇళ్లల్లోని నివాసితులు. → 1996 నవంబర్ 12: సౌదీ అరేబియా విమానం 763, కజకిస్తాన్ ఎయిర్లైన్స విమానం 1907 హరియాణాలోని చార్కీ దాద్రీ గగనతలంలో పరస్పరం ఢీకొని కుప్పకూలాయి. ఏకంగా 349 మంది మరణించారు. సమాచార మారి్పడిలో లోపం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. → 1990 ఫిబ్రవరి 14: ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టులో ల్యాండయ్యే ముందు అదుపుతప్పింది. రన్వే పక్కన భూమిని ఢీకొని పక్కనే ఉన్న గోల్ఫ్ కోర్సులోకి దూసుకెళ్లింది. విమానంలో 146 మంది ఉండగా, వీరిలో 92 మంది మృతిచెందారు. → 1988 అక్టోబర్ 19: గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 113 ల్యాండింగ్ సమయంలో రన్వే పక్కన చెట్లను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగడంతో 135 మంది ప్రయాణికులకు గాను 133 మంది విగత జీవులయ్యారు. పొగమంచు అధికంగా ఉండడం వల్ల రన్వే కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. → 1978 జనవరి 1: ముంబై నుంచి దుబాయ్కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855 అరేబియా సముద్రంలో కూలిపోయింది. విమానంలోని మొత్తం 213 మంది ప్రయాణికులు మరణించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన జరిగింది. → 1973 మే 31: ఢిల్లీ పాలమ్ ఎయిర్ఫోర్టులో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 440 ల్యాండింగ్ కంటే ముందు హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొట్టింది. దాంతో అందులో మంటలు వ్యాపించడంతో 65 మందికిగాను 48 మంది ప్రయాణికులు బలయ్యారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
వైపరీత్యం..పెరుగుతోంది ప్రాణ నష్టం
దేశంలో వైపరీత్యాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. ఇవి ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమవుతున్నాయి. భూకంపాలు, వరదలు, అకాల వర్షాలు, కొండ చరియలు విరిగిపడడం, సుడిగాలులు..ఇలా జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పులి మీద పుట్రలా ప్రజా జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇందుకు తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే నిదర్శనం. సాక్షి, న్యూఢిల్లీః దేశంలో గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మానవ మరణాల సంఖ్య గణనీయంగా ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా విడుదల చేసిన ఎనీ్వస్టాట్స్ ఇండియా–2025 (పర్యావరణ గణాంకాలు) నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు, వడగాడ్పులు, భారీ వర్షాలు వంటి వైపరీత్యాలతో 2024–25 ఏడాదిలో దేశంలో ఏకంగా 3,080 మంది మరణించినట్లు తెలిపింది. 2013–14 ఏడాదిలో సంభవించిన మానవ మరణాల తర్వాత అత్యధిక మరణాలు గత ఏడాదే సంభవించినట్లు పేర్కొంది. నివేదికలో అంశాలివీ.. ⇒ గడిచిన 25ఏళ్లలో అంటే 2001–02 నుంచి చూస్తే అత్యధిక మరణాలు 2007–08లో 3,764, 2008–09లో 3,405, 2013–14లో 5,677 నమోదు కాగా, ఆ తర్వాత గత ఏడాదే అత్యధికంగా 3,080 మరణాలున్నాయి. ⇒ పశు మరణాల సంఖ్య మాత్రం గత ఏడాది గణనీయంగా తగ్గింది. అత్యధికంగా 2006–07లో 4,55,619 మరణించగా, 2023–24లో 1,19,683 గతేడాది 61,966 చనిపోయాయి. ⇒ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇళ్లు ›కూలడం వంటి నష్టాలు 2007–08లో ఏకంగా 35.27లక్షలుండగా, 2023–24లో 1.40లక్షలు, 2024–25లో మాత్రం 3.64లక్షలుగా ఉంది. ⇒ 2007–08లో 85.13లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగ్గా, 2023–24లో 13.39లక్షల హెక్టార్లు, 2024–25లో 14.24 లక్షల హెక్టార్లుగా ఉంది.