
పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. సక్సెస్ అయినా అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యాసంస్థల ఓనర్ కమ్ పొలిటికల్ లీడర్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలియంది కాదు. అయితే ఇక్కడో పెద్దాయన అట్లాంటి డైలాగులేవీ పేల్చడం లేదు. ప్రేమకు చిహ్నంగా భావించే తాజ్ మహల్ను మోడల్గా తీసుకుని ఏకంగా ఇంటినే నిర్మించుకున్నారు. అందుకు ఆయన చెప్పిన సమాధానం పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించకపోవచ్చు. కానీ, ఆయన చెప్పిన విధానం మాత్రం కచ్చితంగా ఆకట్టుకుంటోంది.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో తాజ్ మహల్ను తలపించేలా నాలుగు బెడ్రూమ్లో ఓ భవనం ఉంది. స్థానికంగా విద్యా సంస్థను నడిపించే ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ నివాసం అది. 2021లో ఈయనగారు ఈ ఇంటితో నేషన మీడియా దృష్టిని ఆకర్షించారు. నాలుగు బెడ్రూమ్లు, ఓ కిచెన్, ఓ మీడియేషన్ రూం.. ఇందులో ఉంటాయి. ఆ ఇంటిని ఆనుకునే ఆ హైటెక్ గురుకుల్ కూడా ఉంది. తాజ్మహల్ పరిమాణంలో మూడింట ఒకటో వంతు ఉందట ఆ ఇల్లు. ఓ వ్లోగర్ ఆ జంటను పరిచయం చేసుకుని ఆ ఇంటిని పరిశీలించడం ఆ వీడియోలో ఉంది.

👉మా తాజ్ మహల్.. నాలుగు బెడ్రూమ్ల ఇల్లు. అసలైన తాజ్ మహల్ ప్రేమకు సమాధి. ఇదేమో నా భార్యకు ప్రేమతో కట్టించిన ఇల్లు.. అంతే తేడా
👉చిన్నతనంలో ఇంటింటికీ తిరిగి పాలు పోసేవాడిని. గర్వం తలకెక్కించుకోకు అని గుర్తు చేయడానికి గృహ ప్రవేశం సమయంలో ఈ ఇంటి మధ్యలో ఇలా గేదె బొమ్మను ఉంచాను. ఇది ఎప్పుడూ నా మూలాలను గుర్తు చేస్తుంటుంది
👉నా భార్య మెడిసిన్ వదిలేయాల్సి వచ్చింది. నేను ఇంజినీరింగ్ చేయలేకపోయాను. అందుకే పిల్లలను డాక్టర్లను, ఇంజనీర్లను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాం. అలా దేశంలోనే మోస్ట్ హైటెక్ గురుకుల్ను నడిపిస్తున్నాం. 2200 మంది పిల్లలు. వాళ్లే మా కుటుంబం.
👉దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం ఒక్కటే.. ప్రేమ. అన్నట్లు ఆనంద్ ప్రకాశ్ చౌక్సీ విద్యావేత్త మాత్రమే కాదు, తరచూ దాతృత్వ కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. మోటివేషనల్ స్పీకర్గానూ ఆయన వీడియోలు కొన్ని అక్కడ వైరల్ అవుతుంటాయి.