house
-
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ నేత ఇంటిపై టీడీపీ నేతల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా, వైఎస్సార్సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దాడి చేయించారు.వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా.. తాడిపత్రిలో నూతనంగా ఇంటిని నిర్మించుకోగా, అన్ని అనుమతులు ఉన్నా కానీ టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వందలాది మంది అనుచరులతో ఫయాజ్ బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్ సీపీ నేత ఫయాజ్ బాషా ఇంటిపై జేసీ.. రాళ్లతో దాడి చేయించారు. టీడీపీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. -
ఎంపీ ఇల్లని తెలియకుండానే చోరీకొచ్చాడు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు ఉత్తరాఖండ్కు చెందిన ఘరానా దొంగ మహ్మద్ అక్రమ్గా తేలింది. 2004 నుంచి ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాలను టార్గెట్ చేస్తున్న ఇతడు తొలిసారిగా హైదరాబాద్కు వచ్చాడు. అది ఎంపీ ఇల్లు అని తెలియకుండానే లోపలికి ప్రవేశించాడు. కేవలం నగదు మాత్రమే తస్కరించే నైజం ఉన్న అక్రమ్ అది దొరక్కపోవడంతో ఫ్రూట్ బాక్సులు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘరానా చోరుడిని పాతబస్తీలోని తలాబ్కట్టలో ఉన్న అతడి అద్దె ఇంటి సమీపంలో పట్టుకున్నట్లు పశి్చమ మండల డీసీపీ విజయ్కుమార్ మంగళవారం వెల్లడించారు. వెస్ట్జోన్, సౌత్ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో నిందితుడు పట్టుబడినట్లు పేర్కొన్నారు. విలాసవంతమైన జీవితం... ఉత్తరాఖండ్లోని మొహల్లా ప్రాంతానికి చెందిన అక్రమ్ గతంలో తాపీ మేస్త్రీగా, ప్రస్తుతం టైల్స్ ఫిట్టింగ్ పనిచేస్తున్నాడు. జల్సాలు, అత్యంత విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన అక్రమ్ అందుకు అవసరమైన డబ్బు కోసం 2004 నుంచి నేరాలు చేయడం మొదలెట్టాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మొహల్లా నుంచి సాధారణ వ్యక్తిగా బయలుదేరి ఢిల్లీ వెళ్లేవాడు. అక్కడ ఖరీదైన బ్రాండెడ్ దుస్తులు ధరించి లాడ్జిల్లో బస చేసేవాడు. ఆ అవతారంలోనే వెళ్లి సంపన్నులు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటాడు. తొలిరోజు రెక్కీ చేసి, రెండో రోజు పంజా విసురుతాడు. ఇలా దేశ రాజధానిలో 35 ఇళ్లల్లో చోరీలు చేసి పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. 2014 నుంచి తన మకాంను ఢిల్లీకి మార్చాడు. నో గోల్డ్... ఓన్లీ క్యాష్.. ఈ ఘరానా దొంగ గతంలో అనుచరుడిని ఏర్పాటు చేసుకుని చోరీలు చేసేవాడు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బంగారం, వెండితో పాటు నగదు కూడా ఎత్తుకుపోయేవాడు. 2019లో సౌత్–ఈస్ట్ ఢిల్లీ పోలీసులు ఇతడితో పాటు అనుచరుడు ఖాలిద్ మహ్మద్ను పట్టుకున్నారు. అప్పట్లో చోరీ బంగారాన్ని విక్రయించడానికి ఖాలిద్ ప్రయత్నించడమే పోలీసులకు ఆధారమైంది. ఆ అనుభవంతో పంథా మార్చుకున్న అక్రమ్... అనుచరులకు, నగలకు దూరంగా ఉంటున్నాడు. ఒంటరిగా సంచరిస్తూ, ఖరీదైన ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ, నగదు మాత్రమే తస్కరించడం మొదలెట్టాడు. ఢిల్లీలో పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో హైదరాబాద్కు వచ్చి తలాబ్కట్ట ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాడు. సంపన్నులు ఉండే ప్రాంతంలో ఇంటిని ఎంపిక చేసుకుని, భారీ మొత్తం కొల్లగొట్టి ఢిల్లీ వెళ్లిపోవాలని పథకం వేశాడు. సీసీ కెమెరాల సాయంతో అరెస్ట్.. పాతబస్తీలో ఆటో ఎక్కే అక్రమ్ తాను టైల్స్ పనిచేస్తానని, దానికోసం సంపన్నులు ఉండే ప్రాంతాలకు వెళ్లాలని డ్రైవర్కు చెప్పేవాడు. అలా శనివారం ఉదయం పెద్దమ్మ గుడి వద్దకు వచి్చన అక్రమ్ అక్కడ నుంచి పలు ప్రాంతాల్లో తిరిగాడు. చివరకు డీకే అరుణ ఇంటిని ఎంపిక చేసుకుని.. మరుసటి రోజు ఇంట్లోకి ప్రవేశించాడు. ఇల్లు మొత్తం తిరిగినా ఎక్కడా నగదు కనిపించకపోవడం, నిద్రిస్తున్న పనిమనుషుల్లో కదలికలు గమనించడంతో బయటకు వచ్చేశాడు. ఈ కేసును ఛేదించడానికి వెస్ట్జోన్ పోలీసులు, సౌత్ జోన్ టాస్్కఫోర్స్ అధికారులు రంగంలోకి దిగారు. వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా తలాబ్కట్టలో అక్రమ్ను గుర్తించి పట్టుకున్నారు. -
DK Aruna : ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం
సాక్షి,హైదరాబాద్ : జూబ్లీహిల్స్లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. ఓ అగంతకుడు అర్థరాత్రి ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం, ఇంట్లో కిచెన్,హాల్సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. గంటన్నరపాటు ఇంట్లో కలయతిరిగాడు. అయితే,దుండగుడు వచ్చిన సమయంలో డీకే అరుణ ఇంట్లో లేకపోవడం ప్రమాదమే తప్పింది. మరోవైపు, డీకే అరుణ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగకపోవడంపై కుట్రకోణం దాగి ఉందని డీకే అరుణ కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. దీంతో డీకే అరుణ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో పోలీసులు, క్లూస్ టీమ్ విచారణ చేపట్టారు. తనపై ఏదైనా కుట్ర కు ప్లాన్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న ఎంపీ డీకే అరుణ.. తన ఇంటికి భద్రత పెంచాలని కోరారు. -
జెర్సీ హీరో షాహిద్ కపూర్ ఇల్లు చూశారా? (ఫోటోలు)
-
అబ్బయ్య చౌదరి ఇంటిపై టీడీపీ దాడి
-
అంతర్జాతీయ ఆవాసం!
అవును. ఈ బుల్లి ఇల్లు నిజంగానే రెండు దేశాల పరిధిలో విస్తరించింది! ఈ గమ్మత్తైన ఇల్లు ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లోని లోంగ్వా గ్రామంలో ఉంది. ఇది కాస్త భారత్లో, మిగతా భాగం మయన్మార్ పరిధిలో ఉంటుంది! భారత్, మయన్మార్ సరిహద్దు సరిగ్గా ఈ గ్రామం నడుమగా పోవడమే దీనికి కారణం. ప్రధాన ద్వారానికి ఆ పక్క సగంపై నాగాలాండ్ (భారత్), ఈ పక్క సగంపై సగాయింగ్ (మయన్మార్) అని రాసి ఉంటుంది కూడా. ఇంటి బయట ఠీవిగా నుంచున్నది దాని యజమాని టోనెయ్ ప్వాంగ్. అన్నట్టూ, ఆయన స్థానిక కోన్యాక్ నాగా గిరిజన తెగ నాయకుడు కూడా. ఆరకంగా చూస్తే ఆయన నివాసం లోంగ్వా గ్రామం మొత్తానికీ రాజప్రాసాదం వంటిదన్నమాట. ఈ ఇంటికి 100 ఏళ్ల పై చిలుకు చరిత్ర ఉంది. అంతర్జాతీయ సరిహద్దు మాత్రం 1971లో పుట్టుకొచ్చింది. ప్వాంగ్ ఇంటిని రెండు దేశాలకూ చెందేలా విడదీసింది. ‘‘అంతర్జాతీయ సరిహద్దు 50 ఏళ్ల కింద పుట్టుకొచ్చింది. మా ఇల్లు అంతకు 50 ఏళ్ల ముందునుంచే ఉంది. సరిహద్దు భూభాగాన్ని విభజిస్తుందేమో గానీ ఇది మా పూరీ్వకుల ఆవాసం. ఇందులో ఉండేందుకు మాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురవడం లేదు’’ అంటారు ప్వాంగ్. ఈ ఊళ్లోని వాళ్లంతా భారతీయులే. అందరికీ ఓటు హక్కు కూడా ఉంది. అయినా వారికి మయన్మార్ నుంచి పలు సంక్షేమ పథకాలు అందుతుండటం విశేషం! ఈ ఊళ్లో రెండు దేశాల సైన్యాలూ గస్తీ కాస్తుంటాయి. అంతేకాదు. ఈ ప్రాంతంలో భారత్, మయన్మార్ ప్రజలు వీసా తదితరాలేవీ అవసరం లేదు. -
లోన్ కట్టలేదని ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు
కొడకండ్ల (జనగాం): తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంక్ అధికారులు(Bank Officials) ఓ కుటుంబాన్ని నిలదీసిన ఘటన బుధవారం ఏడునూతన గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురు మహిళల చొప్పున మూడు గ్రూపులకు 2021సంవత్సరంలో విజయ డెయిరీ(Vijaya Dairy) ఆధ్వర్యంలో డీసీసీబీ స్టేషన్ఘన్పూర్ బ్రాంచ్ ద్వారా గేదెల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.87వేల చొప్పున రుణం అందించారు. ఈఎంఐ రూ.4వేల చొప్పున కొన్ని నెలల పాటు మహిళలు చెల్లించారు. అనంతరం గేదెలు పాలు ఇవ్వకపోవడంతో మహిళలకు ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు డిఫాల్టర్లకు నోటీసు ఇచ్చి రికవరీ ప్రయత్నాలు చేయగా కొందరు రుణం చెల్లించారు. తాజాగా బుధవారం డీసీసీబీ స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల బ్రాంచ్ మేనేజర్లు మహబూబీ, కల్యాణిలతో పాటు ఫీల్డ్ ఆఫీసర్లు మరోసారి రుణం బాకీ ఉన్న వారి ఇంటికి వెళ్లి నోటీసులిచ్చి రుణం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇందులో మద్దెబోయిన కళమ్మ, కుటుంబసభ్యులు రుణం కట్టడం ఇబ్బందిగా ఉందని తెలిపి ఇంటి గేట్లు తీసుకెళ్లమని బ్యాంక్ అధికారులు తీసుకొచ్చిన ట్రాక్టర్ డబ్బాలో వేయడంతో వారు తీసుకెళ్లారు. ఈ సంఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్ కాగా బ్యాంక్ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చేందుకే వచ్చామని తెలుపుతున్నారు.లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు జనగామ - పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన డీసీసీబీ బ్యాంక్ అధికారులు pic.twitter.com/NA0yGAjSPq— Telugu Scribe (@TeluguScribe) February 12, 2025 -
మీ కాళ్ళు మొక్కుతాం.. మా కడుపులు కొట్టొద్దు
-
తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
-
రోమ్లో 2 వేల ఏళ్ల నాటి బాత్ హౌస్
సాక్షి, నేషనల్ డెస్క్: ఏసీ గదులు, ప్రైవేట్ బాత్ టబ్లు. విందుల కోసం ప్రత్యేకమైన, విలాసవంతమైన గదులు. సంపన్నుల ఇళ్లలో ఉండే విలాసాల గురించి తెలిసిందే. ఇప్పుడంటే సరే గానీ ఏకంగా 2 వేల ఏళ్ల కిందటే ఇలాంటి నిర్మాణాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. పురాతన రోమన్ నగరమైన పోంపెయ్లో ఇలాంటివన్నీ ఉన్నట్టు తాజాగా తేలింది. 2 వేల ఏళ్ల కింద నిర్మించిన పెద్ద ప్రైవేట్ థర్మల్ కాంప్లెక్స్ ఒకటి తవ్వకాల్లో బయటపడింది.పోంపెయ్ పార్కు మధ్య ప్రాంతంలో బాత్ హౌస్లు బయటపడ్డాయి! నాటి పాలక వర్గ సభ్యులు విందుల కోసం 30 మంది సామర్థ్యమున్న విశాలమైన గదులను ఏర్పాటు చేసుకున్నారని పోంపెయ్ పురావస్తు పార్కు డైరెక్టర్ గాబ్రియేల్ జుచ్ట్రీగల్ తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రోత్సహించడం, ఏకాభిప్రాయ సాధన తదితరాల కోసం సం సమావేశాలు, ఒప్పందాలు వంటివి ఇక్కడ జరిగేవని వెల్లడించారు.ఇటీవల ఇదే ప్రాంతంలో అప్పటి బేకరీ, లాండ్రీ షాప్, రెండు విల్లాలను కనుగొన్నారు. అప్పట్లో మౌంట్ వెసూవియస్ అగ్నిపర్వత బద్ధలవ్వడంతో దాని బూడిద కింద పోంపెయ్తో పాటు హెర్కులేనియం నగరాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడవన్నీ తవ్వకల్లో బయట పడుతున్నాయి. నాటి ప్రమాదంలో మరణించిన వ్యక్తుల ఎముకలు కూడా పురావస్తు శాస్త్రవేత్తలకు లభించాయి.ఇదీ చదవండి: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
ఆంధ్రప్రదేశ్లో పేదల ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం కక్ష... ఇళ్లు నిర్మించుకోనివారి స్థలాల కేటాయింపులు రద్దు
-
‘పర్ఫెక్ట్ సెట్టింగ్’: ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ
-
మంచి కాదు ముంచే ప్రభుత్వం.. గుర్తు పెట్టుకోండి మేము ఓట్లు వేస్తే గెలిచారు
-
హైదరాబాద్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు - కారణం ఇదే..
హైదరాబాద్ (Hyderabad) ఇళ్ల మార్కెట్ నీరసించింది. ఈ ఏడాది మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది కంటే 5 శాతం తక్కువగా నమోదు కావొచ్చంటూ రియల్ ఎస్టేట్ (Real Estate) కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 58,540 యూనిట్ల అమ్మకాలు ఉంటాయని అంచనా వేసింది. క్రితం ఏడాది విక్రయాలు 61,715 యూనిట్లుగా ఉన్నాయి.హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 4 శాతం తగ్గి రూ.4.6 లక్షల యూనిట్లుగా ఉండొచ్చంటూ.. 2024 ఏడాదిపై అంచనాలతో అనరాక్ నివేదిక విడుదల చేసింది. గతేడాది ఇవే నగరాల్లో 4,76,530 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాకపోతే గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 16 శాతం పెరిగి రూ.5.68 లక్షల కోట్లుగా ఉంది.ఒక ఇల్లు సగటు విక్రయ ధర ఈ ఏడాది 21 శాతం పెరిగింది. భూముల ధరలు, కార్మికుల వేతనాలు, ముడి సరుకుల ధరలు పెరగడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే, సాధారణ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియంత్రణ పరమైన అనుమతుల్లో జాప్యంతో కొత్త హౌసింగ్ ప్రాజెక్టుల ప్రారంభం నిదానించడాన్ని కూడా కారణంగా పేర్కొంది.ఇదీ చదవండి: రూ.16.8 కోట్ల అడ్వాన్స్.. నెల అద్దె తెలిస్తే షాకవుతారు!ఇళ్ల ధరలు పెరగడంతో అమ్మకాల విలువ గతేడాది కంటే అధికంగా ఉన్నట్టు వివరించింది. ‘‘భారత హౌసింగ్ రంగానికి 2024 మిశ్రమంగా ఉంది. సాధారణ ఎన్నికలకు తోడు, నిర్మాణ అనుమతుల్లో జాప్యం నెలకొంది. నూతన ఇళ్ల సరఫరాపై దీని ప్రభావం పడింది. గతేడాదితో పోల్చితే ఇళ్ల అమ్మకాలు సంఖ్యా పరంగా తగ్గినప్పటికీ, ధరల పెరగుదలతో అమ్మకాల విలువ 16 శాతం పెరిగింది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.సరఫరాలో క్షీణత➤తాజా ఇళ్ల సరఫరా ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది 7 శాతం తగ్గి, 4,12,520 యూనిట్లుగా ఉండొచ్చు.➤ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చితే 6 శాతం తగ్గి 61,900 యూనిట్లుగా ఉంటాయి. గతేడాది 65,625 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ➤ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో అమ్మకాలు ఒక శాతం పెరిగి 1,55,335 యూనిట్లకు చేరొచ్చు.➤బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 65,230 యూనిట్లుగా ఉండొచ్చని అంచనా. ➤పూణేలో 6 శాతం తక్కువగా 81,090 యూనిట్ల విక్రయాలు నమోదు అవుతాయి.➤కోల్కతాలో 20 శాతం క్షీణతతో 18,335 యూనిట్లకు అమ్మకాలు పరిమితం కావొచ్చు.➤చెన్నైలో 11 శాతం తగ్గి 19,220 యూనిట్లుగా ఉంటాయని అనరాక్ నివేదిక అంచనా వేసింది. -
అల్లు అర్జున్ ఇంటి గేటును పరదాలతో మూసివేసిన సిబ్బంది
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. ఆరుగురు నిందితులకు రిమాండ్
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్
సాక్షి,హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడికి కారకులైన ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం(డిసెంబర్23) ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అయితే.. వీరికి అప్పటికప్పుడే బెయిల్ మంజూరు అయ్యింది. అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు.. ఒక్కొకరికి రూ.10వేల పూచికత్తుతో బెయిల్ ఇచ్చారు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినవారిలో రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ఉన్నారు. నిందితులపై బీఎన్ఎస్ 331(5),190,191(2),324(2),292,126(2),131 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. నిందితులు మీ పార్టీ వాళ్లంటే.. మీ పార్టీ వాళ్లంటూ కాంగ్రెస్-బీఆర్ఎస్లు పరస్పర ఆరోపణలకు దిగాయి.కాగా, సంధ్య థియేటర్లో పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందన సరిగా లేదని ఓయూ జేఏసీ పేరిట పలువురు ఆయన ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. అల్లు అర్జున్ ఇంటి లోపలికి చొచ్చుకెళ్లి రాళ్లు వేయడంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. పూలకుండీలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇదీ చదవండి: పుష్ప అభిమాని అరెస్ట్ -
జానారెడ్డి, బాలకృష్ణ ఇళ్లకు మార్కింగ్
బంజారాహిల్స్: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1 రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా..ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్నట్లు తెలుస్తోంది. మా ఇంటికే మార్కింగ్ వేస్తారా? అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి. మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు. జూబ్లీహిల్స్లో ఒకవైపే.. బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు రోడ్డుకు ఒకవైపే ఆస్తులు సేకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 అడుగుల రోడ్డు మాత్రమే 120 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఒకవైపు కేబీఆర్ పార్కు గోడ ఉండగా, ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడం లేదు. సమరసింహారెడ్డి, జానారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉంటున్న వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగనుంది. ఆ మేరకే మార్కింగ్ వేశారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది. దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. అయితే పనులు ముందుకుసాగడంలోనే అధికారులకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అంతా ప్రముఖులే కావడం, ప్రభుత్వంలో ఉండడం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది. -
అల్లు అర్జున్ ఇంటి వద్ద హైటెన్షన్
-
రూ.508 కోట్లకు బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ - సొంతం చేసుకున్న హాలీవుడ్ జంట (ఫోటోలు)
-
ఎస్సీ, ఎస్టీల ఇళ్ల పునాదులు ధ్వంసం
పుంగనూరు: అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై టీడీపీ నేతల అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు వేసుకున్న పునాదులను టీడీపీ నాయకులు జేసీబీలతో పెకిలించారు. దీంతో బాధితులు మల్లీశ్వరి, ఈశ్వరమ్మ, లలిత తదితరులు మంగళవారం మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. 2010లో అప్పటి ప్రభుత్వం పేదలకు పట్టణంలోని భగత్సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కానీ సదరు స్థలం తమదంటూ భాస్కర్ అనే వ్యక్తి గొడవలు చేయడం మొదలుపెట్టాడు. భాస్కర్, ఇస్మాయిల్, సర్దార్ అనే ముగ్గురు కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. దీనిపై పట్టాదారులు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. ఇదిలా కొనసాగుతుండగా.. టీడీపీ నాయకులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి పోలీసుల సాయంతో సోమవారం జేసీబీలను ఉపయోగించి ఆ పునాదులను పూర్తిగా పెకిలించేశారు. బాధిత కుటుంబాలు అడ్డుకునేందుకు ప్రయత్ని0చగా.. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై బాధితులు కలెక్టర్కు, తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని.. తమ స్థలాలు తమకు ఇప్పించాలని కోరారు. లేకపోతే ఆత్మహత్య తప్ప తమకు మరో దిక్కు లేదంటూ విలపించారు. -
యూట్యూబర్ ఇంట్లో శుభకార్యం.. నిహారిక, ప్రదీప్తో పాటు వాళ్లంతా (ఫొటోలు)
-
ఆగర్భ శ్రీమంతుల భూగర్భ స్వర్గాలు
వర్తమాన ప్రపంచం శాంతిధామంగా ఏమీ లేదు. ఇప్పటికే చాలా దేశాలు యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఘర్షణలతో రావణకాష్ఠంలా రగులుకుంటున్నాయి. అణ్వాయుధాలను అమ్ములపొదిలో దాచుకున్న ధూర్తదేశాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికైనా వెనుకాడబోమని అడపా దడపా హెచ్చరికలు చేస్తూ, మిగిలిన దేశాలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులు మరింతగా ముదిరితే, మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చినా రావచ్చు. యుద్ధంలో ఏ దేశమైనా తెగబడి అణ్వాయుధాలను ప్రయోగిస్తే, జరగరాని అనర్థాలు జరగవచ్చు. అణ్వాయుధ దాడులు జరిగిన చోట సామాన్యులు బతికి బట్టకట్టే అవకాశాలు కల్ల! అయితే, అణ్వాయుధాల దాడులు జరిగినా, క్షేమంగా బతికి బట్టకట్టడానికి వీలుగా ఆగర్భ శ్రీమంతులు ముందస్తుగా భూగర్భ స్వర్గాలను నిర్మించుకుంటున్నారు.గడచిన శతాబ్దం స్వల్ప వ్యవధిలోనే రెండు ప్రపంచ యుద్ధాలను చవి చూసింది. ఈ రెండు యుద్ధాలు గడచిన శతాబ్ది పూర్వార్ధంలోనే జరిగాయి. రెండు యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా వివిధ దేశాల మధ్య అనేక యుద్ధాలు, కొన్ని దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా ముంచుకు రావచ్చనే ముందుచూపుతో కొందరు ఆగర్భ శ్రీమంతులు ఇప్పటికే భూగర్భ దుర్గాలను నిర్మించుకున్నారు. మరికొందరు శ్రీమంతులు అదే పనిలో ఉన్నారు. బయటి నుంచి చూస్తే, అవి మామూలు నేలమాళిగల్లాగానే కనిపిస్తాయి. లోపలికి అడుగుపెడితే తెలుస్తుంది, వాటి అసలు సంగతి. అవి మామూలు నేలమాళిగలు కావు, కట్టుదిట్టమైన భూగర్భ దుర్గాలు. అణ్వాయుధాలకు కూడా చెక్కుచెదరవు. భూకంపాల వంటి పెను విపత్తులు సంభవించినా, అవి తట్టుకోగలవు. వాటి లోపల ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. ప్రళయం వచ్చి, ప్రపంచం అంతమైపోయినంత పని జరిగినా, వాటిలో ఉండేవారు నిక్షేపంగా, క్షేమంగా ఉండగలరు. ఈ భూగర్భ దుర్గాల లోపలి సౌకర్యాలను, విలాసాలను పరిశీలిస్తే, ఇవి భూగర్భ దుర్గాలు మాత్రమే కాదు, భూగర్భ స్వర్గాలు అనక తప్పదు.ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి భూగర్భ స్వర్గాలు ఎన్ని ఉన్నాయో కచ్చితమైన లెక్క ఏదీ లేదు. కొందరు సంపన్నులు బాహాటంగా ఇలాంటివి నిర్మించుకుంటుంటే, మరికొందరు అత్యంత గోప్యంగా రహస్య ప్రదేశాలలో నిర్మించుకుంటున్నారు. పలు దేశాలు అత్యవసర పరిస్థితుల్లో అణ్వాయుధాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో కొన్ని బహిరంగ నిర్మాణాలనే కట్టుదిట్టం చేశాయి. ఉదాహరణకు ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లోని భూగర్భ మెట్రో మార్గంలో ఉన్న మెట్రో స్టేషన్లన్నింటినీ అణ్వాయుధ దాడులను తట్టుకునేలా నిర్మించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికన్ ప్రభుత్వం రాజధాని వాషింగ్టన్ డీసీ పరిసరాల్లో అణ్వాయు«ధ దాడులను తట్టుకునే భూగృహ స్థావరాలను నిర్మించింది. దేశంలోని అత్యున్నత వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని నిర్మించింది. అమెరికాలోని జంట భవంతులపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్రవాద దాడి తర్వాత ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ (ప్రభుత్వ కొనసాగింపు) పథకం కింద ఇలాంటి మరిన్ని భూగృహ స్థావరాల నిర్మాణానికి నిధుల కేటాయింపులు ప్రారంభించింది. ప్రమాదాలు ఎదురైనప్పుడు పౌరుల సంగతి పట్టించుకోకుండా, ప్రభుత్వం తనను తాను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తూ, గారెట్ గ్రాఫ్ అనే జర్నలిస్టు ‘రేవెన్ రాక్: ది స్టోరీ ఆఫ్ యూఎస్ గవర్నమెంట్స్ సీక్రెట్ ప్లాన్ టు సేవ్ ఇట్సెల్ఫ్– వైల్ ది రెస్ట్ ఆఫ్ అజ్ డై’ అనే పేరుతో పుస్తకం రాశాడు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని రేవెన్ రాక్ మౌంటెయిన్ కాంప్లెక్స్లో అమెరికా ప్రభుత్వం ‘కంటిన్యూయిటీ ఆఫ్ గవర్నమెంట్’ పథకం కింద ఇలాంటి భూగృహ స్థావరాలను నిర్మించింది. ఇవి జనాలకు తెలిసిన స్థావరాలు. ఇలాంటి రహస్య భూగృహ స్థావరాలు కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు కూడా జనాల్లో ఉన్నాయి. అణ్వాయుధ యుద్ధాలు సంభవిస్తే, ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను గాలికొదిలేస్తాయనే ఎరుక కలిగిన అపర కుబేరులు కొందరు ముందు జాగ్రత్తగా ప్రళయ భీకర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా, బతికి బయటపడటానికి వీలుగా భూగర్భ స్వర్గాలను సొంత ఖర్చులతో నిర్మించుకుంటున్నారు. వీటి కోసం వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి భూగర్భ స్వర్గాలను నిర్మించుకున్న ఆగర్భ శ్రీమంతుల కథా కమామిషూ ఒకసారి చూద్దాం..బిల్ గేట్స్ ఇళ్లన్నింటిలోనూ భూగృహాలుమైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ మెడీనా ప్రాంతంలోని 66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న భవంతిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటితో పాటు ఆయనకు దాదాపు అరడజనుకు పైగా విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెల్ మార్, రాంకో శాంటా ఫే, ఇండియన్ వెల్స్ ప్రాంతాల్లోను; ఫ్లోరిడాలోని హోబ్ సౌండ్, వెల్లింగ్టన్ ప్రాంతాల్లోను; మోంటానా బిగ్స్కై ప్రాంతంలోను బిల్ గేట్స్కు సొంత భవంతులు ఉన్నాయి. ఈ భవంతులు అన్నింటిలోనూ సమస్త సౌకర్యాలతో అత్యంత విలాసవంతమైన సురక్షిత భూగృహాలు ఉన్నాయి. అణ్వాయుధ దాడులు జరిగినా, బయటి ప్రపంచంలో మహమ్మారులు వ్యాపించినా, భూకంపాలు, సునామీలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు తలెత్తినా చెక్కుచెదరని విధంగా వీటిని నిర్మించుకున్నారు. ఎలాన్ మస్క్ సైబర్ హౌస్ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ‘టెస్లా’, ‘స్పేస్ ఎక్స్’ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన కోసం అత్యంత సురక్షితమైన ‘సైబర్ హౌస్’ నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైబర్ హౌస్ను ఎప్పుడు ఎక్కడ నిర్మించ నున్నారనే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఎలాన్ మస్క్ ఆలోచనలకు అనుగుణంగా రష్యన్ డిజైనర్ లెక్స్ విజెవ్స్కీ సైబర్ హౌస్ నమూనాకు రూపకల్పన చేశారు. అత్యంత దృఢమైన, స్వయం సమృద్ధి కలిగిన బహుళ అంతస్తుల భూగృహంగా దీనిని డిజైన్ చేశారు. అణ్వాయుధ దాడులకు చెక్కు చెదరకుండా ఉండటం ఒక్కటే దీని విశేషం కాదు, వైరస్లు, బ్యాక్టీరియాలు వంటి సూక్ష్మజీవుల నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించేలా తీర్చిదిద్దారు. విద్యుదుత్పాదన కోసం సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ వంటి వసతులతో పాటు, మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, ఎలాంటి ఆయుధాలకైనా చెక్కుచెదరని ఎయిర్లాక్ డోర్స్, మెటల్ రోల్ షట్టర్స్ తదితర వసతులతో సైబర్ హౌస్ను నిర్మించనున్నారు. సైబర్ హౌస్ డిజైన్ మూడేళ్ల కిందటే పూర్తయినా, దీని వాస్తవ నిర్మాణం ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది.హవాయి దీవిలో జూకర్బర్గ్ భూగృహం‘ఫేస్బుక్’ అధినేత మార్క్ జూకర్బర్గ్ హవాయి దీవుల్లోని ఒకటైన కావాయి దీవిలో 1400 ఎకరాల స్థలాన్ని 100 మిలియన్ డాలర్లకు (రూ.843 కోట్లు) కొనుగోలు చేశారు. ఇందులోని ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సురక్షితమైన భూగర్భ స్థావరాన్ని నిర్మించుకుంటున్నారు. ఈ నిర్మాణాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినా, నిర్మాణంలో ఉన్న భూగృహం ఫొటోలు మీడియాకు చిక్కాయి. ఈ స్థలంలోనే నిర్మిస్తున్న రెండు వేర్వేరు భవంతుల నుంచి ఈ భూ గృహానికి చేరుకోవడానికి సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార సరఫరాకు అంతరాయం లేనివిధంగా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు, నిరంతర మంచినీటి సరఫరా కోసం వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, కీబోర్డు ద్వారా పనిచేసే సౌండ్ప్రూఫ్ తలుపులు, ద్వారాలు, హైస్పీడ్ ఎలివేటర్లు, మెకానికల్ రూమ్, స్విమింగ్ పూల్, జిమ్, సినిమా థియేటర్ వంటి విలాసవంతమైన సౌకర్యాలతో దీని నిర్మాణం సాగిస్తున్నట్లు సమాచారం. అన్ని రకాల ప్రమాదాల నుంచి రక్షణ కల్పించగల ఈ భూగృహ నిర్మాణానికి 270 మిలియన్ డాలర్లు (రూ.2,278 కోట్లు) ఖర్చు కాగలదని అంచనా.జెఫ్ బెజోస్ ఇళ్లలో భూగృహాలు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇప్పటికే ఫ్లోరిడా పరిధిలోని ఇండియన్ క్రీక్ దీవిలో మూడు భవంతులను నిర్మించుకున్నారు. ఈ మూడింటిలోనూ ఆయన సురక్షితమైన భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీటి కోసం బెజోస్ 237 మిలియన్ డాలర్లు (రూ.1,999 కోట్లు) ఖర్చు చేశారు. ఇదే దీవిలో ఇవాంకా ట్రంప్, ట్రాన్స్ఫార్మర్కో వ్యవస్థాపకుడు, సియర్స్ మాజీ సీఈవో అమెరికన్ అపర కుబేరుల్లో ఒకరైన ఎడ్డీ లాంపెర్ట్, అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మీడ్, ఏకాన్ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు కార్ల్ ఏకాన్ తదితరులు సైతం ఇండియన్ క్రీక్ దీవిలో జెఫ్ బెజోస్ తరహాలోనే భూగర్భ స్థావరాలతో కూడిన ఇళ్లను నిర్మించుకున్నారు.భూగృహ నిర్మాణరంగంలో కంపెనీల పోటాపోటీభూగృహ నిర్మాణరంగంలో పలు కంపెనీలు పోటాపోటీగా నిర్మాణాలు సాగిస్తున్నాయి. అణ్వాయుధ దాడులు, ప్రకృతి విపత్తులు సహా ఎలాంటి ముప్పునైనా తట్టుకుని నిలిచే భూగర్భ గృహాల నిర్మాణానికి కొత్త కొత్త నమూనాలకు రూపకల్పన చేస్తూ, అమిత సంపన్నులను తమ వైపుకు ఆకట్టుకుంటున్నాయి. న్యూక్లియర్ బంకర్ కంపెనీ, ఓపిడమ్ బంకర్స్, అట్లాస్ సేఫ్ సెల్లార్, సీబీఆర్ఎన్ షెల్టర్స్, స్పార్టమ్ సర్వైవల్ సిస్టమ్స్, యూఎస్ఏ బంకర్ కంపెనీ, రైజింగ్ ఎస్ బంకర్స్ వంటి కంపెనీలు కట్టుదిట్టమైన భూగర్భ నిర్మాణాలకు ప్రసిద్ధి పొందాయి. ఇవి భారీ ఎత్తున దేశ దేశాల్లో నిర్మాణాలను సాగిస్తున్నాయి. రైజింగ్ ఎస్ బంకర్స్ ఇటీవలి కాలంలో దాదాపు పది బంకర్లను న్యూజీలండ్లో ఏర్పాటు చేసింది. మిగిలిన కంపెనీలు కూడా ఇందుకు దీటుగా దేశ దేశాల్లో భూగర్భ స్థావరాల నిర్మాణాలను సాగిస్తున్నాయి. యుద్ధాలు, విపత్తులపై భయాందోళనలు ఉన్న సంపన్నులు కోట్లాది డాలర్లు వెచ్చిస్తూ వీటి ద్వారా తమ కోసం ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఆ దేశంలో ఇంటింటా భూగృహంప్రపంచవ్యాప్తంగా భూగృహాల సంఖ్యలో స్విట్జర్లండ్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ దేశంలో దాదాపు ప్రతి ఇంటా సురక్షితమైన భూగృహం ఉంటుంది. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ బంకర్లు, నివాస భవనాల్లోని ప్రైవేటు బంకర్లు సహా స్విట్జర్లండ్లో 3.70 లక్షలకు పైగా బంకర్లు ఉన్నట్లు అంచనా. అనుకోకుండా దేశంపై అణ్వాయుధ దాడులు జరిగితే, దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించడానికి వీలుగా స్విట్జర్లండ్ ప్రభుత్వం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసుకుంది. స్విట్జర్లండ్లోని ప్రతి భూగర్భ స్థావరం అత్యంత కట్టుదిట్టమైన రక్షణ కల్పిస్తుంది. దాదాపు ఏడువందల మీటర్ల దూరంలో 12 మెగాటన్నుల అణుబాంబులు పేలినా చెక్కుచెదరని రీతిలో వీటిని నిర్మించడం విశేషం. సురక్షితమైన బంకర్ల నిర్మాణంలో స్విట్జర్లండ్కు దాదాపు ఆరు దశాబ్దాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో– 1963 నుంచి స్విట్జర్లండ్ ప్రభుత్వం అణ్వాయుధ దాడులను తట్టుకునే భూగర్భ స్థావరాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, విరివిగా నిర్మాణాలను చేపట్టింది. అణ్వాయుధ దాడుల పట్ల మరే దేశంలోనూ లేని సంసిద్ధతను కేవలం స్విట్జర్లండ్లో మాత్రమే చూడవచ్చు. విపత్కర పరిస్థితుల్లో పౌరుల ప్రాణాలకు కూడా భరోసా కల్పించే ఏకైక దేశం స్విట్జర్లండ్ మాత్రమేనని చెప్పుకోవచ్చు.భూగర్భ స్వర్గాల నిర్మాతఅమెరికన్ వ్యాపారవేత్త ల్యారీ హాల్ భూగర్భ స్వర్గాల నిర్మాణంలో ప్రసిద్ధుడు. భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న ల్యారీ హాల్, సంపన్నుల కోసం అణ్వాయుధాలను తట్టుకునే భూగృహాలను కొన్నేళ్లుగా నిర్మిస్తున్నారు. ఆయన తన కోసం కాన్సస్ ప్రాంతంలో స్వయంగా భూగర్భ స్వర్గాన్ని నిర్మించుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కాన్సస్ ప్రాంతంలో అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూగర్భ క్షిపణి స్థావరాన్ని ల్యారీ హాల్ 2008లో 20 మిలియన్ డాలర్లకు (రూ.168.75 కోట్లు) కొనుగోలు చేశారు. తర్వాత దీనిని తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. బయటి నుంచి చూస్తే, గుమ్మటంలా కనిపించే ఈ భూగృహంలో నేలకు దిగువన పదిహేను అంతస్తుల భవంతిని నిర్మించారు. ఇందులో హైస్పీడ్ ఎలివేటర్లు, నిత్యావసర సరుకులతో కూడిన జనరల్ స్టోర్, సినిమా థియేటర్, పిల్లలు చదువుకోవడానికి తరగతి గది, లైబ్రరీ, స్విమింగ్ పూల్, జిమ్, స్పా, వంట గదులు, భోజనశాలలు, కూరగాయలను పండించుకోవడానికి తగిన పొలం, చేపలు, రొయ్యల పెంపకానికి ఒక కొలను వంటి సమస్త సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం విశేషం. విలాసవంతమైన సురక్షిత భూగృహాలను నిర్మించడంలో ల్యారీ హాల్ నైపుణ్యం తెలుసుకున్న సంపన్నులు చాలామంది ఆయన ద్వారానే తమ కోసం ప్రత్యేక భూగృహాలను ఇప్పటికే నిర్మించుకున్నారు. ఇంకొందరు నిర్మించుకుంటున్నారు.సంపన్నుల చూపు.. న్యూజీలండ్ వైపుప్రపంచంలోని అమిత సంపన్నుల్లోని చాలామంది భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు న్యూజీలండ్ను ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికన్ వ్యాపారవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ న్యూజీలండ్ దక్షిణ ప్రాంతంలోని దీవిలో 73,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భూగర్భ స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి స్థలాన్ని కూడా ఎంపిక చేసుకున్నారు. దీనివల్ల దీవిలోని పరిసరాల సౌందర్యం దెబ్బతింటుందనే కారణంగా న్యూజీలండ్ ప్రభుత్వం 2022లో పీటర్ థీల్కు అనుమతి నిరాకరించింది. న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, ఓపెన్ ఏఐ అధినేత శామ్ ఆల్ట్మన్ వంటి వారు సైతం న్యూజీలండ్లో భూగర్భ స్థావరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరే కాకుండా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, హాలీవుడ్ గాయని జూలియో ఇగ్లేసీయస్ సహా పలువురు సంపన్నులు న్యూజీలండ్లో భూగర్భ స్థావరాల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. -
ముంబైలోని విలాసవంతమైన ఇంటిలో స్టైలిష్గా సోనమ్ (ఫోటోలు)
-
ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ!
‘ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, ముఖమే మనసుకు ప్రతిబింబం అన్నమాట! అలాగే, ఇల్లు కుటుంబ సభ్యుల మానసిక స్థితికి అద్దం పడుతుంది. ఒద్దికగా సర్దుకుంటే, ఇల్లే స్వర్గసీమలా ఉంటుంది. చిందర వందరగా ఉంటే ఇంట్లోని కుటుంబ సభ్యులు గందరగోళంగా ఉంటారు. ఇంటిని ఒద్దికగా సర్దుకోవడం ఒక కళ. ఇంటి నిండా రకరకాల పనులు చేయడానికి మనుషులు ఉంటారు కాబట్టి సంపన్నుల ఇళ్లు మాత్రమే చక్కగా ఉంటాయి అనుకుంటే పొరపాటే! మనసుంటే, సామాన్యులు కూడా ఇంటిని శుభ్రంగా, చూడచక్కగా తీర్చిదిద్దు కోగలుగుతారు. ఇంటిని చూడముచ్చటగా తీర్చిదిద్దుకునే పద్ధతులపై జపానీస్ యువతి మేరీ కొండో చెబుతున్న పాఠాలు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి. మేరీ కొండో ముద్దుపేరు ‘కోన్మారీ’. ఇల్లు సర్దుకోవడంలో ఈమె సూచించిన పద్ధతి ‘కోన్మారీ’ పద్ధతిగా ప్రసిద్ధికెక్కింది. కోన్మారీ కథ, ఆమె పద్ధతి కమామిషూ తెలుసుకుందాం..జపాన్లోని ఒసాకా నగరంలో పుట్టిన మేరీ కొండోకు ఇంటిని చక్కగా సర్దుకోవడం అంటే ఐదేళ్ల వయసు నుంచే ఇష్టమైన వ్యాపకంగా ఉండేది. ఆ వయసు పిల్లలు బొమ్మలతో ఆటలాడుతుంటే, ఆమె మాత్రం ఇల్లు సర్దడంలో తలమునకలుగా ఉండేది. అప్పట్లో జపాన్ మాత్రమే కాదు, పలు ఇతర దేశాల్లోనూ చైనీస్ వాస్తు పద్ధతి ‘ఫెంగ్ షుయి’ వేలంవెర్రిగా ఉండేది. ఇంచుమించుగా ‘ఫెంగ్ షుయి’లాంటి ‘ఫు సుయి’ అనే పురాతన పద్ధతి జపాన్లో వాడుకలో ఉంది. ఇంటి అలంకరణలో మేరీ కొండో తల్లి ‘ఫు సుయి’ పద్ధతులు అనుసరించేది. చిన్నారి కొండో అదంతా గమనిస్తూ ఉండేది. ఊహ తెలిసి, కొంత ఎదిగిన తర్వాత ఇంటిని ఒద్దికగా సర్దుకోవడానికి, అందంగా తీర్చిదిద్దుకోవడానికి కేవలం ‘ఫెంగ్ షుయి’, ‘ఫు సుయి’ వంటి పద్ధతులు సరిపోవని గుర్తించింది. ఇంటిని మరింత ఒద్దికగా, చూడముచ్చటగా సర్దుకోవడంలో తనదైన శైలిలో ప్రయోగాలు మొదలుపెట్టి, అద్భుతమైన ఫలితాలను సాధించింది. అలా మొదలైందిమేరీ కొండో చిన్నప్పటి నుంచి తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని చాలా ఇళ్లను గమనిస్తూ వచ్చేది. ఇల్లు సర్దుకోవడంలో తన ఇంటి చుట్టుపక్కల జనాలు అనుసరించే పద్ధతులను నిశితంగా పరిశీలించేది. ‘ఫెంగ్ షుయి’, ‘ఫు సుయి’ పద్ధతులను తు.చ. తప్పకుండా పాటిస్తూ అలంకరించిన ఇళ్లను కూడా చూసేది. ఇవన్నీ చూసినా, ఆమెకు వాటిలో ఏదో లోపం ఉన్నట్లే అనిపించేది. తన ఇంట్లోనే తల్లికి చేదోడుగా ఇంటిని చక్కగా సర్దుకోవడంలో రకరకాల ప్రయోగాలు చేసేది. జూనియర్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఇంటర్వెల్లో పిల్లలంతా ఆడుకోవడానికి బయట మైదానంలోకి వెళితే, మేరీ కొండో మాత్రం తరగతి గదిలోని పుస్తకాల షెల్ఫులను చక్కగా సర్దిపెట్టేది. ఆమె పనికి టీచర్ల ప్రశంసలు లభించేవి. తాను ఉన్న పరిసరాలను శుభ్రంగా, చూడచక్కగా సర్దుకోవడం అప్పట్లోనే ఆమెకు వ్యామోహంగా మారింది. ఒకనాడు స్కూల్లోని పుస్తకాల షెల్ఫులను నిర్విరామంగా సర్దుతుండగా, విశ్రాంతి లేకపోవడం వల్ల స్పృహతప్పి పడిపోయింది. రెండు గంటల తర్వాత ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. ఈ సంఘటనే తన జీవితాన్ని మలుపు తిప్పిందని మేరీ కొండో చెబుతుంది. ‘ఆ రోజు పుస్తకాల షెల్ఫులు సర్దుతుండగా, స్పృహ తప్పిపోయాను. రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాను. ఏం జరిగిందో అర్థంకావడానికి కొన్ని నిమిషాల సమయం పట్టింది. ఇల్లు, స్కూలు సర్దుకోవడంలో నేను అప్పటి వరకు చేస్తూ వచ్చిన పొరపాటు నాకు తెలిసి వచ్చింది. అప్పటి వరకు పనికిరానివి పారేస్తూ, కొద్దిపాటి వస్తువులను చూడముచ్చటగా కనిపించేలా సర్దుతూ వచ్చేదాన్ని. ఆ తర్వాత నా పద్ధతిని మార్చుకున్నాను. పారవేయాల్సిన వస్తువుల పనిపట్టడం బదులుగా, అట్టే పెట్టుకోవలసిన వస్తువులను ఎలా సర్దుకోవాలనే దానిపై దృష్టిపెట్టడం మొదలుపెట్టాను. మనసుకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని ఇచ్చే వస్తువులను కంటికి ఇంపుగా కనిపించేలా సర్దుకోవడం ప్రారంభించాను’ అని చెబుతుందామె. బడి చదువు పూర్తయ్యాక మేరీ కొండో టోక్యో విమెన్స్ క్రిస్టియన్ యూనివర్సిటీలో సోషియాలజీ చదువుకుంది. ఆ తర్వాత ఒక షింటో ఆలయంలో అటెండెంట్గా ఐదేళ్ల పాటు సేవలందించింది. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక పూర్తి స్థాయిలో ఇల్లు, బడి, ఆఫీసు వంటివి చక్కగా సర్దుకునే పద్ధతులపై సలహాలు, సూచనలు ఇవ్వడాన్నే వృత్తిగా మార్చుకుంది.సంతోషాల వెలుగుమేరీ కొండో వస్తువులను చక్కగా సర్దుకోవడంలో కనిపెట్టిన పద్ధతి ‘కోన్మారీ’గా పేరు పొందింది. జపానీస్ భాషలో ‘కోన్మారీ’ అంటే సంతోషాల వెలుగు అని అర్థం. వస్తువులను త్వరగా, చూడముచ్చటగా, పరిపూర్ణంగా ఎలా సర్దుకోవాలో చెప్పే ఈ పద్ధతికి జపాన్లోనే కాకుండా, మరో ముప్పయి దేశాలలో అనతికాలంలోనే జనాదరణ పెరిగింది. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా మన పరిసరాల్లో మన సంతోషాన్ని పెంచే వస్తువులను చూడముచ్చటగా సర్దుకోవడం, మనకు ఏమాత్రం సంతోషం కలిగించని వాటిని వదుల్చుకోవడమే ‘కోన్మారీ’ పద్ధతి. ‘కోనామారీ’కి ఆదరణ పెరగడంతో మేరీ కొండోపై పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు దృష్టి సారించాయి. కొన్ని చానళ్లు ఆమెతో ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. ఇంకొన్ని ఆమెతో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి రేటింగులను పెంచుకున్నాయి. ఒక టీవీ చానల్లో ప్రసారమైన ‘స్పార్కింగ్ జాయ్ విత్ మేరీ కొండో’ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ లభించింది. వస్తువులను సర్దుకోవడంపై మేరీ కొండో ఇప్పటి వరకు ఆరు పుస్తకాలు రాసింది. అవి చాలా భాషల్లోకి అనువాదం పొందాయి. లక్షలాది కాపీలు ఇప్పటికే అమ్ముడుపోయాయి. షింటో బోధనల స్ఫూర్తితో తాను ‘కోన్మారీ’ పద్ధతికి రూపకల్పన చేసినట్లు మేరీ కొండో చెబుతుంది. ‘కోన్మారీ’ పద్ధతి చాలా సరళమైనది. ఇంట్లోని వస్తువులను రకాల వారీగా విభజించుకోవడం ఇందులోని మొదటి ప్రక్రియ. అంటే, దుస్తులు, పుస్తకాలు, కాగితాలు, పాత్రలు, డబ్బాలు– ఇలా ఒక్కోరకం వస్తువులను ఎంపిక చేసుకుని, ముందుగా ఒకచోట పోగు పెట్టాలి. తర్వాత వాటిలో మనకు పనికొచ్చే వాటిని, మనకు సంతోషం కలిగించే వాటిని ఏరుకుని, వాటిని పొందికగా సర్దుకోవాలి. పనికిరాని వాటిని పారేయాలి. ఇంతే! ఈ పని చేస్తే చాలు, ఇంటి తీరుతెన్నులే మారిపోతాయి. ఇంట్లోకి అడుగుపెడుతూనే ప్రశాంతంగా అనిపిస్తుంది. జపాన్ నుంచి అమెరికాకుమేరీ కొండో ఒసాకోలోనే పనిచేసే కవాహరా తకుమిని 2012లో పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కవాహరా ఒసాకోలోని ఒక కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేసేవాడు. ‘కోన్మారీ’కి ఆదరణ పెరిగి మేరీ కొండో కెరీర్ నిలదొక్కుకున్నాక కవాహరా ఉద్యోగం మానేసి, భార్యకు పూర్తిస్థాయి మేనేజర్గా మారాడు. తర్వాత ఈ దంపతులు ‘కోన్మారీ’ మీడియా సంస్థను నెలకొల్పారు. కవాహరా మీడియా సంస్థకు సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటే, మేరీ కొండో సంస్థకు చెందిన సృజనాత్మక వ్యవహారాలను చూసుకుంటోంది. సంస్థను మరింతగా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ దంపతులు అమెరికా చేరుకున్నారు. తొలుత శాన్ఫ్రాన్సిస్కోలో కొన్నాళ్లు ఉన్నాక, తర్వాత లాస్ ఏంజెలెస్కు మకాం మార్చి, ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. అమెరికాకు తరలిపోయిన తర్వాత ‘కోన్మారీ’కి పాశ్చాత్య ప్రపంచంలో ఆదరణ బాగా పెరిగింది. మేరీ కొండో ‘యూట్యూబ్’లోను, ‘ఇన్స్టాగ్రామ్’లోను పెడుతున్న వీడియోలకు లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘కోన్మారీ’ పద్ధతిలో ఇల్లు సర్దుకోవడం చాలా సులువు. ఈ పద్ధతిలో ఒద్దికగా ఇంటిని సర్దుకున్నట్లయితే, ఇల్లే కదా స్వర్గసీమ అన్నట్లుగా ఉంటుంది.కోన్మారీ చిట్కాలుఒక టీవీ కార్యక్రమంలోమేరీ కొండో చెప్పిన చిట్కాలు ఇవి:⇒ఇల్లు ఎలా ఉంటే ఇంట్లో సౌకర్యంగా, సంతోషంగా ఉండటం సాధ్యమవుతుందో ఊహించండి. మీ ఊహలను అమలు పెట్టడానికి ప్రయత్నించండి.⇒ఇంట్లో ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వని వస్తువులు పడి ఉంటే, వాటిని వదుల్చుకోండి. దానివల్ల కొంత చోటు ఖాళీగా మిగులుతుంది. ఇల్లు విశాలంగా ఉన్నట్లు అనిపిస్తుంది.⇒ప్రతి వస్తువుకు దానిదైన చోటును నిర్దేశించుకోండి. ఆ వస్తువు అక్కడే ఉండేలా సర్దుకోండి.⇒అలాగని తక్కువ చోటులో ఎక్కువ దుస్తులను పట్టించాలనే ప్రయత్నంలో వాటిని కుక్కేయకండి. వాటిని జాగ్రత్తగా మడతపెట్టి, తిరిగి సులువుగా వాడుకునేలా సర్దుకోండి.⇒బాగా సంతోషాన్ని ఇచ్చే వస్తువులను ఇంట్లోకి అడుగుపెడుతూనే కనిపించేలా పొందికగా సర్దుకోండి.⇒నిలువుగా ఎక్కువ అరలతో ఉండే వార్డ్రోబ్లలో మడతపెట్టిన దుస్తులను సర్దిపెట్టుకోండి. దానివల్ల చాలా చోటు కలిసొస్తుంది.⇒గోడలకు ఫొటో ఫ్రేములు, చిత్రపటాలు అతిగా వేలాడదీయకండి. పూలకుండీలను ఇరుకిరుకు మూలల్లో ఉంచకండి. -
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్హౌస్ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
సకల సౌకర్యాలున్న గుండ్రని ఇల్లు (ఫొటోలు)
-
ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
సోనమ్ కపూర్ డ్రీమ్ హౌస్, అది మరో ప్రపంచం
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇల్లుభారతీయ హస్తకళ, రాచరికపు వారసత్వ కళతో ఆకట్టుకుంటుంది. ముంబైలో ఉన్న ఆమె ఇల్లు తంజోర్ పెయింటింగ్స్, నాగా ప్యానెల్స్, రాజస్థానీ జాలీస్, జర్దోజీ ఎంబ్రాయిడరీలతో.. రాజ సౌధాలకు మించిన అద్భుతంతో అలరారుతుంటుంది. సోనమ్ ఆంటీ ఎడి 100 ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ సోనమ్ ఇంటి డిజైనింగ్లో పాలుపంచుకుంది.మనం అత్యంత ఇష్టపడే తారల్లో సోనమ్ కపూర్ ఒకరు. ఆమెకు ఇష్టమైనది మాత్రం భారతీయ వారసత్వ కళ అని ఆమె ఇంటిని చూసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ ఈ హంగులను ప్రస్తావిస్తూ –‘‘సోనమ్ ఆసక్తిని లోతుగా పరిశోధించడానికి ఆమెతో కలిసి కొంత కాలం ప్రయాణించాను. సెప్టెంబర్ 2021లో ఆమె నాటింగ్ హిల్ పైడ్ – ఎ – టెర్రే, కెన్సింగ్టన్ స్టూడియోలు రెండింటినీ చూశాను. వాటి పునరుద్ధరణలో ఆమె ప్రతిభ, కళల పట్ల ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నాతో మాట్లాడుతూ ‘నేను నా భర్త ఆనంద్, కొడుకు వాయుతో పంచుకునే ఈ ఇంటిని ఒక మహిళగా, నిర్వాహకురాలిగా, తల్లిగా నాకు ఓ కొత్త అనుభూతిని అందించాలి‘ అని తెలిపింది. ఈ సందర్భంగా సోనమ్ చెప్పిన విషయాలు కూడా ప్రస్తావించాలి. ప్రాచీన వస్తువుల సేకరణ‘సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా చోట్లకు వెళుతుంటాం. ఆ విధంగా సంవత్సరాలుగా నేను సేకరించిన అన్ని వస్తువులను అలంకరించడానికి ఒక స్థావరం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను. భారతదేశం అంతటా మురికి హవేలీలు, పురాతన వస్తువుల దుకాణాలు గుండా తిరిగాను. నేను దేనినైనా ప్రేమిస్తే, అది నా ఇంటికి చేరకుండా ఉండదు. లక్ష్మీ నివాస్ ప్యాలెస్లో చిత్రీకరణ సమయంలో దొరికిన విశాలమైన బికనీర్ డ్యూరీని మోసుకొచ్చేశాను’ అని ఆనందంతో వివరిస్తుంది. ఓ వైపు ప్రాచీన చైనీస్ గ్లాస్ పెయింటింగ్లు, మరో ప్రపంచంలా అనిపించే పియరీ ప్యారీ వాల్పేపర్తో రూపొందించిన గదులు, పాదాల క్రింద హృదయాన్ని మెత్తగా హత్తుకుపోయే ఎరుపు, నారింజల రంగుల తివాచీలు మనల్ని అబ్బురపరుస్తాయి.అమ్మమ్మ ప్రభావంకపూర్ సౌందర్య అభిరుచులను ్ర΄ోత్సహించింది ఆమె అమ్మమ్మ. ‘మా ఆమ్మమ్మ ఒక సామాన్యమైన మహిళ, కానీ చాలా చురుకుదనంతో ఉంటుంది’ అని గుర్తు చేస్తుకుంటుంది కపూర్. ‘అమ్మమ్మ తన మారుతి సుజుకీలో దాదర్ పూల మార్కెట్కు ఉదయం 5 గంటలకు తన ఇంటిని సువాసనలతో నింపడానికి స్పీడ్గా వెళ్లేది. శాస్త్రీయ సంగీతం, కళలు, తివాచీలను ఆరాధించేది. కరాచీలో విభజనకు ముందు సింధీ కుటుంబం నుండి వచ్చినందున, మా అమ్మమ్మకి తన అభిరుచులపై మంచి ఆసక్తి ఉంది. నాపై ఆమె ప్రభావాన్ని తగ్గించడం కష్టం’ అంటుంది. ఇలా సోనమ్ ఇష్టాయిష్టాలను కనుక్కుంటూ ఒక్కో వస్తువును అలంకరణలో భాగం చేసుకుంటూ ఆమె ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. -
దొరా.. ఇళ్లు రెడీ!
కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది. ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు... ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్లో రెండు బెడ్ రూమ్లు, అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్ను ఎన్సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది. ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధిసొంతిల్లు అదృష్టం ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధిసమస్యను పరిష్కరించాం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు -
లోకేష్ ఇంటికి ఒకేసారి టీడీపీ మంత్రుల క్యూ.. ‘కూటమి’లో ఏం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇంటికి ఒకేసారి 18 మంది టీడీపీ మంత్రులు క్యూ కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ రోజు ఉదయం మంత్రులందరినీ లోకేష్ తన ఇంటికి పిలిపించుకోగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినందుకు అభినందనలు తెలిపినట్లు లోకేష్ టీం ప్రకటించింది.లోకేష్ పిలవగానే 18 మంది టీడీపీ సీనియర్, జూనియర్ మంత్రులు హాజరయ్యారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన నారా లోకేష్ తనకు విషెస్ చెప్పించుకోవడానికి మంత్రులందరిని ఇంటికి రప్పించుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీ మంత్రి సత్యకుమార్ మాత్రం లోకేష్ను అభినందించలేకపోవడం కూడా కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా, ఒక మంత్రి ఇంటికి ఒకేసారి మంత్రులు వెళ్లడం ఏపీలో ఎప్పుడు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో లోకేష్ ఎందుకు 18 మంది టీడీపీ మంత్రులను ప్రత్యేకంగా పిలిపించుకున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024 -
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు. -
‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!
అందమైన రంగులు ఇంటికి అందాన్నిస్తాయనుకుంటాం. కానీ ఒకే ఒక రంగుతో ఇంటిని అద్భుతంగా అలంకరించవచ్చని ‘నీల్’ కాన్సెప్ట్ రుజువు చేస్తోంది. స్వచ్ఛమైన తెలుపుకి లేత నీలంరంగు థీమ్తో డిజైన్ని చూస్తుంటే నీలి మేఘం నట్టింట్లోకి వచ్చినట్లుంది. ఆకాశంలో మబ్బుల్లో రూపాలను వెతుక్కుంటాం. ఇది నట్టింట్లో ఆవిష్కరించిన కళారూపం. ఇందులో ప్రతి ఒక్కటీ చేత్తో చేసినవే. అచ్చమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ హోమ్ డెకరేషన్ అన్నమాట. బెడ్ స్ప్రెడ్, పిల్లో కవర్, రన్నర్, కార్పెట్, డోర్ మ్యాట్, ల్యాంప్ షేడ్, సోఫా కుషన్లు, కవర్లతోపాటు డిన్నర్ సెట్ కూడా గౌరంగ్ షా డిజైన్ చేసిన నీల్ థీమ్లో ఒదిగి పోయింది. ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్గా జాతీయ అవార్డు గ్రహీత గౌరంగ్ షా ఇంటీరియర్ డెకరేషన్లో చేసిన ప్రయోగం ఇది. తన ప్రయోగాన్ని ఇటీవల హైదరాబాద్లోని హైటెక్స్లో ఇది ‘గౌరంగ్ హోమ్’ అంటూ సగర్వంగా ప్రదర్శించాడు షా. ఇంటి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది మన ఇంటి డెకరేషన్లో ప్రతిబింబిస్తుంది. వారసత్వ కళల సమ్మేళనం! లేత నీలం రంగులో అలరిస్తున్న పూలు, ఆకుల్లో కొన్ని జామ్దానీ నేతకు ప్రతిరూపాలు. కొన్ని కసౌటీ, చికన్కారీలతో సూదిమొన చెక్కిన రూ΄ాలు. మరికొన్ని అచ్చు అద్దిన పూలు. తెల్లటి పింగాణీ మీద విరిసిన నీలాలు ఫ్యాషన్తో ΄ోటీ పడుతున్నట్లున్నాయి. జామ్దానీ, అజ్రక్, కలంకారీ, చికన్కారీ, హ్యాండ్ ప్రింట్లతో ఇంటిని అలంకరిస్తే భారతీయ వారసత్వ హస్తకళకు ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? కళాకారులకు ఇవ్వగలిగిన ప్రోత్సాహం మరేముంటుంది? ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, నాచురల్ రంగులతో పర్యావరణ హితమైన జీవనశైలికి మరో నిర్వచనం ఇంకెక్కడ దొరుకుతుంది. -
సోఫా, ఏసీ, ట్యాప్లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్పై బీజేపీ ఆరోపణలు
రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. -
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
బంగారు ఇల్లు!.. ధర తెలిస్తే గుండె జల్లు (ఫోటోలు)
-
సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం స్వాధీనం చేసుకుంది. బ్యాగ్ను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ట్యాంక్బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్కు మంటలు -
అక్కడ భారీగా పెరిగిన ఇళ్ల ధరలు: ఇదిగో ప్రూఫ్..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అయితే కేరళలో కూడా ఇళ్ల ధరలు ఏ మాత్రం తక్కువ కాదని ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక పోస్ట్ వెల్లడిస్తోంది.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక సోషల్ మీడియా పోస్టులో 4 బీహెచ్కే (3500 చదరపు అడుగులు) ఇల్లు ధర రూ. 3 కోట్లు అని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే కేరళలో రియల్ ఎస్టేట్ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది నగరానికి దగ్గర ఉందా? దూరంగా ఉందా? అనే వివరాలు వెల్లడించలేదు.ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా? కరోనా తరువాత స్థిర ఆస్తిని కలిగి ఉండాలని.. భూములు, భవనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రాపర్టీ ధరలు పెరిగాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు వంటి నగరాల్లో 3 బీహెచ్కే అపార్ట్మెంట్ ధర సగటున రూ. 2 కోట్లు. 4 బీహెచ్కే ధర రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఇల్లు బాగుందని చెబుతుంటే.. మరికొందరు ధర చాలా ఎక్కువని అని పేర్కొంటున్నారు.4 BHK, 3500 sq ft is what 3Cr gets you in Kerala. pic.twitter.com/oRqSzmWqZg— Sidharth II सिद्धार्थ (@sidharthgehlot) September 9, 2024 -
ప్రధాని మోదీ ఇంటికి ప్రత్యేక అతిథి.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తాను ప్రత్యేకంగా ఏమి చేసినా దానిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇవి త్వరగా వైరల్గా మారుతుంటాయి. తాజాగా ప్రధాని మోదీ ఇంటికి ఒక చిన్న ప్రత్యేక అతిథి వచ్చింది. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా తెలియజేశారు. ఈ అతిథికి పేరు కూడా పెట్టినట్లు మోదీ పేర్కొన్నారు. हमारे शास्त्रों में कहा गया है - गाव: सर्वसुख प्रदा:'। लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है। प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है। इसलिए, मैंने इसका नाम 'दीपज्योति'… pic.twitter.com/NhAJ4DDq8K— Narendra Modi (@narendramodi) September 14, 2024ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ‘మన శాస్త్రాల్లో చెప్పినదాని ప్రకారం గోమాత మనకు సర్వసుఖాలను అందిస్తుంది. ప్రధానమంత్రి కుటుంబంలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టింది. ప్రధానమంత్రి నివాసంలో గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై జ్యోతి గుర్తు ఉంది. అందుకే దానికి 'దీప్జ్యోతి' అని పేరు పెట్టాను’ అని పేర్కొన్నారు. ఆ దూడకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ దీప్జ్యోతిని ప్రేమగా నిమురుతూ కనిపిస్తున్నారు. మోదీ తన ఇంటిలోని పూజాగదిలో దీప్జ్యోతికి పూలమాల వేసి, తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించడం కనిపిస్తుంది. దీప్జ్యోతి కూడా ప్రధానమంత్రికి చాలా సన్నిహితంగా మెలుగుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. A new member at 7, Lok Kalyan Marg! Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4— Narendra Modi (@narendramodi) September 14, 2024ఇది కూడా చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది -
పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి..
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్హాల్, రామ్లీలా ఫంక్షన్హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు. బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న దాతల చేయూతవరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు. -
శంభీపూర్ రాజు నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు
-
కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి
-
కరకట్ట కొంపలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు.. విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
-
కష్టమంతా వరదపాలు
ఈ చిత్రంలోని సంతోష్, దుర్గ దంపతులు విజయవాడ వన్టౌన్ సాయిరాం థియేటర్ వెనుక రాజీవ్శర్మ వీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి డాబాపైకి వెళ్లిపోయారు. రూ.20 వేల విలువైన వాషింగ్ మెషిన్, రూ.22 వేల ఫ్రిడ్జ్, రూ.50 వేల విలువైన డబుల్ కాట్, రూ.15 వేల దివాన్, రూ.10 వేల మిక్సీ గ్రైండర్ నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.వీటి విలువే రూ.1.17 లక్షలు. ఇవి పనిచేసే పరిస్థితి లేదు. నాలుగు బియ్యం బస్తాలు, వంట సామగ్రి, సరుకులు ఏవీ మిగల్లేదు. భవన నిర్మాణంలో టైల్స్ అమర్చే పని చేసే సంతోష్ వాయిదా పద్ధతిలో 2016 నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కొంటున్నారు. ఎనిమిదేళ్ల కష్టం ఒక్క రోజులో నీటిపాలైంది. మళ్లీ ఇన్ని వస్తువులు సమకూర్చుకోవడం ఇప్పట్లో తమ వల్ల అయ్యే పని కాదని సంతోష్, దుర్గ బోరున విలపిస్తున్నారు.(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): వరదల కారణంగా బెజవాడ, పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు ఇలా వేలు, లక్షల్లో నష్టపోయాయి. జీవిత కాలం కష్టమంతా వరద నీటి పాలైపోయింది. గృహావసరాలకు ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, మంచం, ఫ్యాను, గ్రైండర్ వంటికి కొనుక్కోవడానికి కూడా పేద, మధ్య తరగతి ప్రజలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రూపాయి రూపాయి పోగేసి, చిట్టీలు కట్టి, ఈఎంఐలతో కొంటుంటారు. ఇప్పుడు వరదలో అన్నీ పాడైపోయాయి. ఇవే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆస్తి దస్తావేజులు, పాఠశాలల ఫీజు రసీదులు, కష్టపడి సంపాదించుకున్న నగదు, శుభకార్యాల కోసం, రోజువారీ అవసరాల కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బు బీరువాల్లో తడిసిముద్దయ్యాయి. కొన్ని వరదలో కొట్టుకొనిపోయాయి. ప్రతి ఇంటికీ రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి జీవితం మొదలుపెట్టాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాకు మిగిలిందేమీ లేదు..ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. సామగ్రి మొత్తం మునిగిపోయింది. పాములు కూడా ఇళ్లలోకి చేరాయి. జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్నవన్నీ వరద పాలయ్యాయి. మాకు మిగిలిందేమీ లేదు. – సాయికుమారి, రాజరాజేశ్వరిపేటవిలువైన పత్రాలేవీ మిగల్లేదుపిల్లల సర్టిఫికెట్లు, ఇంటి పట్టాలు, గుర్తింపు కార్డులన్నీ నీటిలో నానిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ పోయి దుర్బర స్థితిలోకి వచ్చేశాం. మా స్కూటీ కూడా కొట్టుకెళ్లిపోయింది. పూలు అమ్ముకునే నాలాంటోళ్లు ఎన్నేళ్లు కష్టపడితే ఇంటి సామగ్రిని సమకూర్చుకోగలం? – గోపమ్మ, రాజరాజేశ్వరి పేటమళ్లీ వస్తువులు కొనుక్కోవడం మా వల్ల కాదుఇంట్లో ప్రతి వస్తువూ వాయిదాల్లో కొన్నవే. రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్నాం. వాటి కోసం ఇతర ఖర్చులూ తగ్గించేసుకున్నాం. ఒక్కో వస్తువు రూ.20వేలుపైనే ఉంటుంది. అవన్నీ మళ్లీ కొనుక్కోవాలంటే మావల్ల కాదు. – జగన్నాథం దుర్గ, బాధితురాలు, రాజరాజేశ్వరిపేటడ్రోన్లతో ఆహారం ఎవరికిస్తున్నారో..?నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సింగ్నగర్ పైపులరోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఆదివారం ఉదయం మా ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మొదటి అంతస్తుకు చేరాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఆకలి అని ఏడుస్తుంటే ఆదివారం సాయంత్రం అటుగా వెళ్తున్న బోటు అడిగితే రూ.4 వేలు ఇవ్వమన్నారు. అంత ఇవ్వలేక అక్కడే ఉండిపోయాం. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఆహారం, నీరు కూడా అందించలేదు. మా బిల్డింగ్పై ఉన్న వాటర్ ట్యాంకులో నీళ్లు తాగి బతికాం. ఆ ట్యాంకులో కూడా నీళ్లు ఖాళీ కావడంతో పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరాం. డ్రోన్లు, హెలికాప్టర్లలో ఆహారం ఎవరికి ఇస్తున్నాయో తెలియడం లేదు. – బూర అనీల్, పైపులరోడ్డు, అజిత్సింగ్నగర్మానవ తప్పిదమే..ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇది ప్రకృతి వైపరీత్యం అని సరిపెట్టుకునేందుకు వీల్లేదు. ఇది కచ్చితంగా మానవ తప్పిదంగానే భావిస్తున్నాను. ప్రాణ భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకటి, రెండు అంతస్తుల్లోకి వెళ్లిపోయాం. ఎవరు ఎక్కడికి వెళ్లిపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్లు వచ్చేసి అన్నీ మునిగిపోయాయి. ప్రాణ భయం అంటే ఏమిటో తెలిసింది. – నక్కా ప్రభుదాస్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
బాబు ఇల్లు వరదపాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా నదీ తీరంలో కరకట్ట వెంబడి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూడా కృష్ణమ్మ వరద ముంచెత్తింది. కనీసం సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేనంతగా రెండో అంతస్తు వరకు వరద వచ్చింది. ఇది అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలుసు. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అందులో నివాసం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎన్ని విమర్శలు వచి్చనా కొన్నేళ్లుగా చంద్రబాబు అదే తన నివాసంగా చేసుకొన్నారు. రెండు రోజులుగా కృష్ణా నదికి తీవ్రంగా వరద రావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కప్పిపుచ్చారు. సీఎం చంద్రబాబు ఆదివారం నుంచి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటున్నారు. ఇంటి వద్దకు వరద ఎంత వస్తుందో కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో సోమవారం సీఎం ఇంట్లోని రెండో అంతస్తులోకి వరద నీరు వచి్చంది. ముఖ్యమంత్రి నివాసమే మునిగిపోయింది. కనీసం అందులో ఉన్న సామగ్రిని కూడా బయటకు తీయలేకపోయారు. ప్రకాశం బ్యారేజి పరిసర ప్రాంతాలకు పోటెత్తిన వరద కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నది పరిసర ప్రాంతాలన్నీ వరద పోటెత్తింది. బ్యారేజ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో సోమవారం 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు నిలిపి వేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో రిటైనింగ్ వాల్ కూలి ప్రమాదభరితంగా మారింది. బకింగ్హామ్ కాలువ నీరు రెండు బ్రిడ్జిల మధ్య ఓవర్ ఫ్లో అవుతోంది. కొండవీటి వాగు స్లూయిజ్ వద్ద తూటాకు అడ్డుపడడంతో నీటిని బయటకు పంపడం సాధ్యం కావడంలేదు. కెనాల్లోని తూటాకును తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. కృష్ణా నీరు కొండవీటి వాగులోకి ప్రకాశం బ్యారేజ్ వద్ద కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు రూ. 200 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిరి్మంచారు. అయితే వాగు వద్ద స్లూయిజ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఎత్తిపోతల వరకు భారీగా వరద వస్తోంది. కృష్ణానది ఎత్తులో ఉండడంతో ఆ నీరంతా వాగులోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరు చానల్కు వెళ్లి ఉండవల్లిలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఉండవల్లి అమరావతి రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.సారపాక వాగులోంచి వచి్చన వరద నీరంతా సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద నిలిచిపోయింది. అధికారులు ఇక్కడ గండి కొట్టి నీటిని మళ్లించారు. కాగా, వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణ రాజు నిరి్మంచిన ప్రకృతి వైద్యం ఆశ్రమానికి సోమవారం ఉదయం వరద నీరు రావడంతో ఆందోళన చెందిన రోగులు పెద్దపెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద తాడు సహాయంతో పై అంతస్తుల్లో ఉన్న వారిని కిందకు దించి పంపించి వేశారు. కరకట్టకు ముప్పు ప్రకాశం బ్యారేజ్ నుంచి హరిశ్చంద్రపురం వరకు కరకట్ట పలుచోట్ల దెబ్బతిని పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం గ్రామాల్లోకి నీరు చొచ్చుకు వస్తోంది. కొల్లిపర వద్ద కరకట్టకు గండ్లు పడే పరిస్థితి తలెత్తడంతో అధికారులు ఇసుక బస్తాలు వేస్తున్నారు. రేపల్లె పులిగడ్డ వద్ద కరకట్ట తెగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. కరకట్ట ఎక్కడైనా గండిపడితే నష్టం భారీగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎప్పుడు వరదలు వచి్చనా ముందస్తుగా వివిధ శాఖల అధికారులు పలు ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. -
నిందితుల ఇళ్లు కూల్చడమేంటి? : సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: బుల్డోజర్ రాజ్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.ఢిల్లీ జహంగీర్పురిలో నిందితుడు అద్దెకున్న ఇళ్లు కూల్చివేయడంపై సీనియర్ న్యాయవాదులు దుష్యంత్దవే, సీయూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్ల బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ’క్రిమినల్ కేసుల్లో నిందితులు, దోషుల ఇళ్లు కూల్చివేయాలన్న నిబంధన ఎక్కడ ఉంది. ఒక కట్టడం అక్రమమైనదైతే దానిని కూల్చేందుకు ఒక విధానం ఉంది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’అని బెంచ్ తెలిపింది. కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కొడుకు నేరం చేస్తే తండ్రి ఇళ్లు కూల్చిన ఘటనపైనా కోర్టు మండిపడింది. -
అక్రమ నివాస ఫలితం.. చంద్రబాబూ వరద బాధితుడే
సాక్షి, అమరావతి: భారీ వర్షాలతో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ సౌధాన్ని వరద ముంచెత్తింది. దీంతో చంద్రబాబు కూడా వరద బాధితుడిగా మారారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) గత నెల 28నే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించాల్సిన చంద్రబాబు తన కర్తవ్యాన్ని విస్మరించారు. ఫలితంగా తాను విజనరీనని చెప్పుకునే సీఎం చంద్రబాబు స్వయంగా వరద కోరల్లో చిక్కుకున్నారని అధికారవర్గాలే చెబుతున్నాయి.ఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని.. రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. విజయవాడ నగరానికి, లక్షలాది మంది ప్రజలకు వరద ముప్పును తప్పించడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే విజయవాడలో ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచే సహాయక చర్యలను పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్తవ్యం మరిచి.. విద్యుక్త ధర్మం విస్మరించి.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కి గరిష్ట వరద ప్రవాహం వస్తుందని తెలిసినా చంద్రబాబు ముందు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులకు దిశానిర్దేశం చేయలేదు. ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రకాశం బ్యారేజ్లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉన్న అక్రమ సౌధంసహా 35 బంగ్లాలను వరద చుట్టుముట్టింది. ఇందులో చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ గెస్ట్ హౌస్గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది.సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఇసుక బస్తాలు వేసి వరద చేరకుండా జలవనరుల అధికారులు విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. వరద జలాలు చుట్టుముట్టడంతో ఆ సౌధంలో నివాసం ఉండటం ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రికి కృష్ణాలో ప్రవాహం 10.50 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని, అప్పుడు పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని తేలి్చచెప్పారు. దాంతో విధి లేని పరిస్థితుల్లో ఆదివారం రాత్రి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సీఎం చంద్రబాబు తన మకాం మార్చారు. నాడు ముంచేశారని.. నేడు తానే మునిగి.. కృష్ణా నదికి 2019లో ఆగస్టు 14 నుంచి 17 వరకూ భారీ వరదలు వచ్చాయి. అప్పుడు కూడా చంద్రబాబు నివాసంతోపాటూ 35 అక్రమ బంగ్లాలు నీట మునిగాయి. 2020, 2021, 2022లోనూ ఇదే జరిగింది. కానీ.. ఇప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నారు. ఐఎండీ హెచ్చరికలను పట్టించుకోలేదు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. ఫలితంగా తానే వరద బాధితుడిగా చంద్రబాబు మారారు. అప్పట్లో తన నివాసాన్ని ముంచడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడెందుకు ముంపు ముప్పును తప్పించుకోలేకపోయారని అధికారవర్గాలే ప్రశి్నస్తున్నాయి.చరిత్రలో మూడో అతి పెద్ద ప్రవాహం.. కృష్ణా నదిపై సర్ ఆర్ధర్ కాటన్ తొలుత ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు 1903, అక్టోబర్ 7న గరిష్ఠంగా 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచి్చంది. ఆ తర్వాత 2009, అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజ్లోకి 11,10,404 క్యూసెక్కుల వరద ప్రవాహం వచి్చంది. ఆదివారం రాత్రికి ప్రకాశం బ్యారేజ్లోకి చేరే వరద 10.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే.. కృష్ణా నది చరిత్రలో ఇప్పుడొచ్చిన ప్రవాహం మూడో గరిష్ఠ వరద ప్రవాహంగా రికార్డుల్లోకి ఎక్కనుంది. -
సీఎం చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. రాత్రి బస చేస్తే ప్రమాదమే
సాక్షి, విజయవాడ: సీఎం చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. సిబ్బంది మోటార్లతో వరద నీటిని తోడుతున్నారు. సీఎం నివాసం వైపు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.ఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఇల్లు నీటమునిగింది.కృష్ణా నది కరకట్ట లోపల సీఎం చంద్రబాబు నివాసం ఉండటంతో ఆయన ఇంట్లోకి వరద నీరు పోటెత్తింది. మరోవైపు.. ప్రకాశం బ్యారేజ్కు అనూహ్యంగా గంట గంటకు వరద నీరు ప్రవాహం పెరుగుతోంది. కరకట్టపై అక్రమంగా కట్టిన చంద్రబాబు ఇల్లు మునకవైయస్ జగన్ గారి హయాంలో ప్రకాశం బ్యారేజ్లోని ఒక గేటుకి బోటు అడ్డంపడితే.. మా ఇంటిని ముంచేందుకు కుట్ర అంటూ అప్పట్లో చంద్రబాబు, నారా లోకేష్ గగ్గోలు ఇప్పుడు చంద్రబాబు ఇంటి ప్రాంగణంలోకి చేరిన వరద నీరు.. మరి ఇప్పుడు ఎవరు కుట్ర… https://t.co/qruHOMsQbk pic.twitter.com/tkH6rRhfav— YSR Congress Party (@YSRCParty) September 1, 2024చంద్రబాబు ఇంటికి వరద ముప్పు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి పెరిగింది. 9.17 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో రాత్రికి వరద ఉదృతం కానుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని, ఈ రాత్రికి ఇంట్లో బస చేస్తే ప్రమాదం ఉందని భావించిన అధికారులు..ప్రత్యామ్నాయ బస ఏర్పాట్లు చేస్తే మంచిదని సూచించారు. ఈరోజు రాత్రికి కలెక్టరేట్లో ఉంటే బావుంటుందని సలహా ఇస్తున్నారు.రాష్ట్ర చరిత్రలో రెండోసారిరాష్ట్ర చరిత్రలో 9.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రెండవ అతి పెద్ద వరదగా నమోదైంది. ఆ రికార్డును కొద్దిగంటల్లో అధిగమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 24 గంటల్లో 6 లక్షలు క్యూసెక్కులు వరద పెరిగింది. 2009లో అత్యధికంగా 11 లక్షలు క్యూసెక్కుల వరద నమోదు కాగా..గంట గంటకు పెరుగుతున్న వరదతో అధికారులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది -
Manikonda: ఇంట్లోకి చొరబడిన కొండచిలువ
మణికొండ: ఓ ఇంట్లోకి 12 అడుగుల కొండ చిలువ చొరబడటంతో స్ధానికులు భయాందోళనకు గురైన ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అలిజాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గణేష్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి మంగళవారం ఉదయం కొండ చిలువ వచి్చంది. అది అప్పటికే మూడు కుక్క పిల్లలను మింగటంతో కదలలేక ఇంట్లోనే ఉండిపోయింది. కొండ చిలువను చూ సిన గణేష్ సింగ్ విషయం చుట్టు పక్కల వారికి చెప్పాడు. దీంతో స్థానికంగానే ఉన్న అమర్సింగ్ అనే వ్యక్తి దాన్ని పట్టుకుని బయటకు తెచ్చి అలిజాపూర్ పక్కనే ఉన్న గుట్టల్లో దాన్ని వదలిపెట్టాడు. గతంలో పలు మార్లు పాములు వచ్చాయని, కానీ ఇప్పుడు ఏకంగా 12 అడుగుల కొండ చిలువ వచి్చందని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. -
రూ. మూడు కోట్ల ఇల్లు.. 11 సెకెన్లలో కొట్టుకుపోయిందిలా..
అతని కలల ఇల్లు సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఇక్కడి సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది.ఆగస్టు 16న వచ్చిన ఎర్నెస్టో హరికేన్ ఈ రూ. మూడు కోట్ల విలువైన ఈ ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో తుఫానుకు ఎగసిపడుతున్న సముద్రపు అలలు ఆ ఇంటిని సముద్రంలోనికి లాక్కెళ్లిపోవడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అందమైన ఇల్లు 1973లో నిర్మితమయ్యింది. ఇంతకాలం ధృడంగా నిలిచిన ఈ ఇల్లు శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది.ఈ వీడియోను ఆగస్టు 18న @CollinRugg హ్యాండిల్తో మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్లో.. నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ సముద్రతీర ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అట్లాంటిక్లో ఎర్నెస్టో హరికేన్ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఇంటి యజమాని ఈ నాలుగు బెడ్రూమ్లు, రెండు బాత్రూమ్ ఇంటిని 2018లో సుమారు రూ. 3 కోట్లు ($339,000) వెచ్చించి కొనుగోలు చేశారు’ అని రాశారు.ఈ పోస్ట్కు లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వందలాది మంది యూజర్స్ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్..‘అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఒక మూర్ఖపు నిర్ణయం’ అని రాశారు. మరొక యూజర్ ‘నార్త్ కరోలినా సముద్రంలో తుఫానులు సర్వసాధారణం. ఈ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఉండాల్సింది’ అని రాశారు. JUST IN: Beachfront home falls into the Atlantic Ocean on North Carolina’s Outer Banks. The incident was thanks to Hurricane Ernesto which is off the coast in the Atlantic. The unfortunate owners purchased the 4 bed, 2 bath home in 2018 for $339,000. The home was built in… pic.twitter.com/MvkQuXz5SG— Collin Rugg (@CollinRugg) August 17, 2024 -
Uttar Pradesh: కూలిన రెండు ఇళ్లు.. శిథిలాల కింద పలువురు..
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో సోమవారం అర్థరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోయా గల్లీ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.సమాచారం అందుకున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం దరిమిలా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే నాల్గవ నెంబరు ద్వారాన్ని మూసివేశారు. ఆలయానికి వెళ్లే సందర్శకులకు గేట్ నంబర్ వన్, గేట్ నంబర్ టూ నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. కూలిపోయిన రెండు ఇళ్లు 70 ఏళ్ల క్రితం నాటివని అధికారులు తెలిపారు. #WATCH | Kaushal Raj Sharma, Commissioner Varanasi Division says "Two houses collapsed here in which 9 people were trapped. 2 of them came out on their own and 7 others were rescued. One woman has lost her life and the remaining are under treatment. The rescue operation is almost… pic.twitter.com/YWhycEVmgZ— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2024 -
జైలుకెళ్లాల్సిన ఖైదీని ఇంటికి దిగబెట్టి.. కానిస్టేబుళ్ల నిర్వాకం
రాజ్కోట్: గుజరాత్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఖైదీతో స్నేహం చేశారు. ఒక కేసులో విచారణకు ఆ ఖైదీని కోర్టుకు తీసుకెళ్లిన సదరు కానిస్టేబుళ్లు.. విచారణ అనంతరం అతనిని తిరిగి జైలుకు తరలించకుండా ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే విచిత్ర పరిస్థితుల్లో వారి నిర్వాకం బయటపడింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుజరాత్లో పేరు మోసిన మద్యం స్మగ్లర్ ధీరజ్ కరియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. విచారణలో భాగంగా కరియాను అమ్రేలీ జిల్లాలోని గాంధీనగర్ కోర్టుకు తీసుకెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు, విచారణ ముగిశాక అతనిని తిరిగి జైలుకు తీసుకెళ్లకుండా, జునాగఢ్లోని అతని ఇంటి వద్ద దింపారు. ఈ వ్యవహారం ఎలా బయటపడిందనే వివరాల్లోకి వెళితే..జునాగఢ్కు చెందిన ఒక రెస్టారెంట్ యజమాని తన హోటల్లో గొడవ పడిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్కు వచ్చిన ఆ ఇద్దరూ ముందుగా ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ తరువాత అక్కడే మద్యం తాగారు. వీరిని గమనించిన వెయిటర్ వారితో అక్కడ మద్యం తాగవద్దని కోరాడు. ఈ మాట విన్నవెంటనే ఆ ఇద్దరు వ్యక్తులూ వెయిటర్తో గొడవపడ్డారు. చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం రెస్టారెంట్ యజమాని ఆ వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఆ ఇద్దరూ కానిస్టేబుళ్లు రంజిత్ వాఘేలా, నితిన్ బంభానియాగా తేలింది. ఈ ఉదంతంపై జునాగఢ్కు చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం స్మగ్లర్ కరియాను కోర్టు విచారణ కోసం గాంధీనగర్కు తీసుకెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు వారు ఆ ఖైదీని జైలుకు తీసుకెళ్లేందుకు బదులు అతను ఉంటున్న జునాగఢ్కు తీసుకెళ్లారు. అనంతరం వారు అక్కడున్న ఒక రెస్టారెంట్లో మద్యం సేవించారన్నారు. విషయం బయటపడటంతో జునాగఢ్ పోలీసులు.. కానిస్టేబుళ్లు రంజిత్ వాఘేలాను, నితిన్ బంభానియాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖైదీ ధీరజ్ కరియాను తిరిగి జైలుకు తరలించారు. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : అర్థము అంటే..!!!
సుఖాన్ని... కామాన్ని ధర్మము చేత కట్టాలి. అప్పుడు ధర్మబద్ధమైన అర్థం ప్రభవిస్తుంది. అందుకే కన్యాదాత కన్యను తీసుకొచ్చి ధర్మపత్నిగా ఇచ్చేటప్పుడు వరుడితో... ‘కన్యామిమాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై’ అంటాడు. ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి నీరు... అలాగే కామం ఒక ప్రయోజనం కోసం... అందువల్ల అది ధర్మంచేత కట్టబడాలి. ఆయనకు సంతానం కలిగి పితృరుణంనుండి విముక్తుడు కావాలి. ఆయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య ఉండాలి. వివాహం చేయాలంటే పత్ని ఉండాలి. ఆమె లేనప్పుడు ఈ కార్యక్రమాలు వేటికీ కూడా ఆయన అర్హుడు కాడు... ఈ నియమాలు ఎవరో ఒకరు పెట్టినవి కావు. శాస్త్రం నిర్దేశించినవి. అంటే ధర్మపత్నిని స్వీకరించకుండా పుణ్యకార్యాలు చేయడం, తరించడం ఎలా సాధ్యం? అందుకే జీవితం పండించుకోవడానికి అవసరమయిన సాధనాన్ని కన్యాదాత ఇస్తున్నాడు. నిజం చె΄్పాలంటే ... కొడుకు పుడితే.. వాడు ప్రయోజకుడయితే.. వాడు ధార్మికంగా బతికితే... అప్పుడు తల్లీదండ్రీ, ఆపైన ఉన్నవాళ్ళు .. తరువాత అత్తగారు, మామగారు తరిస్తారు. పుత్ అను పేరుగల నరకం నుంచి త్రాయతే.. రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు అన్నారు. కుమార్తెను కన్యాదానం చేశాను.. అనుకోండి. అప్పుడు నాకు పది తరాల ముందూ, పది తరాల వెనకా నాతో కలిపి 21 తరాలు తరించి΄ోతాయి. ఈ సంతానం కలగడానికి కారణం ఎవరు? నా ధర్మపత్ని. ఆమె వల్ల సంతానం కలిగితే ఇంత గొప్ప ప్రయోజనం సిద్ధించింది. అందువల్ల కామము ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలంటే.. భార్యాభర్తలు చెలియలికట్ట దాటకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారు ‘చెలియలికట్ట’ అనే సాంఘిక నవల రాశారు. అందులో... వివాహం ద్వారా కామము ధర్మం చేత ఎందుకు కట్టబడుతుందో ప్రతి΄ాదించారు. సముద్రం అనంత జలరాశి. చాలా శక్తిమంతం. అది అనుకుంటే ఊళ్ళను సునాయాసంగా ముంచేయగలదు. అయినా దానికదిగా .. చెలియలికట్ట దాటకూడదని.. ఒక నియమం పెట్టుకుంది. ఆడుకుంటున్నట్లుగా అక్కడిదాకా వస్తాయి. ఎదురుగా వచ్చిన వాళ్ళ ఆచారాలు కడిగి అలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాళ్ళు కడిగాయి కదా అని అతి చేసి తెగించి మరింత ముందుకు వెడితే.. ప్రమాదం ముంచుకొస్తుంది.‘ధర్మేచ, అర్థేచ, కామేచ ఏషా నాతి చరితవ్యా..’ – ఇది ప్రమాణం. ‘మామగారూ! ఇప్పుడు నాకు అర్థమయింది. మీరు నాకు ఇంతటి మహోపకరణాన్ని ఇచ్చారు. నేను ఈమెను అతిక్రమించను. ఈమె నాకు ప్రధానంగా ధర్మబద్ధ జీవితానికి ఒక సాధనం. ఈమెను నేను ధర్మపత్నిగా స్వీకరించినందుకు నా జీవితం పండాలి. చేయగలిగిన పుణ్యకార్యాలు చేయాలి. అసలు నేను నా భార్యతో కలిసి చేయవలసివేమిటో నాకు తెలియాలి. మేమిద్దరం చేయీచేయీ పట్టుకుని ప్రయాణించాలి. తద్వారా నేనూ తరించాలి, ఆమే తరించాలి.’ అనుకుని ఆచరిస్తాడు. అలా కామము ధర్మము తో కలిసినప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అర్థము – అంటే? బంగారం, ఇళ్ళు, వస్తు, వాహనాలు కాదు... మరి నిజమైన సంపద ఏది? పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలే అసలు సిసలైన సంపద. అదే అర్థము ప్రభవించడం అంటే.-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కూటమి అరాచకాలు.. దన్నానపేటలో ఆర్మీ జవాన్ ఇంటి కూల్చివేత
-
తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
వినుకొండ: రషీద్కు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ.. అండగా ఉంటానని భరోసా (ఫొటోలు)
-
త్రిపుర: ‘మా ఇళ్లు దగ్ధమౌతుంటే మీరెక్కడున్నారు?’
త్రిపుర మంత్రి టింకూ రాయ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందానికి బాధితుల నుంచి చేదు అనుభవం ఎదురయ్యింది. వీరు ధలై జిల్లాలోని గండత్విజా ప్రాంతాన్ని సందర్శించినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. జూలై 12న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన 19 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో హింస చెలరేగింది. ఈ ప్రాంతాన్ని మంత్రి టింకూ రాయ్ సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గండత్విజా డిప్యూటీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. తమ ఇళ్లపై దాడి జరిగినప్పుడు మీరెక్కడున్నారంటూ బాధితులు మంత్రిని నిలదీశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు, ఇతర అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో క్లిప్లో కోపోద్రిక్తులైన బాధితులు ఈ ఘటన కారణంగా తమ ప్రాంతంలో 11 వివాహాలను రద్దు చేసుకోవలసి వచ్చిందని మంత్రికి చెప్పడం కనిపిస్తుంది. వారి వాదన విన్న త్రిపుర సాంఘిక సంక్షేమ మంత్రి రాయ్ మాట్లాడుతూ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రత కల్పిస్తుందని హామీనిచ్చారు. STORY | Tripura minister-led team visits violence-hit area in Dhalai district, faces ire of people.READ: https://t.co/qbcXkrArtBVIDEO : pic.twitter.com/OVNR0DFzDU— Press Trust of India (@PTI_News) July 15, 2024 -
ఆ ఇల్లే.. ఓ మ్యూజియం!
చెక్క ఫ్యాన్ ను చూశారా? వందేళ్ల కిందటే వంట పాత్ర కమ్ హాట్ క్యారేజ్ ఉండేది తెలుసా? రేడియో ఉండాలంటే లైసెన్ ్స కావాలా? ఇలా మనం చూడని.. మనకు తెలియని ఎన్నో వస్తువులు, కళ్లు చెదిరే కళాఖండాలు, అబ్బురపరచే చిత్రాలెన్నో అక్కడ దర్శనమిస్తాయి. వీటిని చూడాలన్న ఉత్సుకత.. తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటే పరవాడలోని కోరుపోలు గంగాధరరావు ఇంటికి వెళ్లాల్సిందే! ఆయన 22 ఏళ్ల ఈ ప్రయాణాన్ని తెలుసుకోవలసిందే!గంగాధరరావు.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని బపాడుపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలో పుస్తకాల్లో ఉన్నది చెప్పడంతో పాటు వాటిని పిల్లలకు ప్రత్యక్షంగా చూపిస్తే వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇచ్చినట్టవుతుంది కదా అనే ఆలోచన వచ్చింది ఆ టీచర్కి. ఆ బాటలో సాగిపోతుండగా ఒకరోజు ఆయనకు అల్యూమినియం, రాగి నాణేలు లభించాయి.వాటి మీద ఆసక్తి పెరిగి నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం ప్రారంభించాడు. అది కాస్త ఒక యజ్ఞంలా మారి ‘మోస్ట్ కలెక్షన్ ఆఫ్ వెరైటీ టెన్ రూపీస్ కాయిన్స్’ అంశంపై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కాయిన్ ్స అంశంలో మూడుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరును నమోదు చేసింది. 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కూ దరఖాస్తు చేసుకున్నారాయన. నాణేలు సరే.. కనుమరుగైపోతున్న వస్తువులనూ ఈ తరానికి చూపించాలన్న ఆలోచనా చేశారు గంగాధరరావు.తక్షణమే వాటి సేకరణాæ మొదలుపెట్టారు. అలా ఆయన ఇల్లు ఇప్పుడు 100 నుంచి 300 ఏళ్ల నాటి ఇత్తడి కొలత పాత్రలు, కంచు గిన్నెలు, గోకర్ణాలు, బోషాణం, రంగం పెట్టెలు, బ్రిటిష్ కాలం నాటి పాత పేపర్లులాంటి పలురకాలకు చెందిన రెండువేలకు పైగా వస్తువులతో మ్యూజియమ్ను తలపిస్తోంది. ఆ వస్తువుల్లో ఆసక్తిరనమైన కొన్ని..మ్యూజియం ఏర్పాటే లక్ష్యం.. "అప్పట్లో వాడిన ప్రతి వస్తువుకూ ఓ ప్రత్యేకత ఉంది. ఆ వస్తువుల్లో ఆరోగ్యం ఉండేది. ఆ ప్రాముఖ్యతను, ఆ సంప్రదాయాలను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే మన పూర్వీకులు వాడిన ప్రతి వస్తువును సేకరించి భద్రపరచాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాను. అవి అందరికీ అందుబాటులో ఉండేలా విశాఖపట్నంలో ఓ మ్యూజియమ్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సహకరిస్తే నా కల నెరవేరుతుంది". – గంగాధరరావు, పరవాడచెక్క ఫ్యాన్..దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చెక్క ఫ్యాన్కు పేటెంట్ కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో ఈ ఫ్యాన్ ను వినియోగించేవారు. ఇందుకోసం పంకా మ్యాన్ అనే ఉద్యోగం ఉండేది. చెక్క ఫ్యాన్ తిప్పడమే ఆ ఉద్యోగి పని. 1920లో తయారైన ఈ ఫ్యాన్ కోసం గంగాధరరావు రూ. 45 వేలు పెట్టి.. ఢిల్లీ నుంచి తెప్పించారు.స్టీమ్ క్యారేజ్..1917లో తయారైన ఈ స్టీమ్ క్యారేజ్ సుమారు పది కిలోల బరువు ఉంటుంది. ఇందులో వంట వండుకోవడమే కాక వండిన వంటను 10 నుంచి 12 గంటల పాటు వేడిగానూ పెట్టుకోవచ్చు. దీన్ని గంగాధరరావు రూ. 16 వేలు వెచ్చించి రాజస్థాన్ , జైపూర్ నుంచి తీసుకొచ్చారు.రేడియోలు.. లైసెన్సులు..మొదటితరం నాటి 10 రకాల రేడియోలను ఆయన సేకరించారు. అప్పట్లో రేడియో ఉండాలంటే పోస్టాఫీస్ నుంచి లైసెన్స్ తీసుకోవలసి వచ్చేదట. ఆ లైసెన్ ్స కాపీలూ మాష్టారి వద్ద ఉన్నాయి. అంతేకాదు బ్రిటిష్ వారి గెజిట్స్, స్వాతంత్య్ర ఉద్యమం నాటి పోస్ట్కార్డ్స్నూ ఆయన సేకరించారు.సేకరణలో కష్టాలెన్నో.. ఇలాంటి వస్తువులన్నింటినీ సేకరించేందుకు మొదట్లో గంగాధరరావు.. ఫలానా వస్తువు ఫలానా చోట ఉంది అని తెలియగానే సంబంధిత వ్యక్తులకు ఉత్తరాలు రాసేవారట. తర్వాత ఫోన్లు రావడం, వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ కావడంతో పని కొంత సులువైందంటారు. ఫలానా చోట వస్తువు ఉందంటే ముందుగా డబ్బులు చెల్లిస్తే.. వారే ఇంటికి పంపిస్తున్నారట. ఇందులో కూడా పోటీ ఉంటుంది. ఒకసారి మిస్ అయితే ఆ వస్తువు మళ్లీ దొరకదు.అందుకే ఎంత కష్టమైనా వెంటనే డబ్బులు చెల్లించి వస్తువు సేకరిస్తున్నారు. దీనికోసం ఆయన ప్రతి నెలా తనకు వచ్చే ఆదాయంలోంచి 20 శాతాన్ని కేటాయిస్తున్నారు. తను సేకరించిన వస్తువుల కోసం ఇప్పటివరకు రూ. 10 లక్షలకు పైనే వెచ్చించారు. ఆయనకు ‘ఎఖఅNఖీఐఖ్ఖఉ ’ అనే యూట్యూబ్ చానెల్ కూడా ఉంది. ఆయన సేకరించిన ప్రతి వస్తువు గురించి ఇందులో వివరిస్తుంటారు. దీనికి 2.58 కోట్ల మంది వ్యూయర్స్, 1.38 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.‘గోల్డ్ స్పాట్ గురించి చెబితే దాదాపు 5 లక్షల మంది చూశారు. గోల్డ్ స్పాట్ జ్ఞాపకాలను పంచుకుంటూ 20 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. లూనాపై వీడియో చేస్తే కూడా అంతే వైరల్ అయింది. నా దగ్గరున్న వస్తువులను చూడ్డానికి హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి చాలామంది వస్తుంటారు. నా యూట్యూబ్ చానెల్ వీడియోలు చూసి చాలామంది సినిమా డైరెక్టర్లూ నన్నూ అప్రోచ్ అవుతున్నారు.. నేను సేకరించిన వస్తువులను తమ సినిమాల్లో ఉపయోగించుకుంటామంటూ! ఈ రెస్పాన్స్ భలే సంతోషాన్నిస్తోంది. నేను పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చును మరచిపోయేలా చేస్తోంది’ అంటారు గంగాధరరావు. – గొరకల పూర్ణచందర్, సాక్షి, విశాఖపట్టణం -
అత్త ఇంటికి జగన్నాథుడు.. రథయాత్రలో అద్భుత ఘట్టం
ఒడిశాలోని పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నిన్న (సోమవారం) ఉదయం మంగళ హారతితో రథయాత్ర ప్రారంభమైంది. జై జగన్నాథ్ అంటూ భక్తులు నినాదాలు చేస్తుండగా రథయాత్ర మొదలయ్యింది.భక్తులు రెట్టించిన ఉత్సాహంతో రథాల తాళ్లను ముందుకు లాగారు. డప్పుల దరువులుల మధ్య బలభద్రుడి రథంతో జగన్నాథుడు తన అత్త అయిన గుండిచా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి జగన్నాథుని సోదరి దేవి సుభద్ర ఆశీనురాలైన రథం కూడా గుండిచా ఆలయానికి చేరుకుంది. నేటి (మంగళవారం) తెల్లవారుజాము వరకు రథాలపైనే ఆశీనులై పూజలు అందుకున్న జగన్నాథుడు, సుభద్రలు గుండిచా ఆలయంలోకి ప్రవేశించనున్నారు.53 ఏళ్ల తర్వాత ఈసారి పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరుగుతోంది. కాగా ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రథయాత్ర సందర్భంగా శ్యామ్ సుందర్ కిషన్ (45) అనే భక్తుడు రథం చక్రాల కింద పడి మృతి చెందాడు. ఆదివారం కుకుజుంఘా గ్రామంలో జగన్నాథ రథాన్ని లాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆదివారం పూరీలో జరిగిన రథయాత్రలో కొంతమంది పోలీసులతో సహా 130 మంది గాయపడ్డారు, వారిలో సగం మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ కాగా, 40 మందికి చికిత్స కొనసాగుతోంది. -
చక్కనైన చెక్క ఇల్లు (ఫొటోలు)
-
Nanda Birth Anniversary: సొంతిల్లు లేని ప్రధాని.. జీవన భృతి కూడా వద్దంటూ..
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మన దేశ రెండవ ప్రధాని(తాత్కాలిక) గుల్జారీలాల్ నందా గురించి చాలా తక్కువమందికే తెలుసు. ఆయన 1964, 1966లలో రెండుసార్లు భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. నేడు (జూలై 4) గుల్జారీలాల్ నందా జన్మదినం. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.గుల్జారీలాల్ నందా 1898, జులై 4న ప్రస్తుత పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు. నందా తన విద్యాభ్యాసాన్ని లాహోర్, ఆగ్రా, అలహాబాద్లలో పూర్తి చేశారు. 1997లో ఆయనకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న లభించింది. గుల్జారీలాల్ నందా 1957, 1962లలో రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు.నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం నందా 1964 మే 27న తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాడు అతని పదవీకాలం 13 రోజులు. దీని తరువాత తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత నందా 1966, జనవరి 11న మరోమారు తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం చేశారు. గుల్జారీ లాల్ నందా 1962, 1963లో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా, 1963 నుంచి 1966 వరకు హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు.దేశానికి రెండుసార్లు ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్రమంత్రిగా పనిచేసిన గుల్జారీ లాల్ నందాకు చివరి రోజుల్లో సొంత ఇల్లు కూడా లేదు. అద్దె చెల్లించడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడ్డారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో గుల్జారీ లాల్ నందాను ఇంటి యజమాని వెళ్లగొట్టాడు. ఈ వార్త దావానంలా మారడంతో నాటి కేంద్ర ప్రభుత్వం కొందరు అధికారులను నందా దగ్గరకు పంపింది. వారు స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే రూ. 500 భృతిని తీసుకునేందుకు నందాను అతికష్టం మీద ఒప్పించారు. గుల్జారీలాల్ నందా మాజీ ప్రధాని అని ఆ ఇంటి యజమానికి తెలియడంతో అతను నందాకు క్షమాపణలు చెప్పాడు. గుల్జారీ లాల్ నందా తన 99 సంవత్సరాల వయసులో 1998, జనవరి 15న కన్నుమూశారు. -
ఔట్ సోర్సింగ్ టీచర్ల ఆందోళన
-
లండన్లో బాలీవుడ్ బాద్షా ఇల్లు.. వీడియో వైరల్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అత్యధిక పారితోషకాలు తీసుకునే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. షారుఖ్కు లండన్లో ఉన్న ఇంటికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్లో బయటకు వచ్చింది.షారుఖ్ ఖాన్ లండన్ ఇల్లు ఇదేనంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ యూజర్ వీడియోను పోస్ట్ చేశారు. 'ఇది లండన్ లోని షారుఖ్ ఖాన్ ఇల్లు' అని లండన్ లోని పార్క్ లేన్ లోని 117లో ఉన్న ఈ ఇంటి వీడియోను షేర్ చేస్తూ ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చాడు. 'ఇల్లు మొత్తం తనది కాదు.. అతని ఫ్లాట్ కింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది' అని కామెంట్స్ సెక్షన్ లో ఓ యూజర్ పేర్కొన్నారు. లండన్ లోని విలాసవంతమైన మేఫేర్ పరిసరాల్లో షారుఖ్కు అనేక ఆస్తులు ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు.ఎంతకు కొన్నాడంటే..మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్లో 2009లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ పార్క్ లేన్ లోని ఈ అపార్ట్ మెంట్ను 20 మిలియన్ పౌండ్లు పెట్టి కొన్నారు. భారత్ బయట ఒక ప్రాపర్టీ కోసం ఏ బాలీవుడ్ స్టార్ ఇంత అధిక మొత్తం వెచ్చించలేదని నివేదిక పేర్కొంది. View this post on Instagram A post shared by Asif Iqbal (Ovee) | London & Travel 🛫 (@beingovee) -
మరో లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న స్టార్ హీరో.. ఎన్ని కోట్ల ఖరీదంటే?
రీసెంట్ టైంలో స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కొత్త ఇల్లు కొనేసి, ఓ ఇంటి వాళ్లవుతున్నారు. ఇదివరకు బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువ మంది బంగ్లా లేదా ఫ్లాట్ కొనడంలో కాస్త ముందుండేవాళ్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి హీరో ఆమిర్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఇప్పటికే అరడజనుకి పైగా ఇళ్లని కొనుగోలు చేసిన ఇతడు.. తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)ముంబైలోని చాలా ఖరీదైన ప్రాంతంగా పేరున్న పలిహలి ఏరియాలో ఓ సూపర్ లగ్జరీ రెడీ టూ మూవ్ అపార్ట్మెంట్ని ఆమిర్ ఖాన్ ఇప్పుడు కొన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.9.75 కోట్లు అని, జూన్ 25నే దీని కొనుగోలు పూర్తయిందని తెలుస్తోంది. ఇందుకోసం రూ.58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాడని జాతీయ న్యూస్ సైట్లు రాసుకొచ్చాయి.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆమిర్ ఖాన్కి ముంబైలోని మెరీనా, బాంద్రాలో సముద్రం ఒడ్డున, పంచగనిలో ఫామ్ హౌస్ ఉన్నాయి. అలానే ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనూ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఆమిర్.. ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రెండో భార్య కిరణ్ రావ్కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటున్నాడు.(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్గా టాలీవుడ్ హీరో) -
పరువుకు భయపడి దారుణం.. పది నెలల తర్వాత?
దేశంలో పలు గ్రామాల్లో నేటికీ అప్పుడప్పుడూ పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. సమాజంలో పరువును కాపాడుకునే ప్రయత్నంలో కొందరు పెద్దలు దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా అటువంటి ఉదంతం హర్యానాలో వెలుగు చూసింది.ఫరీదాబాద్లోని దౌజ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక ఇంటిలో 10 నెలల క్రితం ఒక యువతి మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదుతో ఆ యువతి అస్తిపంజరాన్ని పోలీసులు వెలికి తీసి, స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో నివసిస్తున్న బాలిక తండ్రి మెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఆ యువతి తల్లిని విచారించగా అసలు విషయం బయటపడింది.10 నెలల క్రితం తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి తల్లి పోలీసులకు తెలిపింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకునితో వెళ్లిపోయి, తరువాత ఇంటికి వచ్చిందని, అయితే చుట్టుపక్కలవారి మాటలు విని, అవమానంగా భావించి ఉరివేసుకున్నదని తెలిపింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే, పరువుపోతుందని భావించి, తన సోదరుని సాయంతో కుమార్తె మృతదేహాన్ని ఇంటిలోనే పాతిపెట్టామని తల్లి పోలీసులకు వివరించింది.విషయమంతా తెలియడంతో పోలీసులు పోలీసులు తహసీల్దార్, ఏసీపీ సమక్షంలో మృతురాలి అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టు వచ్చిన వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి తాహిర్ గత పదేళ్లుగా సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. అతని ఎనిమిదిమంది సంతానం తల్లి దగ్గర ఫరీదాబాద్లో ఉంటున్నారు. తన కుమార్తె హత్యకు గురై ఉండవచ్చునని తాహిర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పోచారం ఇంట్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ పోచారం ఇంటికెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. 12 మంది నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంట్లోకి బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు హంగామా సృష్టించారు.తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు.పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అందనంత అద్దెలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇందుమతి మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. 2 బీహెచ్కే ఫ్లాట్కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్కేక్లు..పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి.అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం కూడా..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అద్దె చట్టం ఏం చెబుతోందంటే..⇒ అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్ అథారిటీకి సమర్పించాలి.⇒ ఓనర్ నాన్ కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.⇒ కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్లను ఏర్పాటు చేయాలి.⇒ అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.⇒ ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.⇒ కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్రూమ్, శాని టేషన్ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.కరోనా తర్వాత నుంచి..కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. – అనూజ్ పూరీ,చైర్మన్, అనరాక్ గ్రూప్ -
కదిలే ఇళ్లు.. ఆసక్తికర ఫొటోలు
-
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై శాపనార్థాలు
-
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మాజీ హోం గార్డులు..
-
బెంగళూరులో ఓ ఇల్లు.. అలాంటి జంటలకే ప్రాధాన్యం!
దక్షిణాదిలో అత్యంత రద్దీ నగరంగా పేరొందిన బెంగళూరు ఖరీదైన ఇంటి అద్దెలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యువకులకు, ముఖ్యంగా బ్యాచిలర్లకు ఇళ్లు, ఫ్లాట్లు దొరకడం కష్టం. అద్దెకు వచ్చే వారి నేపథ్యం, అకడమిక్ మార్కుల ఆధారంగా కూడా ఇల్లు ఇస్తున్న సంఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు.మెట్రో నగరంలో అద్దె ఇళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రియమ్ సారస్వత్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు విభిన్నమైన ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. బెంగళూరులోని తన ఇంటిని అద్దెకు ఇస్తున్న ఆయన "బ్యాచిలర్స్, లివ్-ఇన్ కపుల్స్" కు ప్రాధాన్యత ఇస్తున్నారు.వూష్ కో ఫౌండర్ ప్రియమ్ సారస్వత్ ఈ మేరకు తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. బెంగళూరులోని హర్లూర్ రోడ్డులో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని హోమ్ టూర్ చేశారు. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్కు సమీపంలో ఉంది. "నేను హర్లూర్ రోడ్లో (హెచ్ఎస్ఆర్ లేఅవుట్కు చాలా దగ్గరగా) లో ఈ అందమైన ఇంటిని కొనుగోలు చేశాను. ఇందులో అద్దెకు ఉండేవారి కోసం చూస్తున్నాను. బ్యాచిలర్స్ లేదా లివ్-ఇన్ జంటలకు ప్రాధాన్యం ఉంటుంది" అని ఆయన ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. I purchased this beautiful house at Harlur Road (Very close to HSR Layout) and now looking for tenants to occupy asap 🏡😇Bachelors or Live-In couples preferred ( My way of giving back to the community 😉) Dm if you are interested and RT for good karma ✌️ pic.twitter.com/d7pcC53GI8— Priyam Saraswat (@priyamsaraswat) June 13, 2024 -
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
-
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
-
Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
-
డిజిటల్ హౌస్ అరెస్ట్ అంటే ఏమిటి? ఎలా ఎదుర్కోవాలి?
జనాన్ని మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాలను కనుగొంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ పేరిట నూతన తనహా వంచనకు తెర లేపుతున్నారు. ఈ పద్దతిలో సైబర్ నేరగాళ్లు పోలీసు, సీబీఐ లేదా కస్టమ్స్ అధికారులుగా నటించి, తాము టార్గెట్ చేసుకున్న వారికి ఫోన్ చేసి, వారిని ఇంట్లో బందీలుగా మారుస్తున్నారు. అనంతరం వారి బ్యాంక్ ఖాతాలోని సొమ్మును స్వాహా చేసేస్తున్నారు. ఇదే కోవలో ఇంటి తాకట్టు మోసానికి సంబంధించిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.ఆర్బీఐ ఇటీవల వెలువరించిన ఒక నివేదికలోని వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రూ. 302.5 బిలియన్లు అంటే రూ. 30 వేల కోట్లకు పైగా డిజిటల్ మోసాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో అంటే జూన్ 1, 2014 నుండి మార్చి 31, 2023 వరకు భారతీయ బ్యాంకులలో 65,017 మోసం కేసులు నమోదయ్యాయి. రూ. 4.69 లక్షల కోట్ల మేరకు చీటింగ్ జరిగింది. యూపీఐ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, ఓటీపీ స్కామ్, జాబ్ స్కామ్, డెలివరీ స్కామ్ మొదలైన వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ‘డిజిటల్ హౌస్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతి ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది.మోసగాళ్లు తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇంట్లో బంధించి, వారిని మోసం చేసేందుకు ఈ కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు. ముందుగా సైబర్ నేరగాళ్లు బాధితులకు డబ్బులు చెల్లించాలని ఆడియో, వీడియో కాల్స్ చేస్తూ, అలజడి వాతావరణాన్ని సృష్టిస్తారు. స్కామర్లు ఏఐ సాయంతో రూపొందించిన వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా పోలీసులు లేదా అధికారుల మాదిరిగా నటించి, బాధితుల ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్తో తప్పులు దొర్లాయని చెబుతారు. ఇంతటితో ఆగకుండా ఆ మోసగాళ్లు అధికారులుగా నటిస్తూ, తాము టార్గెట్ చేసుకున్నవారిని ఇళ్లలో బంధించి, వారికి అరెస్టు భయం కల్పించడంతోపాటు, వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. దీంతో అరెస్టు, పరువు నష్టం భయంతో బాధితులు స్కామర్ల ఉచ్చులో సులభంగా పడిపోతారు. దీంతో నిండా మోసపోతుంటారు.ఈ రకమైన మోసానికి గురికాకుండా ఉంటాలంటే విజిలెన్స్ సహకారం అవసరం. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ లేదా మెసేజ్లు వచ్చినప్పుడు విజిలెల్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ఇటువంటి సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సంచార్ సాథి వెబ్సైట్లో చక్షు పోర్టల్ను ప్రారంభించింది. దీనికి తోడు ఇలాంటి మోసాల బారిన పడినవారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు. ఏ బ్యాంక్ లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థ ఎవరినీ పిన్, లేదా ఓటీపీని అడగదు. ఇటువంటి సందర్భాల్లో పొరపాటున కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే ఆన్లైన్ మోసాల నివారణకు సోషల్ మీడియాతోపాటు బ్యాంక్ ఖాతాల పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం ఉత్తమమని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ‘డ్రీమ్ హౌజ్’ చూశారా? (ఫోటోలు)
-
ఉగాది రోజు ఆట సందీప్- జ్యోతిరాజ్ నూతన గృహప్రవేశం (ఫొటోలు)
-
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
అద్దె ఇంటిని కొనుగోలు చేసిన యంగ్ రెబల్ స్టార్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సలార్ సినిమాతో మెప్పించిన ప్రభాస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. లండన్లో ఓ లగ్జరీ హౌస్ను ఆయన కొన్నారన్న నెట్టింట మాత్రం హల్చల్ చేస్తోంది. గతంలో షూటింగ్స్, వేకేషన్కు వెళ్లినప్పుడు అద్దె ఇంట్లో వారని తెలుస్తోంది. అంతే దాదాపూ కోటి రూపాయల రెంట్ చెల్లించేవారని సమాచారం. తాజాగా ఆ ఇంటినే భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. (ఇది చదవండి: 'కల్కి' ప్రభాస్ పాత్ర గురించి స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్) సలార్తో సూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణే, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో రాజాసాబ్ అనే చిత్రంలో నటించనున్నారు. -
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి!
దేశరాజధాని ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రి నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఊపిరాడక మరణించారు. మృతులను మనోజ్ (30), అతని భార్య సుమన్ (28), ఐదు, మూడేళ్ల వయసున్న ఇద్దరు బాలికలుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఫైర్ సర్వీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. సీనియర్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ ఘటనలో నలుగురు ఊపిరాడక మృతి చెందారని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని, పార్కింగ్లో మంటలు చెలరేగడంతో భవనం అంతటా పొగలు వ్యాపించాయన్నారు. రోడ్డు ఇరుకుగా ఉన్నప్పటికీ అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
లెబనాన్: ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురి మృతి
జెరూసలెం: దక్షిణ లెబనాన్లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో అయిదుగురు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని లెబనాన్ అధికారిక వార్తాసంస్థ వెల్లడించింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వీరిలో తల్లిదండ్రులు సహా ఇద్దరు పిల్లలున్నారు. మరణించిన వారిలో మహిళ ప్రస్తుతం గర్భవతి. ఇజ్రాయెల్ దాడిలో ఇళ్లంతా ధ్వంసమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల నివసించేవారు తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. గత వారంలోనూ దక్షిణ లెబనాన్లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఓ జంటతో పాటు వారి కుమారుడు మృతి చెందాడు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులు చేసి వందల మందిని చంపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అటు గాజాలో హమాస్ ఇటు లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 30,960 మంది మరణించగా లెబనాన్లో 312 మంది హెజ్బొల్లా ఫైటర్లు, 56 మంది సాధారణ పౌరులు మృతి చెందారు. వీలు దొరికినపుడల్లా హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు పలువురు ఇజజ్రాయెల్ సైనికులు సహా సాధారణ పౌరులు మృతి చెందారు. ఇదీ చదవండి.. పాక్ అధ్యకక్షుడిగా జర్దారీ -
యూపీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం!
ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లక్నో జిల్లా, కకోరిలో గల హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఇంతలో ఇంటిలోని సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒక జంటతో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. హతా హజ్రత్ సాహెబ్ నివాసి ముషీర్ అలీ (50) జర్దోసీ పనితో పాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంతలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ముషీర్, అతని భార్య హుస్నా బానో (45), వారి బంధువుల పిల్లలు రాయ (5), హిబా (2), హుమా (3) మంటల్లో సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బనోయి అజ్మత్ (30), అనమ్ (17)ఇన్షా (16), లకబ్ (18)లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇళ్ల ధరలకు రెక్కలు.. రెండేళ్లలో ఇంత తేడానా!
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం భారీగా వృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. 2021 నుంచి 2023 మధ్య ఇళ్ల ధరలు ఏకంగా 20 పెరిగినట్లు హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ క్రెడాయ్ (CREDAI) నివేదిక ద్వారా తెలిసింది. దేశంలో నిర్మాణ వ్యయం పెరగటం మాత్రమే కాకుండా.. ఇళ్ల కొనుగోళ్ళకు కస్టమర్లు కూడా పెద్ద ఎత్తున ఎగబడటమే ధరలు పెరగటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దేశంలో సుమారు 8 పెద్ద నగరాల్లో ధరలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక ద్వారా తెలిసింది. ముఖ్యంగా బెంగళూరులో 2021 - 2023 కాలంలో ఇళ్ల ధరలు 31 శాతం పెరిగాయి. వైట్ఫీల్డ్, కెఆర్ పురం, సర్జాపూర్ వంటి ఐటీ హబ్లకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉంది, ప్రత్యేకించి లగ్జరీ సెగ్మెంట్లో కొత్త లాంచ్లు పెరగటం వల్ల కూడా ధరలు ఆకాశాన్ని తాకాయని తెలుస్తోంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ధరల విషయానికి వస్తే.. 2021 కంటే 2023లో గృహాల ధరలలో 2 శాతం పెరుగుదల ఉందని నివేదికలో స్పష్టమైంది. కరోనా మహమ్మారి తగ్గిన తరువాత ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. ఇదీ చదవండి: గోడ కట్టేస్తున్న రోబోట్.. వీడియో వైరల్ హైదరాబాద్లో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర వద్ద ఉన్న విల్లాలు, రూ. 50 లక్షల లోపు ఉన్న అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. కేవలం రెండు సంవత్సరాల్లోనే ధరలు 20 శాతం పెరగటం వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. -
మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
శ్రీలంక పురాతన పానీయాల బ్రాండ్ను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ భారత్కు తీసుకొస్తోంది. శ్రీలంకకు చెందిన పానీయాల తయారీ సంస్థ ఎలిఫెంట్ హౌస్తో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నూతన ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది. "భారతదేశం అంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను తయారు చేయడం, మార్కెట్ చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం" ఈ భాగస్వామ్యం లక్ష్యం అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. "ఈ భాగస్వామ్యం పెరుగుతున్న మా ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోకు అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా మా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపికను కూడా అందిస్తుంది" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో కేతన్ మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్లను భారత్కు తీసుకొచ్చిన రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన బేవరేజెస్ బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్ను భారత్లో మరింత విస్తరించడానికి సన్నద్ధమైందని కేతన్ మోదీ తెలిపారు. కాగా రిలయన్స్ ఇప్పటికే క్యాంపా సొస్యో, రాస్కిక్ వంటి పానీయాల బ్రాండ్లను కలిగి ఉంది. -
ఐదేళ్లుగా శవం పక్కనే : పోలీసులే షాక్ అయిన దృశ్యాలు
ఇంటినిండా చెత్తా. చెదారం..ఎలుకలు, మానవ వ్యర్థాల గుట్టలు, కుళ్లిపోయిన అస్తి పంజరం, ఎముకలు ఇదంతా.. ఇదేదో హారర్ హౌస్ దృశ్యాలు అనుకుంటున్నారా? కానే కాదు శవంతో ఐదేళ్ల పాటు జీవించిన జీవించిన మహిళ దుర్భర స్థితి. వివరాలు.. ఆస్ట్రేలియాకు చెందిన వృద్ధురాలు (70) తన సోదరుడి కుళ్ళిన శవం పక్కన ఐదు సంవత్సరాలుగా ఉండి పోయింది. మెట్రో ప్రకారం జీలాంగ్లోని సంపన్న శివారు ప్రాంతంలోని ఇల్లు అది. దీంతో ఇల్లంతా చచ్చిపడిన ఎలుకల మయం. ఎక్కడ చూసినా మానవ వ్యర్థాలు, ఎలుకల విసర్జాలతో భరించలేని వాసన. అయినా ఇంట్లోంచి బయటికి రాకుండా లోపలే ఉండిపోయింది. ఒక వ్యక్తి అదృశ్యం కేసులో పోలీసులు నిందితురాలుగా 2022లో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత పోలీసులు ఆమెను వదిలివేశారు. టాప్ డిటెక్టివ్ సీనియర్ సార్జెంట్ మార్క్ గుత్రీ సమగ్ర దర్యాప్తులో తాజా విషయాలు వెల్లడైనాయి. విచారణ నిమిత్తం వెళ్లినపుడు అక్కడి పరిస్థితి చూసి పోలీసులే ఖంగుతిన్నారు. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు కూడా వణికిపోయారు. బయోహజార్డ్ సూట్లు ధరించి మరీ ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి వెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు 2018లో చివరిసారిగా ఆ వ్యక్తిని సజీవంగా చూశారట. ఈ మహిళ మానసిక అనారోగ్యంపై అనేక ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ఆరోపలు నమోదు కాలేదని, సోదరుడి మరణానికి గల కారణాన్ని విచారిస్తున్నారు పోలీసు అధికారులు -
స్మృతి ఇరానీ ఇంట శుభకార్యం.. 20 వేల అతిథులు!
ఉత్తరప్రదేశ్లోని అమేథీ పరిధిలో గల మెదన్ మావాయి గ్రామంలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. నేటి (గురువారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీ స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు నూతన గృహంలో పూజలు నిర్వహించనున్నారు. సొంత ఇంటి గృహప్రవేశం సందర్భంగా స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని 20 వేల మందికి గురువారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఎంపీ స్మృతి ఇరానీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, మంత్రి ధరంపాల్ సైనీ, స్వతంత్ర దేవ్ సింగ్, అమేథీ ఇన్ఛార్జ్ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. స్మృతి ఇరానీ నూతన నివాసంలో సేవకులు, అతిథులకు పత్యేక గదులతో పాటు విలేకరుల సమావేశ గది కూడా ఉంది. ఎంపీ స్మృతి ఇరానీ నూతన గృహం సిద్ధమైన తరుణంలో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
30 కిలోల ఆహారంతో ఇంటిపై కూలిన డ్రోన్!
హర్యానాలోని గురుగ్రామ్లో ఆహారాన్ని తరలిస్తున్న ఒక డ్రోన్ కలకలం సృష్టించింది. సౌత్ సిటీలోని జి బ్లాక్ మీదుగా ఆహారాన్ని తీసుకువెళుతున్న ఆ డ్రోన్ హఠాత్తుగా ఒక ఇంటిపై పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 30 కిలోల బరువున్న ఆహార పదార్థాలు ఆ ఇంటిపై పడటంతో పాటు ఇంటి బాల్కనీ, డిష్ యాంటెన్నా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఇంటి బాల్కనీలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అకస్మాత్తుగా హౌస్ నంబర్ జి-68 పైనుండి పెద్ద శబ్దం వచ్చింది. ఇంటి యజమాని బయటకు వచ్చి చూసేసరికి డ్రోన్ శిథిలాలు, మరికొన్ని వస్తువులు అక్కడ పడి ఉన్నాయి. ఆహార సరఫరా కోసం డ్రోన్ల ట్రయల్ జరుగుతున్నదని. ఇందుకోసం అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నట్లు ఆ కంపెనీ ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. ఇంటికి జరిగిన నష్టానికి పరిహారం అందజేస్తామని ఆ కంపెనీ తెలిపింది. మరోవైపు ఈ ప్రాంతంలో ప్రధాని పర్యటన సందర్భంగా డ్రోన్లను ఎగురవేయడంపై జిల్లా యంత్రాంగం నిషేధం విధించింది. ఇదే సమయంలో డ్రోన్లను ఎగురవేసేందుకు ఆ కంపెనీకి అనుమతి ఎలా లభించిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే నిషేధ ఉత్తర్వుల గురించి తెలుసుకున్న డ్రోన్ పైలట్ ఈ భవనంపై అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాల ప్రకారం డ్రోన్లోని సాంకేతిక లోపం కారణంగా అది కూలిపోయింది. ఈ ఘటనపై సెక్టార్ 50 పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ పాడైన డ్రోన్ను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నమన్నారు. అలాగే సదరు కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, ఇది చరిత్రాత్మకమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఏపీలోనే తొలిసారి జరుగుతోందని తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్లపై వారికి పూర్తి హక్కు కల్పిస్తూ, వారికి ఒక ఆస్తిగా దాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేయడం తమ శాఖకు చాలెంజింగ్ వంటిదని, అత్యంత క్లిష్టమైన ఈ పనిని అందరి సహకారంతో సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షలాది మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు, వారి ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, హద్దులు, రెవెన్యూ గ్రామాల సమాచారాన్ని అప్లోడ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజి్రస్టార్లుగా గుర్తించడంతో వారికి లాగిన్లు ఇవ్వడం, ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్లు చేసే 15 వేల మంది వీఆర్వోలకు లాగిన్లు ఇవ్వడం పూర్తి చేసినట్టు చెప్పారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఈ డేటా మొత్తాన్ని మ్యాపింగ్ చేశామన్నారు. ఈ పని చేయడమే అత్యంత క్లిష్టమని, దాన్ని పూర్తి చేయడంతో రిజిస్ట్రేషన్లు ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్లు వెల్లడించారు. వీరందరి ఆధార్ ఈ–సిగ్నేచర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని చెప్పారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 6.5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిచ్చిందని రామకృష్ణ తెలిపారు. సాధారణంగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.5 వేల ఫీజు కట్టాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్టు తెలిపారు. రోజుకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, త్వరలో ప్రభుత్వం లక్ష్యానికనుగుణంగా అన్ని రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంతో సాకారమైందని తెలిపారు. మొన్నటివరకు భూముల రీ సర్వే పూర్తయిన 4 వేల గ్రామాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేవారని, ఇప్పుడు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ గ్రామ స్థాయికి పూర్తిస్థాయిలో చేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ఈ–సిగ్నేచర్ యూజర్లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. 6.5 లక్షల రిజిస్ట్రేషన్ల కోసం 20 లక్షల ఈ–సిగ్నేచర్లు తీసుకున్నట్టు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల వల్ల వారు పొందిన స్థలాలపై పేదలకు హక్కులు ఏర్పడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇచ్చే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారడం వల్ల వారికి ఇబ్బందులుండవన్నారు. రెవెన్యూ ఎన్వోసీ లేకుండానే పదేళ్ల గడువు ముగిశాక ఆ స్థలాలపై పేదలకు సర్వ హక్కులు లభిస్తాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరమని రామకృష్ణ వివరించారు. -
ఆ ఇంటిని మడత పెట్టి..! ధర ఎంతంటే..
అమెజాన్లో అమ్ముడుపోతున్న ఓ ఇంటి గురించి ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. లాస్ ఏంజెల్స్లో ఎక్కువ అమ్ముడుపోతున్న ఆ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. అది మడతపెట్టేదిగా ఉండడమే. దీని ధర 26 వేల డాలర్లు(మన కరెన్సీలో 21 లక్షల రూపాయలు)గా ఉంది. చిన్న కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూంతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉంది ఈ ఇంట్లో. టిక్టాక్ ద్వారా అక్కడ ట్రెండ్లోకి రాగా.. అక్కడి నుంచి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అయితే ఈ ఇంటిపై ఇంటర్నెట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. Someone bought a "foldable" house from Amazon 😳!! How would the future of homes be if you could buy them today from Amazon? pic.twitter.com/PAQGrILPIQ — Tom Valentino (@TomValentinoo) February 4, 2024 Y'all better go head and get yourselves a Amazon foldable house ‼️ pic.twitter.com/m4748K9xNy — Mesh🇧🇧 (@rahsh33m) January 30, 2024 -
కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది. -
ఇదేం ఆఫర్ సామీ! ఇల్లు కొంటే భార్య ఉచితమా?
చైనాలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే.. దీంతో అక్కడ ఆస్తుల విలువల ఆర్థిక వ్యవస్థపై ఘోరంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ సంకోభం చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా కుదేలుచేసింది. చాలా తిరోగమనంలో సాగుతోంది. దీంతో కొందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులురకరకాల మార్కెట్ వ్యూహాలతో ఇళ్లను అమ్మే పనిలో పడ్డారు. ఈ ప్రకటనల విషయంలో వారిలోంచి ఎంతలా క్రియేటివిటీ బయటకొస్తుందంటే..నిర్ఘాంతపోయేంత విచిత్రమైన స్థితిలో ఉన్నాయా ప్రకటనలు. వింటే మాత్రం..వామ్మే ఇదేం ఆఫర్ అని నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం! తాజగా టియాంజన్లోని ఓ కంపెనీ ఎంత విచిత్రమైన రీతీలో అడ్వర్టైస్మెంట్ చేసిందంటే..ఛీ అని కచ్చితంగా అంటారు. మరి ఇంత ఘోరమా! అని అనుకుండా ఉండలేరు. ఇళ్లు అమ్ముడుపోవాలని ఏకంగా 'ఇల్లు కొనండి భార్యను ఉచితంగా పొందండి' అని అడ్వర్టైస్మెంట్ ఇచ్చింది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్లోని మరో కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించిందట. ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు గానీ మరీ ఇలా భార్యలేంటి అని అందరూ సీరియస్ అయ్యారు. పైగా ఇది చైనీస్ రెగ్యులేటర్లకు కూడా నచ్చలేదట. ఇలా ప్రకటన ఇచ్చినందుకగానూ సదరు కంపెనీకి రూ. 3 లక్షల దాక జరిమాన విధించింది. గత రెండేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ పడిపోవడం ప్రారంభించింది. ఆ తర్వాత నెమ్మదిగా నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. దీంతో అనేక మల్టీ బిలయన్ డాలర్ల కంపెనీ కుప్పకూలాయి. దీని ప్రభావంతో చైనాలో నాలుగు సంపన్న నగరాల్లో గృహాల ధరలు దారుణంగా పడిపోయాయి. అలాగే కొత్త ఇళ్లు విక్రయాలు కూడా తగ్గిపోయాయి. అంతేగాదు ఈ రియల్ ఎస్టేట్ తిరోగమనం మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మాజీ హెడ్ షెంగ్ సాంగ్చెంగ్ అంచనా వేశారు. పైగా దశాబ్దం క్రితం రెండంకెల వృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ నాలుగో త్రైమాసికంలో కేవలం 5.2% వృద్ధితో ఆర్థికవేత్తల అంచనాలను సైతం అందుకోలేకపోయింది. (చదవండి: మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!) -
సీఎం జగన్ ఇంట నేడు సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: ముత్యాల ముగ్గులు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట నేడు సంక్రాంతి శోభ వెల్లివిరియనుంది. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్కు ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీ, నాడు–నేడు స్కూల్, పాల కేంద్రం నమూనాలు, ఎడ్లబండ్లు, గ్రామీణ ఇళ్లతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు వీటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. వందేళ్ల క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ఇక్కడ ప్రత్యేకంగా సెట్టింగ్ ఏర్పాటుచేశారు. భోగి మంటలతో సంబరాలకు శ్రీకారం.. తొలుత సీఎం వైఎస్ జగన్, భారతమ్మ దంపతులు సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయటంతో ఆదివారం పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. గంగిరెద్దులకు సారెను సమర్పిస్తారు. ► తిరుమల రహదారి మార్గంలో ఉండే శిలాతోరణం లాంటి సెట్టింగ్ గుండా ముఖ్యమంత్రి దంపతులు గోశాల ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ► గోపూజ కార్యక్రమంలో వారిరువురూ పాల్గొంటారు. ఆ తర్వాత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి సంక్రాంతి సంబరాల ప్రాంగణంలోకి అడుగుపెడతారు. ► ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. -
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు అదిరిపోయింది
-
అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..
కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త.. -
పట్టణ పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల కష్టాలు తీరనున్నాయి. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 82,080 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 4 నుంచి మరో 73,580 ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో 61,684 యూనిట్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై అధిక ధరలను మోపగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని తొలగించింది. 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఆర్థిక భారాన్ని సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా ఇందులో మొదటి దశలో 1,51,298 వంద శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది పేద మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న టిడ్కో ఇళ్లు అదనం. అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు.. ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఎస్టీపీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాకే ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తుండటం విశేషం. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఫ్లాట్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండడం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండు చోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా పేరు పెట్టారు. వీటి నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. ఇళ్ల పేరిట పేదలపై చంద్రబాబు బండ టిడ్కో ప్రాజెక్టులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాది స్థాయిని మాత్రమే దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతోపాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారు చేశారు. అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. తద్వారా ప్రతి నెలకు రూ.3,805 భారం మోపింది. ఇక 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల వాటా కింద వసూలు చేసింది. లబ్ధిదారులకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్ వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడు కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10,339 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. 365 చ.అ ఇళ్లకు 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లకు 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని జగన్ ప్రభుత్వం సగానికి తగ్గించింది. అంతేకాకుండా లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను కూడా ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులు గత ప్రభుత్వ ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వ చర్యలతో ఆ మొత్తం రూ.4,590 కోట్లకు దిగివచ్చింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు కేవలం రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. వైఎస్ జగన్ సర్కారు రూ.3,237 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. రివర్స్ టెండరింగ్లో చ.అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించడంతో పాటు అన్ని పనుల్లోనూ దాదాపు రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్లు మేలు పొందారు. ఇళ్ల పంపిణీ తాజా షెడ్యూల్.. ► జనవరి 4న అనకాపల్లి జిల్లాలో సత్యనారాయణపురం 2,744 గృహాలు. ► 6న గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో 4,192, వెంగళాయపాలెంలో 1,888. ► జనవరి రెండో వారంలో మచిలీపట్నంలో 864, పెద్దాపురంలో 1,584. ►మూడో వారంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15,552, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 1,008, మదనపల్లి మున్సిపాలిటీలో 1,872, చిత్తూరు మున్సిపాలిటీలో 2,832. ► నాలుగో వారంలో విజయనగరం జిల్లా సారిపల్లిలో 352, సోనియానగర్లో 1,088, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 548, విశాఖ జిల్లా దబ్బందలో 1,920, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 1,248, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో 480, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 192, పలాసలో 912. రెండో దశలో 6,500 ఇళ్లను కూడా పంపిణీ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 800, పాలకొల్లులో 1,024, తాడేపల్లిగూడెంలో 1,124, కడపలో 9,912, విశాఖపట్నంలోని 11 ప్రాంతాల్లో 6,048. ► ఫిబ్రవరి మొదటి వారంలో పార్వతీపురం మున్సిపాలిటీలో 768 ఇళ్లు. -
ఇంట్లోనే థియేటర్!
సాక్షి, హైదరాబాద్: భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టీప్లెక్స్లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. అడ్డంకులు లేని అనుభూతి.. మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచ్చిన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచ్చిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో... దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్ను 25 శాతం, వెబ్ సిరీస్లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే.. మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యత కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్ను మించి హోం థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
ప్రేతాత్మకు ఆవాసం
చూడటానికి రాచప్రాసాదంలా కనిపించే ఈ పురాతన హోటల్ భయానకమైన కట్టడంగా పేరుమోసింది. మామూలుగా చూస్తే ఇందులో భయపెట్టే వస్తువులేవీ కనిపించవు గాని, ఇది ప్రేతాత్మకు ఆవాసంగా మారిందని జనాలు చెప్పుకుంటారు. స్టీమ్ ఇంజిన్తో నడిచే కారును కనుగొన్న ఫ్రీలాన్ ఆస్కార్ స్టాన్లీ క్షయవ్యాధికి లోనైనప్పుడు కొలరాడోలోని రాకీ పర్వత ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నాడు. స్వచ్ఛమైన గాలి, ధారాళంగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఉంటూ మంచి ఆహారం తీసుకోవడం తప్ప అప్పట్లో క్షయవ్యాధికి పెద్దగా మందులు లేవు. ఇక్కడ ఉంటూ స్టాన్లీ వ్యాధి నుంచి కోలుకున్నాడు. తర్వాత క్షయ రోగులకు ఆవాసంగా ఉపయోగపడేలా ఇక్కడ 1907లో 48 గదుల హోటల్ నిర్మించాడు. తర్వాత హోటల్ను 140 గదులకు విస్తరించాడు. ఈ హోటల్లోనే స్టాన్లీ భార్య మరణించింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఇందులోనే సంచరిస్తోందని, రాత్రివేళ హోటల్ హాలులో ఉన్న పియానోను వాయిస్తోందని ప్రచారం మొదలైంది. ఈ హోటల్లో దిగిన కొందరు అతిథులు కూడా ఇక్కడ ఆత్మను తాము స్పష్టంగా చూసినట్లు చెప్పడంతో ఇది హాంటింగ్ హోటల్గా పేరుమోసింది. -
ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా!
ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి జనం వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంటారు. వీరిలో సంపాదనకు చక్కటి మార్గాలను కనుగొన్నవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కరుణ్ విజ్. అతను భారతీయుడే అయినప్పటికీ ప్రస్తుతం కెనడాలో నివసిస్తున్నారు. కరుణ్ విజ్ ప్రతి నెలా సగటున రూ.9 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు కరుణ్ సంపాదనకు లాభసాటి మార్గాన్ని కొనుగొన్నారు. 33 ఏళ్ల కరుణ్ మొదటి నుంచి ప్రాపర్టీ ఓనర్గా మారాలనుకునేవారు. రియల్ ఎస్టేట్.. మంచి లాభదాయకమైన వ్యాపారమని కరుణ్ కాలేజీ రోజుల్లోనే గ్రహించారు. ఈ సమయంలో కరణ్.. దేశంలోని ఇన్స్టిట్యూట్ల చుట్టుపక్కల ఉండే ఇళ్లకు సంబంధించి ఒక ఆలోచన చేసేవారు. మొత్తం ఇంటిని ఒకరికే అద్దెకు ఇవ్వకుండా.. గదుల ప్రాతిపదికన రెంట్ వసూలు చేయడం లాభదాయకమని భావించారు. ఇంటినంతటికీ అద్దెదారుకు అద్దెకు ఇవ్వకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక గదులుగా మలచి, అద్దెకు ఇవ్వడం ఎంత ప్రయోజనకరమనేది గ్రహించారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం కరుణ్ కెనడాలో మొత్తం 28 గదులు కలిగిన నాలుగు ఇళ్లను కలిగి ఉన్నాడు. అతను వాటిని అద్దెకు ఇచ్చాడు. దీంతో ప్రతినెలా రూ.9 లక్షలకు పైగా మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. అయితే ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు కరుణ్ దాదాపు రూ.19 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2016వ సంవత్సరంలో తన 26 ఏళ్ల వయస్సులో కరుణ్ కెనడాలోని అంటారియోలో తన మొదటి పెట్టుబడి పెట్టారు. ఈ క్రమంలో దాదాపు రూ.2.7 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి, ఏడుగురు కాలేజీ విద్యార్థులకు అద్దెకు ఇచ్చారు. కరుణ్ కేవలం అద్దె ఆదాయంపై మాత్రమే ఆధారపడటం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కరుణ్ అప్లికేషన్స్ ఇంజనీర్గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఒక కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, తన జీతం సొమ్ముతో కరుణ్.. దక్షిణ అంటారియోలో భారీగా ఆస్తులను కూడబెట్టారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత -
ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసం ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలపాటు దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్కు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్ రోడ్లోని 3వ నంబరు ఇల్లును ఖాళీ చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని ఇక్కడి సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే కొంత సామాను తరలించిన సిబ్బంది.. రెండు మూడు రోజుల్లో ఈ ఇంటిని పూర్తిగా ఖాళీ చేయనున్నారు. లోక్సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్రావుకు ఈ బంగ్లాను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు ఇది అధికారిక నివాసంగా మారింది. ఈ ఇంటి నుంచే హస్తినలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట సాధన ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర సాధన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం హోదాలో హస్తినకు ఎప్పుడు వచ్చినా ఇదే ఇంట్లో ఆయన బస చేసేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజా ప్రతినిధి అయినా.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది. కానీ.. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆ ఇంటిని రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీ అయితే రెండు దశాబ్దాలుగా కేసీఆర్కు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది. -
ఇలా చేస్తే మీ ఇల్లు విశాలంగా, కాంతివంతంగా కనిపిస్తుంది
చలికాలం పొద్దు తగ్గుతుంది. వాతావరణం డల్గా మారుతుంది. ఆ దిగులు ఇంటికీ చేరుతుంది. ఇంట్లో వాళ్ల ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. సో.. కాలాన్ని బట్టి దుస్తులే కాదు ఇంటి అలంకరణనూ మార్చాలి.. హుషారురేకెత్తించేలా.. ఇలా.. ►చీకటి మూలలను బ్రైట్ చేసేయాలి. అందుకు ఫ్లోర్ ల్యాంప్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉల్లాసం.. ఉత్సాహం కోసం ఇండోర్ మొక్కల అలంకరణ తప్పనిసరి. ► అల్లికలతో ఉన్న బెడ్షీట్స్, దిండు కవర్లు శీతాకాలాన్ని బ్రైట్గా మార్చేస్తాయి. అలాగే వెచ్చదనం కావాలన్నా.. విలాసంగా కనిపించాలన్నా.. వెల్వెట్ క్లాత్స్, సాఫ్ట్ ఫర్ ఉండే పిల్లోస్ బాగా ఉపయోగపడతాయి. ► సహజమైన కాంతి కోసం.. ఖాళీగా ఉన్న గోడపైన పెద్ద నిలువుటద్దాన్ని వేలాడదీయాలి. ఫ్రేమ్కి ఆకట్టుకునే రంగును వేయడం ద్వారా అద్దాన్ని అందంగా మార్చేయవచ్చు. దీని వల్ల ఇల్లు విశాలంగా, కాంతిమతంగానూ కనిపిస్తుంది. ► వింటర్ ఫ్యాషన్లాగానే వింటర్ హోమ్ డెకరేటింగ్ని ఫాలో అవ్వాల్సిందే. కుర్చీలను స్లిప్ కవర్లతో కవర్ చేయడం ద్వారా డైనింగ్ రూమ్కి వెచ్చదనాన్ని తీసుకురావచ్చు. ► విండోస్కి మందపాటి కర్టెన్లు వేసి, షీర్ డ్రేపరీలతో భర్తీ చేయవచ్చు. దీని వల్ల ఉష్ణోగ్రతలు పడిపోయినా వెచ్చదనం ఉంటుంది. ► శీతాకాలపు సువాసనల్లో సుగంధ ద్రవ్యాల పాత్ర అమోఘం. ముఖ్యంగా దాల్చిన చెక్క సువాసన వింటర్ని ఉత్సాహంగా మారుస్తుంది. సుగంధ పరిమళాల డ్రై ఫ్లవర్ బాస్కెట్ని అమర్చుకోవచ్చు. సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఉల్లాసంగా ఉంచుతాయి. -
Dethadi Harika House Warming Pics: ఘనంగా దేత్తడి హారిక నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్కు చేర్చారు. డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు. కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారున్నారు. ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? -
నేపాల్లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు!
భారత్ పొరుగు దేశమైన నేపాల్లో ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదయ్యిందని, భూకంప కేంద్రం మక్వాన్పూర్ జిల్లాలోని చిట్లాంగ్లో ఉందని నేపాల్ సైన్స్ సెంటర్ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా నవంబర్ 3న, నేపాల్లోని జాజర్కోట్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇప్పటికీ గుడారాలలో నివసిస్తున్న దుస్థితి నెలకొంది. చలికి వీరంతా అల్లాడుతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఐదుగురు మృతిచెందారు. కాగా నవంబర్ 17న మయన్మార్లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ టంగ్ నగరానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమయ్యింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇది కూడా చదవండి: వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు? -
ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులుగా ప్రదీప్రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రదీప్రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది. ప్రదీప్రెడ్డితో పాటు కోట్ల నరేందర్రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ. 7 కోట్ల 50 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఐటీ అధికారుల వరుస సోదాలు సోమవారం మూడ్రోజులు పాటు కొనసాగాయి. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అమీన్పూర్లోని పటేల్గూడ, ఆర్సీపురం, వట్టినాగులపల్లి,గచ్చి బౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడాలో అంతర్జాతీయ రసాయన పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి రానీయకుండా సీఆర్పీ ఎఫ్ జవాన్లు బందోబస్తు నిర్వహించారు. ఆయా కంపెనీలకు చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు మెరుపుదాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కోట్లున్నా..కారుండదు..ఎందుకు? -
హైదరాబాద్కు యునెస్కో గుర్తింపు తెస్తాం
రాయదుర్గం: హైదరాబాద్కు యునెస్కో ద్వారా వరల్డ్ హెరిటేజ్ సిటీగా గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తున్నామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. నగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాలు ఉన్నాయని, ఎన్నింటినో గుర్తించి, ఆధునీకరించామని, భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. శనివారం నగరంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నగరంలో క్రీడారంగానికి ప్రాధాన్యత ఇస్తూ 2036 నాటికి ఒలింపిక్స్ హౌజ్ నిర్మిస్తామని, ఇప్పటికే ఉన్న ఉప్పల్, ఎల్బీ స్టేడియాలను మరింత ఆధునీకరించి, కొత్త స్టేడియాలను, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను నిర్మిస్తామన్నారు. నగరంలో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నామని, వచ్చే పదేళ్లలో 24 గంటలపాటు తాగునీరు అందేలా చేయాలని, వచ్చే అయిదేళ్ల కాలంలో రోజువారీగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నగరాన్ని తొమ్మిదిన్నరేళ్లలో భూతల స్వర్గం చేశామని చెప్పమని, కానీ చిత్తశుద్ధితో కష్టపడి ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేశామని చెప్పగలనన్నారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీకి మరో ఇద్దరు అదనపు కమిషనర్లు హైదరాబాద్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో మరో ఇద్దరు కమిషనర్లను నియమించాలనే ప్రతిపాదన ఉందని కేటీఆర్ చెప్పారు. చెరువులు పరిరక్షణ, పర్యవేక్షణ, సుందరీకరణకు ఒక ప్రత్యేక కమిషనర్, పార్కులు, హరిత పరిరక్షణకు మరో ప్రత్యేక కమిషనర్ను నియమించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో కాలుష్య రహిత రవాణా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మెట్రోను రానున్న కాలంలో 415 కి.మీ.కు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. లింకురోడ్ల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ ప్లాన్ చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. -
Ananya Panday: హీరోయిన్ నూతన ఇంటి గృహప్రవేశం.. ఇప్పుడు కూడా గ్లామర్ షో వదల్లేదుగా (ఫోటోలు)
-
ఇంటి పంటగా కుంకుమ పువ్వు!
కశ్మీర్లోని చల్లని ప్రదేశాల్లోనే సహజంగా ఆరుబయట పొలాల్లో కుంకుమ పువ్వు పండుతుంది. అయితే, కృత్రిమ శీతల వాతావరణం సృష్టించిన గదుల్లో కూడా ఈ పంటను పండిస్తున్నారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎరట్రి దారాల్లాంటి కేసరాలు ఉంటాయి. వాటిని సేకరించి జాగ్రత్తగా నీడన ఎండబెట్టి భద్రపరిచి వాడుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్యోగం చేస్తున్న కె. శైలజారెడ్డి తన ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వును ఇంటిపంటగా పండిస్తున్నారు. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గర్భవతులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. స్వీట్లు, ఖీర్, బిర్యానీ, ఫ్రూట్ సలాడ్లలో దీన్ని వాడుతుంటారు. శ్రీఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీనిధి అనే యువతి కుంకుమ పువ్వు సాగు చేస్తున్న వీడియోలు యూట్యూబ్లో చూసి స్పూర్తి పొందిన శైలజారెడ్డి తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు చేపట్టారు. ఇండియా మార్ట్ ద్వారా కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం అక్కడ రైతులకు, విత్తనాలను సేకరించి అమ్మే వారికి మధ్య వివాదం రావడంతో ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని శైలజారెడ్డి తెలిపారు. రూ. 4 లక్షల పెట్టుబడి శైలజారెడ్డి తన మూడు బెడ్రూమ్లతో కూడిన ఇంట్లోనే.. 12“12 అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో ఇనుప ర్యాక్లలో ఫైబర్ టబ్లు, కృత్రిమ వెల్తురు సదుపాయాలను సమకూర్చి కుంకుమ పువ్వు పండిస్తున్నారు. విత్తనాలకు, ఈ ఏర్పాట్లకు రూ. 4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. చల్లని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనువైనది. మనం గదిలో కృత్రిమ శీతల వాతావరణాన్ని కల్పించి నిశ్చింతగా సాగు చేయవచ్చని శైలజారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గదిలో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. గాలిలో తేమ శాతం 80% ఉండాలి. ఇందుకోసం గదిలో చిల్లింగ్ యంత్రాన్ని, హ్యుమిడిఫయర్ను ఏర్పాటు చేశారు. కృత్రిమ కాంతితో కూడిన తగుమాత్రపు వేడి కోసం గదిలో 20 వరకూ గ్రోలైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ లైట్లు వెలిగిస్తే సరిపోతుంది. పూత దశలో తప్ప ఇతర కాలాల్లో గది పగటి ఉష్ణోగ్రత 16–17 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్న శైలజారెడ్డి ఇటీవలే తొలి పంట తీశారు. ఇప్పటి వరకూ 1441 పువ్వులు పూస్తే అందులో నుంచి 10 గ్రాముల కుంకుమ పువ్వు కేసరాల దిగుబడి వచ్చింది. గ్రాము రూ. ఏడు వందల చొప్పున ఆరు గ్రాములను అమ్మారు. మిగిలిన కుంకుమ పువ్వును తనతోపాటు పనిచేసే వారికి కొంచెం కొంచెం బహూకరించాలని నిర్ణయించుకున్నట్లు శైలజారెడ్డి చెప్పారు. తాను గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన కుంకుమపువ్వును ఇప్పుడు తాను పండించిన కుంకుమ పువ్వుతో పోల్చి పరిశీలించినప్పుడు, అది కల్తీది అని స్పష్టంగా అర్థమైందన్నారు. గ్రోలైట్ల వెలుగులో కుంకుమ పూల సాగు వాడకానికి సిద్ధమైన కుంకుమ పువ్వు ఎయిరోపోనిక్స్..? కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమం (మట్టి 50%, ఇసుక 40%, వర్మీ కంపోస్టు పది మట్టి%)లో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. అంటే.. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే. నవంబర్– డిసెంబర్లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని శైలజారెడ్డి వివరించారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని శైలజారెడ్డి వివరించారు. మొదటి ఏడాదే పెట్టుబడి! ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి సంవత్సరమే పెట్టుబడి అవసరమవుతుంది. రెండో సంవత్సరం నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు. ఈ అనుభవాలను ఇతరులకు పంచాలని ‘శాన్వి శాఫ్రన్ ఫార్మ్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేశాను. – కె. శైలజారెడ్డి, కుంకుమ పువ్వు సాగుదారు, తాడేపల్లి, గుంటూరు జిల్లా . మొబైల్: 94912 33492. (సా. 7 గం. తర్వాత ఫోన్ చేయొచ్చు) www.youtube.com/ @ShanviSaffronFarms – దాళా రమేష్ బాబు, సాక్షి, బ్యూరో ఇన్చార్జ్, గుంటూరు (చదవండి: టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!) -
కలెక్టర్ ఇంట్లో చోరీ.. ల్యాప్ టాప్ మాయం
సాక్షి, కరీంనగర్: బదిలీపై మరోచోటికి వెళ్లేందుకు సామాన్లు సర్దుకున్న కలెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. ఎన్నికల వేళ బదిలీ అయి అసలే టెన్షన్ లో ఉన్న కరీంనగర్ కలెక్టర్ గోపీ ఇంట్లో దొంగలు పడ్డారు. ల్యాప్ టాప్ తో పాటు కలెక్టర్ కు చెందిన పలు డాక్యుమెంట్లను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సీసీ టీపీ ఫుటేజ్ లో బయటపడింది. ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గోపీ బదిలీ అయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలి. దీని కోసం తన సామాన్లన్నింటిని రెడీ చేసుకుని ఆయన హాయిగా బెడ్ రూమ్ లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి టైమ్ లో దొంగలు వెనుకవైపు గోడ నుంచి కలెక్టర్ బంగ్లా లోపలికి ఎంటర్ అయ్యారు. ఇంట్లో ముందు రూమ్ లో ఉంచిన కలెక్టర్ ల్యాప్ టాప్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగు, మరికొన్ని వస్తువులు దొంగిలించారు. దొంగలే వస్తువులు చోరీ చేసినట్టు సీసీ టీవీలో రికార్ట్ అయింది. ఇరవై నాలుగు గంటలు పోలీసు పహారాలో ఉండే కలెక్టర్ బంగ్లాలో దొంగలు పడడం సంచలనంగా మారింది. చోరీపై కలెక్టర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది?
ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్).. దేశంలోని ఇతర ప్రాంతాలకు మించిన మౌలిక సదుపాయాలు కలిగినదిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోని గురుగ్రామ్ జిల్లాలోని బంధ్వాడి గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది గురుగ్రామ్-ఫరీదాబాద్ హైవేపై, ఆరావళి పర్వతాల దిగువన ఉంది. ఇక్కడకు రాగానే దూరం నుంచే ఒక చెత్త కొండ కనిపిస్తుంది. దీని పరిష్కారానికి కసరత్తు జరుగుతున్నప్పటికీ, మరోవైపు దీనికారణంగా స్థానికుల ప్రాణాలు పోతున్నాయి. దాదాపు నాలుగున్నర వేల జనాభా కలిగిన ఈ గ్రామంలో ప్రతి మూడో ఇంటిలో ఒక కేన్సర్ బాధితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం అవుతుంది. క్యాన్సర్తో బాధపడుతున్న సత్పాల్ మాట్లాడుతూ ‘చెత్త కొండపై నుంచి ప్రవహించే ‘లీచెట్’ కారణంగా క్యాన్సర్ బారిన పడ్డాను. నేను ఎదుర్కొంటున్న పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకుంటున్నాను’ అని అన్నాడు. ‘లీచెట్’ అంటే తడి చెత్త నుండి వెలువడే ద్రవ విష పదార్థం. అది భూమిలో ఇంకిపోతే ఆ నీరు తాగడానికి లేదా స్నానానికి సైతం పనికిరానిదిగా మారుతుంది. ఇక్కడ సుమారు రెండున్నరేళ్ల క్రితం పల్లపు స్థలంలో నిర్మించిన సరిహద్దు గోడ వర్షాలకు కూలిపోవడంతో ఆ స్థలంలో నిరంతరం చెత్త పేరుకుపోతూవచ్చింది. ఈ చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసనలు చేపట్టారు. గౌహతిలోని ఐఐటి బృందం తన సర్వేలో ఇక్కడ 22 లక్షల టన్నుల చెత్త ఉందని వెల్లడించింది. ఈ చెత్తనంతటినీ 2024, ఏప్రిల్ నాటికి తొలగించగలమని అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. బంధ్వాడి భూగర్భ జలాల పరీక్షలో నీటిలో సీసం ఉండవలసిన పరిమితి కంటే 120 రెట్లు, కాడ్మియం 10 రెట్లు అధికంగా ఉందని తేలింది. ఇది ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి? -
కాజల్ అగర్వాల్ నూతన గృహ ప్రవేశం.. భర్తతో కలిసి పూజలు! (ఫొటోలు)
-
కొత్తింటికి చేరిన భగవంత్ కేసరి భామ.. భర్తతో కలిసి పూజలు!
మగధీర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటీవలే బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. కాగా.. 2020లో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన భామ కొన్నేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. గతేడాదిలోనే ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. తమ ముద్దుల కుమారుడికి నీల్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బీజీగా ఉంటోన్న ముద్దుగుమ్మ.. తాజాగా కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తన భర్త, కుమారుడితో కలిసి గృహ ప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాజల్ తన ఇన్స్టాలో రాస్తూ..'నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉంది. మా పవిత్రమైన కుటుంబ కోసం ఈ వారంలోనే గృహ ప్రవేశానికి సంబంధించిన పూజ జరిగింది. ఇది మేము ప్రేమతో కట్టుకున్నఇల్లు. ఇది నేను ఆ దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. ఈ శుభ సందర్భంలో మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖ సినీతారలు, ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
మన దేశంలో దివ్యాంగులకు అనువైన ఇల్లు ఉందా..?
అద్దెకు ఎన్నో ఇళ్లు, ఫ్లాట్లు ఉంటాయి కదా అనిపించవచ్చు. కాని వీల్చైర్లో మాత్రమే జీవనం గడిపేవారికి ఆ ఇళ్లేవీ పనికి రావు. బెంగళూరులో ఐటి ఇండస్ట్రీలో పని చేస్తున్న మృణ్మయి తను నివసించడానికి బెంగళూరులో తగిన ఫ్లాటే దొరకడం లేదని ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ విశేషంగా చాలామంది దృష్టిని ఆకర్షించింది. లిఫ్ట్లో అడుగు పెట్టడం దగ్గరి నుంచి బాత్రూమ్ల వరకూ ప్రతిదీ వీల్చైర్కు వీల్లేనివేనని ఆమె తెలిపింది. ఆమె మాత్రమే కాదు సాధారణ వ్యక్తులకు జబ్బు చేస్తే వీల్చైర్లో ఆస్పత్రికి వెళ్లిరావడం కూడా దుర్లభమే. మన నిర్మాణ పద్ధతుల్లో మానవీయత రాదా? ‘అందరికీ అందుబాటు’ (యాక్సెసెబిలిటీ టు ఆల్) అనే మాట వినడానికి చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కాని అది ఆచరణ యోగ్యం కావడం ఇంచుమించు అసాధ్యంగా ఉంది మన దేశంలో. ‘మా ఇంటికి రండి’ అని ఆహ్వానిస్తే అందరూ ఆ ఆహ్వానాన్ని మన్నించగలరా? మన ఇల్లు దివ్యాంగుల రాకపోకలకు అనువుగా ఉందా? నివసించే ఫ్లాట్స్లో సులభంగా వీల్చైర్తో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కట్టుకున్న ఇళ్ల మెయిన్గేట్నైనా వీల్చైర్ దాటగలదా? అందరూ మెట్లు వాడగలరని, మెట్లు ఉంటే సరిపోతుందని ఇప్పటికీ భావిస్తున్నామంటే యాక్సెసెబిలిటీ టు ఆల్ హక్కును నిరాకరిస్తున్నట్టే. ర్యాంప్లు కట్టి దివ్యాంగుల రాకపోకలను అన్ని ప్రయివేటు, పబ్లిక్ ప్లేసుల్లో సులభం చేసినప్పుడే మెరుగైన సమాజాన్ని ఏర్పాటుచేసుకున్నట్టు. ఇల్లు కావాలి బెంగళూరులో అమేజాన్లో పనిచేస్తున్న మృణ్మయి‘నాకు ఇల్లు కావాలి. కాని అలాంటి ఇల్లు దొరకడం లేదు’ అని ‘ఎక్స్’ (ట్విటర్)లో తాజాగా పెట్టిన పోస్టు దివ్యాంగుల ఘోషను మరోసారి బయటపెట్టింది. ‘నేను ఇన్నాళ్లు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అందులో ర్యాంప్లు ఉన్నాయి. నా మోటర్డ్ వీల్చైర్తో కిందకు రావడం మళ్లీ ఫ్లాట్లోకి వెళ్లడం సులభంగా ఉంటుంది. ఫ్లాట్లో కూడా ఎలాంటి ఇబ్బందీ లేదు. కాని ఇప్పుడు మా ఫ్లాట్ ఓనర్ ఏవో కారణాల రీత్యా ఖాళీ చేయమన్నాడు. అప్పటి నుంచి తగిన ఫ్లాట్ కోసం ఎంతో వెతుకుతున్నాను. కాని వీల్చైర్తో రాకపోకలు సాగించేలా ఒక్క ఫ్లాట్ కూడా లేదని తెలపడానికి చింతిస్తున్నాను’ అని ఆమె రాసుకొచ్చింది. అన్ని చోట్లా మెట్లే చాలా ఫ్లాట్లలో లిఫ్ట్ దగ్గర మెట్లు ఉండటం ఒక సమస్యగా మృణ్మయి చెప్పింది. అంటే ఒకటో రెండో మెట్లు ఎక్కి లిఫ్ట్ ఎక్కాలి. కొన్ని లిఫ్ట్లు చాలా చిన్నవిగా ఉంటాయి. వీల్చైర్తో ప్రవేశించి లోపల దానిని తిప్పుకుని డోర్ వైపుకు ముఖం పెట్టడం కష్టం. ‘అపార్ట్మెంట్స్లో చాలా ఫ్లాట్లకు గడప అడ్డంగా ఉంటుంది. వీల్చైర్తో దాటలేము. దాటినా అన్ని ఫ్లాట్లలో బాత్రూమ్లు ఒక మెట్టు ఎత్తులో ఎందుకు కడతారో అర్థం కాదు. నేను వీల్చైర్తోటే బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చేయాలి. కాని సింకో, టాయిలెట్ సీటో అడ్డంగా ఉంటుంది. అదీగాక బాత్రూమ్ ద్వారాలు మరీ సన్నగా పెడతారు. నా వీల్చైర్తో అడుగుపెట్టాలంటే అవి కనీసం 25 అంగుళాల వెడల్పు ఉండాలి. అలా ఉండవు’ అంటుంది మృణ్మయి. ‘మరో సమస్య ఏమిటంటే... ఇలా వీల్చైర్కు అనువుగా ఉన్న ఫ్లాట్లకు రెంట్ ఎక్కువ అడుగుతున్నారు. 25 వేల రూపాయల ఫ్లాట్ 40 వేలు చెబుతున్నారు’ అందామె. యాక్సిడెంట్ వల్ల మృణ్మయి అందరిలా హుషారుగా తిరిగే అమ్మాయి. కాని 2011లో జరిగిన కారు ప్రమాదం వల్ల ఆమెకు స్పైనల్ కార్డు ఇంజూరీ జరిగింది. సర్జరీ చేసినా రెండు భుజాల కింద ప్రాంతమంతా అధీనాన్ని కోల్పోయింది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మోటర్డ్ వీల్చైర్ ద్వారా ఆమె మామూలు జీవనం గడపడానికి ప్రయత్నిస్తోంది. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఆఫీస్ పని కోసం డిక్టేషన్ సాఫ్ట్వేర్ వాడతాను. వేళ్ల మీద అధీనం ఉంది కాబట్టి టచ్ స్క్రీన్ ఉపయోగిస్తాను. కాని నాకూ తిరగాలని ఉంటుంది. బయటికొస్తే రెస్టరెంట్కు కూడా పోలేను. ప్రతి రెస్టరెంట్కూ మెట్లు ఎక్కి వెళ్లాలి. ఎక్కడా ర్యాంప్లు ఉండవు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నవారికే ప్రవేశం అన్నట్టుగా మన నిర్మాణాలు ఉంటాయి. సినిమా హాళ్లు చెప్పే పనే లేదు. టాక్సీ సర్వీసులు కూడా వీల్చైర్ ఫ్రెండ్లీ కావు. అందుకే మాలో చాలామంది యాక్సెసబిలిటీ యాక్టివిస్ట్లుగా మారి సమాజంలో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తుంటాం’ అని తెలిపింది మృణ్మయి. ‘ఎక్స్’లో మృణ్మయి పెట్టిన పోస్ట్కు చాలామంది స్పందించారు. నిజంగా మీ ఇబ్బంది మీరు చెప్తుంటే తెలుస్తోంది అని చాలామంది చెప్పారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆఫీసులు, పార్కులు, హాస్పిటళ్లు, విద్యా సంస్థలు.. ఇలా ప్రతిదీ దివ్యాంగుల రాకపోకలకు అనువుగా మారడం, మార్చడం తప్పనిసరి. వాటిని వాడేది ఒకరిద్దరైనా ఆ ఒకరిద్దరి హక్కును నిరాకరించే అధికారం మనకు లేదు. (చదవండి: ఎవరికి వారే.. మహిళా‘మణులే’! ) -
బిగ్ బాస్ శివజ్యోతి నూతన గృహ ప్రవేశం (ఫొటోలు)
-
సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం నేటికి మిస్టరీలే!
ఊహో..? అపోహో..? అంతకు మించిన అభూతకల్పనో..? తేల్చుకోలేని స్థితే అశాంతికి ఆలవాలం. అంధవిశ్వాసానికి ఆధ్యం. వాటి మధ్య నలిగిన జీవితాలు.. వాళ్లు వదిలి వెళ్లిన ఆనవాళ్లు.. తర్వాత తరాలను ఇట్టే బెదరగొడతాయి. అలాంటి ఉదంతమే ఇది. 1881 తర్వాత మొదలైంది ఈ కథ. అది అమెరికా, న్యూ హెవెన్ సమీపంలోని ఒక పెద్ద విల్లా. అందులో నివసించే 44 ఏళ్ల సారా వించిస్టర్కు పడుకునే ముందు పియానో వాయించి నిద్రపోవడం అలవాటు. ఆ రాత్రి అదే చేసింది. అయితే పన్నెండు దాటాక.. అదే పియానో మ్యూజిక్ అస్పష్టంగా వినిపించడం మొదలైంది. తుళ్లిపడి నిద్ర లేచిన సారా.. వెంటనే హాల్లోకి వెళ్లిచూడగానే.. ఆ మ్యూజిక్ ఆగిపోయింది. కానీ ఆ ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు. ‘ఎవరది?’ అనే అరుపు ఆమెలోని భయాన్ని మభ్యపెట్టింది. అప్పుడే.. చిమ్మచీకటిలో హాల్కి ఆనుకుని ఉన్న స్టోర్ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అయ్యింది. ఆ అలికిడికి తిరిగి చూసిన సారా.. ధైర్యం తెచ్చుకుని.. దగ్గరకు వెళ్లి తలుపు క్లోజ్ చేయబోతుంటే.. అందులో ఉన్న ఊయల ఊగుతూ కనిపించింది. పసిపాప ఏడుపు, విచిత్రమైన ఓ నవ్వు ఆమెను వణికించాయి. అప్పటి నుంచి ప్రతిరాత్రి అదే ఉలికిపాటు. కొన్ని రోజులకు పియానో వాయించే మనిషి కూడా స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్నిసార్లు అది కలో.. నిజమో ఆమెకు అర్థమయ్యేది కాదు. అప్పటికే ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ముసురుకున్నాయి. ∙∙ 1862లో ‘విలియమ్ విర్ట్ వించిస్టర్’ అనే ధనికుడ్ని వివాహం చేసుకున్న సారా.. తన మామగారు ఆలివర్ వించిస్టర్కి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేది. మొదట షర్ట్స్ కంపెనీ నడిపించే వించిస్టర్ కుటుంబం.. తర్వాత కాలంలో రైఫిల్స్ కంపెనీ (తుపాకుల వ్యాపారం) పెట్టి.. రెట్టింపు లాభాలు గడించసాగింది. గవర్నమెంట్ పర్మిషన్స్తో అఫీషియల్గానే కాదు.. రహస్యంగా కూడా చాలా గన్స్ అమ్మేది. సుఖశాంతులతో సాగిపోతున్న ఆ కుటుంబంలోకి సారా మరో శుభవార్తను మోసుకొచ్చింది.. తాను తల్లిని కాబోతున్నా అంటూ! పెళ్లి అయిన చాలా ఏళ్లకు కలగబోతున్న సంతానం కావడంతో.. ఆ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. సారాకు ఆడపిల్ల పుట్టింది. పాపకి యానీ వించిస్టర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ నెల రోజులకే ఆ పాప చనిపోయింది. ఆ విషాదం వించిస్టర్ కుటుంబాన్ని కోలుకోనివ్వలేదు. కొన్ని రోజులకే ఆలివర్ మరణించాడు. ఇంటి పెద్ద మరణించడంతో సారా, విలియమ్ కుంగిపోయారు. కొన్నాళ్లకు రైఫిల్ కంపెనీ లాభాలు తగ్గాయి. వ్యాపారం పతనం దిశగా సాగింది. కంపెనీ బాధ్యతలందుకున్న విలియమ్.. ఏడాది గడవకముందే (1881లో) మరణించాడు. దాంతో సారా మరింత కుంగిపోయింది. నిజానికి అక్కడితోనే ఆ కుటుంబంలో విషాదాలు ఆగిపోలేదు. విలియమ్ తర్వాత.. సారా అత్త, సారా తల్లి, సారా సోదరి ఇలా పలు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు చాలామంది మరణించారు. దాంతో సారాలో భయం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే సారాకు ఆత్మలు కనిపించడం మొదలుపెట్టాయి. తనకు ఎదురవుతున్న వింత అనుభవాల గురించి.. కొందరు శ్రేయోభిలాషులతో పంచుకుని, వారి సాయంతో.. పరిష్కారం కోసం కొంతమంది మాంత్రికుల్ని కూడా ఆశ్రయించింది. వారు ఆ ఇంటిని పరిశీలించి.. ఇక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని.. ఇందులో నివసించడం మంచిది కాదని తేల్చేశారు. కొన్నినెలల పాటు శాంతిపూజలు చేయించినా ఫలితం లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. స్టోర్ రూమ్లో ఊగే ఊయల సారా పాపదే. ప్రతిరాత్రి పియానో వాయించేది సారా భర్తే. తనకు ఎదురుపడే అస్పష్టమైన ఆకారం తన భర్తేదేనని గ్రహించిన రాత్రే.. సారాకి చాలా విషయాలు తెలిశాయి. ఆ రాత్రి విలియమ్.. సారాను తీవ్రంగా హెచ్చరించాడట. ‘మనం అమ్మిన రైఫిల్స్ (తుపాకీలు) కారణంగా చనిపోయిన వారి ఆత్మలు మన ఇంటిని చుట్టుముట్టాయి. ఆత్మలన్నీ కలసి.. వించిస్టర్ కుటుంబాన్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాయి. ఇప్పటి దాకా జరిగిన మరణాలన్నీ (నాతో సహా) ఆ ఆత్మల వల్లే జరిగాయి. ఈ ఇల్లు వదిలి పారిపో.. మరెక్కడైనా ఇల్లు కట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించు. అయితే ఆ నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాకుండా చూసుకో.. ఎప్పుడైతే ఇంటి నిర్మాణం పూర్తవుతుందో ఆ రోజే నీకు మరణం సంభవిస్తుంది’ అని చెప్పి విలియమ్ మాయమయ్యాడట. దాంతో సారా ‘న్యూ హెవెన్ను విడిచిపెట్టి.. కాలిఫోర్నియా వెళ్లిపోయింది. అక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన స్థలం కోసం వెతకడం మొదలుపెట్టింది. ఓ మూడేళ్లకు.. తనకు వారసత్వంగా వచ్చిన డబ్బుతో కాలిఫోర్నియాలోని శానోస్ సమీపంలో ఓ విశాలమైన స్థలాన్ని కొనుక్కున్నది. అక్కడ ఏడంతస్తుల భవనానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. సుమారు పదహారుసార్లు.. కట్టిన గదులను కూలుస్తూ మళ్లీ మళ్లీ కట్టించింది. ఆ ఇల్లు.. ఆత్మలను గందరగోళంలోకి నెట్టేలా ఉండాలనేది సారా ఉద్దేశమట. 1906 నాటికి ఇంటికి ఓ అందమైన రూపం వచ్చినా.. ఆమె శాంతించలేదు. ఆ ఇల్లు కొన్నిసార్లు భూకంప ప్రభావాలకు కూలితే.. ఎక్కువ సార్లు సారా అభీష్టానికి కూలిపోయింది. గదులు, కిటికీలు, తలుపులు ఇలా అన్నీ పగిలేవి, విరిగేవి. సుమారు ఆమె మరణం వరకూ అంటే 1922 సెప్టెంబర్ దాకా ఆ ఇంటి నిర్మాణం జరుగుతూనే ఉంది. స్వయంగా తనే ఎప్పటికప్పుడు నిర్మాణాల్లో పలు మార్పులు చేసేదట. సుమారు 36 ఏళ్ల పాటు ఆ ఇంట్లో రకరకాల మార్పుచేర్పులు జరిగాయి. కొన్ని మెట్లు పైకప్పుకి మార్గమైతే.. కొన్ని తలుపులు కేవలం అడ్డు గోడల్ని చూపెడుతుంటాయి. అంటే మెట్లు ఎక్కి మరో అంతస్తుకు వెళ్తాం అనుకుంటే అక్కడ ఇంటి పైకప్పు తప్ప ఏం ఉండదు. కొన్ని చోట్ల తలుపులు తెరిస్తే అడ్డంగా నిర్మించిన గోడలు తప్ప మార్గం కనిపించదు. కొన్ని కిటికీలు గోడలకు కాకుండా సీలింగ్కి ఉంటాయి. సారా స్వయంగా ఆత్మలతో మాట్లాడేదని.. వాటికి క్షమాపణలు చెప్పేదని.. వాటిని శాంతపరచడానికే ఇంటికి పదే పదే మార్పుచేర్పులు చేసేదని ఆ ఇల్లు కట్టిన కార్మికులు కొందరు ప్రచారం చేశారు. భర్త, బిడ్డ చనిపోవడంతో ఆమెకు పిచ్చి పట్టిందని.. ఆస్తులుండటంతో అలా ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేసిందని కొందరి అభిప్రాయం. అయితే వించిస్ట్టర్ బంధువులు మాత్రం.. ‘ఆమెకు ఆర్కిటెక్చర్ మీదున్న ఆసక్తికారణంగానే అన్నిసార్లు భవన నిర్మాణంలో మార్పులు చేసిందని.. ఆత్మలు వంటి పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచానికి వెల్లడించారు. ఏది ఏమైనా సారా జీవితం.. ఆ వించిస్టర్ హౌస్ నిర్మాణం రెండూ నేటికీ మిస్టరీలే. అంతేగాదు మిస్టరీ హౌస్లో.. ప్రస్తుతం నాలుగు అంతస్తుల నిర్మాణం మిగిలింది. 500లకు పైగా గదులు, 2 వేలకు పైగా తలుపులు, 10 వేలకు పైగా కిటికీలు, 50కి పైగా బెడ్ రూమ్స్, 13 బాత్ రూమ్స్, ఆరు కిచెన్ రూమ్స్, చాలా బాల్కనీల సువిశాలమైన ఆ భవనం.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా ఔత్సాహికులను ఆకట్టుకుంటోంది. సంహిత నిమ్మన (చదవండి: ఆరుగంటలకు పైగా మంచులో కూరుకుపోయింది! బతికే ఛాన్స్ లేదు కానీ..) -
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం
-
ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిపై బుల్డోజర్యాక్షన్కి సిద్ధమయ్యారు అధికారులు. అక్రమంగా నిర్మించారనే కారణంతో.. అతని ఇంటికి కూల్చేయబోతున్నారు. జరిగింది ఇదే.. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన 12 ఏళ్ల.. సెప్టెంబర్ 25వ తేదీన ఉజ్జయినిలో లైంగిక దాడికి గురైంది. అనంతరం గాయాలతోనే ఆమె సాయం కోసం ఉజ్జయినిలో నడిరోడ్డుపై 8 కిలోమీటర్లు తిరిగింది. సుమారు 2 గంటల పాటు ఇంటింటికి వెళ్లి సాయం అర్థించింది. చివరకు ఓ ఆశ్రమం వద్ద స్పృహ తప్పిపడిపోయిన ఆమెను ఓ పూజారి పోలీసుల సాయంతో దవాఖానకు తరలించారు. ప్రధాన నిందితుడి అరెస్టు? లైంగికదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెతో మాట్లాడిన ఐదుగురిని ప్రశ్నించారు. ఓ ఆటోడ్రైవర్ సహా నలుగురిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో ఆటో డ్రైవర్ భరత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని కేసులో పోలీసుల కృషిని కొనియాడిన ఏఎస్పీ.. వారిపై కూడా చర్యలు తప్పవు.. -
ఆస్కార్ గెలిచిందని స్థలమిచ్చారు.. ఇప్పుడేమో కూల్చేస్తామంటూ!
2009లో ఆస్కార్ అవార్డ్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం స్మైల్ పింకీ. ఈ చిత్రంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన పింకీ జీవితం ఆధారంగా మెగాన్ మైలాన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన ఆరేళ్ల పాప పేరు పింకీ సోంకర్. ఆమె తన తండ్రితో కలిసి ఆస్కార్ అవార్డ్ను అందుకుంది. ఈ డాక్యుమెంటరీతో దేశ వ్యాప్తంగా పింకీ పేరు మారుమోగిపోయింది. అయితే పింకీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. వీరి కుటుంబం ఉత్తర్ప్రదేశ్లోని ఓ మారుమూల పల్లెలో నివసిస్తోంది. అయితే గతంలో ఆస్కార్ అవార్డ్ వచ్చినందుకు పింకీ కుటుంబానికి అధికారులు కొంత భూమిని ఇచ్చారు. ప్రస్తుతం అదే స్థలంలో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తోంది పింకీ ఫ్యామీలీ. అయితే తాజాగా ఈ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఇచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. యూపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా పింకీ ఫ్యామిలీకి కూడా ఇంటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు. మీర్జాపూర్ జిల్లా ధాబీ గ్రామంలో చాలామందికి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇంటిని నిర్మించామని చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఇంటిని కూల్చివేస్తామనడం యూపీతో పాటు దేశంలోనూ హాట్టాపిక్గా మారింది. 2008లో స్మైల్ పింకీ డాక్యుమెంటరీలో నటించినప్పుడు ఆ పాప వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం 20 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఇప్పుడు 12వ తరగతి చదువుతోంది. మా కుటుంబ అవసరాలు తీర్చేందుకు నాన్న పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని గతంలో పింకీ వెల్లడించింది. -
బాలికపై పాశవికం.. ఆర్మీ మేజర్ దంపతుల వికృత చేష్టలు
అసోం: ఓ బాలికపై ఆర్మీ మేజర్, ఆయన భార్య వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంట్లో పనిచేసే పదహారేళ్ల బాలికను పాశవికంగా వేధింపులకు గురిచేశారు. బాలిక శరీరంపై ఎక్కడ చూసిన కాల్చిన వాతలు కన్పించాయి. పళ్లు ఊడిపోయాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలు కనిపించాయి. ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. ఇంట్లో పనులు చేయిస్తూనే గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆహారం సరిగా ఇవ్వకుండా బాలికను బక్కచిక్కిపోయేలా చేశారు. ఆహారం కూడా చెత్తకుప్పలో నుంచి ఏరుకుని తినేలా చేసి పాశవిక ఆనందాన్ని పొందినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నగ్నంగా ఉంచి రక్తం వచ్చేలా కొట్టేవారని వెల్లడించింది. గదిలో బందించి క్రూరంగా హింసించేవారని బాధితురాలు పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ఆర్మీలో మేజర్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్నారు. అసోం నుంచి వెళ్లినప్పుడు ఓ బాలికను ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్లారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అసోంకి తిరిగివచ్చిన క్రమంలో బాలిక తన కుటుంబాన్ని కలిసింది. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల వయసులో ఉన్న తన కూతురును వృద్ధురాలిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం -
‘అసైన్డ్’ రైతులకు యాజమాన్య హక్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నిరుపేద రైతులకు వారి అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై వాటి యజమానులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ అసైన్డ్ భూముల(ప్రొబిషన్ ట్రాన్స్ఫర్) చట్టం–1977 సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 10 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు బదిలీ చేసుకునే అవకాశాన్నిచ్చింది. సోమవారం శాసన సభ మూడో రోజు సమావేశాల్లో మంత్రులు ప్రవేశపెట్టిన 10 బిల్లులతో పాటు బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ చేసిన తీర్మానానికీ సభ ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య రాష్ట్రంలోని విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రైవేటు వర్సిటీలు కూడా అంతర్జాతీయంగా టాప్ 100 వర్సిటీలతో కలిసి సంయుక్త సర్టిఫికేష¯న్ తప్పనిసరిగా అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు (స్థాపన, క్రమబద్ధీకరణ) చట్టం–2016ను సవరించింది. ఇందులో కొత్తగా ఏర్పడే వర్సిటీల్లో 65:35 నిష్పత్తిలో ప్రభుత్వ కోటా (35శాతం సీట్లు) కింద పేద విద్యార్థులకు చదువుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోని అధ్యాపక, మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి రాతపూర్వక పరీక్షలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (వర్సిటీల్లో నియామకాలకు అదనపు ఫంక్షన్లు) చట్టం–2023లో సవరణ చేసింది. నిరుపేదలకు భూ పంపిణీ రాష్ట్రంలో భూదాన్–గ్రామదాన్ బోర్డును ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసేలా చట్టాన్ని సవరించింది. భూదాన్ ఉద్యమకర్త వినోభా భావే, ఆయన నిర్దేశించిన వ్యక్తుల సమ్మతి ప్రకారమే భూదాన్ – గ్రామదాన్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ వినోభా భావే మరణించి నాలుగు దశాబ్దాలు గడుస్తోంది. ఆయన నిర్దేశించిన వ్యక్తులు ఎవరనేది స్పష్టత లేకపోవడంతో బోర్డు ఏర్పాటుకు అవాంతరాలేర్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వమే బోర్డును ఏర్పాటు చేసి భూదాన్ – గ్రామదాన్లోని భూమిని నిరుపేదలకు కేటాయించేలా చర్యలు చేపట్టేలా చట్టాన్ని సవరించింది. డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి జఫ్రీన్కు ఉద్యోగం రాష్ట్రానికి చెందిన డెఫ్ ఒలింపిక్ విజేత, అంతర్జాతీయ డెఫ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జఫ్రీన్కు వ్యవసాయ, సహకార శాఖలో సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్గా గ్రూప్–1 స్థాయి ఉద్యోగాన్ని కల్పిస్తూ ఏపీ పబ్లిక్ సర్వీసుల నియామకాలు క్రమద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన స్వరూపాన్ని హేతు బద్ధీకరించే చట్టం–1994ను సవరించింది. జఫ్రీన్ క్రీడారంగంలో దేశానికి అందించిన విశిష్ట సేవలను గౌరవిస్తూ ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. -
లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు
టీమిండియా మాజీ కెప్టెన్ కూల్, మహేంద్ర సింగ్ ధోనీకి తన స్వస్థలం రాంచీ నగరం నడిబొడ్డున విలాసవంతమైన ఫామ్హౌస్ ఉంది. సోషల్ మీడియాలో ధోనీ పెద్దగా యాక్టివ్గా ఉండపోయినప్పటికీ, ఆయన భార్య భార్య సాక్షి ధోని తరచుగా చేసే సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా ఈ ఇంటికి సంబంధించిన సంగతులు వెలుగు చూస్తూనే ఉంటాయి. కైలాసపతిగా పేరు పెట్టుకున్న ఫామ్హౌస్ 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. టాప్ మోస్ట్ సౌకర్యాలతోపాటు సహజమైన ప్రకృతి దృశ్యం, చక్కటి ఇంటీరియర్స్తో ఇదొక ఇంద్ర భవనమని ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. యువరాజ్ సింగ్ ముంబైలోని వోర్లీలోని లావిష్ సీ ఫేస్డ్ అపార్ల్మెంట్కు ఓనర్ మాజీ క్రికెటర్ యువరాజ్ 16,000 చదరపు అడుగుల స్థలంలో ఓంకార్ టవర్స్లోని 29వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్మెంట్ను 2013లో రూ. రూ. 64 కోట్లకు కొనుగోలు చేశాడు. గ్లాస్ పేటెడ్ బాల్కని ప్రధాన హైలైట్. ఇతనికి గోవాలో హాలిడే హోమ్గా ఉంది. సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడు, సచిన్ టెండూల్కర్ ముంబైలోని బాంద్రాలోని నాగరిక ప్రాంతంలో లగ్జరి బంగ్లా ఉంది. డోరబ్ విల్లా అని పిలిచే దీనిని 2007లో క్రికెటర్ దానిని కొనుగోలు చేశాడు. దీన్ని అత్యాధునిక సౌకర్యాలు, ఫీచర్లతో పునర్నిర్మాణం చేసి 2011లో మాత్రమే ఇందులోకి మారారు. మూడు అంతస్తుల్లో 6000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఇంటి విలువ రూ. 38 కోట్లు. రోహిత్ శర్మ ఇల్లు, 2015లోదీని విలువ రూ. 30 కోట్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని వర్లీలోని అహుజా టవర్స్లోని 29వ అంతస్తులో రోహిత్ శర్మకు సముద్రానికి ఎదురుగా భారీ అపార్ట్మెంట్ ఉంది. నాలుగు బెడ్రూమ్లు , ఆకట్టుకునే 13 అడుగుల ఎత్తైన సీలింగ్ ఉన్నాయి. వాక్-ఇన్ వార్డ్రోబ్, ఇతర అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. వాయిస్-కమాండ్ కంట్రోల్ ప్యానెల్ల ద్వారా లైటింగ్, గాడ్జెట్లు, ఉష్ణోగ్రత , ఎంటర్టైన్మెంట్ డివైస్లను రిమోట్గా నియంత్రించగల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హోమ్ ఆటోమేషన్ దీని ప్రత్యేకత. సునీల్ గవాస్కర్ లెజెండ్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ గోవాలో ఖరీదైన ఇంటిని 2017లో కొనుగోలు చేశారు. ఈ విలాసవంతమైన హాలిడే విల్లా 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. పురాతన ఫర్నిచర్తో చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకరమైన విల్లా ఇది. సురేష్ రైనా సురేష్ రైనా తన స్వస్థలమైన ఘజియాబాద్లో అందమైన ఇంటిని నిర్మించుకోవడం విశేషం. రాజ్ నగర్లోని పాపులర్ ఏరియాలో అన్ని ఆధునిక హంగులతో బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ మార్బుల్కి తోడు, చుట్టూ విలాసవంతమైన పచ్చదనంతో ఆకర్షణీయంగాఉంటుంది. ఇంకా ఓపెన్ యార్డ్లో సురేశ్ కోసం విశాలమైన చక్కటి జిమ్ ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్లోని రూ.18 కోట్ల విలువైన ఢిల్లీలోని 5 బీహెచ్కే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. సౌరవ్ గంగూలీ కోల్కతా యువరాజు సౌరవ్ గంగూలీకి కోల్కతా నగరం నడిబొడ్డున వంశపారంపర్యంగా వచ్చిన ఆస్థికి యజమాని దాదాపు 45 ఏళ్లుగా ఆస్తి బాగా కరిగిపోయినప్పటికీ కోల్కతాలోని అతిపెద్ద ప్రైవేట్ భవనాల్లో ఒదొకటి. దాదా ఎక్కువ సమయాన్ని ఇక్కడే గడుపుతారట. స్మృతి చిహ్నాలతో నిండిన దాదా రూం ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి. విశాలమైన గార్డెన్, క్రికెట్ పిచ్ , పోర్చ్తో కూడిన ఓపెన్ ఫ్రంట్ యార్డ్ ఉన్నాయి. రవీంద్ర జడేజా: గుజరాత్లోని జామ్నగర్లోని ఇంద్రభవనం లాంటి ఇల్లు రాజసంతో ఉట్టి పడుతూ ఉంటుంది. దీనివిలువ 10 కోట్లు ఉంటుందని అంచనా. పలు లగ్జరీ,రాయల్ ఫిట్టింగ్లతోపాటు, చెక్కతో అందంగా తీర్చిదిద్దిన జడేజా ఇంటి ప్రవేశ ద్వారం స్పెషల్ ఎట్రాక్షన్. హార్దిక్ పాండ్యా క్రికెటర్లు, అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇద్దరి కలిపి లగ్జరీ ఇల్లు ఉంది. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో ఉంటుంది. ఇందులో ప్రైవేట్ జిమ్, ప్రైవేట్ థియేటర్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.దీని విలువ రూ. 3.6 కోట్లు. విరాట్ కోహ్లీ స్వీట్ హోం హర్యానాలోని గురుగ్రాంలో విరాట్ కోహ్లీ స్వీట్ హోం. 10,000 చదరపు అడుగుల స్థలంలో ఉన్న దీన్ని విలువ రూ. 80 కోట్లు . -
ఆ ఇంట్లోకి అడుగుపెట్టడమే..తూలుతూ, ఊగిపోతారు!
ఈ ప్రపంచంలో అసాధారణమైన ప్రతీది మిస్టరీనే. మనం ఏ సపోర్ట్ లేకుండా ముందుకు వాలి నిలబడగలమా? బేస్లేకుండా ఏ వస్తువునైనా నిలబెట్టగలమా? ఎప్పుడైనా, ఎక్కడైనా ఇద్దరు వేరువేరు పొడవులు గల వ్యక్తుల ఎత్తులు సమాంతరంగా మారతాయా? ఈ వింతలన్నీ ఒకే చోట జరుగుతాయి. అమెరికాలోని ఓ మిస్టీరియస్ స్పాట్లో ఒక చీపురును నిలబెడితే.. ఏ సపోర్ట్ లేకుండా నిలబడుతుంది. కుర్చీ నేలకు ఆనకుండా.. గోడకు ఆనిస్తే.. అది నిలబడే ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ! యూఎస్లోని మిషిగన్, సెయింట్ ఇగ్నస్ ప్రాంతంలో.. ‘ది ఒరెగాన్ వోర్టెక్స్’ అనే పర్యాటక కేంద్రాన్ని సందర్శిస్తే ఈ వింతలన్నిటినీ చూడొచ్చు. ఇక్కడున్న ‘ద హౌస్ ఆఫ్ మిస్టరీ’ అనే ఇంట్లోకి వెళ్తుంటే కళ్లు చెదరడం పక్కా! తూలుతూ, ఊగుతూనే ఇందులో అడుగుపెడతారంతా. ఈ ఇల్లు ఓ పక్కకు వాలి ఉంటుంది. ఈ ఇంట్లో గోడ మీద నిలబడొచ్చు! ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన రాయిని ఎక్కితే ఇద్దరు వ్యక్తుల ఎత్తులు ఒకే విధంగా కనిపిస్తాయి. నిలబడిన స్థానాలను మార్చుకున్నప్పుడు ఆ తేడాను గమనించొచ్చు. ఇక్కడ నడిస్తే అడుగులన్నీ వాలుగానే పడుతాయి. ఈ విచిత్రమైన ప్రదేశాన్ని 1950లో కొందరు సర్వేయర్స్ కనుగొన్నారు. ఇక్కడ ఎలాంటి పరికరాలూ పనిచేయవు. సుమారు 300 అడుగుల డయామీటర్ సర్కిల్లో మాత్రమే ఈ వింత గోచరిస్తుంది. జీవితంలో ప్రత్యేకమైన అనుభూతి కోసం ఇక్కడికి కచ్చితంగా వెళ్లాల్సిందే అంటుంటారు పర్యాటకులు. ఈ థ్రిల్ని ఎంజాయ్ చెయ్యడానికి ఇక్కడికి ఎగబడుతుంటారు ఔత్సాహికులు. ఈ స్పాట్.. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుందట. అయితే ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) ఎందుకు సాధారణంగా లేదు? అనేదానికి కారణాన్ని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. దాంతో ఈ ప్రదేశం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సంహిత నిమ్మన (చదవండి: బ్రిటీష్ కాలం నాటిది, ప్రపంచంలోనే ఖరీధైన స్టాంపు.. ధర ఎంతంటే..) -
"విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..
ఇంతకుమునుపు విన్నాం ఓ సాధారణ కూలీ ఏకంగా విమానంలాంటి ఇల్లుని నిర్మించాడని. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చాడు. కానీ ఇక్కడొక వ్యక్తికి అసలు విమానాన్నే ఇల్లుగా మార్చుకుంటే అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కార్యరూపం ఇచ్చి మరీ తన సృజనాత్మకతకు జోడించి విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చూస్తే అక్కడ విమానం ఆగిందేమో అనుకునేలా ఆ ఇల్లు ఉంటుంది. లోపలకి చూస్తే ఇల్లులా ఉంటుంది. అద్భతం కదా! అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆ విమానం ఎక్కడది? తదితర సందేహాలు వచ్చేస్తున్నాయా!..ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రూస్ క్యాంపెబెల్కి చిన్నప్పటి నుంచి పాత వస్తువులను కొత్తవాటిగా మార్చడం అతని ప్రత్యేకత. సరుకులు రవాణా చేసే విమానమే ఇల్లుగా మార్చాలనే ఓ డ్రీమ్ ఉంది. హెయిర్ స్టయిలిస్ట్ జాన్ ఉస్సేరీ.. బోయింగ్ 727 విమానాన్ని కొనుగోలు చేసి ఇల్లుగా మార్చకుందని, ఆమె ఇల్లు అగ్రిప్రమాదంలో కాలిపోవడంతో ఇలా వినూత్నంగా ఆలోచించి రూపొందించదని విన్నాడు. అదే క్యాపెంబెల్కు విమానాన్ని ఇల్లుగా మార్చే ఆలోచనకు పురికొల్పింది. అందుకోసం క్యాపెంబెల్ ఒరెగాన్లోని హిల్స్బోరో అడవుల్లో 10 ఎకరాల భూమిని 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్ ఎయిర్వేస్ నుంచి బోయింగ్ 727 విమానాన్ని లక్ష డాలర్లకు(రూ. 85 లక్షలకు) కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానాన్ని ఒరెగాన్లోని అడవులకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు మాత్రం తడిసిమోపడయ్యాయి. అయిన వెనుకడుగు వేయలేదు క్యాంప్బెల్. చేయాలనుకుంది చేసే తీరాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు క్యాంప్బెల్. ఇక ఆ విమానాన్ని ఎన్నో ప్రయాసలు పడి ఆ అడవులకు చేర్చాక దాన్ని ఇల్లులా మర్చే పనికి ఉపక్రమించాడు. ఎలాగో విమానంలో సీట్లు టాయిలెట్లు ఉంటాయి కాబట్టి ఇక వాషింగ్ మిషన్, షింక్ వంటివి, కిచెన్కి కావల్సిన ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటే చాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగానే దాన్ని అత్యంత విలాసవంతమైన ఇల్లులా మార్చేశాడు. క్యాంపెబెల్ వంట చేసేందుకు మైక్రోవేవ్, టోస్టర్ని ఉపయోగిస్తాడు. అద్భుతమైన భారీ "ఎయిర్ప్లేన్ హోం" చూపురులను కట్టేపడేసేంత ఆకర్షణగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాంపెబెల్లా ప్లేన్హోం లాంటి లగ్జరీ ఇల్లును కట్టుకునేందుకు ట్రై చేయండి మరీ. (చదవండి: అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్లో ప్రజలు) -
ఇంటి తవ్వకాల్లో పురాతన బాక్సు.. తెరిచి చూడగానే..
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఒక పురాతన ఇంటి తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. గతంలో ఈ ఇంటిలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నరేష్ అగర్వాల్ ఉండేవారు. తాజాగా ఈ ఇంటి తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు లభించాయి. అయితే ఇవి ఎవరివనే విషయం ఇప్పటి వరకూ వెల్లడికాలేదు. కాగా ఇంటి తవ్వకాల్లో అస్థిపంజరాలు లభించాయని తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంటిని సీల్ చేశారు. అస్థిపంజరాలను పరిశీలనకు ల్యాబ్కు పంపారు. ఇంటిలో అస్థిపంజరాలు దొరికాయన్న విషయం స్థానికంగా దావానలంలా వ్యాపించింది. దీంతో అవి ఎవరివంటూ స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ నరేష్ అగర్వాల్ ఈ ఇంటిని అశోక్ అగర్వాల్ అనే వ్యక్తికి విక్రయించారు. తాజాగా అశోక్ అగర్వాల్ ఈ ఇంటిని పడగొట్టి నూతన భవనం నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇంటి కూల్చివేతలు జరుగుతుండగా, కూలీలకు ఒక పెద్ద పురాతన బాక్సు లభించింది. ఆ బాక్సుకు ఉన్న తాళం బద్దలుగొట్టి లోపల ఏముందో చూసి, హడలెత్తిపోయారు. బాక్సులోపల మానవ అస్థిపంజరాలు ఉండటంతో వారు భయపడిపోయారు. పనులను ఎక్కడివక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాక్సును పరిశోధనాశాలకు తరలించారు. అక్కడి నుంచి రిపోర్టు రాగానే దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అలాగే ఇంటి యజమానిని విచారిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షులపై స్మార్ట్ గాడ్జెట్ల నిషేధం ఎందుకు? -
ప్రపంచంలోనే అత్యంత కారు చౌక ఈ ఇల్లు! ఎందుకో తెలుసా!
ఇది ప్రపంచంలోనే కారుచౌక ధరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇల్లు. అలాగని ఇదేదో మారుమూల నిరుపేద దేశంలోనిది కాదు. అగ్రరాజ్యమైన అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలోని పాంటియాక్లో ఉందిది. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసుకుంటే, మరీ ఇంత చౌకా అని నోరెళ్లబెడతారు. దీని ధర కేవలం ఒక్క డాలరు మాత్రమే! అంటే, రూ.82.74 అన్నమాట. క్రిస్టఫర్ హ్యూబెల్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈ ఇంటిని ఒక డాలరు కనీస ధరకు అమ్మనున్నట్లు ప్రకటన విడుదల చేయడంతో ఇది వైరల్గా మారింది. ప్రకటన వెలువడిన తర్వాత చాలామంది ఈ ఇంటిని కొనుక్కోవడానికి ముందుకొస్తున్నారని హ్యూవెల్ తెలిపాడు. ఈ ఇంటిని 1956లో నిర్మించారు. ఇరవై ఏళ్ల కిందట ప్రస్తుత యజమాని ఈ ఇంటిని 10వేల డాలర్లకు (రూ.8.27 లక్షలు) కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుల పోటీ వల్ల ప్రస్తుతం ఈ ఇంటికి 40 వేల నుంచి 50 వేల డాలర్ల (రూ.33.09 లక్షల నుంచి రూ.41.36 లక్షల) వరకు ధర పలకవచ్చని హ్యూవెల్ అంచనా. (చదవండి: తోకతో రికార్డు కొట్టేసింది...) -
టిడ్కోలో కూడా చంద్రబాబు ‘డబుల్’ దోపిడీ!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా సాగిన దోపిడీ, ప్రజాధనం లూటీకి టిడ్కో ఇళ్లే నిలువెత్తు సాక్ష్యం. ఈ నిర్మాణాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వానిది.. ఇసుక ఉచితం.. నిర్మాణ అనుమతులకు ఎలాంటి ఫీజులూ లేవు. వసతులు, సదుపాయాలు కల్పించాలన్న నిబంధన కూడా టెండర్లలో లేదు. అలాంటప్పుడు మార్కెట్ రేటు కంటే టిడ్కో ఇళ్ల నిర్మాణ ధర తగ్గాల్సింది పోయి రెట్టింపు కావడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. నిరుపేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడటం విస్మయం కలిగిస్తోంది. ఎనిమిది కంపెనీలకు కాంట్రాక్టు.. పట్టణాల్లో సొంత ఇల్లు లేని సుమారు 5 లక్షల మందికి జీ ప్లస్ 3 విధానంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో టిడ్కో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ. విస్తీర్ణంలో కట్టే టిడ్కో ఇళ్లకు నాటి మార్కెట్ ధర కంటే రెండింతలు పైగా నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు. కంపెనీని బట్టి చ.అడుగుకు రూ.2,534.75 నుంచి రూ.2034.59 మధ్య నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. సగటున చ.అడుగు నిర్మాణ ధర రూ.2,203.45 చొప్పున టెండర్లు అప్పగించారు. అంటే బయట మార్కెట్ కంటే అదనంగా రూ.1203.45 పెంచారు. తొలి విడతలో 2,08,160 టిడ్కో యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించే కాంట్రాక్టును ఎనిమిది కంపెనీలకు కేటాయించారు. నిజానికి అప్పుడు పట్టణాల్లో ప్రైవేట్ అపార్ట్మెంట్లను చ.అడుగు రూ.1,000 లోపే నిర్మిస్తుండటం గమనార్హం. టిడ్కో ఇళ్లకు నాడు ఇసుక ఉచితం. సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా తక్కువే కాబట్టి వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపైంది. టిడ్కో ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో నిర్మిస్తున్నందున గరిష్టంగా చ.అడుగు నిర్మాణ వ్యయం రూ.1000కి మించదని ఈ విధానంలో ఎన్నో ఏళ్లుగా అపార్ట్మెంట్లు కడుతున్న కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. రివర్స్ టెండర్లతో ఖజానాకు ఆదా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు రివర్స్ టెండరింగ్ విధా నాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో 2020 ఏప్రిల్లో 54,056 టిడ్కో యూనిట్లకు చ.అ. నిర్మాణానికి సగటున రూ.1,655.31 చొప్పున టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు సర్కారు నిర్ణయించిన దానికంటే చ.అడుగుకు రూ.548.14 తక్కువ ధరకు టెండర్లు చేయడంతో ఖజానాకు దాదాపు రూ.321 కోట్లు ఆదా అయ్యాయి. పైగా ఈ నిర్మాణాలకు ఇసుక ఉచితం కాదు. సిమెంటు, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి, కూలీల రోజువారి వేతనాలు అన్నీ గత ప్రభుత్వ హయాం కంటే ఎక్కువే ఉన్నా ధర తగ్గించి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును చంద్రబాబు బృందం తమ అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నదనేందుకు ఇది నిదర్శనం. ఇంటికి రూ.2 వేలు.. ఫ్లాట్కి రూ.1,500 సాధారణంగా వ్యక్తిగత ఇల్లు, అపార్ట్మెంట్ నిర్మాణాల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంటికి అయిన ఖర్చులో అపార్ట్మెంట్కు సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు వ్యక్తిగత ఇల్లు నిర్మాణ ధర చ.అ రూ.2 వేలు ఉంటే అపార్ట్మెంట్లో చ.అ. రూ.1500 వరకు ఉంది. ఇవన్నీ ఎక్కువ మంది కోరుకునే ప్రాంతాల్లో చెబుతున్న సరాసరి ధరలు. అదే పట్టణాలకు దూరంగా నిర్మిస్తే గరిష్టంగా రూ.700 నుంచి రూ.900 మించదు. – వీవీఎన్ యుగంధర్, భవన నిర్మాణ సంస్థ యజమాని, కాకినాడ రూ.1,200 మించదు కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నా. టిడ్కో ఇళ్లు ప్రారంభించినప్పుడు కాకినాడలో అపార్ట్మెంట్లు కట్టా. స్థలంతో కలిపి అన్ని సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఫ్లాట్లను చ.అడుగు రూ.1,900 నుంచి రూ.2,000 మధ్యనే ఇచ్చాం. అలాంటిది ప్రభుత్వ స్థలంలో ఉచిత అనుమతులు, ఉచితంగా ఇసుక ఇస్తే చ.అడుగుకు గరిష్టంగా రూ.800 మాత్రమే అవుతుంది. టిడ్కో ఇళ్లకు అప్పుడు ఇన్ని వసతులు కూడా లేవు. అన్ని వసతులతో అద్భుతంగా కడితే చ.అ రూ.1,200కి మించే అవకాశం లేదు. – బసవా ప్రసాద్, బిల్డర్(కాకినాడ) అక్రమాలు జరిగినట్లే.. పట్టణంలో ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఫీజుల రూపంలో చ.అడుగుకు రూ.270 వరకు చెల్లించాలి. ఫౌండేషన్, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి అధికంగా ఖర్చవుతుంది. స్థలంతో కలిపి 2016–17లో విశాఖలో మేం కట్టిన అపార్ట్మెంట్లో చ.అ. రూ.2వేల నుంచి రూ.2200కే ఇచ్చాం. అన్ని వసతులు కల్పించాం. పేరున్న కంపెనీల వస్తువులనే వాడాం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అన్ని అనుమతులను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. నాడు ఇసుక కూడా ఉచితం. ఇంటీరియర్ సొబగులు లేవు. మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటి నిర్మాణాల్లో చ.అ రూ.700కి మించి ఖర్చుకాదు. ఆ ధర దాటిందంటే అక్రమాలు జరిగినట్టే. – బర్కత్ అలీ, బిల్డర్ (విశాఖపట్నం) ఇప్పుడూ అంత ధర లేదు ఎన్నో ఏళ్లుగా కాకినాడలో నిర్మాణాలు చేస్తున్నాం. అ పార్ట్మెంట్లో ఫ్లాట్ల ధర అన్ని సదుపాయాలు, స్థల ంతో కలిపి ఇప్పుడైతే చ.అ. రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉంది. విశాఖలో మరో రూ.2 వందలు ఎక్కువ ఉంది. నాలుగైదేళ్ల క్రితం అయితే ఇందులో సగం కూడా లేదు. ప్రభుత్వ ప్రాజెక్టులైతే ఫీజులు ఉండవు కాబట్టి రూ.వందల్లోనే ఉండాలి. – ఎం.గంగబాబు, బిల్డర్ (కాకినాడ) -
గిన్నిస్ బుక్లో చోటు సంపాదించిన మహిళా డైరెక్టర్.. ఆమె ఇంటిని చూశారా?
విజయనిర్మల ఈ పేరు తెలుగువారి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే అంతలా తన పేరు తెలుగు సినీ పరిశ్రమలో లిఖించుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై మెరిశారు. తన ఏడో ఏటనే మత్స్యరేఖ అనే సినిమా ద్వారా బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 42 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకోవడం విశేషం. కృష్ణతో వివాహం ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం కాగా.. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు. మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టమని.. అందుకే కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారని తెలిపింది. అంతకుముందే విజయ నిర్మలకు కేఎస్ మూర్తితో వివాహం జరిగింది. వీరికి నరేశ్ సంతానం. ఆమె జూన్ 27న 2019లో కన్నుమూశారు. కాగా.. గతేడాది నవంబర్లో కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఎటు చూసిన అవార్డులే అయితే హైదరాబాద్లోని ఆమె ఇంటిని మీరెప్పుడైనా చూశారా? హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో దాదాపు 12 ఏకరాల్లో ఆమె ఇంటిని నిర్మించారు. అప్పట్లోనే డైరెక్టర్గా తెలుగులో మంచి గుర్తింపు ఉండేది. అంతలా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఆమె ఇల్లు కూడా అవార్డులతో నిండిపోయింది. ఆమె అక్కడే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఉండేవారు. ఈ ఇంట్లో ప్రస్తుతం నరేశ్, ఆయన కుమారుడు నవీన్ ఉంటున్నారు. ఆమె ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అప్పట్లోనే గార్డెన్తో అన్ని రకాల వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించారు. అంతే కాకుండా ఆమెకు గిన్నిస్ అవార్డ్ వచ్చిన విషయాన్ని శిలాఫలకం తయారు చేయించారు. -
టాలీవుడ్ సీరియల్ నటి నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా!
మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి పరిచయం అక్కర్లేదు. మాటలు రాని మూగ అమ్మాయిగా నటించి అద్భుతహ అనిపించింది. ముంబయికి చెందిన ముద్దుగుమ్మ తెలుగులో సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. చల్తే చల్తే, ఎవడు తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార లాంటి చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా మౌనరాగంతో పాటు ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్లో నటించింది. అయితే మౌనరాగం ఫేమ్, సహనటుడు శివకుమార్ మరిహల్తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గతంలో వీరిద్దరు చాలా సార్లు హోమ్ టూర్స్ చేస్తూ జంటగా కనిపించారు. వారి మధ్య రిలేషన్ గురించి ఇప్పటికే చాలా వీడియోలు చేశారు. (ఇది చదవండి: ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ) అయితే వీరి పెళ్లి సంగతి పక్కనపెడితే ఆమె నటిస్తోన్న జానకి కలగనలేదు సీరియల్ను అర్ధాంతరంగా ఆపేశారు. కొంతకాలంగా ప్రేక్షకులకు తలభారంగా మారడంతో ఎలాగోలా 662 ఎపిసోడ్ వరకు అతి కష్టం మీద లాక్కొచ్చారు. కానీ చివరికీ ఇక నిర్మాతలు కూడా చేతులెత్తేయడంతో సీరియల్కు ఎండ్ కార్డ్ వేయక తప్పలేదు. తాజాగా జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ తన యూట్యాబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాము కొత్త ఇంటిలో చేరబోతున్నట్లు వీడియోలో వెల్లడించింది. నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆ వీడియోలో చూపించింది. గృహ ప్రవేశానికి వచ్చిన వారందరికీ ప్రియాంక జైన్, శివ కుమార్ కానుకలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా తమ సొంతింటి కల సాకారమైందని ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. ఇక ప్రియాంక జైన్, శివ కుమార్.. ‘మౌనరాగం’ సీరియల్ అప్పటి నుంచి రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!) -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti) -
కార్చిచ్చును కేర్ చేయని ఇల్లు.. వైరలవుతోన్న ఫోటో.. నిజమేనా?
హవాయి: అమెరికాలోని హవాయి దీవిలో ఇటీవల చెలరేగిన కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత వందేళ్లలో ఇది అత్యంత తీవ్రమైన ప్రకృతి విపత్తు అని స్థానికులు చెబుతున్నారు. కార్చిచ్చు ధాటికి వందలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ నగరమైన ‘లాహైనా’ బూడిద కుప్పగా మారిపోయింది. ఇక్కడ దాదాపు అన్ని ఇళ్లు మంటల్లో చిక్కుకొని నేలమట్టమయ్యాయి. మంటల తీవ్రతకు వంద మందికిపైగానే మరణించారు. కానీ, ఒక ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలిచి ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఇల్లు ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాహైనా సిటీలో రివర్ ఫ్రంట్ వీధిలో ఈ ఇల్లు ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇదొక్కటే ఎప్పటిలాగే మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది నిజమేనా? ఫొటోలో ఏదైనా మార్పులు చేశారా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై భవన యజమాని ట్రిస్ మిలికిన్ స్పందించారు. అది నిజమైన ఫొటో అని స్పష్టం చేశారు. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ చెక్క ఇంటిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేశామని, పాత పైకప్పును తొలగించి, లోహపు పైకప్పు వేయిచామని తెలిపారు. చుట్టుపక్కల గడ్డి లేకుండా బండలు పరిచామని వెల్లడించారు. ఈ జాగ్రత్తల వల్లే తమ ఇల్లు మంటల్లో చిక్కుకోలేదని పేర్కొన్నారు. కార్చిచ్చులో నిప్పు రవ్వలు తమ ఇంటిపై పడినా లోహపు పైకప్పు వల్ల ఎలాంటి నష్టం జరగలేదని ట్రిస్ మిలికిన్ వివరించారు. -
ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న నగరాలేంటో తెలుసా?
పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం గృహ రుణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. అత్యధిక వడ్డీ రేట్ల కారణంగా వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోతున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. అయినప్పటికీ దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్లో ఇళ్లను కొనుగోలు చేసే సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో పూణే, కోల్కతాలు ఉన్నాయి. ఇంటి ధరను, ఏడాదికి ఓ కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. వారి ఆదాయంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఎక్కడ ఇళ్లను కొనుగోలు చేసే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుందో వివరిస్తుంది. వాటిలో 23 శాతం నిష్పత్తితో పుణె, కోల్కతా 26 శాతం చొప్పున ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఈ సందర్భంగా ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్న 8 నగరాల జాబితాను విడుదల చేసింది. వాటిల్లో ముంబై, ఢిల్లీ - ఎన్సీఆర్, బెంగళూరు,చెన్నై, కోల్కతా, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్లు మోస్ట్ అఫార్డబుల్ ఇండెక్స్ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నాయి. నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఒక నగరంలో ఇల్లు కొనుగోలు స్థాయి 40 శాతం అంటే, ఆ నగరంలోని కుటుంబాలు ఆ యూనిట్ కోసం హౌసింగ్ లోన్ ఈఎంఐకి చెల్లించేందుకు వారి ఆదాయంలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందని సూచిస్తుంది. 50 శాతం కంటే ఎక్కువ ఈఎంఐ ఆదాయ నిష్పత్తి భరించలేనిదిగా పరిగణిస్తుంది. -
గృహంలో బాంబు పేలుడు.. భారీగా ఎగిసిన మంటలు.. వీడియో వైరల్..
న్యూయార్క్: అమెరికాలో దారుణం జరిగింది. పిట్స్బర్గ్లో బాంబు పెలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ఉంది. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. పిట్స్బర్గ్లో పగటిపూటనే బాంబు పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరిగింది. అదే సమయంలో పేలుడుకు పక్కనే ఉన్న నలుగురు యువకులు ఓ చిన్నారి మంటల్లో కాలి మృతి చెందారు. బాంబు పేలుడు సంభవించినప్పుడు ఇంటి శిథిలాలు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ఇంటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. Four Adults And A Child Have Passed Following A House Explosion In Pennsylvania. Three People From Surrounding Homes Were Rushed To Hospitals, One Of Which Is Currently In Critical Condition. 😳🤯 pic.twitter.com/LYyw5QZDDD — 🚘BrutalCams🎥 (@BrutalCams) August 15, 2023 పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్న మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. కాగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యా కేంద్ర బ్యాంకు సంచలనం: ఆర్థిక వేత్తల ఆందోళన -
ఇల్లులాంటి వాహనం!.. ఇదే ప్రపంచంలోని అతి పెద్ద కారు!
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కారు. చూడటానికి చిన్న సైజు కొండలా కనిపిస్తుంది. దీని ఎత్తు 21.6 అడుగులు. ఇది రెండంతస్తుల కారు. అమెరికన్ కార్ల తయారీ కంపెనీ ‘హమ్మర్’ దీనిని ప్రత్యేకంగా తయారు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాచకుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నాహ్యాన్ దీనిని 20 మిలియన్ డాలర్లకు (రూ.164.52 కోట్లు) చెల్లించి సొంతం చేసుకున్నారు. కార్ల పిచ్చిగల ఈ షేక్గారి దగ్గర ఇప్పటికే అత్యంత అరుదైన కార్లు ఉన్నాయి. తాజాగా ‘మాన్స్టర్ ట్రక్’గా పేరుపొందిన ఈ ‘హమ్మర్ హెచ్1 ఎక్స్3’ మోడల్ కారు కూడా ఆయన గ్యారేజీకి చేరింది. ఈ భారీ కారు నాలుగు డీజిల్ ఇంజన్లతో పనిచేస్తుంది. రోడ్లపై దీని గరిష్ఠవేగం గంటకు 32 కిలోమీటర్లు మాత్రమే! ఒక్కో అంతస్తులోను ఒక్కో బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ దీని ప్రత్యేకతలు. రెండో అంతస్తులో డ్రైవర్ సీటు ఉంటుంది. వుడెన్ ఫ్లోరింగ్తో దీని లోపలకు అడుగు పెడుతూనే ఒక ఇంట్లోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది. నిజానికి దీనిని వాహనం అనడం కంటే చక్రాలపై కదిలే ఇల్లు అనడమే సబబు. (చదవండి: మనుషులు వదిలేసిన దీవి) -
పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా..
పంద్రాగస్టు దగ్గరపడుతోంది. మువ్వన్నెల జెండాలకు డిమాండ్ పెరిగింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ నినాదాన్ని కొనసాగిస్తోంది. ఇందుకోసం పోస్టాఫీసులలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఎవరైనా సరే సమీపంలోని పోస్టాఫీసు నుంచి త్రివర్ణ పతాకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదేవిధంగా పోస్టాఫీసు నుంచి హోమ్ డెలివరీ సర్వీసును కూడా వినియోగించుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకల కోసం పోస్టల్ విభాగం తమ 1.60 లక్షల పోస్టాఫీసు కార్యాలయాల్లో జాతీయ జెండాలను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆగస్టు 13 నుంచి 15 వరకూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దేశ పౌరులెవరైనా ఈ- పోస్ట్ ఆఫీస్ ద్వారా జాతీయ పతాకాన్ని ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఎటువంటి డెలివరీ ఛార్జీలు ఉండవు. ఒక్కో జాతీయ పతాకం కోసం రూ. 25 చెల్లిస్తే సరిపోతుంది. బుకింగ్ ప్రాసెస్ ఇలా.. ఆన్లైన్ ఆర్డర్ చేసేందుకు ముందుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ epostoffice.gov.inకు వెళ్లాలి. అక్కడ ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’పై క్లిక్ చేయాలి. తరువాత త్రివర్ణ పతాకాల కొనుగోలును ఎంచుకోవాలి. దీనిలో ఎవరైనా అత్యధికంగా ఐదు జెండాల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం బై నౌపై క్లిక్ చేయాలి. తరువాత మన మొబైల్ నంబర్ ఇవ్వాలి. మన మొబైల్కు ఓటీపీ రాగానే దాని సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది. చిరునామా వివరాలు అందించాక ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయ్యాక త్రివర్ణ పతాకం మీ ఇంటికి చేరుతుంది. ఇది కూడా చదవండి: స్వీట్ పాప్కార్న్ అడిగితే చేదు కాకర.. స్విగ్గీ ఎందుకలా చేసిందంటే.. .@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the… — All India Radio News (@airnewsalerts) August 1, 2023 -
స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం
Bloomsbury US CEO Adrienne Vaughan: హ్యారీ పోటర్ బ్లూమ్స్బరీ అమెరికా పబ్లిషింగ్ హౌస్ సీఈవో అడ్రియన్ వాఘన్ (45) దుర్మరణం విషాదాన్ని నింపింది. ఇటలీలోని అమాల్ఫీ తీరంలో జరిగిన ఘోర బోటింగ్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై బ్లూమ్స్బరీ అమెరికా తీవ్ర విచారాన్ని ప్రకటించింది. అడ్రియన్ అకాల మరణం తమకు తీరని లోటని వ్యాఖానించింది. ఆమె నేతృత్వంలోనే అమెరికా తమకు అతిపెద్ద మార్కెట్గా ఎదిగిందని తెలిపింది. సీఎన్ఎన్ ప్రకారం తన భర్త,ఇద్దరు పిల్లలతో విహార యాత్రంలోఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. అద్దెకు తీసుకున్న స్పీడ్బోట్లో ప్రయాణిస్తుండగా, 80 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న పెద్ద సెయిలింగ్ బోట్ను ఢీకొట్టింది. దీంతో వాఘన్ నీటిలో పడిపోవడంతో, తీవ్ర గాయాల పాలయ్యారు. అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మరణించినట్లు ప్రకటించారు.వాఘన్ భర్త మైక్ వైట్కు స్వల్పగాయాలయ్యాయి.వారి ఇద్దరు పిల్లలు లియన్నా (14) మేసన్(11) కు ఎలాంటి గాయాలు కానప్పటికీ, తల్లి మరణంవారిని తీవ్రంగా కలిచి వేసింది. మరోవైపు బోట్ స్కిప్పర్ ఎలియో పెర్సికోపై వాఘన్ భర్త తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మద్యం సేవించడంతోపాటు, స్మార్ట్ఫోన్ వాడుతూనే ఉన్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సలెర్నోలోని ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు దర్యాప్తు ప్రారంభించారు. అటు అనుమానితుడుమద్యం సేవించి, కొకైన్ వాడినట్లు టాక్సికాలజీ పరీక్షలు నిర్ధారించాయి. కాగా 2021లో బ్లూమ్స్బరీ అమెరికాకు హెడ్గా నిమిమితులైన వాఘన్ 2020లో అమెరికాలో హ్యారీ పాటర్ పుస్తకాలను ప్రచురించే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీవోవోగా చేరారు. ఫైనాన్స్లో ఎంబీఏతోపాటు NYU స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో గ్రాడ్యుయేట్ అయిన వాఘన్ గతంలో డిస్నీ పబ్లిషింగ్ గ్రూప్, ఆక్స్ఫర్డ్ ఫ్రీ ప్రెస్కి ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. వాఘన్ నెట్వర్త్ దాదాపు 1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. -
వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్నే ఇల్లుగా..!
ఇంగ్లండ్కు చెందిన క్రిష్, మిషెల్ అనే దంపతులు పాతబడిన అంబులెన్స్ను కొనుక్కుని, దాన్ని చక్కని ఇల్లులా మార్చేశారు. ఇప్పుడు వారు ఈ అంబులెన్స్ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. యూట్యూబ్ వీడియోలు చూసి, ఈ దంపతులు అంబులెన్స్ను ఇల్లులా తీర్చిదిద్దుకున్నారు. సామాన్యమైన ఇంటికి కావలసిన వసతులన్నింటినీ ఇందులో ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంబులెన్స్ 2003 నాటి ‘తాన్యా’ ఈ–450 వాహనం. ఇందులో మంచం, స్టవ్, కిచెన్ కేబినెట్ సహా అవసరమైన సామగ్రిని పొందికగా అమర్చుకున్నారు. స్నానానికి వీలుగా ఫోల్డబుల్ వాటర్ టబ్ను కూడా తయారు చేసుకున్నారు. పని పూర్తయ్యాక ఈ టబ్ను మడతపెట్టి, దాచేసుకోవచ్చు. వీరు ఈ అంబులెన్స్ను అగ్నిమాపక శాఖ నుంచి 4500 పౌండ్లకు (రూ.4.72 లక్షలు) కొనుగోలు చేశారు. కోరుకున్న వసతులతో దీనిని ఇల్లులా మార్చుకోవడానికి మరో 8000 పౌండ్లు (రూ.8.40 లక్షలు) ఖర్చు చేశారు. (చదవండి: బస్సు డ్రైవర్ కూతురుకి లండన్లో ఉద్యోగం) -
భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస
వరంగల్ డెస్క్: ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ములుగు జిల్లా కొండాయి, దొడ్ల, జయశంకర్భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, వరంగల్ నగరంలోని ముంపుకాలనీల వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. వరధ ఉధృతికి ఇంట్లోని భూమి పట్టాదార్పాస్పుస్తకాలు, పిల్లల విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు ఇలా అన్ని రకాల విలువైన పత్రాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల తడిసి పనికి రాకుండాపోయాయి. ఈ క్రమంలో తమకు కనీసం ధ్రువీకరణపత్రం కూడా లేకుండాపోయిందని పలువురు వరద బాధితులు అంటుండగా, పై చదువులకు ఎలా వెళ్లేది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటో వరంగల్ నగరంలోని బీఆర్నగర్.వరద బాధితులు ఇలా ఇంట్లో తడిసిన అన్ని పత్రాలను మంచంపై పరిచి ఆరబెట్టారు. ఇటీవల వరదలకు ఈ కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో కాలనీవాసులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గాక ఇంటికి చేరుకున్న వారికి ఏ వస్తువు చూసినా బురదతో నిండి ఉంది. ఇంట్లోని ధ్రువీకరణ పత్రాలు, చెక్బుక్లు, పాస్బుక్లు, ఇంటిపత్రాలుఅన్నీ తడిసిపోయాయి. సర్వే చేస్తున్నాం మోరంచపల్లి గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే ఆధారంగా పాస్పుస్తకాలు, ఆధార్ కార్డులు వచ్చేలా కృషి చేస్తాం. తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తాం.. కొండాయి, మోరంచపల్లి, వరంగల్లో.. గత 27వ తేదీన వరద బీభత్సానికి కొండాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రజలు వణికిపోయారు. ఇళ్లను వదిలి ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇళ్లల్లో దాచుకున్న ధ్రువీకరణపత్రాలు, చెక్బుక్లు, పాస్బుక్లు, ఇంటిపత్రాలు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇక వరంగల్ నగర పరిధిలో వరద ముంపునకు గురైన బీఆర్నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, గోపాల్పూర్, నయీంనగర్ ప్రాంతాల్లోని వారిదీ ఇదే పరిస్థితి. అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి ట్రంకు బాక్సులో పెట్టుకున్న పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లన్నీ కొట్టుకుపోయాయి. నా పై చదువుల పరిస్థితి ఏమిటీ? ఇంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. నా సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోవాలి. -ప్రవీణ్కుమార్, దొడ్ల, ములుగు జిల్లా -
ఇళ్ల కొనుగోలు దారులకు ఆర్బీఐ భారీ షాక్? వచ్చే ఏడాది వరకు తప్పదంట
సొంతింటి కలల్ని నిజం చేసుకోవాలనుకునేవారికి, లేదంటే ఇప్పటికే ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ ( equated monthly interest) చెల్లించే వారికి ఆర్బీఐ భారీ షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రుణ గ్రస్తులు హోంలోన్లపై కడుతున్న ఈఎంఐలు వచ్చే ఏడాది మార్చి వరకు తగ్గవని సమాచారం. అప్పటి వరకు రెపోరేటు (ప్రస్తుతం 6.50 శాతం) అలాగే కొనసాగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఎకనమిస్ట్ సర్వే నిర్వహించింది. స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఎక్కువ వడ్డీ రేట్లు మార్చి 2024వరకు కొనసాగనున్నాయని సర్వేలో ఆర్ధిక వేత్తలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నాలుగు నెలల తగ్గుదల ధోరణి కనిపించినప్పటికీ పెరిగిన ఆహార ధరల కారణంగా ద్రవ్యోల్బణం గత నెలలో 4.81 శాతానికి పెరిగింది. కొనసాగనున్న రెపోరేటు జూన్ సర్వేలో,ఆర్బీఐ మార్చి 2024 చివరి నాటికి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. కానీ ఈ అంచనాలు తలకిందులయ్యాయి. మొదటి రేటు తగ్గింపు 2024 రెండవ త్రైమాసికం వరకు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇళ్ల కొనుగోలుదారులకు ఇబ్బందే హోం లోన్ ఈఎంఐ చెల్లిస్తుంటే 2024 వరకు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. ఆర్బీఐ ప్రస్తుత రెపో రేటును కొనసాగిస్తున్నంత కాలం, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదు, ఫలితంగా రుణగ్రహీతలకు ఎంఎంఐల భారం తగ్గదు. రెపో రేట్ల తగ్గింపు ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఉండవు. కాబట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వడ్డీ రేట్లు అలాగే కొనసాగుతాయని భావిస్తున్నా’ అని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ చీఫ్ ఎకనామిస్ట్ సుమన్ చౌధరి అన్నారు. -
గుహనే ఇల్లుగా మార్చేసి..ఆ ఇంటితోనే..
గుహను ఇల్లుగా మార్చేసి, ఆ ఇంటితోనే స్వయం ఉపాధి పొందుతున్నాడు గ్రాంట్ జాన్సన్ అనే ఈ అమెరికన్ పెద్దమనిషి. సరిగా చదువుకోక పోవడంతో పదిహేడేళ్ల వయసులోనే ఇతన్ని బడి నుంచి సాగనంపేశారు. బడి నుంచి బయటపడ్డాక పొట్టపోసుకోవడానికి గని కార్మికుడుగా కుదురుకున్నాడు. గనుల్లో పనిచేసి, కూడబెట్టుకున్న సొమ్ముతో 1995లో 25 వేల డాలర్లు (ర.15.60 లక్షలు) పెట్టి యూటా శివార్లలో 40 ఎకరాల బీడు భమిని కొన్నాడు. ఈ భూమి కొన్నప్పుడు అతడి మిత్రులంతా పనికిరాని భమి కొని వెర్రిబాగుల పని చేశాడంటూ అతడిని తిట్టిపోశారు. గ్రాంట్ వాళ్ల మాటలను పట్టించుకోలేదు. తాను కొన్న భూమిలోనే ఉన్న కొండ గుహను ఏళ్ల తరబడి శ్రమించి 5,700 చదరపు అడుగుల విస్తీర్ణం గల చూడచక్కని ఇంటిగా తయారు చేశాడు. అధునాతనమైన ఇంటికి కావలసిన హంగులన్నింటినీ అందులో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఇంటిని పర్యాటకులకు అద్దెకు ఇస్త, వచ్చే ఆదాయంతో నిక్షేపంగా కాలక్షేపం చేస్తున్నాడు. ఇందులోని ఒక గదిలో బస చేసేందుకు ఒక రాత్రికి 350 డాలర్లు (ర.28,741), ఇల్లు మొత్తంగా అద్దెకు కావాలనుకుంటే ఒక రాత్రికి వెయ్యి డాలర్లు (ర.82,119) చెల్లించాల్సి ఉంటుంది. గ్రాంట్ ఈ భూమిని కొన్నప్పుడు ఇక్కడ ఉండే గుహ ప్రవేశమార్గం చాలా చిన్నగా ఉండేది. డైనమైట్లతో దాన్ని పేల్చి, మార్గాన్ని విశాలం చేశాడు. లోపలి గోడలను స్వయంగా తన చేతులతోనే ఉలి, సుత్తి వంటి పరికరాలను పట్టుకుని నున్నగా చెక్కాడు. నేల మీద మొజాయిక్ ఫ్లోరింగ్ చేయించాడు. నీటి సరఫరాకు పైపులు వేయించాడు. పైఅంతస్తుకు, కింది అంతస్తుకు రాకపోకలు జరుపుకోవడానికి మెట్లు ఏర్పాటు చేశాడు. విద్యుత్తు, టెలిఫోన్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకున్నాడు. సలక్షణమైన ఇంటిగా మార్చుకున్నాక, ఈ గుహనే అద్దెకిస్త స్వయం ఉపాధి పొందుతున్నాడు. (చదవండి: ఆకాశమే హద్దుగా.. స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి..) -
గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు
మెదక్ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్ సర్వర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో యాస్మిన్ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు. యాస్మిన్ను హైదరా బాద్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్ తల్లి చాంద్ సుల్తానా మెదక్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. -
మారుతి జిమ్నీని సింగిల్ బెడ్తో అలా మార్చేసిన జంట; వైరల్ వీడియో
మారుతి సుజుకి చెందిన పాపులర్ వెహికల్ 5-డోర్ మారుతీ జిమ్నీని ఒక క్యాంపింగ్ బెడ్గా మార్చేసిన వైనం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. యూట్యూబర్స్ జంట మారుతి సుజుకి జిమ్నీని సౌకర్యవంతమైన క్యాంపింగ్ సెటప్గా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను Xreme Moto అడ్వెంచర్ షేర్ చేసింది. ఈ వీడియోలో దశల వారీగా మొత్తం ప్రక్రియను పొందుపర్చింది ఈ జంట. ఇది నెటిజనులను ఆశ్చర్య పరుస్తోంది. (బెదిరింపులు: అంబానీ కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారు, ప్రత్యేకత తెలిస్తే..!) యూట్యూబర్ , అతని భార్య తమ మారుతి సుజుకి జిమ్నీ కారు లోపలి భాగాన్ని పరుపుకు అనుగుణంగా మార్చి, హాయిగా క్యాంపింగ్ సెటప్ను సృష్టించారు. ఇందుకోసం ఆగానే కష్టపడ్డారు. కారు వెనుక తలుపు తెరిచి కవర్ను తీసి వేయడం, ఇంటి నుండి 6-అంగుళాల సింగిల్ బెడ్ కోసం మధ్య సీటును తీసివేయడం ప్రారంభిస్తారు. ప్రారంభంలో, వారు మధ్యలో నుండి నాలుగు బోల్ట్లను తీసివేయడానికి ప్రయత్నించి, విఫలమై, మరుసటి రోజుకు వాయిదా వేయడం, మరుసటి రోజు మధ్య వరుస సీట్లలోని పైభాగాన్ని విప్పడంతో వారి పని ఈజీ అవుతుంది. (శాంసంగ్ లాంచ్ ఈవెంట్: అంచనాలు మామూలుగా లేవుగా!) మారుతి సుజుకి జిమ్నీ వంటి కాంపాక్ట్ వాహనంలో కూడా క్యాంపింగ్ సెట్ను అందంగా మర్చుకోవడం క్రియేటివ్గా నిలిచింది. సెటప్ పూర్తయిన తర్వాత, దంపతులు తమ కొత్త క్యాంపింగ్ ఏర్పాటును తమ తల్లికి ఆసక్తిగా చూపించడంతో వ్యక్తిగతంగా ఎనలేని సంతోషాన్ని, అటు కుటుంబ ఆమోదాన్ని కూడా పొందింది. (ఐటీ రిటర్న్ గడువులోగా ఫైల్ చేయండి..లేదంటే?) -
మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో బీఎస్ఎఫ్ జవాన్లు అల్లరి మూకలతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో సైన్యంలో పనిచేసి అమరుడైన సైనికుని కుటుంబాన్ని ఆందోళనకారుల నుంచి రక్షించారు. అమరవీరుని కుటుంబం నివసిస్తున్న మఫౌ గ్రామం ఆపదలో ఉందని గమనించి అక్కడకు చేరుకున్నారు. దేశానికి కాపాలా కాసిన అమరుని ఇంటికి జవాన్లు ప్రస్తుతం రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని పిల్లలు, వృద్ధులు, స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మణిపుర్లోని మఫౌ గ్రామానికి చెందిన పాయోటిన్సాట్ గైట్ బీఎస్ఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 2020 డిసెంబరు 1న కశ్మీర్లోని ఎల్వోసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడుతూ గైట్ అమరుడయ్యాడు. ఆయన తెగువకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గైట్ స్వగ్రామం ఆపదలో ఉందని గుర్తించి బీఎస్ఎఫ్ జవాన్లు .. అల్లరి మూకలను పారదోలారు. ఆ గ్రామాన్ని రక్షించారు. ఇదీ చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్ సురక్షిత ప్రాంతంలో ఉన్న గైట్ తండ్రి టోంగ్జాంగ్ గైట్.. బీఎస్ఎఫ్ జవాన్లు తమను, తమ గ్రామాన్ని కాపాడిన తీరును వివరించారు. ' దాదాపు 1000 మంది అల్లరిమూకలు మా గ్రామంపై దాడి చేశారు. దీనిని పసిగట్టిన మేము గ్రామంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించాము. దాడిని పసిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. మా గ్రామానికి అండగా నిలబడ్డారు. కానీ అప్పటికే 50 శాతం ఇళ్లు కాలిబూడిదయ్యాయి.' అని తెలిపారు. 'అమరవీరుని కుటుంబం అయినందున రెండేళ్ల క్రితం మణిపూర్ సీఎం మమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ మేము ఇప్పుడు ఈ దాడిలో బాధితులుగా మిగిలిపోయాము. మా ఇంటిని విడిచి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది.' అంటూ టోంగ్జాంగ్ గైట్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కోడలు హోనిల్హింగ్ గైట్ కూతుళ్ల చదువుల కోసం మేఘాలయాలో ఉన్నట్లు చెప్పాడు. తనకు ఇద్దరు 6, 3 ఏళ్ల వయస్సు కలిగిన మనవరాళ్లు ఉన్నట్లు చెప్పారు. మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. తమ కోడలు, మనవరాళ్లతో ఇక్కడే ఉండాలని ఉందని తెలిపారు. ఇదీ చదవండి: ఒకపక్క మణిపూర్ అల్లకల్లోలంగా ఉంటే.. 718 మంది వలస వచ్చారు.. కారణం ఏమై ఉంటుంది? -
పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్ జీవితాంతం రుణపడి ఉంటా లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. :::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
సొంతింటి కల నెరవేర్చారు...మళ్లీ జగనన్నే సీఎం కావాలి
-
400 కిలోల టమాటాలు చోరీ
పుణే: టమాటాల ధర ఆకాశాన్నంటుతున్న వేళ ఈ కూరగాయ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ రైతు ఇంట్లో ఉంచిన నాలుగు క్వింటాళ్ల టమాటాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఈ మేరకు షిరూర్ తహశీల్కు చెందిన రైతు అరుణ్ ధోమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తన పొలంలో పండించిన 400 కిలోల టమాటాలను కోసి 20 క్రేట్లలో ఇంటికి తీసుకువచ్చాడు. తెల్లారాక చూస్తే అవి కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం టమాటా కిలో ధర రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. ఇటీవలి పుణేకే చెందిన ఓ రైతు తను పండించిన 18 వేల క్రేట్ల టమాటాలను రూ.3 కోట్లకు అమ్మి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. -
కూల్చేయండి..! లేదంటే మేమే కూల్చేస్తాం..!!
కరీంనగర్: ‘ఇందు మూలంగా మీకు తెలియచేయునది ఏమనగా.. మీ భవనం శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నదని గుర్తించడమైనది. కావున ఇంటిలో నివసించే వాళ్లు తక్షణమే ఖాళీ చేసి.. ఇల్లును కూల్చుకోమని.. మరమ్మతులు చేసుకోమని హెచ్చరించనైనది. లేని యెడల సెక్షన్ 182, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కూల్చివేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.’ ఇది వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లకు నగరపాలకసంస్థ అంటిస్తున్న హెచ్చరిక నోటీ సు. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని శిథిలావస్థలో (కూలడానికి సిద్ధంగా) ఉన్న ఇళ్లపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పురాతన నిర్మాణాలతో ప్రమాదాలు పొంచి ఉన్నందున ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసుకోవాలని లేదంటే మరమ్మతులు చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తోంది. 57 ఇళ్లకు హెచ్చరిక నోటీసు వర్షాలతో కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను మూడురోజులుగా గుర్తించే పనిలో నగరపాలకసంస్థ అధికా రులు బిజీగా ఉన్నారు. గురువారం నాటికి ఇలాంటి పడిపోయే 57 ఇళ్లను టౌన్ప్లానింగ్ అధికారులు గుర్తించారు. యజమానులకు నోటీసులు జారీ చేశా రు. కార్ఖానగడ్డ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలికంగా బసకోసం తరలాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వర్షాలకు కూలే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఇండ్లను స్వచ్ఛందంగా కూల్చుకోవాలని, మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. స్పెషల్ టీమ్స్ ఆన్ డ్యూటీ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన నగరపాలకసంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం తెలిసిందే. ఎనిమిది గంటలకు ఒక బృందం చొప్పున మూడు విడుతలుగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. నగరంలో ఎక్కడ వర్షపు నీళ్లు నిలిచినా, డ్రైనేజీలు పూడుకుపోయినా, చెట్లు విరిగి పడిపోయినా ఈబృందాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి. కట్టరాంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో విరిగిన చెట్లను రెస్క్యూ టీం గురువారం తొలగించింది. నగరంలోని ప్రధాన రహదారుల నుంచి డ్రైనేజీలకు వెళ్లే హోల్స్ మట్టి, చెత్తతో మూసుకుపోగా సిబ్బంది తొలగించారు. రోడ్లు, పల్లపు ప్రాంతాల్లో నిలుస్తున్న నీళ్లను డ్రైనేజీలకు వెళ్లేలా మళ్లిస్తున్నారు. ప్రజల రక్షణే ముఖ్యం.. వర్షాలు కురుస్తున్న సమయంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు తొలగించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి గృహ యజమానులకు నచ్చచెప్పి తొలగిస్తాం. పురాతన ఇండ్ల సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలి. రెస్క్యూ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి. – మేయర్ యాదగిరి సునీల్రావు