Social Media
-
తమిళనాడులో బాబు స్పీచ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్
-
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు. -
Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!
-
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మద్యం మత్తులో యువకుల ఘర్షణ
గుంటూరు: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని కంకరగుంట బ్రిడ్జి వద్ద ఓ వైన్ షాపు భవనం పైనుంచి వేలాడదీసి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పై దాడి చేసిన ఘటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రసన్న సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకులవారితోట ప్రాంతానికి చెందిన దేవరకొండ స్వరూప్, శ్రీనివాసరావు తోట ప్రాంతానికి చెందిన దేవరకొండ శశికుమార్ సోదరులు. వీరు మద్యం తాగేందుకు కొమ్మినేని రత్తయ్యకు చెందిన నిర్మల్ వైన్ షాపు వద్దకు వచ్చారు. మద్యం తాగుతున్న సమయంలో అదే వైన్షాపులో ఉన్న మరో వ్యక్తితో వాగ్వవాదం చోటుచేసుకుంది. దీంతో సోదరులిద్దరు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఆ వ్యక్తిని వైన్ షాపు భవనం పై నుంచి కిందకు వేలాడ తీసి తీవ్రంగా దాడి చేశారు. ఇది గమనించి వాహనదారులు సెల్ఫోన్లో వీడియాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇద్దరు సోదరులను వైన్షాపు నిర్వాహకులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలి చేరుకుని ఇద్దరు సోదరులను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. బల్లి రాజ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఇద్దరు సోదరుల దాడికి భయపడి పారిపోవడంతో గాయపడిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని విచారించి ఇద్దరు సోదరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ వెల్లడించారు. -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
అనంతపురం జిల్లా: హనీ ట్రాప్ దందా దుమారం రేపుతోంది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఈ నయా దందాపై ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’ అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉమ్మడి జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బాధితులు నేరుగా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అనంతపురం రూరల్, నాలుగో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు గ్యాంగ్ లీడరు లేడీబాస్తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులందరిపైనా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న దందా.. వలపు వయ్యారాలతో బాధితులకు వల వేసి, వీడియో కాల్స్, వ్యక్తిగత సంభాషణలను ఆయుధాలుగా మార్చుకుని రూ.లక్షలు దోచుకుంటున్న ఈ ముఠా కార్యకలాపాలు విస్తృతంగా సాగినట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా ‘లేడీ డాన్’ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్టు బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందట తిరుపతిలో ఒక ఫారెస్ట్ అధికారిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేసిన ఘటన కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తిరుపతిలో కేసు కూడా నమోదైంది. అలాగే కూడేరు మండలానికి చెందిన బాధితుడు ఈ ముఠా వలలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడం, అలాగే ముఠాలో డబ్బుల పంపకాల విషయంలో విభేదాలు రావడం వల్ల ఈ దందా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న రిటైర్డ్ ఉద్యోగి.. అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్లకు పైబడి ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనిమీద రుద్రంపేట వద్దనున్న డీమార్ట్ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ (అప్పటికే పక్కా ప్రణాళిక రచించారు) తారసపడి.. సదరు రిటైర్డ్ ఉద్యోగి చేస్తున్న పనికి సంబంధించి తమకు అవసరం ఉందని, ఇంటివద్దకు రావాలని చెప్పి ఫోన్ నంబరు తీసుకెళ్లింది. మరుసటి రోజు ఫోన్ చేసి రిటైర్డ్ ఉద్యోగిని రుద్రంపేట శివారులోని ప్రాంతానికి పిలిపించింది. అక్కడ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది. ‘రండి సార్.. పర్వాలేదు’ అంటూ వలపు మాటలతో రెచ్చగొట్టింది. ఈ పరిణామంతో కంగుతిన్న బాధితుడు ‘అమ్మా...ఏంటిది’ అంటుండగానే అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పాత్రధారులు రంగప్రవేశం చేశారు. రిటైర్డ్ ఉద్యోగిని న్యూడ్(నగ్నం)గా నిలబెట్టి వీడియోలు, ఫొటోల్లో బంధించారు. ఆయనతో పాటు ఉన్న మహిళపై తీవ్రస్థాయిలో చిందులేశారు. ‘నువ్వు అవసరం లేదుపో... మా కుటుంబ మర్యాద మంటగలిపావు’ అని అనడంతో ఆ వృద్ధుడికి ఏమి జరుగుతోందో తెలీక బిక్కమొహం వేశాడు. ‘నీ విషయం కూడా బయటపెడతా...ఎలా మా ఇంటికి వస్తావు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా. మీ కుటుంబ సభ్యులందరికీ ఫొటోలు, వీడియోలు పంపుతా. సోషల్ మీడియాలోనూ పెడతాన’ని బెదిరించారు. దీంతో ఆయన లబోదిబోమంటూ తనకు ఏపాపమూ తెలీదని చెప్పినా వినలేదు. చివరగా రూ.10 లక్షలు ఇస్తే సమస్య ఇంతటితో ఆపేస్తామని, లేదంటే నీ బండారమంతా బయటపెడతామని చెప్పడంతో తన ఇబ్బందులన్నీ చెప్పుకుని చివరకు రూ.3 లక్షలు సమరి్పంచుకున్నాడు. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ధనవంతులను ఈ ముఠా లక్ష్యం చేసుకుంది. -
సడెన్ షాక్ అంటే ఇదేనేమో.. అర్ధరాత్రి వింత అనుభవం..
Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.సదరు యువతి అలర్ట్గా లేకపోవడం.. సడెన్గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..
ఛండీగఢ్: హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై గన్ గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి జేజేపీతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధాంత్ జైన్ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా.. తనపై పిస్టల్ గురిపెట్టినట్టు ఆరోపించారు.BJP ka Nayab HaryanaPolice ke besh main Gunde.....@PMOIndia @NayabSainiBJP pic.twitter.com/uVCBOFyyVf— Dushyant Chautala (@Dchautala) April 17, 2026దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఈ వీడియోలో ఒక పోలీసు వాహనం తన కారును అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. మరో వీడియోలో, చౌతాలా తన వాహనం దిగి పోలీసులను నిలదీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత, కదులుతున్న ఆ వాహనాన్ని ఆపడానికి ఆయన అందులోకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, కానీ ఆ వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అనంతరం, ఈ వీడియోను చౌతాలా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్బంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నాయబ్ హర్యానా పోలీసులతో దాడి చేస్తున్నాడు. రక్షకుడే వేటగాడిగా మారినప్పుడు, వ్యవస్థను ప్రశ్నించడం అనివార్యమవుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఘటనను పోలీసుల రౌడీయిజంగా అభివర్ణించారు. ఇదే బీజేపీ వారి నయా హర్యానా.. పోలీసు యూనిఫాంలో ఉన్న రౌడీలు అని వ్యాఖ్యానించారు.जब रक्षक ही भक्षक बन जाए, तो व्यवस्था पर सवाल उठना तय है। pic.twitter.com/UGvYm7qEJx— Dushyant Chautala (@Dchautala) April 17, 2026 -
తప్పుడు పోస్టులపై వైఎస్ భారతీరెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికలు మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్లకు లీగల్ నోటీసులు పంపారు. భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈమేరకు నోటీసులిచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులను ప్రచారం చేస్తున్న థింక్ ఆంధ్ర, ఎం9 న్యూస్లకు సైతం నోటీసులు పంపారు.భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డి బాధితులుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి.. అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర.. తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి 9 న్యూస్ కూడా ఇలాంటి కంటెంట్నే సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్ పనే..ఈ కంటెంట్ను భారతీరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్రా ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రణాళికబద్ధంగా సాగుతున్న దాడి...వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతీరెడ్డి వ్యకిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుత లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, మళ్లీ ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..’ అని ప్రద్యుమన్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. -
బ్లాక్ శారీలో నిహారిక అందాలు.. కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ..!
కోలీవుడ్ బ్యూటీ రవీనా రవి స్మైలీ లుక్స్..హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటీఫుల్ వీడియో..కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్..బ్లాక్ శారీలో నిహారిక కొణిదెల అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా హోయలు.. View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanoor Sana Begum (@shanoor_sana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్!
సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు...ఇదేదో కొత్త గేమ్ క్యారెక్టర్లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. నడిరోడ్డులో డివైడర్కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్లో రాకీభాయ్లా ఊహించేసుకున్నాయి. ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్ చెరో వైపు పారిపోయారు. పాపం ఎడ్వర్డ్ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.zaganiam dziki do lasu pic.twitter.com/Pjxkn0kfob— Edward Warchocki (@edwardwarchocki) April 12, 2026కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. -
వెర్రితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు ... టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దు్రష్పచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది. ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశ్వంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తుండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పుంఖానుపుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతుండటం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్డడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించవన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించడమే లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ...నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తుండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది. -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
పోలీసుల్ని ఆశ్రయించిన వల్లభనేని వంశీ
సాక్షి,కృష్ణాజిల్లా: వల్లభనేని వంశీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఏఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు. -
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
-
రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా?
ఆదిలాబాద్టౌన్: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.‘లైక్’ల కోసం..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ వైద్యులు, వారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్చల్ కావడంతో రిమ్స్లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఫోన్లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని ఫైన్
మనదేశంలో ఇటీవల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. పర్యావరణానికి హాని కలిగించవనే ఉద్దేశంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజస్థాన్లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగౌర్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు నడుపుతున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్షేడ్ అమర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయల జరినామా విధించారు. అక్కడితో ఆగకుండా పొల్యుషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ చూపించాలని వాహనదారుడిని పోలీసు అధికారి అడిగారు. అతడు చూపించకపోవడంతో మరో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని ఎంత చెప్పినా సదరు పోలీసు పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయలేదని, సాక్ష్యం చూపించాలని కోరినా పట్టించుకోలేదు. తనకు అకారణంగా జరిమానా వేసినందుకు కోర్టులో వేస్తానని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్కచేయలేదు. ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజనులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అడగడం హాస్యాస్పదంగా ఉందని.. ఇది కాలిక్యులేటర్ను వాతావరణం గురించి అడిగినట్టుగా ఉందని సెటైర్ వేశారు. తెలియని విషయాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించడాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజనులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని చాలా మంది పోలీసులకు తెలియదని, ఇలాంటి విషయాలపై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు."ఇలాంటి పోలీసు అధికారుల వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించర''ని ఓ నెటిజన్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలోని తెలివితక్కువ వారి వల్లే దేశం నాశనం అవుతుందని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంతకైనా దిగజారతారని మరో నెటిజన్ మండిపడ్డారు. ఈవీకి కచ్చితంగా పీయూసీ వర్తించదని, ఒకవేళ డ్రైవింగ్ సమయంలో కారు కిటికీలకు కర్టెన్లు వేసివుంటే చలానా విధించే అవకాశం ఉందని మరో నెటిజన్ అన్నారు. नागौर पुलिस ने नया कानून लागू किया है इलेक्ट्रिक कार की PUC करवाओ नहीं तो आपके भी PUC का चालान कटेगालो साहब ने काट दिया 1500 की चालान😳😲 pic.twitter.com/uYpFvT0If1— एक नजर (@1K_Nazar) April 8, 2026చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు! -
ఒక రాధ ఇద్దరు కృష్ణులు!
వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధరంగంలా మారింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబం తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు బారాత్లతో, కుటుంబ సభ్యులు.. బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు కుటుంబం సంభల్కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదని భావించిన పెళ్లి కూతురు తండ్రి.. మొరాదాబాద్కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు.అయితే.. సంభల్కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని.. తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుని.. బారాత్తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు బారాత్తో చేరుకుంది. ఇరువర్గాల లౌడ్ మ్యూజిక్, డ్యాన్సులతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరు వైపులా కొట్టుకున్నంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు.. నిర్ణయాన్ని వధువుకు, ఆమె కుటుంబానికే వదిలేశారు. దీంతో మూడు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరకు సంభల్కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించారు. దీంతో చేసేది లేక మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనుదిరగ్గా.. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ ‘డబుల్ బారాత్’ గురించి చర్చ జరగ్గా.. అది నెట్టింటకు చేరింది. -
మోనాలిసా భర్తకు దక్కిన ఊరట
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్ అంటూ భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్ను ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్రాజ్(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్ కంట పడి ఇంటర్నెట్ సెన్సేషన్గా నిలిచింది మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్ అటుపై మూవీ ఆఫర్స్తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్ కిడ్నాప్, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్కార్డ్, బర్త్ సర్టిఫికెట్) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్ వేశారు. ఇంతకు ముందు..మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది. తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.మిస్సింగ్ కలకలం?మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్కు వెళ్లామని.. అజ్మీర్లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే.. ఆమె మిస్ కావడం వెనుక ఫర్మాన్ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. -
బాహుబలి గెటప్లో వరుడు.. శోభన ఫ్లెక్సీ వైరల్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొత్త స్టైల్తో హైలైట్ అయింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెంకు చెందిన గోపి పెళ్లి ఈ నెల 10న జరిగింది. కానీ అసలు టాక్ మాత్రం శోభన ఫ్లెక్సీదే! వరుడిని ‘బాహుబలి’ గెటప్లో స్టైలిష్గా డిజైన్ చేసి, “బ్రహ్మచారి జీవితానికి Good Bye.. సంసార జీవితానికి Welcome” అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. హీరో లుక్లో ఉన్న వరుడి ఫ్లెక్సీ చూసి గ్రామస్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిళ్లలో క్రియేటివిటీకి ఇది కొత్త లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు! -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె. ‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
హైదరాబాద్కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్గా ఉండిపోయాడు. వారం గడిచింది.. డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది. ఇదో భారీ స్కామ్?!ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదంటే మనీపే యాప్ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి. ఇలా చేయండి.. సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయండి. బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్షాట్లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దుడీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దుఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలిచెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గంఫిర్యాదుల కోసం.. • ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555• హెచ్పీ గ్యాస్ (HPCL): 1800-233-3555• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్సైట్లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్షాట్ వంటి సాక్ష్యాలుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. -
కిడ్నాప్ చేసి.. హిజ్రాగా మార్చే యత్నం
మైసూరు(కర్ణాటక): యువకున్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మంగళముఖిగా వేషం వేసి డబ్బులు వసూలు చేయించడం, రీల్స్ చేయించుకుని డబ్బు సంపాదిస్తూ, అతన్ని కూడా బలవంతంగా హిజ్రాగా మార్చాలని ప్రయత్నించారు. దీంతో బాధిత యువకుడు న్యాయం కోసం మైసూరు లష్కర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంజనగూడులోని త్యాగరాజ కాలనీకి చెందిన యువకుడు అనిల్కుమార్ దివ్యాంగుడు కూడా. అతడు 4 నెలల క్రితం మైసూరు రూరల్ బస్టాండులో బస్సు కోసం వేచిఉన్న సమయంలో మంగళముఖి అనిత ముసుగువేసి.. కిడ్నాప్ చేసి, మంగళూరుకు తీసుకు వెళ్లింది. అక్షతగా పేరు మార్చి తరువాత అతనికి చీర , నైటీ, చెవి కమ్మలు వేసి అక్షత అని పేరు మార్చింది. బలంవంతంగా వీధులలో , దుకాణాల వద్ద భిక్షాటన చేయించింది. ప్రతినిత్యం 2 నుంచి 3 వేల రూపాయలు కలెక్షన్ తీసుకు రావాలని బెదిరించింది. రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మంగళూరు, కేరళ ప్రాంతాలలో వ్యభిచారానికి పంపింది. అతని ఆధార్ కార్డులో కూడా ట్రాన్స్ జెండర్గా మార్పించింది. వచ్చే నెల ముంబైకి తీసుకు వెళ్లి, సర్జరీ చేయించి పూర్తిగా మంగళముఖిగా మార్చడానికి ప్రణాళిక రూపొందించింది. దీనిని గుర్తించిన అనిల్కుమార్ ఇంటికి వెళ్తానని చెప్పగా, అనిత బెదిరించి చోరీ కేసు పెట్టించింది. ఎలాగోలా మంగళూరు నుంచి తప్పించుకుని వచ్చిన అనిల్.. మైసూరు లష్కర్ స్టేషన్లో అనితపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదుకు స్పందించడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఆమె మరణం తీరని లోటు
‘‘ఓ మధురమైన స్వరాన్ని కోల్పోయాం. ఆమె మరణం తీరని లోటు’’ అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆశా భోంస్లేకి నివాళి అర్పించారు.తరతరాలుగా విభిన్నమైన భావోద్వేగాలను పలికిస్తూ, ఆశా భోంస్లేగారి గాత్రం భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి పాటకూ గ్రేస్, విలక్షణతను తీసుకువచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని స్వరాన్ని కోల్పోయింది.– నటుడు చిరంజీవిశాశ్వతమైన గాయనీ...! అంటూ తాను నటించిన ‘చాచీ 420’ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట ‘జాగో ఘోరీ..’ను, ఆమెతో తాను ఉన్న క్లిప్పింగ్స్ను షేర్ చేశారు.– నటుడు కమల్హాసన్.ఆశా భోంస్లేగారి మరణంతో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె స్వరం కేవలం సంగీతం మాత్రమే కాదు... మన జీవితాల్లోని ప్రతి దశను స్పృశిస్తూ మనతో జీవించిన ఒక భావోద్వేగం. తరతరాలుగా ఆమెలా ప్రజల హృదయాలను తాకిన కళాకారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు. ఆమె స్వరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – నటుడు మోహన్ బాబుదశాబ్దాల పాటు ఆశా భోంస్లేగారి మ్యాజికల్ వాయిస్ భారతీయ సినిమాకు ్రపాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలుగా నిలిచిపోయే జ్ఞాపకాలను ఆమె వదిలి వెళ్లారు. ప్రేమ, గౌరవాలతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. – నటుడు ఎన్టీఆర్భారతీయ సంగీతానికి తీరని లోటు. ఆశా భోంస్లేగారి గాత్రం స్వచ్ఛమైన మ్యాజిక్ అండ్ ఎమోషన్ . ఆమె లెగసీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆశాగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నటుడు రామ్చరణ్ఆశా భోంస్లేగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. తరతరాలను నిర్వచించిన ఆమె స్వరం ఎప్పటికీ నిలిచిపోతుంది. – అల్లు అర్జున్భారతీయ సంగీతానికి తీరని లోటు. మీ స్వరానికి సాటి లేదు... మీ పాటలు తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. – నటుడు సల్మాన్ ఖాన్ఆశా తాయ్ (మరాఠీలో పెద్దక్క అని అర్థం) మరణవార్త బాధ కలిగించింది. భారతీయ సినిమాకు ఆమె గాత్రం ఒక మూలస్తంభంలాంటిది. భవిష్యత్లో శతాబ్దాల పాటు ఆశాగారి గాత్రపు మాధుర్యం కొనసాగుతూనే ఉంటుంది. – నటుడు షారుక్ ఖాన్ఆశాగారి మరణం దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆమెకు నేను పెద్ద అభిమానిని. గొప్ప గాయకులు రఫీ, కిషోర్, లతగార్లు లేరు. ఇప్పుడు ఆశాగారూ మనకు దూరమయ్యారు. ఓ శకం ముగిసిందని నాకు అనిపిస్తోంది. ఆశాగారి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు... దేశం, ప్రపంచానికే నష్టం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – నటుడు ఆమిర్ ఖాన్మన దేశానికి స్వాతంత్య్రం లభించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ అనే పాటను ఆమెతో కలిసి రికార్డు చేసే అవకాశం నాకు లభించింది. మా అమ్మని కాకుండా నేను అమ్మా అని పిలిచే మరొక వ్యక్తి ఆశాగారు మాత్రమే. ‘శ్రీవల్లీ..’ సాంగ్ (పుష్ప: ది రైజ్’లోని పాట..) ఆమెకు నచ్చింది. ఆశా అమ్మ... మిమ్మల్ని చాలాసార్లు కలిసే చాన్స్ నాకు దక్కింది. అది నాకు పెద్ద ఆశీర్వాదం. సంగీతం పట్ల మీ అంకితభావం, ప్యాషన్ ను నేను ప్రత్యక్షంగా చూశాను. – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ఆమె గాత్రం ఒక మ్యాజిక్. ఆమెతో ఓ సాంగ్ను షేర్ చేసుకునే గౌరవం నాకు లభించింది. ఆశాగారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. భారతీయ సంగీతానికి ఆమె మరణం తీరని లోటు. – నటుడు సంజయ్ దత్ఒక శకం ముగిసింది. నేను ముంబైలో ఎక్కడున్నా ప్రభుకుంజ్ (ముంబైలో ఆశా ఎక్కువ కాలం నివసించిన భవనం) దాటి వెళ్తున్నప్పుడు తొలుత లతాగారికి ఫోన్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆశాజీగారిని కలిసేదాన్ని. ఆమె స్థానాన్ని మరొక సింగర్ భర్తీ చేయలేరు.– గాయని ఉషా ఉతుప్మనందరికీ, భారతీయ సంగీతానికి ఎంతో బాధాకరమైన రోజు ఇది. మన ప్రియమైన ఆశా సోదరి ఇక లేరన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె స్వరం ఎప్పటికీ జీవించే ఉంటుంది.– గాయకుడు–సంగీతదర్శకుడు శంకర్ మహదేవన్తన పాటలకు జీవకళను అద్ది, ఎంతో ప్రత్యేకతను చాటుకున్న ఆశాగారు ఇక లేరనే విషయం నమ్మశక్యంగా లేదు. ఆశాగారితో నాకు ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడిన అనుబంధం ఉంది. అందుకే ఆమె ఇక లేరన్న విషయం నాకు కష్టంగా అనిపిస్తోంది. నేను నటించిన సినిమాల్లోని పాటలను ప్రత్యేకమైన తన గాత్రం, శైలితో పాపులర్ చేశారామె. చిత్ర పరిశ్రమలో నా ఎదుగుదలలో భాగస్వామ్యమైన లతా, ఆశాగార్లతో నాకు మంచి అనుబంధం ఉంది. – నటి హేమ మాలినిభారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక గాయనిని కోల్పోయిన రోజు ఇది. ఆమె నాతో ఎంత ప్రేమాభిమానాలతో ఉండేవారో, గాయనిగా అంతే గౌరవమర్యాదలతో నడుచుకునేవారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేని ఓ స్థానంలో ఉంటారామె. వేరే ఏ స్వరంతోనూ పోల్చలేని ఓ ప్రత్యేకమైన స్వరం ఆమెది. ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా నన్ను కలిసేవారు. నా ఆత్మీయ సోదరి. – సంగీతదర్శకుడు ఇళయరాజాఆశాగారు తన గాత్రంతో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఆమె గొప్ప కళాకారిణి. – సంగీతదర్శకుడు, ఏఆర్ రెహమాన్ఆమె గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా? ఆమె సాధించలేనిదంటూ ఏమైనా ఉందా? పనులు ఎలా చేయాలో మా అందరికీ చూపించిన వ్యక్తి. నిజమైన మార్గదర్శకురాలు. – గాయని చిన్మయిఆశాజీ మరణవార్త విని నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆశాజీని కోల్పోవడం అంటే మా అమ్మగారిని రెండోసారి కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంగీత ప్రపంచంలో నా వేలు పట్టుకుని, నా చేత తొలి అడుగులు వేయించి, నాకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, నా మొట్టమొదటి స్వరకల్పనకు గాత్రం అందించారు ఆమె. బహుముఖ ప్రజ్ఞాశాలి. అద్భుతమైన గాయని. ఆమెలా మరొకరు ఎప్పటికీ రారు. ఒక శకం ముగిసింది. – గాయకుడు అనూ మాలిక్ఆశా తాయ్ ఒక సింగర్గా, మంచి మానవతావాదిగా, లెజెండ్లా ఎప్పటికీ నిలిచిపోయే ఉంటారు. ఆమె స్వరానికి తగ్గట్లుగా మేం నటించేందుకు ముందే ప్రిపేర్ అయి, వస్తుంటాం. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆశాగారి సాంగ్ రికార్డింగ్ చూశాను. ఓ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆ మెలోడి సాంగ్కు ఆమె చూపిన ప్రతభలో నటిగా నేను పది శాతం ప్రతిభ చూపినా నేనో గొప్ప యాక్టర్ అవుతానని ఆమెకు చెప్పాను. – నటి కాజోల్నా ఆల్టైమ్ ఫేవరెట్ సింగర్ ఆశాగారి మరణం నన్ను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లో రెహమాన్ లాంటి కొత్త సంగీత దర్శకుడితో ప్రయోగాలు చేయాలనే ఉత్సుకతతో వచ్చి, విప్పారిన కళ్లతో చూసిన ఓ పాపలా ఆమె కనిపించారు. చిన్న అడ్జెస్ట్మెంట్తో సింగిల్ టేక్లోనే ఈ పాట పూర్తయింది. ఆశ్చర్యకరంగా నా ‘కంపెనీ’ సినిమాలో ఆమె ‘ఖల్లాస్’ పాటను పాడారు. ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తవుతున్నాయి. శాస్త్రీయ సంగీత మూలాలను, ఆధునిక లయల్లో విభిన్నమైన భావోద్వేగాలతో పలు భాషలకు అనుసంధానిస్తూ ఆమె స్వరం తరతరాలుగా నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. మానవ భావోద్వేగాలను ఆమె ఆవిష్కరించినట్లు మరెవరూ ఆవిష్కరించలేరు. ఆశాజీ... మీరు మరొక చోటుకు వెళ్లి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ సంగీతం శాశ్వతంగా నిలిచే ఉంటుంది.– దర్శకుడు రామ్గోపాల్ వర్మఆశా భోంస్లేగారు మధురమైన గానంతో ఎన్నో తరాలను అలరించారు. ఆమె ప్రతిభ, ఆమె స్వరం ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయి ఉంటాయి. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవి. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. మహాగాయని మనతో లేకపోవడాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. బాలీవుడ్లో తన అద్భుతమైన స్వరంతో నాకిచ్చినటువంటి అమోఘమైన పాటలు మరపురానివి. ‘శరాబీ’ చిత్రంలో ‘దే దే ప్యార్ దే..’, ‘తోఫా తోఫా’ పాటలు కానీ... తెలుగులో ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం...’ అనే పాటను కానీ అద్భుతంగా ఆలపించారు. లతా మంగేష్కర్గారు కానీ, ఆశా భోంస్లే దీదీ కానీ నా జీవితంలో నాకిచ్చినటువంటి ఈ అనుభూతిని మర్చిపోలేను. ఆశా భోంస్లే లేని లోటు నాకే కాదు... వ్యక్తిగతంగా ప్రజలకు, సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు. అలాంటి గాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇక మనకు దొరకరేమో! – నటి జయప్రద -
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
సోషల్ మీడియాపై చర్చ కొత్త దశకు చేరుకుంది. 16 ఏళ్ల లోపు బాలల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తు న్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్ వ్యసనం, ఆన్లైన్లో అపరిమిత కాలాన్ని వెచ్చిస్తున్నందువల్ల కొన్ని పరిమితులు తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశముందని వార్తలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మైనర్లను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఒక చట్టం తెచ్చింది. అదే తరహా విధానాలు అనుసరించడంపై ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, సైబర్ బెదిరింపులు, నిద్రలో అవాంతరాలు వంటి సమ స్యలు తలెత్తుతున్నమాట వాస్తవమే. ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ వంటి సంస్థల అధ్యయనాలు కూడా ఆ సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. బాలలు ఎలక్ట్రానిక్ తెరల ముందు రోజూ ఏడు గంటలకు పైగా గడుపుతున్నారని అవి తెలుపుతున్నాయి.సోషల్ మీడియా ‘కత్తి’ లాంటిది!ఎడతెగని ఫార్వర్డ్లు, సంచలనాత్మక అభిప్రాయాలు వ్యక్తపర చడం గురించి సోషల్ నెట్వర్క్ వాడకందారులు ఎవరికైనా వేరే చెప్పనవసరం లేదు. వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫారాలు తప్పుడు సమాచారానికి కారణమవుతున్నాయని నిందలు మోస్తున్నాయి. ఎన్నికల సందర్భాలలోనైతే చెప్పనే అక్కర లేదు. ఏది బూటకమో, ఏది వాస్తవమో నిర్ధారణ కాకపోయినా ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ముద్ర వేసుకుని వచ్చేస్తాయి. ఫలితాలను ప్రభావితం చేయడంలో, హింసకు పురిగొల్పడంలో వాటి పాత్రను తోసిపుచ్చలేం. ఢిల్లీలో 2020 నాటి అల్లర్లను దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నిషేధించడం, లేదా నియంత్రించడం తప్ప గత్యంతరం లేదు. కానీ, ఆ యా వేదికలది తప్పా, లేక వాటిని వినియోగించుకుంటున్న మన తీరులో లోపం ఉందా అనే ప్రశ్న వెన్నాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా దానికదే విషపూరితమైనది కాదు. క్యాట్ వీడియోలు, కుట్ర సిద్ధాంతాలు, కవ్వించే మాటల వంటి అల్పమైన విషయాల వరదలో టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఘర్షణ ప్రాంతాల నుంచి పౌరులు నేరుగా నివేదించే కథనాల వంటి మంచి సంగతులు కూడా కొట్టుకొస్తాయి. ఇస్రో రాకెట్ ప్రయోగాల ప్రత్యక్ష వీడియోల వంటివి యువతలో స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి సంగతులు మాధ్యమం తటస్థమైనదేననే సంగతిని గుర్తుచేస్తాయి. ఇదీ కత్తి లాంటిదే! దానితో కూరగాయలు తరగ వచ్చు. ఒంటికి గాయమూ చేసుకోవచ్చు. చరిత్ర నేర్పుతున్న పాఠాలుగూటెన్బర్గ్ 1440లో ముద్రణా యంత్రం కనుగొనడంతో విషయ పరిజ్ఞానం అందరికీ అందడం మొదలైంది. పునరుజ్జీవన, సంస్కరణవాద ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. యూరప్లో అక్షరాస్యత 10 శాతం నుంచి దాదాపు నూరు శాతానికి చేరుకుంది. అదే సమయంలో మూఢ నమ్మకాలను, కక్ష సాధింపు ప్రాపగాండాను పెంపొందించే కరపత్రాలు కూడా పుట్టుకొచ్చాయి. అయినా, నిషేధాలు నిలువలేదు. టెక్నాలజీయే కొనసాగింది. రేడియో వాడుకలోకి వచ్చినప్పుడు కూడా అదే ధోరణి పునరా వృతమైంది. జర్మనీలో 1930లలో హిట్లర్ విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తికి అది కారణమైంది. ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ ఉత్తేజపూరిత ప్రసంగాలు అమెరికా ఐక్యానికి దోహదపడ్డాయి. టెలివిజన్ రాకతో నిరాధారమైన ఆరోపణలతో ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసే పద్ధతి ఊపందుకుంది. అదే సమయంలో, పౌర హక్కులకు రక్షణ కల్పించి, మార్పునకు చేయూతనందించింది. నేడు సోషల్ మీడియా కూడా అదే బాటలో ఉంది. 50 కోట్ల మంది యూజర్లు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్గా మన దేశాన్ని మార్చారు. ‘నాసా’ కృష్ణబిల చిత్రాలను కొన్ని అందిస్తే, భ్రమలను తొలగిస్తూ నోబెల్ బహుమతి గ్రహీతలు చెప్పే మాటలను మరికొన్ని అందిస్తున్నాయి. వన్యప్రాణులపై డిస్కవరీ ఛానల్ రీల్స్ వస్తున్నాయి. అలా వేదికలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. వదంతులను వ్యాప్తి చేస్తోందని ట్విట్టర్ను తిట్టుకున్నాం. కానీ, కోవిడ్ మృతుల విషయంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన తాజా సమాచారాన్ని కూడా ట్విట్టరే ఎప్పటికప్పుడు అందించింది. డిజిటల్ ఎకో సిస్టంనిజమైన సవాల్ నిషేధించడంలో కాక, ఎకో సిస్టంను సుసంపన్నం చేయడంలో ఉంది. దేశంలోని 1.4 బిలియన్ల మందిలో మూడొంతుల మంది 35 ఏళ్ళ లోపువారు. వార్తలకు వారు డిజిటల్ మార్గాలపైనే ఆధారపడుతున్నారు. యువతలో 80 శాతం మంది సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల నుంచి పొందు తున్నారు. ప్రజానిధులతో ప్రభుత్వం కూడా బోలెడంత సమాచా రాన్ని ఎత్తిపోస్తోంది. వాటిలో నీతి ఆయోగ్ నివేదికలు, విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘ పరిశోధన పత్రాలు, రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ నవీకరణలు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రాచుర్యానికి నోచుకోని ఎక్కడెక్కడో సైట్లలో పీడీఎఫ్ల రూపంలో మూలుగుతున్నాయి. కొందరు ఉన్నత విద్యావంతులు మాత్రమే వాటిని చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల నివేదికలలో 70 శాతం ఏటా వెయ్యికన్నా తక్కువ మంది చూపరుల దృష్టికి మాత్రమే ఆనుతున్నాయని 2023 నాటి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తేలింది. సోషల్ మీడియా ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపుతోంది. వ్యవసాయ చట్టాలను, లేదా వాతావరణ డేటాను వివరించే రీల్స్ చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో వివిధ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే? ప్రాచీన చరిత్రపై విశ్వవిద్యాలయాలు టిక్టాక్ సిరీస్ చేస్తే? వేదాలను వైరల్ చేస్తే? నివేదికలను ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చేందుకు యువ క్రియేటర్ల సేవలను ఇస్రో, ఐఐటీలు, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగించుకుంటే? వేదికలను సద్వినియోగం చేసుకునేటట్లు విద్యావేత్తలు, స్కాలర్లు తమ వంతు పాత్ర పోషించాలి. ‘పనికిమాలిన’వంటూ ప్లాట్ ఫారాలను చిన్నచూపు చూసే బదులు వారు క్వాంటమ్ ఫిజిక్స్, లేదా ఎన్నికల డేటాపై థ్రెడ్లను పోస్ట్ చేయవచ్చు. ఉన్నత ప్రమా ణాలతో కూడిన కంటెంట్ పెడుతున్నవారిని ఆ యా ప్లాట్ ఫారాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కాకపోతే విచక్షణా జ్ఞానంతో అన్వేషిస్తూ పోవాలి. మేరీ క్యూరీ 1 గ్రాము రేడియం కోసం 8 టన్నుల పిచ్ బ్లెండ్ను జల్లెడ పట్టవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సోషల్ మీడియా కూడా అదే రకమైన శ్రమను డిమాండ్ చేస్తోంది. చిందర వందర మధ్యలో అసలైన దాన్ని వెతికి పట్టుకోవాలి. సైట్ విశ్వస నీయతకు సంబంధించి న్యూస్ గార్డ్ వంటి టూల్స్ రేటింగ్ ఇస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పోలీసుగానే వ్యవహరించకుండా, స్వయంగా క్వాలిటీ కంటెంట్ అందించాలి. వార్తాహరుడిని చంపే బదులు అతన్ని సమాచారంతో బలోపేతం చేయాలి.శివప్రసాద్ ఖేనేడ్వ్యాసకర్త సైన్స్ కమ్యూనికేటర్, మ్యూజియంవృత్తి నిపుణుడు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
శ్రీలంక వెకేషన్లో హీరోయిన్ ప్రణీత.. హాఫ్ శారీలో సురేఖవాణి కూతురు..!
శ్రీలంక వేకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రణీత..లంగా ఓణిలో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..లైట్ పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..బాలీవుడ్ భామ ఇషితా దత్తా హాట్ ఫోజులు..శారీలో ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta) -
ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్.. కేటుగాడి మాయ వైరల్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్లో కారు నంబర్ ప్లేట్ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఇంటర్నెట్ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ!
భోపాల్: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన మధ్యప్రదేశ్లోని భోపాల్ ‘90-డిగ్రీల వంతెన’ గుర్తుంది కదా? ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వింత డిజైన్ పై అటు స్థానికుల నుంచి, ఇటు నెటిజన్ల వరకూ తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), రైల్వే శాఖల కొనసాగుతున్న వివాదానికి ముగింపు దొరికింది. ‘సిమెంట్ తో కట్టిన మృత్యుద్వారం’గా ముద్రపడిన ఈ వంతెన డిజైన్ను పూర్తిగా మార్చివేసి, త్వరలోనే సురక్షితంగా తీర్చిదిద్ది, ప్రజల వినియోగానికి తీసుకురావాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు.భోపాల్ లోని ఐష్బాగ్ ప్రాంతంలో సుమారు 18 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి 2025, జూన్ నాటికే పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలకు నోచుకోలేదు. ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు, ఈ వంతెన మలుపు ఏకంగా 90 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆ మలుపులో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడతాయని స్పష్టమైంది. ఈ దారుణమైన ప్లానింగ్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మీమ్స్, విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపధ్యంలో ఏడుగురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందాలను రంగంలోకి దించింది. పక్కనే ఉన్న మెట్రో లైన్ వల్లే డిజైన్ లో ఈ సమస్య తలెత్తిందని దర్యాప్తులో తేలింది. రైల్వే శాఖ నుండి సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే మరో నాలుగు, ఐదు రోజుల్లో పాత కాంట్రాక్టర్తోనే మార్పుల పనులు ప్రారంభించనున్నారు. కొత్త డిజైన్ ప్రకారం మలుపు వ్యాసార్ధాన్ని 2 మీటర్ల నుండి 2.5 మీటర్లకు, వంతెన వెడల్పును 8.5 మీటర్ల నుండి 10.5 - 11 మీటర్లకు పెంచనున్నారు. దీని ద్వారా కార్లు, మధ్య తరహా, భారీ వాహనాలు సురక్షితంగా ప్రయాణించే వీలుంటుంది.ఇది కూడా చదవండి: ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు -
Instagramతో కోట్లలో డబ్బు సంపాదన.. ఎలా అంటే?
ఫ్రెండ్స్.. మీకో విషయం తెలుసా..? Instagramలో సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్తో ఒక అమ్మాయి నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అక్షరాలా కోటి రూపాయలు. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా సంవత్సరానికి 12 కోట్లు. ఇది వినగానే మీలో చాలా మందికి.. అబ్బా.. నాకూ అకౌంట్ ఉంది.. నేను కూడా స్టార్ట్ చేస్తా, ఆ టాలెంట్ ఏదో నేర్చేసుకుంటా.. అని అనిపిస్తోంది కదా..? కానీ ఒక్క నిమిషమాగండి. ఆ టాలెంట్ మీరు నేర్చుకోలేరు, నేను నేర్పించలేను. ఎందుకంటే అది ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి గారు చెప్పినట్టు.. అదో రకమైన టాలెంట్, అది అందరికీ రాదు, అందరూ చేయకూడదు కూడా.హిందీలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకి కూడా పాకింది. దురదృష్టవశాత్తూ.. మన ఫీమేల్ కంటెంట్ క్రియేటర్స్ ఈ ఫీచర్ని చాలా రాంగ్ దారిలో వాడుతున్నారు. అసలేం జరుగుతోంది..? దీనిపై ఎందుకు ఇంత వ్యతిరేకత..? అనేవి వివరంగా మాట్లాడుకుందాం.అసలు ఈ కోటి రూపాయల గోలేంటి..? కేరళకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. తన పేరు అశ్విని, Instagramలో పర్పుల్ సెలా అని ఉంటుంది.. ఆ అమ్మాయికి ఉన్నది కేవలం 2-3 లక్షల ఫాలోవర్లే. కానీ.. సబ్స్క్రైబర్లు మాత్రం 26 వేల మందే. వీరంతా ఒక్కొక్కరు నెలకు 399 రూపాయలు పే చేస్తున్నారు. ఇలా లెక్కేస్తే నెలకు కోటి రూపాయల పైనే ఈ అమ్మాయి సంపాదిస్తోంది. హిందీ క్రియేటర్లని కూడా దాటి ఈమె ఇండియాలోనే నంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయింది. మన తెలుగులో కూడా గత 4-5 నెలలుగా విష్ణుప్రియ, సాధన నాయుడు లాంటి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారు. నిన్న మొన్నటి వరకు Twitterలో వీళ్ళ ఫోటోలే ట్రెండింగ్. మరి.. ఏంటా ఫోటోలు? ఏమున్నాయి అందులో? అన్నీ ఆనిముత్యాలే. బాహాటంగా ఎక్స్పోజింగ్ చేస్తూ యూత్ ని ఆకర్షించడమే వీరి పని.అసలు Instagram ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ ఎందుకొచ్చింది..? అంటే నిజానికి ఇది YouTube మానిటైజేషన్ లాంటిది. క్రియేటర్లకి డైరెక్ట్ ఆదాయం ఉండదు కాబట్టి, వాళ్ళ స్పెషల్ టాలెంట్ని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చారు. ఉదాహరణకు.. ఒక బిజినెస్ పర్సన్ తన ప్రీమియం డిజైన్లు చూపించడానికి.. ఒక CA లేదా లాయర్ తన క్రిటికల్ లీగల్ టిప్స్ చెప్పడానికి.. ఒక ఫోటోగ్రాఫర్ తన సీక్రెట్ సెట్టింగ్స్ నేర్పించడానికి.. లేదా ఒక డాన్సర్ తన ఎక్స్క్లూజివ్ స్టెప్స్ నేర్పించడానికి.. ఈ సబ్స్క్రిప్షన్ను తీసుకొచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి..? టాలెంట్ని పక్కన పెట్టి, బాడీని చూపిస్తూ మనీ సంపాదిస్తున్నారు. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు రాత్రింబవళ్లు కష్టపడితే నెలకి లక్ష రావడం కష్టంగా ఉంటే, వీళ్ళు ఇలాంటి కంటెంట్తో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇది చూసినప్పుడు ఎవరికైనా కోపం, ఆవేదన రావడం సహజం.ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. మన పేరెంట్స్ చిన్నప్పుడు కష్టపడి కాయగూరలమ్మినా, కూలి పని చేసినా మనం గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే అది కష్టం, అది నీతి. కానీ వీళ్ళు రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు..? మీ అమ్మ ఏం చేస్తుందిరా అంటే.. Instagramలో సబ్స్క్రిప్షన్ పెట్టి ఇగో ఇలాంటి ఫోటోలు అమ్ముతుంది.. అని గర్వంగా చెప్పుకోగలరా..? మై బాడీ మై విష్ అని కొందరు వాదిస్తారు. లీగల్గా ఇది కరెక్టే కావచ్చు.. కానీ ఎథికల్గా ఏం సమాధానం చెబుతారు. ఇలాంటివి చూసి కాలేజీ పిల్లలు, హౌస్ వైఫ్స్ కూడా మనీ ఇంత ఈజీగా వస్తుందా అని తప్పుడుదారిలో ఇన్స్పైర్ అవుతున్నారు. దీనివల్ల యూత్ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా..? ఒక ఫోటో చూడటానికెళ్లి గంటల కొద్దీ అందులోనే మునిగిపోతున్నారు. రాబోయే కాలం ఒక యుద్ధభూమి. అక్కడ సర్వైవ్ అవ్వాలంటే స్కిల్ కావాలి కానీ, ఇలాంటి వ్యసనాలు కాదు.మీకు అలాంటి కంటెంట్ చూపించాలనే ఉంటే.. దానికి ఓన్లీ ఫ్యాన్స్ లాంటి డెడికేటెడ్ యాప్స్ ఉన్నాయి, అక్కడికెళ్ళండి. Instagram అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర్నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉంటారు. దీన్ని ఇలాంటి చెత్తతో నింపేయొద్దు. తల్లిదండ్రులకు కూడా ఓ సజిషన్.. మీ పిల్లల ఫోన్లలో Instagram, Telegram యాప్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. వాళ్ళు ఎక్కడ మనీ స్పెండ్ చేస్తున్నారో చూడండి. చెడిపోవడానికి వంద దారులున్నాయిక్కడ, జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. చివరిగా.. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది కాదు, ఎలా సంపాదిస్తున్నారు అన్నదే ముఖ్యం. అభిమానుల పేరుతో ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు మీ అభిమానానికి అర్హులు కాదా అని. దట్సాల్. -
తోటి విద్యార్థి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
హయత్నగర్: సహచర విద్యార్థి సోషల్ మీడియాలో వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన నమలితోక కేశవ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుంట్లూర్లో ఉంటున్నాడు. ఆయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు (15) స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్థానిక కాంగ్రెస్ నేత కొడుకు (15) కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.ఈ క్రమంలో కేశవ కూతురు గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాడు. దీంతో పోలీసులు కేశవకు ఫోన్ చేసి మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ తెప్పించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు ఆరా తీయగా స్థానిక రాజకీయ నేత కొడుకు తరచూ సోషల్ మీడియాలో బాలికను వేధించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. -
మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్.. కేఫ్లో బిగ్బాస్ దివి చిల్..!
మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్..హీరోయిన్ ప్రియమణి లేటేస్ట్ లుక్..గ్రీన్ డ్రెస్లో మెరిసిపోతున్న నటి బిందు మాధవి..కేఫ్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ దివి..జిమ్లో హనీ రోజ్ కసరత్తులు.. View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ.. హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్..!
ఎల్లో డ్రెస్లో బాలీవుడ్ భామ అవనీత్ కౌర్..అమ్మ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్న నిత్యా మీనన్..ఐటమ్ సాంగ్ లుక్లో బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీ..హీరోయిన్ కృతి కర్బందా గ్లామరస్ పిక్స్..హాంకాంగ్లో ప్రియా ప్రకాశ్ వారియర్ చిల్.. వేకేషన్లో చిల్ అవుతోన్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!
బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్ స్పేస్లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్ఫామ్లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్ఇన్లో 65,000 మందికి పైగా, ఇన్స్టాగ్రామ్లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం."నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్ఇన్లో పోస్ట్లో వెల్లడించింది.నెటిజన్ల స్పందన ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు. సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని సూచించడం గమనార్హం.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి -
రాజకీయాల్లోకి తమిళ్ రౌడీ.. ఆకులు నములుతూ వింత ప్రచారం
-
‘ఎప్పుడైనా పొమ్మంటారు’.. టెక్కీ కన్నీరు!
న్యూఢిల్లీ: ‘ఉద్యోగమే ప్రాణంగా భావించి, రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యం.. సెలవులు కూడా తీసుకోకుండా అహర్నిశలు శ్రమించినా.. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థ కూడా తనను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలో నుంచి తీసేసిందని’ ఒక టెక్కీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత అస్సలు లేదని, ఏ క్షణంలోనైనా కంపెనీలు మనల్ని సాగనంపొచ్చని యువతకు ఆయన రియాలిటీ చెక్ ఇస్తున్నారు.జేసన్ జాంగ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత నెలలో గూగుల్ చేపట్టిన లేఆఫ్స్లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటినుంచి ఫేస్ చేస్తున్న తన నిరుద్యోగ జీవితాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘నేను ఎప్పుడూ నా పనికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను. మరింత కష్టపడితే, రోజులో ఎక్కువ గంటలు పనిచేస్తే, నా వెకేషన్స్ వాయిదా వేసుకుంటే.. నా శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుందని బలంగా నమ్మాను. కానీ, ఇవేవీ నా ఉద్యోగాన్ని కాపాడలేకపోయాయి’ అని జాంగ్ తన తాజా వీడియోలో వాపోయాడు. రాత్రులు, వీకెండ్స్ అని తేడా లేకుండా తన జీవితమంతా ఆఫీస్ పనులకే పరిమితమయ్యానని గుర్తుచేసుకున్నాడు.ప్రాణం పెట్టి పనిచేస్తే ఉద్యోగం ఊడదన్నది ఒక భ్రమ మాత్రమేనని జాంగ్ స్పష్టం చేశాడు. తనతో పాటు పనిచేసిన ఎంతో మంది ప్రతిభావంతులైన ఉద్యోగులు కూడా ఇలాగే ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ‘కంపెనీలు ఎప్పుడైనా మిమ్మల్ని వదిలించుకోగలవు.. కార్పొరేట్ రంగంలో ఇదే ఇప్పుడు కొత్త సాధారణంగా మారిపోయింది" అని పేర్కొన్నారు. ఈ చేదు అనుభవం తర్వాత, తాను ఏదో ఒకటి సొంతంగా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు జాంగ్ తెలిపాడు.నెటిజన్ల రియాక్షన్..జాంగ్ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ‘మనం ఎప్పుడూ ఇతరుల కోసమే కష్టపడతాం కానీ, మన కోసం పనిచేయం. ముందు మీ ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు లేకపోయినా కంపెనీలో పనులు ఆగవు, కానీ మీ జీవితం ఆగిపోతుంది’ అని ఒకరు విలువైన సలహా ఇచ్చారు. చేస్తున్న ఉద్యోగంతో పాటే ఇతర అవకాశాలు, సైడ్ బిజినెస్ కూడా వెతుక్కోవాలని మరొకరు సూచించారు. 25 ఏళ్లకే తాను కూడా ఇలాగే ఉద్యోగం కోల్పోయి ఏడు నెలలు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్లు ఒక యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ.. జాంగ్కు భవిష్యత్తులో మంచి వాతావరణం ఉన్న ఉద్యోగం దొరకాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు! -
ట్రంప్పై మీమ్ల వర్షం
టెహ్రాన్: ఇరాన్ సేనలు రణక్షేత్రంలో అమెరికా సైనికులతో తలపడుతుంటే ఇరాన్ దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెటకారపు మాటలతో ట్రంప్ను చీల్చి చెండాడుతున్నాయి. వెక్కిరింతలతో, మీమ్స్తో ట్రంప్పై విరుచుకుపడుతున్నాయి. దీంతో నెటిజన్లకు నవ్వుకోవడానికి భారీ సరుకే దొరికింది. ‘ఎక్స్’ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్లో ఇప్పుడీ మీమ్స్ తెగ షేర్ అవుతున్నాయి. వేల కోట్ల రూపాయల యుద్ధ విమానాలు, సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు కుప్పకూలినా ట్రంప్ ఇంకా తామే గెలిచామనడంపై పశ్చిమఆఫ్రికాలోని సియారాలియోన్ దేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఒక వెటకారపు ట్వీట్ పెట్టింది. దాంట్లో బాంబుల ధాటికి సూటు చిరిగిపోయి, దెబ్బలు తగిలి, జుట్టు చెదిరిపోయినా ట్రంప్ ‘మేమే గెలిచాం’అని గట్టిగా అరుస్తున్నట్లు ఒక ఏఐ ఫొటోను పెట్టి ‘‘అవును సర్. అంతా తగలబడినా మీరే గెలిచారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి’’అనే క్యాప్షన్ను ఎంబసీ జతచేసింది. హార్మూజ్ను తెరవండి వెధవల్లారా అని ట్రంప్ తిట్టగా ‘అసలు అది మూసేయలేదుగా. మా నౌకలు హార్మూజ్ను ఇప్పుడే దాటేశాయిగా’’అని చైనా అన్నట్లు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్ పెట్టింది. జలసంధిని తెరవాలని ట్రంప్ ఆదేశించగా తాళం చెవులు ఎక్కడో మరచిపోయామని మరో ట్వీట్ పెట్టారు. సొంత మాధ్యమం ‘ట్రూత్సోషల్’లో ట్రంప్ కొద్దిసేపు పోస్ట్లుపెట్టకపోతే ‘‘సార్. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి పోస్ట్ చేయండి. లేదంటే మాకు మహా బోర్ కొడుతోంది’’అని జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ మరో ట్వీట్తో నవ్వించింది. -
వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి.. పింక్ శారీలో మెగా కోడలు..!
రిసార్ట్లో చిల్ అవుతోన్న శాన్వీ మేఘన..పింక్ శారీలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి..వైట్ డ్రెస్లో చిన్నపిల్లలా బిగ్బాస్ దివి పోజులు..నయనతార బ్లాక్ అండ్ వైట్ లుక్స్..పల్లిచట్టంబి ప్రమోషన్స్లో బిజీగా కయాదు లోహర్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
రీల్ కూడా వార్తే..
వార్తలు, రాజకీయ సంబంధ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారా? రానున్న రోజుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఐటీ నిబంధనలు–2021కి కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఇవి కార్యరూపంలోకి వస్తే యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా ప్రచురణకర్తలుగా పరిగణిస్తారు. అంటే వారు పోస్ట్ చేసే ప్రతి విషయంపై ప్రభుత్వ నిఘా, బాధ్యత పెరుగుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్క్రియేటర్లూ జాగ్రత్త..వార్తలు, రాజకీయ సంబంధ పోస్టులను పంచుకునే యూట్యూ బర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను ఇప్పటివరకు ప్రభుత్వం వార్తా సంస్థలుగా గుర్తించలేదు. దీనివల్ల టీవీ చానెళ్లకు ఉండే కఠిన నిబంధనలు వీరికి ఉండేవి కావు. ప్రతిపాదిత కొత్త సవరణల ప్రకారం ఏదైనా కంటెంట్ను ‘తప్పు’అని ప్రభుత్వం భావిస్తే.. దాన్ని వెంటనే తొలగించే అధికారం ప్రభుత్వానికి పెరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు క్రియేటర్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమిటీ కొత్త ప్రతిపాదన? సమాచార సాంకేతికత (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) రెండో సవరణ నిబంధనలు–2026 కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14 వరకు ప్రజల అభిప్రాయాలను కోరింది. సురక్షితమైన ఇంటర్నెట్ను నిర్మించడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతుండగా.. విమర్శకులు మాత్రం ఇది సామాన్యుల డిజిటల్ వాక్ స్వాతంత్య్రంపై ప్రభుత్వానికి అపరిమితమైన కొత్త అధికారాలను కట్టబెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఈ ముసాయిదా నిబంధనలను డిజిటల్ నియంతృత్వంగా అభివర్ణించింది. పరిధిలోకి ఎవరు వస్తారు? ఈ సవరణలు యూట్యూబర్లు, ఇన్స్ట్రాగామ్ రీల్స్ క్రియేటర్లు, ‘ఎక్స్’యూజర్లు, ఇన్ఫ్లుయెన్సర్లతో సహా ప్రైవేట్ వ్యక్తులు పోస్ట్ చేసే వార్తలు, రాజకీయ అభిప్రాయాలతో కూడిన కంటెంట్ ఐటీ నిబంధనలలోని ‘పార్ట్–3’పరిధిలోకి వస్తాయి. గతంలో వృత్తిపరమైన మీడియా సంస్థలకు మాత్రమే పరిమితమైన మూడంచెల పర్యవేక్షణ విధానం ఇకపై వీరికి కూడా వర్తిస్తుంది.కొత్త నిబంధన ఏమిటి? ప్రభుత్వం జారీ చేసే లిఖితపూర్వక వివరణలు, సలహాలు, ఉత్తర్వులు, మార్గదర్శకాలను సోషల్ మీడియా సంస్థలు కచ్చితంగా పాటించాలి. ఏదైనా ప్లాట్ఫాం నిరాకరిస్తే వాటికి ఉన్న ‘సేఫ్ హార్బర్’రక్షణను ప్రభుత్వం రద్దు చేస్తుంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు తప్పుడు పోస్ట్ పెడితే దానికి ఆ సంస్థను బాధ్యులను చేయకూడదనేది సేఫ్ హార్బర్ నిబంధన ఉద్ధేశం. ఈ రక్షణ పోతే యూజర్లు చేసే ప్రతి తప్పుకు లేదా పెట్టే ప్రతి వివాదాస్పద పోస్ట్కు సదరు కంపెనీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కోర్టు కేసులు, భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత సమయంలో తొలగించాలి? నోటీసు అందిన 2–3 గంటల్లో ప్లాట్ఫాంలు సదరు కంటెంట్ను తొలగించాల్సి ఉంటుంది. 2021 నిబంధనల ప్రకారం గతంలో ఉన్న 24–36 గంటల సమయ పరిమితితో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పు.విస్తృత చర్యల్లో భాగమా? ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం డీప్ఫేక్స్, ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్పై కొన్ని నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం అలాంటి కంటెంట్ ఏఐతో రూపుదిద్దుకుందని లేబుల్ వేయడం, ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరగా తొలగించడం తప్పనిసరి చేశారు. ఇప్పుడు వస్తున్న కొత్త ఐటీ ప్రతిపాదన దీనికి తదుపరి దశ. ఆన్లైన్లో ప్రజలు మాట్లాడే లేదా పెట్టే పోస్టులపై ప్రభుత్వ పర్యవేక్షణను మరింత పటిష్టం చేయడం దీని ప్రధాన లక్ష్యం. -
షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ ప్రకటించిన భారీ లేఆఫ్స్ టెక్ ప్రపంచం ప్రకంపనలు రేపాయి. రేపటినుంచి మీ సేవలు అవసరం లేదు అంటూ కేవలం తెల్లవారుజామున 6 గంటలకు పంపిన ఒకే ఒక్క ఈమెయిల్ టెకీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఆందోళన ఇలా ఉండగానే మరో భిన్నమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే..ఒకవైపు ఒరాకిల్ 30వేలమంది ఉద్యోగుల తీసివేత ప్లాన్లతో షాక్ ఇవ్వగా, మరోవైపు గూగుల్ తన ఉద్యోగుల కుటుంబాలకు అందించే 'మరణానంతర ప్రయోజనాల' వివరాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.ఒకవైపు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' విశేషంగా నిలిచాయి. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం గూగుల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి భారీ ప్రయోజనాలు అందిస్తోంది.గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' మరణించిన ఉద్యోగి భాగస్వామికి (Spouse) 10 ఏళ్ల పాటు సగం జీతాన్ని గూగుల్ చెల్లిస్తుంది. అలాగే స్టాక్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉద్యోగికి రావాల్సిన అన్-వెస్టెడ్ స్టాక్స్ (Unvested Stocks) అన్నీ తక్షణమే కుటుంబానికి అందుతాయి.దీంతోపాటు పిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు (ఒకవేళ ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 23 ఏళ్ల వరకు) ప్రతి నెల 1,000 డాలర్లు (సుమారు రూ. 83,000) అందుతాయి. సర్వీస్తో సంబంధం లేకుండా అంటే ఉద్యోగి ఎంత కాలం పనిచేశారనే దానితో సంబంధం లేకుండా కొత్తగా చేరిన వారికైనా, పదేళ్ల అనుభవం ఉన్న వారికైనా ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!మరోవైపు ఈ ప్రయోజనాలపై ఒక సీనియర్ ఇంజనీర్ ఉదాహరణను నెటిజన్లు విశ్లేషించారు. గూగుల్ పాలసీ ప్రకారం, ఒక సీనియర్ ఇంజనీర్ మరణిస్తే ఆ కుటుంబానికి 15 కోట్లకు పైగా అందుతాయి. 2012లో గూగుల్ HP మాజీ చీఫ్ లాస్లో బాక్ రూపొందించిన ఈ విధానం రూపొందించారనీ ఉద్యోగి కుటుంబ భద్రత సంస్థ బాధ్యత అని గూగుల్ నమ్ముతుందని ఆయన వ్యాఖ్యానించారు.10 ఏళ్లలో సుమారు 925,000 డాలర్ల జీతం.లైఫ్ ఇన్సూరెన్స్ కింద 555,000డాలర్లుస్టాక్స్ రూపంలో డాలర్లు 350,000.పిల్లలకు నెలకు వెయ్యి డాలర్లు.మొత్తంగా చూస్తే వెస్టెడ్ స్టాక్స్ కాకుండానే దాదాపు రూ. 15.5 కోట్లు కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.నెటిజన్ల స్పందన"మా మేనేజర్ శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే ఏదో కొండను తవ్వి తెచ్చినట్లు ఫీల్ అవుతారు. కానీ గూగుల్ తన ఉద్యోగి లేకపోయినా వారి కుటుంబాన్ని కాపాడుతోంది. ఇది కదా లైఫ్ గోల్స్ అనాల్సింది!" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. నిజంగా గ్రేట్ ఇది.. దీని విలువను లెక్కగట్టేంత వరకు దీన్ని గ్రహించలేరు అని ఒకరు, కంపెనీలు ఈ విధంగా ఇంత దీర్ఘకాలికంగా ఆలోచించడం చాలా అరుదు.” అని మరొకరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్? -
జగన్ MAVIGUNపై TDP ట్రోల్స్.. ఇచ్చిపడేసిన KS ప్రసాద్
-
సోలో లైఫ్.. సోషల్ మీడియా
ఉదయం లేస్తూనే సోషల్మీడియా వాకిట్లో పక్షుల్లా వాలిపోతుంటారు. రీల్స్, రివైవల్, కబుర్లు, మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు.. వయసు తేడా లేకుండా ఆన్లైన్ వేదికగానే ఎన్నో విశేషాలను పంచుకుంటూ, పెంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా డంప్ అయ్యే ఎన్నో మానసిక సమస్యలనూ నెత్తిన మోస్తున్నారు. ‘ప్రపంచం అంతా ‘పర్ఫెక్ట్’గా ఉందన్న భ్రమతో తమను తాను హింసించుకునేవారి శాతం ఇటీవల పెరుగుతోంది..’ అంటున్నారు నిపుణులు.వైజాగ్ వాసి పదిహేడేళ్ల అనన్య భోజనం తినడం తగ్గించడం మొదలుపెట్టింది. ఈ సమస్య ఎంతగా అంటే ఒకరోజు ఆమెను బలవంతంగా హాస్పిటల్లో చేర్చి, సెలైన్ పెట్టించాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్రభావంతో ఆమె తన శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేది. తినమని తల్లి ఒత్తిడి చేస్తే ‘లైక్స్ రావడం లేదంటే అర్థం, నేను బాగా లేనట్టేగా..’ అని గట్టిగట్టిగా అరుస్తోంది.. అని అనన్య తల్లి ఆవేదన చెందుతోంది.. ∙∙ ఉద్యోగంలో బిజీగా ఉండే మాధవి రిలాక్స్ కావడానికి సోషల్మీడియా ఒక మార్గంగా మారింది. మొదట్లో ఫ్రెండ్స్తో కనెక్ట్ అవడానికి ఆ తర్వాత ఫొటోలు షేర్ చేసేది. ఆ పోస్టులకు లైక్స్, కామెంట్స్ పెరుగుతుండటంతో తరచు చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. ఒకట్రెండుసార్లు ఆమె పెట్టిన ఫొటోకు తక్కువ లైక్స్ రావడంతో నిరాశ మొదలైంది. ‘అందరూ నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, ఎందుకో’ అనుకోవడం మొదలుపెట్టింది. ఇతరుల ఫొటోలు చూసి, తనను తాను పోల్చుకుంటుంది. ‘వారితో పోల్చితే, అంత అందంగా లేను. అందుకే లైక్స్ రావడం లేదు’ అనే భావన పెరిగింది. పనిమీద దృష్టి తగ్గింది. దీంతో ఆందోళన పెరగడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు మొదలయ్యాయి. కనిపించని ఒత్తిడులుఇప్పటికాలంలో సోషల్ మీడియా మహిళల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ అదే సమయంలో ఇది మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. బయటికి కనిపించేది ఫొటోలు, వీడియోలు, లైక్స్, కామెంట్స్ మాత్రమే. కానీ అంతరంగంలో జరిగే మానసిక ఒత్తిడి వేరుగా ఉంటోంది. అందం, ఆనందం, ఆర్థిక విషయాలు, తన చుట్టూ ఏమీ బాగోలేదనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలుఇతరులతో పోల్చుకోవడం. ఇతరులు అందంగా, ఆనందంగా ఉన్న ఫొటోలు, రీల్స్.. చూసి వారి జీవితం వడ్డించిన విస్తరి అనే భావనకు లోనవుతున్నారు. అదే సమయంలో తమ జీవితం ఎంత నిస్సారంగా ఉందో అంచనా వేసుకుంటున్నారు. దీంతో మిగతావారికంటే తమ జీవితం చాలా తక్కువ అనే భావనకు లోనవుతున్నారు. → ఫొటోలు, వీడియోలకు వాడే ఫిల్టర్లు, ఎడిటింగ్, ఏఐ.. వంటి వాటి వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. నిజానిజాలు అర్ధం చేసుకోలేకపోతున్నారు.→ తమపై తమకు ఆత్మవిశ్వాసం లోపిస్తోంది. కుటుంబంపైనా ఈ ప్రభావం పడుతోంది.→ లైక్స్, కామెంట్స్ ద్వారా ఆనందం పొందడం అలవాటై, తక్కువ రెస్పాన్స్ వస్తే ‘బాధ’కు లోనవుతున్నారు. → ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ వల్ల డిప్రెషన్, భయాందోళనకు లోనవుతున్నారు. → ఇతరుల ఆనందం చూసి ‘నేను ఏదో మిస్ అవుతున్నాను’ అనుకుంటున్నారు. → అతి ఎక్కువగా స్క్రీన్ టైమ్లో గడపడం వల్ల మానసిక అలసటకు లోనవుతున్నారు. → సోషల్ మీడియా అంటే రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. సరైన విధంగా వాడితే సమాచారం, ప్రపంచంతో కనెక్టివిటీ ఇస్తుంది. కానీ నియంత్రణ లేకుండా వాడితే మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.నియంత్రణ తప్పనిసరి→ రోజుకు ఒక పరిమితి పెట్టుకోవాలి.→ సోషల్ మీడియాలో కనిపించేది పూర్తి నిజం కాదని గుర్తుంచుకోవాలి.→ వారానికి ఒక రోజు సోషల్ మీడియా నుంచి పూర్తి బ్రేక్ తీసుకోవడం మంచిది.→ ప్రేరణ, ఉత్సాహం, అవగాహన కలిగించే కంటెంట్ను ఫాలో అవడం మంచిది. → మన విలువలను లైక్స్తో కాకుండా మనసుతో కొలవాలి. కుటుంబం, స్నేహితులతో రోజువారీ అంశాలపై చర్చ, మాట్లాడం.. వంటివి చేస్తుంటే సోషల్ మీడియా ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. సోషల్ మీడియా అనేది ఒక వర్చువల్ ప్రపంచం. అక్కడ మనం చూస్తున్నది పూర్తినిజం కాదు. కానీ, మన మెదడు దాన్ని నిజం అనేలా స్వీకరిస్తుంది. అదే సమస్యకు మూలం అవుతుంది. పాజిటివ్గా వచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే ‘ఫీల్గుడ్’ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఫోన్ను పదే పదే చెక్ చేయడం, సోషల్ మీడియా లేకపోతే అసహనం, నిద్రలేమి, పనిమీద దృష్టి తగ్గడం.. వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. రోజులో కొంత సమయమే సోషల్ మీడియా ఉపయోగించడం, అభి రుచులు, వ్యాయామం, కుటుంబంతో సరైన టైమ్ గడపడం వంటివాటి వైపు మనసును మళ్లించగలిగితే సరైన జీవన ఆనందాన్ని పొందగలరు. సమస్యను నియంత్రించుకోలేకపోతే నిపుణులను సంప్రదించి, వారి సూచనలు పాటించడం మేలు చేస్తుంది.– పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ -
ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు
చైనాకు చెందిన వ్యాపారవేత్త యు వెన్హాంగ్ (Yu Wenhong), తనకంటే 30 ఏళ్లు చిన్నవాడైన 25 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సుమారు రూ. 60 కోట్ల కట్నం, విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన వైనం పెళ్లి కాని ప్రసాదులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం చైనా మెడికల్ ఈస్తటిక్స్ రంగంలో ప్రముఖురాలైన యు వెన్హాంగ్ (55), 25 ఏళ్ల లియు యుచెన్ (Liu Yuchen) అలియాస్ రెన్రెన్ను వివాహం చేసుకుంది. యు, యుచెన్ (రెన్రెన్) ఈ మార్చిలో పెళ్లాడింది. పెళ్లి సందర్భంగా తన భర్తకు సుమారు 50 మిలియన్ యువాన్ల (సుమారు రూ.60 కోట్లు) విలువైన నగదు, విలాసవంతమైన ఇళ్లు, రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిందట.(పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్)ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరడంతో వీరి ప్రేమ చర్చల్లో నిలిచింది. మరోవైపు లియు యుచెన్ తమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఇంత విలాసవంతమైన జీవితాన్ని తాను ఊహించలేదని, కానీ ఆమె ప్రేమను, వచ్చిన అవకాశాన్ని ఉప యోగించుకున్నానని భర్త లియు యుచెన్ పేర్కొనడం గమనార్హం. కాగా యుకు గతంలోనూ వివాహాలు అయ్యాయి. అలాగే ఒక విదేశీ మోడల్ అల్బేనియన్ మోడల్ Rolando Lekajతో పదేళ్ల రిలేషన్షిప్లో ఉంది. వీరికి ఒక బిడ్డ కూడా.ఇదీ చదవండి : రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!వీరిద్దరి పరిచయం ఎలా2025లో లైవ్ స్ట్రీమింగ్లో వీరిద్దరూ ఒకరికొకరు పరిచయమైనారు. ఈ పరిచయం వారిని మరింత దగ్గర చేసింది. ఆ తరువాత యు అతనికి రోల్స్-రాయ్స్, మెర్సిడెస్-బెంజ్ మోడళ్ల వంటి ప్రీమియం కార్లతో సహా అత్యంత ఖరీదైన విలాసవంతమైన వస్తువులను బహుమతిగా ఇచ్చిందని చెబుతున్నారు.నెటిజన్లు స్సందన మల్టీ మిలియన్ డాలర్ల డౌరీ కథ చైనీస్ సోషల్ మీడియా అంతటా మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొంతమంది వినియోగ దారులు యు విజయాన్ని, ఆర్థికంగా ఎదిగిన తీరును అభినందిస్తుండగా, ఈ ఉదంతం చైనాలో మారుతున్న సామాజిక విలువలు, సంపద, స్త్రీ-పురుష సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది.యు వెన్హాంగ్ సక్సెస్ స్టోరీసామాన్య కుటుంబంనుంచి వ్యాపారవేత్తగా యు ఎదిగిన తీరు అసామాన్యం. ఈశాన్య చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్లోని డాలియన్లో ఒక సాధారణ ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించింది. తండ్రి మరణం తర్వాత 18 ఏళ్లకే కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. బ్యూటీ ఇండస్ట్రీలో ఐబ్రో టాటూ టెక్నీషియన్గా కెరీర్ ప్రారంభించి, పట్టుదలతో 2004లో హాంగ్కాంగ్లో 'యంగ్ మెర్రీ రియల్ ఇంటర్నేషనల్ గ్రూప్'ను స్థాపించింది. ఆమె తనను తాను 'సెల్ఫ్ మేడ్' మహిళగా ప్రొజెక్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె వ్యాపారం చైనా వ్యాప్తంగా వందలాది బ్రాంచ్లతో విస్తరించింది.వ్యాపార వివాదాలు : ఆమె కంపెనీకి చెందిన కొన్ని కాస్మెటిక్ చికిత్సల శాస్త్రీయతపై గతంలో విమర్శలు వచ్చాయి. అలాగే, 2022లో వందల కోట్ల పన్ను ఎగవేత కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. -
శారీలో నభా నటేశ్ అందాలు.. ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్..!
ఎల్లో డ్రెస్లో పాయల్ రాజ్పుత్ అందాలు..ఏఐ పిక్స్ షేర్ చేసిన రేణు దేశాయ్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గ్లామరస్ పిక్స్..శారీలో మత్తెక్కిస్తోన్న హీరోయిన్ నభా నటేశ్ అందాలు.. మార్చి జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి.. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్ స్టోరీ
కనిపెంచిన తల్లిదండ్రులకు బిడ్డలు ఖరీదైన బహుమతులు అందించడం చాలా కామన్. ఎదిగిన బిడ్డలు ఎంతో ప్రేమగా ఇచ్చిన కానుకను చూసి మురిసిపోవడం ఇంకా కామన్. అయితే తల్లికి ఖరీదైన అందమైన గిష్ట్ ఇచ్చిన కొడుకు ఆ తరువాత తల్లిని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాడు. దీనికి సంబంధింన వివరాలను సోషల్మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. స్టోరీ ఏంటంటే..వేదిక్క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సాహిల్ రాజ్ కుమార్ తన తల్లికి లక్ష రూపాయల బహుమతి కొన్నాడు. కానీ దాన్నితల్లి తీసుకునేందుకు చాలా ష్టపడాల్సి వచ్చింది. దాదాపు అరగంటపాటు ఆమెకు నచ్చచెప్పి ఒప్పించారు.. ఊహించిన దానికంటే తాను చాలా ఎక్కువ సంపాదిస్తానమ్మా.. డోంట్ వర్రీ అంటూ ఆమెను ఒప్పించారు. ఆమెకు 1,200 డాలర్ల (సుమారు 1,00,500 రూపాయలు) విలువైన కళ్లజోడును కొనిచ్చిన హృద్యమైన కథను ఎక్స్లో షేర్ చేశారు. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ, సాహిల్ దానిని "చాలా హృద్యమైన రోజు"గా అభివర్ణించారు.సోషల్ మీడియాలో పంచుకున్న ఒక హృద్యమైన కథ ఆన్లైన్లో వేలాది మంది నెటిజనులను ఆకర్షించింది. తన తల్లి షాపింగ్ చేస్తుండగా అనుకోకుండా చేసిన వీడియో కాల్ అనంతరం, ఆమెకు లక్ష రూపాయల విలువైన డిజైనర్ కళ్లజోడును ఎలా బహుమతిగా ఇచ్చాడో వెల్లడించారు. తాను ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ, తన కోసం విలాస వస్తువులపై అరుదుగా ఖర్చు చేసే తన తల్లి, ఒక దుకాణంలో కళ్లద్దాలు చూస్తుండగా, వాటిలో కొన్నింటిని చూపించడానికి తనకు వీడియో కాల్ చేసిందని గుర్తుచేసుకున్నాడు. అయితే తనకు బాగా నచ్చిన కళ్లజోడు విలువ ఎక్కువ ఉండటంతో , దాన్ని కొనే ఆలోచనను ఆమె వెంటనే విరమించుకుంది. దీంతో కొడుకు కుమార్ కల్పించుకుని, ఆ డబ్బు తానే చెల్లిస్తానని చెప్పాడు, కానీ అతని తల్లికి నమ్మకం కుదరలేదు. అతను నెలకు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు, సంపాదిస్తూ, పొదుపు చేసినప్పుడే అలాంటి బహుమతిని అంగీకరిస్తానని ఆమె చెప్పింది. అలా కుమార్ ఆమెను 30 నిమిషాలు వాదించి ఒప్పించి, చివరకు ఆమె అతన్ని నమ్మిన తర్వాత, కళ్లద్దాలు కొనడానికి అంగీకరించింది. ఇదీ చదవండి : బెంగళూరులో మహిళా టెకీ విషాదాంతంఇది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. కుమారుడిపై ప్రశంసలు కురిపించారు. సగటు భారతీయ కుటుంబాల్లో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలని వ్యాఖ్యానించారు. పిల్లలు తమ జీవితంలో బాగా రాణిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా వారి నుండి ఆర్థిక సహాయం స్వీకరించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరని పేర్కొన్నారు.ఇదీ చదవండి : రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి -
సమంత మెచ్చిన ఇన్స్టా రీల్.. ఆమె టాలెంట్కు ఫిదా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది. మనం ఏదైనా ప్రత్యేకంగా చేస్తే చాలు.. అది క్షణాల్లోనే వైరలైపోతుంది. ఇప్పుడున్న జమానాలో ఇన్స్టా రీల్స్లో మునిగిపోతున్నారు జనాలు. కొంచెం గ్యాప్ దొరికితే ఇన్స్టా ఓపెన్ చేసిన రీల్స్ తెగ చూసేస్తున్నారు. కేవలం చూడడమే కాదు.. తమ క్రియేటివిటీని అంతా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టా ప్రపంచం పచ్చని పల్లె ప్రజల టాలెంట్ను కూడా అందరికీ పరిచయం చేస్తోంది.తాజాగా ఓ మహిళ టైలర్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అచ్చం హీరోయిన్ సమంతతో మాట్లాడుతున్నట్లుగా చేసిన ఈ రీల్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత-యాంకర్ సుమ ఉగాది సందర్భంగా చేసిన వీడియోను సింక్ చేస్తూ ఆ మహిళ టైలర్ చేసిన ప్రమోషన్ నెట్టింట వైరల్గా మారింది. ఆమె హీరోయిన్తో నేరుగా మాట్లాడుతున్నట్లుగా అద్భుతంగా ఎడిట్ చేసి ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఆ మహిళ క్రియేటివిటీని మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ సమంత సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. సమంతను మెప్పించిన రీల్సోషల్ మీడియాలో నెటిజన్ల క్రియేటివిటీకి అద్దం పట్టేలా ఓ మహిళా టైలర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో యాంకర్ సుమతో సమంత మాట్లాడిన వీడియో కాల్ క్లిప్ను వాడుకుని, హీరోయిన్ నేరుగా తనతోనే మాట్లాడుతున్నట్లుగా ఆమె అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియో చూసి… pic.twitter.com/xMtp5jsGXs— ChotaNews App (@ChotaNewsApp) April 1, 2026 -
‘రండి బాబూ రండి.. 50 రూపాయలకే స్వచ్ఛమైన గాలి’
న్యూఢిల్లీ: మనం తాగే మంచి నీటిని బాటిళ్లలో కొనుక్కోవడం మనకు అలవాటే.. అయితే పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని కూడా సీసాల్లో కొనుక్కునే రోజులు వచ్చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఒక వ్యక్తి ‘స్వచ్ఛమైన గాలి’ని విక్రయిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కన్నౌట్ ప్లేస్లో కనిపించిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ధర్మశాల నుంచి ‘ప్యూర్ ఎయిర్’..హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతమైన ధర్మశాల నుంచి స్వచ్ఛమైన గాలిని ప్లాస్టిక్ సీసాల్లో నింపి తీసుకొచ్చినట్లు గాలి విక్రయదారు చెబుతున్నాడు. అతను ఒక్కో బాటిల్ ధర రూ. 50 గా నిర్ణయించాడు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ వాసులు ఈ ‘స్వచ్ఛమైన గాలి’ అనుభవం కోసం క్యూ కడుతున్నారు. ఆ బాటిళ్లు కొనుక్కుని పీలుస్తూ ‘నిజంగానే ఢిల్లీ గాలికంటే ఇది చాలా భిన్నంగా, హాయిగా ఉంది’ అని కొనుగోలుదారులు అభిప్రాయపడటం గమనార్హం. This guy sold “air” from Dharamshala for ₹50 to people in Delhi, and those buying it actually said it felt different from Delhi’s air. What looks like a random video today could turn into a real business and a harsh reality in the coming years, the bigger concern is whether even… pic.twitter.com/MS2nDwzj5A— Nikhil saini (@iNikhilsaini) March 31, 2026విషపూరితమైన గాలికి నిదర్శనంఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. మంగళవారం నాటి లెక్కల ప్రకారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 171 గా నమోదైంది. ఇది ‘పేలవమైన’ కేటగిరీ కిందకు వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు కాలుష్యాన్ని కొంత మేర తగ్గించినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు.ముంచుకొస్తున్న ముప్పు?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ రోజు ఇది ఒక ఫన్నీ వీడియోలా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో గాలిని ఇలాగే కొనుక్కోవాల్సి రావడం ఒక చేదు నిజం కాబోతోంది’ అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ఇది ఒక వింత వ్యాపారంగా కనిపిస్తున్నా, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే రేపు అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’ -
పాతికేళ్లకే కుంగుబాటు!!
ఆమె శరీరానికి జ్వరం వస్తేనే ఇంట్లో సరిగా పట్టించుకోరు. ఇక మనసుకు జ్వరం వస్తే? మన దేశంలో స్త్రీల మానసిక సమస్యలను గుర్తించడం, వైద్యం చేయించడం చాలా తక్కువ. తల్లి, భార్య, చెల్లెలు, అక్క, కుమార్తె... వీరి మానసిక ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలుసుకునేలోపు మానసిక సమస్యలు ముదిరిపోయి ఉంటాయి. అనేక వొత్తిళ్లు, పరిమితులు స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. వాటి పట్ల అవగాహనే సగం వైద్యం. ఇంటిల్లిపాది తెలుసుకోవాల్సిన వరుస కథనాలు నేటి నుంచి...హాస్పిటల్స్లో సైకియాట్రీ, సైకాలజీ విభాగాల్లోని వెయిటింగ్ రూమ్స్లోకి చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ మానసిక సమస్యలతో కనిపిస్తున్నవారు 35 ఏళ్ల లోపువారే ఉంటున్నారు. 84 దేశాలలో వరల్డ్ మెంటల్ హెల్త్ రిపోర్ట్ చేసిన మైండ్ హెల్త్ కోషెంట్ స్కోర్లో భారతీయ యువత 60వ స్థానంలో ఉండి, తక్కువ పనితీరును కనబరిచినట్టు వెల్లడైంది. ఈ విషయంలో ఇండియన్ సైకియాట్రీ సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది. అంటే, మన దేశ యువత మానసిక ఆరోగ్య సమస్యల ముఖచిత్రం ఇప్పుడు చిన్నవయసుకే చేరిపోయిందన్నమాట.వరల్డ్ మెంటల్ హెల్త్ పరిశోధనలో భారతదేశంలోని యువత ఎం.హెచ్.క్యూ స్కోరు సుమారు 33గా ఉంది. ఇది ‘బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న’ వర్గం కిందకు వస్తుంది. దీని వల్ల 18–34 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో దాదాపు 64 శాతం మంది ఇంకా కుటుంబాలపై ఆధారపడుతున్నట్టుగానే తెలిసింది. సాధారణంగానే ఇటీవలి కాలంలో పదమూడు, పద్నాలుగేళ్ల లోపు వయసు నుంచే మానసిక సమస్యలు మొదలవుతున్నాయి. ఇక 25 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆ సమస్యలు 62 శాతానికి పెరుగుతున్నాయి. వీరిలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, మత్తు పదార్థాలపై ఆధారపడటం.. వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని త్వరగా గుర్తించకపోతే తాత్కాలిక సమస్యలుగా ఉండాల్సినవి, జీవితాంతం వెంటాడే పెను భారంగా మారిపోతాయి.మానసిక ఒత్తిడిఈ రోజుల్లో యువత డబ్బును సంపాదించడంలోనూ, విచ్చలవిడిగా ఖర్చు చేయడంలోనూ ఇండిపెండెంట్గా ఉంటున్నారని అనుకుంటారు. కానీ, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇతరులపై ఆధారపడుతున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ ప్రపంచం, గ్లోబల్ పోటీ వల్ల విస్తృతంగా అవకాశాలు పెరిగాయి. కానీ అదే సమయంలో అవన్నీ మనసుపై ఒత్తిడిని కూడా పెంచుతున్నాయి. దీని వల్ల 20–25 ఏళ్ల వయస్సులోనే బర్నౌట్, క్లినికల్ డిప్రెషన్ కేసులు కనిపిస్తున్నాయి అంటున్నారు సైకియాట్రిస్టులు.సామాజిక ఒత్తిడిఈ రోజులు ఎలా ఉంటున్నాయంటే చిన్న వయస్సులోనే ‘పనితీరును అద్భుతంగా ప్రదర్శించాలి’ అనే ఒత్తిడి మొదలవుతోంది. పిల్లల్లో వారి మైండ్ పూర్తిగా ఎదగకముందే ‘కంపారిజన్’ అనే భారం పడుతోంది. ఒక దశలో చదువుల ఒత్తిడి, మరొక దశలో ఉద్యోగ అనిశ్చితి, వివిధ రకాల ప్రతిభ, డిజిటల్ స్మార్ట్.. రోజువారీ స్ట్రెస్గా మారిపోయాయి. అన్నీ సాధించేయాలనే తపన కూడా మైండ్ను ప్రశాంతంగా ఉండనివ్వడంలేదు. డిజిటల్ అడిక్షన్ – కంపారిజన్ ట్రాప్సోషల్ మీడియాలో అందరి జీవితాలు ‘పర్ఫెక్ట్’గా కనిపిస్తాయి. అవి నిజం కాకపోయినా మనలో మనకే తక్కువవాళ్లమనే భావనను పెంచుతాయి. తెలిసినవారి, పరిచయస్తుల సోషల్మీడియా పర్ఫెక్ట్ ఫొటోలు చూసి పోల్చుకోవడం పెరిగింది. ‘నేను అంతగా బాగోలేను, నేనేమీ చేయలేను’ అనే భావనలో సెల్ఫ్–ఎస్టీమ్, సోషల్ ఐసోలేషన్... వంటివి పెరుగుతున్నాయి.ఒంటరితనం సృష్టించిన వలయంఇప్పటి జనరేషన్ సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువగా కనెక్ట్ అయి ఉంది. కానీ, గాఢమైన, వాస్తవ సంబంధాలు మాత్రం తగ్గిపోయాయి. అదే ఒంటరితనానికి, డిప్రెషన్ కు ప్రధాన కారణంగా మారుతోంది. యువత ఈ విధంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. యువత ఆరోగ్యంగా, ఉత్పాదకంగా ఉంటేనే దేశం సర్వ సంపన్నంగా ఎదుగుతుంది. కానీ, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 70–80 శాతం మందికి సరైన సమయంలో చికిత్స అందడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఒక తరం యువత తమ సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.నియంత్రణ తప్పనిసరి→ చాలా మానసిక సమస్యలు ముందే గుర్తించి, నిపుణులను సంప్రదించి, తగిన సూచనలు పాటిస్తే నియంత్రణలో ఉంటాయి.→ ఆలస్యమైతే సులభంగా నయం అయ్యే సమస్య జీవితాంతం ఉండే డిసేబిలిటీగా మారిపోతుంది.→ స్కూళ్లు, కాలేజీల్లో మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. → నేటి తరాన్ని మన ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మెరుగైన ఫలితాలను పొందుతాం.చర్చించే స్వేచ్ఛ ఉండాలిమానసిక కుంగుబాటు, సమస్యలను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. మన దేశంలో ఇప్పటికీ కొన్నిచోట్ల మానసిక సమస్య అంటే ‘సంకోచం’తో ఆగిపోతారు. ఇతరులతో పోటీ, పోలిక అనేవి ఈ రోజుల్లో చిన్నప్పటి నుంచే బాగా పెరిగాయి. అలా కాకుండా స్వీయ సమర్థతను వెలికి తీయగలగాలి. ఏ పని ఎంతవరకో హద్దులు ఏర్పాటు చేసుకోవాలి. సమయ పాలన, పోషకాహారం, ఉత్సాహభరితమైన జీవనశైలి.. మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ఎలాంటి సంకోచం లేకుండా మానసిక సమస్యలపై కుటుంబంలోనూ, సమాజంలోనూ చర్చించే స్వేచ్ఛ ఉండాలి. మానసిక ఆరోగ్యానికి సంబంధించి యువతకు అనుకూలమైన హెల్త్కేర్ సిస్టమ్ అవసరం.– డాక్టర్ మంజులారావు, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్లోని సాయి నివాస్ అపార్ట్మెంట్లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్కు చేదు అనుభవం ఎదురైంది. పాకిస్తాన్లో జరిగిన కీలక నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్బంగా ఇషాక్ దార్ కాలు జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల మేరకు.. తాజాగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నాలుగు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈజిప్ట్, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలలో మధ్యవర్తిగా తనను తాను నిలబెట్టుకోవడానికి ఇస్లామాబాద్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలట్టిని ఆహ్వానించే సమయంలో కాలు జారి కింద పడిపోయారు.#Pakistan के Deputy Prime Minister और Foreign Minister #Ishaq_Dhar ज़मीन पर धड़ाम!इशाक Saudi और Egypt के विदेश मंत्रियों का स्वागत कर रहे थे कि चलते चलते अचानक गिर गए.. pic.twitter.com/0H2aNHdP6i— Ruby Arun रूबी अरुण (@arunruby08) March 29, 2026దీంతో, వెంటనే అక్కడ ఉన్న అధికారులు ఆయనను పైకిలేపేందుకు సహాయం చేశారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. సమావేశం యథావిధిగా కొనసాగినట్టు సమాచారం. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటికి కేవలం పాకిస్తాన్ నేతలకు మాత్రమే సాధ్యమని.. ఎవరూ ఇలా ప్రయత్నించవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Ishaq Dar sends his regards and slots to the Foreign Ministers of Iran and Egypt like this.It's a new style of slots of Pakistan military regime 😂Note: None should try this kind of slots it's just Pakistan military regime style 😀 😂 pic.twitter.com/QbaXf36Aea— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) March 29, 2026 -
బంగారం కాదు బిల్డప్
సాక్షి, హైదరాబాద్: ఒంటి నిండా బంగారంతో సూర్య భాయ్గా సోషల్మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చి, కొన్ని సినిమాల్లోనూ నటించిన హైదరాబాదీ పల్లపు సురేష్ కుమార్ చెప్పినవన్నీ కేవలం బిల్డప్లేనని తేలిపోయింది. ఢిల్లీ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు పట్టుకున్న ‘బంగారు బాబు’ కొండా విజయ్కుమార్ వ్యవహారంతో సూర్య భాయ్ కథ బయటికి వచ్చింది. శుక్రవారం విచారణ చేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడు ధరించే బంగారు ఆభరణాల్లో అనేకం కోటింగ్తో కూడినవి స్పష్టం చేశారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని తేల్చారు. గుట్టు వీడిన కట్టుకథలు.. నగరంలోని అత్తాపూర్నకు చెందిన పల్లపు సురే‹Ùకుమార్ అలియాస్ సూర్య భాయ్ తాను ధరించే బంగారు ఆభరణాలు, యూట్యూబ్ చానళ్లతో పాటు ఇతర సోషల్మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలతో అనేక మందిని సుపరిచితుడిగా మారాడు. తాను ధరించే నగల విలువ రూ.కోటి వరకు ఉంటుందనీ ప్రగల్భాలు పలికేవాడు. ఇప్పటి వరకు ఇతడి ప్రచారాన్ని అంతా నమ్మారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో మొదలైన ఓ కేసు విచారణ శుక్రవారం హైదరాబాద్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇతడు చెప్పేవన్నీ కట్టుకథలని, ధరించే వాటిలో అత్యధికం నకిలీ నగలని తేలిపోయింది. సెటిల్మెంట్లతో వాహనాల కొనుగోలు సూర్య భాయ్ గడిచిన ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని గుర్తించారు. 2022–23లో రూ.4.9 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించారని తేల్చారు. అతడితో పాటు భార్య పేరు మీదా సొంద ఇంటితో సహా ఎలాంటి స్థిరాస్తులు లేవని, నెలకు రూ.20 వేల అద్దె చెల్లిస్తూ ఓ ఫ్లాట్లో అద్దెకు ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అతడికి ఉన్న థార్, సఫారి, ఎండీవర్ వాహనాలతో పాటు బుల్లెట్ బైక్ను భూవివాదాలు సెటిల్మెంట్ చేయడం ద్వారా వచ్చిన కమీషన్తో కొనుగోలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. సూర్యభాయ్ ధరించే నగల విలువ రూ.3 లక్షలే అని తేల్చారు. అతను ధరించేవి ఎక్కువ భాగం రాగి, వెండితో తయారయ్యాయని, వాటి పైన బంగారం, రేడియం పూత పూసినట్లుతేల్చింది. ఐటీ అధికారుల విచారణలో సూర్య భాయ్ తాను సమాజంలో పాపులారిటీతో పాటు సినిమాల్లో అవకాశాలు పొందడానికి ఇలా చేశానని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారాలపై ఐటీ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
హెబ్బాపటేల్ గ్లామరస్ లుక్.. వేకేషన్లో ధనశ్రీ వర్మ చిల్..!
బాలీవుడ్ బ్యూటీ సురభి జ్యోతి బేబీ బంప్ లుక్..పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ పునర్నవి..హీరోయిన్ హెబ్బా పటేల్ గ్లామరస్ పిక్స్..వేకేషన్లో చిల్ అవుతోన్న కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ..హీరోయిన్ సమంత స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) -
సోషల్ మీడియా అసత్య వార్తలతో దేశం ఇబ్బంది పడింది! : కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలతో అనేక రకాలు ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో ఒక్క కుటుంబమో, ఒక వ్యక్తి ఇబ్బంది పడడం లేదని, యావత్ దేశం ఇబ్బంది పడేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయిల్ కంపెనీలు, డీలర్లతో కలిసి కిషన్రెడ్డి సీజీజీ టవర్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాలపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని చెప్పారు. దేశానికి అవసరమైన ఇంధనం కొరత లేకుండా ఉండేందుకు, ఇతర దేశాలు నిర్ణయించిన ధరలను చెల్లించి అయినా సరే, పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులను దేశానికి తీసుకురావడంలో కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని దేశాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో మనం ఇంధన వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ, దేశవ్యాప్తంగా రైల్వేలను విద్యుదీకరణ చేస్తూ, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కొరత పేరుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎక్కువ ధరకు అమ్మినా, స్టాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కిషన్రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులకు కావాల్సిన వాటిని సకాలంలో చేర్చేలా కంపెనీలు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం గతంలో గ్యాస్ బుక్ చేసుకున్నట్టుగా ఇంటి దగ్గరకి వచ్చి ఇస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పొల్చితే మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, కొంతమేర ధరల తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలిగించినట్టు అవుతుందన్నారు. ప్రజలకు భారం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించద్దని చెప్పారు. ఈ సమావేశంలో జగన్మోహన్రెడ్డి, అమరేందర్రెడ్డి, సుశీల్కుమార్ రాయ్, నిలేశ్, పీయూష్ మిత్తల్ పాల్గొన్నారు. -
ఐపీఎల్ బెట్టింగ్స్.. ప్రత్యేక నిఘాతో సజ్జనార్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బెట్టింగ్లపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు వీడియో షేర్ చేశారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సమాచారం ఇవ్వాలన్నారు.హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా..‘బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఆన్లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్లైన్ బెట్టింగ్లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి అని’ వీడియో షేర్ చేశారు. #SayNoToBettingబెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్లను… pic.twitter.com/BA4uUttaIU— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 28, 2026 -
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్.. పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ..!
బిగ్బాస్ బ్యూటీ దివి శ్రీరామనవమి లుక్..పట్టు పరికిణిలో అరియానా గ్లోరీ అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ గ్లామర్..వైట్ డ్రెస్లో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హోయలు.. బాలిలో చిల్ అవుతోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
రెండు నెలల దాకా నో ఫికర్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం ఇండియాలో భయాందోళనలు సృష్టిస్తోంది. ప్రధానంగా ఇంధనం విషయంలో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం పంపుల వద్ద బారులు తీరుతున్నారు. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా వాణిజ్య ఎల్పీజీ సరఫరా తగ్గింది. హోటళ్లు మూతపడుతున్నాయి. ఇంధనం విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో గందరగోళం మరింత పెరిగిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నా వదంతులు మాత్రం ఆగడం లేదు. అందుకే ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మరో రెండు నెలల దాకా మనకు ఢోకా లేదని భరోసా ఇచ్చింది. అలాగే 8 లక్షల టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, దీంతో దేశమంతటా ఒక నెల మొత్తం గ్యాస్ అవసరాలు తీరుతాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఎంతమాత్రం లేదని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేయడం వల్ల జనం ఆందోళనకు గురై ఇంధనం కోసం ఎగబడ్డారని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రభుత్వం మన దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వల వివరాలను బయటపెట్టడం ఇదే మొదటిసారి. ‘క్యాష్ అండ్ క్యారీ’వల్ల అంతరాయం నిజమే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టంచేసింది. అవి సాధారణంగానే పని చేస్తున్నాయని, చమురు సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ వివరణ ఇచ్చింది. కొన్నిచోట్ల పరిమితంగానే పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించింది. చమురు కంపెనీలు కొత్తగా అమలు చేస్తున్న ‘క్యాష్ అండ్ క్యారీ’విధానం వల్ల చిన్న పట్టణాల్లో కొంత అంతరాయం ఏర్పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. నిధుల సమస్య కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పంపుల యజమాన్యాలకు సహకరిస్తున్నట్లు పేర్కొంది. ఇంధనం, ఎల్పీజీ సరఫరా ప్రస్తుతం పూర్తి సురక్షితంగా, నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించింది. అన్ని రిటైల్ ఇంధన కేంద్రాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని పునరుద్ఘాటించింది. ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా దురుద్దేశపూర్వకంగా సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. 150కిపైగా దేశాల నుంచి దిగుమతి ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన నాలుగో దేశం భారత్. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో ఐదో స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ముడి చమురు, గ్యాస్ దిగుమతులు సగానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా 150కిపైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. మనదేశంలో అన్ని రిఫైనరీలు 100 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నాయని, రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు సరఫరాల ఒప్పందాలను భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఖరారు చేసుకున్నాయని స్పష్టంచేసింది. మన దగ్గర మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురును, ఇంధనాన్ని నిల్వ చేసకొనే సామర్థ్యం ఉన్నట్లు వెల్లడించింది.ఇంధన ఎమర్జెన్సీకి ఆస్కారం లేదు ప్రపంచంలో ఎక్కడం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సరే మన దగ్గర ప్రతి పౌరుడికి రెండు నెలలపాటు స్థిరంగా ఇంధనం సరఫరా చేయగలమని కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని నెలలపాటు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టామని వెల్లడించింది. ఎల్పీజీ విషయంలో దేశీయంగానే ఉత్పత్తిని పెంచుతున్నామని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నామని కేంద్రం స్పష్టంచేసింది. ఇంధనం, గ్యాస్పై తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్ని దేశాల్లో జాతీయ ఇంధన ఎమర్జెన్సీ విధించారని, సరఫరా తగ్గించారని, ధరలు పెంచారని.. మన దేశంలో అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. -
హీరోయిన్ చేస్తానని నా భార్యను తీసుకెళ్లాడు సార్..!
నాకు నలభై సంవత్సరాలు. నా భార్య స్వాతికి ముప్పై సంవత్సరాలు (పేర్లు మార్చబడినవి). మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆమె చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే వంటలు చాలా బాగా చేస్తుంది. అయితే నలుగురిలో తాను ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం ఆమెకు ఎక్కువ. కోవిడ్ సమయంలో సరదాగా యూట్యూబ్లో వంటల వీడియోలు చేయడం ్రపారంభించింది. మొదట్లో మంచి వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. కానీ తరువాత వ్యూస్ తగ్గిపోయాయి, సబ్స్క్రైబర్లు కూడా పెరగలేదు. అదే సమయంలో రీల్స్ ట్రెండ్ మొదలైంది. దాంతో ఆమె వంటలు తగ్గించి చిన్నచిన్న డ్యాన్సులు, స్కిట్స్ చేయడం ్రపారంభించింది. ఇతరుల మాదిరిగా తనకు వ్యూస్ రావడం లేదని రొమాంటిక్ పాటలకు, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఈ లోపు సోషల్ మీడియాలో పరిచయం అయిన ఒక వ్యక్తి తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని, తరువాత ఆమెను హీరోయిన్ని చేస్తానని నమ్మబలకడంతో ఆమె నేను ఎంత చెప్పినా వినకుండా హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. అతను రెండు మూడు చిన్న సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు ఇచ్చాడు. కానీ ఆమె మాత్రం త్వరలోనే హీరోయిన్ అవుతానని నమ్ముతోంది. ఆ వ్యక్తి ఆమెను ప్రలోభపెట్టి అన్ని రకాలుగా తన వైపు తిప్పుకుంటున్నాడని అర్థమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు సర్దిచెప్పకపోగా మా కూతురు హీరోయిన్ అవుతుందని, నేను అనవసరంగా అనుమానాలు పెంచుకుంటున్నానని నా మీదనే ఎదురు దాడి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో నేను ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. – నరసింహారావు, విజయవాడమీరు ఎంత వేదన అనుభవిస్తున్నారో అర్థమవుతోంది. ఒకవైపు బాధ, మరోవైపు అవమానం, కోపం, నిరాశ ఇవన్నీ కలగలిసిన పరిస్థితి మీది. ఇక మీ భార్య విషయానికి వస్తే, ఆమెకు ముందు నుంచే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆకాంక్ష ఉన్నట్లు స్పష్టమవుతోంది. కొందరిలో ఇలాంటి వ్యక్తిత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తింపు రావడం మాత్రమే వారికి చాలా ముఖ్యం. యూట్యూబ్లో వంటల వీడియోల ద్వారా కొంతకాలం ఆమెకు ఆ గుర్తింపు వచ్చింది. కానీ వ్యూస్, సబ్స్క్రైబర్లు తగ్గడంతో ఆమె రీల్స్, ఇతర వీడియోల వైపు వెళ్లి ఉండవచ్చు. సోషల్ మీడియాలో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు కొత్తగా ప్రయత్నిస్తున్న మహిళలను ప్రలోభపరుస్తుంటారు.ఇలాంటి సమయంలో మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకువెళ్లడం చాలా ముఖ్యం. మొదటగా.. ఆమె చేస్తున్న ప్రతి దాన్ని పూర్తిగా తప్పు అని చెప్పి, ఆపమని ఒత్తిడి చేస్తే ఆమె ఇంకా మీకు దూరమయ్యే అవకాశం ఉంది. బదులుగా ‘‘నీ ప్రయత్నాలకు నేను కూడా తోడుగా ఉంటాను’’ అనే విధంగా మాట్లాడడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవసరమైతే కొంతకాలం ఆమెతో కలిసి ఆడిషన్లకు వెళ్లడం ద్వారా ఆమె ఒంటరిగా ఉండే పరిస్థితి తగ్గుతుంది. రెండవది.. సినిమా రంగంలో ఇప్పటికే పనిచేస్తున్న... లేదంటే స్థిరపడిన వ్యక్తులతో ఆమె మాట్లాడేలా చూడండి. ఆ రంగంలో ఉన్న కష్టాలు, వాస్తవ పరిస్థితుల గురించి వాళ్లు చెబితే కొన్నిసార్లు అది ఎక్కువ ప్రభావం చూపుతుంది. మూడవది.. మీ పిల్లల గురించి కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్లు ఈ పరిస్థితి వల్ల ఒత్తిడికి గురికాకుండా చూడాలి. అవసరమైతే కొంతకాలం వారిని హాస్టల్లో చేర్పించండి. నాలుగవది.. మీ అత్తమామలతో కూడా ప్రశాంతంగా మాట్లాడండి. ‘‘ఆమె నటనావకాశాల కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆమె భద్రతే నాకు ముఖ్యం’’అని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఇంతేకాదు.. చట్టపరమైన విషయాల గురించి కూడా మీరు అవగాహన కలిగి ఉండటం మంచిది. ఆ వ్యక్తి నిజంగా మోసం చేస్తున్నాడని అనిపిస్తే సంబంధిత ఆధారాలను సేకరించండి. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనిషిని బలవంతంగా మార్చడం సాధ్యం కాదు, ఆమె సొంత నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారని గమనించాలి. కాబట్టి మనం చేయగలిగేది ఓపికగా ప్రయత్నించడం, అదే సమయంలో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా ఉండడం మాత్రమే! పరిస్థితి క్లిష్టంగా అనిపిస్తే ఒక మంచి క్లినికల్ సైకాలజిస్టు లేదా సైక్రియాట్రిస్టు దగ్గర ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు మనశ్శాంతి కోల్పోకుండా మీ శ్రేయోభిలాషులతో కూడా సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి. ఒక్కోసారి జీవితంలో మనం అన్నీ అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఓపిగ్గా ముందుకెళ్లండి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
చిరునవ్వులు.. డ్యాన్సులు..
‘‘పెళ్లి వేడుకల తర్వాత మేం కొన్నాళ్లు తీరికగా గడపాలనుకున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న జరిగిన విషయం తెలిసిందే. హల్దీ, సంగీత్, పెళ్లి, రిసెప్షన్, గుడికి వెళ్లడం, సత్యనారాయణ వ్రతం, అభిమానులతో విందు, మీడియాని ప్రత్యేకంగా కలవడం... ఇలా వివాహ వేడుకలతో బిజీ బిజీగా గడిపిన విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ఉరుకులు పరుగులు లేకుండా కాస్త ప్రశాంతంగా ఉండాలనుకున్నారు. అందుకే థాయ్ల్యాండ్లోని కో సామ్యూయ్ దీవికి వెళ్లారు. అయితే ఈ నూతన జంటతో పాటు వీరి స్నేహితులు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ప్రశాంతమైన ఉదయాలు, ఈతతో మధ్యాహ్నాలు, టేబుల్ టెన్నిస్ మరియు పూల్ గేమ్స్తో సాయంత్రాలు, సినిమాలతో రాత్రిళ్లు... ఇలా చిరునవ్వులతో సమయం గడిచి΄ోయింది. కో సామ్యూయ్ మాకు ఇల్లులానే అనిపించింది. ఫ్రెండ్స్తో కలిసి గడిపిన ఆ ఆనంద క్షణాలు’’ అని పేర్కొని, ఇన్స్టాగ్రామ్ వేదికగా రష్మిక కొన్ని ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ‘మై హజ్బెండ్’ అని విజయ్ని రష్మిక పిలవడం, విజయ్ నవ్వుతూ చూడడం, ఇంకా రష్మిక కోసం విజయ్ పిజ్జా తయారు చేయించి, ఇవ్వడం, ఇద్దరూ డ్యాన్స్ చేయడం, చిరునవ్వులు చిందించడం, మాట్లాడుకోవడం వంటి విజువల్స్ ఉన్నాయి. -
మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్.. బిగ్ బాస్ దివి స్టన్నింగ్ పోజులు
కాఫీ తాగుతూ హీరోయిన్ మేఘా ఆకాశ్ చిల్..బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గ్లామరస్..బిగ్బాస్ దివి స్టన్నింగ్ పోజులు..మాల్దీవుస్లో మాళవిక రాజ్ చిల్..బుల్లితెర భామ దివ్యాంక త్రిపాఠి సీమంతం వేడుక.. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) -
వైరల్ వీడియో.. కింగ్ కోబ్రాతోనే ఆటలా..?
విష సర్పాలతో ఆటలు చాలా ప్రమాదకరం. స్నేక్ క్యాచర్స్ కూడా పాములను పట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అందులోనూ అత్యంత విష సర్పమైన కింగ్ కోబ్రాను పట్టుకోవడం చాలా ప్రమాదం. ఇక్కడొక వ్యక్తి కింగ్ కోబ్రాను బంధించిన వైనం చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురౌవుతుంది. ఆ కోబ్రాను బంధించే క్రమంలో అది ఒకసారి చిక్కినట్లే చిక్కి మళ్లీ బుసలు కొట్టిన తీరు చూస్తే అమ్మో అనిపించకమానదు. అయినా చివరకు అత్యంత చాకచాక్యంగా ఓ గొట్టం సాయంతో దాన్ని బంధించాడు ఆ స్నేక్ క్యాచర్. ఒక గొట్టం, ఒక సంచి సాయంతో దాన్ని ఎట్టకేలకు పట్టుకున్నాడు. కనీసం చేతికి గ్లౌజ్లు కూడా లేకుండానే పట్టుకోవడం ఇది చూసిన నెటిజన్లకు మరింత కలవరాన్ని కలిగించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం అటు-ఇటు అయినా ఇక ఆ కోబ్రా నుంచి తప్పించుకోవడం కష్టమనేది ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కింగ్ కోబ్రా ఎంత ప్రమాదమంటే ఒకే కాటు ద్వారా 400–500 mg వరకు విషం ఇంజెక్ట్ చేయగల శక్తి ఉంటుంది. ఈ పరిమాణం 11 మంది మనుషులను లేదా ఒక ఏనుగును చంపగలదు అని శాస్త్రీయంగా నిర్ధారించబడింది కూడా. మరి అటువంటి కింగ్ కోబ్రాతో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పట్టుకోవడం ప్రాణం మీదకు తెచ్చుకున్నట్లే అవుతుందని నెటిజన్లు అంటున్నారు.కాస్త అటు ఇటు అయ్యి ఉంటే..5 నిమిషాల్లో అతని ప్రాణం పోవడం ఖాయం! #KingCobra pic.twitter.com/G8W2d22SVT— UttarandhraNow (@UttarandhraNow) March 24, 2026 -
విశాఖలో అద్భుత సైకత శిల్పం.. పర్యాటకుల సందడి
విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరం మరో అరుదైన ఘటనకు నిలయమైంది. విశాఖలో సరికొత్త సైకత(ఇసుక శిల్పం) శిల్పం పర్యాటకులకు మరింతగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ సరికొత్త సైకత శిల్పం ఏంటని అనుకుంటున్నారా?. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్ ఫుడ్ చైన్ 'కేఎఫ్సీ' (KFC)కి చెందిన చికెన్ బకెట్. దీనికి సంబంధించిన భారీ ఆకార శిల్పం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇది భారత్లోనే అతిపెద్ద ఇసుక నిర్మాణం కావడం గమనార్హం.విశాఖపట్నం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రామకృష్ణ మిషన్ బీచ్లో ఇటీవల ఒక అద్భుతమైన ఇసుక శిల్పం వెలిసింది. విశాఖలో కేఎఫ్సీ నూతన రెస్టారెంట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఇసుక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, కేఎఫ్సీ సైకత శిల్పం సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. కాగా, ఈ అద్భుత కళాఖండాన్ని ప్రముఖ స్థానిక సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. కేవలం ఇసుకను మాత్రమే ఉపయోగించి తయారు చేసిన ఈ శిల్పం చూడటానికి అచ్చు అసలైన కేఎఫ్సీ చికెన్ బకెట్లాగే ఉండటం గమనార్హం.ఇక, ఈ శిల్పంపై కేఎఫ్సీ వ్యవస్థాపకుడు కల్నల్ సాండర్స్ ముఖచిత్రాన్ని ఎంతో స్పష్టంగా చెక్కారు. దీనిని రూపొందించడానికి ఆయన సుమారు రెండు రోజుల పాటు నిరంతరంగా శ్రమించారు. ఈ భారీ శిల్పాన్ని "ఇండియాస్ టాలెస్ట్ శాండ్ బకెట్" గా అభివర్ణిస్తున్నారు. బీచ్కు వచ్చే పర్యాటకులు ఈ శిల్పం ముందు నిలబడి సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ భారీ ఇసుక శిల్పం ఇప్పుడు నగరవాసులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక, ఇది విశాఖపట్నం నగరంలో కేఎఫ్సీ 14వ బ్రాంచ్ కావడం విశేషం. సముద్ర తీర వాతావరణానికి అనుగుణంగా, కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందించేలా ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ డిజైన్ను రూపొందించారు. -
‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్!
చాంగ్చున్: చైనాలోని జిలిన్ ప్రావిన్స్లో కొందరు దొంగలు ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్తున్న ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, ఎట్టకేలకు తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.ఈ కథలోకి వెళితే ఈ ఏడు కుక్కలు వేర్వేరు జాతులకు చెందినవి. కానీ ఇవన్నీ ఒకే గ్రామంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా మెలుగుతుంటాయి. అయితే కొందరు దొంగలు వీటిని వేర్వేరు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోనికి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కు నుంచి అవి ఎలాగోలా బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ, ఇవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి. Seven dogs stolen from their owners have gone viral after escaping from an illegal transport truck and making their way home.They traveled around 17 km together, led by a corgi across highways and fields, now safely back with their respective owners..🐶🐾🥺❤️ pic.twitter.com/H5VB9BQkGB— 𝕐o̴g̴ (@Yoda4ever) March 23, 2026చాంగ్చువాంగ్ ఎక్స్ప్రెస్వే హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నా, ఈ ఏడు కుక్కలు ఒక సైనిక దళం మాదిరిగా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి. ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదిలివేయలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడగా, చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ ముందుకు సాగింది. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, వాటికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి.రెండు రోజుల పాటు తిండి, నీరు లేకపోయినా పొలాలు, రోడ్లు దాటుకుంటూ దాదాపు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక వాలంటీర్లు డ్రోన్ల సాయంతో వీటిని గమనిస్తూ వచ్చారు. చివరికి అవి తమ సొంత గ్రామానికి చేరుకోగానే, వాటి యజమానుల ఆనందానికి అవధులు లేవు. మృత్యువు ముఖం వరకు వెళ్లి, తిరిగి ప్రాణాలతో వచ్చిన తమ పెంపుడు జంతువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.ఇది కూడా చదవండి: ‘ఆంత్రోపిక్’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్! -
యూట్యూబర్లకు నోటీసులు.. TDP తప్పులను ప్రశ్నిస్తే జైలుకే
-
స్విమ్ షూట్లో హీరోయిన్ అనితా.. సముద్రంలో ప్రగ్యా జైస్వాల్ చిల్..!
వైట్ బ్యూటీలా మెరిసిపోతున్న ది రాజాసాబ్ బ్యూటీ..సముద్రంలో జలకాలాడుతోన్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్...ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా..స్విమ్ షూట్లో మెరిసిన హీరోయిన్ అనితా.. View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
తమిళనాడులో దారుణం.. వైరల్ వీడియో
ఇటీవలి కాలంలో కుక్క దాడులు దారుణంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూకి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. తాజాగా తమిళనాడులో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంటి ముందు నుంచి వెళ్తున్న వారిపై ఓ పెంపుడు కుక్క దాడి ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, తమ కుక్క దాడి చేస్తున్న సమయంలో దాని యజమానులు చూస్తూ ఉండిపోవడం దారుణం. దీంతో, వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో వేదారణ్యం సమీపంలోని తోప్పుతురై ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడికి పాల్పడింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది.అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. వారితోనే(బాధితులతో యజమానులు) వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆమె కుక్కను కర్రతో కొట్టిన తర్వాత అది అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | நாகை: வேதாரண்யம் அருகே தாய் மற்றும் மகளை கடித்து தாக்கிய வளர்ப்பு நாயை வேடிக்கை பார்த்த உரிமையாளர் #SunNews | #DogIssue | #UntrainedDogs pic.twitter.com/xKB7LsyPTh— Sun News (@sunnewstamil) March 21, 2026 -
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
వాషింగ్గన్: ఎప్పుడూ సంచలనాలకు అడ్డాగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రపంచవ్యాపంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్బీఐ (ఎఫ్బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. అతని మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఒకప్పుడు తనపై వచ్చిన రష్యా సంబంధాల ఆరోపణలను విచారించిన ముల్లర్ మరణంపై ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.విద్వేషానికి పరాకాష్టముల్లర్ మరణవార్త తెలిసిన వెంటనే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. ‘రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. మంచిదైంది.. ఆయన చనిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపై ఆయన అమాయకులను బాధించలేరు’ అంటూ పోస్ట్ చేశారు. గతంలో ముల్లర్ చేపట్టిన దర్యాప్తును ట్రంప్ పదేపదే ‘విచ్ హంట్’ (రాజకీయ కుట్ర)గా అభివర్ణించేవారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముల్లర్పై ఆయనకున్న తీవ్ర విద్వేషాన్ని బయటపెట్టాయి.ఎఫ్బీఐలో కొత్త ఉత్సాహంముల్లర్ తన 12 ఏళ్ల పదవీ కాలంలో ఎఫ్బీఐ రూపురేఖలను మార్చివేశారు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు వారం రోజుల ముందే ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కేవలం నేర పరిశోధన సంస్థగా ఉన్న ఎఫ్బీఐని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ముల్లర్కే దక్కుతుంది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నియమితులైన ఆయన, రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కింద పనిచేశారు.ట్రంప్.. ఆయన 34 మంది స్నేహితులు..2013లో పదవీ విరమణ చేసిన ముల్లర్, 2017లో మరోమారు వార్తల్లోకి నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి, రష్యాకు మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఆయన ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమితులయ్యారు. దాదాపు 22 నెలల పాటు సాగిన ఈ విచారణలో ట్రంప్ సన్నిహితులతో సహా 34 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2019లో ఆయన సమర్పించిన 448 పేజీల నివేదికలో.. ట్రంప్ బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, అది నేరపూరిత కుట్ర అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ముల్లర్ తేల్చారు. అప్పటి నిబంధనల ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్పై క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ, ట్రంప్ దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. ముల్లర్ కుటుంబ సభ్యులు ఆయన ధృవీకరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం -
దళితుడిని ఇంట్లోకి రానిస్తావా..
రాజమహేంద్రవరం సిటీ: ‘ఏయ్.. ఏంటి దళితుడిని ఇంట్లోకి రానిస్తూ మాదర్చోద్ వేషాలు వేస్తున్నావు. నీ కొడుకు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు కదా! మంత్రి కొల్లు రవీంద్రతో చెప్పి ఉద్యోగం తీయించేస్తా’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళను బెదిరించిన ఫోన్ రికార్డింగ్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం రోజుల కిందట వ్యాపార లావాదేవీల్లో ఓ వ్యక్తిని అప్పారావు బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మరచిపోకముందే ఓ మహిళను ఫోన్లో బెదిరించిన ఆడియో జిల్లాలో మరోసారి వైరల్గా మారింది. జాన్ను నరికేస్తా.. నగరంలో ఒంటిరిగా నివసిస్తున్న మహిళ ఇంటికి ఓ దళితుడు వస్తున్నాడనే విషయంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘దళితుడు జాన్ను ఇంటికి రాకుండా బయటకు తరిమి వేయ్.. లేనిపక్షంలో ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న నీ కొడుకు ఉద్యోగం తీయించేస్తా.. నీ అంతు చూస్తా’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. జాన్ అనే వ్యక్తి మాల మహానాడు పేరిట వ్యవహరిస్తున్నాడని, ఇది సరైనది కాదని అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద కూడా మాల మహానాడు, మాదిగ దండోరా ఉన్నాయని, జాన్ విషయం త్వరలో తేల్చేస్తానంటూ ఆయన ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఫైనల్గా నీ బతుకు నువ్వు బతుకు. నేను అడుగు పెట్టానంటే అన్నీ తేల్చి పారేస్తాను..నీ బతుకేంటో రోడ్డున పెడతా.. జాన్ను అడ్డగోలుగా నరికి పారేస్తా’ అంటూ ఆమెకు స్ట్రాంగ్ వారి్నంగ్ ఇస్తూ దుర్భాషలాడారు. మహిళలను దుర్భాషలాడడం సరైన విధానం కాదని ఆమె చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ‘నువ్వు మహిళవే కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిరెడ్డి అప్పారావు ఈవిధంగా దిగజారి మాట్లాడడం సరైనది కాదని కూటమి నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే మహిళను తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్ సిండికేట్ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు.. అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టిన టీవీ5 అధినేత బీఆర్నాయుడి రాసలీలలు బయటపడి వేంకటేశ్వరస్వామి భక్తులంతా ఛీకొడుతుండడం మరోవైపు.. అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ఈ విమర్శల జడిలో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎవరూ ఈ విషయాలపై మాట్లాడకుండా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోని అన్ని వేదికలలోనూ హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పేర్లు కనబడకుండా చేయడానికి మాస్టర్ప్లాన్ వేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈనెల 3న ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో కూడా బీఆర్ నాయుడు, హెరిటేజ్ లపై ఏ విధమైన ప్రచారం చేయకూడదని, ఎలాంటి పోస్టులు ఉన్నా తొలగించాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేర్లు కనపడితే చాలు, వెంటనే రిమూవ్ చేయాలంటూ ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. వేదిక ఏదైనా సరే.. బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేరుతో ఆ పోస్టులు ఉంటే ఆయా సంస్థలకు నోటీసులు పంపి, బలవంతంగా పోస్టులను డిలీట్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఈ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది ప్రజల భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు సర్కార్ చేస్తున్న దాడేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు.డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు..ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే సాకుతో సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. నేరుగా వారికి మెయిల్స్ చేయడంతో పాటు, సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. అందులో వేలాది మంది పేర్లను, ఐడీలను పేర్కొంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలంటూ.. సబ్జెక్ట్, కంటెంట్ తో సంబంధం లేకుండా హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పదాలు ఉంటే చాలు, వీడియో అయినా, పోస్ట్ అయినా, పోస్టర్ అయినా, మీమ్ అయినా, నాలుగు అక్షరాలైనా సరే.. డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. చివరికి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడిన వీడియోలు కూడా డిలీట్ చేయాలంటూ నోటీసులిస్తున్నారంటే సోషల్ మీడియా దెబ్బకు ప్రభుత్వ పెద్దలు ఎంతలా భయకంపితులు అవుతున్నారో అర్థమవుతుంది. మరింత మందికి తెలియకూడదనే..ఇటీవల టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం.. ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై పోస్టులు, వీడియోలు, మీమ్స్ వెల్లువెత్తాయి. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేసిన బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. కానీ, తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపులకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక హెరిటేజ్ విషయంలోనూ ప్రభుత్వం నిజాలు బయటకు రానీయకుండా అడ్డుకుంటోంది. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ ఇష్యూ, అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం, వీఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్ కు సంబంధాలు బయటపడటంతో చంద్రబాబు సర్కార్ బెంబేలెత్తింది. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టులన్నీ డిలీట్ చేయిస్తోంది. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ మాట్లాడిన మాటలు పోస్టు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి డిలీట్ చేయించారు.భావప్రకటనా స్వేచ్ఛకు అడ్డుకట్ట..వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా దాడికి పాల్పడుతోంది. అన్యాయాలపై, దుర్మార్గాలపై వాయిస్ వినిపించకుండా చేస్తున్న దాడి అత్యంత దారుణం. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై జరుగుతున్న ఇలాంటి పరిణామాలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వంపై విమర్శలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, నోటీసులు, పోస్టుల తొలగింపు ముమ్మాటికీ నియంత పాలనకు నిదర్శనం. – కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది -
వారిని కొందరు ఆడపిల్లలు గుడ్డిగా నమ్ముతూ..: సజ్జనార్
హైదరాబాద్: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు.ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని, ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోందని సజ్జనార్ అన్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని చెప్పారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు.అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని సజ్జనార్ వివరించారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని చెప్పారు.‘ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్లైన్లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏ మాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు.తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ.. వారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్లు వాడితే పోలీసులకు చిక్కబోమని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను’ అని ఎక్స్లో సజ్జనార్ చెప్పారు. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు… pic.twitter.com/sWbS2L4bhP— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 21, 2026 -
అభిమాని అభ్యర్థణకు మోదీ రిప్లై.. చెక్కెర తగ్గించండి..!
సోషల్ మీడియాలో ప్రధాని మోదీకి, తన వీరాభిమాని కుమారునికి మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రి ప్రధాని మోదీకి వీరాభిమాని అని ఆయన చెబితే తను చెక్కెర తినడం మానేస్తాడని ఒక సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ ప్రధానిని ఇన్స్ట్రాలో వీడియో చేస్తూ అభ్యర్థించారు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది.యువరాజ్ దువా అనే సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ తన తండ్రి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రధాని మోదీని అభ్యర్థించారు. "ప్రధాని మోదీ గారు మా తండ్రి గారు మీకు వీరాభిమాని ఆయన చెక్కెర అధికంగా తింటాడు. దయచేసి మీరు అతనిని షుగర్ తినడం మానిపించాలి. మీరు చెబితే ఆయన వింటారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్యా దయచేసి ఆయనను చెక్కెర తినడం మానిపించండి" అని ఇన్స్ట్రా రీల్ చేశారు.ఈ వీడియో కాస్త వైరల్గా మారి ప్రధాని దృష్టికి చేరింది. దీంతో మోదీ తన అధికారిక ఇన్స్ట్రా అకౌంట్లో దీనికి రిప్లై ఇచ్చారు. " యువరాజ్ అభ్యర్థన మేరకు నేను తన తండ్రిని షుగర్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనతో పాటు ఇతరులు కూడా అలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెక్కెర అధికంగా తీసుకోవడం అనేక వ్యాధులకు, ఉభకాయానికి కారణం అవుతుంది. యోగా మీ జీవితంలో భాగం చేసుకొవడం ద్వారా ఆరోగ్యంగా ఫిట్గా ఉండవచ్చు. అని మోదీ ఇన్స్ట్రాలో రిప్లై ఇచ్చారు. అనంతరం అతని వీడియో రీషేర్ చేశారు.అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రధాని మీ వీడియో షేర్ చేశారని తెలిస్తే మీ తండ్రి చాలా గర్వంగా ఫీలవుతారని ఒకరు కామెంట్ చేశారు. ఇలా ఇన్స్ట్రాలో చాలా మంది యువరాజ్ దువాకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. అయితే భారత ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్ట్రాగ్రామ్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 10 కోట్లు దాటింది. -
సంయుక్త మీనన్ గ్లామరస్ పిక్స్.. మాల్దీవుస్లో ప్రగ్యా జైస్వాల్..!
హీరోయిన్ సంయుక్త మీనన్ గ్లామరస్ లుక్స్..బాలిలో చిల్ అవుతోన్న లక్ష్మీ రాయ్..రెడ్ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్ అందాలు..శారీలో దిల్ రాజు సతీమణి తేజస్విని పోజులు..మాల్దీవుస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ చిల్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Lakshmi raai (@iamraailaxmi) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026 -
సోషల్ మీడియాతో సంతోషం ఆవిరి!
హెల్సింకీ: ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా యువతలో సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. లేనిపోని ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా పశి్చమ దేశాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్–2026’ఇదే విషయం వెల్లడించింది. గ్యాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సస్టెనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ఈ నివేదిక రూపొందించారు. అధ్యయనంలో భాగంగా 147 దేశాల్లో లక్షల మందిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యంత సంతోషంగా ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈసారి టాప్–10 జాబితాలో ఫిన్లాండ్తోపాటు ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్కు 29వ ర్యాంకు లభించింది. భారత్కు 116వ ర్యాంకు దక్కింది. నివేదికలోని కీలక అంశాలివీ.. → కోస్టారికా దేశం 2023లో 23వ స్థానంలో ఉండగా, 2026లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. → ఏమాత్రం సంతోషంగా లేని దేశాల్లో అఫ్గానిస్తాన్, సియెర్రాలియోన్, మలావీ నిలిచాయి. → అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో 25 ఏళ్లలోపు యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. సంతోషానికి దూరమవుతున్నారు. → మనుషులు సంతోషంగా ఉండాలంటే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సామాజికంగా ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. → సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉన్న దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉంటున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ ఎమ్మానుయేల్ డీ నెవ్ చెప్పారు. లాటిన్ అమెరికా దేశాల్లో కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టంచేశారు. → ఫిన్లాండ్తోపాటు ఉత్తర యూరోపియన్ దేశాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటన్నది పరిశీలిస్తే.. అక్కడి సంపద, ఆ సంపద పంపిణీలో సమానత్వం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉండడం, ఆర్థిక విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం వంటివి కనిపిస్తాయి. -
అనసూయ ఉగాది వైబ్స్..థాయ్లాండ్ వేకేషన్లో అభినయ..!
టాలీవుడ్ నటి అనసూయ ఉగాది వైబ్స్..మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఉగాది లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ఉగాది పోజులు..టాలీవుడ్ నటి హంసానందని ఉగాది సెలబ్రేషన్స్..థాయ్లాండ్ వేకేషన్లో టాలీవుడ్ నటి అభినయ.. View this post on Instagram A post shared by Rahasya Gorak (@rahasya_kiran) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
బీజేపీ ఆఫీసులో కలకలం.. పార్టీ నేతపై మహిళ దాడి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ఆఫీసులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్టీ కార్యవర్గ సభ్యుల అభినందన కార్యక్రమంలో ఓ మహిళ.. బీజేపీ నేతపై దాడి చేసింది. అతడిని చెంపదెబ్బ కొట్టి, అతడి కాలర్ పట్టుకుని బయటకు లాగేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో బుధవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. నామినేటెడ్ కౌన్సిలర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులను అభినందించడానికి పార్టీ నేతలు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ మహిళ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆర్థిక వివాదంపై పార్టీ నేతను కార్యకర్తను నిలదీసింది. తనను లక్షల రూపాయలు మోసం చేశాడని ఆరోపించి, పార్టీ కార్యకర్తల సమక్షంలో అతనిపై దాడి చేసింది. చెంపదెబ్బ కొట్టి, అతని కాలర్ పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. దీంతో ఆ ప్రాంగణంలో కలకలం రేగింది. దీంతో, అక్కడున్న వారంతా జోక్యం చేసుకోవడానికి పరుగెత్తుకొచ్చారు. ఈ ఘర్షణలో తోపులాటలు, మాటల దూషణలు, చెప్పులతో కొట్టుకోవడం వంటివి జరిగినట్లు సమాచారం.यूपी – जिला महराजगंज में BJP के कार्यक्रम में एक महिला कार्यकर्ता ने पुरुष कार्यकर्ता का कॉलर पकड़ लिया, हाथापाई की, उसे चप्पल दिखाई। महिला कार्यकर्ता का आरोप था कि LIC पॉलिसी के नाम पर साढ़े 4 लाख रुपए लिए, लेकिन इस व्यक्ति ने वो पैसे खाते में जमा .!#UttarPradesh #Maharganj pic.twitter.com/IzETG53KxF— Anil Yadav (Journalist) (@AnillYadavIN) March 19, 2026రూ.4.5 లక్షల మోసం ఆరోపణ..ఈ సందర్భంగా సదరు మహిళ మాట్లాడుతూ.. తాను ఎల్ఐసీ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.4.5 లక్షలు అతడికి అప్పగించానని.. అయితే నిందితుడు ఆ డబ్బును జమ చేయకపోగా దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. ఆమె చాలా కాలంగా తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా ఇవ్వడం లేదని మండిపడ్డారు. బుధవారం ఆమె తన కుమారుడితో కలిసి ఆ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, వారిద్దరూ వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని పట్టుబట్టారు.పోలీసుల జోక్యంసమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ వివాదంలో పాల్గొన్న మహిళను, ఇతరులను బీజేపీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లడంతో, దాదాపు గంటపాటు అంతరాయం తర్వాత కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది.పార్టీ స్పందనఆర్థిక వివాదం కారణంగా ఈ ఘర్షణ అకస్మాత్తుగా చెలరేగిందని మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ అభ్యర్థి సమీర్ త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ..‘నామినేటెడ్ కౌన్సిలర్లు మరియు మండల అధ్యక్షుల సన్మాన కార్యక్రమం సందర్భంగా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక వివాదం తలెత్తింది. మాకు ముందే సమాచారం అంది ఉంటే, ఈ పరిస్థితిని నివారించే వాళ్లం. వీరిద్దరూ బీజేపీకి చెందినవారే. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
రోడ్డు మధ్యలో బోరింగ్ పంపు.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో పీడబ్ల్యూడీ ఇంజనీర్ల నిర్లక్ష్యం కారణంగా వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మధ్యలో బోరింగ్ ఉండగానే కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టిన అంశం బయటకు రావడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తేరుకుని దిద్దుబాటు చర్యలకు దిగారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతేదాడి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మీర్జాపూర్ జిల్లాలో పర్యటించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షెడ్యూల్ ఖరారైంది. కాగా, సీఎం యోగి వస్తున్నారని.. అధికారులు ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. యోగి వస్తున్న కారణంగా మీర్జాపూర్ జిల్లాలో అధికారులు హడావిడి చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలోని కాంతిత్ ప్రాంతంలో రోడ్డు వెడల్పు పనులను కూడా యమ స్పీడ్గా చేశారు. రోడ్డు పనులు చకచకా కానిచ్చేశారు కానీ.. నడిరోడ్డు మధ్యలో ఉన్న బోరింగ్ పంపును తీసివేయడం మర్చిపోయారు.🚨Mirzapur, UP's new PWD road built AROUND a hand pump. Coordination fail or planning blunder? Who's accountable for this public inconvenience? pic.twitter.com/l1juOKDIsA— indiainlast24hr (@indiain24hr) March 18, 2026బోరింగ్ పంపు నడిరోడ్డుపైన ఉండగానే కొత్త రోడ్డు వేశారు. బోరింగ్ తొలగించకుండానే కొత్త రోడ్డు వేసి కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులు చేతులు దులుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. దీంతో, నెటిజన్లు యూపీ ప్రభుత్వం, అధికారులపై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. బోరింగ్ పంపు ఘటన ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా చేరడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తాజాగా రోడ్డుపై ఉన్న పంపును తొలగించారు. ఈ వీడియో సైతం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ పంపు వ్యవహారం సోషల్ మీడియాలో కొత్త చర్యలకు దారి తీసింది. Handpump In Middle Of The Road, Netizens Slam #PWD #Mirzapur #UttarPradesh #YogiAdityanath pic.twitter.com/VJyrKmY5x9— HW News English (@HWNewsEnglish) March 18, 2026 -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు» ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. » ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. » ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. » మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. » వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎల్రక్టానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మంచి పనులకు ఉపయోగించాలి కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకంగా కొనసాగుతున్న కృత్రి మ మేధస్సు (ఏఐ) ను మంచి పనులకు ఉపయోగించడం వల్ల అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప తప్పుడు మార్గాలకు వెళితే కచ్చితంగా శిక్షలకు గురికాక తప్పదు. ఏఐ ఉపయోగం, దుర్వినియోగం పై అవగాహన పెంచుకోవాలి. – ప్రొఫెసర్ ఎం.వీ.బీ.చంద్రశేఖర్, హెచ్ఓడీ, సీఎస్ఈ, ఏఐఎంఎల్దుర్వినియోగం చేస్తే కఠినమైన శిక్షలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏఐను దుర్వినియోగం చేస్తే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి. ఏఐను ఒక టూల్గా ఉపయోగించి ఎన్నో ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుల్లో ఏఐతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి.– ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ దివి..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి..!
కర్లింగ్ హెయిర్తో బిగ్బాస్ బ్యూటీ దివి..రెస్టారెంట్లో ఆరగిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రా..ఆరెంజ్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..కల్లు తాగుతూ చిల్ అవుతోన్న హేమ, సురేఖావాణి..బీచ్లో ఎంజాయ్ చేస్తోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by @natasastankovic__ -
గ్యాస్ బ్లాక్ దందా.. 201 సిలిండర్లు, 33 లక్షలు స్వాధీనం
అమెరికా-ఇజ్రాయెల్.. ఇరాన్ యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి నుంచి చమురు రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో, పలు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. తాజాగా యూపీలో బాత్రూమ్లో సిలిండర్లు దాచిన ఘటన, పశువుల పాకలో 200 సిలిండర్లు దాచి పెట్టిన ఘటనలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాత్రూమ్లో సిలిండర్లు..ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా దాచిపెట్టారనే ఆరోపణ నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బదౌరా మార్కెట్లోని ఒక గృహోపకరణాల దుకాణంలో సోదాలు చేపట్టగా తాళం వేసి ఉన్న బాత్రూమ్ అధికారులకు కనిపించింది. అనుమానంతో గది తలుపును పగలగొట్టి చూడగా అందులో పదుల సంఖ్యలో ఫుల్ సిలిండర్లు, ఖాళీ సిలిండర్లు బయటపడ్డాయి. ఈ ఘటన సమయంలోనే దుకాణం యజమాని మున్నీలాల్ విశ్వకర్మ, అతని కుమారుడు అక్కడి నుంచి పారిపోయారు. అధికారులు రీఫిల్లింగ్ పరికరాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, జాన్సా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.#BREAKING : During a late-night raid in Hapur, Uttar Pradesh, local authorities recovered 32 LPG cylinders from a residential property. Officials confirmed that 18 of the cylinders were filled. Further action is being taken in the matter.#LPGSeizure #IllegalLPG… pic.twitter.com/9NR8ZWbcbK— upuknews (@upuknews1) March 13, 2026పశువుల పాకలో 201 సిలిండర్లు..రాజస్థాన్లోని పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 201 ఎల్పీజీ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోట్పుట్లి-బెహ్రోర్ జిల్లాలోని శ్యామ్నగర్ ప్రాంతంలో అధికారి శశిశేఖర్ శర్మ నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. ఈ సోదాల్లో పశువుల పాకలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 ఫుల్ సిలిండర్లు, 95 ఖాళీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పశువుల పాకకు సమీపంలోనే గుంజన్ గ్యాస్ ఏజెన్సీ పేరుతో ఏ ఏజెన్సీ నడుస్తోంది. సోదాల సమయంలో ఏజెన్సీ యజమాని మదన్ సైని అక్కడే ఉన్నారు. దీంతో, అధికారులు ప్రశ్నించగా.. సరైన పత్రాలు లేకుండానే ఏజెన్సీని నడుపుతున్నట్లు ఆయన అంగీకరించారు. అనంతరం, అధికారులు.. గ్యాస్ సిలిండర్లతో నిండిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెటింగ్పై రాష్ట్రవ్యాప్తంగా నిఘా ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.610 LPG Cylinders of Indane, Bharat Gas & HP Gas were seized, which were illegally storedThe Crime Branch, Delhi Police busted an illegal LPG cylinder hoarding racket operating from a godown in Mundka, Outer DelhiTo defame govt and to create panic situation these people can… pic.twitter.com/v9oWJBGHAM— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) March 16, 2026గ్యాస్ చోరీ.. హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక సిలిండర్ నుండి మరొక సిలిండర్కు గ్యాస్ను బదిలీ చేస్తున్న వీడియోలు ఆన్లైన్లో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫరీదాబాద్ అధికారులు ఎల్పీజీ దొంగతనం, అక్రమ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్పై చర్యలను ముమ్మరం చేశారు. ఈ విషయమై జిల్లా ఆహార మరియు సరఫరాల శాఖ పలు ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్పై 7 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్టు చెప్పుకొచ్చారు.ఎల్పీజీ బ్లాక్ మార్కెట్.. 33 లక్షలు స్వాధీనంమహారాష్ట్రలో ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అధికారులు తనిఖీలు చేపట్టగా 2,129 దాడుల్లో రూ.33 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న 1,208 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలకు సంబంధించి మొత్తం 23 మందిపై కేసులు నమోదు చేయగా, నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని నిబంధనల కింద 18 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎల్పీజీ డెలివరీ, బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు సంబంధించిన ఫిర్యాదులను తెలియజేయడానికి ప్రభుత్వం 9769919229 అనే వాట్సాప్, హెల్ప్లైన్ నంబర్ను జారీ చేసింది.330 LPG cylinders seized in Bhiwandi, Maharashtra. Three people booked for illegal storage.#lpggasissue #LpgCrisis #LpgCylinder #Maharashtra pic.twitter.com/3RfIiLTZB8— Sachin (@Sachin1649242) March 17, 2026 -
‘నేను బ్రతికే ఉన్నాను మైక్’ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్ నాయకత్వంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రోజు, నేను పంచ్ కార్డ్పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.నెతన్యాహూ మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. Crossing names off the list is good - doing it shoulder to shoulder with our American friends is even better.Good to see Ambassador @GovMikeHuckabee. Always a pleasure.🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 17, 2026 -
గంగా నదిలో బిర్యానీతో ఇఫ్తార్ విందు.. 14 మంది అరెస్ట్
వారణాసి: గంగా నదిలో పడవలో విహరిస్తూ చికెన్ బిర్యానీతో ఇఫ్తార్ విందు చేసుకున్నందుకు యూపీ పోలీసులు 14 మందిని అరెస్ట్ చేశారు. ప్రార్థనా ప్రదేశాన్ని అపవిత్రం చేశారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే, విందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీనిపై బీజేపీ యువమోర్చా నగర విభాగం అధ్యక్షుడు రజత్ జైశ్వాల్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గంగా నది మధ్యలో విహరిస్తూ వీరు మిగిలిన ఆహారపదార్థాలను నీళ్లలోకి పడవేసి అపవిత్రం చేశారని ఆరోపించారు. హిందువులు మనోభావాలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారన్నారు. ప్రపంచ దేశాల నుంచి నిత్యం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు గంగా నదిని పవిత్రంగా భావిస్తారని, పూజలు చేస్తారని తెలిపారు. In Varanasi, 14 Muslim youths were arrested after holding an Iftar Party on a boat in the Ganga River.An FIR was filed alleging that they consumed chicken biryani during iftar and threw leftover bones into the river, which reportedly hurt religious sentiments.The complaint… pic.twitter.com/VDIdIE3cWi— زماں (@Delhiite_) March 17, 2026 -
రీల్స్ పిచ్చి.. ఇంటి యజమానిని పార్శిల్ చేసిన కుటుంబం?!
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్కు గురి చేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లారు.పార్శిల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది? అందులో ఏమున్నాయి? అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్శిల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. ‘మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈ పార్శిల్ను తాము చెప్పిన అడ్రస్కు పంపాలి’ అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.విచారణలో కుటుంబం చెప్పిన వివరణ మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమానిని తెల్లబస్తాలో పెట్టి పార్శిల్ కేంద్రానికి తీసుకువచ్చామని, ఇదంతా సోషల్ మీడియా రీల్స్ కోసం చేశామని తెలిపారు. తరువాత పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ, తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోను రికార్డు చేశారు.పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరిక జారీ చేసి, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. చివరికి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station. Weird world. 😭pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026 -
విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా పోస్టులపై ఇకపై ప్రభుత్వం తన కీలక శాఖల కళ్లతో నిఘా సారించనుంది. ఇప్పటివరకు కేవలం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు మాత్రమే ఉన్న ‘కంటెంట్ బ్లాకింగ్’ అధికారాలను మరో నాలుగు కీలక మంత్రిత్వ శాఖలకు కూడా కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఐటీ చట్టం, 2000లోని సెక్షన్ 69 (ఏ) కింద పలు మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఏదైనా వివాదాస్పద పోస్టును తొలగించాలన్నా లేదా బ్లాక్ చేయాలన్నా ఇతర శాఖలు ఐటీ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలి. ఈ కారణంగా ఐటీ శాఖ వద్ద ఫైళ్లు పేరుకుపోయి, నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించే తప్పుడు సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.అధికారాలు పొందే శాఖలు ఇవే..ఐటీ మంత్రిత్వ శాఖతో పాటు నేరుగా బ్లాకింగ్ ఆర్డర్లు జారీ చేసే అవకాశం ఉన్న శాఖలు..హోం మంత్రిత్వ శాఖవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖరక్షణ శాఖసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అంతేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు ఆర్థిక సలహాలు ఇచ్చే ‘ఫిన్-ఫ్లూయెన్సర్ల’పై చర్యలు తీసుకునేందుకు వీలుగా సెబీ (సెబీ) వంటి నియంత్రణ సంస్థలకు కూడా ఈ అధికారాలు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.యూజర్లపై ప్రభావంఇటీవలే ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ తొలగింపు సమయాన్ని 36 గంటల నుండి కేవలం 3 గంటలకు తగ్గించింది. ఇప్పుడు అధికారాల వికేంద్రీకరణ జరిగితే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లకు నేరుగా వివిధ శాఖల నుండి ఆదేశాలు అందుతాయి. అయితే దీనివల్ల ప్రభుత్వంపై చేసే విమర్శలు లేదా సెటైరికల్ పోస్టులు కూడా తొలగించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దేశ సార్వభౌమాధికారం, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: ‘ట్రావెల్ విత్ జో’ కేసు.. 10 నెలలైనా వీడని ఉత్కంఠ -
అమ్మాయిలు, ఆంటీలతో యువకులు సరదాగా మాట్లాడొచ్చంటూ..
"ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు" అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ కనపడుతున్నాయి. అమ్మాయిలు, ఆంటీలతో మాట్లాడొచ్చని అనగానే చాలా మంది అబ్బాయిలు ఆ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అయితే, అటువంటి యాడ్స్ వెనుక నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు ఉంటుందని అంటున్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్.‘యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు పన్నుతున్న హనీట్రాప్ ఇది. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదు. అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు. మాయమాటలకు బుట్టలో పడి వారు సూచించిన యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లే. ఆ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోగానే, మీ ఫోన్లోని కాంటాక్ట్స్, గ్యాలరీ మొత్తం వారి అధీనంలోకి వెళ్లిపోతాయి.ఇక రాత్రిపూట సరదాగా మాట్లాడుదమని వీడియో కాల్ చేస్తే.. అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్పై ఉన్న మీ ముఖాన్ని రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి, మీ కాంటాక్ట్ లిస్ట్లోని బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్మెయిలింగ్ సెక్స్టార్షన్ కు దిగుతారు. పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత ఇచ్చుకుంటూ పోతే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయం.యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కారు.. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు లాగేసే భారీ కుట్ర దాగి ఉందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తుతెలియని ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి.. జాగ్రత్తగా ఉండండి.ఒకవేళ ఇప్పటికే ఎవరైనా ఇలాంటి సైబర్ వలలో చిక్కుకుంటే, పరువు పోతుందేమో అని భయపడకండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్’ అని సజ్జనార్ సూచించారు. "ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు." అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్న ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు.. నిలువునా దోచేసే సైబర్ కేటుగాళ్ల ఉచ్చు. యువత… pic.twitter.com/gl9bJcJQi5— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 17, 2026 -
నోరు జారిన లోకేష్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
-
సింగర్ ఓవరాక్షన్.. డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన
పాట్నా: బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రైవేటు ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్తో శర్మ అనుచితంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా.. మహిళ అని కూడా ఆమెను పైకి ఎత్తి జనాలపైకి విసిరేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భోజ్పురి సింగర్ ధనంజయ్ శర్మ తాజగా బీహార్లో ఓ ప్రైవేటు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాటలు పాడుతూ అందరూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న ఓ లేడీ డాన్సర్ను పైకి ఎత్తి జనాల్లో పడేశాడు ధనంజయ్ శర్మ. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా టచ్ చేస్తూ ఆమెను లిఫ్ట్ చేశాడు. అనంతరం, స్టేజ్ కింద ఉన్న ఆడియన్స్పైకి ఆమెను విసిరేశాడు. దీంతో ఆ లేడీ డ్యాన్సర్ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.⚠️VIRAL | Singer Dhananjay Sharma lifts female dancer off stage and throws her into reaching fans during Muzaffarpur show. pic.twitter.com/neHNwWTdFl— The Tatva (@thetatvaindia) March 16, 2026ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ధనంజయ్ శర్మకు కొంచెం కూడా బుద్ధి లేదని ఫైర్ అవుతున్నారు. లేడీ డాన్సర్ అని చూడకుండా, పబ్లిక్ సిటీ కోసం ఇలాంటి పనులు చేస్తారా? అని మండిపడుతున్నారు. మహిళలంటే అతడికి ఎలాంటి గౌరవం లేదని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ ధనుంజయ్ శర్మ స్పందించారు.. ఈ క్రమంలో తాను కావాలని అలా చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఆమెతో అనుచితంగా ప్రవర్తించలేదని తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో వేదికపై ఏం జరిగిందో ప్రజలకు పూర్తి నిజం తెలియదని ఆయన అన్నారు. తాను పాట పాడుతున్న సమయంలో డ్యాన్సర్లు నన్ను ఢీకొట్టారు. వారు నన్ను పట్టుకుని వేదికపై నుండి నెట్టడానికి ప్రయత్నించారు. ఈ మధ్యలో, ఒక మోడల్ నన్ను తన్ని.. నా ఛాతీపై చేయి వేయడం ప్రారంభించింది. ఇది ఎలాంటి ప్రవర్తన? అని ఆయన ప్రశ్నించారు. సదరు డ్యాన్సర్ను తాను విసిరేయాలని అనుకోలేదని ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సింగర్ ధనంజయ్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. -
శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్.. హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక
ఆస్కార్ వేడుక పిక్స్ షేర్ చేసిన ప్రియాంక చోప్రా..శారీలో బుల్లితెర భామ మౌనీ రాయ్ అందాలు..బ్లూ డ్రెస్లో టాలీవుడ్ నటి వితికాశేరు పిక్స్..ఈవెంట్లో మెరిసిన టాలీవుడ్ భామ మెహరీన్..హల్దీ పిక్స్ షేర్ చేసిన రష్మిక మందన్నా.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
టీడీపీ ఎంపీ పుట్టా సోషల్ మీడియాలో ఆడుకున్న నెటిజన్లు
-
ఏఐ మేధావికి ఇలాంటి టెస్టా?.. ఇంత కన్నా ఘోరం ఉంటుందా?
అహ్మదాబాద్: విదేశాల్లో భారీ ప్యాకేజీలు అందుకుంటూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసి, ఏవో కారణాలతో స్వదేశానికి తిరిగివచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు భారతీయ కంపెనీల్లో వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్యాన్సర్ పరిశోధనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)వంటి అత్యున్నత రంగాల్లో అనుభవమున్న టెక్కీలను ఇంటర్వ్యూల్లో ‘నోట్ప్యాడ్' మీద కోడ్ రాయమనడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.అసలేం జరిగింది?అహ్మదాబాద్కు చెందిన ‘న్యూకాన్స్’ (Pneucons) సంస్థ వ్యవస్థాపకుడు రితేష్ లఖానీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ఉదంతం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అతని స్నేహితులిద్దరు గత ఐదేళ్లుగా జర్మనీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఒకరు క్యాన్సర్ కణాలను గుర్తించే ఏఐ మోడల్స్ను రూపొందించగా, మరొకరు మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) పైప్లైన్స్లో నిపుణుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసం వారు తమ విదేశీ ఉద్యోగాలను వదిలి భారత్కు తిరిగివచ్చారు.అయితే వారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తే.. సదరు రిక్రూటర్లు వారి అనుభవాన్ని పక్కన పెట్టి, 2026వ సంవత్సరంలో కూడా ఒక సాధారణ ‘నోట్ప్యాడ్’ ఇచ్చి కోడ్ రాయమని అడగడం వారిని షాక్నకు గురిచేసింది. ‘క్యాన్సర్ను గుర్తించే ఏఐ మోడల్స్ తయారు చేసే మేధావులను నోట్ప్యాడ్పై కోడ్ రాయమనడం హాస్యాస్పదం’ అని లఖానీ ఎద్దేవా చేశారు.నెటిజన్ల రియాక్షన్: 'ఇది టెక్ ఇంటర్వ్యూనా.. జోకా?'ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.. ‘భారతీయ ఇంటర్వ్యూ వ్యవస్థ ఇంకా పురాతన కాలంలోనే ఉంది. 15 ఏళ్ల అనుభవం ఉన్నవాడిని కూడా లాజిక్ అడగకుండా, బట్టీ పట్టినట్టు కోడ్ రాయమనడం రిక్రూటర్ల అసమర్థతకు నిదర్శనం’ అని ఒకరు మండిపడ్డారు. ‘అనుభవం ఎంత ఉన్నా ప్రాథమిక అంశాలు ముఖ్యం. నోట్ప్యాడ్పై రాయడం వల్ల వారి సృజనాత్మకత, పట్టు అర్థమవుతుంది" అని మరికొందరు వాదించారు. మొత్తానికి ప్రపంచమంతా ఏఐ వేగంతో దూసుకుపోతుంటే, మన దగ్గర ఇంకా పాత పద్ధతులతోనే ప్రతిభను కొలవడం ఇప్పుడు ఐటీ రంగంలో చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: UAE:19 మంది భారతీయుల అరెస్ట్.. కారణం ఇదే.. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
బిగ్బాస్ దివి గ్లామరస్ లుక్.. బ్లూ శారీలో త్రిష అందాలు..!
యోగాసనాలు చేస్తోన్న నటి పూనమ్ బజ్వా..బీచ్లో చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్..ఫ్యామిలీతో అనసూయ వాకింగ్ టైమ్..బిగ్బాస్ దివి లేటేస్ట్ గ్లామరస్ లుక్..బ్లూ శారీలో హీరోయిన్ త్రిష అందాలు... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
-
తొక్కతో తింటే... తలనొప్పి తగ్గుతుందా?
ఇటీవల ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల మీద ఆహార సలహాలు చాలా వస్తున్నాయి. ఫలానా ఆహారం ఇలా తింటే ఈ లాభాలనీ, ఫలానా పదార్థాలతో ఇవీ ప్రయోజనాలంటూ రకరకాల సలహాలూ, సూచనలూ నెటిజనులను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందులో ఒకటి... ఆపిల్ను తొక్కతో సహా పరగడుపునే తీసుకుంటే దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు తగ్గుతాయన్నది. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం! వాస్తవాలేమిటంటే... ఆపిల్ స్కిన్లో చాలారకాల పోషకాలున్న మాట వాస్తవమే. ఉదాహరణకు మలబద్ధకాన్ని తొలగించే పీచు, వ్యాధి నిరోధకశక్తిని సమకూర్చే విటమిన్ సి, ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి నివారణనిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆపిల్ తొక్కలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల ఇతరత్రా ఆరోగ్య ప్రయోజనాలకు అవకాశాలున్నాయి. అయితే సాధారణంగా ఆపిల్ తొక్క మెరిసేలా చేయడానికి చాలామంది ఒక రకం మైనపుపూత (వ్యాక్స్)తో ఆపిల్కు మెరుపు తెప్పించి ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తారు కాబట్టి తొక్కతో తినాలనుకునేవారు వీలైనంతగా కడిగి తినడం మేలు. అదో అపోహ మాత్రమే... పరగడుపున పొట్టుతోనే ఆపిల్ తినడం వల్ల తలనొప్పులు తగ్గుతాయనుకోవడం అపోహ మాత్రమే. తలనొప్పులు అనేక కారణాల వల్ల వస్తుంటాయి. ఉదాహరణకు ఒంట్లో నీటి మోతాదు తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి వంటివి. తొక్కతో సహా తినడం వల్ల దేహం రీహైడ్రేట్ కావడం, ఒత్తిడి తగ్గడం వంటివేమీ జరగవు. కాబట్టి తొక్క వల్ల తలనొప్పులు తగ్గడమనేది అపోహేనని నిపుణుల అభిప్రాయం.అయితే తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి వాటిలో ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలు కూడా ఉన్నందువల్ల నొప్పి తగ్గడంలో అవి కొంత ఉపయోగపడవచ్చు గానీ... ఉదయం పరగడుపున తొక్కతో ఆపిల్ తినడం వల్లనే తలనొప్పుల నుంచి పూర్తి విముక్తి కలుగుతుందనుకోవడం మాత్రం అపోహ అంటూ నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే అయినా ‘ప్రతి రోజూ ఆపిల్ తింటే... వైద్యుడి దగ్గరకు వెళ్లక్కర్లేదు’ (ఏన్ ఆపిల్ ఏ డే... కీప్స్ ద డాక్టర్ అవే) అనే సూక్తి ప్రకారం ఆపిల్ను బాగా కడిగాక తొక్కతో తినడంలో ప్రయోజనమే తప్ప నష్టమీదీ ఉండదనేది ఆహార నిపుణుల మాట. -
గ్యాస్ కొరత.. సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా..!
ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ కొరత భయాందోళనలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా గ్యాస్ సిలిండర్ల ప్యానిక్ బుకింగ్స్ మాత్రం అధికంగానే కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ల యుద్ధం కారణంగా అనిశ్చిత పరిస్థితి రావొచ్చేమోనని భయంతో ప్రజలు ముందుగానే అప్రమత్తమవుతున్నారు. ఇందులో గ్యాస్ సిలిండర్ అంశం ఒకటి.అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడీయో వైరల్గా మారింది. ఈ వీడియోను చూస్తే గ్యాస్ సిలిండర్ను ఇలా కూడా వాడొచ్చా అనిపించకమానదు. నెట్టింటిలో వైరల్గా మారిన ఆ వీడియోలో ఓ వ్యక్తి.. ఖాళీ సిలిండర్ తీసుకుంటాడు. దాన్ని వెల్డింగ్ పనిముట్ల సాయంతో కట్ చేసి.. దాన్ని కట్టెల పొయ్యి మాదిరిగా మార్చేశాడు. ఇలా ఫుల్ గ్యాస్ సిలిండర్ లేదనే చింతను తీర్చుకున్నాడు. ఈ వ్యక్తి తెలివి తేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. వీడు మాములోడు కాదురా నాయనా అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ భయాందోళనలు నడుస్తున్న నేపథ్యాన్ని ఆసరగా చేసుకుని ఇలా వైరల్ కావడానికి కూడా చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మన భారతీయుల టాలెంట్ మామూలు టాలెంట్ కాదుగా 👍pic.twitter.com/AVN1cCRPTS— UttarandhraNow (@UttarandhraNow) March 13, 2026 -
ఖాళీ సిలిండర్ల కామెడీ.. ‘మీమ్స్’ మహోత్సవం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిలిండర్ బుక్ చేశాక రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో, వినియోగదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే ఈ పరిస్థితులను కొందరు తమదైన శైలిలో హాస్యంగా మలుస్తున్నారు. గ్యాస్ కష్టాలపై సోషల్ మీడియా వేదికగా షేర్ అవుతున్న ‘మీమ్స్’ ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి.‘ఉత్తుత్తి’ వంటలు.. వివిధ విన్యాసాలుపశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ దిగుమతులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. ఇదే తరుణంలో నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ‘ఖాళీ సిలిండర్లు - నిండుగా కామెడీ’ అన్నట్లుగా పరిస్థితి మారింది. స్టవ్ మీద వంట చేస్తున్నట్లు నటిస్తూ, ‘ఇది ఊహాజనిత గ్యాస్’ అని పేర్కొనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు.. మళ్లీ పాతకాలం నాటి కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నట్లుందని అంటున్నారు.గ్యాస్ అప్పు ఇస్తారా?గతంలో ఇరుగుపొరుగు వారి వద్ద చక్కెర, పాలు అప్పుగా తీసుకునేవారమని, ఇప్పుడు గ్యాస్ అప్పు ఇస్తారా? అని అడిగే రోజులు వచ్చాయంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సిలిండర్లను బంగారు ఆభరణాల్లాగా దాచుకోవడం, వాటికి సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవడం వంటి మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. కేవలం గృహ అవసరాలకే కాకుండా, వాణిజ్య రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు దాదాపు 8 శాతం పెరగడంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయంతో చాలామంది ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కృత్రిమ కొరతకు కూడా దారితీస్తోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలతో చర్చలు జరిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 25 శాతం పెంచాలని రిఫైనరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ భరోసా ఇస్తున్నప్పటికీ, అంతటా పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్పీజీ కష్టాలకు త్వరలో విముక్తి: మంత్రి సురేష్ గోపి -
హైదరాబాద్ పిల్లల సోషల్ మీడియా వినియోగం ఎంతంటే?
పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్కి వెళ్లే ముందు మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి ప్రి్రస్కిప్షన్పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్ కోసం.. పిల్లలు మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో సోషల్ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్ యాప్స్ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్ఫోన్ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ‘డీలా’.. ఓ వైపు చాట్ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరిచయం చేస్తూ.. ఆన్లైన్ క్లాసులు, హోమ్వర్క్ పేరుతో క్రమంగా స్క్రీన్ టైమ్ సోషల్ మీడియావైపు దారి మళ్లుతోంది.ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమ్.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్ ఫ్రెండ్షిప్, లైక్స్, ఫాలోవర్స్ ఆధారంగా రిలేషన్స్ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్ అల్గారిథమ్స్ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్ జీ తరం కన్నా.. జెన్ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్ లిటరసీ, హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్టడి సాధ్యమేనా? దేశంలో చిన్నారుల ఆన్లైన్ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్సైట్లు, ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, కథలు, సైన్స్ వీడియోలు, క్రియేటివ్ ఆర్ట్స్ వంటి కంటెంట్ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. -
ఇన్స్టాగ్రామ్ డౌన్, యూజర్లు గగ్గోలు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని బుధవారం ఉదయం నుంచీ ఇన్స్టాగ్రామ్ వినియోగ దారులకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో యాప్ను ఉపయోగించడంలో సమస్యలొస్తున్నా యంటూ వేలాదిమంది యూజర్లు గగ్గోలే పెడుతున్నారు. ఇన్స్టాలో సందేశాలను పంపలేక పోతున్నారని లేదా వాటికి ప్రత్యుత్తరం ఇవ్వలేక పోతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో సందేశాలు, మీమ్స్తో హల్ చల్ చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 10,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సమస్యలను ఫ్లాగ్ చేశారు, వీరిలో అమెరికా యూజర్లే ఎక్కువున్నారు. ఇండియాలో వందల సంఖ్యలో ఇలాంటి సమస్యలను నివేదించారు. అయితే మెటా యాజమాన్యంలోని కంపెనీ ఇన్స్టాగ్రామ్ దీనిపై ఇంతవరకూ అధికారికంగా స్పందించ లేదు.యూజర్ల ఫిర్యాదులు యాప్ పనిచేయకపోవడంతో, వినియోగదారులలో గందరగోళం, నిరాశకు దారితీసింది. ఇన్స్టాగ్రామ్ DMలు పనిచేయడం లేదంటూ స్క్రీన్షాట్లతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. “ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐ రిపీట్ ఇన్స్టాగ్రామ్ డౌన్” అని ఒకరు, మరొకరు “ఇన్స్టాగ్రామ్ dms డౌన్ అయ్యిందా లేదా... నేను కుక్ అయ్యానా” , “ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిందా??? dms నాకు పని చేయడం లేదా అది నేను మాత్రమేనా?” అని మరొకరు ప్రశ్నించారు. మరికొతమంది నెటిజన్లు ట్విటర్లో తమ సమస్యను రిపోర్ట్ చేశారు. “ఇన్స్టాగ్రామ్ పనిచేయడం మానేసిందా? నేను నా స్నేహితుడికి ప్రత్యుత్తరం ఇవ్వలేను” అని ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్లో (గతంలో ట్విట్టర్)లో ఒక వినియోగదారు పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: గల్ఫ్ ఉద్రిక్తతలు : సౌదీకు పాకిస్థాన్ బాసట -
’మూడో బిడ్డ’ ముచ్చట దేనికి? ఉన్నవారికే దిక్కులేదు!
అక్షరానికి అభయం ఎక్కడ? పేదోడి చదువుకు భరోసా ఏది? కూటమి సర్కార్ కొలువుదీరిన వేళ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సెగ విద్యార్థుల భవిష్యత్తును దహించివేస్తోంది. అటు పాలకుల నిర్లక్ష్యం.. ఇటు యాజమాన్యాల మొండివైఖరి మధ్య సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే విద్యార్థులను గెంటేస్తుంటే, ’మన ప్రభుత్వం’ అని నమ్మిన జనసేనాని అభిమానులే ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా పాలకుల వైఫల్యాలను ఎండగడుతున్నారు. ’ముగ్గురు పిల్లల ముచ్చట పక్కన పెట్టండి.. ఉన్న ఇద్దరి చదువుల సంగతి చూడండి’ అంటూ ఒక తండ్రి వెళ్లగక్కిన ఆవేదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దావానలంలా మారుతోంది.విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఎన్నికల ముందు చదువుల తల్లికి అండగా ఉంటామని చెప్పిన పాలకులు, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను గాలికి వదిలేయడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా విశాఖలోని దువ్వాడలో ఉన్న విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత పార్టీ ఎంపీ కాలేజీలోనే వేధింపులా? నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చెందిన ఈ కాలేజీలో, ప్రభుత్వం నుంచి రావాల్సిన మొదటి ఏడాది ఫీజు బకాయిలు రాలేదన్న సాకుతో విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను క్లాసులో నుంచి పంపించేశారని, ఇది ఎంతవరకు ధర్మమని పాయకరావుపేటకు చెందిన ఒక సామాన్య కాపు సామాజికవర్గ నాయకుడు, పవన్ కల్యాణ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ’మూడో బిడ్డ’ ముచ్చట దేనికి? ఉన్నవారికే దిక్కులేదు! ప్రభుత్వం ప్రకటించిన ’మూడో బిడ్డకు రూ. 25 వేల ప్రోత్సాహం’ పథకంపై సదరు తండ్రి ఎద్దేవా చేశారు. ‘మొదటి దానికి మొగుడు లేడు.. కొసదానికి కల్యాణం అన్నట్లుంది మీ తీరు‘ అంటూ ఘాటుగా విమర్శించారు. ఉన్న ఇద్దరు పిల్లల చదువులకే దిక్కులేదని, మీ మాటలు నమ్మి మూడో బిడ్డను కంటే రోడ్డున పడటం ఖాయమని మండిపడ్డారు. రూ. 1750 కోట్లతో విగ్రహాలు పెట్టడం కంటే, ఆ నిధులను విద్యార్థుల ఫీజుల కోసం ఖర్చు చేస్తే ఎందరో పేదల భవిష్యత్తు నిలబడుతుందని ఆయన హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఆందోళన ఈ ఒక్క కాలేజీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్షా హాల్ టికెట్లు ఇవ్వకుండా, అటెండెన్స్ వేయకుండా విద్యార్థులను వేధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు విడుదల చేయకపోతే, వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక అభిమానిగా ప్రారంభమైన ఈ పోస్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఒక ప్రజా నిరసనగా మారుతోంది. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్గా అవుతోంది.పవన్ కల్యాణ్కు సూటి ప్రశ్న జనసేనాని పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సదరు తండ్రి చేసిన వ్యాఖ్యలు బాణాల్లా తగులుతున్నాయి. ‘అయ్యా పవన్ కల్యాణ్ గారూ.. రెండేళ్లుగా టీడీపీతో సావాసం చేస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో సామాన్యుల కష్టాలు మీకు పట్టడం లేదు. ఎంపీలకు చెందిన కాలేజీలే ఇలా విద్యార్థులను గెంటేస్తుంటే, ఇక మా పిల్లల చదువులకు భరోసా ఎక్కడ?‘ అని ఆయన నిలదీశారు. గాలి మాటలు చెప్పడం మానేసి, విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా చూడండి’ అని డిమాండ్ చేశారు. -
నెట్టింటి నిండా సైబర్ సైకోలే!
ఇంటర్నెట్.. సమాచారానికి, అవకాశాలకు ఒక విస్తారమైన డిజిటల్ వేదిక. అయితే, నేడు ఇదే వేదిక నేరాలకూ నిలయంగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు సైబర్ నేరగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, సరైన అవగాహన లేకపోవడంతో సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.⇒ 31.2% నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2025–26 నివేదికల ప్రకారం, 2023తో పోలిస్తే 2024–25 నాటికి దేశంలో సైబర్ నేరాలు 31.2% పెరిగాయి. ఇది ఆందోళనకరమైన అంశం.⇒ 50 భారతదేశంలో ప్రతి గంటకు సగటున 50 కంటే ఎక్కువ మంది మహిళలపై హింస, నేరాలు జరుగుతున్నాయి. అందులో గణనీయమైన నేరాలు డిజిటల్ మాధ్యమాల ద్వారానే చోటుచేసుకుంటున్నాయి.⇒ 28.15 - 2025లో భారతదేశంలో మొత్తం సైబర్ క్రై మ్ కేసులు 28.15 లక్షలకు చేరాయి (ఇది 2024తో పోలిస్తే 24% ఎక్కువ). ఇందులో మహిళలు బాధితులుగా ఉన్న కేసుల శాతం గణనీయంగా ఉంది.⇒ 51- నేషనల్ సైబర్ క్రై మ్ రిపోర్టింగ్ పోర్టల్ గణాంకాల ప్రకారం, ప్రతి గంటకు సగటున 51 ఫిర్యాదులు నమోదవుతున్నాయి.⇒ రూ. 22,495 కోట్లు సైబర్ నేరాల వల్ల దేశం మొత్తం మీద దాదాపు రూ. 22,495 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మహిళలు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ మోసాల బారిన ఎక్కువగా పడుతున్నారు.⇒ 20,551 మహిళలపై సైబర్ నేరాల రేటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ప్రతి లక్షమంది మహిళలకు 125 మంది సైబర్నేరగాళ్ల వలలో చిక్కకుంటున్నారు. హైదరాబాద్లో డిజిటల్ కేసులపై అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేవలం 2025లోనే రాష్ట్రవ్యాప్తంగా 20,551 మహిళా సంబంధిత కేసులు నమోదయ్యాయి.⇒ 48,475- 2020లో మహిళలపై 22,188 సైబర్ నేరాలు నమోదు కాగా, 2024 నాటికి ఈ సంఖ్య 48,475కు (దాదాపు 118% పెరుగుదల) చేరిందని నివేదికలు చెబుతున్నాయి.⇒ 2వ స్థానం దేశంలోని మెట్రో నగరాల్లో మహిళలపై సైబర్ వేధింపుల విషయంలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ముఖ్యంగా అసభ్యకరమైన కంటెంట్ సర్క్యులేషన్, మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.⇒ 69% మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ నేరాలలో లైంగిక వేధింపులు 4.9%, బ్లాక్మెయిలింగ్ 3.8%, ఆర్థిక మోసాలు 69% ప్రధానంగా ఉన్నాయి.⇒ 9% మహిళలను, ముఖ్యంగా ఉద్యోగినులను భయపెట్టి లక్షల రూ΄ాయలు వసూలు చేసే (డిజిటల్ అరెస్ట్) మోసం 2025–26లో 9% పెరిగింది.⇒ 15-20% ఏఐ డీప్ఫేక్ కేసులు 2026 లో దాదాపు 15–20% పెరిగాయి. ఫొటోలను అసభ్యంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ప్రధాన సమస్యగా మారింది.⇒ 18,236 అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. మొత్తం కేసుల సంఖ్య 21,889. తెలంగాణ రెండో స్థానంలో అంటే నమోదైన కేసుల సంఖ్య 18,236. ఉత్తరప్రదేశ్ 10,794 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య 2,500 మార్కును దాటింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఫిర్యాదుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన సైబర్ నేరాల రేటు దక్షిణ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. -
ఒక‘ట్రెండు’సార్లు ఆలోచించండి...
‘ఏమవుతుంది లే’ అనే నిర్లక్ష్యం కంటే... ‘ఎందుకైనా మంచిది’ అనే ముందు చూపు చాలా మంచిది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ‘వైరల్ ఏ.ఐ. క్యారికేచర్’ ట్రెండ్ అనేది హాట్ టాపిక్. ‘ఇదిగో నా గురించి నీకు అన్నీ చెప్పేస్తున్నాను. క్యారికేచర్ అదిరిపోవాలి’ అని ఏ.ఐ.కి ప్రాంప్ట్ ఇవ్వడం అనేది ఈ ట్రెండ్లో భాగం. అయితే అయితే... ఈ ట్రెండ్లో భాగంగా వేలం వెర్రిగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం వల్ల, మోసగాళ్లకు చేతినిండా పనే అని హెచ్చరిస్తున్నారు డిజిటల్ నిపుణులు...యూజర్లు పర్సనల్ ఫొటోను షేర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ను క్యారికేచర్ లేదా ఇలస్ట్రేషన్ క్రియేట్ చేయమని అడగడమే వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్. మన అభిరుచులు, జీవిత విశేషాలు, ఉద్యోగ విశేషాల ఆధారంగా ఈ క్యారికేచర్ క్రియేట్ అవుతుంది. క్యారికేచర్ కదా అనుకోవద్దు! ‘ఏమవుతుంది? వస్తే గిస్తే నా క్యారికేచర్ బయటికి వస్తుంది. దీంతో మోసాలు ఎలా చేస్తారు?’ అనే వాళ్లు బోలెడు మంది. అయితే మనం అనుకున్నట్లు బయటికి వచ్చేది క్యారికేచర్ మాత్రమే కాదు...‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’ అనే ఒకే ఒక ప్రాంప్ట్తో ఏఐ ఎన్నో వివరాలను లాగేస్తుంది. చివరికి మన కమ్యూనికేషన్ స్టైల్ను కూడా విడిచి పెట్టదు. ఒక్కముక్కలో చె΄్పాలంటే... బయటికి వచ్చేది క్యారికేచర్ రూపంలోని మన పర్సనల్ ప్రోఫైల్! అది మనం ఇష్టపూర్వకంగా అందజేసిందే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.ట్రెండ్లో భాగంగా...వైరల్ క్యారికేచర్ ట్రెండ్ క్రియేటివ్గా, ఎంటర్టైనింగ్గా కనిపించినప్పటికీ, ఈ ట్రెండ్ ద్వారా బయటికి వచ్చే వ్యక్తిగత సమాచారం ఆధారంగా మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘నా మనస్తత్వానికి అద్దం పట్టే క్యారికేచర్ క్రియేట్ చేసుకోవాలి’ అనే ఉత్సాహంతో యూజర్లు ఎటువంటి పరిమితులూ లేకుండా సమాచారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. సమాచారం ఎంత ఎక్కువ ఇస్తే క్యారికేచర్ అంత బాగా వస్తుందనేది వారి ఉద్దేశం. ట్రెండ్లో భాగంగా రెఫరెన్స్ ఫొటోతో పాటు అదనపు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు... కంపెనీ పేరు, కార్పొరేట్ లోగో, చేస్తున్న ఉద్యోగం, పని చేస్తున్న నగరం పేరు, దినచర్య, కుటుంబ వివరాలు... మొదలైనవి తెలియజేస్తున్నారు.ఎమోషనల్ మానిప్యులేషన్ఫొటోగ్రాఫ్కు సందర్భోచిత వివరాలు జత చేస్తే డిజిటల్ మోసాలు జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఫొటోతో స్కామర్లు వివిధ ΄్లాట్ఫ్లామ్లలో నకిలీ ప్రోఫెషనల్ ప్రోఫైళ్లను సృష్టించవచ్చు. జెనరేటివ్ వాయిస్ లేదా డీప్ఫేక్లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు. ఫొటోను డిస్ప్లే ఇమేజ్గా ఉపయోగించి కంపెనీ లేదా ప్రోఫైల్ పేజీలను క్లోన్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రామాణికంగా, నమ్మదగినదిగా చేయడానికి ఇలాంటి ట్రిక్స్ను ఉపయోగిస్తుంటారు. ఫొటోగ్రాఫ్తో పాటు ఉద్యోగం, ఆఫీసు వివరాలు మోసగాళ్ల చేజిక్కితే ఎంతమాత్రం అనుమానం రాకుండా బిజినెస్ ఈమెయిల్స్, మెసేజ్లను స్కామర్లు రూపొందించి ఆ వ్యక్తి కొలీగ్స్కు ఫేక్ ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్లను పంపే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే స్కామర్లు ఎమోషనల్ మానిప్యులేషన్కూ పాల్పడే ప్రమాదం ఉంది.యస్... ఇది నిజమేమనం అందించే డేటా పాయింట్స్ సవివరమైన డిజిటల్ ప్రోఫైల్ను రూపొందించడానికి ఉపకరిస్తాయి. ఇమేజ్తో జత చేసిన వివరాలతో సైబర్ నేరగాళ్లు సోఫిస్టికేటెడ్ స్కామ్లు చేసే అవకాశం ఉంది ‘ఏఐ–జనరేటెడ్ పర్సనల్ ఇమేజ్లు స్కామర్లకు ఉపయోగపడతాయా?’ అనే ప్రశ్నకు వచ్చే జవాబు... ‘అవును’ సాధారణంగా సైబర్ నేరగాళ్లు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ (వోఎస్ఐఎన్టీ)పై తగిన సమయం వెచ్చిస్తారు. లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, న్యూస్ ఆర్టికల్స్....మొదలైన వాటి ద్వారా వ్యక్తుల డిజిటల్ ఫుట్ప్రింట్ను సేకరిస్తారు. వైరల్ ఏఐ క్యారికేచర్ ట్రెండ్ ద్వారా వారి పని మరింత సులభం అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాలు, ΄్లాట్ఫామ్ల ద్వారా సేకరించడానికి బదులు ఒకేచోటు నుంచి తీసుకోవడానికి స్కామర్లకు అవకాశం ఇస్తుంది.‘యూజర్లు పంచుకునే ఏ ఒక్క సమాచారం విడిగా ప్రమాదం కాదు. అయితే ఈ ట్రెండ్తో వచ్చిన చిక్కు ఏమిటంటే, అలవాట్ల నుంచి ఆందోళన వరకు యూజర్ షేర్ చేసే సమాచారాన్ని మొత్తం ఒకే దగ్గర చేరుస్తుంది. స్కామర్లు ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనునుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇస్తుంది.ఏ చెడు జరిగినా ‘ఇది కలికాలం నాయనా’ అనే మాట బాగా వినిపిస్తుంది. ఇప్పుడు కాలం మారింది. ‘ఇది డిజిటల్ కాలం నాయనా’ అనుకోవాల్సి వస్తోంది. ఏ ట్రెండ్ నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా! అందుకే జాగ్రత్త అవసరం...అత్యవసరం.ఇలా చేయాలి...⇒ ఐడెంటిఫైయబుల్ డేటా ప్రాంప్ట్స్ ఇవ్వవద్దు. ఉదా: పూర్తి పేరు, చేస్తున్న ఉద్యోగం, కంపెనీ పేరు, ఇంటి అడ్రస్... మొదలైనవి.⇒ మీ లొకేషన్ లేదా, సంస్థ గురించి తెలుసునేలా చేసే లోగోలు, ఐడీ కార్డ్, డాక్యుమెంట్లు, లైసెన్స్ ప్లేట్స్, స్క్రీన్లు, భవన ముఖద్వారాలు, స్ట్రీట్ సైన్లు, బిల్డింగ్ పేర్లు కనిపించే ఫొటోలను అప్లోడ్ చేయవద్దు.⇒ ఎమోషనల్ స్కామ్స్ నివారించడానికి పిల్లలకు సంబంధించి సమాచారాన్ని షేర్ చేయకూడదు. కుటుంబ వివరాలను వెల్లడించకూడదు.⇒ ‘ఎవ్రీథింగ్ యూ నో ఎబౌట్ మీ’లాంటి ప్రాంప్ట్లు ఇవ్వకూడదు. దీనికి బదులుగా ‘క్రియేట్ యూజింగ్ వోన్లీ ది డిటేల్స్ ఇన్ దిస్ మెసేజ్ అండ్ డోన్ట్ యూజ్ పాస్ట్ చాట్స్ ఆర్ హిస్టరీ’ అని ఇస్తే సరిపోతుంది.⇒ ఇతరుల అనుమతి లేకుండా వారి ఫొటోను అప్లోడ్ చేయవద్దు.⇒ ప్లాట్ఫామ్ను ఉపయోగించే ముందు ప్రైవసీ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కంటెంట్ను ఎంత కాలం స్టోర్ చేస్తారు? కంటెంట్ను మోడల్ ట్రైనింగ్, సర్వీస్ ఇంప్రూమెంట్స్ కోసం ఉపయోగిస్తారా?... మొదలైన విషయాలు తెలుసుకోవాలి.⇒ ‘టెంపరరీ చాట్’లాంటి ప్రైవసీ మోడ్స్ను ఉపయోగించడం మంచిది.⇒ ఒకవేళ మీరు ట్రెండ్ను ఫాలో కావాలనుకుంటే తాజాగా తీసిన హై–రిజల్యూషన్ ఫొటో కాకుండా పాత లేదా ఎడిటెడ్ ఇమేజ్ను ఉపయోగించాలి.⇒ వైరల్ ట్రెండ్తో సంబంధం ఉన్న హానికరమైన లింక్లు, ప్రమాదకరమైన డౌన్లోడ్లు, ఫిషింగ్ నివారించడానికి సెక్యూరిటీ టూల్స్ను ఉపయోగించాలి. -
‘యుద్ధమంటే ఆటలా?’ అగ్రరాజ్యంపై ఆగ్రహ జ్వాలలు
వాషింగ్టన్: యుద్ధ క్షేత్రంలో కనిపించే క్షిపణుల హోరు, పేలుళ్లు, ప్రాణనష్టం.. ఇవి అమెరికాకు వినోదాన్ని పంచే ఆటల్లా ఉన్నాయి. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను ఒక అద్భుతమైన ‘వీడియో గేమ్’లా చిత్రికరిస్తూ సోషల్ మీడియాలో అమెరికా ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది. స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్, ఐరన్ మ్యాన్ వంటి పాప్ కల్చర్ పాత్రలు, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి వీడియో గేమ్ క్లిప్పింగులతో వైట్ హౌస్ విడుదల చేస్తున్న వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. యుద్ధాన్ని వినోదంగా మార్చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇరాన్పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా పెంటగాన్, వైట్ హౌస్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ వింత పోకడలు కనిపిస్తున్నాయి. ఎక్స్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా విడుదలవుతున్న ఈ వీడియోల్లో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యాలపై విరుచుకుపడుతుంటే, వెనుక నేపథ్య సంగీతం యాక్షన్ సినిమా ట్రైలర్ను తలపిస్తోంది. ముఖ్యంగా ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ స్టైల్లో క్షిపణులు తగిలిన వెంటనే స్క్రీన్పై ‘కిల్ స్కోర్’ గ్రాఫిక్స్ కనిపిస్తుండటం గమనార్హం. ఈ వీడియోలకు ఇప్పటికే 5.8 కోట్లకు పైగా వ్యూస్ దక్కాయి.కేవలం గేమింగ్ మాత్రమే కాదు, చిన్న పిల్లలు ఇష్టపడే స్పాంజ్ బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ వంటి కార్టూన్ పాత్రలను కూడా అమెరికా తన ప్రచారానికి వాడుకుంటోంది. ఒక క్షిపణి దాడి తర్వాత మరో దాడి చేసే ముందు ‘నేను మళ్ళీ చేయడం చూడాలనుకుంటున్నారా?’ అంటూ వచ్చే డైలాగులను జోడించడంపై అందరూ మండిపడుతున్నారు. టాప్ గన్, గ్లాడియేటర్ వంటి హాలీవుడ్ చిత్రాల క్లిప్పింగులతో యుద్ధ విమానాలను పోలుస్తూ అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించుకుంటోంది. Damn teryata sudah di ramalkan 😂🤣🤣 pic.twitter.com/SEzrodEo9z— Kageyoru (@Kageyoru_) March 8, 2026‘యుద్ధం వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇది. గతంలో యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందో ప్రజలకు వివరించేవారు. కానీ ఇప్పుడు విధ్వంసాన్ని వినోదంలా చూపిస్తున్నారు’ అని మాజీ అండర్ సెక్రటరీ జేమ్స్ గ్లాస్మాన్ విమర్శించారు. యువతను, ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకోవడానికే ట్రంప్ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ విమర్శలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. అమెరికా సైనిక సాంకేతికత ఎంత శక్తివంతమైనదో, ఇరాన్ క్షిపణి కేంద్రాలను ఎంత సమర్థంగా ధ్వంసం చేస్తున్నామో ప్రజలకు ‘రియల్ టైమ్’లో చూపించడమే తమ ఉద్దేశమని వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: చిరుత దవడలు సాగదీసి.. పంజాను తొక్కిపెట్టి.. -
లావణ్య త్రిపాఠికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య
-
కావాల్సింది భారత్ విజయాలు
⇒ భారత జట్టు ప్రదర్శన, టోర్నీ అసాంతం ఆడిన తీరు అద్భుతం. అహ్మదాబాద్లో మన జట్టు చరిత్ర సృష్టించింది. (ఎప్పుడు గంభీరంగా ఉండే గౌతీని ఉద్దేశించి) కోచ్ సాబ్... మీ ముఖంపై ఈ చిరునవ్వు బాగుంది. గెలుపు కోసం తపించిన మీ పట్టుదల, ఈ చిద్విలాసం రెండు కిల్లర్ కాంబినేషన్. బుమ్రా చాంపియన్ బౌలర్. అతని గురించి ఓ ముక్కలో సరిపెట్టలేను. ఓ వాక్యంలో పూర్తి చేయలేను. ⇒ రెండేళ్ల తర్వాత ధోని ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఈ పోస్ట్కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా ధోని, గంభీర్ అభిమానులైతే తెగ రీట్వీట్ చేసుకుంటున్నారు.అహ్మదాబాద్: తాజా ప్రపంచకప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే భారత జట్టు ఘనవిజయాలే ముఖ్యమని అన్నాడు. విజయానంతరం కోచ్ మాట్లాడుతూ ‘మన జట్టు ట్రోఫీలతో సంబరాలు చేసుకోవాలి... వ్యక్తిగత ఘనతలతో కాదు’ అని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తను పదవిలో ఉన్నంత కాలం సమష్టి విజయాలపైనే దృష్టి ఉంటుందని అన్నాడు. ఒకట్రెండు మెగా ట్రోఫీలతో, లేదంటే విజయాలతో భారత శకం మొదలైనట్లుగా భావించనన్నాడు. సోషల్ మీడియా చెత్తని పట్టించుకోనని తేలిగ్గా తీసిపారేశాడు. నమ్మకంతోనే జట్టును నిర్మించాలి, అంచనాలతో కాదని స్పష్టం చేశాడు. పలు అంశాలపై మీడియాతో గంభీర్ పంచుకున్న అభిప్రాయాలు అతని మాటల్లోనే... ఆటగాళ్లపై ఉండాల్సింది నమ్మకం ఏదైనా జట్టు నమ్మకంతో ఎదగాలి. అంచనాలతో కాదు. అంటే ఆటగాళ్ల ఎంపికైనా... జట్టు నిర్మాణమైనా... ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఒకటే. అదే రాణిస్తారనే నమ్మకం. ఈ పునాదితోనే జట్టును నిర్మిస్తాం. అంతే కానీ ఫలానా ఆటగాడు ఈ పూటకు మెరిపిస్తాడు లేదంటే ఈ మ్యాచ్లో గట్టెక్కిస్తాడనే అంచనాలతో జట్టును నిర్మించడం సాధ్యపడదు. ఒక్కసారి నమ్మకం ఏర్పడితే ఒకటి అర వైఫల్యంతో కూలిపోదు. సంజూ సామ్సన్, అభిõÙక్, ఇషాన్ కిషన్లు కూడా విఫలమయ్యారు. కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. అందువల్లే జట్టులో కొనసాగారు. విజయవంతమయ్యారు. సోషల్ మీడియాను పట్టించుకోను అదేపనిగా విమర్శల్ని లేదంటే ప్రతికూల వార్తల్ని వైరల్ చేసే సోషల్ మీడియాను, పనికిరాని నెటిజన్ల పోస్టుల్ని పట్టించుకోను. కోచ్గా నేను జవాబుదారీగా ఉండాలనుకునేది ఈ 30 మందికే (డ్రెస్సింగ్ రూమ్లో భాగమయ్యే ప్లేయర్లు)! పరిమిత ఓవర్ల శకం మాదే అనుకోను అంతర్జాతీయ పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ శకం మొదలైందని నేను అనుకోను. మా ఆధిపత్యం మొదలైనట్లయితే మేం గత మూడు వన్డే సిరీస్లలో రెండు ఎలా ఓడిపోతాం. ప్రత్యేకించి ఐసీసీ క్రికెట్ టోర్నిల్లో మాత్రం భారత్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తాను. 2024లో టి20 ప్రపంచకప్, 2025లో చాంపియన్స్ ట్రోఫీ, 2026లో టి20 వరల్డ్కప్ ఇలా ఏడాదికో ఐసీసీ ట్రోఫీ చొప్పున భారత్ గెలుచుకుంది. లక్ష్మణ్, ద్రవిడ్లకు థ్యాంక్స్ముఖ్యంగా ఈ తాజా కప్ను నా కన్నా ముందు హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రవిడ్కు, బీసీసీఐ ఎక్సలెన్సీ కేంద్రం (సీఓఈ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్లకు అంకితమిస్తున్నా. కొన్నేళ్లపాటు అంకితభావంతో శ్రమించిన ద్రవిడ్ టీమిండియాను ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా మార్చాడు. అలాగే ఆటగాడిగా భారత్కు విజయాలందించిన లక్ష్మణ్ ఇప్పుడు బెంగళూరులో కుర్రాళ్లకు సరైన మార్గదర్శనం చేస్తున్నాడు.2028లో ‘హ్యాట్రిక్’, బంగారమాయేనా... భారత జట్టు సభ్యులందరూ గెలుచుకున్న వరుస ప్రపంచకప్లతో అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత జట్టు సభ్యుల సగటు వయసు 30. అంటే ఇంకో రెండేళ్లలో జరిగే మెగా ఈవెంట్కు దాదాపు వీరే ఉండటం ఖాయం. నిజానికి కెపె్టన్ సూర్యకుమార్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వినిపించినా విజయానంతరం స్వయంగా అతనే వాటిని తోసి పుచ్చాడు. ప్రస్తుతానికి పక్కన బెట్టినా... 2028 వరకైతే సూర్య కొనసాగడం ముమ్మాటికి కష్టమే! ఇక ఆ ఏడాది (2028) భారత క్రికెట్కు అత్యంత కీలకం కానుంది.ఓవైపు ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్లో ‘హ్యాట్రిక్’ టైటిల్ ఊరిస్తుంటే... ప్రతిష్టాత్మక లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కూడా జరుగనున్నాయి. ఇందులోనూ చాంపియన్ అయితే మాత్రం 2028 మనకి బంగారమవుతుంది! ఆదివారం రాత్రి కప్తో పిచ్పై కూర్చున్న కెపె్టన్ సూర్యకుమార్ ఫొటోలకు పోజులిస్తూ తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణం, మరో టి20 ప్రపంచకప్ గెలవడమనే చెప్పాడు. ఆదివారం రాత్రి విన్నర్స్ ట్రోఫీ బహుమతి ప్రదానోత్సవం తర్వాత భారత క్రికెటర్లు తమ కుటుంబసభ్యులతో మైదానంలో ఉల్లాసంగా గడపడంతోపాటు ట్రోఫీతో ఫొటోలు దిగారు. సోమవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి పలువురు ఆటగాళ్లు తమ స్వస్థలాలకు బయలుదేరారు. -
పశ్చిమాసియాలో నిప్పుల వాన.. ఇజ్రాయెల్ ట్రెండింగ్లో యాప్
అహ యేమి హాయిలే హలా.. అంటూ హాయిగా స్నానం చేసే భాగ్యం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇరాన్ దాడుల వేళ నచ్చినప్పుడు బాంబ్ షెల్టర్ల నుంచి బయటికొచ్చి ఇంట్లో కిటికీల సమీపంలో స్నానం చేసే ఆస్కారం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాంబులు పడితే ఇక అంతే. అందుకే ఇప్పుడు ఇజ్రాయెలీల స్నానభయాలను పోగొట్టేందుకు కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. రోజులో ఏ సమయంలో క్షిపణులు తక్కువ పడే అవకాశం ఉందో అంచనావేసి యూజర్లకు సూచిస్తుంది. అవసరం.. ఆవిష్కరణకు తల్లిలాంటిది అంటారు.అలా ఇజ్రాయెలీల పలు రకాల అవసరాలకు తగ్గట్లు వినూత్న యాప్లు ఇప్పుడు ఆ దేశంలో హల్చల్ చేస్తున్నాయి. రాకెట్లు తక్కువగా పడే సమయాన్ని దాదాపు ఖచ్చితంగా అంచనావేసి చెప్పే ‘కెన్ ఐ షవర్?(నేనిప్పుడు స్నానం చేయొచ్చా?’అనే యాప్ ఇప్పుడు అక్కడ తెగ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అంకురసంస్థల దేశంగా పేరొందిన ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ యాప్కు ట్రెండింగ్లో ఉంది. యాప్ను ఉపయోగించే యూజర్ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? బాంబు షెల్టర్ నుంచి అతని స్నానాల గది ఎంత దూరంలో ఉంది? అతను ఎంతసేపు స్నానంచేస్తాడు?స్నానంచేశాక తిరిగి బాంబుషెల్టర్కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను యాప్కు అందజేస్తే ఆయా వ్యక్తులు స్నానంచేసే వేగం, షెల్టర్ దూరం, క్షిపణులు పడే అవకాశాలను గణించి ఆయా వ్యక్తులకు తగ్గట్లుగా ‘స్నానం సమయం’ను యాప్ సూచిస్తుంది. రోజులో ఎన్ని గంటలకు బాత్రూమ్కు వెళ్లాలో చెబుతుంది. రాకెట్లు పడిన సమయాలు, ఎంతసేపు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎంత సేపు ప్రభుత్వం అలర్ట్లు, సైరన్లు ఇచ్చిందనే డేటాను విశ్లేషించి ఆరోజుకు ‘సురక్షిత స్నాన సమయం’ను యాప్ సూచిస్తుంది. ‘హోం ఫ్రంట్ కమాండ్’, ‘రెడ్ అలర్ట్’వంటి యాప్లు సైతం వార్నింగ్ సందేశాలను పంపిస్తూ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.యుద్ధంలోనూ ప్రేమ.. యుద్ధజ్వాలల్లోనూ ప్రేమాగ్నిలో కరిగిపోయే జంటలు, యువత కోసం విభిన్నమైన యాప్లు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బయటికొచ్చాక సైరన్లు మోగగానే సమీప బంకర్ వైపు పరుగెడతారు. అప్పటికే ఆ బంకర్లో మనకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? మనతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఎవరైనా ఆసక్తిచూపిస్తున్నారా? అని తెల్సుకునేందుకు కొన్నియాప్లు రంగంలోకి దూకాయి. బంకర్ ముఖద్వారాల వద్ద క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెచ్చా రు. ఆ కోడ్ను స్కాన్చేస్తే ఆ బంకర్లో ఉన్న వాళ్ల సోషల్మీడియా ప్రొఫైళ్లు ప్రత్యక్షమవుతాయి. కావాలంటే వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం లేదా చాటింగ్ మొదలెట్టవచ్చు. ఏకాకులుగా ఉండిపోయిన సింగిల్స్తో మాట్లాడించే డేటింగ్ యాప్లూ బాంబర్ల వద్ద క్యూఆర్ కోడ్రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి. సురక్షిత మార్గాలనూ చూపుతూ.. ఇప్పటిదాకా క్షిపణులు పడని ప్రాంతాలను గుర్తించి స్థానికులకు ఆయా సమాచారాన్ని కొన్ని యాప్లు చేరవేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ఇతరులు ఆ డేటా ప్రకారమే సురక్షిత రోడ్లు మార్గాల్లోనే ప్రయాణించేందుకు అవకాశం చిక్కుతోంది. వేరే ప్రాంతాలకు వచ్చినప్పుడు సమీపంలోని షెల్టర్ లొకేషన్ను సూచించే యాప్లు వచ్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇంటర్నెట్ను ఊపేసిన ఈ బాలుడు గుర్తున్నాడా? ఇప్పుడు మరోసారి..
అరుణ్ కుమార్ అనే బాలుడు చేతిలో చాయ్ కప్ పట్టుకుని నవ్విన వీడియో సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఈ బాలుడి వీడియోను మీరు కూడా ఇప్పటికే మీమ్స్లో లెక్కలేనన్ని సార్లు చూసి ఉంటారు. 15 సెకన్ల అతడి చిన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇప్పుడు అతడిని అందరూ గుర్తు పడుతున్నారు. ఆ వీడియోను అతని యజమాని ట్రక్ డ్రైవర్ నెహ్రూ ప్రయాణం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తీసి, పోస్ట్ చేశాడు. అరుణ్ నవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్లో అత్యధికంగా షేర్లు వచ్చిన మీమ్లలో ఒకటిగా మారింది. లక్షల మంది ఆ క్లిప్ చూశారు. కానీ, ఆ వీడియోలో కనిపించిన బాలుడి కథ చాలా మందికి తెలియదు.‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ తెలిపిన సమాచారం ప్రకారం.. అరుణ్ చిన్నప్పటి నుంచే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. అరుణ్ 10 సంవత్సరాల వయసులోనే 4వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల చదువును మానేశాడు. అతడి కుటుంబం పేదరికంతో పోరాడుతోంది. చదువు కొనసాగించడం సాధ్యం కాలేదు. పని చేయడం తప్ప మరో మార్గం అతనికి లేదు.ఆ సమయంలో డ్రైవర్ నెహ్రూ అతనిని ట్రక్ క్లీనర్గా పనికి పెట్టుకున్నాడు. రోజువారీ పనుల్లో నెహ్రూకి అతడు సాయం చేశాడు. వింత ఏమిటంటే అతని వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతుండగా ప్రజలు అతని గురించి రాసిన కామెంట్లు చదవడం కూడా అరుణ్కు సాధ్యం కాలేదు. లక్షల మంది అతని నవ్వును ప్రశంసిస్తున్నా ఆ ప్రశంసలను చదవలేడు.. అర్థం చేసుకోలేడు.క్లీనర్ జీవితాన్ని మార్చుతున్న డ్రైవర్అరుణ్ గురించి నెహ్రూ బాగా ఆలోచించాడు. అతని భవిష్యత్తు మార్చాలని నిర్ణయించాడు. నెహ్రూ కూడా ఒకప్పుడు తన కుటుంబాన్ని పోషించేందుకు కాలేజీ చదువును మధ్యలో ఆపాల్సి వచ్చింది. ప్రజలు ఆన్లైన్లో అరుణ్ను ప్రశంసించడం చూసి ఆ బాలుడి భవిష్యత్తు గురించిహ్రూ బాగా ఆలోచించాడు. అరుణ్కు పుస్తకాలు కొనిచ్చాడు. పరీక్ష ఫీజులు చెల్లించాడు. 10వ తరగతి బోర్డు పరీక్షను ప్రైవేట్గా రాయించాడు.ట్రక్లో ప్రయాణిస్తున్న సమయంలో చాయ్ విరామం సమయాల్లో అరుణ్కు నెహ్రూ అక్షరాలు, గణితం నేర్పించాడు. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు అరుణ్. ఈ సంవత్సరం అతని కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. పదో తరగతి బోర్డు పరీక్షలో అతను ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడి కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ సీఎం సిద్ధరామయ్య ఆంక్షలు
-
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్స్ దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయడానికి బ్యాన్ చేసినట్లు సీఎం తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా.. ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.కాగా, సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. -
ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ గ్లామర్.. కలర్ఫుల్ డ్రెస్లో ఆషిక రంగనాథ్ అందాలు..!
మరింత గ్లామరస్గా ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్..దేవకన్యను మరిపిస్తోన్న హీరోయిన్ ఆషిక రంగనాథ్..హీరోయిన్ అమలాపాల్ హోలీ సెలబ్రేషన్స్..బిగ్బాస్ దివి హోలీ సెలబ్రేషన్స్..ధగధగ మెరిసిపోతున్న రానా సతీమణి మిహికా.. View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
ఖుషీ కపూర్ బోల్డ్ లుక్.. మాల్దీవుస్లో బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..!
బోల్డ్ లుక్లో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్..బిగ్బాస్ బ్యూటీ రమ్య మోక్ష లేటేస్ట్ పిక్స్..మాల్దీవుస్లో ఎంజాయ్ చేస్తోన్న బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్..గిటార్ వాయిస్తోన్న స్వయంభు బ్యూటీ సంయుక్త మీనన్..శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ రంభ.. View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Ramya moksha kancharla (@ramya_moksha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) -
సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
‘పెళ్లి’ అంటేనే సంబరాల సందడి. ముచ్చట్లు, మురిపాలతో వధూవరులతో పాటు బంధు మిత్రులుకు మరింత ఉత్సాహాన్నిచ్చే వేడుక. సంగీత్, మెహిందీ అంటూ సాగే ప్రీ వెడ్డింగ్ సంబరాల్లో అలాంటి అరుదైన క్షణాలకు కొదవే ఉండదు. తాజాగా అలాంటి హృదయాన్ని ఆకట్టుకునే దృశ్యం ఒకటి ఆవిష్కృతమైంది. అదేంటో ఒకసారి చూసేద్దామా.సాధారణంగా పెళ్లి వేడుకల్లో వధూవరులే ప్రధాన ఆకర్షణగా ఉంటారు, కానీ ఈ చిన్ని డ్యాన్సర్ ఇద్దరు "చీర్ లీడర్స్" (తాతయ్యలు) అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వధువు అయేష్ణా ప్రసాద్ సంగీత్ వేడుక ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతోంది. ఇంతలో చక్కటి దుస్తుల్లో మెరిసిపోతున్న ఆ చిన్నారి, తన ఇద్దరు తాతయ్యల (అమ్మనాన్న, నాన్న నాన్న) చేతులు పట్టుకుని స్టేజ్ పైకి వచ్చింది. వారిద్దరి మధ్యలో నిలబడి ఎంతో ఆత్మవిశ్వాసంతో స్టెప్పులేసింది. ఆ వయసులోనూ ఆ ఇద్దరు తాతాయ్యలు చిన్నారి ఉత్సాహానికి తగ్గట్టుగా, కొరియోగ్రఫీని ఫాలో అవుతూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.హైలైట్ ఏంటంటే పాట మధ్యలో వచ్చే ఒక డ్రమాటిక్ బీట్కు, ఇద్దరు తాతయ్యలు ఆ పాపను గాలిలోకి ఎత్తారు. ఆ సమయంలో ఆ చిన్నారి తన చేతులను చాపి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ డ్యాన్స్ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఏకంగా 82 లక్షల (8.2 మిలియన్) మందికి పైగా ముఖాల్లో చిరు నవ్వులు పూయించింది.నెటిజన్ల సంబరంఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడిపోయారు. స్వచ్ఛమైన ప్రేమ, ఉత్సాహంపై ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిన్నారికి ఇది జీవితాంతం గుర్తుండి పోయే అద్భుతమైన జ్ఞాపకం (Core memory)." అని ఒకరు వ్యాఖ్యానించారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్) View this post on Instagram A post shared by Anjali Damani Choreography (@anjalidamanichoreography) "తమ తాతయ్యలను కోల్పోయిన వారికి, ఈ వీడియో చూస్తుంటే తమ నెరవేరని కల నెరవేరినట్లు అనిపిస్తోంది." అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'అంజలి దమానీ కొరియోగ్రఫీ' షేర్ చేసిన ఈ వీడియో, సంజు రాథోడ్ పాడిన 'షకీ' (Shaky) అనే పాపులర్ మరాఠీ సాంగ్కు వీరు స్టెప్పులేశారు.ఇదీ చదవండి: వెజ్ బిర్యానీ షాప్ ఫ్రీజర్లో డెడ్బాడీ, షాకైన ఓనర్ -
నటిపై అసభ్య పోస్టులు పెట్టిన నటుడి అరెస్టు
హైదరాబాద్: సోషల్ మీడియాలో బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రముఖ నటిపై అసభ్య పదజాలంతో కామెంట్ పెట్టిన నటుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వరంగల్కు చెందిన సినీ నటుడు రుషిత్(26) రీల్ మాయ–1 పేరుతో మూడు వారాల క్రితం ఓ బోగస్ అకౌంట్ను క్రియేట్ చేసి ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్లలో ఓ నటి మీద అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టాడు. సదరు నటికి ఓ దర్శకుడితో లింక్ ఉందంటూ ఫేక్ ప్రచారం చేశాడు. దీంతో బాధిత నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు రుషిత్ బోగస్ అకౌంట్లపై లోతుగా దర్యాప్తు చేశారు. సదరు సోషల్ మీడియా సంస్థలకు కూడా లేఖలు రాసి ఆరా తీయగా నిందితుడి గుట్టు బయటపడింది. అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటూ సినిమాల్లో వేషాలు వేసుకుంటూ కాలం గడుపుతున్న రుషిత్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
82 ఏళ్ల మహిళకు అప్పర్ బెర్తా? IRCTC క్లారిటీ ఇది!
సీనియర్ సిటిజెన్ అని ప్రత్యేకంగ పేర్కొన్నప్పటికీ, రైల్వే రిజర్వేషన్ సమయంలో చాలా మందికి లోయర్ బర్త్లు ఎలాట్ కావు. పైగా అప్పర్ బర్త్లు కేటాయించడం ఒక్కోసారి చాలా కోపం తెప్పిస్తుంది. అలా కాసేపు రైల్వేస్ని తిట్టుకుని ఊరుకోకుండా ఒక వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. 82ఏళ్ల మహిళకు అప్పర్ బెర్త్ కేటాయించారని వ్యక్తి ఫిర్యాదుపై భారతీయ రైల్వేస్ ఎలా స్పందించింది. సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం ఈ కథనంలో..ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వెబ్సైట్ ద్వారా రైల్వే టికెట్ బుక్ చేసుకుంటే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణులు ట్రైన్లలో లోయర్ బెర్త్లు పొందే అవకాశముంది. కానీ తాజాగా 82 ఏళ్ల వృద్దురాలికి ట్రైన్లో పైబెర్త్ కేటాయించడంపై సోషల్ మీడియా ద్వారా రైల్వేశాఖను ప్రశ్నించాడు. “82 ఏళ్ల మహిళ కోసం ఆన్లైన్లో టికెట్ బుక్ చేశాను. చాలా సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ అప్పర్ బెర్త్ కేటాయించారు. ఇప్పుడు అదే లోయర్ బెర్త్లను ప్రీమియం తత్కాల్ కేటగిరిలో అధిక ధరలకు అమ్ముకున్నారు” అంటూ ఐఆర్సీటీసీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ట్యాగ్ చేస్తూ ఎక్స్లో ట్వీట్ చేశారు. దీనిపై ఐఆర్సీటీసీ స్పందించింది క్లారిటీ ఇచ్చింది.ఐఆర్సీటీసీ ఏమందీ అంటే..ఈ వైరల్ పోస్ట్కు ప్రతిస్పందిస్తూ, కార్పొరేషన్ సీనియర్ సిటిజన్లు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు లోయర్ బెర్త్ కేటాయింపుకు సంబంధించి నియమాలను స్పష్టం చేసింది."సర్, భారత రైల్వేల కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్లో, సీనియర్ సిటిజన్లు మరియు 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణీకులకు, వేరే మార్గం లేకపోయినా, స్వయంచాలకంగా లోయర్ బెర్త్ కేటాయించే నిబంధన ఉంది. అయితే, ఇది బుకింగ్ సమయంలో అటువంటి లోయర్ బెర్త్ల లభ్యతకు లోబడి ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా రిజర్వ్ చేయబడిన టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో, లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుకింగ్ను ఎంచుకునే నిబంధన ఉందని కూడా ఉంది. ఈ సందర్భంలో లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే టికెట్ బుక్ అవుతుంది. అంతేకాకుండా, ఇండియన్ రైల్వేలలో, రిజర్వ్ చేయబడిన వసతిని ఫస్ట్ కమ్ఫస్ట్ సర్వ్ కింద బుక్ అవుతుంది. ఎంపిక చేసుకున్న బెర్త్ లభ్యతకు లోబడి కేటాయించబడుతుంది" అని IRCTC వివరణ ఇచ్చింది. Booked ticket for 82 year old lady and @IRCTCofficial allotted upper berth (even though there were many seats available). Now the same lower berths will be sold at high rates in premium tatkal 👏Also well done in removing senior citizen quota @AshwiniVaishnaw— babu bisleri (@baabuOP) February 28, 2026లోయర్ బెర్త్ కావాలంటే ఈ చిట్కా పాటించాలట ఇలాంటి వివాదంలో గతంలో ఇండియన్ రైల్వేస్కు చెందిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఇచ్చిన వివరణ ఇచ్చారు. ఇది చాలామంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తొలగించడంలో సహాయపడింది. "మీరు సీనియర్ సిటిజన్ కోటాలో లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకే టికెట్లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చినట్లయితే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయని టీటీ వివరించారు. ఇదీ చదవండి : తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?భారతీయ రైల్వేస్లో సీనియర్ సిటిజన్ కోటా ఆటోమేటిక్ లోయర్ బెర్త్ కేటాయింపు లభ్యతను బట్టి 60 ఏళ్లు, అంతకు పైబడిన పురుషులకు, 45 ఏళ్లకంటే ఎక్కువ వయస్సున్న మహిళలకు లోయర్ బెర్త్లు కేటాయించ బడతాయి. టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణీకులు వయస్సు రుజువును అందించాల్సిన అవసరం లేదు. అయితే, వారు ప్రయాణ సమయంలో వారి వయస్సును చూపించే చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి . టికెట్ తనిఖీ సిబ్బంది అడిగినప్పుడు దానిని చూపించాలి.ఇదీ చదవండి: విజయ్కు మరో ఎదురుదెబ్బ, జ్యోతిష్కుడి సంచలన అంచనాలు -
వ్యూస్ కోసం కక్కుర్తి పడొద్దు.. సజ్జనార్ వార్నింగ్
సాక్షి హైదరాబాద్: సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారని హైదరా బాద్ సీపీ VC సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ఖాతాలో సజ్జనార్ పోస్ట్ చేశారు.చలాన్ల రాయితీ తప్పంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీస్ శాఖ ఇదివరకూ అధికారికంగా ఎటువంటి రాయితీలను ప్రకటించలేదని తెలిపారు.కనుక ప్రజలు దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలను నమ్మకండి.. ఇతరులకు షేర్ చేయకండి అని సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొంతమంది వ్యక్తులు ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వీసీ సజ్జనార్ తెలిపారు.ఫేక్ న్యూస్ అలర్ట్! సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కక్కుర్తితో కొందరు ఎంతకైనా దిగజారుతున్నారు. మార్చి 14న లోక్ అదాలత్ సందర్భంగా ట్రాఫిక్ చలానాలపై రాయితీలు అంటూ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరం ఏంటంటే.. ఈ ఫేక్ సమాచారం వీడియోలకు ఏకంగా లక్షల్లో వ్యూస్ రావడం.… pic.twitter.com/wrZ9znN6qe— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 1, 2026 -
మా వరకు ఎందుకు.. మీ ఎమ్మెల్యేలు చాలు సోషల్ మీడియాని కంపు చేయడానికి
-
పిల్లల లోకానికి 'లాక్'
పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. గతవారం ఢిల్లీలో జరిగినఏఐ ఇంపాక్ట్ సదస్సులో కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పిల్లల్ని ఆన్లైన్నుంచి దూరం చేస్తూ నియంత్రణలను అమలు చేస్తున్నాయి. –సాక్షి స్పెషల్ డెస్క్నియంత్రణ ఎందుకు?సోషల్ మీడియా ప్రభావం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, ఆన్లైన్ లో భద్రతా పరమైన ముప్పు పొంచి ఉండటం పట్ల సామాజికవేత్తలు, పిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రణ గురించి యోచిస్తోంది.అమలు సాధ్యమేనా?నియంత్రణలు విధించడం మంచిదే అయినా, వాటిని అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదా : ఇంట్లో అందరూ వాడే ఫోన్ల ద్వారా పిల్లలు సులభంగా తమ వయసును తప్పుగా చూపి సోషల్ మీడియాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో నియంత్రణ నిష్ఫలం అవుతుంది. మరికొన్ని సమస్యలునియమాలు కఠినంగా ఉంటే పిల్లలు తక్కువ పర్యవేక్షణ ఉండే ఇతర ప్రమాదకరమైన యాప్స్ వైపు వెళ్లే ప్రమాదం ఉంది. అదీగాక, ఇంటర్నెట్లో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని కూడా వారు కోల్పోవచ్చు. చివరికి మంచి చేయబోతేచెడు ఎదురైనట్లవుతుంది. నిపుణుల సూచనపిల్లలను సోషల్ మీడియాకు దూరం చేయడం కంటే కూడా, టెక్నాలజీ కంపెనీలు తమ ప్లాట్ఫాంల డిజైన్ను మార్చాలని నిపుణులు చెబుతున్నారు. యాప్స్కు బానిసల్ని చేసే ఫంక్షన్లను, ఆప్షన్లను తొలగించాలని వారు చెబుతున్నారు. అలాగే కంటెంట్ను సరిగ్గా నియంత్రించేలా కంపెనీలపై ఒత్తిడి తేవడమే సరైన పరిష్కారమని వారు అభిప్రాయపడుతున్నారు. -
ప్రసన్న కుమార్ అలియాస్ అంజలి!
సాక్షి,హైదారాబాద్: విశాఖపట్నానికి చెందిన పెదపూడి ప్రసన్న కుమార్ కాంబోడియాలో కూర్చుని అంజలి కందులగా మారాడు. ఈ పేరుతో మాట్రిమోనియల్ సైట్ ద్వారా నగరానికి చెందిన యువకుడి పరిచయమయ్యాడు. చాటింగ్ చేస్తూ చీటింగ్ మొదలుపెట్టి క్రిప్టో ట్రేడింగ్లో ఇన్వెస్టిమెంట్ అన్నాడు. ఇలా రూ.11 లక్షలకు పైగా కాజేసి తన వాటా తీసుకున్నాడు. కాంబోడియా కేంద్రంగా సాగుతున్న భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్లో సూత్రధారిగా ఉన్న ప్రసన్న కుమార్ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ వి.అరవింద్ బాబు శుక్రవారం ప్రకటించారు. ఇతడిపై జారీ చేసిన ఎల్ఓసీ ఆధారంగా చెన్నై విమానాశ్రయంలో దిగిన వెంటనే పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. ప్రసన్న కుమార్ 2024 ఏప్రిల్లో విదేశీ ఉద్యోగం కోసం విశాఖలోని జాబ్ కన్సల్టెంట్ను సంప్రదించాడు. డేటా ఆధారిత ఉద్యోగం కలి్పస్తామని చెప్పి కంబోడియా పంపారు. అక్కడకు చేరుకున్న ప్రసన్నకు భారతీయులను సోషల్మీడియా వేదికల ద్వారా మోసం చేసే వ్యవస్థీకృత ముఠా సూత్రధారులతో పరిచయం ఏర్పడింది. తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించిన ఇతగాడు వారితో చేతులు కలిపి వివిధ రకాలైన ఫ్రాడ్స్ చేయడంపై శిక్షణ పొందాడు. ఆపై నేరుగా రంగంలోకి దిగిన ప్రసన్న విశాఖకే చెందిన రవి కిరణ్, గంగ రాజుల నుంచి దాదాపు 500 సిమ్కార్డులను అక్రమంగా పొందాడు. ఆ నెంబర్ల ఆధారంగా వివిధ సోషల్మీడియా, మాట్రియోనియల్ సైట్లలో ఆక్షణీయమైన యువతులు, మహిళల ఫొటోలు, పేర్లతో నమోదయ్యాడు. అలా ఇక్కడి వారితో పరిచయం పెంచుకుని, పెళ్లి ప్రస్తావన తెచి్చ, చాటింగ్ ద్వారా బోగస్ క్రిప్టో, ఫారెక్స్ ట్రేడింగ్ వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టి స్వాహా చేయడం మొదలుపెట్టాడు. నగరానికి చెందిన యువకుడికి (28) ఇతగాడు అంజలి కందులగా మాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను లండన్లో ఇంజనీర్గా పనిచేస్తున్నానని నమ్మించాడు. ప్రేమ, పెళ్లి అంటూ మాటలు చెప్పి ఆపై అసలు కథ మొదలుపెట్టాడు. తన మామ క్రిప్టో ట్రేడింగ్ నిపుణుడని ఆయన చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఎర వేశాడు. దీనికి బాధితుడు అంగీకరించడంతో నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్లో పెట్టుబడి పెట్టించాడు. ఈ బోగస్ ప్లాట్ఫామ్స్ డ్యాష్బోర్డుల్లో భారీ మొత్తం బ్యాలెన్స్ ఉన్నట్లు చూపిస్తూ రూ.11,17,834 ఇన్వెస్ట్ చేయించారు. బాధితుడు ఈ మొత్తాన్ని గత ఏడాది నవంబర్ 13న విత్డ్రా చేసుకోవాలని ప్రయతి్నంచగా సాధ్యం కాలేదు. తనతో తియ్యగా మాట్లాడిన అంజలి పేరుతో ఉన్న సోషల్మీడియా, మాట్రిమోనియల్ ఖాతాలు సైతం మాయం అయ్యాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు తొలుత విశాఖపటా్ననికి చెందిన రవి కిరణ్, గంగ రాజులను అరెస్టు చేశారు. వీరి విచారణలో ప్రసన్న కుమార్ పేరు వెలుగులోకి వచి్చంది. అతడు కాంబోడియాలో ఉన్నాడని తెలియడంతో లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసి అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు పంపారు. మంగళవారం కాం»ొడియా నుంచి వచి్చన ప్రసన్న చెన్నై విమానాశయంలో దిగాడు. ఎల్ఓసీ ఆధారంగా పట్టుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ప్రసన్నను అరెస్టు చేసి తీసుకువచ్చింది. -
మల్లికార్జున ముత్యాకు మూడింది.. వైరల్ వీడియోతో ‘అప్పాజీ’పై పోక్సో కేసు
బెంగళూరు: తనను తాను ‘నడిచే దేవుడు’గా ప్రచారం చేసుకుంటున్న మహల్ రోజా మఠాధిపతి మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాలల రక్షణ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు మహల్ రోజా మఠాధిపతి మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గోగి పోలీస్ స్టేషన్లో పోక్సో యాక్ట్ సెక్షన్ 12 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదనంగా బీఎన్ఎస్లోని సంబంధిత సెక్షన్ల కింద కూడా కేసు పెట్టారు. అయితే, ముత్యా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు వచ్చే వారం విచారణకు రానుంది.మఠాధిపతి నేపథ్యంమల్లికార్జున ముత్యా కర్ణాటక యాదగిరి జిల్లాలోని మహల్ రోజా మఠం అధిపతి. ఆయనను స్థానికంగా ‘నడిచే దేవుడు’గా కొలుస్తారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఆయనకు పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు ఉన్నారు. మఠం ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.సంఘటన వివరాలుఫిబ్రవరి 19న మహల్ రోజా మఠంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు ఓ మైనర్ బాలిక, ఆమె కుటుంబ సభ్యులు మఠానికి వచ్చారు. మఠంలో అందరూ చూస్తుండగానే ముత్యా బాలికను ఎత్తుకోవడం, ఆమె శరీరాన్ని తాకడం వంటి దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద వివాదం చెలరేగింది.పోలీసు చర్యలువీడియో ఆధారంగా పోలీసులు చిన్నారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె తల్లిదండ్రులను కూడా విచారించారు. మఠానికి నోటీసులు జారీ చేసి, ముత్యా విచారణాధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించారు. మఠంలో ముత్యా అనుచరులు, భక్తులు సమావేశమై తదుపరి చర్యలపై చర్చించారు. ‘కమిషన్ వీడియోను సరిగా పరిశీలించకుండా తొందరపడి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అధికారులను ఆదేశించింది. 48 గంటల్లో ఎఫ్ఐఆర్ను ఉపసంహరించకపోతే, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం ముందు నిరసన చేపడతాం’ అని యాదగిరి సీఎంసీ మాజీ చైర్పర్సన్ లలితా అన్పూర్ మీడియాకు తెలిపారు.మల్లికార్జున ముత్యా ఒక స్వయంఘోషిత దేవుడు. ఆయనకు భక్తులలో గౌరవం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలు, కేసు కారణంగా పెద్ద వివాదం చెలరేగింది. ఎఫ్ఐఆర్ నిజమా, వీడియో ఎడిట్ చేసిందా అన్నది కోర్టు విచారణలో స్పష్టత రావాల్సి ఉంది. -
ఇదిగో... బ్లింకిబాండ్
‘గుర్రాలు సినిమాలలో మాత్రమే కనిపిస్తాయి’ అనుకునే వరకు వచ్చింది పరిస్థితి. అయితే నిత్యజీవితంలో ఎక్కడో ఒకచోట అవి మనుషులకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. తాజా విషయానికి వస్తే... రాజస్థాన్లోని ఒక హైవేపై బ్లింకిట్ డెలివరీ బ్యాగ్ను గుర్రంపై మోసుకెళ్తున్న వృద్ధుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంటెంట్ క్రియేటర్ కపిల్ బిష్ణోయ్ ఈ వీడియో క్లిప్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.‘ఇది రాజస్థాన్! యువకులకు గుర్రాన్ని స్వారీ చేసే అవకాశం ఇవ్వకుండా వృద్ధులు ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు’ అని సరదాగా తన క్యాప్షన్లో రాశాడు కపిల్.‘ఆధునిక రహదారిపై గుర్రపు డెక్కల లయబద్ధమైన సంగీతం మాత్రమే వినిపిస్తుంది. ఎలాంటి గందరగోళం, హడావిడీ కనిపించదు’ అనుకునేలా చేసిన ఈ తొమ్మిది సెకన్ల వీడియోను చూసి నెటిజనులు ‘వావ్’ అనడమే కాదు... ‘కార్లు, బైక్ల వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యతోపాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో గుర్రాలు పర్యావరణానికి హాని కలిగించని అద్భుతమైన రవాణా సాధనాలు’ అంటున్నారు కొందరు. ‘బ్లింకిట్’ను ‘జేమ్స్బాండ్’ ను కలిపి ‘బ్లింకిబాండ్’ అని నామకరణం చేశారు. -
ఆర్టిస్ట్ మీరే... క్యారికేచర్ మీదే!
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్... క్యారికేచర్ ట్రెండ్. పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీలో క్యారికేచర్లలోకి మార్చడమే ఈ ట్రెండ్ సారాంశం. వ్యక్తిత్వం నుంచి అభిరుచుల వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా క్యారికేచర్లను రూపొందిస్తున్నారు. ఈ కార్టూన్–స్టైల్ ఇమేజ్లు నెటిజనులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్లో భాగం కావడానికి డ్రాయింగ్ స్కిల్స్, డిజైన్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ ఎక్స్పీరియెన్స్లాంటివేమీ అవసరం లేదు. జస్ట్... ఆసక్తి ఉంటే చాలు!మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటే... ఇలా చేయండి:→ చాట్జీపీటీ ఒపెన్ చేసి లేటెస్ట్ వెర్షన్ (జీపీటి–4వో) ఎంపిక చేసుకోవాలి.→ స్పష్టమైన, ఫ్రంట్–పేసింగ్ సెల్ఫీ లేదా ఫొటోను అప్లోడ్ చేయాలి.→ ‘క్రియేట్ ఏ క్యారికేచర్ ఆఫ్ మై మీ’... ఇలా ఇన్పుట్ ఇవ్వాలి.→ మీ వృత్తి, అభిరుచులకు సంబంధించిన వివరాలను యాడ్ చేయాలి.→ ఇమేజ్ జనరేట్ అయిన తరువాత డౌన్లోడ్ చేసుకోవాలి. -
కలర్పుల్ డ్రెస్సుల్లో మృణాల్ ఠాకూర్.. ట్రెండీ లుక్లో దుషారా విజయన్!
డిఫరెంట్ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతున్న మృణాల్ ఠాకూర్..బీచ్లో టాలీవుడ్ నటి అభినయ చిల్..మెరూన్ డ్రెస్సులో హీరోయిన్ సదా అందాలు..ట్రెండీ లుక్లో కోలీవుడ్ బ్యూటీ దుషారా విజయన్..పట్టు పరికిణిలో విమలా రామన్ హోయలు.. View this post on Instagram A post shared by Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) -
బ్రెజిల్ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు..
జూయిజ్ డీ ఫోరా: బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గెరాయిస్ను భీకర వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని జూయిజ్ డీ ఫోరా, ఉబా నగరాల్లో లక్షలాది మంది ప్రజల జనజీవన అస్తవ్యస్థమైంది. వరద సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 46 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా చాలా మంది జాడ తెలీకుండా పోయిందని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు ప్రకటించారు. 21 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.ఇక, రాత్రిళ్లు సైతం రిస్క్యూ బృందాలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 3,000 మందిని బుధవారం ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 5,60,000 జనాభా ఉండే జూయిజ్ డీ ఫోరా నగర వీధులన్నీ బురదలో నిండిపోయాయి. సమీపంలోని కొండచరియలు మరోసారి విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.🇧🇷🔴 ارتفاع حصيلة القتلى في البرازيلأعلنت فرق الإنقاذ والسلطات المحلية وفاة ما لا يقل عن 20 شخصًا، مع فقدان العشرات، واضطرار أكثر من 400 شخص إلى إخلاء منازلهم، جراء الأمطار الغزيرة التي ضربت جنوب شرق البرازيل.#Brazil #HeavyRain #Floods #Landslides #ExtremeWeather #BreakingNews pic.twitter.com/CHZr6VoFw7— طقس_العالم ⚡️ (@Arab_Storms) February 24, 20261,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మొదలైన వానలకు ఇప్పటిదాకా 20 కొండచరియలు విరిగిన ఘటనలు నమోదయ్యాయని మేయర్ మార్గరీడా సాలమావో చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోందని, బాధిత కుటుంబాలకు తగుసాయం అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లాలూ డ సిల్వా భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించారు. 🇧🇷 Dozens are still missing in southeastern #Brazil after floods killed at least 36 people in the state of Minas Gerais, officials said 👇 pic.twitter.com/B5xvJ4M8iT— FRANCE 24 English (@France24_en) February 25, 2026🚨⚡️At least 23 people were killed due to floods and landslides that struck Juiz de Fora in the state of Minas Gerais, Brazil, after heavy rainfall totaling 584 mm over two days, prompting authorities to declare a state of public calamity. pic.twitter.com/3ZLptDPXTu— RussiaNews 🇷🇺 (@mog_russEN) February 25, 2026🚨 At least 30 people are dead and hundreds displaced in Brazil’s Minas Gerais after record-breaking rainfall triggered landslides and flash floods⚠️ Juiz de Fora was hardest hit, with rivers bursting their banks and entire neighborhoods submerged pic.twitter.com/ZrvhyWwm0u— Anadolu English (@anadoluagency) February 25, 2026 -
‘ఇన్స్టా’లో ప్రధాని మోదీ రికార్డు.. ట్రంప్ ఎక్కడంటే..
న్యూఢిల్లీ: ప్రపంచ వేదికలపై తిరుగులేని ప్రజాదరణతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో మరో సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫోటో షేరింగ్ ప్లాట్ఫారమ్ ‘ఇన్స్టాగ్రామ్’లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మార్కును దాటిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అంతర్జాతీయ నేతలతో పోలిస్తే ప్రధానమంత్రి మోదీ ప్రజాదరణ అందనంత ఎత్తులో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2014లో ఈ ప్లాట్ఫారమ్లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ గత దశాబ్ద కాలంలో తన డిజిటల్ ఉనికిని అమితంగా చాటుకున్నారు. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ యువతను ఆకర్షించడంలోనూ ఆయన ముందున్నారు. మోదీ సాధించిన ఈ ఘనత ఎంతటిదంటే.. ప్రపంచంలోని తదుపరి ఐదుగురు ప్రముఖ దేశాధినేతల మొత్తం ఫాలోవర్ల సంఖ్యను కలిపినా, అది మోదీ వ్యక్తిగత ఫాలోవర్ల సంఖ్య కంటే తక్కువగా ఉండటం గమనార్హం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43.2 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, మోదీ ఆయన కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. వీరి తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో (15 మిలియన్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా (14.4 మిలియన్లు), టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ (11.6 మిలియన్లు) వరుస స్థానాల్లో నిలిచారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ 6.4 మిలియన్ల ఫాలోవర్లతో జాబితాలో కొనసాగుతున్నారు.దేశీయ రాజకీయాల్లోనూ ఇతర నేతలతో పోలిస్తే ప్రధానమంత్రికి ఉన్న ఆదరణ అమితంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుమారు 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్లోనే కాకుండా, ప్రపంచ నేతల ‘అప్రూవల్ రేటింగ్’ (ఆమోదయోగ్యత)లోనూ మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ప్రధాని మోదీ 70 శాతం రేటింగ్తో ప్రథమ స్థానంలో ఉండగా, జపాన్ ప్రధాని సనే తకైచి (63 శాతం), అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ (60 శాతం) తరువాతి స్థానాల్లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 43 శాతం రేటింగ్తో 11వ స్థానానికి పరిమితమయ్యారు.ప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘మోర్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసిన గణాంకాలు సైతం మోదీదే పైచేయి అని చెబుతున్నాయి. 2026 ఫిబ్రవరి 2 నుంచి 8 మధ్య సేకరించిన సమాచారం ప్రకారం 67 శాతం ఆమోదయోగ్యతతో మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. చెక్ రిపబ్లిక్ నేత ఆండ్రెజ్ బాబిస్ (59 శాతం) రెండో స్థానంలో నిలవగా, డొనాల్డ్ ట్రంప్ 40 శాతంతో 11వ స్థానంలోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 2025 నాటి డేటాలోనూ 75 శాతం రేటింగ్తో మోదీ అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ 59 శాతంతో తర్వాతి స్థానంలో నిలిచారు. -
బిగ్బాస్ బ్యూటీ దివి షాపింగ్.. శారీలో నివేదా థామస్ అందాలు..!
చార్మినార్ షాపింగ్లో బిగ్బాస్ బ్యూటీ దివి..బ్లూ డ్రెస్లో బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్..బ్లాక్ శారీలో నివేదా థామస్ హోయలు...డిఫరెంట్ డ్రెస్సులతో బాలీవుడ్ భామ దిశాపటానీ..రెడ్ రోజ్లా మెరిసిపోతున్న ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
విద్వేష వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న విద్వేష ప్రసంగాలు (Hate Speech), సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులు లేదా వ్యవస్థలు ఏవైనా సరే.. ప్రసంగాలు, మీమ్స్, కార్టూన్లు లేదా మరే ఇతర మాధ్యమాల ద్వారా.. ఏదైనా ఒక సమాజాన్ని కించపరచడం అనేది రాజ్యాంగబద్ధంగా అంగీకారం కాదని స్పష్టం చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. #BREAKING #SupremeCourt declares - "It is constitutionally impermissible for anybody, be it the State or non-state actors, through any medium, such as, speeches, memes, cartoons, visual arts etc. to vilify and denigrate any community""It will be violative of the Constitution… pic.twitter.com/1GNinQKAfc— Live Law (@LiveLawIndia) February 25, 2026మతం, భాష, కులం లేదా ప్రాంతం ఆధారంగా ఏ ఒక్క సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో మీమ్స్, ఫొటోల ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడం పెరిగిపోతున్నదని, ఇటువంటి చర్యలు సామాజిక సామరస్యానికి విఘాతం కలిగిస్తాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా సరే ఈ నిబంధనలకు లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగాన్ని సమర్థిస్తానని ప్రమాణం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టిన వారు, బాధ్యతారహితంగా మాట్లాడటం ఏమాత్రం చెల్లదని హెచ్చరించింది. సాధారణ పౌరుల కంటే కూడా ప్రజాప్రతినిధులపై ఈ బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారు చేసే వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ పరిమితులను అతిక్రమించి సమాజాన్ని అవమానపరిచే చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, డిజిటల్ రూపంలో ఉన్న మీమ్స్, కార్టూన్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. -
బయటపడ్డ బ్యూటీ బండారం.. నిమిషాల్లోనే 1.4 లక్షల ఫాలోవర్లు గాన్..!
-
మజిల్ మమ్మీ
మహిళలకు సంబంధించి సోషల్ మీడియాలో తాజా ట్రెండ్.. మజిల్ మమ్మీ. ‘బాగా సన్నబడాలి... మెరుపు తీగలా కనిపించాలి’ అనుకునే ట్రెండ్లు ఎన్నో వచ్చాయి. వాటికి భిన్నమైన ట్రెండ్ ఇది. వెల్నెస్ సంస్కృతికి సంబంధించిన పాత స్టీరియోటైప్లను తోసిరాజని మహిళల శక్తి, ఫిట్నెస్ను పునర్నిర్వచిస్తున్న ట్రెండ్ ఇది. గత ఫిట్నెస్ ట్రెండ్ల మాదిరిగా కాకుండా ‘మజిల్ మమ్మీ’ కండరాల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెడుతుంది. ఈ ట్రెండ్ ప్రధాన సందేశం...బలం బలంలాగే కనిపించాలి. బరువు తగ్గడం మాత్రమే ఫిట్నెస్ కాదు. స్త్రీలు సన్నగా కనిపించాలి, బరువులు ఎత్తవద్దు, స్ట్రెంత్ ట్రైనింగ్ మనకు సంబంధించింది కాదు, నాజూకుగా కనిపించాలంటే మజిల్ అక్కర్లేదు...ఇలాంటి సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను నేటి తరం మహిళలలో చాలామంది తిరస్కరిస్తున్నారు. కండరాలపై దృష్టి సారించే ఈ ఫిట్నెస్ ట్రెండ్ ఊపందుకోవడానికి మరో ప్రధాన కారణం...దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి అవగాహన పెరగడం. మెరుగైన ఎముక సాంద్రత(బోన్ డెన్సిటీ), హార్మోన్ల సమతుల్యత...మొదలైవాటికి ప్రాధాన్యతన పెరిగింది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లాంటి ΄్లాట్ఫామ్లలో ‘మజిల్ మమ్మీ’ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ‘అసలు సిసలు ఫిట్నెస్ అంటే ఏమిటి?’ అనే కాప్షన్తో జనాదరణ పొందిన డెడ్లిఫ్ట్లు, స్క్వాట్లు, రెసిస్టెంట్స్ వర్క్కు సంబధించిన వీడియో క్లిప్లకు, ఆఫ్బీట్ మ్యూజిక్, జోక్స్ జోడించి పోస్ట్ చేస్తున్నారు. -
ఒప్పందాల కోసమే ‘క్వాంటమ్’ కంపెనీల సృష్టి?
సాక్షి, అమరావతి: ఇటీవల క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన సమయంలో 14 కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలో డొల్లతనం బయటపడింది. కేవలం ఒప్పందాల కోసమే కొన్ని కంపెనీలను సృష్టించి, వాటితో ఎంవోయూలు కుదుర్చుకున్నారంటూ ఆధారాలతో సహా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న 14 కంపెనీల్లో... మూడు కంపెనీలు డిసెంబర్, జనవరి నెలల్లోనే ఏర్పాటయ్యాయని... మరో రెండు కంపెనీల అడ్రస్లు ఎంత వెతికినా దొరకడం లేదని విమర్శిస్తున్నారు. డిసెంబర్, జనవరిలో ఏర్పాటు చేసిన కంపెనీలతో ఫిబ్రవరి మొదట్లో ఒప్పందం కుదుర్చుకొని 35 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు ఉద్యోగులున్న కంపెనీతో ఒప్పందమా... 35 లక్షల ఉద్యోగాలా? చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న వాటిలో ఐక్యూలీప్ అనే కంపెనీ డిసెంబర్లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో ముగ్గురు ఉద్యోగులే ఉన్నారు. ఫోటాన్ కోర్ సిస్టమ్స్ అనే కంపెనీ రూ.10 లక్షల మూలధనంతో జనవరి 12న ఏర్పాటైంది. ఇక ట్రై క్వాంటా అనే కంపెనీ కూడా నెలల వ్యవధిలోనే ఏర్పాటైంది. అయితే ఆ కంపెనీ నెలకొ ల్పిన ఆరు నెలల్లోనే బెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అవార్డును కూడా కైవసం చేసుకుందని ప్రకటించారు. కానీ, ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్న క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అప్పుడే ఆ కంపెనీకి అవార్డులు ఎవరిచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కంపెనీల ప్రొఫైల్స్ చూసిన నెటిజన్లు.. ఒకటి, రెండు నెలల కిందటే ఏర్పాటు చేయడంతోపాటు కేవలం ముగ్గురు ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థల ద్వారా ఎంత మందికి శిక్షణ ఇస్తారు? 35 లక్షల మందికి ఉద్యోగాలు ఎలా క ల్పిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వం భారీ ప్రచారం ఎప్పటిలాగానే క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన పేరుతో గ్రాఫిక్ డిజైన్స్ విడుదల చేసి చంద్రబాబు సర్కారు భారీ ప్రచారం చేసుకుంది. రూ.9,000 కోట్లతో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాలంటూ గ్రాఫిక్స్తో సినిమా చూపించింది. వాస్తవంగా చూస్తే ఒప్పందానికి ఒకటి, రెండు నెలల ముందు పుట్టిన మూడు కంపెనీలు, అడ్రస్ దొరకని మరో రెండు కంపెనీలతోపాటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, బోసాన్ క్యూసై, ఐక్యూలీప్, క్యూబిక్ఫోర్స్, క్వాంటమ్ ఫోకస్ ల్యాబ్స్ వంటి లోకల్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఈ రంగంలో భారీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. -
ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా!
గుజరాత్లోని ద్వారకలోని గోమతి ఘాట్ సమీపంలో అద్భుతమైన నెమలి లాంటి తోక ఉన్న అరుదైన చేప ఆసక్తికరంగా మారింది. ద్వారకలోని గోమతి నది పవిత్ర జలాలు సాధారణంగా యాత్రికులతో కళకళలాడుతుంటాయి. సోషల్ మీడియాలో ఒక వింత చేప అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడినెమలి పింఛాన్ని పోలిన చేప అంటూ ఇటు భక్తి పారవశ్యాన్ని, ఇటు శాస్త్రవేత్తలలో ఉత్సుకతను రేకిత్తించింది. అసలేంటీ నెమలి పింఛం పోలిన తోకతో ఉన్న 'నీడిల్ ఫిష్' (Needlefish) కథ తెలుసుకుందాం.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యాయి. చూసేందుకు ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుని తలపైన ఉండే నెమలి పింఛంలాగే ఉందని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే, అద్భుతంతో పాటు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒక చేప నెమలి పింఛంతోకతో కనిపించిన అసాధారణ దృశ్యం సముద్ర జీవవైవిధ్యంలో వస్తున్న మార్పులకు ఇది ఒక సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.చేప తోకలోని రంగురంగుల విసనకర్ర లాంటి తోకను చూసి స్థానికులు, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అరుదైన జీవులు కనిపిస్తాయని నిపుణుల అంచనా.శాస్త్రవేత్తల ప్రకారం, ఇది ఒక అరుదైన జన్యుపరమైన మార్పు లేదా పర్యావరణ ప్రభావం వల్ల కలిగిన శారీరక మార్పు అయి ఉండవచ్చు ఈ నీడిల్ ఫిష్ శరీరం పొడవుగా, సూదిలా ఉండి, తోక విసనకర్ర ఆకారంలో ఉండి, నెమలి ఈకల వలె మెరిసే నీలం, పచ్చ రంగులతో కూడి ఉండటం విశేషం. సాధారణంగా నీడిల్ ఫిష్లు (Needle Fish) పొడవైన శరీరాలు, పదునైన దవడలు కలిగి ఉంటాయి, కానీ వాటికి ఇంత అందమైన, రంగురంగుల తోకలు ఉండటం చాలా అరుదు. ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ View this post on Instagram A post shared by THE UNITY INDIA™ (@theunityindia)ఈ చేప ప్రత్యేకత ఏమిటి?సాధారణంగా ఈ జాతి చేపలకు తోక రెక్కలు (Fins) చాలా చిన్నవిగా, రంగు లేకుండా ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకమైన చేపకు తోక భాగం చాలా వెడల్పుగా, స్పష్టమైన రంగులతో ఉంది. కాంతి పడినప్పుడు ఆ తోక నెమలి పింఛంలా మెరుస్తూ కనిపిస్తోంది. గోమతి నది అరబిక్ సముద్రంలో కలిసే చోట (Brackish water) మంచినీరు, ఉప్పునీరు కలిసి ఉంటాయి. వాతావరణ మార్పులు, నీటిలోని లవణీయత (Salinity) మారడం లేదా సముద్ర ప్రవాహాల వల్ల ఇలాంటి అరుదైన సముద్ర జీవులు అప్పుడప్పుడు తీరానికి వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు, సముద్రపు నీరు వేడెక్కడం వల్ల కొన్ని జీవుల ఆవాసాలు మారుతుంటాయి. జన్యుపరమైన మార్పులు (Mutation) లేదా స్థానిక పర్యావరణ ప్రభావం వల్ల ఈ చేప తోక ఇలా భిన్నంగా తయారై ఉండవచ్చు. దీనిపై సరైన పరిశోధన జరిగితే, భారత తీర ప్రాంతాల్లోని సముద్ర జీవుల పరిణామ క్రమం గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.ఇది తెలిసిన జాతిలో ఒక కొత్త రకమా లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమా అనేది పక్కన పెడితే, ఈ "నెమలి తోక చేప" మాత్రం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఇదీ చదవండి: పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకిగోమతి ఘాట్: ఈ ఘాట్ సుమారు 100 సంవత్సరాలకు పైగా భక్తులచే పూజించబడుతోంది, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడ స్నానం చేసినట్లు నమ్మకం. గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే పవిత్రమైన ప్రదేశం. దీనిని గోమతి సంగమ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పవిత్ర స్నానం చేసి, తమ పాపాలలన్నీ హరిస్తాయని భక్తుల విశ్వాసం. -
లిఫ్ట్ ఫెయిల్ ..చిన్నారి తెగువతో తప్పిన ప్రమాదం
ఇటీవల కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు కామన్ గా మారాయి. తయారీ సంస్థలు సరైన విధంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఇక్కడ జరిగింది. అయితే లిఫ్ట్ లో చిక్కుకోబోయిన ఇద్దరు చిన్నారులను ఒక బాలిక మెలకువతో తక్షణమే స్పందించి కాపాడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఒక అపార్టుమెంటులోని ఎలివేటర్ లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే వారి కుటుంబసభ్యుల కోసం వేచిచూస్తు అక్కడే ఉన్న బాలిక లిఫ్ట్ ని తన చేతితో ఆపుతుంది. అయితే వారు లిఫ్ట్ ద్వారాల మధ్యలో ఉండగానే ఆ గేట్స్ అకస్మాత్తుగా క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ చిన్నారి లోపలికి వెళ్లిపోయింది. అయితే అక్కడే ఉన్న బాలిక తక్షణమే స్పందించి వారికి తన చేయితే లిఫ్ట్ ని బిగియపట్టింది.తన శక్తికి మించిన పనైనా ఏమాత్రం అ ధైర్యపడకుండా బిగుతుగా లిఫ్ట్ గేటును పట్టుకుంది. ఇంతలోనే వారి కుటుంబసభ్యులు వచ్చి ఎట్టకేలకు బలవంతంగా ఆ చిన్నపిల్లలను బయిటకి తీశారు. దీంతో అంతా ఉపిరిపీల్చుకున్నారు. సాధారణంగా లిఫ్ట్ సెన్సార్స్ ఏదైనా అడ్డు చూపితేనే వెనక్కి వెళతాయి. అయితే ఇందులో చిన్న పాప అడ్డు ఉన్నప్పటికీ ఆ డోర్స్ క్లోజ్ అవడం ఆందోళనకు గురిచేస్తోంది.ఈ లిఫ్ట్ వీడియో ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బాలిక ధైర్యసాహసాలకను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఆ ఎలివెేటర్ల భద్రతని ప్రశ్నిస్తున్నారు. లిఫ్ట్ తయారిలో ఇలాంటి భద్రత ప్రమాణాలు పాటించకపోవడం ఏంటని ఇలాంటి వాటి వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే ఈ ప్రమాద ఘటన ఎక్కడ జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. A small girl is seen at the entrance of a residential lift. As the elevator doors began to close, she noticed another child running toward the lift from the corridor.Without hesitation, the girl used her own body to partially block the doorway, preventing the heavy doors from… pic.twitter.com/llUbPdk5eN— SUNIL KUMAR (@ijustsunil) February 21, 2026 -
పరువు నష్టం కేసు.. రోహిణి అర్జీ డిస్మిస్
శివాజీనగర(కర్ణాటక): ఐపీఎస్ అధికారి డి.రూపా మౌద్గిల్ తనపై వేసిన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి డి.రోహిణి సింధూరి సమరి్పంచిన పిటిషన్ను శనివారం హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణ కొనసాగుతుందని తెలిపింది. దీంతో కింది కోర్టులో కేసు విచారణకు ఉన్న అడ్డంకి తొలగినట్లయింది. 2023 ఫిబ్రవరిలో రోహిణి సింధూరి మీద రూప ప్రైవేట్ కేసు (పీసీఆర్) నమోదు చేశారు. సోషల్ మీడియాలో రోహిణి తనను అవమానపరిచేలా పోస్టులు పెట్టారని, పరువుకు నష్టం కలిగించారని, మానసిక అస్వస్థురాలిగా పేర్కొన్నారని రూపా ఆరోపించారు. ఆమె పోస్టుల వల్ల ప్రభుత్వం తనకు కొన్ని నెలలపాటు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది, కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక క్షోభ కలిగిందని డీ.రూపా కోర్టు మెట్లెక్కారు. కేసు విచారణలో ఉండగా, కొట్టివేయాలని రోహిణి హైకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు వచ్చింది. ప్రస్తుతం రూపా అదనపు డీజీపీగా, రోహిణి ఓ శాఖ కార్యదర్శి స్థాయిలో ఉన్నారు. -
గాడి తప్పుతున్న యువత
టీటీసీ పూర్తి చేసిన సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. పొరుగు మండలంలోని పశు వైద్యశాలలో కాంపౌండర్గా పనిచేస్తున్న గోరంట్ల మండలానికి చెందిన యువకుడు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరువైపులా కుటుంబ పెద్దలు గత ఏడాది నవంబర్లో ఇద్దరికీ పెళ్లి చేశారు. కొద్ది రోజులు కాపురం అన్యోన్యంగా సాగింది.ఈ లోపు వెలువడిన డీఎస్పీ ఫలితాల్లో ఆమె అర్హత సాధించకపోవడంతో భర్త మాట్లాడడం మానేశాడు. చివరకు కనిపించకుండా పోయాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని ధర్మవరం పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు స్పందించపోవడంతో ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో ఎస్సీ వద్ద తన గోడు వెల్లబోసుకుంది. ... ఈ పరిస్థితి ఆమె ఒక్కరిదే కాదు... ప్రేమ వివాహం చేసుకున్న 70 శాతం మంది వివిధ కారణాలతో పోలీసులనో.. న్యాయస్థానాన్నో ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఇరువైపులా కుటుంబ పెద్దలకు మనో వేదన మిగులుతోంది. పుట్టపర్తి టౌన్: పాతికేళ్ల క్రితం వరకూ పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడిచేవారు. పెళ్లిళ్లు కూడా ఎక్కువ భాగం తల్లిదండ్రుల నిర్ణయం మేరకే జరిగేవి. పెళ్లి తర్వాత వారిద్దరి మధ్య ఏదైనా సమస్య తలెత్తితే ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని సమస్యకు పరిష్కారం చూపేవారు. పిల్లలకు సర్ది చెప్పి వారి మధ్య మనస్పర్థలు తొలగించి ఒక్కటి చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. సెల్ఫోన్ మాయలో పడి ఒకరినొకరు అర్థం చేసుకోలేక విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. సర్దిచెప్పబోయే తల్లిదండ్రులను సైతం ధిక్కరిస్తున్నారు. ప్రతి వందలో 30 వివాదాస్పదమే.. అగ్ని సాక్షిగా జీవితమంతా కలసి ఉంటామని ఒక్కటవుతున్న జంటలు పెళ్లైన ఆరు నెలలు, ఏడాది గడవక ముందే మనస్పర్దలతో రోడ్డున పడుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాదనలకు దిగుతున్నారు. ఒకరి నిర్ణయాలు మరొకరు గౌరవించక పోవడం, మొండిగా వ్యవహరిస్తుండడంతో పరిస్థితి విషమించి చివరకు విడాకుల వరకూ వెళుతోంది. ప్రతి వంద జంటల్లో 30 వరకు ఇలాంటి కేసులే ఉంటున్నాయి. ఇటీవల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అందుతున్న వినతులే ఇందుకు నిదర్శనం. పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నాలకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్య మాలకు అలవాటు పడిన జంటలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కనీసం ఒక గంట పాటు సమయం కూడా కేటాయించకపోవడమే ఇందుకు కారణమని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. సత్యసాయి జిల్లాలో రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన జంటలు 32విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన దంపతుల సంఖ్య 67విడాకుల పిటీషన్లలో ప్రేమ వివాహాలు 70%తల్లిదండ్రులు దృష్టి సారించాలి ఆధునిక సాంకేతికతను సరైన మార్గంలో పిల్లలు వినియోగించుకునేలా తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఈ క్రమంలోనే పిల్లల ప్రవర్తననూ గమనిస్తూ ఉండాలి. ఏమి చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాలు గమనిస్తూ ఉండాలి. ఒక్కసారి ప్రేమలో పడితే తర్వాత వారు బయటపడడం కష్టం. పెద్దలను ఎదరించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ మేజర్లు కావడంతో చట్టం కూడా అంగీకరిస్తుంది. ఆ తర్వాత చిన్నపాటి విషయంలోనూ ఏకీభవించకుండా మనస్పర్థలు చోటు చేసుకుని విడిపోయే వరకూ దారి తీస్తుంది. ఇలాంటి కేసులే ఎక్కువగా వస్తున్నాయి. – సతీష్ కుమార్, ఎస్పీ -
‘సాక్షి’ సోషల్ మీడియా అరుదైన ఘనత
నేటి సమాజంలో వార్తా విశేషాల్ని తెలుసుకోవడానికి టీవీలు, పేపర్ల పాత్ర చాలా తక్కువైపోయింది. అంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ప్రజలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వేదికలపై దృష్టి పెడుతున్నారు. వార్తలు, వినోదం, అభిప్రాయాలు ఇలా ఆల్ ఇన్ వన్ తరహాలో అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్(ట్విటర్) వంటి ప్లాట్ఫాంలు ప్రధాన సమాచార వనరులుగా మారాయి. తక్షణ సమాచారం అందించే సామర్థ్యం సామాజిక మాధ్యమాలకు ఉండడం ప్రజలను ఆకర్షిస్తోంది. ఫలితంగా యువతలో సోషల్ మీడియా వినియోగం అత్యధికంగా ఉంది.సమాజంలో అభిప్రాయాలు, చర్చలు ఇప్పుడు ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం భవిష్యత్తులో మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా కూడా. ఈ క్రమంలోనే ఇక్కడ మీతో(ప్రేక్షక్షులకు) ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి సంతోషిస్తున్నాము. ‘సాక్షి’ సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్స్లలో నెలవారీ వీక్షణలో 100 మిలియన్ల వ్యూయర్షిప్ను సాధించింది. తెలుగు సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ‘సాక్షి’ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. ఎప్పటికప్పుడు వేగంగా వార్తా సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘సాక్షి’ సోషల్ మీడియాని ఫోలో అవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాం.సాక్షి ఫేస్బుక్సాక్షి ఇన్స్టాసాక్షి ‘ఎక్స్’సాక్షి వాట్సాప్ చానల్ -
ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గుర్తుతెలియని ఆకతాయి చేష్టలకు జిల్లా ప్రజలు శుక్రవారం భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీని వినియోగించుకొని పెట్రోల్బంక్లోకి పులి వచ్చినట్లు ఏఐ ఫొటో క్రియేట్ చేసి సోషల్మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. శుక్రవారం జిల్లాలో ఇద్దరు కలిస్తే చాలు ఈ విషయాన్ని చర్చించుకోవడం కనిపించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లోని భారత్ పెట్రోల్ బంకులోకి పులి వచ్చినట్లు ఫొటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీన్ని చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. దీనిపై ఎస్సై ఉపేంద్రచారి మాట్లాడుతూ పద్మనగర్కు చెందిన కొందరు యువకులు ఈ తుంటరి పనిచేసినట్లు గుర్తించామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అందమే అసూయపడేలా! స్టేడియం మురిసేలా ఎవరి అందాల ‘ ఐరా’ (ఫొటోలు)
-
యూట్యూబర్ ‘నా అన్వేషణ’కు మెటా బిగ్షాక్!
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ 'నా అన్వేష్' కు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ మెటా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది.ఇటీవల అన్వేష్ దేశాన్ని దూషించడంతో పాటు మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల్లో తన సోషల్ మీడియా అకౌంట్లలో అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఫిర్యాదులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించారు. వాటిల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కంటెంట్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నట్లు గుర్తించారు. ఇదే అంశంపై ఇన్స్టా మాతృ సంస్థ మెటాను సంప్రదించారు. అన్వేష్ అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెటా సైతం అన్వేష్ ఇన్స్టా అకౌంట్లను పరిశీలించింది. అనంతరం, అతడి అకౌంట్లపై నిషేదం విధించింది. గతంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. తాజాగా ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది -
రాజుగారు వచ్చారహో!
సౌరభ్జైన్ అనే భారతీయుడి కుటుంబంతో దుబాయ్ పాలకుడు సరదాగా గడిపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది... దుబాయ్లోని సాయిహ్ అల్ సలాం ఎడారి. చుట్టూ ఇసుక తిన్నెలు, ప్రశాంతమైన అల్ ఖుద్రా సరస్సు. వారాంతాల్లో సరదాగా గడపడానికి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈసారి అక్కడికి దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎటువంటి హడావిడి, భద్రతా సిబ్బంది లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. సరస్సు దగ్గర ఆడుకుంటున్న పిల్లలను చూసి, కారు ఆపి ఆత్మీయంగా పలకరించారు. ఆశ్చర్యంతో చూస్తున్న వారి కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో పలకరించారు. పిల్లలతో కలిసి ఫొటో దిగారు. ఈ అద్భుతమైన క్షణాలను సౌరభ్జైన్ తన ఫోన్లో బంధించాడు. ‘ఖుద్రా లేక్ దగ్గర గడిపిన ఒక సాధారణ వారాంతం అద్భుతం. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, పిల్లలపై ఆయన చూపిన ప్రేమ, ఆత్మీయత మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి’ అంటూ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. చాలా తక్కువ టైమ్లోనే ఈ వీడియో వైరల్గా మారింది. నెటిజనులు దీనిని ‘డ్రీమ్ ఆఫ్ మిలియ¯Œ ్స’ అంటున్నారు. -
పింక్ శారీలో ది రాజాసాబ్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్లో సమంత పోజులు..!
వజ్రాల్లాంటి బ్లాక్ డ్రెస్లో సమంత హోయలు..హీరోయిన్ అమలాపాల్ డిఫరెంట్ లుక్..సెలయేరు వద్ద హీరోయిన్ ప్రియమణి చిల్..పింక్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ అందాలు..పట్టుశారీలో మరింత అందంగా బిగ్బాస్ సోనియా...ఎల్లో చీరలో కాయాదు లోహర్ బ్యూటీపుల్ లుక్స్.. View this post on Instagram A post shared by Soniya Yash (@soniya.yashofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Amala Paul 🩷 (@amalapaul) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) -
భారతీయుడి మోసానికి రష్యా మహిళ విలవిల.. వీడియో వైరల్
ఓ భారతీయుడి నమ్మి.. ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకున్న పాపానికి తాను నరకం అనుభవిస్తున్నానని రష్యా మహిళ బోరున విలపించింది. ఇంతటి నమ్మక ద్రోహాన్ని తాను ఎక్కడా చూడలేదని.. తన జీవితంలో మరోసారి భారతీయులను నమ్మను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో తాను స్వదేశానికి(రష్యా) వెళ్లిడానికి భారత్లో వీసా విషయంలో ఉన్న లోపాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. దీంతో, బాధితురాలి పోస్టుపై స్పందిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రష్యాకు చెందిన ఒల్గా 2015లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం భారత్కి వచ్చింది. ఈ సమయంలో భారత్కు చెందిన వ్యక్తిని(భర్త పేరు చెప్పలేదు) ప్రేమించింది. వారిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. అనంతరం, ఆమె భారత్లో శాశ్వత నివాసం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే, కొద్దిరోజుల తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో, ఒల్గా.. 2023 నవంబరులో స్పౌసల్ వీసా(భారతీయ పౌరుడు లేదా OCI కార్డ్ హోల్డర్ను వివాహం చేసుకున్న విదేశీయులకు Spousal Visa (X Visa లేదా Entry Visa) మంజూరు చేస్తారు) కోసం దరఖాస్తు చేసినప్పుడు తన భర్త ఇంటర్వ్యూకి హాజరుకాలేదు. ఈ పరిణామాలతో వారి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఒల్గా.. రష్యా వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. ఇంతలో 2024 జనవరిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన భర్త అదృశ్యమయ్యాడు. దీంతో, ఆందోళన చెందిన ఒల్గా.. పోలీసులను సంప్రదించి. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆరు నెలలు అయినా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో అతను చనిపోయినట్టు భావించి భయంతో కాలం వెల్లదీసింది. కుటుంబం లేకుండా, డబ్బు లేకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. వీసా సమస్యల వల్ల రష్యాకు వెళ్లలేకపోయినట్టు చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay)అయితే, ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో జపాన్ పర్యాటకుడి పోస్ట్లో తన భర్త.. ఒల్గాకు కనిపించాడు. వారణాసిలో సన్యాసిలా మారిపోయి కనిపించడంతో ఆమె ఒక్కసారిగా ఖంగుతింది. దీంతో, అతడిని కలిసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భర్త మరో స్టోరీ అల్లాడు.. ఒల్గాకు క్షమాపణలు చెప్పి, తనను ప్రేమిస్తున్నట్టు నటించి నమ్మించాడు. మరోసారి ఇలా చేయనని చెప్పడంతో.. అతడి మాటలను ఒల్గా నమ్మి మళ్లీ సంబంధాన్ని కొనసాగించింది. దీంతో, ఒల్గా.. హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగం చేస్తూ, భర్తకు ఆర్థికంగా సహాయం చేసింది. ఇంతలో.. తన భర్త చేసిన మరో మోసాన్ని ఆమె తెలుసుకుంది. ఆయన మరో మహిళతో 15 కి.మీ దూరంలో సంబంధం పెట్టుకుని ఉంటున్నాడని గుర్తించింది. ఈ క్రమంలో అతడిని ప్రశ్నించలేక.. చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు రష్యాకు వెళ్లేందుకు ప్రయత్నించింది. రష్యా వెళ్తున్న సమయంలో తన భర్త ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ కారణంగా ఆమెను విమానం నుండి దింపివేశారు. ప్రస్తుతం ఆమె వీసా సమస్యలు పరిష్కరించుకోవడానికి న్యాయ సహాయం కోరుతున్నట్టు పోస్టులో వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఆమె పోస్టులపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా మంది ఆమెకు మద్దతు తెలుపుతూ, ధైర్యంగా నిలబడమని ప్రోత్సహించారు. కొంతమంది ఆమె భర్త ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా భారత వీసా చట్టాలు, విదేశీయుల హక్కులు, భార్యాభర్తల మధ్య న్యాయ పరిరక్షణలపై చర్చలు జరిగాయి. -
పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే!
ఆకాశమంత మందిరి, భూదేవి అంత పీట అన్నట్టు జరుగుతున్నాయి ప్రస్తుతకాలంలో పెళ్లిళ్లు. పెళ్లి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలి పోవాలని కోరుకుంటారు ఇందుకోసం చాలా ఆర్భాటాన్ని ప్రదర్శిస్తుంటారు. పంజాబ్ పెళ్లిలో వధువుపై నోట్ల వర్షం కురిపించిన కుటుంబం చిక్కుల్లో పడింది.విషయం ఏమిటంటే..తమ ఇంట పెళ్లిన గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటంతో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించడం ప్రస్తుతం నెట్టింట తెగ చర్చకు దారి తీసింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను పెళ్లి కుమార్తెపై వెదజల్లారంటూ సోషల మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. (జస్ట్ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)పంజాబ్లోని తర్న్ తరణ్ జిల్లాలో వాలంటైన్స్ డే రోజు ఒక జంట వివాహం చేసుకుంది. వీరి వివాహ రిసెప్షన్ సందర్భంగా పెళ్లికూతురిపై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను పూలవర్షంలా కురిపించారట. ఇదిఆన్లైన్లో షేర్ అయిన వెంటనే దావానలంలా వ్యాపించింది. అటు వధూవరుల కుటుంబంనుంచిగాన,ఈ ఇటు వివాహంలో పాల్గొన్న ఎవరి నుండి నిజమైన నిర్ధారణ లేనప్పటికీ గ్రాండ్ క్యాష్ పార్టీ అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలురూ. 8.5 కోట్లు కాదు, లక్షలేఈ వీడియో వైరల్గా మారడంతో వరుడి కుటుంబం స్పందించింది. ఈ వాదనలను వరుడి కుటుంబ సభ్యులు , వివాహ కార్యక్రమ నిర్వాహకులు తోసిపుచ్చారు.ఈ కార్యక్రమంలో జంటపై రూ.3–4 లక్షల నగదును మాత్రమే కురిపించామన్నారు. రూ. 8.5 కోట్లు అని జరుగుతున్న ప్రచారం అవాస్తమని వరుడి సోదరుడు సికందర్ సింగ్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, DJ కూడా వైరల్ అయిన రూ. 8.5 కోట్ల వాదనను తోసిపుచ్చారు. మొత్తం నగదు సుమారు రూ. 4 లక్షలు అని కొన్ని డాలర్ నోట్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పడం గమనార్హం View this post on Instagram A post shared by PunjabInsta.in (@punjabinsta.in)ఇదీ చదవండి: థాయ్లాండ్లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! -
ఆ విషయంలో ప్రభాస్ నిల్.. పూజా హెగ్దే షాకింగ్ కామెంట్స్
-
బేబీ హీరోయిన్ లేటేస్ట్ లుక్..శారీలో సింగర్ మధు ప్రియ..!
ఈషా ఫౌండేషన్ ఈవెంట్ జ్ఞాపకాల్లో తమన్నా..జిమ్లో కష్టపడుతోన్న సుకుమార్ సతీమణి తబిత..శారీలో సింగర్ మధు ప్రియ..బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య లేటేస్ట్ లుక్..హీరోయిన్ రంభ గ్లామరస్ లుక్.. View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) -
ఫేక్, ఏఐ కంటెంట్ నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం కీలకం నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ఫేక్ కంటెంట్ను అరికట్టడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంటెంట్కే పరిమితం కాకుండా, అన్ని రకాల కంటెంట్పై వర్తించనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంటర్నెట్ యుగంలో వ్యక్తుల గోప్యత ఉల్లంఘన, నకిలీ సమాచారం, డీప్ఫేక్ వీడియోలు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అదే సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అందుబాబులోకి తెచ్చింది. తద్వారా వినియోగదారులు ఎవరైనా సంబంధిత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లో చూసిన ఫేక్ కంటెంట్ గురించి సంబంధిత ఫ్లాట్ఫామ్ యాజమాన్యానికి నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులు బాటు కల్పించింది. ఉదాహరణకు, ఫేస్బుక్లో గోప్యత ఉల్లంఘించే వీడియో కనిపిస్తే, ఫేస్బుక్ గ్రివెన్సెస్ ఆఫీసర్కి ఆన్లైన్లో ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా దాన్ని ఫ్లాట్ఫామ్ నుంచి తొలగిస్తుంది. అంతేకాదు, అశ్లీల కంటెంట్, పిల్లల లైంగిక నేరాలు, కులం లేదా మతం ఆధారిత ద్వేషం, నకిలీ సమాచారం వంటి వాటిని 36 గంటల్లో, వ్యక్తిగత నగ్నత్వం, లైంగిక సంపర్కం, డీప్ఫేక్ వీడియోలు వంటి వాటిపై ఫిర్యాదు వస్తే 2 గంటల్లో చర్య తీసుకోవాలి. కాపీరైట్, పేటెంట్, ట్రేడ్మార్క్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు అయితే 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాలపై కంటెంట్ తొలగించడానికి గడువు 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించారు. జాతీయ భద్రత, శాంతిభద్రతలు, పరువు నష్టం వంటి అంశాలకు ఇది వర్తిస్తుంది.మీరు ఫిర్యాదు చేసినా సదరు సోషల్ మీడియా యాజమాన్యం పట్టించుకోకపోతే 30 రోజుల్లో ప్రభుత్వ Grievance Appellate Committee (GAC)ని సంప్రదించవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. వెబ్సైట్ gac.gov.inలో మొబైల్ నంబర్, OTP, ఆధార్ ద్వారా నమోదు చేసి, ‘File New Appeal’ ద్వారా వివరాలు సమర్పించాలి. కమిటీ నిర్ణయం తప్పు అని భావిస్తే, కంటెంట్ తొలగించాలని ఆదేశించవచ్చు. ఏఐ కంటెంట్పై ప్రత్యేక నియంత్రణలు కూడా ఉన్నాయి. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్కి తప్పనిసరిగా లేబుల్ (నోటీసు) ఇవ్వాలి. ఆడియో లేదా వీడియోలో ప్రారంభంలోనే ఇది AI కంటెంట్ అని స్పష్టంగా చూపించాలి. అశ్లీల కంటెంట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పత్రాలు, డీప్ఫేక్లు ఉత్పత్తి కాకుండా ఆటోమేటెడ్ టూల్స్ ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కంటెంట్ అప్లోడ్ చేసే సమయంలో వినియోగదారుల నుండి అఫిడవిట్ తీసుకోవాలి.ఇప్పటివరకు సోషల్ మీడియా సంస్థలకు సేఫ్ హార్బోర్ ప్రొటెక్షన్ ఉండేది. కొత్త నిబంధనలతో, ప్లాట్ఫారమ్లు కంటెంట్ తొలగించడంలో విఫలమైతే ఈ రక్షణ కోల్పోతాయి. అంటే, వినియోగదారులు రాసిన పోస్ట్పై కూడా కంపెనీలు న్యాయపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఒకవైపు గోప్యత రక్షణను బలపరుస్తాయి, మరోవైపు భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేలా రూపొందించబడ్డాయి. AI కంటెంట్కి ప్రత్యేక నియంత్రణలు ఉండటం వల్ల భవిష్యత్తులో డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. -
టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సెన్సేషన్గా అందాల ‘ఐరా’
క్రికెట్ మ్యాచ్లు జరుగుతుఉన్నపుడు కేవలం ఓవర్లు పరుగులు, బాల్స్, వికెట్స్, విజయాలు, రికార్డులు మరికొంతమంది కూడా విశేషంగా మారిపోతుంటారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా అవతరిస్తారు. ఇటీవల భారతదేశం , అమెరికా మధ్య జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాయ్లో ఇలాంటి విశేషమే చోటు చేసుకుంది. ఒక అందాల ముందు గుమ్మ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ 3వేల 3.77 లక్షలకు పెరిగిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.ICC పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తళుక్కున మెరిసింది ఐరా రావత్ (Aira Rawat). ఆ క్షణం ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఇండియా vs USA మ్యాచ్ సందర్భంగా కెమెరా ప్యాన్ అవుతూన్న సందర్భంలో ఒక యువతి వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే నిమిషాల్లోనే, ఇంటర్నెట్ ఆమె ఫోటోలు, వీడియోలతో నిండిపోయింది. మ్యాచ్ రోజున ఆమె నీలం రంగు టీ-షర్టు, తెల్లటి షార్ట్ స్కర్ట్ ధరించి స్టేడియంలో సందడి చేసింది. ఉత్కంఠగా జరుగుతున్న మ్యాచ్ మధ్యలు ఆమె హావభావాలు మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. టీమిండియా పట్ల అమె అభిమానానికి,ఆమె క్రికెట్ వైబ్స్కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆసక్తికరంగా, తోటి క్రికెట్ ప్రేమికులతో కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటున్న రావత్ ఫోటోలు కూడా వైరల్గా మారాయి.ఇదీ చదవండి: తీవ్ర విషాదాన్ని నింపిన మెటర్నిటీ ఫోటోషూట్ ఎవరీ ఐరాఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అన్న ఊహాగానాలకు భారీగా వ్యాపించాయి. ఐరాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టమట. ఇన్స్టాగ్రామ్ పేజీలో, క్రికెట్ స్టేడియంలో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను చూడవచ్చు. ప్రత్యక్ష మ్యాచ్లను చూడటానికి రావత్ తరచుగా స్టేడియాలలో వాలిపోతుంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్లకు ఆమె వీరాభిమాని. నిజానికి, ఒకసారి విరాట్ కోహ్లీని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నానని కూడా చెప్పింది రావత్. విరాట్ అనుష్క శర్మను వివాహం చేసుకున్నప్పుడు రావత్ వయసు దాదాపు 18 సంవత్సరాలు. అంతేనా ఐరా రావత్ మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. అందుకే తన బయోలో తనని తాను ఫ్యాషన్ డ్రీమర్ అని పేర్కొంది. ఫ్యాషన్ , స్టైలింగ్ పట్ల ఆసక్తి ఎక్కువటఇరా రావత్ గురించి నిజం ఏమిటంటే..ఇరా రావత్ నిజమైన వ్యక్తినా లేక AI-జనరేటెడ్ ఐడెంటిటీనా అనే దానిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ విడుదల కాలేదు. అయితే, కొన్ని AI డిటెక్షన్ టూల్స్ , డిజిటల్ విశ్లేషకులు ఆమె వైరల్ చిత్రాలను "అనుమానాస్పదంగా" ఫ్లాగ్ చేయడంతో ఇవి ఏఐమాయాజాలమే అనే ఊహాగానాలకు మరింత పెరిగాయి. AI-జనరేటెడ్ కంటెంట్ వాస్తవికంగా మారుతున్న నేటి డిజిటల్ యుగంలో, అసలైన, వర్చువల్ ఐడెంటిటీల మధ్య రేఖను గుర్తించడం చాలా కష్టతరంగామారింది. అందుకే గుడ్డిగా నమ్మకుండా వినియోగదారులు ఇలాంటి ప్రొఫైల్స్ను ఫాలో అయ్యేముందు ప్రామాణికతను ధృవీకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.(కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్) View this post on Instagram A post shared by Aira Rawat (@aira_rawat_) -
పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!
బెట్టింగ్ యాప్లు, సైబర్ మోసాలు, స్కాంలపై అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరో ఇంట్రస్టింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవలి కాలంలో విద్యావంతులు కూడా డిజిటల్ అరెస్ట్ స్కాం బారిన పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్న కేసులను అనేకం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను ఎక్స్లో షేర్ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.దయచేసి గమనించండి...… pic.twitter.com/mzA6JNKBrk— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 14, 2026 -
స్వయంభూ హీరోయిన్ లేటేస్ట్ స్టిల్స్.. రెడ్ డ్రెస్లో మెగా డాటర్ నిహారిక..!
స్వయంభు స్టిల్స్ షేర్ చేసిన సంయుక్త మీనన్..వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనిఖా సురేంద్రన్..మెగా డాటర్ నిహారిక కొణిదెల లేటేస్ట్ పిక్స్..మెడికల్ గ్రాడ్యుయేషన్ పిక్స్ షేర్ చేసిన శ్రీలీల.. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14)


