Social Media
-
హీరోయిన్లకు ‘క్యారెక్టర్’ అక్కర్లేదా?
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుసగా చేసిన ‘దేవర’, తాజా ‘పెద్ది’ పాత్రలపై సోషల్మీడియాలో వేడెక్కిన వివాదం నడుస్తోంది. “ఆమెను కేవలం గ్లామర్కే పరిమితం చేస్తున్నారా? లేక అలాంటి పాత్రలనే ఆమె వెతుక్కుంటూ వెళ్తోందా?” అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో గట్టిగా వినిపిస్తోంది.‘దేవర’ సినిమాలో ఆమె పాత్రపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కథలో పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఆమెను ఎక్కువగా గ్లామరైజ్డ్ ప్రెజెంటేషన్కే పరిమితం చేశారన్న అభిప్రాయం బలంగా వినిపించింది. పాత్ర లోతు కంటే రూపానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ ఒక దశలో “ఆమె పాత్ర అవసరమేలేదా?” అనే స్థాయికి కూడా వెళ్లింది.ఇప్పుడు అదే చర్చ ‘పెద్ది’ తర్వాత మరింత తీవ్రంగా మారింది. రాంచరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో జాన్వీ పోషించిన అచ్చాయమ్మ పాత్రను కొన్ని చోట్ల “అతి గ్లామర్ షో”, మరికొన్ని చోట్ల “రొమాన్స్ కట్టలు తెంచుకునేలా చూపించార”న్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ నేపథ్యం ఉన్న పాత్రగా పరిచయమైనా, కథ ముందుకు సాగేకొద్దీ ఆమె పాత్రను ప్రేమ ట్రాక్, కంప్లీట్ గ్లామర్ ఎలివేషన్స్ వైపు మళ్లించారని సోషల్మీడియా చర్చిస్తోంది. “బలమైన పాత్ర అయ్యే అవకాశం ఉన్నా చివరికి తగ్గించేశార”న్న అభిప్రాయం వైరల్గా మారింది. ఈ క్రమంలో “శ్రీదేవి కూతురై ఉండి ఇలాంటి పాత్రలే చేయాలా?” అనే విమర్శలు కూడా కొంతమంది నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.అలాగని ఆమె కెరీర్ మొత్తం ఇదే దారిలో లేదు. బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రయోగాత్మక పాత్రలు చేసినా, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ బలపడుతోంది—“ఆమెకు గ్లామర్ పాత్రలే సేఫ్ జోన్గా మారాయా?” అని. అయితే మరో వాదన కూడా ఉంది. మార్కెట్ డిమాండ్, కమర్షియల్ ప్రెజర్, కథల ఎంపికలో పరిమిత అవకాశాలు.. కలిసి ఇలాంటి పాత్రలకు దారి తీస్తున్నాయని కొందరు అంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం “స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి రోల్స్ ఒప్పుకోవడం కెరీర్ డైరెక్షన్ నిర్ణయమే” అని వాదిస్తున్నారు.ఇక ఈ చర్చ కేవలం ఒక నటికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల రిప్రజెంటేషన్పై పెద్ద డిబేట్ నడుస్తోంది. కొన్నిచిత్రాల్లో హీరోయిన్లు ఇంకా హీరో ప్రయాణానికి సహాయక పాత్రలుగానే కనిపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. భావోద్వేగాలు, ప్రేమ సన్నివేశాలు, పాటలతో మాత్రమే కథలో ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే సమయంలో ‘అరుంధతి’, ‘మహానటి’ వంటి సినిమాలు హీరోయిన్లను కేంద్రంగా నిలబెట్టి భారీ విజయాలు సాధించాయి. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు, కొందరు హీరోయిన్లు బలమైన పాత్రలతో మంచి ముద్ర వేసారు. ఇది ప్రేక్షకులు బలమైన మహిళా పాత్రలను అంగీకరిస్తారని స్పష్టంగా చూపించింది. కానీ కమర్షియల్ సినిమాల్లో మాత్రం ఆ స్థాయి సమతౌల్యం ఇంకా కనిపించడం లేదు.సీనియర్, జూనియర్ హీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ మధ్యకాలంలో ప్రీతీ ముకుందన్, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తరం నటీమణులు కూడా వేర్వేరు భాషల్లో వేర్వేరు రకాల పాత్రల్లో కనిపిస్తూ చర్చకు కారణమవుతున్నారు. ఒకే నటి ఒక చోట గ్లామర్ షోగా, మరో చోట కథలో కీలక పాత్రగా కనిపించడం ప్రేక్షకుల్లో మిశ్రమ స్పందన తెస్తోంది. మంచి ఫెర్ఫార్మర్ అయిన ప్రీతి ముకుందన్ను కన్నప్పలాంటి భక్తిరస చిత్రంలో దారుణంగా చూపించారని.. కానీ, రీసెంట్ సెన్సేషన్ బ్లాస్ట్లో అద్భుతంగా చూపించారని కోలీవుడ్ నుంచి టాలీవుడ్కు సెటైర్ పడింది. ఉమెన్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయాలో అక్కడి వాళ్లను చూసి నేర్చుకోవాలంటూ ట్రోలింగ్ నడిచింది. అయితే ఈ వ్యవహారం “ఒక్కో ఇండస్ట్రీలో ఒక్కోలా ఎందుకు?” అనే అంశాన్ని మరోసారి పైకి తెచ్చింది.బాలీవుడ్లో బలంగా ఉన్న గ్లామరైజేషన్ ట్రెండ్ ఇప్పుడు దక్షిణాది సినిమాలకూ విస్తరించిందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే దక్షిణాది సినిమాలే ఒకప్పుడు మహిళా పాత్రలకు బలం ఇచ్చిన చరిత్రను కూడా మరికొందరు గుర్తు చేస్తున్నారు. కొంతమంది నటీమణులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ, “కొన్ని సినిమాల్లో పాత్రలకు గౌరవం ఉంటుంది, మరికొన్నింటిలో కమర్షియల్ అవసరాల పేరుతో గ్లామర్ షోకే ప్రాధాన్యం ఇస్తారు” అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పష్టమైన ఏకాభిప్రాయం మాత్రం లేదు.మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ నడుస్తున్న ఈ చర్చ ఒక్క నటికి సంబంధించినది మాత్రమే కాదు. భారతీయ సినిమా పరిశ్రమలో హీరోయిన్ల పాత్రల స్థానం ఎలా మారుతోంది అన్న పెద్ద ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవైపు బలమైన మహిళా పాత్రలు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటే, మరోవైపు గ్లామర్కే పరిమితమైన పాత్రలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు ధోరణుల మధ్య సరైన సమతౌల్యం సాధించగలిగినప్పుడే తెరపై హీరోయిన్లకు నిజమైన గౌరవం దక్కుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. -
అందరూ ప్రేమకథే చూశారు.. అసలు కథ వేరే ఉంది!
భారత సైన్యానికి చెందిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ తన కాబోయే భార్య ఆరోషికి యూనిఫామ్లో.. అదీ ఆర్మీ హెలికాప్టర్లో ప్రపోజ్ చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధుల్లో ఉండగా ఇవేం పనులంటూ ఆర్మీ అధికారులతో సహా కొందరు దీనిని ఖండించారు. మాజీల్లో కొందరు మాత్రం ‘ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు?’ భరద్వాజ్కు సపోర్ట్ చేశారు. అయితే ఆ రొమాంటిక్ దృశ్యం వెనుక.. అత్యంత కీలకమైన ఓ అంశాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది.కెప్టెన్ భరత్ భరద్వాజ్ భారత సైన్యంలో యంగ్ ఆర్మీ ఏవియేషన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న అధికారి. ఇటీవలే హెలికాప్టర్ పైలట్గా శిక్షణ పూర్తి చేసి యూనిఫామ్లో ఫ్రంట్లైన్ సర్వీస్కు సిద్ధమయ్యాడు. అతని కాబోయే భార్య ఆరోషి, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉండగా, అధికారిక శిక్షణ పూర్తి అయిన సందర్భంలో భరద్వాజ్ చేసిన ఈ ప్రత్యేక ప్రపోజల్ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యువ వయసులో ఉన్న ఈ జంటకు సంబంధించిన ఈ రొమాంటిక్ ఘటన ఒకవైపు చర్చనీయాంశంగా మారితే, మరోవైపు యూనిఫామ్లో వ్యక్తిగత జీవితం ఎంతవరకు సమంజసం అన్న డిబేట్కు కూడా దారితీసింది.భరద్వాజ్ ప్రపోజల్ కోసం ఉపయోగించిన హెలికాప్టర్ ‘చీతా’. గత 50 ఏళ్లుగా భారత సైన్యం దాని మీదే ఆధారపడి ఉంటోంది. ఫ్రాన్స్కు చెందిన ఏరోస్పటియల్ సంస్థ డిజైన్ చేసిన ఈ హెలికాప్టర్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 1970ల నుంచి భారత్లో తయారు చేస్తోంది. సియాచిన్ వంటి అత్యంత ఎత్తైన, క్లిష్టమైన ప్రాంతాల్లో సైనిక రవాణా, గాయపడిన వారిని తరలించడం, సరఫరాలు అందించడం వంటి కీలక బాధ్యతలను ఇది నిర్వర్తిస్తోంది. కానీ దీని భద్రతపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.1974 నుంచి 2022 మధ్య కాలంలో చీతా హెలికాప్టర్లు 60కి పైగా ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మొన్న.. మే 20న లడఖ్లోని టాంగ్స్టే ప్రాంతంలో మరో చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో ఉన్న ముగ్గురు సైనిక అధికారులు ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఇప్పుడు ఈ ప్రేమకథ పుణ్యమాని ప్రమాదాల పరంపరను మరోసారి కొందరు చర్చకు తీసుకొచ్చారు. అలాగని చీతా మాత్రమే కాదు, దాని సోదర మోడల్ ‘చేతక్’ హెలికాప్టర్ కూడా ప్రమాదాల పరంగా చెడు రికార్డే కలిగి ఉంది. ఆర్మీ వైవ్స్ అజిటేషన్ గ్రూప్ (AWAG) వివరాల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో చీతా-చేతక్ హెలికాప్టర్లకు సంబంధించిన దాదాపు 191 ప్రమాదాల్లో 294 మంది పైలట్లు మరణించారు. ఈ కారణంగానే వీటిని కొందరు “ఫ్లయింగ్ కాఫిన్స్” (ఎగిరే శవపేటికలు)గా కూడా అభివర్ణించారు.వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే ఆధునిక సాంకేతికత, నావిగేషన్ వ్యవస్థలు లేకపోవడం వల్లే అనేక ప్రమాదాలు జరిగాయని మాజీ వైమానిక దళ అధికారి ఎయిర్ మార్షల్ జీఎస్ బేడీ అభిప్రాయపడ్డారు. దీంతో 2027 నుంచి చీతా, చేతక్ హెలికాప్టర్లను దశలవారీగా సేవల నుంచి తప్పించాలని సైన్యం, వైమానిక దళం నిర్ణయించాయి. వాటి స్థానంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (LUH)ను తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినా, సర్టిఫికేషన్ వివాదాలు, సాంకేతిక అడ్డంకుల కారణంగా ఆ ప్రాజెక్టు ప్రస్తుతం నిలిచిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఒకవైపు వైరల్ ప్రపోజల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే.. మరోవైపు అదే హెలికాప్టర్లో ఎన్నో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలు మాత్రం ఆధునిక ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ఎదురుచూస్తున్నాయి. సియాచిన్ నుంచి లడఖ్ వరకు ఎన్నో విజయవంతమైన మిషన్లకు చీతా సాక్ష్యమైనా, దాని వయసు మీద పడడం, ప్రమాదాల చరిత్ర ఇప్పుడు భారత సైన్యానికి పెద్ద సవాలుగా మారింది. -
పాక్ నిషేధం లేదా?.. జాతరలో కొన్న బెడ్షీట్పై మేడ్ ఇన్ పాకిస్తాన్ ముద్ర
ముంబై: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ వెలుగుచూసింది. ఓ జాతరలో కొనుగోలు చేసిన బెడ్షీట్పై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ (Made in Pakistan) అనే లేబుల్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోను మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, పాకిస్తాన్కు చెందిన వస్తువులు భారత్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణే సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయంలో బుధవారం సంకష్ట చతుర్థి జాతర జరిగింది. ఈ జాతరకు పూణేకు చెందిన ఓ మహిళ వెళ్లింది. జాతరలో ఆమె.. బెడ్షీట్ను కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో దానిపై ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. దానిపై మేడ్ ఇన్ పాకిస్తాన్ అని రాసి ఉండటం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో, వెంటనే దీన్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు గుర్తించారు.पुणे के चिंचवड़ में मोरया गोसावी मंदिर के संकष्टी चतुर्थी के दिन मेले में मेड इन पाकिस्तान चीजों की बिक्रीहिंदू महिला ने किया उजागर वीडियो हुआ वायरल pic.twitter.com/JN859goEf9— Amrendra Bahubali 🇮🇳 (@TheBahubali_IND) June 5, 2026ఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్షీట్ను అమ్మిన సదరు వీధి వ్యాపారి ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్తాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్వర్క్ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు లేఖ రాశారు. అయితే, మహారాష్ట్రలోని శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో కూడా ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్న కొన్ని కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జాతరలు, స్థానిక మార్కెట్లలో విక్రయించే వస్తువులపై నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన పుల్వామా అటాక్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా తగ్గాయి. భారత్.. పాకిస్తాన్కు ఇచ్చిన Most Favoured Nation (MFN) హోదాను రద్దు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా అనేక భారతీయ వస్తువుల దిగుమతులపై పరిమితులు విధించింది. అందువల్ల ‘Made in Pakistan’ అనే లేబుల్ ఉన్న వస్తువు భారత మార్కెట్లో కనిపిస్తే అక్రమంగా దేశంలోని వచ్చేనట్టే లెక్క. ఈ నేపథ్యంలో సరిహద్దు భద్రత, దిగుమతి నియంత్రణలు, అక్రమ సరఫరా గొలుసులపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. -
సారీ చెప్పి.. 15 వేలు ఫోన్పే చేశాడు!
డిజిటల్ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్ పూర్తయ్యాక డిజిటల్ పేమెంట్ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. ఆటో డ్రైవర్ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్పే ద్వారా పంపించాడు. సారీ సర్.. అంటూ మెసేజ్ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్గా మారింది.ఈ కథ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. -
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ -
రోబో ఎంత పనిచేసిందంటే.. వీడియో వైరల్
చైనాలోని ఓ రోబో కలకలం రేపింది. షింజియాగ్లోని ఉర్మికి బొటానికల్ గార్డెన్లో బాలుడిపై రోబో దాడి చేసింది. బాలుడి పొట్టలో తన్నడంతో ఆ బాలుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో రోబోలపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలుడు తన కుటుంబంతో కలిసి సరదాగా గడపడానికి బొటానికల్ గార్డెన్కు వెళ్లాడు. అక్కడ హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శనను చూడటానికి మిగతా ప్రేక్షకులతో కలిసి నిలబడటంతో అంతా బాగానే సాగుతోంది. కానీ అంతలోనే అనూహ్య మలుపు చోటుచేసుకుంది.ఆ రోబో హఠాత్తుగా ఆ చిన్న బాలుడి పొట్టలో తన్నింది. ఈ వీడియో ఈ క్షణాల్లో వైరల్ కావడంతో.. రోబోల చుట్టూ ఉండాల్సిన భద్రతా ప్రమాణాలపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ వీడియో క్లిప్లో కనిపించినట్లుగా.. ఆఫ్రో-స్టైల్ విగ్ ధరించిన ఆ హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన చేస్తోంది. పిల్లలు, పెద్దలు ఆ వినూత్న ప్రదర్శనను ఆసక్తిగా చూస్తూ.. రికార్డ్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆ రోబో ఫైటింగ్ స్టాన్స్లో ముందుకు అడుగు వేసి చుట్టూ తిరుగుతూ రౌండ్హౌస్ కిక్ ఇచ్చింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాకపోయినప్పటికీ.. ఆ ప్రదర్శనను ఎంతో ఆసక్తిగా చూస్తున్న పింక్ కలర్ టీ-షర్ట్, జీన్స్ ధరించిన ఓ బాలుడి పొట్టకు నేరుగా తగిలింది.A robot kicked a little boy in the stomachWe're officially one software update away from Terminatorpic.twitter.com/iO9jv2qUuf— Mario Nawfal (@MarioNawfal) June 4, 2026ఆ బాలుడు నొప్పితో విలవిలలాడుతుండగా.. పక్కనే ఉన్న మరో బాలుడు అతడిని రోబోకు దూరంగా వెనక్కి లాగాడు. అక్కడున్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే, ఆ బాలుడికి తీవ్రమైన గాయాలేమీ కాలేదని తర్వాత ఓ వార్తా సంస్థ తెలిపింది. యంత్రం తప్పు చేసినప్పుడు బాధ్యత ఎవరిది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రోబో ఆ బాలుడిని తన్నినా.. జనాలు ఇంకా ఆ రోబో వైపే చూస్తున్నారా? బాలుడి వైపు దృష్టి సారించి.. అతడు బాగున్నాడా? లేదా? అని చూసే మానవత్వం మనలో ఎటుపోయింది? ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు."ఇది 'టెర్మినేటర్' సినిమా కాదు.. ఇక్కడ యంత్రాలు కావాలని హింసను ఎంచుకోవడం లేదు. అసలైన ప్రమాదం ఎక్కడ ఉందంటే.. హార్డ్వేర్ డెవలపర్లు భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి.. బహిరంగ కార్యక్రమాలలో యంత్రాలను అమాయకపు ఆటబొమ్మల్లా వదిలేస్తున్నారంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇది కేవలం ఒక ప్రమాదంగానే భావిస్తున్నా.. ఆ రోబో కావాలని ఆ చిన్నారిని తన్నలేదు. అది మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తున్నప్పుడు ఆ పిల్లాడు దాని దారికి అడ్డంగా వచ్చాడు.. అందుకే ఈ ఘటన జరిగిందని మరొకరు వ్యాఖ్యానించారు. -
చక్రం ఊడి కుప్పకూలిన విమానం.. పలువురికి గాయాలు!
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలు.. 2011 నుంచి ఈ విమానాలను అనేక అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఉపయోగిస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద సమయంలో ఈ విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. తాజాగా ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో జరిగిన ఘటనతో అసలు ఈ విమానాలు సేఫేనా అనే చర్చ మళ్లీ తెర మీదకు వచ్చింది. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానానికి ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. గేట్ వద్ద నిలిపి ఉంచిన సమయంలో విమానం ముందరి ల్యాండింగ్ గేర్ (నోస్ గేర్) ఒక్కసారిగా కుప్పకూలడంతో విమానం ముందు భాగం నేలపై పడిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్లో పలువురు గాయపడ్డారు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లాల్సిన LH450 విమానం అనూహ్యంగా ముందు చక్రం ఊడిపోవడం గమనార్హం. అయితే ఆ సమయంలో ప్రయాణికులు ఇంకా విమానంలోకి ఎక్కకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. A nearly five-month-old Lufthansa Boeing 787-9 Dreamliner at Frankfurt, preparing for a flight to Los Angeles, experienced a nose landing gear collapse at the gate. pic.twitter.com/72b6J4HyIr— Aviation (@xAviation) June 4, 2026ఈ ఘటనకు గల కారణాలపై సంబంధిత అధికారులు, లుఫ్తాన్సా సంస్థ దర్యాప్తు ప్రారంభించాయి. బోయింగ్ సంస్థ కూడా విచారణలో సహకరిస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రమాదానికి గురైన ఈ బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానం 2026 జనవరిలోనే వాణిజ్య సేవల్లోకి వచ్చిన కొత్త మోడల్ కావడం గమనార్హం. -
పచ్చగా ఉందాం
మంచి చెప్పాలనే ఆలోచన కొందరిలోనైనా మార్పు తీసుకురావాలనే తపన వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చింది. ‘భూమాతకు జవం జీవం కల్పించండి’ అంటూ సోషల్మీడియా ద్వారా సస్టెయినబులిటీ, జీరోవేస్ట్, రీ సైక్లింగ్ గురించి వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఇళ్లలో పోగవుతున్న చెత్తఫ్రెంచ్ సబ్జెక్ట్లో పిల్లలకు పాఠాలు చెబుతుంది విధి. ఐదేళ్లక్రితం పర్యావరణ అనుకూల జీవనంవైపు ప్రయాణం ఆరంభించింది. మిలియన్కు పైగా వీక్షకులు ఉన్న విధి ట్రేషీ సిస్టర్ పేరుతో బోలెడన్ని ఇంటి చిట్కాలు చెబుతుంది. ‘మహిళలు ఉపయోగించే మెనుస్ట్రువల్ కప్ను కనుక్కోవడంతో ఈ దిశగా నా ఆలోచనలు సాగాయి. మహిళలు రుతుక్రమ సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యా డ్స్ వల్ల చెత్త ఎంత ఎక్కువగా వస్తుందో గ్రహించాను. దీంతోపాటు వివిధ రకాల వ్యర్థాలు పర్యావరణంపైనే కాకుండా మన ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకున్నాను. ఇళ్లలో పోగవుతున్న చెత్త గురించి నా పేజీ ద్వారా మాట్లాడుతుంటాను. చిరిగిన బట్టలు, అరిగిన చెప్పులు, వాడేసిన టూత్బ్రష్షులు, గడువు ముగిసిన ఉత్పత్తులు.. వీటన్నింటినీ తిరిగి ఎలా ఉపయోగించుకోవచ్చో చెబుతుంటాను. నా కంటెంట్ చూసి, ఒక్కరు మారినా చాలు’ అంటుంది విధి.ప్రకృతి ప్రేమికురాలు.. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ ఛేంజ్ అడ్వకేట్, ఫొటోగ్రాఫర్, సస్టెయినబిలిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా పేరొందారు శివ్యానాథ్. సోలో ట్రావెలర్ అయిన శివ్యా పదేళ్లుగా మాంసాహార ఉత్పత్తుల నుంచి దూరమై వీగన్ ఫుడ్వైపుగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. వాయిసెస్ ఆఫ్ రూరల్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు కో–ఫౌండర్గా వర్క్ చేస్తున్నారు. రూరల్ స్టోరీ టెల్లర్గా తన గొంతుకను వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా లక్షల్లో ఫాలోవర్లు ఉన్న శివ్యా సోలో ట్రావెలర్గా ప్రకృతి, పర్యావరణం గురించి తన అనుభవాలన్నీ ఇందులో జోడిస్తుంది.చెట్లను రక్షిద్దాం..హిమాచల్ప్రదేశ్ వాసి శివాని కన్వర్ స్వచ్ఛభారత్ మిషన్లోనూ వర్క్ చేస్తుంది. వేస్ట్ మేనేజ్మెంట్, సస్టెయినబిలిటీ మీద కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అమృత్సర్ జిల్లాలోని మజీతాలోని స్థానిక సంస్థలలో చేసిన కృషికి గాను ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాన్నీ పొందింది. ‘చెట్లను నాటడం ముఖ్యం. కానీ, ఇప్పటికే ఉన్న పెద్దచెట్లను రక్షించడం మరింత కీలకం. ఒక చెట్టుకు హాని జరుగుతుంటే చూస్తూ మౌనం వహించకండి. దానిని రక్షించండి. ఇలా దేశమంతటా చేస్తే పచ్చదనాన్ని కాపాడుకున్నవారం అవుతాం. ఎవరైనా అక్రమంగా చెట్లను నరుకుతుంటే దాని గురించి పోలీసులకు తెలియజేయండి. ఒక్క ఫోన్ కాల్ ఒక చెట్టును కాపాడగలదు. కాపాడిన చెట్టు తరతరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని ప్రచారం చేసే శివానీ ఎకో ఎఫర్ట్స్ పేరుతో పర్యావరణ హితానికి కృషి చేస్తోంది.రీ యూజ్ప్రకృతిలో మమేకం అవుతూ ఎలా జీవించవచ్చో తన పేజీ ద్వారా విరిస్తుంది ఇండోర్వాసి ‘శ్వేత కటారియా’. వీగన్ న్యూట్రిషన్పై వర్క్ చేస్తున్న శ్వేత తన పేజీ ద్వారా సస్టెయినబిలిటీ జీవన విధానాల గురించి వివరిస్తుంది. వంటగదిలో వాడే క్లీనింగ్ ప్రొడక్ట్స్, వేస్టేజ్, రీయూజ్ దుస్తుల గురించి మొక్కల పెంపకం, చెట్ల ప్రాముఖ్యత.. ఇలా ప్రతిదీ వివరిస్తుంది. లక్షకు పైగా ఫాలోవర్లు తన కంటెంట్ను ఫాలో అవుతున్నారు. -
నందూస్ వరల్డ్ వీసా స్కామ్లో బిగ్ ట్విస్ట్?!
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ‘నందూస్ వరల్డ్’(Nandu's World) దంపతులైన మధుకర్ జాగర్లమూడి, రమా నందన వీసా స్కామ్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులు, ఒకరో ఇద్దరు కాదని వందల్లో ఉండొచ్చనే వాదనలు తెరపైకి వచ్చాయి. నందూస్ వరల్డ్ వీసా స్కామ్లో ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా, ఇద్దరు దంపతులు డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని తమ వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫ్యామిలీవ్లాగ్స్తో ఫేమస్ యూట్యూబ్లో ఫ్యామిలీవ్లాగ్స్తో ఫేమస్ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిలై సక్సెస్ స్టోరీగా నిలిచారు. ఇప్పుడా కపుల్స్ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా?. బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్ చేశారా?. వైరల్ అవుతున్న వీడియోలు,కేసులు,కౌంటర్ ఆరోపణల మధ్య నందూస్ వరల్డ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అసలు ఈ వివాదం వెనుక కథేంటీ?.సోషల్ మీడియాలో నందు వరల్డ్తో ఫేమస్యిన రమానందన, జాగర్లముడి మధుకర్ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్ దంపతులపై కేసుస్కామ్ విలువ రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు? బాధితుల ప్రకారం.. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్లు కొన్ని సందర్భాలలో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా?’ అన్న వ్యాఖ్యలు వైరల్ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఆరోపణల్ని నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని,యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్ చేసినవేనని, అసలు సంభాషణలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరిని మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణిచ్చారు.మరోవైపు నందన తరుఫు న్యాయవాదులు సైతం కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తాము డబ్బులు ఇచ్చినట్లుగా రసీదులు, ఆడియోలు, బ్యాంకు ట్రాన్సాక్షన్ని సాక్షాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అసలు నిజం ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది.బాధితుల కన్నీళ్లు.. నందన దంపతుల కుట్ర ఆరోపణలుఒకప్పుడు యూట్యూబ్లో సక్సెస్ సింబల్గా కనిపించిన ఈ జంట.. ఇప్పుడ కోట్లాది రూపాయల వీసా స్కామ్ కేంద్రంగా మారింది. ఓ వైపు బాధితుల కన్నీళ్లు.. మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో సోషల్ మీడియా నిండిపోయింది. వైరల్ ఆడియోలు, కేసులు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్ చేశాయి. సోషల్ మీడియా స్టార్డమ్ నుంచి క్రిమినల్ కంప్లయింట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరివైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్ వరల్డ్ వ్యవహారం సోషల్ మీడియా నుంచి పోలీస్ స్టేషన్ వరకు హాట్టాపిగ్గా కొనసాగేలా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతుల్ని హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అమ్మ,భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం రూ.18లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్ షిప్ వీసాతో యూకేకి వెళ్లిన తాము పడరాన్ని పడినట్లు తెలిపారు. తమను నమ్మించి పదే పదే ఫేక్ స్పాన్సర్ షిప్ విధించడంతో యూకే ప్రభుత్వం తమను పదేళ్ల పాటు బ్యాన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.యూట్యూబ్లో తమకు వస్తున్న ఫేమ్ను తట్టుకోలేక పలువురు విష ప్రచారం చేస్తున్నారని నందన వీడియోపై బాధిత దంపతులు స్పందించారు. నందన భర్త మధుకర్కు డబ్బులు పంపిన సస్కక్రీన్ షార్ట్స్, మనీ ట్రాన్సాక్షన్ ఉన్నాయని తెలిపారు. తమ న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట వారి బాధను వెలిబుచ్చారు. -
సుష్టుగా గడ్డి భోంచేస్తున్న యువకుడు : వైరల్ వీడియో
సోషల్ మీడియా అంటే విచిత్రాలు, వింతల పుట్ట. తాజాగా ఒక విచిత్రమైన వీడియో సోషల్ మీడియాను సంచలనం రేపుతోంది. ఒక యువకుడు పశువుల మేతను తింటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. పశువుల కంటే ఇష్టంగా, ఎంతో హాయిగా, మహా ప్రసాదంలా కళ్లకద్దుకుని మరీ గడ్డిని భోంచేయడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు చుట్టూ ఉన్నవారంతా ఇతడిని ఉత్సాహపరుస్తుండటం చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వీడియో ప్రామాణికత, ఉద్దేశ్యం, ఎక్కడిది? ఆ యువకుడు ఎవరు? ఎందుకు తింటున్నాడు అనే దానిపై స్పష్టత లేదు. కానీ మతపరమైన లేదా మూఢనమ్మకపు ఆచారంలో భాగంగా ఆవుల కోసం ఉద్దేశించిన మేతను తింటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో ఆన్లైన్లో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు దీన్నొక సాంస్కృతిక ఆచారంగా భావిస్తుండగా, మరికొందరు పశువుల కోసం ఉద్దేశించిన మేతను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పశువుల మేత అనేది పశువులకు మాత్రమే ఉద్దేశించింది. అది మానవ ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం దానిని తయారు చేయడం, నిల్వ చేయడం లేదా ప్రాసెస్ చేయడం లాంటివి ఉండవు. అటువంటి పదార్థాలను తినడం వల్ల కలుషితాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలతో ప్రాణాపాయం ప్రమాదం పెరగవచ్చు.ఇదీ చదవండి: ఢిల్లీ విషాదం : ఈ హీరోల సాహసం తెలిస్తే కన్నీళ్లాగవు!మరోవైపు దీనిపై ఆహార నిపుణులు, వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ కోసమో, సోషల్ మీడియాలో ఆదరణ కోసమో ఇలాంటి అసాధారణ చర్యలకు పూనుకోవద్దని హితవు చెబుతున్నారు. ఇలాంటి వాటిని మనుషులు జీర్ణం చేసుకోలేని, తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.बिल्कुल इसी तरह से चारा खाया गया था 🧐एक युवक भूसा खाते हुए नजर आ रहा है. वीडियो में वह बड़े आराम से भूसे को चबाता दिखाई दे रहा हैं. pic.twitter.com/UM232Bvufa— Rahul Singh Parihar🇮🇳 (@RAHULPARIHAR11) June 2, 2026 ఇదీ చదవండి: రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు -
రండి దొర.. రండి.. ప్రకాశ్రాజ్ సెటైరికల్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్రాజ్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రకాశ్రాజ్ తాజాగా ఎక్స్ వేదికగా..‘మీరొస్తానంటె మేమొద్దంటామా?. రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?. లేదా సింగల్గా వస్తున్నారా?. అది చెప్పి రండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. “మీరొస్తానంటె మేమొద్దంటామా? రండి దొర .. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి . #justasking— Prakash Raj (@prakashraaj) June 4, 2026 -
ఏ ర్యాంకర్ చేయని సాహసం.. ఐఐటీ బాంబే సీటు వదులుకుని!
జేఈఈ అడ్వాన్స్డ్.. దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలో ఒకటి. అలాంటి పరీక్షంలో సింగిల్, డబుల్ డిజిట్ ర్యాంకులు సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ఆ ర్యాంక్తో.. ఐఐటీ బాంబే లాంటి ప్రతిషాత్మక వర్సిటీలో సీటు దక్కించుకోవడం గొప్ప అవకాశం కాదంటారా?. కానీ ఒడిశాకు చెందిన ఓ విద్యార్థి.. అదెంత మాత్రం కాదనే అంటున్నాడు. ఎందరో ఆ అవకాశం కోసం కళ్లు కాయలు కాసేలా చదువుతుంటే.. చేతిదాకా వచ్చిన ఆ అవకాశాన్ని పక్కన పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. ఒడిశాకు చెందిన మహరూఫ్.. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో 32వ ర్యాంకర్. ఈ ర్యాంక్తో ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీటు సులభంగా దక్కుతుందని అతని పేరెంట్స్ ఆశపడ్డారు. అయితే.. మహరూఫ్ మాత్రం వద్దని వాళ్లతో చెప్పేశాడు. అందుకు కారణం.. అన్న మస్రూర్కు దూరం కావడమే!. మస్రూర్, మహరూఫ్ కవలలు. ఇద్దరూ ఈ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మస్రూర్ ఆల్ ఇండియాలో 169వ ర్యాంక్ పొందాడు. అయితే.. అన్నని వీడి ఉండలేని మస్రూర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఐటీ బాంబే సీటు కాదని.. తన అన్నతోపాటు మద్రాస్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. ‘‘నేను అన్నతో కలిసి చదవాలనుకుంటున్నాను” అని మహరూఫ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మస్రూర్ కూడా తన తమ్ముడి నిర్ణయాన్ని ఎంతో భావోద్వేగంగా స్వీకరించాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నామని, ఇప్పుడు కూడా కలిసి చదవడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. ఈ నిర్ణయం వారి కుటుంబానికి ఎంతో గర్వకారణంగా మారింది. అలాగే వారి విజయం వెనుక తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకం. తండ్రి డాక్టర్గా పనిచేస్తుండగా, తల్లి డాక్టర్ జీనత్ బెగం తన ఉద్యోగాన్ని వదిలి పిల్లలతో కలిసి కోటా(రాజస్థాన్, దేశంలో కోచింగ్ హబ్)కు వెళ్లి వారి చదువుకు పూర్తిగా అంకితమయ్యారు. కుటుంబం నుంచి వచ్చిన ఈ మద్దతే ఇద్దరి విజయానికి బలమైన పునాది అయింది.కోటాలో ఉన్న సమయంలో ఇద్దరూ అత్యంత క్రమశిక్షణతో చదివారు. రోజుకు సుమారు ఐదు గంటల కోచింగ్, గంటసేపు డౌట్స్ క్లియరింగ్, ఆపై గంటల తరబడి స్వీయ అధ్యయనం చేసేవారు. అదే సమయంలో పరస్పరం ఒకరికి ఒకరు క్లిష్టమైన అంశాలు వివరించడం, పరీక్షల తర్వాత కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వారి ప్రత్యేకతగా నిలిచింది.ఇప్పుడు ఈ ఇద్దరి కథ కేవలం ర్యాంకుల గురించి మాత్రమే కాదు, బంధాల విలువ గురించి కూడా చెబుతోంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీటును కూడా వదిలేసి కుటుంబం కోసం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థి జీవితంలో సక్సెస్ అంటే ఏమిటో కొత్తగా నిర్వచిస్తోంది. ర్యాంకులు, కాలేజీలు ఎంత గొప్పవైనా, బంధాలు వాటికన్నా గొప్పవని మహరూఫ్ తీసుకున్న నిర్ణయం నిరూపిస్తోంది. -
సోషల్ మీడియా పోస్టును అల్లర్లను ప్రేరేపించే నేరంగా చిత్రీకరిస్తారా?
ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే.. కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే కచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్ప నిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకు పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. – హైకోర్టుసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా.. ఆ పోస్టు దేనికి సంబంధించిందన్న దాంతో నిమిత్తం లేకుండా దానిని అల్లర్లను ప్రేరేపించే తీవ్రమైన నేరంగా పోలీసులు చిత్రీకరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ‘ఐపీసీ సెక్షన్ 153 లేదా 153ఏ కింద ఒక వ్యక్తిని దోషిగా తేల్చాలంటే, కేవలం అతను మాట్లాడిన మాటలు లేదా పెట్టిన పోస్టులు మాత్రమే సరిపోవు. సమాజంలో హింసను ప్రేరేపించాలనే లేదా ప్రజాశాంతికి భంగం కలిగించాలనే ఖచ్చితమైన నేరపూరిత ఉద్దేశం ఆ వ్యక్తికి ఉందని తప్పనిసరిగా నిరూపించాల్సి ఉంటుంది. అటువంటి ఉద్దేశం లేనప్పుడు ఆ సెక్షన్ కింద నేరం మోపడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కూడా చెప్పింది. అలాగే ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట వర్గానికి లేదా సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రేకెత్తించేలా ప్రత్యక్షంగా ఎలాంటి చర్యలకూ పాల్పడనప్పుడు, కేవలం అనుమానాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లను వారిపై మోపడం చట్టవిరుద్ధం. ఒక సమూహంలో ఉన్నంత మాత్రాన లేదా ఒక నిర్దిష్ట గ్రూపుతో సంబంధం ఉన్నంత మాత్రాన, ఆ గ్రూపు చేసే ప్రతి తప్పును వ్యక్తిగతంగా ఒకరికి ఆపాదించలేం. నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేనప్పుడు, కేవలం సదరు వ్యక్తులతో పరిచయం ఉందనే నెపంతో ఎవరినీ దోషిగా నిలబెట్టలేం’, అని హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు, మాగల్లు గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులపై ఐపీసీ సెక్షన్ 153 కింద నమోదు చేసిన కేసును కొట్టేసింది. అయితే ఇదే కేసులో ఐపీసీ సెక్షన్ 120బీ, 505 (2), ఐటీ చట్టం సెక్షన్ 66 కింద జరిగే విచారణలో (ప్రొసీడింగ్స్) జోక్యానికి మాత్రం నిరాకరించింది. ఈ మేరకు ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. -
7 సార్లు TEDX స్పీకర్ ఈ ‘ఆటో అన్న’ నెట్టింట సందడి
సాధారణంగా మనం ఆటోలో ప్రయాణిస్తున్నపుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం. అసలు కంటే ఎక్కువ చార్జ్ వసూలు చేయకుండా, ర్యాష్గా డ్రైవ్ చేయకుండా, మనల్ని ప్రశాంతంగా గమ్యాన్ని చేర్చితే చాలు అనుకుంటాం, కదా. కానీ చెన్నైలో ఒక మహిళ షేర్-ఆటో డ్రైవర్తో తనకు ఎదురైన అనుభవం సోషల్ మీడియాలో వైరల్ కథగా మారింది. తన ప్రయాణీకుల సేవ పట్ల చూపిన విలక్షణమైన విధానం మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది. పదండి మరి ఆ సంగతులేంటో తెలుసుకుందాం.షోలింగనల్లూర్లో తనకు ఎదురైన ఒక ఊహించని ప్రయాణం గురించి వివరిస్తూ, @the_dharani_theory అనే ఇన్స్టాలో ఒక స్టోరీని పోస్ట్ చేశారు. దీని ప్రకారం ప్రీమియం సౌకర్యాలున్న ఈ ఆటోలో అంతకుముందెన్నడూ లేని గొప్ప అనుభవం ఎదురైంది.షోలింగనల్లూరులో ఆటో ఎక్కిన వెంటనే ఎడమ వైపున ఫ్రంట్లైన్, ఫెమినా, అవుట్లుక్ నుండి UPSC ప్రిపరేషన్ మ్యాగజైన్ల వరకు అన్నీ అప్డేటెడ్ వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఉండటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇంతేనా.. చక్కగా పనిచేస్తున్న రెండు ఐప్యాడ్లు, ప్రయాణీకులందరికీ ఉచితంగా చాక్లెట్ బాక్సులు, గొడుగులు, ఒక మినీ కూలర్, కాఫీతో కూడిన ఫ్లాస్క్ ఉన్నాయి. ఆగండాగండి.. ఇంకా ఉన్నాయి. ఉచిత వైఫై , నర్సులు, పారిశుధ్య కార్మికులు, ఉపాధ్యాయులు , వైద్యులకు ఆటో రైడ్ ఉచితం అన్న వాక్యాలు కూడా కనిపించాయి. అతని ప్లేలిస్ట్లో షకీరా పాడిన "వెనెవర్, వెరెవర్" నుండి మురుగర్ భక్తి పాటల వరకు ఉండటం విశేషం.ఈ పోస్ట్ ఆటోలోని సౌకర్యాలను మాత్రమే కాదు ఈ ఆటో అన్న మనసారా పకలరిస్తాడు, నవ్వుతాడు , తన ప్రయాణికులను తీసుకువెళ్తున్నప్పుడు ముద్దుగా చిన్న చిన్న డ్యాన్సులు చేస్తాడు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 7 భాషలు మాట్లాడతాడు. ఈఆటో డ్రైవర్ అన్న ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం ప్రయాణీకులపై చెరగని ముద్ర వేస్తుందనడంలో అతిశయోక్తి లేదు.ఇంకో ఆశ్చర్యకరమైన విషయంఆ మహిళ వాహనం దిగడానికి కొద్ది క్షణాల ముందు కథ మరో ఊహించని మలుపు తీసుకుంది.మరో ప్రయాణికురాలు,కార్పొరేట్ ఉద్యోగి ఆ డ్రైవర్ను గుర్తుపట్టి, అతను వృత్తి, విద్యా రంగాలలో ఆరితేరినవాడనే విషయాన్ని ఈమెకు వివరించింది. రెండేళ్ల క్రితం తన కళాశాలకు అతన్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారట. ఏడుసార్లు TEDX స్పీకర్. గూగుల్ , మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలలో ఉపన్యాసాలు ఇస్తాడు. View this post on Instagram A post shared by Dharani's Photoblog (@the_dharani_theory)మరోవైపు ఈమె టీచర్ కావడంతో ముందుగానే తాను ప్రకటించినట్టు, ఎంత బలిమాలినా కూడా ఆమె దగ్గర్నుండి ఒక్కపైసా కూడా చార్జ్ తీసుకోలేదు. ఆటోలో సౌకర్యాలు, అతను సాధించిన విజయాలు ప్రత్యేకంగా అనిపించినప్పటికీ, పని, జీవితం పట్ల డ్రైవర్కు ఉన్న దృక్పథమే ఆ ప్రయాణం నుండి తాను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠమని పేర్కొన్నారు. అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు. "ఆ రోజు ఆయన నాకు ఒక విషయం అర్థమయ్యేలా చేశారు. మనమందరం మన ఉద్యోగాల గురించి ఫిర్యాదు చేస్తుంటాం, కానీ 'అన్న' నాకు ఒక విషయం నేర్పించారు. అదేంటంటే, మనం చేసే ఏ పనినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, మన చెడ్డ రోజుల్లో కూడా నూటికి నూరు శాతం కృషి చేస్తే, నిజాయితీగా పనిచేస్తే అందులో ఎలా విజయం సాధించవచ్చో. గుర్తుండిపోయే ఈ ప్రయాణానికి ధన్యవాదాలు @auto_anna."'ఆటో అన్న'కు నెట్టింట ప్రశంసలుఈ పోస్ట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. "ఆటో అన్న"గా పాపులర్ అయిన అన్నాదురైపై ప్రశంసలు వెల్లువెత్తాయి. తాము కూడా ఈ ఆటోలో ప్రయాణించామంటూ మరికొంతమంది తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మొత్తానికి అందరూ చేసే వృత్తిని, గౌరవించడం, మనస్ఫూర్తిగా సేవలందించడం ముఖ్యమని పేర్కొన్నారు. -
ఢిల్లీ మృత్యుకేళి: ప్రాణాల కోసం పై నుంచి దూకారు..!
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. హౌజ్రాణి ఏరియాలోని ఓ హోటల్లో భారీగా మంటలు చెలరేగడంతో 21 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు కాగా.. 40 మందికిపైగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. ప్రమాద సమయంలో హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింటకు చేరాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో లోపల చిక్కుకున్న అతిథులు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు భవనం పైఅంతస్తుల నుంచి కిందకు దూకిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ వీడియోలో ఓ విదేశీయుడు, ఓ మహిళ ఉన్నారు. వాళ్ల పరిస్థితి ఏంటన్నది తెలియరావడం లేదు. మరికొందరు కూడా ప్రాణాలు అరచేత పట్టుకుని భవనం నుంచి బయటపడే ప్రయత్నాలు చేశారు. వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉన్నారు. కింద నిల్చున్న స్థానికులు తమ ఫోన్లలో ఆ దృశ్యాలు బంధించారు.VIDEO | Death toll in fire in restaurant in south Delhi's Malviya Nagar goes up to 21, many of those killed are foreigners: officials. Latest visuals from incident spot.#DelhiNews #MalviyaNagarHotelFire(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8QS1kYrx4v— Press Trust of India (@PTI_News) June 3, 2026ఉదయం సుమారు 9 గంటల సమయంలో అగ్నిప్రమాద సమాచారం అందడంతో ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పది కంటే ఎక్కువ ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక రక్షణ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పొగతో నిండిపోయిన భవనంలోకి ప్రవేశించి చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.Delhi hotel fire: woman seen jumping off building#MalviyaNagar #DelhiFire pic.twitter.com/4LoMU1ypqF— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026నిబంధనలకు విరుద్ధంగా..!ఈ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ 'బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్' పథకం కింద కేవలం ఆరు గదులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతి పొందిన లెమన్ గ్రీన్ హోటల్.. నిబంధనలకు విరుద్ధంగా 25 గదులు నడుపుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. బేస్మెంట్లో కూడా గదులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో భవన భద్రతా ప్రమాణాలు, అనుమతుల ఉల్లంఘనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.Delhi Hotel Fire: Death Toll Rises to 21 in Malviya Nagar Tragedy#MalviyaNagar #DelhiFire pic.twitter.com/3lEpgIKWBM— Anil Thakur (अनिल ठाकुर) (@Anil_NDTV) June 3, 2026#दिल्ली: मालवीय नगर के होटल में लगी आग पूरी इमारत में फैली, दर्दनाक हादसे में 10 लोगों की जलकर मौत #Malviyanagar #Delhifire #Breaking pic.twitter.com/zymTBTdWQt— Journalist Ravendra kumar (@Chhotukingoffi1) June 3, 2026అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హోటల్ యాజమాన్యం అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించిందా? అనుమతులకు మించి కార్యకలాపాలు నిర్వహించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఇదీ చదవండి: ఢిల్లీ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ -
వైరల్ వీడియో.. సుప్రీం కోర్టులో బిగ్ హైడ్రామా
ఒక వైరల్ వీడియో దేశం మొత్తాన్ని ‘‘అయ్యో పాపం పెద్దాయన..’’ అనుకునేలా చేసింది. అటు ఇటు తిరిగి.. అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం కదిలించింది. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అయితే.. ఈ హైడ్రామాలో చివరి క్షణంలో ‘ట్విస్ట్’ చోటు చేసుకోవడంతో విచారణను విరమించుకోవాల్సి వచ్చింది.బిహార్లోని వైశాలి జిల్లాకు చెందిన ఓ కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడినట్లు వచ్చిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నడవడానికే కష్టపడుతున్న ఆ వృద్ధుడు కర్ర సాయంతో కోర్టు ఆవరణ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు.. ఇద్దరు వ్యక్తుల సాయంతో పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందన వ్యక్తమవుతుండగా.. సుప్రీంకోర్టు కూడా అప్రమత్తమైంది.बिहार में 33 साल पुराने केस में 84 साल के बुजुर्ग को भेजा गया जेल, दो लोगों ने सहारा देकर पहुंचाया सलाखों तक। pic.twitter.com/HSlPTwqKAZ— छपरा जिला 🇮🇳 (@ChapraZila) June 1, 2026మంగళవారం మధ్యాహ్నం సుమారు 2.40 గంటల సమయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఆదేశాలతో కోర్టు నం.1 (ప్రధాన న్యాయమూర్తి కోర్టు)ను తక్షణం తెరవాలని సూచించారు. సుమోటో విచారణ చేపట్టే అవకాశముందని భావించి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అయితే సాయంత్రం 4 గంటల సమయానికి పరిస్థితి మారింది.బిహార్ హైకోర్టు నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. వృద్ధుడికి అప్పీల్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. ఈ వివరాలు తెలిసిన వెంటనే సుప్రీంకోర్టు సుమోటో చర్యను నిలిపివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుపై తక్షణ చర్యకు ఆసక్తి చూపినట్లు సమాచారం. అదే సమయంలో ఆయన కొలీజియం సమావేశాల్లో ఉన్నప్పటికీ.. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రీకి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ వివాదానికి కారణమైన కేసు 1992 నాటి హత్యాయత్నం ఘటనకు సంబంధించినది. అప్పట్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మిది మందిపై కాల్పుల ఆరోపణలు నమోదయ్యాయి. దీర్ఘకాల విచారణ అనంతరం వారిలో నలుగురు మరణించగా, మిగిలిన ఐదుగురిపై తీర్పు వెలువడింది. ఇందులో 85 ఏళ్ల దీప్ రాయ్కు మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. మిగిలిన నలుగురికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడింది. వైరల్ వీడియో ప్రభావంతో సుప్రీంకోర్టు వరకు చేరిన ఈ ఘటన చివరి క్షణంలో భిన్న మలుపు తిరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
‘క్వాంటమ్’ పేర.. లాభాల ఎర
హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన 74 ఏళ్ల రిటైర్డ్ మహిళా వైద్యురాలు సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్టు కనిపించిన నకిలీ వీడియోను చూసి మోసపోయారు. ఆ వీడియోలో చూపిన ట్రేడింగ్ ప్లాట్ఫారమ్పై నమ్మకం పెంచుకున్న ఆమె.. జూలై నుంచి డిసెంబర్ 2025 మధ్య 11 విడతల్లో రూ.68.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. డబ్బు ఉపసంహరించుకునే సమయంలో మోసం జరిగినట్టు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.సాక్షి, హైదరాబాద్: సులువుగా డబ్బు సంపాదించాలన్న కొందరి అత్యాశను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ‘క్వాంటమ్ ఏఐ’లో పెట్టుబడులు పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్వయంగా ఈ ప్రకటన ఇస్తున్నట్టుగా డీప్ఫేక్ వీడియోను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. కేవలం నిర్మలాసీతారామన్వే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధామూర్తి ఇతర ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి ఇలాంటి ఫేక్ వీడియోలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇవన్నీ పూర్తిగా నకిలీవేనని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది. క్వాంటమ్ ఏఐ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న పెట్టుబడి మోసాలపై నిర్మలాసీతారామన్ బహిరంగంగా హెచ్చరించారు. తనకు సంబంధించిన పలు డీప్ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలా మోసం చేస్తున్నారు? సైబర్ నేరగాళ్లు ముందుగా ప్రముఖుల పేర్లతో నకిలీ వార్తా కథనాలు, డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ప్రముఖులు స్వయంగా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందినట్టు చూపిస్తున్నారు. ఆ ప్రకటనల్లో ‘రూ.22 వేల పెట్టుబడితో నెలకు రూ.3 లక్షల ఆదాయం’, ‘రూ.22 వేల పెట్టుబడికి రూ.40 లక్షల రాబడి’, ‘ప్రభుత్వ హామీతో క్వాంటమ్ ఏఐ’వంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల్లో వచ్చే ఆ ప్రకటనల్లో మీరూ ఈ లాభాలు పొందాలంటే ప్రకటనల్లోని లింక్లపై క్లిక్ చేయండి అని సూచిస్తున్నారు. తర్వాత ఇప్పుడే నమోదు చేసుకోండి అనే లింక్పై క్లిక్ చేయిస్తారు. బాధితుడు మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన వెంటనే కాల్ సెంటర్ తరహాలో మోసగాళ్లు సంప్రదించి కనీసం రూ.17 వేల నుంచి రూ.22 వేల వరకు పెట్టుబడి పెట్టమని ఒత్తిడి తెస్తారు. ఇలా ఒకసారి వారి వలకు చిక్కిన తర్వాత మొదట్లో కొద్దిమేర లాభాలు వచ్చినట్టుగా చూపి..ఆ తర్వాత క్రమంగా పలు రకాల ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీలు అంటూ అవకాశం ఉన్నంత మేర వారి ఖాతాల్లోకి నగదు వేయించుకుంటున్నారు. ఆ వీడియోలు చూసి మోసపోవొద్దు సైబర్ నేరగాళ్లు మొదట ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్లలో ఉన్న ప్రముఖుల వీడియోలను తీసుకొని వాటిని డీప్ఫేక్ టెక్నాలజీతో మార్పులు చేస్తున్నారు. క్వాంటమ్ ఏఐకి సంబంధించి వారు మాట్లాడుతున్నట్టుగా డీప్ఫేక్ వీడియోలు రూపొందించి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత బాధితుల వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులకు ఈ లింక్లను పంపుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనల విషయంలో నమ్మొద్దని, ఆ తరహా వీడియో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి – తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలను నమ్మొద్దు. – ప్రముఖుల పేర్లు, ఫొటోలు ఉన్నాయనే కారణంతో పెట్టుబడి పెట్టొద్దు. – పెట్టుబడి సంస్థ సెబీ వద్ద నమోదు అయిందో లేదో పరిశీలించాలి. – అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా ఉండాలి. – మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం పలుమార్లు ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర మంత్రులు, రిజర్వ్ బ్యాంక్ అధికారులు లేదా ప్రముఖ వ్యాపారవేత్తలు పెట్టుబడి సలహాలు ఇస్తున్నట్టు కనిపించే వీడియోలు, ప్రకటనలను నమ్మొద్దని హెచ్చరించింది. డీప్ఫేక్ సాంకేతికతతో వీడియోలు తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొంది. -
ఈ బేబీ ఎంజాయ్మెంట్ చూసి పెద్దలూ అసూయపడుతున్నారు!
ఒక వ్యక్తి తన చిన్నారి కుమార్తెను ఛాతీకి కట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో తండ్రి అక్షయ్ పాలీవాల్, 2001లో వచ్చిన దిల్ చాహ్తా హై సినిమాలోని వో లడ్కీ హై కహాన్ పాటకు స్టెప్పులు వేశాడు. బేబీ క్యారియర్లో ఉన్న చిన్నారి నవ్వుతూ, ఊగుతూ కనిపించింది.తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లిటిల్_మంచ్కిన్28లో ఈ వీడియోను పంచుకున్నాడు. కొద్ది సమయంలోనే ఇది వేగంగా వైరల్ అయి 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వీడియో తమ ముఖంపై చిరునవ్వు తెప్పించిందని చెబుతూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తారు. ఇటీవల చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపిన మధురమైన క్షణాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్న ధోరణిలో పెరుగుతోంది.యూజర్ల స్పందన"అయ్యో... బిడ్డ ఎంత ముద్దుగా ఉంది. అందరిలోకెల్లా క్యూటెస్ట్" అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు."వెనుక వినిపిస్తున్న సంగీతం చాలా చాలా క్యూట్గా ఉంది," అని మరో నెటిజన్ అన్నాడు."బిడ్డ చాలా సంతోషంగా ఉంది. పూర్తిగా ఆస్వాదిస్తోంది. చాలా బాగా చేశారు" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు."నాన్న డ్యాన్స్కు బేబీ ఫుల్ సపోర్ట్.. వైరల్కు ఇదే సీక్రెట్!" అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. "స్టెప్పులు నాన్నవి.. షో మొత్తం బేబీదే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు."బేబీ నవ్వితే చాలు.. 25 మిలియన్ల వ్యూస్ వచ్చేశాయి" అని మరో వ్యక్తి పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Adrija Paliwal (@little_munchkin28) -
డ్రెస్ చూసి ‘క్యారెక్టర్లెస్’ అంటారా?
మోరల్ పోలీసింగ్ అంశం దేశంలో తరచూ చర్చకు వస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళల వేసుకునే దుస్తులు, వ్యక్తిగత ఎంపికలు, ప్రవర్తనపై అనవసర వ్యాఖ్యలు, బహిరంగ విమర్శలు వంటి ఘటనలు తరచూ పెద్ద డిబేట్కు దారి తీస్తున్నాయి. “వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ ముగుస్తుంది?.. సమాజం పేరు మీద నియంత్రణ ఎక్కడ మొదలవుతుంది?” అనే ప్రశ్నలు ప్రతి సారి మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఓ విద్యార్థిని, ఓ మహిళ మధ్య దుస్తులపై జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అస్సాంలో ఓ చిన్న వీడియో ఇప్పుడు పెద్ద సామాజిక చర్చకు దారి తీసింది. పనికోసం బయటకు వెళ్లిన ఓ విద్యార్థినిపై ఓ పెద్దావిడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నీ బట్టలే నీ క్యారెక్టర్ ఏంటో చెబుతాయి” అంటూ జరిగిన ఆ వాగ్వాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. “మోరల్ పోలీసింగ్” మళ్లీ హాట్ టాపిక్గా మారిందితేజ్పూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని అనుష్క శర్మ తన ప్రాక్టికల్ పరీక్ష కోసం అవసరమైన మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు స్కూటర్పై బయటకు వెళ్లింది. అదే సమయంలో రోడ్డుపై ఓ వృద్ధ మహిళ ఆమె దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే సమాజం చెడిపోతుంది. ఏం చేద్దామని ఇలాంటి బట్టలు వేసుకుని బయటకు వచ్చావ్” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని వేడెక్కించాయి. అంతేకాదు, “క్యారెక్టర్లెస్” వంటి పదాలు ఉపయోగించడంతో వాగ్వాదం మరింత తీవ్రమైంది.రికార్డింగ్తో బయటపడ్డ వివాదంఈ ఘటనను అనుష్క స్వయంగా తన మొబైల్లో రికార్డ్ చేసింది. వీడియోలో ఆమె తన దుస్తులపై ఎందుకు ఇంత విమర్శ వస్తోందని ప్రశ్నించినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో వృద్ధ మహిళ కూడా ఆమెను చిత్రీకరిస్తూ తన అభిప్రాయాన్ని కొనసాగించింది. వీడియోలో అనుష్క నలుపు రంగు ట్యాంక్ టాప్, ట్రౌజర్స్ ధరించి కనిపించింది. దుస్తులపై విమర్శలు పెరుగుతుండగా, ఆమె ధైర్యంగా ఎదుర్కొని మాట్లాడటం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందుతోంది.హాట్ డిబేట్వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. చాలామంది యువతులు, మహిళా హక్కుల సంఘాలు అనుష్కకు మద్దతు తెలుపుతూ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు వేస్తున్నాయి. “ఎవరికి ఏం వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికుంది?” అనే కామెంట్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొందరు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటన “మోరల్ పోలీసింగ్ vs వ్యక్తిగత స్వేచ్ఛ” అనే పెద్ద చర్చగా మారింది.A viral video from Tezpur has triggered a huge debate online. A student was allegedly shamed publicly over her clothes, but she chose to speak up instead of staying silent.#Assam #Tezpur #ViralVideo #WomenRights pic.twitter.com/wNq8TDmVbz— Kaushiki Dey (@De7845Dey) June 2, 2026 -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ కీలక ప్రకటన
ఢిల్లీ: సోషల్ మీడియాలో సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు (సీజేపీ) అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు. ఇటీవల విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న పలు వైఫల్యాల్ని ఎత్తి చూపిస్తూ జూన్ 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతి చేపట్టే నిరసనలో పాల్గొనేందుకు అందరూ కలిసి కట్టుగా రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల విదేశాల్లో ఉన్న సీజేపీ వ్యవస్థాపకుడు జూన్ 6న ఢిల్లీకి చేరుకోనున్నారు. ‘విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసేందుకు భారత్కు తిరిగి వస్తున్నాను. జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుండి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలని భారత యువతను నేను కోరుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.అయితే, అభిజీత్ దీప్కే పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ విద్యా వ్యవస్థలో పదేపదే తలెత్తుతున్న సమస్యలతో విసిగిపోయిన ప్రజలు, దీప్కే తిరిగి వచ్చి ముందుండి నడిపించాలనే నిర్ణయం సాహోసోపేతమని కొనియాడుతున్నారు. Important announcement:CJP Founder @abhijeet_dipke will return to India on June 6 for a peaceful protest at Jantar Mantar, Delhi, demanding the resignation of the Education Minister. pic.twitter.com/x9M1v38Pwu— Cockroach is Back (@Cockroachisback) June 1, 2026 -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
అధికార మదమా?.. పవన్ తీరుపై వైరల్ వీడియో
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతా«ధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకైనా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామర్.. చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..!
ఇట్స్ మై డ్రీమ్ అంటోన్న అనన్య నాగళ్ల..చిన్నపిల్లలా యషిక ఆనంద్ పోజులు..కాశీలో బిగ్బాస్ బ్యూటీ అశ్వినీ శ్రీ పూజలు..మంచుకొండల్లో హీరోయిన్ శ్రీలీల చిల్.. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ పోజులు.. View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Archana Ravichandran (@iam_archanaravichandran) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
బలగం నటి.. ఇంత గ్లామరస్గా మారిపోయిందేంటి?
ఎంతోమంది నటీనటులను వెండితెరకు పరిచయం చేసిన మూవీ బలగం. తెలంగాణ పల్లె సెంటిమెంట్తో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. వేణు యెల్దండి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ పల్లెటూరి సంప్రదాయాలను, రక్త సంబంధాలను ఒక్కసారిగా మళ్లీ గుర్తుకు తెచ్చింది. అచ్చ తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ద్వారా పలువురు నటీనటులు ఫేమస్ అయ్యారు.అలా ఈ మూవీ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నవారిలో రూపాలక్ష్మి ఒకరు. ఈ మూవీలో కొమురయ్య కూతురు లచ్చవ్వగా నటించిన రూపలక్ష్మికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఆమెను అందరూ తమ ఇంటి ఆడపిల్లగా అక్కున చేర్చుకున్నారు. హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్కు తల్లి పాత్రలో రూప లక్ష్మి తనదైన నటనతో మెప్పించారు. యితే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యకల్యాణ్ రామ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. బలగం తర్వాత రూపలక్ష్మి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో బిజీగా మారిపోయింది.తాజాగా రూపాలక్ష్మి ఇన్స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె మరింత గ్లామరస్గా కనిపించింది. అసలు బలగం నటి రూపానేనా అన్నంతలా మారిపోయింది. కారు నడుపుకుంటూ వెళ్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యూ జర్నీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.కాగా.. బలగం చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్రామ్లతో పాటు సుధాకర్ రెడ్డి, నర్సింహ, రూప లక్ష్మి, మురళీధర్లకు చాలా మంచి గుర్తింపు దక్కింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలంగాణ నేపథ్యంలో సినిమా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. View this post on Instagram A post shared by Rupa Lakshmi Vaishnava Sri (@rupalakshmi23) -
‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆట ముగిసింది. లీగ్ దశలో చాలా కష్టపడి ప్లేఆఫ్స్ చేరిన రాజస్తాన్ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజన్ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు పరిమితమైనప్పటికీ.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. గత సీజన్లోనే తన మెరుపులను చూపెట్టిన వైభవ్ ఈ సీజన్లో దానిని పరిపూర్ణం చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్లో అతడు కొనసాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్ల్లో మెరిసి ఆ తర్వాత విఫలమయ్యుంటే వైభవ్ గురించి చర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వయసులోనే క్రికెట్లో ఉన్న అన్ని షాట్లను అలవోకగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. 16 మ్యాచ్ల్లో 237కు పైగా స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలున్నాయి. క్రీజులోకి అడుగుపెట్టిందే మొదలు ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడమే కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం అలవాటు చేసుకోవడం వైభవ్ సూర్యవంశీలో కనిపించిన గొప్ప పరిణితి. ఉదాహరణకు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కమిన్స్ మొదలుకొని ఏ బౌలర్ను వదలని సూర్యవంశీ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే ప్రపంచ రికార్డు తన ముంగిట ఉండేదేమో. ఇక గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో పడిందన్న విషయాన్ని గుర్తించిన వైభవ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసినప్పటికీ మెరుపులకు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ శతకం చేజార్చుకున్న వైభవ్ ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాది ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇలా సీజన్ ఆద్యంతం తన ఆటతీరుతో అలరించిన వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టులతో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజన్లో ఒక జట్టును తన భుజస్కందాలపై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది వైభవ్’ అని ఒక అభిమాని వైభవ్కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్గా నిలిచింది.THE COLDEST EDIT ON VAIBHAV SOORYAVANSHI. 🥶 pic.twitter.com/LgDqruGc4A— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2026this IPL will be remembered for a 15 year old carrying an entire team on his shouldersTrophies come and go, but the impact you left will always stay🙏 pic.twitter.com/oPOW5ABYx2— OldMonkOfCricket (@OldMonkOfCric) May 30, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
ప్రియురాలి భర్త సడన్ ఎంట్రీ! పదో అంతస్తు నుంచి పట్టుతప్పి..
వివాహేతర సంబంధాలు అనైతిక బంధాలుగా సమాజంలో తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కొన్నిసార్లు నమ్మకాన్ని, కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సంబంధాల్లో చిక్కుకున్న కొంతమంది వ్యక్తులు నిజాన్ని దాచేందుకు మోసం, తప్పించుకోవడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో భయంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక ఫిట్నెస్ ట్రైనర్–ఓ మహిళ మధ్య అల్లుకున్న ప్రేమ (అనైతిక) బంధం అనూహ్యంగా ముగిసింది. ఆ మహిళ భర్త అనుకోకుండా పనినుంచి ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. నమ్మకం అనే గోడలు కూలిపోతున్న ఆ క్షణంలో.. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. భయంతో అతను భవనం వెలుపల బాల్కనీ అంచున వేలాడుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ఉద్వేగభరిత క్షణాల ఒత్తిడిని తట్టుకోలేక చివరికి అదుపు తప్పి కిందకు జారిపోయి తన ప్రాణాలను కోల్పోయాడు. ప్రేమ పేరుతో మొదలైన ఆ కథ, చివరికి నిశ్శబ్ద విషాదంగా ముగిసింది.. సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా ఓ వీడియో భారీగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి భవనం కిటికీ బయట వేలాడుతూ కనిపించడం, కొద్దిసేపటి తర్వాత కిందపడిపోవడం, ఆ సమయంలో రికార్డింగ్ చేస్తున్న కొందరు హాహాకారాలు చేయడం అందులో కనిపిస్తోంది. అతని పేరు "హువాంగ్ మావో". అతనొక చైనా జిమ్ ట్రైనర్. తన క్లయింట్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, భర్త అకస్మాత్తుగా ఇంటికి రావడంతో కిటికీ మార్గంలో తప్పించుకునే ప్రయత్నంలో 10 అంతస్తుల ఎత్తు నుంచి జారిపడి మృతి చెందాడని.. ఆ వైరల్ పోస్టుల సారాంశం. A forbidden love affair between a fitness trainer and a woman ended in tragedy. When the woman's husband returned home early from work, Huang Mao, who was hanging from a balcony outside the building, fell to his death. pic.twitter.com/Q4xjNfRD9J— MOSCOW NEWS 🇷🇺 (@MOSCOW_EN) May 28, 2026Fitness coach Huang Mao has an affair, the male homeowner returns,crouching on the window ledge he accidentally falls off the building, dying on the spot. pic.twitter.com/FiB0O3GUXv— Josh Blaq (@Josh_korn1) May 28, 2026 ప్రస్తుతం ఎక్స్, టిక్టాక్ తదితర వేదికల్లో వైరల్ అవుతూ ఈ స్టోరీ తీవ్ర చర్చకు దారి తీసింది. కొందరు దానిని ఏఐ వీడియో అంటే.. మరొకొందరు తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేశారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అత్యుత్సాహంతో ముందు వెనకా చూడకుండా ఆ ప్రచారాన్ని యధాతథంగా వార్తగా ఇచ్చేస్తున్నాయి. అయితే.. సాక్షి.కామ్ ఫ్యాక్ట్ చెక్ కోసం ప్రయత్నించి అసలు విషయం రాబట్టగలింది. ఆ వీడియో మీద ప్రచారం అవుతున్న విషయంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. కిటీకి పట్టుకుని వేలాడి కింద పడిపోయిన ఆ ఘటన.. 2023 ఏప్రిల్లో చైనాలోని చెంగ్డూలో జరిగిన ఘటనది. వ్యక్తి మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యల కారణంగా భవనం కిటికీ నుంచి వేలాడిన ఆ వ్యక్తి.. ఆత్మహత్య చేసుకునే క్రమంలోనే కింద పడిపోయాడు. పైగా అతడు జిమ్ ట్రైనర్ అని, అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ ఘటన జరిగిందని నిర్ధారించే విశ్వసనీయ ఆధారాలు ఎక్కడా లభించలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వైరల్ పోస్టుల్లో పేర్కొంటున్న "హువాంగ్ మావో" అనేది ఆ వ్యక్తి అసలు పేరు కూడా కాదు. చైనా భాషలో "హువాంగ్ మావో" అంటే "పసుపు రంగు జుట్టు ఉన్న వ్యక్తి" అనే అర్థం. ఒకప్పుడు అలా జుట్టుకు రంగులు వేసే వ్యక్తుల కోసం ముద్దు పేరుగా సోషల్ మీడియాలో ఆ పదం వాడారు. ఇప్పుడు ఆ పేరునే వైరల్ వీడియోలో వాడేసి కట్టుకథ అల్లారు. సో.. వీడియో పాతదైనా, దానికి కొత్త కథను జోడించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని పరిశీలనలో తేలింది. జిమ్ ట్రైనర్, అక్రమ సంబంధం, భర్త నుంచి తప్పించుకునే ప్రయత్నం వంటి అంశాలకు ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. -
లగ్జరీ బైక్పై బెంగాల్ బీజేపీ మంత్రి రైడ్, వీడియో వైరల్
సాక్షి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి దిలీప్ ఘోష్ బైక్ రైడ్ చేసి ఆకట్టుకున్నారు. కోల్కత్తా వీధుల్లో ఖరీదైన హోండా గోల్డ్ వింగ్ను రాయల్గా చక్కర్లు కొట్టారు. ఈ రైడ్కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా కామెంట్ చేశారు. మరికొంతమంది మంత్రి బైక్ నడపడం చూసి ఆశ్చర్య పోయారు. హెల్మెట్ లేకుండా బైక్ ఎలా నడుపుతున్నారని కొంతమంది విమర్శిస్తే.. ఇంత ఆదాయం ఎక్కడిది అంటూ @IncomeTaxIndia ట్యాగ్ చేయడం విశేషం ఈ బైక్ ధర మార్కెట్లో దాదాపు రూ.53 లక్షల వరకు ఉంటుందని అంచనా.దీనికి సంబంధించిన వివరాలను కూడా మంత్రి దిలీప్ ఎక్స్లో షేర్ చేశారు, Honda BigWing సూపర్ బైక్ అత్యంత వేగవంతమైన, 1800cc సామర్థ్యం గల 6-సిలిండర్ల మోటార్సైకిల్. ఈ బైక్ ఎంతో సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అద్భుతమైన వేగాన్ని అందిస్తుంది. దీని వెనుక భాగంలో విశాలమైన స్థలం ఉంది; అక్కడ సోఫాలాంటి ప్రయాణీకుల సీటు ఉండటం వల్ల, వెనుక కూర్చునే వ్యక్తి కూడా అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అంటూదీని ఫీచర్స్ గురించి రాసుకొచ్చారు.#WATCH | West Bengal Minister Dilip Ghosh seen riding a bike, in Kolkata this morning. pic.twitter.com/OKBr643M33— ANI (@ANI) May 29, 2026 1.1 Today, I rode a Honda BigWing superbike. It is a high-speed 1800cc, 6-cylinder motorcycle.The bike is extremely comfortable & offers incredible speed.There is ample space at the back with a sofa-like passenger seat,ensuring that the pillion rider can also sit very comfortably pic.twitter.com/al8jWEKVkF— Dilip Ghosh (Modi Ka Parivar) (@DilipGhoshBJP) May 29, 2026 -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ అకౌంట్ బ్లాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీ: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అకౌంట్ను బ్లాక్ చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో బ్లాక్ చేయడంపై 'X' (ట్విట్టర్)కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్లాకింగ్ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాలని ఐటీ శాఖ 'రివ్యూ కమిటీ'కి హైకోర్టు ఆదేశించింది.అయితే, అంతకుముందు.. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తమ పార్టీ ఖాతాలను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ స్థాపకుడు అభిజిత్ దీప్కే (Abhijit Deepke) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జాతీయ భద్రత పేరిట వ్యంగ్య (Satirical) అకౌంట్ను బ్లాక్ చేయడంపై అభిజీత్ విమర్శలు గుప్పించారు. స్వేచ్ఛగా రాజకీయ అభిప్రాయాలను పంచుకునే హక్కును కాలరాస్తూ తమ అకౌంట్లను నిలిపివేశారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.అయితే, ఈ వివాదానికి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి పిటిషనర్కు కీలక సూచన చేశారు. సమాచార సాంకేతిక (IT) చట్టం ప్రకారం దేశంలో ఇలాంటి డిజిటల్ నిలిపివేతలపై అభ్యంతరాలను పరిశీలించడానికి ఓ స్పెషల్ రివ్యూ కమిటీ ఉందని గుర్తుచేసింది. నేరుగా కోర్టు ద్వారా కాకుండా, ఐటీ చట్టం పరిధిలోని ఆ రివ్యూ కమిటీ ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. #DelhiHighCourt on Friday issued notice on a plea by #AbhijitDipke-founder of '#CockroachJanataParty' challenging the blocking of the party's X account, while directing Review Committee of Ministry of Electronics and Information Technology to examine the Dipke's case granting him… pic.twitter.com/JflYEepD4x— Kashmir Crown (@kashmircrownews) May 29, 2026 -
పవన్పై కోపం చల్లారట్లేదా?
టాలీవుడ్ సీనియర్ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల రాజమండ్రిలో చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ రాజకీయాల్లో సినిమా హీరోల ప్రభావాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో.. ఆ చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత సినీ–రాజకీయ విమర్శలుగా మొదలైన రియాక్షన్లు ఇప్పుడు సెటైర్ వార్ను దాటి మరింత భావోద్వేగ దశకు చేరుకున్నాయి.మొదట సోషల్ మీడియాలో ఆగ్రహంగా మొదలైన ప్రతిస్పందనలు ఇప్పుడు క్రమంగా విభిన్న రూపాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సెటైర్లతో బదులిచ్చిన నెటిజన్లు, ఇప్పుడు తమ అభిమాన హీరో వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం, సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ మరింత గట్టిగా స్పందిస్తున్నారు.పవన్ ప్రసంగంలో “కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుని ఈజీగా గెలిచేసి సీఎంలు అయ్యారు” అనే వ్యాఖ్యలు వైరల్గా మారడంతో, కొందరు అభిమానులు దాన్ని తమ హీరోలపై వ్యాఖ్యలుగా భావించారు. దీంతో తమిళనాడు సోషల్ మీడియా వేదికలపై “పవన్ సార్… మా దళపతి మీలా కాదు” అనే వాక్యం విస్తృతంగా ట్రెండ్ అవుతోంది. ఇది నేరుగా విజయ్ అభిమానుల భావోద్వేగ కౌంటర్గా మారింది.విజయ్ అభిమానులు ఈ కౌంటర్ ద్వారా ఆయన 25 ఏళ్ల సినీ ప్రస్థానం మాత్రమే కాదు, ప్రజలతో ఏర్పరుచుకున్న అనుబంధాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. “కేవలం హైప్ వల్ల కాదు… నిజమైన ఫ్యాన్ బేస్, గ్రౌండ్ లెవెల్ కనెక్షన్ వల్లే ఆయన నిలిచారు” అనే వాదనలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.చదువులో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం చేయడం, ఫ్యాన్స్ అసోసియేషన్ల ద్వారా విద్యా సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అలాగే తమిళనాడులో వరదలు, తుఫాన్లు వచ్చిన సమయంలో ఆయన ప్రకటించిన విరాళాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న విధానాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.“సినిమాల్లో మాత్రమే హీరో కాదు… అవసరమైన సమయంలో ప్రజలతో నిలబడే వ్యక్తి” అంటూ కొందరు విజయ్ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. మరికొందరు ఆయన వ్యక్తిత్వం, అభిమానులతో మెలిగే తీరు, పబ్లిక్లో చూపించే సింప్లిసిటీని ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ కేవలం సినిమా లేదా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, ఇద్దరు నటుల వ్యక్తిత్వాల పోలిక దాకా వెళ్లిన పరిస్థితి వెళ్లింది.#Ilayathalapathy Vijay's helping hand rare old pics! @AllYGirL85 @vijayrambomaxim @Anything4Vj @yok382 @Vicky_VjMsd pic.twitter.com/CgkJS3F0b9— Balaji (@balajiganesan26) August 15, 2016#Vijay has donated relief materials worth Rs 3cr to people affected by Chennai floods #Theri #Ilayathalapathy pic.twitter.com/jCsVZVvIbW— Nandhakumar (@ActorVijayFan1) December 20, 2015మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలను వేరే కోణంలో చూస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు కాదని, రాజకీయ అనుభవాలపై చేసిన సరదా వ్యాఖ్యలేనని వారు చెబుతున్నారు. 15 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను హైలైట్ చేయడమే ఉద్దేశమని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. విజయ్ కంటే పవనే తోపు అంటూ విజయ్ అభిమానులతో వాదనకు దిగుతున్నారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలపై విజయ్ అభిమానుల కోపం ఇంకా చల్లారడం లేదు. మొత్తానికి పవన్ వ్యాఖ్యలు ఒక సాధారణ రాజకీయ హాస్యంగా మొదలై, ఇప్పుడు తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్ వర్గాల మధ్య భావోద్వేగ పోరుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది.Cutouts pettukoni gelichadu 👍 pic.twitter.com/hPoFawOwOp— JD⚡ (@JohnDurdeno) May 26, 2026 -
ట్రంప్ పోలికలే రక్షించాయి!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్మీడియాలో వైరల్గా మారిన ఓ అరుదైన తెల్లగేదె ఇప్పుడు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కు బక్రీద్ సందర్భంగా బలి తప్పదనుకున్న వేళ.. చివరి క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది.బంగ్లాదేశ్లోని ఢాకా సమీప నారాయణ్గంజ్లో ఓ ఫారంలో పెంచుతున్న ఈ అరుదైన ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు వచ్చింది. ఆ తర్వాత సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ గేదె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. పిల్లలు, యువత, కుటుంబాలు పెద్దఎత్తున ఫారంకు చేరుకుని సెల్ఫీలు దిగేవారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట.అయితే ఈద్ అల్ అదా సందర్భంగా బలి కోసం ఇప్పటికే ఈ గేదెను విక్రయించినట్లు యజమాని జియౌద్దీన్ మృధా వెల్లడించారు. “ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను.. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని ఆయన చెప్పడంతో.. వైరల్ స్టార్గా మారిన ఈ గేదె కథ విషాదంగా ముగియబోతోందన్న చర్చ మొదలైంది.కానీ సోషల్మీడియాలో పెరిగిన చర్చలు, భారీ ప్రజాదరణ చివరకు ప్రభుత్వాన్ని కదిలించాయి. పరిస్థితిని గమనించిన బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ చివరి క్షణంలో జోక్యం చేసుకుని గేదెను రక్షించింది. ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ‘ట్రంప్ బఫెలో’ను ఢాకాలోని జాతీయ జూకు తరలించారు. ప్రత్యేక షెడ్, కేర్టేకర్ను ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉంచిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఆల్బినో జంతువులు బంగ్లాదేశ్లో చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం కారణంగానే వీటికి తెల్లటి చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టు వస్తాయని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు పలుమార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని తెలిపారు.ఇప్పుడు సోషల్మీడియాలో ఒక్క ప్రశ్నే వైరల్గా మారింది.. “ట్రంప్లా కనిపించడం వల్లేనా ఈ గేదె ప్రాణాలు దక్కాయి?” అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా.. బలి పీఠం దాకా వెళ్లిన ‘ట్రంప్ బఫెలో’ కథ చివరకు జూ వరకూ చేరి హ్యాపీ ఎండింగ్ దిశగా మలుపు తిరిగింది. -
విజయ్ సర్కార్కు కొత్త సవాల్..
సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. 1.శాంతిభద్రతలు – మహిళల భద్రతఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖగత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలుతమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనంశ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లుప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తివ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
త్వరలోనే హీరో అర్జున్ దాస్ పెళ్లి?
సౌత్లో తన గంభీరమైన గొంతు, సీరియస్ యాక్టింగ్తో విలన్గా, హీరోగా పలు కీలక పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన ఒక నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రహస్యంగా నిశ్చితార్థం జరగబోతుందని ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై అర్జున్ దాస్ టీమ్ వెంటనే స్పందించింది. అర్జున్ దాస్ పెళ్లి గురించి వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. అయితే ఇంతకుముందు ఆయనకు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిచిందని, అనంతరం బ్రేకప్ కూడా జరిగిందంటూ రూమర్స్ వినిపించాయి. అయితే అందులో నిజం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అటు అర్జున్ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా? అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోను అని బదులిచ్చాడు.ఆ సమయంలోనే దాదాపు నెల రోజుల పాటు తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయానంటూ అర్జున్ దాస్ ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో చాలామంది ఈ రెండింటినీ కలిపి చూశారు. అయితే వాటిపై ఎటువంటి అధికారిక క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత కొంత కాలానికి ఆ కథనాలు కాస్త సద్దుమణిగాయి. అయితే అంతలోనే ఇప్పుడు మరో నటితో అర్జున్ దాస్ పెళ్లి అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈసారి అతడి టీమ్ మాత్రం వెంటనే స్పందించి పుకార్లకు చెక్ పెట్టింది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమాతో అర్జున్ దాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సౌత్లో మోస్ట్ బిజీ ఆర్టిస్టుగా అర్జున్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
‘కాక్రోచ్’ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ!
క్విక్ కాల్?” అనే మెసేజ్ చూడగానే క్యాలెండర్లో ఫ్రీ స్లాట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క స్లైడ్లో చెప్పాల్సిన విషయం 10 స్లైడ్స్ పవర్పాయింట్ ప్రజంటేషన్గా సా..గిపోతూ చివరికి మీటింగ్ టైమ్ కూడా మించి పోవడం. మనమంతా ఒక కుటుంబం (We are a family) అనే హెచ్ఆర్ మాట… పనిభారం పెరిగిన ప్రతిసారి గుర్తొచ్చే ఒకరకమైన ఫీలింగ్. కార్పొరేట్ ఉద్యోగుల్లో కలిగే ఈ అనుభవాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్య రూపంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.రోజువారీ పనిలో భాగంగా మారిపోయిన ఈ చిన్న చిన్న ఒత్తిడులు, మీటింగ్ కల్చర్, ప్రెజెంటేషన్ల పొడవు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దులు మసకబారడం వంటి అంశాలు.. ఇప్పుడు హాస్యరూపంలో ఒక పెద్ద ఆన్లైన్ సంభాషణగా మారాయి. సాధారణంగా ఉద్యోగులు లోపలే పేరుకుపోయే అసహనం.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక సార్వత్రిక అనుభవంగా మారి అందరినీ కనెక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందుతూ “కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ (CMJP)” అనే సెటైరిక్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడిని, అలసటను వ్యంగ్యంగా రాజకీయ రూపంలో చూపిస్తూ ఈ ట్రెండ్ మరింత చర్చకు దారి తీస్తోంది.గుర్గావ్కు చెందిన అమెజాన్ మాజీ ఉద్యోగి శుభం కుమార్ మిట్టల్ ‘లింక్డిన్’లో చేసిన ఒక సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈయనే ఈ సీఎంజేపీ ప్రకటిస్తూ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఉద్యోగుల్లోని అలసట, పని ఒత్తిడి, కార్పొరేట్ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని సరదాగా రాజకీయ రూపంలో చూపించింది. కాక్రోచ్ పార్టీ మీమ్ ట్రెండ్ నుంచి స్ఫూర్తి తీసుకున్న ఈ కాన్సెప్ట్, కార్పొరేట్ ఉద్యోగుల దైనందిన సమస్యలను ఫన్నీ మేనిఫెస్టోలా చూపించారాయన.ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పలు సరదా ప్రతిపాదనలు ఉన్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని “అనవసరంగా ఎక్కువ పని దినాలు”గా పేర్కొనడం, “క్విక్ కాల్?” అనే మాటను అధికారికంగా వర్క్ప్లేస్ ఒత్తిడిగా గుర్తించాలన్న సూచన, అలాగే జీతంలో కంపెనీ చూపే మొత్తం (CTC).. చేతికి వచ్చే జీతం మధ్య తేడాలపై ప్రత్యేక దర్యాప్తు జరగాలన్న డిమాండ్లు ఉన్నాయి.ఇంకా వెటకారంగా.. వరుసగా మూడు సార్లు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా “ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్” ఇవ్వాలని కూడా ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే 50 స్లైడ్స్ కంటే ఎక్కువ ఉన్న పీపీటీలను ఉద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమని గుర్తించాలని సూచించారు. “We are a family” అనే హెచ్ఆర్ మాటను.. ఉద్యోగులను ఒప్పించడానికి వాళ్లు ఉపయోగించే భావోద్వేగ పద్ధతిగా చూడాలని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో లింక్టిన్, ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు ఈ అంశాలు తమ రోజువారీ అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని కామెంట్లు చేశారు. కొందరు అయితే ఇది జోక్ అయినప్పటికీ “చాలా నిజంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.అయితే ఆశ్చర్యకరంగా.. “Corporate Majdoor Janta Party” అనే పేరుతో ఒక వెబ్సైట్ కూడా ప్రత్యక్షమవ్వడం ఈ ట్రెండ్ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆ సైట్లో జాయిన్ ద మూమెంట్ అనే ఆహ్వానం ఉండటంతో ఇది సాధారణ పోస్ట్ నుంచి ఒక పెద్ద ఇంటర్నెట్ క్యాంపెయిన్గా మారినట్లు కనిపిస్తోంది. ఒక సాధారణ LinkedIn వ్యంగ్య పోస్ట్గా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగుల అలసట, పని ఒత్తిడి, కార్యాలయ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని హాస్యరూపంలో బయటపెడుతున్న ఒక వైరల్ సోషల్ మీడియా ఉద్యమంగా మార్చేయడం గమనార్హం.అది ఇది కాదు.. ఇదిలా ఉంటే.. ప్రముఖ కమెడియన్ అన్మోల్ గర్గ్ కూడా ఇదే థీమ్పై వీడియోలు చేస్తూ ఈ ట్రెండ్కు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. కార్పొరేట్ జనతా పార్టీ (Corporate Janata Party - CJP) పేరుతో కార్పొరేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న లేఆఫ్లు, వేధింపులు, తక్కువ హైక్లు, టాక్సిక్ వర్క్ కల్చర్లపై నిరసనగా ఈ క్యాంపెయిన్ ప్రారంభించారాయన. అయితే దీనికంటూ కొన్ని లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు. లేఆఫ్ ఇన్సూరెన్స్: ఉద్యోగం నుండి తొలగిస్తే ప్రభుత్వాలు లేదంటే కంపెనీలు భద్రత కల్పించడం. మూన్లైటింగ్ (Moonlighting): ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేయడానికి అనుమతి. పని వేళలు: కార్యాలయ వేళల తర్వాత ఫోన్ కాల్స్, మెయిల్స్ బంద్ చేయడం. జీతాల పెంపు: ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతంలో హైక్ ఇవ్వడం.. ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ఒక మీమ్ పేజీ లా కాకుండా, ప్రైవేట్ రంగ ఉద్యోగుల హక్కుల కోసం ఏర్పాటయిన ఒక వర్క్ఫోర్స్ ఉద్యమంగా వైరల్ అయింది. అయితే, కొన్ని ప్లాట్ఫారమ్లలో దీని ఖాతాలు బ్యాన్ కావడంతో ఉద్యోగుల సంఘీభావంతో ఇది మరింత చర్చనీయాంశమైంది కూడా. -
బెంగాల్లో బీజేపీ ఎఫెక్ట్.. ఈ దృశ్యాలు చూశారా?
ఓ చేతిలో తట్టా బుట్టలు, భుజాన మూటలు… మరో చేతిలో పిల్లల చెయ్యి పట్టుకుని సరిహద్దుల వైపు నడక. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ముఖంలో.. హకీంపూర్ చెక్పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్ అంతటా ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ఒకప్పుడు రాజకీయ చర్చలకే పరిమితమైన అక్రమ వలసదారుల అంశం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కనిపించే పరిణామాలుగా మారడంతో సరిహద్దులో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని బెంగాల్లో బీజేపీ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సువేందు అధికారి కూడా గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే.. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రాగానే దానిని కార్యరూపంలోకి తీసుకొచ్చారనే చర్చ జోరందుకుంది. West Bengal CM Suvendu Adhikari is on Fire Mode 🔥Worst days for Illegal Jehadi immigrants are coming."Bhaag Jao, Warna Sarkaar pel degi" pic.twitter.com/HpftDWLjQs— Chota Don (@choga_don) May 26, 2026బెంగాల్లో అక్రమ వలసదారుల ఎరివేతకు “డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్”.. విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. తాజాగా సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులతో జరిగిన మీటింగ్లోనూ ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలో లేని వారిని అక్రమంగా దేశంలోకి వచ్చినవారిగానే పరిగణిస్తామని.. అలాంటి వాళ్లను స్థానిక పోలీసులు సాయంతో అదుపులోకి తీసుకుని బీఎస్ఎఫ్కు అప్పగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అటు నుంచి అటే వాళ్లను దేశం నుంచి పంపించేస్తారన్నమాట. ఈ వ్యాఖ్యలు బెంగాల్లో అలజడిని రేపాయి. అందుకు తగ్గట్లే.. ప్రవాహం కనిపిస్తోంది. North 24 Parganas, West Bengal: Following BJP govt’s fresh order to identify and act against illegal Bangladeshi immigrants, movement near border areas reportedly increased. 🚨 pic.twitter.com/PLQw3Tfurp— JanHit Voice (@HJP2029_2036) May 26, 2026 హకీంపూర్ చెక్పోస్ట్ సహా ఉత్తర 24 పరగణాలు, మాల్దా ప్రాంతాల్లో అనుమానితుల కదలికలు పెరిగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక్క హకీంపూర్ వద్దే ఒకే రోజులో వంద మందికి పైగా గుమిగూడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో కొందరు బంగ్లాదేశ్ వైపు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో మాల్దాలో కూడా ఇదే తరహా కదలికలు కనిపించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.ఇక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా హోం & హిల్ అఫైర్స్ శాఖలోని ఫారినర్స్ బ్రాంచ్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మాల్దా జిల్లాలో మొదటిసారిగా “హోల్డింగ్ సెంటర్” ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. భారత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై చేపట్టే చర్యల భాగంగా ఈ వ్యవస్థను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హోల్డింగ్ సెంటర్లలో అనుమానితులను తాత్కాలికంగా ఉంచి వారి బయోమెట్రిక్ వివరాలు, పత్రాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాల్దా కేంద్రంలో పలువురు అనుమానితులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగుతోంది.#WATCH | North 24 Parganas, West Bengal | A large group of allegedly illegal Bangladeshi immigrants gather at the Hakimpur checkpost near the Bangladesh border, after the newly formed, BJP-led, West Bengal government, launched its 'detect, delete and deport' policy. (26.05) pic.twitter.com/RBN79D0cfP— ANI (@ANI) May 27, 2026ఇటీవల అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ మరియు ఫారినర్స్ చట్టం బెంగాల్ బీజేపీ ప్రభుత్వం చేపట్టిన డ్రైవ్కు మరింత బలం ఇచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ చట్టం ద్వారా వలసదారులపై నిఘా, నిర్బంధం, బహిష్కరణ ప్రక్రియలను డిజిటల్ వ్యవస్థ ద్వారా వేగవంతం చేయడంతో పాటు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వారెంట్ లేకుండానే చర్యలు తీసుకునే అధికారం ఉంది.బెంగాల్ అధికారుల చెబుతోంది ఏంటంటే.. ఈ హోల్డింగ్ సెంటర్లు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలుగా పనిచేస్తాయి. అనుమానితుల జాతీయత నిర్ధారణ పూర్తయ్యే వరకు వారిని గరిష్టంగా 30 రోజుల వరకు అక్కడ ఉంచే అవకాశం ఉంది. జిల్లా మేజిస్ట్రేట్లు మరియు సంబంధిత అధికారులు పత్రాల ధృవీకరణ, డేటా సేకరణ, కేంద్ర డేటాబేస్లకు సమాచారాన్ని అప్లోడ్ చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.అయితే ఈ పరిణామాలు కేవలం పశ్చిమ బెంగాల్కే పరిమితం కాలేదంటూ సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున నడుస్తోంది. పలు రాష్ట్రాల్లోనూ(తెలుగు రాష్ట్రాల్లోనూ) బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద అక్రమ వలసల కదలికల సంకేతాలు కనిపిస్తున్నాయట. కొందరు ఈ పరిణామాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అదే సమయంలో కుటుంబాలతో కలిసి తాత్కాలికంగా ప్రయాణిస్తున్న వర్గాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. -
బండెనుక బండికట్టి రేపిస్టు పోతుంటే.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్
అత్యాచార దోషి, డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు 30 రోజుల పెరోల్ మంజూరయ్యాక అతడు హరియాణాలోని రోహ్టక్లోని సునారియా జైలు నుంచి విడుదలై సిర్సాకు చేరుకున్నాడు. దాదాపు పది కార్లు అతడి ముందు, వెనక ఉండగా దర్జాగా మధ్యలోని కారులో కూర్చొని సిర్సాకు వెళ్లాడు. అత్యాచార దోషి ఇలా ఓ రాజులా విహారానికి వచ్చినట్లు కనపడడంతో తీవ్ర విమర్శలతో పాటు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.అత్యాచార దోషికి పెరోల్ మంజూరుకు కావడంతో దీనిపై సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఎక్స్లో స్పందిస్తూ.. “గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మరోసారి పెరోల్ మంజూరైంది.. ఈ సారి 30 రోజులు దక్కింది. 2017 ఆగస్టులో శిక్ష పడినప్పటి నుంచి ఇది 16వసారి అతను పెరోల్పై బయటకు వచ్చాడు. అత్యాచార కేసులో అతడు 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో ఉమర్ ఖాలిద్ లాంటి వారు విచారణ కూడా మొదలు కాకుండా దాదాపు 6 ఏళ్లుగా జైలులో ఉన్నారు. ఇదే న్యాయ వ్యవస్థ. ఇకపై మన న్యాయమూర్తులు ఏం ఉపదేశిస్తారో ఆశ్చర్యంగా ఉంది!” అని అన్నారు.గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు 30 రోజుల పెరోల్పై సీపీఎం నాయకురాలు బృందా కారత్ మాట్లాడుతూ.. “ఇప్పటికి 16 సార్లు పెరోల్ ఇచ్చారు. తన శిక్ష కాలంలో సగం సమయం అతను పెరోల్పైనే గడిపాడు. ప్రశ్న ఏంటంటే, మన చట్టం ఎందుకు వివక్ష చూపుతోంది? అతను తీవ్రమైన నేరస్థుడు కాదా? ఎంతో మంది అండర్ట్రయల్స్ సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. కానీ వాళ్లకు పెరోల్ లేదా బెయిల్ నిబంధన లేదు. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. హరియాణా ప్రభుత్వం అతనికి ఇస్తున్న మద్దతుపైనా సందేహాలు వస్తున్నాయి” అని అన్నారు. నెటిజన్ల సెటైర్లు ఇలా.. ‘‘ముందే పెట్రోలు ధరలు పెరిగిపోతున్నాయంటే ఆయన పది కార్లను వెంటేసుకుని తిరుగుతున్నాడు. లైఫ్ అంటే మినిమం ఇలా ఉండాలి’’‘‘జోక్ ఏంటంటే.. 75 శాతం హాజరు లేకపోతే మేము పరీక్ష కూడా రాయలేం. కానీ, ఈ అత్యాచార దోషి జైలుకు హాజరుకాకుండా తన భారీ కాన్వాయ్తో తిరుగుతూ విలాసవంతమైన జీవితం ఆస్వాదిస్తున్నాడు’’‘‘ఈ దేశంలో అసలు ఏమి జరుగుతోంది? మీడియాకూ అతడిని అత్యాచార దోషి అని చెప్పే ధైర్యం కూడా లేదు’’‘‘ఈ దేశంలో ఏమి జరుగుతోంది సోదరా? వీళ్లకు ఇంత భద్రత ఎందుకు ఇస్తున్నారు? దీనికి మొత్తం ప్రజలే కారణం. ఈ చెత్త పరిస్థితుల నుంచి మనకు ఎప్పటికీ విముక్తి రాదేమో..’’‘‘ప్రభుత్వం ఇతడి కాన్వాయ్లో ఇంకో 10 వాహనాలు చేర్చాలి. ఆయనకు జెడ్ ప్లస్ భద్రత ఇవ్వాలి. ఈ కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేకపోతే ఎలా?’’‘‘మోదీ తన కాన్వాయ్ను 2 కార్లకు తగ్గించారు. అత్యాచార దోషి గుర్మీత్ రామ్ రహీమ్ అంతకంటే పెద్ద వ్యక్తినా? పెట్రోల్, డీజిల్ ఖర్చుల నియంత్రణ చర్యల గురించి నరేంద్ర మోదీ ప్రకటించిన విషయమే అతనికి తెలియనట్టుంది’’."इस देश में न्याय अंधा नहीं है।उसकी आँखें खरीदी जा चुकी हैं।"2026 - 16वीं बार बाहर।उन दो बेटियों से पूछोजिनके साथ यह हुआ.."क्या तुम्हें न्याय मिला?"जवाब system कीसबसे बड़ी सच्चाई है।• Election आने वाला था।बाकी आप समझदार हैं। #RamRahimParole #BalaatkariBahar #IndiaWakeUp pic.twitter.com/xaEBPFuRpu— AVI SHUKLA (@AVINASHKUM41087) May 26, 2026#WATCH | Haryana | Rape convict Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh, who has been released from Sunaria prison in Rohtak after being granted 30-day parole, arrives in Sirsa pic.twitter.com/ifkW47oXNI— ANI (@ANI) May 26, 2026राम रहीम को बैल मिलती रहे वोह वजह से BJP ने कानून ही बदल दिया।#RamRahim#RamRahimParole#RamRahimBail#Haryana#HaryanaBJP#BJPGovernment#VIPTreatment#IndianPolitics pic.twitter.com/s8kxShrkL9— Mayank Solanki 🇮🇳 (@BareTruthX) January 7, 2026pic.twitter.com/UABin1I37q— Mr. X Y Z (@mr_xyz_007) May 26, 2026BJP ka Love Charger 😂 pic.twitter.com/rXy8mwUk4Z— Mi Pan Kakoroz (@BMCInsider_) May 26, 2026 -
కాక్రోచ్ జనతా పార్టీని నాకిచ్చేయండి..!
సోషల్ మీడియాలో వ్యంగ్యరూపంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రోజుల వ్యవధిలోనే విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుంది. ఎంతలా అంటే భారత్లో ప్రధానంగా ఉన్న రాజకీయా పార్టీలను వెనక్కు నెట్టి మరీ ఈ పార్టీ దూసుకుపోయింది ఏ నోట విన్నా సీజేపీ అనే స్థాయికి ఈ సోషల్ మీడియా పార్టీ చేరింది. అయితే దీన్ని నెలకొల్పంది అభిజీత్ దిప్కే. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన అభిజిత్.. ఇటీవల దీన్ని సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేయగా విశేషమైన ఆదరణ లభించింది. అయితే దీనికి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న ఈ పార్టీకి చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా భారతదేశంలో బ్లాక్ అయ్యింది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ డిజిటల్ ఉద్యమ అకౌంట్ బ్లాక్ కావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఆ పేరును నాకిచ్చేయండి..హరియాణాలోని పానిపట్కి చెందిన న్యాయవాది సుధీర్ జాకర్ సీజేపీని తన పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన తానే పార్టీ జాతీయ కన్వీనర్ అని ప్రకటించుకున్నాడు, దీన్ని అమెరికాలో చదువుకుంటున్న అభిజీత్ దిప్కే నుంచి వేరు చేసి తన పేరుతో పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుధీర్ జాకర్.. కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాడు. ఆ పేరును తనకు కేటాయించాలని కోరుతూ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ పార్టీని రిజిస్టర్ చేసుకోవడానికి భారత్కు రమ్మంటే రానంటున్న అభిజిత్ దీప్కే నుంచి ఆ పార్టీని వేరు చేయాలని దరఖాస్తులో కోరారు. ‘యువతలో కోపం పెరుగుతోంది. ఎవరైనా ముందుగా ఈ పేరును నమోదు చేసి దుర్వినియోగం చేస్తే ఉద్యమం నశిస్తుంది. అందుకే నేను ముందుకు వచ్చాను’ అని దరఖాస్తు చేసుకునే క్రమంలో చెప్పుకొచ్చారు సదరు న్యాయవాది. ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత గత గురువారం భారతదేశంలో సీజేపీ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ ట్రెండ్లలో ఒకటిగా అవతరించిన సీజేపీని ప్రస్తుతం బ్యాన్ చేశారు. మరి ఇది పార్టీగా రూపాంతరం చెందుతుందా? తుపాను వేగంతో వచ్చిన ఈ పార్టీకి ఇక్కడతోనే కథ ముగిసినట్లా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తంగా సీజేపీ ఇప్పుడు అసలు స్థాపకుడు అభిజీత్ దిప్కే వర్సెస్ జాకర్ మధ్య యాజమాన్య పోరుకు తెరతీయడం మరింత హాట్ టాపిక్గా మారింది. -
‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2026 సీజన్లో ప్లాఫ్ షో కనబరిచాడు. 13 మ్యాచ్ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసిన సూర్యకుమార్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సీజన్లో రాజస్తాన్తో మ్యాచ్లో 60 పరుగుల ఇన్నింగ్స్ సూర్యకు ఈ సీజన్లో చెప్పుకోదగిన ప్రదర్శన. ఇది మినహా అతడు రాణించిన దాఖలాలు లేవు. అయితే రాజస్తాన్తో మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ మణికట్టు గాయంతో బాధపడుతున్నాడని, అందుకే అతడి నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను సూర్యకుమార్ ఖండించాడు. తనకు ఏ గాయం కాలేదని, సరిగ్గా ఆడనంత మాత్రానా గాయంతో బాధపడుతున్నట్లు ఊహించుకున్నవారంతా మూర్ఖులేనంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. అంతేకాదు తనపై వచ్చిన వార్తలన్నీ అబద్దాలేనంటూ కొట్టిపారేశాడు. సూర్యకుమార్ మాట్లాడుతూ..‘ఒక విషయంపై నేను స్పష్టత ఇవ్వదలచుకున్నా. నేను మణికట్టు గాయంతో బాధపడుతున్నా అని మాట్లాడుకుంటున్నవాళ్లు ఫిజియోథెరపిస్టులు కాకపోవడం లేదా క్రికెట్ గురించి అవగాహన లేని వాళ్లు అయి ఉంటారు. ఎందుకంటే, ఒకవేళ నిజంగా నేను మణికట్టు గాయం లేదా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే.. ప్రాక్టీస్లోనూ, మ్యాచ్లలోనూ షాట్లు కొట్టడంలో ఇబ్బంది ఎదుర్కొనేవాడిని. నేను మ్యాచ్ల్లో ఆడే చాలా షాట్లతో పాటు ఫ్లిక్ షాట్లు నా మణికట్టుపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రూమర్లను పట్టించుకునే సమయం నాకు లేదు. కానీ నేను పూర్తి ఫిట్గా ఉన్నప్పటికీ గాయంతో బాధపడుతున్నట్లు వార్తలు రావడం ఆగ్రహం తెప్పించింది. అందుకే పని గట్టుకొని ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఈ సీజన్లో నా నుంచి బ్యాటింగ్లో మంచి ప్రదర్శన రాకపోవడంపై అసంతృప్తిగానే ఉన్నా. కానీ ఈ ఏడాది మంచి హార్డ్వర్క్తోనే క్రికెట్ సీజన్ను స్టార్ట్ చేశాను. న్యూజిలాండ్తో సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నా. టీ20 ప్రపంచకప్లో ఆరంభంలో విఫలమైనప్పటికీ ఆఖర్లో మంచి ప్రదర్శనే కనబరిచాను. కానీ ఐపీఎల్లో మాత్రం లయను కోల్పోయి బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాను. నా ప్రదర్శన బాగాలేదని సర్దిచెప్పుకోలేను. దానిని మెరుగుపరుచుకునేందుకు ఇంకా కష్టపడుతా. ఫలితం వస్తే సంతోషం లేకుండా మళ్లీ కష్టపడతా. దేవుడు అన్నీ చూస్తున్నాడు. త్వరలోనే మళ్లీ కమ్బ్యాక్ ఇస్తానని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.Suryakumar Yadav on his Wrist Injury : "First of all, I'd like to clear the air a little bit. The people talking about a wrist injury are either pure physios or people who don't understand cricket. Because if I really had a wrist injury or such a problem, then the shots I've… pic.twitter.com/cNvibE9e3j— Vipin Tiwari (@Vipintiwari952) May 25, 2026చదవండి: కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు! -
రోడ్డు కుదరదా?.. బాబ్బాబు హెలికాప్టర్లైనా పంపండి
అది అడవుల మధ్య దాగి ఉన్న ఓ మారుమూల గిరిజన గ్రామం. నక్సలిజం ప్రభావం కారణంగా చాలాకాలం అభివృద్ధి పనులకు నోచుకోలేకపోయింది. పదేళ్ల కిందట ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. “నక్సల్ సమస్య తుడిచేశాం” అని ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాక ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడవ లేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై ఓ పని చేశారు. దశాబ్దాల నుంచి గుంతల దారే దిక్కుగా మిగిలిన ఆ గ్రామం.. ఇప్పుడు అసాధారణ విజ్ఞప్తితో వార్తల్లోకి ఎక్కింది.. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా మారుకి గ్రామం నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ లేఖ వెళ్లింది. “ అయ్యా.. రోడ్లు నిర్మించలేకపోతే కనీసం హెలికాప్టర్లు అయినా పంపండి” అంటూ కాస్త వెటకారంగానే అక్కడి వాస్తవ దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు వాళ్లు. ఆ లేఖ ఎలాగోలా సోషల్ మీడియాకు చేరింది. అక్కడి నుంచి మీడియాకు చేరింది. దట్టమైన అటవీ ప్రాంతం నడుమ బస్తర్ ప్రాంతానికి సమీపంగా ఉండే మారుకి గ్రామం.. కొండలు, వాగులు, గాఢమైన అడవులతో కూడిన కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇక్కడి గ్రామాలు పెద్దగా ఉండవు. కొన్ని వందల మంది మాత్రమే నివసించే చిన్న గిరిజన గూడేలు మాత్రమే కనిపిస్తాయి. గోండ్, మరియా వంటి ఆదివాసీ సముదాయాలకు చెందిన ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులు, చిన్న స్థాయి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆధునిక సదుపాయాలకు దూరంగా ఉన్న ఈ ప్రాంతాల్లో రహదారి అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, జీవనాధారం కూడా. అయితే మారుకి గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి గత ఏళ్లు గడుస్తున్న మారలేదు. దశాబ్దం కిందట.. బ్రిడ్జిలు, కల్వర్టులు వంటి నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, అవి మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాలు చేసిన గుంతలు అలాగే వదిలేయడం వల్ల మార్గం పూర్తిగా ధ్వంసమై, రాళ్లు, మట్టి, గుంతలతో నిండిపోయిన ప్రమాదకర దారిగా మారింది. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారి గ్రామం బయట ప్రపంచానికి పూర్తిగా తెగిపోతుంది. చిన్న వర్షానికే రహదారి జారిపోవడం లేదంటే వాగులు పొంగిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యమవుతుంది.ఈ దారుణ పరిస్థితుల్లో గర్భిణీలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారిని కూడా కొయ్య మంచాలపై కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో నిత్యకృత్యంగా మారింది. అంబులెన్స్లు గ్రామం లోపలికి రాలేకపోవడంతో ముందుగా అడవిలో కాలినడక, తర్వాత ప్రధాన రహదారికి చేరుకుని అక్కడి నుంచి మాత్రమే ఆసుపత్రికి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ఆలస్యాల కారణంగా ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సర్పంచ్తో పాటు స్థానికులు చెబుతున్నదేమిటంటే.. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా అధికారులు మొదలుకొని ఉన్నతస్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని. ప్రతి సారి హామీలు మాత్రమే వస్తున్నాయని, కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వారు వాపోతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం ఈ పరిస్థితికి భిన్నమైన వివరణలు ఇస్తున్నారు. భౌగోళికంగా అత్యంత కఠినమైన అటవీ ప్రాంతం కావడం, గతంలో నక్సలిజం ప్రభావం ఉండటం, కాంట్రాక్టర్లు మధ్యలో పనులు వదిలేయడం వంటి కారణాలతో రహదారి నిర్మాణం ఆలస్యమైందని వారు చెబుతున్నారు. అయితే ఇటీవల సుక్మా ప్రాంతంలో నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రహదారి పనులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం అందడం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని, మిగిలిన రహదారి భాగాన్ని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని ఐదారు నెలలుగా చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు చేసిన చివరి ప్రయత్నం.. “రోడ్లు ఇవ్వలేకపోతే హెలికాప్టర్లు అయినా ఇవ్వండి” ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. -
‘నాపై కక్ష కట్టారు’.. శ్రేయస్ అయ్యర్ సోదరి ఆవేదన!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ ప్రయాణం ఒక విషాదగాథ అని చెప్పొచ్చు. సీజన్ తొలి దశ పోటీల్లో ఓటమి ఎరుగని పంజాబ్ టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో దశ పోటీలకు వచ్చేసరికి పంజాబ్ కథ అడ్డం తిరిగింది. వరుసగా ఆరు పరాజయాలు ఆ జట్టును ఇవాళ ప్లేఆఫ్స్కు చేరకుండా అడ్డుకున్నాయి. చివరి లీగ్ మ్యాచ్లో గెలిచినప్పటికీ ముంబై ఇండియన్స్ఫై రాజస్తాన్ రాయల్స్ గెలవడంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ సంగతి పక్కనబెడితే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ ఒక వీడియోను విడుదల చేసింది. శ్రేష్ట ఉన్నపళంగా వీడియో రిలీజ్ చేయడం వెనుక ఒక కారణముంది. అదేంటంటే.. సీజన్ ఆరంభంలో పంజాబ్, కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ సమయంలో అయ్యర్ సోదరి శ్రేష్ట పంజాబ్ జెర్సీ ధరించి ఒక వీడియో రిలీజ్ చేసింది. 'మేము పంజాబీలం. మా మనసు చాలా పెద్దది. అందుకే మీకు ఒక పాయింట్ ఇచ్చాము' అని సరదాగా కేకేఆర్ను ట్రోల్ చేసింది. అయితే శ్రేష్ట మాటలను సీరియస్గా తీసుకున్న కేకేఆర్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన ట్రోలింగ్ యుద్ధం తనపై ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉందంటూ శ్రేష్ట అయ్యర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తనకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని, కేవలం సరదా కోసమే వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు శ్రేష్ట తెలిపింది. 'నేను వీడియోలు పెట్టడం వెనుక అసలు ఉద్దేశం కేవలం ఫన్ మాత్రమే. నేను ఎవరిని ట్రోలింగ్ చేయాలనుకోవడం లేదు. ఎవరి మీద నాకు అలాంటి దురుద్దేశం లేదు. ప్రతీ క్రికెటర్ను గౌరవిస్తాను.. ఎందుకంటే నా సోదరుడు కూడా ఒక క్రికెటరే. కానీ మీరు మాత్రం నేను చేసిన చిన్న తప్పుకు నాపై కక్ష కట్టి వేధింపులకు దిగారు. ఆ దూషణల పర్వం నేను పనిచేసే చోటు వరకు రావడం బాధాకరం. నాకు ఫోన్ చేసి నన్ను, నా సహ ఉద్యోగులను, విద్యార్థులను, కుటుంబాన్ని అసభ్యంగా దూషిస్తున్నారు. ట్రోల్ చేయండి.. కానీ అవి కుటుంబాలను లక్ష్యం చేసుకునేలా ఉండకూడదు. ఇప్పటికైనా నన్ను టార్చర్ పెట్టడం ఆపండి' అని వీడియోలో శ్రేష్ట పేర్కొంది. View this post on Instagram A post shared by Shresta Iyer (@shrestaiyer29) చదవండి: IPL 2026: క్వాలిఫయర్-1 పోరు.. ఫైనల్ వెళ్లేదెవరు? -
‘కాక్రోచ్ జనతా పార్టీ’పై విచారణకు నో!
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవల పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’కి సంబంధించిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని మరీ సెంటిమెంట్గా తీసుకోవద్దని, ఇందులో అత్యవసరంగా విచారించాల్సినంత తీవ్రత ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సీజేపీ వెనుక ఉన్న వ్యక్తులపై, అలాగే నకిలీ న్యాయవాద డిగ్రీల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని న్యాయవాది రాజా చౌదరి పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున ఎన్.కె.గోస్వామి వాదనలు వినిపించారు. సీజేపీ సోషల్ మీడియా ద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను మసకబారుస్తోందని పేర్కొన్నారు. కోర్టులో జరిగే సంభాషణలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలను కొందరు వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు వ్యాఖ్యలను కత్తిరించి, మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తాము వాక్ స్వాతం్రత్యానికి, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకం కాదని, కేవలం కోర్టు వ్యాఖ్యలను స్వార్థానికి వాడుకోవడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిల ధర్మాసనం.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మరీ అంత సెంటిమెంట్గా తీసుకోవద్దంటూ వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వెంటనే విచారించాలన్న అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. -
ఆదితి గౌతమ్ నాభి అందాలు.. బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..!
బ్లాక్ డ్రెస్లో బిగ్బాస్ బ్యూటీ సావిత్రి హోయలు..పర్పుల్ కలర్ డ్రెస్ టాలీవుడ్ నటి బిందు మాధవి సమ్మర్ పోజులు..లైట్ కలర్ శారీలో ఆదితి గౌతమ్ మతిపొగొట్టే అందాలు..సిస్టమ్ టీమ్తో జ్యోతిక చిల్..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న నటాషా స్టాంకోవిచ్.. View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by @natasastankovic__ -
హెడ్ భార్యకు వేధింపులు.. వికృత చేష్టలు ఆపండి!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది. మేము మనుషులమే..'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.గతంలోనూ వేధింపులు..అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.కోహ్లీ, హెడ్ వివాదమేంటి?ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్!
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి. ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.🇦🇹 A paraglider collided midair with a Cessna 172 over Austria and somehow survived.She deployed her emergency parachute seconds after impact and landed safely.The plane pilot also managed to land safely at Zell am See Airport.pic.twitter.com/6IH7sTi3Ic— Mario Nawfal (@MarioNawfal) May 24, 2026 -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ని చూస్తుంటే జాలేస్తోంది : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
సాక్షి,ఢిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల జరిగిన సభలో మాట్లాడుతూ..‘కాక్రోచ్ జనతా పార్టీ’కి పాకిస్థాన్, బిలియనీర్ జార్జ్ సోరోస్ నెట్వర్క్ల నుంచి మద్దతు లభిస్తోంది అని వ్యాఖ్యానించారు.అయితే, ఈ ఆరోపణలను కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీకి పాకిస్థాన్తో ఎలాంటి సంబంధం లేదు. రిజిజు చేసిన ఆరోపణలు అసత్యం, నిరాధారం. మా పార్టీ ఉద్దేశ్యం భారతీయ ప్రజల సమస్యలను వినిపించడం, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడమే” అని స్పష్టం చేశారు. అభిజీత్ దిప్కే తమ పార్టీకి భారత్లోనే 94 శాతం మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారని గుర్తు చేశారు.దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పాకిస్థాన్, జార్జ్ సోరోస్ నెట్వర్క్ల నుండి ఫాలోవర్స్ సంపాదించుకునే వారిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. మన దేశంలో తగినంత జనాభా, అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన ఫాలోవర్స్. భారత్ వ్యతిరేక నెట్వర్క్ల నుంచి గుర్తింపు కోరాల్సిన అవసరం లేదు” అని అన్నారు.I pity those who seek their followers in social media from Pakistan & George Soros gang.— Kiren Rijiju (@KirenRijiju) May 23, 2026 -
బొద్దింకలకే భయపడుతున్నారా?.. కేంద్రంపై విజయన్ ఫైర్!
తిరువనంతపురం: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) సంచలనంగా మారింది. కేవలం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మొదలైన ఈ వేదికకు పెరుగుతున్న ప్రజాదరణ చూసి బీజేపీ భయపడుతోందని కేరళ ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఆరోపించారు. ప్రజాస్వామ్య నిరసనలపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.అసహనమే అధికార పక్షం ఆయుధమా?యువ కార్యకర్త అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అతి తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. కొన్ని వేదికల్లో అధికార బీజేపీ కంటే ఈ సంస్థకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సీజేపీకి చెందిన ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేయడం, చివరకు వ్యవస్థాపకుడు అభిజీత్ వ్యక్తిగత ఖాతాను కూడా సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నిరసనను అణచివేసే ప్రయత్నంతమను ‘బొద్దింకలు’గా పిలుచుకుంటూ చేపట్టిన ఈ నిరసనను కేవలం ఒక సాధారణ స్పందనగా కొట్టిపారేయకూడదని పినరయి విజయన్ పేర్కొన్నారు. తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా స్పందించిన ఆయన, కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ ధోరణిని ఎండగట్టారు. ఇలాంటి వ్యంగ్య రాజకీయ ప్రయోగాలను చూసి అధికార పక్షం కంగారు పడటం, భావ ప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.అంతర్జాతీయ స్థాయికి ‘బొద్దింక’ పోరుభారతదేశంలో మొదలైన ఈ ‘కాక్రోచ్’ ట్రెండ్ ఇప్పుడు సరిహద్దులు దాటుతోంది. ఈ సంస్థపై సైబర్ దాడులు, పోలీసు హెచ్చరికలు, విదేశీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నా, ప్రజాదరణ తగ్గడం లేదు. ముఖ్యంగా ఇలాంటి వినూత్న నిరసనలు భారత్ నుంచే కాకుండా పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల్లో కూడా కొత్త రాజకీయ కదలికలకు దారితీస్తుండటం విశేషం. -
అణచివేస్తున్నారు!
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై అణచివేత చర్యలు కొనసాగుతున్నాయని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. తమ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తున్నారని, హ్యాకింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీకి ప్రస్తుతం తమ సోషల్ మీడియా ఖాతాలేవీ అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని విమర్శించారు. రెండు రోజుల క్రితం సీజేపీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ పార్టీ కొత్త ఖాతాను సృష్టించుకుంది. నీట్(యూజీ)–2026 పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ సీజేపీ శుక్రవారం ఆన్లైన్లో ఉద్యమం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని ఉందని అభిజిత్ దిప్కే చెప్పారు. తమ పార్టీని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజీని, తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ పేజీని హ్యాక్ చేశారని తెలిపారు. ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారని, బ్యాకప్ ఖాతాను కూడా తొలగించారని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలేవీ తమకు అందుబాటులో లేవన్నారు. ఇకపై వచ్చే పోస్టులను కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చిన అధికారిక ప్రకటనగా పరిగణించకూడదని కోరారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు కక్షగట్టారు సీజేపీ వెబ్సైట్ అయిన ‘కాక్రోచ్జనతాపార్టీ.ఓఆర్జీ’ని కూడా ప్రభుత్వ వర్గాలు కక్షపూరితంగా తొలగించినట్లు అభిజిత్ దీప్కే తెలిపారు. అది ఇప్పుడు అందుబాటులో లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తమ పార్టీపై యుద్ధం ప్రకటించారని అభిజిత్ దీప్కే మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం మా ప్రతిష్టాత్మక వెబ్సైట్ను తొలగించింది. మా వెబ్సైట్లో కోటి మంది సభ్యులుగా చేరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆరు లక్షల మంది సభ్యులు పిటిషన్పై సంతకం చేశారు’’అని వివరించారు. ఎంతగా అణచివేస్తున్నా తమ ఉద్యమం నానాటికీ విస్తరిస్తూనే ఉందని తేల్చిచెప్పారు. ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను నిలిపివేయడాన్ని డిజిటల్ హక్కుల సంఘం ‘ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్’తప్పుపట్టింది. ఈ చర్యను ప్రభుత్వ అధికార దురి్వనియోగంగా అభివర్ణించింది. ఇదీ కాక్రోచ్ కథ → ఉద్యోగాలు, ఉపాధి లేని యువత పరాన్నజీవులుగా, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ నెల 15న ఒక కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ విమర్శించారు. → ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో సంబంధాలున్న అభిజిత్ దీప్కే అనే యువకుడు జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఈ నెల 16న ‘వాయిస్ ఆఫ్లేజీ అండ్ అన్ఎంప్లాయ్డ్’అనే ట్యాగ్లైన్తో కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేశాడు. ఇదొక ఆన్లైన్ వ్యంగ్య పార్టీ. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని, ఐదు సూత్రాల మేనిఫెస్టోను ప్రకటించాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆన్లైన్లో పోరాటం సాగించడమే తన లక్ష్యమని స్పష్టంచేశాడు. ప్రధానంగా యువత ఈ పార్టీ పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు. → కాక్రోచ్ జనతా పార్టీని ఇన్స్టాగ్రామ్లో అనుసరించేవారి సంఖ్య కోటికి చేరుకుంది. రెండు రోజుల వ్యవధిలోనే 40 వేల మంది ఆ పార్టీలో చేరారు. → నిరుద్యోగం, రాజకీయ జవాబుదారీతనం, ప్రశ్నపత్రాల లీకేజీలపై యువతలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని సీజేపీ బహిర్గతం చేసింది. సీజేపీ వెబ్సైట్. ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. → అధికార బీజేపీ సహా ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల కంటే సీజేపీకి సోషల్ మీడియాలో అధికంగా ఆదరణ లభించింది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్లో బీజేపీ కంటే సీజేపీని ఎక్కువ మంది అనుసరించారు. ఇన్స్టాగ్రామ్లో సీజేపీని అనుసరించేవారి సంఖ్య 2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 22న సీజేపీ ‘ఎక్స్’ఖాతాను నిలిపివేసింది. -
అభిజీత్ దీప్కే (కాక్రోచ్ జనతా పార్టీ) రాయని డైరీ
కొన్నిసార్లు అవకాశాలను భగవంతుడు కల్పిస్తాడు. మరికొన్నిసార్లు భారత ప్రధాన న్యాయమూర్తి! నిజం! నాకసలు ఏ ఉద్యమమూ చేపట్టాలని లేదు. కానీ, దైవం ఏ రూపంలోనో వచ్చి, ఇదిగో ఇలా ప్రభుత్వాలతో తలపడమని పిలుపును ఇస్తాడు కావచ్చు... ఉమర్ ఖాలిద్కు ఇచ్చినట్లుగా! ఖాలిద్ ఆరేళ్ల తర్వాత తీహార్ నుండి మూడు రోజుల బెయిల్ మీద బయటికి వచ్చి జూన్ 1 నుంచి 3 వరకు తల్లికి తోడుగా ఉండబోతున్నాడు... ఈ లోపు ఆ మూడు రోజుల బెయిలైనా రద్దు కాకుండా ఉంటే!ఢిల్లీలో అల్లర్లకు కుట్ర పన్నాడని ‘ఉపా’ కింద ఉమర్ ఖాలిద్ని 2020లో అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచారు. ఇప్పుడు నేను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని పెట్టి నిరుద్యోగ యువకుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నానని నా పైన ‘ఉపా’ పెట్టినా చేసేదేం లేదు!! రెండు రోజులు ఆగితే ఇండియా వెళ్లేవాడిని. నాలుగు రోజులు ఇండియాలో ఉండి, తిరిగి బోస్టన్ వచ్చేసేవాడిని.బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ రిలేషన్స్లో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ చేసొచ్చిన భారతీయ యువకుడికైనా స్వదేశంలో ఎక్కడో ఒక చోట చిన్న ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకం లేదు. ఉండటానికైతే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మానాన్న ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఛత్రపతి శంభాజీ నగర్లోని మా ఇంటికి వెళ్లటానికి లేదు.‘‘ఎందుకొచ్చిన పిచ్చి పని జీత్! ఆ ఆన్లైన్ ఆటలు ఆపేసెయ్’’ అని అమ్మ అంటోంది. ‘‘అమ్మా... ఇన్స్టాలో వారం రోజుల్లో నాకు 2 కోట్ల మంది ఫాలోవర్స్...’’ అన్నాను నవ్వుతూ. ‘‘అదేదో వారానికి ఇంత జీతం అని చెబుతున్నావేంటి జీత్!!’’... అమ్మ నుంచి ఫోన్ లాక్కొని నాన్న! ‘‘జీత్, మన ఇంటి చుట్టుపక్కల నిన్నటి నుంచి ఎవరో కొత్తవాళ్లు కనిపిస్తున్నార్రా’’... నాన్న నుంచి ఫోన్ లాక్కొని అమ్మ. ‘‘అమ్మా... నాకేం కాదు’’ అన్నాను.‘‘కానీ, ఇక్కడ అంతా అంటున్నారు... మీ జీత్ను అక్కడే అమెరికాలో ఉండిపొమ్మని చెప్పండి, ఇండియా వస్తే అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తీసుకెళతారు... అని!’’అమ్మ ఏడుస్తూ చెబుతోంది.‘‘అమ్మా ఏం కాదు, ఊర్కో’’ అంటున్నాను, అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మ నుంచి నాన్న ఫోన్ లాక్కోవటం లేదు! అంటే, నాన్న అక్కడి నుంచి వెళ్లిపోయారా? ఈ నాన్నలెందుకు కొడుకుల మీది కోపాన్ని తల్లుల మీద ప్రదర్శిస్తారు?! అన్లైన్ ఉద్యమాలు ఊరికే బొద్దింకల్లా పుట్టుకు రావు. వాటి ఆవిర్భావం వెనుక ఒక ఆవేదన ఉంటుంది. ఒక మహావేశం ఉంటుంది. సీజేపీ అనే మా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కూడా అలాగే ఉద్యమ రూపం తీసుకుంది. నిరుద్యోగుల ఆత్మగౌరవ సాధన సీజేపీ ప్రధాన లక్ష్యం, ప్రధాన పోరాటం.ఈ లక్ష్యాన్ని ఏర్పరిచింది, పోరాటానికి దారి చూపింది... సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి! ఆయనకు మా ఉద్యమ ధన్యవాదాలు. నిరుద్యోగులను ఆయన బొద్దింకలతో పోల్చారు! వాళ్లకు ఏ ఉద్యోగమూ దొరకదు అన్నారు! వారిలో కొందరు సోషల్ మీడియా కార్యకర్తలు అవుతారు అన్నారు. కొందరు ఆర్టీఐ యాక్టివిస్ట్ల అవతారం ఎత్తుతారు అన్నారు. అలా అని, ప్రపంచ భారతీయ బొద్దింకలన్నిటినీ ఆయనే ఏకం చేశారు. నిరుద్యోగులను బొద్దింకలు అన్నందుకు ‘చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ మీద ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి కోపమేం లేదు. అసలు ఆయన మీద గౌరవంతోనే మేము మా పార్టీకి ముందనుకున్నట్లుగా ‘కాక్రోచ్ జనతా ఇంపాక్ట్’ అనే పేరు పెట్టుకోలేదు. పెట్టుకుని ఉంటే అప్పుడది ‘సీజేఐ’ అయి ఉండేది. ‘సీజేఐ’ అన్నప్పుడల్లా ‘చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా’ అని అన్నట్లుగానూ ఉండేది!! -
దేశ రాజకీయాలను కుదిపేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీపై ఎడిటర్స్ కామెంట్
-
కాక్రోచ్ జనతా పార్టీకి కర్ణాటక మంత్రుల మద్దతు!
సాక్షి బెంగళూరు: సోషల్ మీడియా వేదికగా ఇటీవల పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి కన్నడనాడు కర్ణాటకలో కూడా మద్దతుదారులు పెరిగారు. ఏకంగా రాష్ట్ర మంత్రులు సైతం ఈ ఆన్లైన్ పోర్టల్కు మద్దతు ప్రకటించారు. దేశ సమస్యలపై కేంద్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో యువతలో పెల్లుబికిన ఆగ్రహమే ఈ కాక్రోచ్ జనతా పార్టీ’ అని మంత్రి శరణ ప్రకాశ్ పాటిల్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నిరుద్యోగం, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ తదితర కారణాల వల్ల యువత ఆగ్రహంతో ఉంది. వారి సమస్యలపై కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. మరో మంత్రి సంతోష్ లాడ్ కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. యువత డిజిటల్ పోరాటంపై తనకు సంతోషంగా ఉందని, ఇలాంటి పోరాటం ప్రస్తుతం అవసరమని, తన మద్దతు కచ్చితంగా ఉంటుందని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చ సాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ పార్టీకి అనుకూలంగా చాలా మంది వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 24న కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత మానవహారాన్ని నిర్వహిస్తోందంటూ ఒక పోస్టర్ షేర్ అవుతోంది. బెంగళూరు టౌన్హాల్ ఎదుట ఆదివారం ఉదయం 11 గంటలకు ఆందోళన చేపడుతున్నట్లు ఆ పోస్టర్లో పేర్కొన్నారు. యువతకు భవిష్యత్తు లేదని, ధరల పెరుగుదల, నీట్ పేపర్ లీకేజీ, ఓట్ల చోరీ తదితర అంశాలపై యువత పోరాటం అనే పేరిట ఈ పోస్టర్ ప్రచురితమైంది. -
ట్రంప్లా కనిపించిన గేదె.. పాపం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అరుదైన తెల్లగేదె సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కథ.. మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్గంజ్లో ఉన్న ఓ ఫారంలో పెంచుతున్న ఈ నాలుగేళ్ల ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు ముద్రపడింది. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే.. బక్రీద్ సందర్భంగా ట్రంప్ గేదెను బలి ఇవ్వబోతున్నారట. ఈ గేదెను పెంచుతున్న ఫారం యజమాని జియౌద్దీన్ మృధా మాట్లాడుతూ.. ఈద్ అల్ అదా(Eid al-Adha) సందర్భంగా బలిచేయడానికి ఇప్పటికే ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడని తెలిపారు. ‘‘ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్ చెబుతున్నారు.తెల్లని చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టుతో కనిపించే ఈ గేదెను చూసేందుకు ప్రతిరోజూ జనాలు పెద్ద ఎత్తున ఫారంకు వచ్చేవారని.. పిల్లలు, యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడేవారని తెలిపారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట. మరోవైపు.. ఆల్బినో జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం వల్లే వీటికి తెల్లటి రంగు వస్తుందని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు నాలుగు సార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని చెప్పాడు. అయితే జనసందోహం ఎక్కువ కావడంతో గేదె ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే చివర్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశాడట. వైరల్ స్టార్గా మారిన ఆ గేదెకు ఇదే చివరి పండుగ కానుండటం స్థానికంగా భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల చివర్లో జరగనున్న ఈద్ అల్ అదా కోసం భారీ సంఖ్యలో పశువులను సిద్ధం అవుతున్నాయి. భారీ సైజులో ఉండడమో లేదంటే ప్రత్యేక లక్షణాల కారణంగా పలు పశువులు సోషల్మీడియాలో వైరల్ అవడం సాధారణమైపోయింది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం.. సంచలన నిర్ణయాలతో పలు దేశాలను షేక్ చేస్తుండడంతో.. ఈ గేదె తన ప్రత్యేక రూపంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
గే యాప్ పరిచయం.. యువకుడి దారుణ హత్య..!
కోదాడ: సోషల్ మీడియాలో ఓ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం యువకుడి హత్యకు కారణమైంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరానికి చెందిన బల్గూరి గణేష్(20) ఈ నెల 15న హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సామాజిక మాధ్యమంలో ఉన్న ‘పోలో’ గే యాప్ కారణమని, హత్యకు కారణమైన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గణపవరానికి చెందిన బల్గూరి గణేష్కు, హుజూర్నగర్కు చెందిన బర్రెంకుల సోమేష్కు పోలో అనే గే యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఏకాంతంలో తీసుకున్న ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గణేష్ను చంపాలని సోమేష్ నిర్ణయించుకున్నాడు. దీనికి గరిడేపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తన స్నేహితుడు పగిల్ల ఉదయ్కిరణ్ సాయం తీసుకున్నాడు. గణేష్ హత్యకు సోమేష్ పథకం వేస్తున్న విషయం తెలిసినప్పటికీ సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతి మిన్నకుండిపోయారు. ఈ నెల 15న రాత్రి పథకం ప్రకారం సోమేష్.. గణేష్ను గణపవరానికి సమీపంలో ఉన్న మామిడి తోట వద్దకు పిలిచాడు. ఫొటోల విషయంలో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అక్కడే ఉన్న సోమేష్ స్నేహితుడు ఉదయ్కిరణ్ సాయంతో గణేష్పై రాయితో దాడి చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. సంఘటన స్థలం నుంచి కత్తి, మొబైల్ ఫోన్లు ఇతర ఆధారాలను సేకరించినట్లు డీఎస్పీ తెలిపారు. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీంను ఏర్పాటు చేసి సీసీ పుటేజీలు, మొబైల్ లొకేషన్లు పరిశీలించి నిందితులైన పగిళ్ల ఉదయ్కిరణ్, ప్రధాన నిందితుడైన సోమేష్ తల్లిదండ్రులు బర్రెంకుల సాంబయ్య–జ్యోతిలను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్క పంపినట్లు ఆయన వెల్లడించారు. సోమేష్ పరారీలో ఉన్నాడని, అతన్ని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో కోదాడ రూరల్ ఇన్చార్జీ సీఐ రామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్ఐ గోపాల్రెడ్డి, మేళ్లచెరువు ఎస్ఐ నవీన్కుమార్, చింతలపాలెం ఎస్ఐ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాక్లో ‘బొద్దింకల’ తుఫాన్
ఇస్లామాబాద్: భారత్లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.పాకిస్థాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.లోగోలు,బ్రాండింగ్పాకిస్థాన్లోని ఈ అకౌంట్ లోగోలు భారతీయ వెర్షన్లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.యువతలో ప్రభావంఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ యువత కూడా ఆకర్షితులవుతున్నారు. -
ఉద్యోగం పోయినా సంబరమే..!
ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళన చెందుతారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.అమెరికాలోని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ మెటాలో నాలుగేళ్లుగా పనిచేసిన ఆశా రావల్ అనే యువతి ఇటీవల లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి సమయంలో బాధపడాల్సిందిపోయి.. ఆమె మాత్రం సంతోషంతో తన మనసులోని మాట బయటపెట్టింది.పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠ అన్నీ ఉన్నా.. ప్రతిరోజూ ఒకేలా జరిగే సమావేశాలు, గంటల కొద్దీ కూర్చుని పత్రాలు తయారు చేయడం విసుగు తెప్పించాయి. బయటికి మంచి జీవితం కనిపించినా.. లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపిందామె. ఒకానొక టైంలో.. మెకానికల్ వర్క్తో లోలోపల తాను చనిపోయినట్లు ఫీలయ్యేదానిని.. ఆ బాధతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే.. View this post on Instagram A post shared by Asha | Maximalist Fashion (@ashamode_)ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన.. సృజనాత్మక(క్రియేటివిటీ) పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది.ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలను బయటపెట్టినట్టయ్యాయి. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతుండగా.. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.“డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో ఆ చర్చ నడుస్తోంది. -
ఇలాంటిదేదో జరుగుద్దని ముందే ఊహించాం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో గతవారం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ‘ఎక్స్’ఖాతాను ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. అయితే గంటల వ్యవధిలో ఆ పార్టీ ‘కాక్రోచెస్ డోంట్ డై’ట్యాగ్లైన్తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట మరోఖాతాను సృష్టించుకుంది. తమ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, నిలిపివేస్తారని కూడా ముందే ఊహించామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెప్పారు. ఇది ప్రభుత్వం తనకు తాను చేసుకున్న తప్పిదం అని పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా పోరాడుతామని వెల్లడించారు. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరుతో ‘ఎక్స్’లో కొత్త ఖాతా ప్రారంభించామని తెలిపారు. తమ ఖాతా, ఉద్యమం వేగంగా జనంలోకి చొచ్చుకెళ్తున్నాయని స్పష్టంచేశారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఖాతా ప్రారంభం కాగా.. మళ్లీ ఫాలోవర్స్ విషయంలో దూసుకుపోతోంది. అందుకే తప్పుడు ప్రచారంతమ ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఖాతాను నిలిపివేసిందని అభిజిత్ దీప్కే విమర్శించారు. అంతేకాదు.. సీజేపీ విషయంలో జరుగుతున్న ప్రచారంపైనా ఆయనో క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి ఇస్లాం ప్రభావిత దేశాల నుంచే దానికి ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారని, ఫేక్.. బోట్(కంప్యూటర్ ఆపరేటెడ్) అకౌంట్లు ఉన్నాయని(కొందరు వీడియోలు పెట్టారు.. అవి ఫేక్ అని అభిజిత్ అంటున్నారు).. జనతా కాక్రోచ్ పార్టీ ప్రొపగాండ క్యాంపెయిన్ అని, తాను ఆప్ ఏజెంట్నని(అభిజిత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పని చేశారు), దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఇది ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే విదేశీ కుట్ర వ్యవహారమంటూ జరుగుతున్న ప్రచారాలన్నింటినీ ఆయన ఖండించారు. ఒకవైపు నిరుద్యోగ యువత ఈ ఉద్యమంలో చేతులు కలుపుతుంటే.. పనికిమాలిన వాళ్లే అలాంటి ప్రచారాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చాడు. I know you are desperately trying to hack the account but since you have failed to do so. Let me share the real data.Why would you call 94% of Indian youth as Pakistanis? https://t.co/547NtEP934 pic.twitter.com/9DRTx6l96e— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇన్స్టాగ్రామ్లో 18 మిలియన్లు క్రాస్ఉపాధి, ఉద్యోగాలు లేని యువత పరాన్నజీవులు, బొద్దింకల మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఓ కేసు విచారణ సందర్భంగా ఆక్షేపించారు. దీనిపై నిరసన వ్యక్తంచేస్తూ అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించారు. నిజానికి ఇదొక వ్యంగ్య డిజిటల్ పార్టీ. సోషల్ మీడియాలో యువత విపరీతంగా ఆకర్షితులయ్యారు. సామాజిక కార్యకర్తలు, కళాకారులు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. పలు రాజకీయ పార్టీ నేతలు, మేధావులు కూడా అండగా నిలిచారు. పార్టీ ‘ఎక్స్’ఖాతాకు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో చేరింది. ఇన్స్టా్రగామ్లో అనుసరించేవారి సంఖ్య 18 మిలియన్లు దాటేసింది. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న కాంగ్రెస్, రెండో స్థానంలో ఉన్న బీజేపీలను సీజేపీ అధిగమించినట్లైంది. కాక్రోచ్ జనతా పార్టీ పదునైన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యానం ద్వారా ఆదరణ పొందుతోంది. సమకాలీన అంశాలపై చర్చ.. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీక్లు, విద్యా వ్యవస్థ తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తోంది. అందుకే దీనికి దేశద్రోహి, ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి తిట్టి పోస్తున్నారు. అయితే వాళ్లకు స్వయంగా అభిజిత్ కౌంటర్ ఇస్తుండడం గమనార్హం. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పారీ్టకి సంబంధించిన తొలి ‘ఎక్స్’ఖాతా గురువారం నుంచి నిలిచిపోవడం.. కాసేపటికే కొత్త అకౌంట్ ప్రత్యక్షం కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ‘ఎక్స్’లో ద కాక్రోచ్ యూత్, కాక్రోచ్ న్యూస్, ఐయామ్ కాక్రోచ్, కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా, కాక్రోచ్ జనతా పారీ్ట(జెన్ జెడ్) పేరిట ఖాతాలు చురుగ్గా పని చేస్తున్నాయి. -
ప్రశ్నించే వారికి సంకెళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సోషల్ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్షిప్ విధిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఎవరైనా అమరావతిలో జరుగుతున్న స్కామ్లు చూపిస్తే, జీవోలు చూపిస్తే.. చదరపు అడుగుకు రూ.20,427లా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినా, తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించినా, మహిళలపై అఘాయిత్యాల మీద, టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కంటెంట్ కన్పించకుండా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై వారి పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఏకంగా కుప్పంలో కేసులు పెట్టిస్తాడు. ఎఫ్ఆర్ఐ నమోదు చేస్తారు. సోషల్ మీడియా పోస్టులను ఆ సీఐ ఎక్స్ (ట్విటర్)కు, ఫేస్బుక్, యూ ట్యూబ్ హెడ్క్వార్టర్కు పంపిస్తాడు. ఆ వీడియోలు డిలీట్ చేయమని చెబుతారు. ఎక్కడో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఎక్స్ యాజమాన్యానికి కుప్పం ఇన్స్పెక్టర్ రాసిన లేఖను చూస్తే ఎవరికైనా పోలీసులు ఎలా తయారయ్యారో అర్థమవుతుంది’ అని తెలిపారు.పోలీసులు ఎక్కడ?రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ డ్యూటీ కన్పించడం లేదని, ఏ కాలేజ్లో చూసినా గంజాయి కన్పిస్తుందని.. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కన్పించరు. ప్రతి ఐదు లిక్కర్ బాటిల్స్లో ఒక బాటిల్æ కల్తీ అయినా పోలీసులు పట్టించుకోరు. ఏ బెల్టు షాపు దగ్గరా పోలీసులు కన్పించరు. పోలీసులు చేసేది ఏమిటో తెలుసా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే తప్పుడు కేసులు పెట్టడం, ఆ కేసుల కోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఆ కేసుల్లో అమాయకుల్ని ఇరికించి జైలుకు పంపేందుకు తాపత్రయ పడడం. రాష్ట్రంలో పరిపాలన (గవర్నెన్స్) అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. పోలీసుల ప్రాథమిక బాధ్యతలన్నీ (బేసిక్ రెస్పాన్స్బిలిటీస్) మరిచిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో దిశ అనే యాప్ను తీసుకొచ్చి, ఏ ఆడపిల్లకైనా, ఎలాంటి వేధింపులు జరిగినా సరే.. ఫోన్ చేసిన 10 నిముషాల్లో పోలీసులు పోయేవాళ్లన్నారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసులు.. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో స్పందించే వారని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరూ పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. -
వైట్ డ్రెస్లో మౌనీ రాయ్.. స్పెయిన్ వీధుల్లో ఆషిక..!
కర్రసాము చేస్తోన్న సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి ..వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ అందాలు..స్పెయిన్ వీధుల్లో ఆషిక రంగనాథ్ చిల్.. ఎల్లో శారీలో బిగ్బాస్ రీతూ చౌదరి అందాలు.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ : ఎవరీ అభిజీత్?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’ (Cockroach Janta Party - CJP) గురించే చర్చ నడుస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే వేగంగా దూసుకుపోతున్న ఈ సరికొత్త వ్యంగ్య (Satirical) ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వైరల్ ట్రెండ్ వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు తెలుసా?భారతదేశ యువతను అనూహ్యంగా ఆకట్టుకున్న సీజేపీ వెనుక ఉన్న ఆ సంచలనం పేరు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke). ఉద్యోగాలు లేక, సమాజంలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియా, ఆర్టీఐ (RTI) యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడి చేసే కొంతమంది నిరుద్యోగ యువతను "బొద్దింకలు" (Cockroaches), "సమాజానికి పట్టిన పరాన్నజీవులు" (Parasites) అన్న భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆన్లైన్లో ప్రతిస్పందనగా 30 ఏళ్ల ఈ రాజకీయ ప్రచార వ్యూహకర్త, అభిజీత్ ప్రారంభించిందే కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ఇప్పుడు సునామీలా మారింది. ఆపై సీజేఐ వివరణ ఇచ్చుకున్నప్పటికీ .. ‘బొద్దింక’ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకున్నారు అభిజీత్.యువతను అవమానించిన ఆ పదంతోనే సరికొత్త వ్యంగ్య రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు. ఫలితంగా సీజేపీ పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ వెబ్ సైట్ అండ్ అజెండా తమను తాను "సోమరులు, నిరుద్యోగ యువత పక్షపాతి" (Voice of the lazy and unemployed youth) గా ప్రకటించుకుంది. 'Secular, Socialist, Democratic, and Lazy' అనే ట్యాగ్లైన్తో నడుస్తున్న ఈ డిజిటల్ పార్టీకి కేవలం ఐదు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 12 మిలియన్ల (1.2 కోట్లు) కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. దీని ఆవిర్భావం కేవలం జోక్ కాదు.. యువత ఆక్రోశం! ఇంటర్నెట్ జోక్ లాగా మొదలైనప్పటికీ, దేశంలోని నిరుద్యోగం, నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల కుంభకోణాలపై యువతలో ఉన్న అసంతృప్తిని ఈ వేదిక ప్రతిబింబిస్తోంది.పార్టీలో చేరడానికి వింత నియమాలు:కచ్చితంగా నిరుద్యోగి అయి ఉండాలి (బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా). విపరీతమైన సోమరితనం ఉండాలి (శారీరక శ్రమ పరంగా మాత్రమే). రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లోనే గడపాలి (Chronically Online). ప్రొఫెషనల్గా, లాజికల్గా వ్యవస్థపై విమర్శలు (Rant) గుప్పించగలిగే నైపుణ్యం ఉండాలి. ఇంతకీ ఎవరీ అభిజీత్ దిప్కే?పూణేలో జర్నలిజం చదివిన అభిజీత్, ఆ తర్వాత అమెరికాలోని ప్రముఖ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ (PR) లో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన నిరుద్యోగి.Now attempts being made to hack Instagram pic.twitter.com/doFskK9D7Z— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఆమ్ ఆద్మీ నేపథ్యం సీజేపీని ప్రారంభించడానికి ముందు, దీప్కే 2020 - 2023 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశారు. సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించినప్పుడు, దీప్కే రాజకీయ సందేశాలు మరియు యువతను చేరుకోవడంపై దృష్టి సారించిన మీమ్-ఆధారిత డిజిటల్ ప్రచారంపై పనిచేశారు.2024లో తన వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం కోసం ఆప్ నుండి బయటకు వచ్చి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మేనిఫెస్టోకేవలం మీమ్స్ కే పరిమితం కాకుండా 5 అంశాలతో కూడిన ఒక మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. జడ్జీలకు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సీట్లు వంటి రాజకీయ ప్రయోజనాలు కల్పించకూడదు.పార్టీ ఫిరాయింపులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.తాము కూడా ఆర్టీఐ (RTI) పరిధిలోకి వస్తామని, ఎలాంటి అజ్ఞాత విరాళాలు (Electoral Bonds) తీసుకోబోమని స్పష్టం చేయడం. మహువా మోయిత్రా, ప్రశాంత్ భూషణ్ వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. సంప్రదాయ రాజకీయాల్లో డబ్బు, అంగబలం ఉన్నవారే రాజ్యమేలుతున్న తరుణంలో.. ఈ జెన్ జెడ్ (Gen Z) యువత కేవలం మీమ్స్, రీల్స్ ద్వారా డిజిటల్ విప్లవాన్ని సృష్టిస్తూ దేశంలోనే సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026ఇంతలోనే భారీ షాక్మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. మే 16న ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ' ఖాతా ఇ వలం 4 రోజుల్లోనే, ఆ ఖాతాకు 2 లక్షలకు పైగా ఫాలోవర్లు చేరడంతో అది నిషేధించబడింది అంటూ అభిజీత్ ట్వీట్ చేశారు. ఊహించినట్టే, ' కాక్రోచ్ జనతా పార్టీని ఇండియాలో నిలిపివేశారని పేర్కొన్నారు. -
సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్న చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్ను డైవర్ట్ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు.సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టా లాంటి హెడ్ క్వార్టర్స్కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి.ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆడలేక మద్దెల ఓడు చందంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు!
ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుకు సోషల్ మీడియా భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలకు సమాధానాలివ్వలేక ప్రశ్నించే వారిని అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పోలీసు వ్యవస్థ కూడా రెడ్బుక్ అరాచకాలకు అలవాటు పడిపోయి అదే పనిలో ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్ల ప్రకటనల్లోని డొల్లతనాన్ని, గతంలో చేసినదాని కంటే భిన్నంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ఎత్తి చూపుతోంది. దీంతో కూటమి సర్కారు గంగవెర్రులెత్తుతోంది. ఎల్లోమీడియా సాయంతో కొద్దోగొప్పో సానుకూల ప్రచారం చేసుకుంటున్నా.. సోషల్ మీడియా ధాటిని మాత్రం తట్టుకోలేకపోతోంది. మామూలుగానైతే సోషల్ మీడియాలో ఏదైనా అభ్యంతరకర పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు వస్తే చర్యలు తీసుకుంటూంటారు కానీ... ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలను తొలగించేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులే రంగంలోకి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి పోస్టుల తొలగింపు కోసం పోలీసులు స్వయంగా గూగుల్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలకు లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. పోస్టుల వల్ల ఇబ్బంది పడ్డవారు లేదా సంస్థలు కోర్టు ఆదేశాల ద్వారా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూంటాయి కానీ.. అంత ప్రాసెస్ ఎందుకు అనుకున్నారేమో తెలియదు కాని, పోలీసులు తమ అధికార బలం ప్రయోగిస్తున్నారట. పోలీసులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫేస్బుక్ తదితర వేదికలు స్పందిస్తున్నాయట. ఒకవైపు కేసులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను భయపెట్టాలని చూడడం, మరో వైపు పోలీసులు సాయంతో పోస్టులు తొలగించేయడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం పోలీసుల దుశ్చర్యలపై పోరాటాలు చేస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు రీసర్వే, 30 వేల మంది మహిళల మిస్సింగ్ వంటి అనేక అంశాలపై అసత్యాలు ప్రచారం చేశారు. టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా ఆకాశమే హద్దుగా అబద్ధాలు సృష్టించింది. వదంతులు ప్రచారం చేసింది. అయినా అప్పట్లో వారిపై ఈ తరహా కేసులు రాలేదు. కాని కూటమి అధికారంలోకి రాగానే సోషల్ మీడియాపై తమ పెత్తనం చెలాయించే పని మొదలుపెట్టారు. సోషల్ మీడియా విమర్శలకు కూటమి సర్కారు ఎందుకు జంకుతోందో తెలుసుకోవడం ఆసక్తికరం. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను హైదరాబాద్లోని వారి స్వగృహాల్లో కలిశారు. ఇది జరగడానికి కొద్ది రోజుల ముందే మంత్రి లోకేశ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో తరిమేశారని, అప్పుడు చంద్రబాబు ఏపీకి వచ్చి ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడపడాన్ని ఆరంభించారని వ్యాఖ్యానించారు. దీంతో సోషల్ మీడియాలో ప్రశ్నల పరంపర మొదలైంది. ‘‘చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి కదా విజయవాడ వెళ్లిపోయింది’’ అని వ్యాఖ్యానించారు. అంతేకాక ప్రధాని ఏపీ పాలకులను అమరావతిలో కదా.. కలవాల్సింది? హైదరాబాద్లో ఎందుకు కలిశారు? అని ప్రశ్నించారు. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు మంత్రుల కుటుంబాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నాయని, వీరు చుట్టపుచూపుగా వారం వారం అమరావతి వచ్చిపోతున్నారని వెళుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఫ్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇదే పాయింట్ ఎత్తిచూపి ఎద్దేవ చేశారు. అంతేకాక 2018లో బీజేపీతో విడిపోయాక చంద్రబాబు, మోడీలు పరస్పరం ఎంత తీవ్రమైన విమర్శలు చేసుకుందీ.. చివరికి వ్యక్తిగతంగా కుటుంబ ప్రస్తావనలు తెచ్చింది కూడా సోషల్ మీడియా గుర్తు చేసింది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఈవిఎమ్ల ట్యాంపరింగ్ జరిగిందని, దమ్ముంటే ఎవరైనా చర్చకు రావచ్చని గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్ సవాల్ చేస్తున్నారు. ఎల్లో మీడియా ఈ వార్తలను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం పరకాల చేసిన వ్యాఖ్యలను ఖండించ లేకపోతోంది. దీనిని ప్రస్తావిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఒక ప్రశ్న సంధించారు. పరకాల ఇన్ని ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం కేసు కూడా పెట్టలేకపోయిందని, దీనిని బట్టి ఆ ఆరోపణలలో వాస్తవం ఉందని అనుకోవల్సి వస్తుందని అన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాల్ దుర్గ అని కోల్కతాలోనే అభివర్ణించారు. మోడీని ఢిల్లీ మహిషాసురుడిగా పోల్చుతూ ఆమె చేతిలో చిత్తు అవుతారని చంద్రబాబు ప్రసంగించారు. అదే చంద్రబాబు ఈసారి బీజేపీ గెలిచిన సందర్భంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. అక్కడ ప్రధాని మోడీకి నమస్కరిస్తున్న తీరుపై వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి.మంత్రి లోకేశ్కు మద్దతుగా 99 పైసలకే పరిశ్రమలకు భూములు కేటాయించడం గేమ్ ఛేంజర్ అని చంద్రబాబు అనగానే ఇతర రాష్ట్రాలలో అవే పరిశ్రమలు వందల కోట్లు ఖర్చు చేసి భూములు ఎలా కొనుగోలు చేస్తున్నది వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయడానికి చంద్రబాబు సర్కార్ కూడా నిర్ణయం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ తదితరులు ఆంగ్ల మీడియంపై ఎలాంటి విమర్శలు చేసింది వివరించే పేపర్ క్లిపింగ్గులు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపించాయి. ఇవే కాదు..చంద్రబాబు ఆయా సందర్భాలలో చేసిన చిత్ర, విచిత్రమైన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. సహజంగానే ఇలాంటివి చంద్రబాబు టీమ్కు ఇబ్బంది కలిగిస్తూంటాయి. తమ పరువుకు భంగం కలుగుతోందని, ప్రభుత్వ పరపతి దెబ్బతింటోందని భావిస్తాయి. ఇదీ నేపథ్యం.. ఎలాగైనా సోషల్ మీడియాను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని, ఇది భావ ప్రకటన స్వేచ్చకు విరుద్ధమని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన చేస్తూ టీడీపీ మద్దతుదారులు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే పోలీసులు శరవేగంగా స్పందించడం పరిపాటై పోయిందన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్ ) తొలగించాలని, వారి అక్కౌంట్లను బ్లాక్, లేదా సస్పెండ్ చేయాలని పోలీసులే సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లకు నోటీసులు పంపుతున్నారని జగన్ అన్నారు. ఇది సోషల్ మీడియాపై వ్యవస్థీకృతంగా సెన్సార్ షిప్ విధించడమేనని విమర్శించారు. జగన్ ఆరోపణలపై ప్రభుత్వం, పోలీసుల నుంచి కాని ఎలాంటి సమాధానం రాలేదు. కొద్ది రోజుల క్రితం మాజీ ఆడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి, మాజీ మంత్రి కన్నబాబులు కూడా పలు ఉదాహరణలు ఇస్తూ పోలీసులు అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధిస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు ప్రెస్ కాన్ఫరెన్స్ లలో మాట్లాడిన విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తొలగించాలని పోలీసులు లేఖలు రాశారట.ఇ దంతా కొత్త ట్రెండ్. గతంలో రాజకీయ విమర్శలపై ఇలా ప్రభుత్వాలు వ్యవహరించలేదు.మహా అయితే వారి వాదన చెబుతారు. ఖండనలు ఇస్తారు. అవేమీ ఇవ్వకుండా వీడియోలు తొలగించే పనిలో పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ప్రభుత్వం ఎంత భయపడుతోందో అర్థం అవుతోంది. ఇవన్ని చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే మీరేమన్నా చేసుకోండి..మా మొండి వైఖరి మాదే..మా రెడ్బుక్ రాజ్యాంగం మాదే.. ఏమైనా మా తప్పులను ప్రశ్నిస్తే ఊరుకోం..అన్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుండడం అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటికి మారేనో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా సీజేపీ!
మే 2026.. భారత్లో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. పార్టీ పెట్టి వారం తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనాలు సృష్టిస్తోంది. ఏకంగా బీజేపీ లాంటి దిగ్గజ పార్టీని మించిపోయి.. కురువృద్ధ పార్టీ కాంగ్రెస్ను సైతం పక్కకు నెట్టేసే దిశగా దూసుకుపోతోంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. అతిపెద్ద పార్టీగా ఎదగడానికి సిద్ధమైంది.సీజేపీ.. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రస్తుతానికి రాజకీయ పార్టీ కాదు. కేవలం వ్యంగ్య ఉద్యమం(సెటైర్) అని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్లకు చెప్పనక్కర్లేదు. కానీ, డిజిటల్ ఫ్లాట్ఫారమ్లలో గత నాలుగైదు రోజులుగా మామూలు సత్తా చాటడడం లేదు. ముఖ్యంగా జెన్ జీ యువత ఆదరణ, మద్దతుతో దూసుకుపోతోంది. సో.మీ. ఫాలోవర్స్ విషయంలో బీజేపీని ఇప్పటికే దాటేసింది సీజేపీ. ఆ విషయాన్ని కూడా అంతే వెటకారంగా ప్రకటించుకుంది. ప్రస్తుతానికి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఉంది. సీజేపీ దూకుడు చూస్తుంటే.. రేపో, మాపో ఆ ఫిగర్ను దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే ఆన్లైన్లో ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పార్టీ(నాన్ పొలిటికల్)గా సీజేపీ నిలవనుంది.World’s largest party they said🤭 pic.twitter.com/dT9TOFKZoZ— Cockroach Janta Party (@CJP_2029) May 20, 2026అలా పుట్టింది..మే 15, 2026న సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్గా మారాయి. కొంతమంది యువకులు బొద్దింకల్లాంటివాళ్లు.. అని ఆయన చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని రగిల్చాయి. పెద్ద సంఖ్యలో యువత దీన్ని అవమానకరంగా భావించి వ్యంగ్యరూపంలో ప్రతిస్పందించారు. అలాంటి వాళ్లలో అభిజీత్ దిప్కే ఒకడు. ఈ ఒక్కడే ఈ పెను సంచలనానికి కేంద్ర బిందువయ్యాడు.మహారాష్ట్రలో పుట్టి, పుణేలో జర్నలిజం చదివిన అభిజిత్.. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆప్ వలంటీర్గా పనిచేసిన అనుభవం ఆయనకు డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్లో ప్రత్యేక నైపుణ్యం ఇచ్చింది. ఆ నైపుణ్యంతో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సెటైరిక్ పేజీని ప్రారంభించాడు.సీజేఐ వివరణ.. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. దీంతో యువతపై తాను చేసిన వ్యాఖ్యలను పొరపాటుగా మీడియా చూపించిందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చారు. ఫేక్ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చినవాళ్లను మాత్రమే ఉద్దేశించి తాను అలా అన్నానని ఆయన చెప్పారు. భారత యువతపై తాను ఎలాంటి విమర్శ చేయలేదని.. పైగా వాళ్లను చూసి గర్వపడుతున్నానని.. వాళ్లే దేశాభివృద్ధికి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. అయితే.. అప్పటికే సీజేపీ జోరు మొదలైంది.మేము సైతం.. మే 16న గూగుల్ ఫారమ్ ద్వారా అభిజిత్ సీజేపీ సభ్యత్వం ప్రారంభించాడు. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే నినాదం ఇచ్చాడు. “సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ” అనే వ్యంగ్య సిద్ధాంతాలతో పార్టీ ముందుకు సాగుతోందని ప్రకటించాడు. అప్పటికే సీజేఐ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా.. పెద్ద సంఖ్యలో యువత మాత్రం వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపేలా ‘‘మేము కూడా కాక్రోచులమే’ అంటూ ఫాలో బటన్ను క్లిక్ చేస్తూ, సభ్యత్వం తీసుకుంటూ తమ అసంతృప్తిని డిజిటల్ వేదికలపై భారీగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.అలా.. మే 17–20 మధ్య జస్ట్ నాలుగురోజుల్లోనే వెబ్ పేజీకి నాలుగు లక్షలకు పైగా సభ్యులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో 9 మిలియన్ ఫాలోవర్లు వచ్చి చేరారు. తద్వారా ఆప్, బీజేపీ పార్టీలను చాలా దూరం నెట్టేశారు. సీజేపీ జోరు చూస్తుంటే కాంగ్రెస్ను కూడా దాటేందుకు ఎంతో సమయం పట్టేలా కనిపించడం లేదు. అలాగని ఇది పూర్తి సెటైరిక్ మూమెంట్గా ఉండిపోలేదు. అర్థవంతమైన చర్చలు, సమకాలీన అంశాలపై మేధావులతో డిబేట్లు, అభిప్రాయ సేకరణ.. ఇలా ఈ ఉద్యమం ప్రత్యేకంగా నిలిచింది. మా లక్ష్యం ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, ఉద్యోగ సమస్యలు, పరీక్షల మోసాలు, యువత నిరాశ వంటి అంశాలను వ్యంగ్యరూపంలో వెలుగులోకి తేవడమే. ఇది యువతను అవమానపరిచిన వ్యాఖ్యకు ప్రతిస్పందన. మేము కాక్రోచులం అనే గుర్తింపుని స్వీకరిస్తున్నాం. ఎందుకంటే దేశ వ్యవస్థ అంతగా కుళ్లిపోయింది కాబట్టి. ఆ కుళ్లులోనే కాక్రోచులు బయటకు రావాల్సి వస్తోంది. ఇది సెటైరిక్ ఉద్యమం కావొచ్చు. అలాగని ఇదేం జోక్ కాదు. దేశంలో ఉన్న కోట్లాది మంది నిరుద్యోగుల గొంతుకంగా మారింది అని చెబుతున్నాడు. అయితే నేపాల్, బంగ్లాదేశ్లా జెన్జీ ఉద్యమానికి ఇది దారి తీస్తుందా? అనే ప్రశ్నకు ఆయన నుంచి నో అనే సమాధానమే వచ్చింది. FYI pic.twitter.com/XCkclwy50K— Cockroach Janta Party (@CJP_2029) May 19, 2026👉సీజేఐ ఏమన్నారంటే.. కొంత మంది బొద్దింకల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాల్లేని యువత.. సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి, వ్యవస్థపై దాడి చేస్తున్నారు. 👉సీజేఐ వ్యాఖ్యల్ని సమర్థించిన వర్గాలు: బొద్దింకలతో పోల్చడం అంటే.. యువతలోని సహనశక్తి, ఎక్కడైనా బతికే సామర్థ్యం ఉంది.👉విమర్శించిన వర్గాలు: మేం కాక్రోచ్లమే అంటూ వెటకారంగా స్పందించినా.. నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోంది ఆ పేజీ ఫాలోయింగ్. పైగా ఆ ప్లాట్ఫారమ్లలో జరుగుతున్న డిబేట్లలో కామెంట్ల రూపంలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు👉రాజకీయ విశ్లేషకులు: ఇది ఒక “సోషల్ మీడియా విప్లవం”. నిరుద్యోగ యువత అసంతృప్తిని వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తున్నారు.👉ప్రతిపక్ష నేతలు: భారతీయ యువతలోని నిరాశను ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఉద్యోగాలపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది👉ప్రభుత్వ అనుకూల వర్గాలు: ఇది కేవలం వ్యంగ్య ఉద్యమం మాత్రమే, నిజమైన రాజకీయ శక్తిగా మారడం కష్టంఅభిజిత్ ఎన్ని వివరణలు ఇస్తున్నప్పటికీ.. వ్యంగ్య ఉద్యమం నుంచి డిజిటల్ విప్లవంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ జెన్జీ మద్దతుతో ఏదైనా పెను ఉద్యమానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -
గాజా ఫ్లోటిల్లా ఘటన.. ఇజ్రాయెల్ కేబినెట్లో చిచ్చు
గాజా ఫ్లోటిల్లా ఘటనపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న బృందాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ బెన్-గ్విర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దుమారం మొదలైంది. సుమారు 40 దేశాల నుంచి 50 ఫ్లోటిల్లా(చిన్నపాటి నౌకలు)ల్లో గాజాకు సాయం అందించేందుకు బయల్దేరాయి. అయితే వాటిని అడ్డుకుని మరీ ఇజ్రాయెల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి, చేతులు వెనుకకు కట్టి ఉంచారు. ఆ సమయంలో ఒక మహిళ "ఫ్రీ, ఫ్రీ పాలస్తీన్" అని నినదించగా, పోలీసులు ఆమెను బలవంతంగా నేలపై తోసిన దృశ్యాలు కనిపించాయి. మే 20న ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ వీడియోను షేర్ చేసిన బెన్-గ్విర్ ఆ కార్యకర్తలను ఎగతాళి చేస్తూ, "వీరంతా హీరోలుగా వచ్చారు.. ఇప్పుడు చూడండి వీరి పరిస్థితి" అని వ్యాఖ్యానించారు. వాళ్లను ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారిలోని కెట్జియోట్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ככה אנחנו מקבלים את תומכי הטרורWelcome to Israel 🇮🇱 pic.twitter.com/7Hf8cAg7fC— איתמר בן גביר (@itamarbengvir) May 20, 2026ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ను ఒక సాధారణ భద్రతా చర్యగా చెబుతున్నప్పటికీ.. పెద్ద దౌత్య సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. అందులో ఇటలీ పౌరులు కూడా ఉన్నారని.. వాళ్లను అవమానకర పరిస్థితుల్లో ఉంచడం ఎంతమాత్రం అంగీకరించలేనిదని అన్నారు. తక్షణమే ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పాలని.. నిర్బంధిత ఇటాలియన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జలాల్లో పౌరులను అరెస్టు చేయడానికి ఇజ్రాయెల్కు ఏ హక్కు ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్ ప్రశ్నిస్తున్నారు. టర్కీ కూడా తమ పౌరుల విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇటు.. ఈ వీడియో ఇజ్రాయెల్ కేబినెట్లోనే చిచ్చు రాజేసింది. బెన్-గ్విర్ చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విదేశాంగ మంత్రి గిదియోన్ సర్ విమర్శించారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా ఫ్లోటిల్లాను అడ్డుకోవడం ఇజ్రాయెల్ హక్కు అని చెప్పినా, వీడియోలో కనిపించిన ప్రవర్తన "ఇజ్రాయెల్ విలువలకు విరుద్ధం" అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనతో మరోసారి గాజాలోని మానవతా సంక్షోభం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం కారణంగా ఎక్కువ మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి శిబిరాల్లో, తాత్కాలిక ఆశ్రయాల్లో జీవిస్తున్నారు. సహాయక సంస్థలు అందిస్తున్న సరఫరాలు అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తాము సహాయం అడ్డుకోవడం లేదని, సరఫరాలు పర్యవేక్షణలో గాజాకు చేరుతున్నాయని వాదిస్తోంది. అయితే తాజా ఫ్లోటిల్లా ఘటనతో ఇజ్రాయెల్ ముసుగు తొలగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఒకే ఒక్క వారం పాలన.. వెయ్యి ఏళ్ల గొప్పలు
అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. హద్దు మీరితే అభిమానమే కాదు, అభిమాని కూడా అవమానాల పాలవుతాడు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన సి.జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం ఒక వారం మాత్రమే అయింది. అయితే, ఈ కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో నకిలీ రాజకీయ కథనాలు, అతిశయోక్తులు అభిమానుల నుంచి విస్తృతంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విజయ్ టీవీకే ప్రభుత్వాన్ని చారిత్రక విప్లవం, అపూర్వమైన మార్పులు తీసుకొస్తున్న ఫ్యాక్టరీగా చూపించే ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏమిటి? అనేక క్లెయిములు అతిశయోక్తి, తప్పుదారి పట్టించేవి లేదా పూర్తిగా తప్పుడు సమాచారమే. ఈ నేపథ్యంలో, నిజాలను.. వాస్తవాలను వేరు చేసి చేద్దాం..టీవీకే 108 సీట్లు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియా వైరల్ పోస్టులతో నిండిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చాలా ప్రచారాలు టీవీకే లేదా ప్రభుత్వం అధికారిక ఖాతాల నుంచి రావడం లేదు. ఇన్ఫ్లూయెన్సర్లు, అజ్ఞాత హ్యాండిల్స్, ఫ్యాన్ పేజీలు, యూట్యూబ్ చానళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా వీటిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముందుగా ఒక ముఖ్యమైన క్లెయిమ్తో మొదలు పెడదాం. అప్పుడే సామాజిక విప్లవాన్ని సృష్టించారా? ఎన్నికల తర్వాత టీవీకే సామాజిక విప్లవం సృష్టించిందని, సాధారణ నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులను బరిలోకి దించిందని వైరల్ అయింది. కొందరు 5 మంది గెలిచారని, మరికొందరు 20 నుంచి 28 మంది వరకు బరిలో ఉన్నారని చెప్పారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక డేటా ప్రకారం, టీవీకే సాధారణ నియోజకవర్గంలో కేవలం ఒక్క షెడ్యూల్డ్ కుల అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించింది. అతను కూడా ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో సాధారణ సీటు నుంచి గెలిచిన ఏకైక షెడ్యూల్డ్ కులాల అభ్యర్థి కాంగ్రెస్కు చెందిన మధురై విశ్వనాథన్. తర్వాత వచ్చింది ఓ పిచ్చి ప్రచారం. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పేదరికం, కష్టాలు, టీ స్టాల్, ఆటో డ్రైవర్ బ్యాక్గ్రౌండ్లను చూపించి ప్రచారం చేశారు. విశ్వసనీయతను దెబ్బతీసేలా.. విజయ్ కూడా “పేదరికం, ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు” అని వ్యాఖ్యానించారు. నిజానికి ఓ రాజకీయ పార్టీకి ఇటువంటి ప్రచారం గౌరవనీయమే. కానీ ఎన్నికల అఫిడవిట్లు వేరే కథ చెబుతున్నాయి. అనేక మంది శాసనసభ్యులు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ వాహనాలు, ప్రీమియం ఆస్తులను డిక్లేర్ చేశారు. పేద సామాన్య నాయకుడిగా బ్రాండింగ్ చేసుకుని, కోటీశ్వరులుగా అఫిడవిట్లు దాఖలు చేయడం విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.ఈ సంఖ్యలన్నీ కలిపితే 126.. టీవీకేకి 107 మందే ఇక్కడ టీవీకే అభ్యర్ధుల అర్హతల విషయంలో కూడా గందరగోళం నెలకొంది. కొందరు ఎమ్మెల్యేలు తమను ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుగా పరిచయం చేసుకున్నారు. కానీ వారి అఫిడవిట్లలో భిన్నమైన అర్హతలు ఉన్నాయి. ఇదే నేపధ్యంలో ఓ వైరల్ స్టాటిస్టిక్ హాస్యాస్పదంగా మారింది. టీవీకే 108 ఎమ్మెల్యేలలో ఆరుగురు PhDలు, 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, అయిదుగురు IIT ఇంజనీర్లు, ఎనిమిది మంది డాక్టర్లు, 40 మంది లాయర్లు-ఇంజనీర్లు మొదలైన వివరాలు ఇచ్చి పోస్టు వైరల్ అయింది. కానీ ఈ సంఖ్యలన్నీ కలిపితే 126 వస్తుంది. వాస్తవానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రా? ఇదంతా పక్కన పెడితే ఓ అతి పెద్ద నకిలీ కథనం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ‘విజయ్ యుగం’లోకి అడుగుపెట్టిందనేది. విజయ్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని వార్త సారాంశం. రాష్ట్రానికి మొదటి మహిళా మంత్రిని విజయ్ ఇచ్చారని చెప్పడం పూర్తి అబద్ధం. ఉదాహరణకు జయలలిత, జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి మహిళా మంత్రులు కూడా ఉన్నారు. అలాగే, షెడ్యూల్డ్ కులాల మంత్రికి ముఖ్య పోర్ట్ఫోలియో ఇచ్చిన మొదటి సారి అనడం కూడా తప్పు. కక్కన్, పరితి, పొన్ముడి వంటి నాయకులు ఇంతకు ముందే ముఖ్య శాఖలు చూశారు.ఫిర్యాదుల పోర్టల్, సీఎం హెల్ప్లైన్, బస్సుల్లో పానిక్ బటన్లు, పాత సర్క్యులర్లను కూడా కొత్త సాధనాలుగా చూపిస్తున్నారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్లను కూడా ‘విజయ్ యుగం’ విజయంగా ప్రచారం చేశారు. పదేళ్లుగా జరుగుతున్న కార్యక్రమాన్ని అభిమానులు విజయ్ కోసం చేయడం వింతగా అనిపిస్తుంది.నిజానికి తమిళనాడు ప్రజలు నిజమైన మార్పు కోసం ఓటు వేశారు. నిజమైన పాలనకు సమయం కావాలి. అతిశయోక్తి, నకిలీ ప్రచారాలు, AI చిత్రాలు దీర్ఘకాలంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. విజయ్ ప్రభుత్వం వైరల్ రీల్స్కు బదులు వాస్తవిక సాధనలు, పారదర్శకత , జవాబుదారీతనంపై దృష్టి పెట్టాలి. సమాచార శాఖ నకిలీ ప్రచారాలను త్వరగా సరిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి స్వయంగా ఈ అతిశయోక్తి సంస్కృతిని నిరుత్సాహపరచాలి. ప్రభుత్వాల పాలన గురించి వాట్సాప్ ఫార్వర్డుల ద్వారా కాకుండా, పనితీరు ద్వారా అంచనా వేస్తారు. -
మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో అనూహ్య ప్రశ్న సంధించి వార్తల్లో నిలిచిన నార్వే మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ (Helle Lyng Svendsen) చేదు అనుభవం ఎదురైంది. ఆమె సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తూ మెటా షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆమె కూడా ధృవీకరించారు.ఆన్లైన్లో వెల్లువెత్తిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు నిలిపివేయబడ్డాయని హెలె లింగ్ ట్వీట్ చేశారు. తన ఖాతా నిలిపివేయబడటానికి ముందు రోజంతా తన ఇన్స్టాను యాక్సెస్ చేయలేకపోయానని లింగ్ తెలిపారు. "పత్రికా స్వేచ్ఛ కోసం చెల్లించాల్సిన చిన్న మూల్యమే ఇది, కానీ ఇలాంటి అనుభవం ఇంతకు ముందెప్పుడూ ఎదురు కాలేదు," అని ఆమె తన సస్పెన్షన్ నోటీసు స్క్రీన్షాట్ షేర్ చేశారు.Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026 ; మెటా యాజమాన్యంలోని ప్లాట్ఫామ్స్ ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న వినియోగ దారులకు, తన ఇన్స్టా, ఫేస్బుక్ ఖాతాలు రెండూ సస్పెండ్ అయ్యాయని మరో పోస్ట్లో లింగ్ తెలియజేశారు. తాను వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు స్పందించాలనుకున్నా, కానీ ఇప్పుడు అది లేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. కానీ తన ఖాతాలు తిరిగి యాక్టివ్ అవుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన పోస్ట్కు ఆమె మెటాను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు.ఇదీ చదవండి: ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్ కాగా ప్రధాని మోదీ పత్రికా సమావేశంలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ బాగా వైరల్ అయింది. ఆమె ఫాలోవర్లు కూడా పెరిగారు. దీనిపై బీజేపీ శ్రేణులు లింగ్పై విరుచుకుపడగా, నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. -
మోదీకి ప్రశ్నా.. నార్వే మహిళా జర్నలిస్టు దుస్సాహసం!
ఇంటా బయటా విలేకరులతో మాట్లాడడానికి ఇష్టపడని మన ప్రధాన మంత్రి మోదీ నిన్న నార్వే టూర్లో Dagsavisan అనే పత్రిక మహిళా జర్నలిస్టు (Helle Lyng Svendsen) నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. "Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world?" అని ఆ జర్నలిస్టు అడిగారు.నార్వే ప్రధానితో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ముగించుకుని కరచాలనం చేసి వెళ్తుండగా అది వినిపించిందో, లేదో గానీ మోదీ గారు ఆ ప్రశ్న పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, ఎక్స్ వేదికగా ఆమె రచ్చ చేశారు. "It is our job to question the powers we cooperate with," అని ఆమె రాశారు. దీని మీద సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. కాషాయ సోషల్ మీడియా బృందం ఆమె వెంటపడి కామెంట్స్తో కుమ్ముతోంది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ క్రమంలో దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు?. తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి, కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడాన్ని ప్రపంచం చూసినప్పుడు, భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? అని ప్రశ్నించారు.కాగా, 2015లో బ్రిటన్లో, 2023లో అమెరికాలో మాత్రమే మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాను ఏ మాత్రం పట్టించుకోకుండా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. నార్వేలో ఇద్దరు ప్రధానులు చేసింది press briefing మాత్రమే అనీ, అది press conference కాదు కాబట్టి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళారని భారత అధికారులు అంటున్నారు. It is indeed a point!When there is nothing to hide, there is nothing to fear.What happens to India’s image when the world sees a compromised PM panic and run from a few questions? https://t.co/tOO8vzESpf— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2026సమాధానం ఇస్తే బాగుండేది..ప్రోటోకాల్లో లేకపోయినా, మన ప్రధాని ఆ జర్నలిస్టు నుంచి ఒక ప్రశ్న తీసుకుని చక్కగా నవ్వుతూ సమాధానం ఇస్తే బాగుండేది. మహా అయితే.. మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లిం వ్యతిరేకత, వ్యవస్థల నిర్వీర్యం, రెండు యుద్ధాల (ఇరాన్, ఉక్రెయిన్) వంటి వివాదాస్పద ప్రశ్న ఒకటి అడిగి ఉండేది ఆమె. ఆ ప్రశ్నకు నేరుగా కాకపోయినా, డొంక తిరుగుడుగా సూపర్ సమాధానాలు చెప్పవచ్చు. దానికి కూడా మంచి పాజిటివ్ కవరేజ్ వచ్చేది. నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే, ఒక మహిళా జర్నలిస్టు ధైర్యంగా ప్రశ్న అడిగితే ఆమె ఘోర అపరాధం చేసినట్లు ఆ దేశ అధికారులు, భద్రతా సిబ్బంది ఎవ్వరూ స్పందించలేదు. మన దగ్గర అయితే సీన్ వేరుగా ఉంటుంది. అందుకే మహిళా జర్నలిస్టులు గ్రేట్.ఇక, ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ NGO రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ ప్రతి ఏడాదీ World Press Freedom Index విడుదల చేస్తుంది. వివిధ కొలబద్దల ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారు. 180 దేశాలలో మీడియా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్లో నార్వే ఉండగా, భారత్ ర్యాంకు 157గా కొనసాగుతోంది. - డాక్టర్ ఎస్.రాము, సీనియర్ జర్నలిస్ట్. ఇదిలా ఉండగా.. ఓస్లోకు చెందిన డగ్సావిసెన్ అనే పత్రికలో హెల్లి లింగ్ పనిచేస్తున్నది. మోదీ నార్వే విజిట్ను కవర్ చేసే బృందంలో ఆమె కూడా ఉన్నారు. గతంలో MSN మరియు ఇతర నార్వేజియన్ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తమ ప్రభుత్వంతో సహకరించే అధికారులను ప్రశ్నించడం తన కర్తవ్యం అని ఆమె తెలిపారు. అనంతరం, ఈ పరిణామాల కారణంగా తన ఇన్స్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్ అయినట్టు ఆమె పేర్కొంది. లింగ్ ప్రశ్నల వర్షం.. ఇక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలోనూ లింగ్ మళ్లీ ప్రశ్నలు కురిపించారు. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని ఆమె అడిగారు. సంక్లిష్టమైన అంశాల్లో ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. లింగ్ చేసిన ఆరోపణలకు విదేశాంగ శాఖ ప్రతిని సిబి జార్జ్ స్పందించారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, మీడియాను ఆమె సమర్ధించారు. అయితే ఏమీ తెలియని ఎన్జీవోలు ఇచ్చే నివేదికలను విదేశీ విమర్శకులు పరిశీలిస్తుంటారని జార్జ్ అన్నారు. విదేశాంగ శాఖ, జర్నలిస్టు మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
విజయ్ శైలి.. శ్రుతి మించుతోందా?
మార్పు నినాదంతో ఘన విజయం సాధించిన విజయ్ అధికార పీఠం అధిరోహించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని అంతా భావించారు. సినీ స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. పార్టీ పెట్టడం దగ్గరి నుంచి సీఎంగా ప్రమాణం చేసే వరకు ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేశారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ విజయ్ పాలనలో కనిపిస్తున్న శైలి ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది..తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ అఖండ విజయం, సీఎంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న పనులు చర్చనీయాంశంగా మారాయి. ఈ దెబ్బకు ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. అంతెందుకు ఒకప్పుడు ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసిన తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఇప్పుడు ఆయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది. అందుకు ఇక్కడి ఓ స్టార్ కమ్ లీడర్తో కంపేరిజన్ కూడా ఓ కారణం కావొచ్చు. అయితే ఇదంతా సోషల్ మీడియా వల్లే. అదే సమయంలో.. విజయ్ శైలిలో సినిమాటిక్ టచ్ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రమాణస్వీకార సమయంలో సెల్ఫీ వీడియో తీయడం.. ప్రతిపక్ష నేతలను కలవడం, పాలనాపరంగా దూకుడు నిర్ణయాలు, ఓ చైల్డ్ యాక్టివిస్ట్ రిక్వెస్ట్తో సచివాలయంలో కుర్చీపై వేసిన టవల్ను తీసేయడం, టిఫిన్ బాక్స్ తెచ్చుకుని భోజనం చేస్తున్నట్లు వైరల్ అయిన AI ఫోటోలు.. ఇలా ప్రతీది సోషల్ మీడియాను కుదిపేసినవే. అయితే తాజాగా దివ్యాంగుల సంఘాలతో జరిగిన మీటింగ్ వీడియో రీల్గా బయటకు రావడం.. దుమారం రేపింది.A Person is taking a selfie video while CM Joseph Vijay is conducting a meeting! Best of Luck to Tamil Nadu for this comedy show for next 5 Years pic.twitter.com/ntG5gRndRM— Amitabh Chaudhary (@MithilaWaaala) May 19, 2026పాలనా సమావేశాలకు సంబంధించిన వీడియోలు అధికారికంగా బయటకు రావడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరీ సినిమా ప్రమోషన్లా మార్చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులేమో.. విజయ్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడని, ఆయన సాదాసీదా జీవనశైలి ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అని అంటున్నారు. అయితే.. అధికారిక సమావేశాలను రీల్లుగా మార్చడం, AI ఫోటోలు వాడటం, పాలనను ప్రచార వేదికగా మార్చడం సరైందేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో దివ్యాంగుల హక్కుల ఉద్యమకారుడు డా. పి. సిమ్మచంద్రన్ స్పందించారు. సీఎం అనుమతి తీసుని ఆ వీడియోను తీశా.. అందులో తప్పేముంది? అని అంటున్నారాయన. విజయ్ సినీ స్టార్ కావడం వల్ల ఆయన ప్రతి చర్యలోనూ ఒక సినిమాటిక్ ఇమేజ్ కనిపిస్తోంది. ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి పాలించాలని స్టాలిన్, రజనీకాంత్, కమల్హాసన్లాంటి సినీ ప్రముఖులు.. అలాగే ఇటు మిత్రపక్షాలు సూచిస్తున్నాయి. అయినా ఇప్పటికప్పుడు అందులోంచి ఆయన బయటపడలేకపోతున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఆయనకు ప్రజాదరణను పెంచినా రాజకీయ విమర్శలకు అవకాశం ఇచ్చినట్లే అవుతోంది. “పాలనలో గంభీరత తగ్గిపోతుందా?”, “ప్రచారం హద్దు దాటుతోందా?” అనే విమర్శలకు గుప్పించేందుకు ప్రతిపక్షాలకు స్వయంగా విజయే ఆయుధం అందించినట్లు అవుతోంది.కొత్త కాదు కదా!రీల్ కల్చర్ అనేది కొత్తది కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యంగా యువ నాయకులు, సోషల్ మీడియా వేదికలను పాలనలో భాగం చేసుకుంటున్నారు. అంతెందుకు.. తెలంగాణ, ఏపీలో చోటామోటా నేతల దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమావేశాలు,ప్రజా కార్యక్రమాలను రీల్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముఖ్యమంత్రుల అధికారిక పేజీల్లో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా పాలనలోని నిర్ణయాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా “మన్ కీ బాత్” వంటి కార్యక్రమాలను డిజిటల్ కంటెంట్గా మార్చి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది కదా. అలాంటప్పుడు విజయ్ విషయంలోనే ఎందుకీ చర్చ?. తప్పా? ఒప్పా?.. అది నిర్ణయించాల్సింది..ఎన్నికల్లో ఆయన సాధించిన గెలుపు ఓ కారణం అయితే.. సినీ స్టార్ బ్యాక్గ్రౌండ్ మరో కారణంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘ఆయన పాలనలో కనిపిస్తున్న ప్రతి చిన్న చర్య సినిమాటిక్ ఇమేజ్ బిల్డింగ్గా అంతా భావిస్తున్నారు. అందుకే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ప్రజలకు చేరువ కావడానికి, పారదర్శకతను చూపించడానికి ఉపయోగపడవచ్చు. కానీ అదే సమయంలో, పాలనను సినిమాటిక్ ప్రచారంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఇదే పద్ధతి సాధారణంగా ప్రచార సాధనంగా మాత్రమే కనిపిస్తే.. విజయ్ విషయంలో అది ఆయన సినీ ఇమేజ్తో మిళితమై ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. సినీ స్టార్గా విజయ్ ప్రజలను ఆకట్టుకున్నారు. అలాగని పాలనలో కూడా అదే శైలి కొనసాగిస్తానంటే కాస్త కష్టమే. ఈ సినిమాటిక్ పాలన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి ఇస్తుందా? లేక ప్రచార హద్దులు దాటుతోందా? అనేది కాలమే నిర్ణయించాలి’’ అని తమిళ రాజకీయాలను అధ్యయనం చేస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు చెబుతున్నారు. -
అవన్నీ అసత్య కథనాలు: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని దేవాలయాల బంగారు నిల్వలకు బదులుగా ప్రభుత్వం బంగారం బాండ్లు జారీ చేయనుందని, ఆ నిల్వలను నగదుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అసత్యాలని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుల చేసింది.ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చేందుకు సంబంధించి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది. అలాగే, ఆలయ గోపురాలు, తలుపులపై ఉండే బంగారు పూతను ‘భారత వ్యూహాత్మక బంగారు నిల్వ’గా పరిగణిస్తారనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ప్రజలు ఇలాంటి పుకార్లను నమ్మవద్దని, వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అధికారికంగా ధ్రువీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, గందరగోళం సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కేవలం అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ వెబ్సైట్లలోని సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేసింది. -
ఆ ఇంటి దీపం ఆరిపోలేదు
అనుకోని రీతిలో మృత్యువు ఆమెను కబళించింది. అయితే అంత విషాదంలోనూ ఆమె భర్త శెభాష్ అనిపించే నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల దాడిలో చనిపోయిన తన భార్య కళ్లను దానం చేశారు. కర్ణాటకలో పర్యాటక ప్రాంతం కొడగు జిల్లా దుబారే వద్ద ఏనుగుల పొట్లాటలో ఓ మహిళ నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వైద్యుల సలహా మేరకు మృతురాలు తులసి కళ్లను దానం చేశాడు భర్త జోయెల్. తద్వారా ఆమె చూపు మరొకరి జీవితంలో వెలుగుని నింపుతుందని.. ఇలాగైనా తాను జీవించి ఉంటుందని చెబుతూ ఆ భర్త కన్నీళ్లు పెట్టుకున్నాడు. Heartbreaking Yet Inspiring Story of Love & Humanity ❤️Tulsi, lost her life in a tragic elephant attack at Dubare. Even in the deepest pain, her husband Joel showed extraordinary strength and compassion.Following doctors’ advice (as the body was severely injured), Joel… pic.twitter.com/gO3VuwF8Q0— Aparajite (@amshilparaghu) May 18, 2026ఏనుగులను చూసేందుకు దుబారే శిబిరం, దాని సమీప కావేరి నది వద్దకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సోమవారం కూడా తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) కుటుంబం అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలోనే కావేరి నది వద్దకు ఏనుగులను మావటీలు స్నానానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో రెండు ఏనుగులు పోట్లాడుకోగా.. అందులో ఒకటి అక్కడే ఉన్న ఝాన్సీపై పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేె లోపు మృతి చెందింది. ఆమె భర్త, కుమార్తె ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో భార్యను రక్షించుకునేందుకు జోయెల్ చేసిన ప్రయత్నం.. వీడియోగా నెట్టింట వైరల్ అయ్యింది. అయితే ఈ ఘటనలో ఆమె శరీరం ఏనుగు కింద పడి నలిగిపోగా.. కళ్లు మాత్రం దెబ్బతినలేదు.Today, a tragic incident at Dubare Elephant Camp in Kodagu district, Karnataka, India.A 33-year-old tourist died after a temporary structure collapsed during an elephant bathing session following a clash between two elephants. pic.twitter.com/lfKJ5tpM6i— Weather Monitor (@WeatherMonitors) May 18, 2026 -
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.నేరగాళ్ల నెట్వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు. -
తల్లి వీరోచిత త్యాగం.. వీడియో వైరల్
జన్మనిచ్చేదే కాదు.. పునర్జన్మనిచ్చేదీ అమ్మే!. తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన పిల్లలనే కాదు.. తన భర్త సోదరుడిని బిడ్డలను కూడా కాపాడిన ఓ తల్లి వీరోచిత త్యాగం ఇది. హృదయాలను కదిలించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నగరంలోని నైనీ బజార్లో మే 12న అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 35 ఏళ్ల అర్చనా కేసర్వాని మృతి చెందింది. అయితే తన బిడ్డలను రక్షించుకునే క్రమంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు నిర్ధారించారు.గత మంగళవారం.. రాత్రి 9 గంటల సమయంలో క్రాకరీ వ్యాపారి అయిన సంజీవ్ కేసర్వాని(అర్చన భర్త) ఇంటి గోదాములో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కుటుంబం పై అంతస్తు టెర్రస్ పైకి చేరింది. పొగతో నిండిన వాతావరణంలో అర్చనా తన పిల్లలను రక్షించేందుకు చివరి వరకు పోరాడింది. ముందుగా ఆమె ఒక ఏడాది కొడుకు రాఘవను బెడ్షీట్లో చుట్టి ఎదురింటి పొరుగువారికి అందించింది. అనంతరం పొరుగువారు ఏర్పాటు చేసిన మెట్ల సాయంతో కుమార్తెలు ప్రియాంశి (13 ఏళ్లు), శివాన్య (10 ఏళ్లు)ను సురక్షితంగా బయటకు పంపగలిగింది. చివరగా ఆమె తన భర్త సోదరుడి కొడుకు భతిజా లవ్ను కూడా రక్షించింది. అప్పటికే దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకుని ఆమె స్వయంగా బయటపడలేకపోయింది. సహాయక చర్యల అనంతరం గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆలస్యమైంది. मां से बड़ा योद्धा कोई नहीं... बच्चों को बचाने में आग में जलकर मां की मौतप्रयागराज के नैनी बाजार इलाके में एक दर्दनाक हादसे में एक मां ने अपने बच्चों को बचाने के लिए अपनी जान कुर्बान कर दी. यह घटना 12 मई की रात की है, जब एक क्रॉकर्री कारोबारी के घर में अचानक भीषण आग लग गई.… pic.twitter.com/7M0fkMudgk— News Leader (@NewsLeaderLive) May 17, 2026ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటకు రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తున్నారు. స్థానికులు ఆమెను "మాతృత్యాగానికి ప్రతీక"గా అభివర్ణించారు. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి నిరూపించిందనే అంటున్నారు. -
మీ ఇంట్లో ఒక్కరు.. ప్రజలకు నలుగురా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు చెబుతున్న కొత్త జనాభా సిద్ధాంతంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఒక్క బిడ్డ చాలని ప్రచారం చేసి ఇప్పుడు యూటర్న్ తీసుకుని నలుగురు బిడ్డల్ని కనాలని చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. తాను విజనరీనని దశాబ్దాలుగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఆయన విజన్ జనాభా విషయంలో అట్టర్ ప్లాప్ అయింది. ఒకప్పుడు ఒక్క బిడ్డే చాలు, చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా ఎక్కువ మంది పిల్లల్ని కనమంటూ మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం అంటూ గతానికి భిన్నంగా కొత్త రాగం అందుకోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఇష్టానుసారం విధానాలు మార్చుకునే విధానాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనాభా పెంచాలని కబుర్లు చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ఒక బిడ్డతోనే ఆగిపోయారు. ఆయన కుమారుడు కూడా ఒక బిడ్డనే కన్నారు. ఈ విషయంలో ఆయన ద్వంద్వ వైఖరి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగం తీవ్రతరం ప్రస్తుతం రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. విద్య, వైద్య ఖర్చులు భరించలేని స్థాయికి చేరాయి. మధ్యతరగతి, పేద కుటుంబాలు బ్రతకడానికే తీవ్రంగా పోరాడుతున్నారు. ఒక బిడ్డను పెంచడమే సామాన్య కుటుంబాలకు భారంగా మారింది. చిన్న పిల్లల స్కూలు ఫీజులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ ఉన్నాయి. ఇంజినీరింగ్ చదువు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వెళ్లింది. మెడిసిన్ అయితే కోట్లు కావాలి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు.ప్రైవేటు ఉద్యోగాలు అస్థిరంగా మారాయి. మధ్యతరగతి కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముగ్గురు, నలుగురు పిల్లల్ని కంటె వాళ్లకు విద్య, వైద్యం, ఉద్యోగ భద్రత, జీవన భరోసా ఎవరిస్తారని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యశ్రీని నీరుగార్చి సామాన్యులకు వైద్యాన్ని భారంగా మార్చారు. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేద ప్రజలను నట్టేట ముంచారు. ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య కలలు కల్లలుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమందిని కన్నా తాను చూసుకుంటానని చెప్పడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు గాలికి ఎన్నికల ముందు సూపర్ సిక్స్, బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ ఎడాపెడా హామీలు ఇచ్చారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం వంటివి ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చాక వాటి గురించి మరచిపోయారు. ఇప్పటివరకూ నిరుద్యోగ భృతి ఊసే లేదు. 20 లక్షల ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. అసలు ఉద్యోగాలే లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు పాలనలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అప్పులు పెరిగిపోతున్నాయి. బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కుటుంబ నియంత్రణ మంచిదని చెప్పి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనకపోతే ప్రమాదమని చెబుతున్న చంద్రబాబు భవిష్యత్తులో ఇంకేమి చెబుతారోనన్న సెటైర్లూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. బాధ్యతారాహిత్యం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు సమాజంపై ప్రభావం చూపుతాయనే ఆలోచన లేకుండా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మాటలు మార్చడం, గతంలో తాను చెప్పిన మాటల్ని మరిచిపోయి అందుకు విరుద్ధంగా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటైన విద్యే. అదే రీతిలో ఇప్పుడు కొత్త జనాభా సిద్ధాంతంతో ప్రజలను మళ్లీ గందరగోళంలోకి నెడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చెప్పే కాకమ్మ కథలు వినే స్థితిలో లేరు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కావాలి. పిల్లల చదువుకు భరోసా కావాలి. ఆరోగ్య రక్షణ కావాలి. ప్రజల జీవన వ్యయం తగ్గాలి. అవేమీ చేయకుండా బాధ్యతారాహిత్యంగా నలుగురు పిల్లల్ని కనమని చెప్పడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు మాటలు హాస్యాస్పదం ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంది. అలాంటప్పుడు చంద్రబాబు నలుగురు పిల్లల్ని కనాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు రెక్కలొచ్చి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలన్నీ భారంగా మారాయి. ఇటువంటి తరుణంలో నలుగురు పిల్లల్ని కంటే ఎలా పోషించాలి. ఇచ్చిన ఎన్నికలు హామీలు అమలు చేయకుండా జనాభాను పెంచమని చెప్పడం సరికాదు. – రాజపు మాధవి, వెల్లటూరు, జి.కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లాకుటుంబ నియంత్రణ మీకేనా.. మాకు అవసరం లేదా? సీఎం చంద్రబాబు కుటుంబం మాత్రం కుటుంబ నియంత్రణ పాటించాలి. ఆయనకు ఒకే ఒక్క కూమారుడు. ఆయన కుమారుడికీ ఒక్కడే కుమారుడు. పేదలం, మధ్య తరగతి వారైన మేం మాత్రం ముగ్గురు, నలుగుర్ని కనాలా? అలా కంటే పోత్సాహకాలిస్తారా? అసలు మీ మాటలను నమ్మొచ్చా? ఎన్నికలకు ముందు ఎన్ని హామీలిచ్చారు.. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటైనా సరిగా అమలు చేశారా? – సుమతి, కర్నూలు, లేబర్ కాలనీఉన్నోళ్లకే విద్య, వైద్యం సరిగా లేదు.. నలుగుర్ని కనాలా? సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలనూ రద్దు చేశారు. మళ్లీ ఇప్పుడు మూడో బిడ్డను కంటే డబ్బులిస్తామంటే ఎలా నమ్మాలి? ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. కొత్త హామీలివ్వడం హాస్యాస్పదం. పౌరులకు సరైన విద్య, వైద్యం అందించకుండా ప్రతి జంటా ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చంద్రబాబు చెప్పడం శోచనీయం. – అంజలి, అనంతపురం అప్పుడలా.. ఇప్పుడిలా..టీడీపీ అధినేత 90వ దశకంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించారు. ఇప్పుడు ఆయన ప్రధాని చేపట్టనున్న నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్) వల్ల ’కుటుంబ నియంత్రణ పాటించిన’ దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని గ్రహించారు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది పిల్లలు పుట్టాలని కోరుతున్నారు. – ప్రియాంకా కక్కర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన జాతీయ ప్రతినిధి లోకేశ్తోనే మొదలుపెడదాం ముందున్న ఆర్థిక అనిశ్చితి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, లోకేశ్కు ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిద్దాం. – పూనమ్ కౌర్, నటితర్వాత సంగతేంటి? పిల్లలు పుట్టిన తర్వాత సంగతి ఏమిటి?ఆ పిల్లలకు 20 ఏళ్ల వయసులో ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుందా? వారి చదువుకు ఖర్చులు భరిస్తుందా? ఆహారం, మందులు, పెంపకం ఖర్చులు ప్రభుత్వం చూసుకుంటుందా? తీవ్ర ద్రవ్యోల్బణం, అదుపు లేని నిరుద్యోగం ఉన్న ఈ కాలంలో ప్రజలకు కావాల్సింది జీవన భద్రత. పతాక శీర్షికల్లో ఎక్కే స్కీములు కాదు. – రేణుకా చౌదరి, కాంగ్రెస్ ఎంపీతప్పుదారి పట్టించే విధానం ఈ ఆఫర్ ప్రమాదకరమైన, తప్పుదారి పట్టించే విధానం. మనకు కావల్సింది... ఆరోగ్యవంతమైన అలాగే నైపుణ్యాలున్న జనాభానే కానీ.. పోషకాహార లోపంతో బాధపడేవారు, నైపుణ్యం లేని వ్యక్తులు కాదు. పోషకాహారం, పాఠశాలలు, నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి పెట్టండి. – కార్తి చిదంబరం, ఎంపీ -
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
60 ఏళ్లకు గర్భం దాల్చి తల్లి అయ్యి.. 76 ఏళ్ల వయసులోనేమో..
బీజింగ్: చైనాలో 16 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. గర్భం దాల్చిన అత్యధిక వయసున్న మహిళగా అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ మహిళకు ఇప్పుడు 76 ఏళ్లు. వ్యక్తిగతంగా ఎన్నో విషాదాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆమె ఈ వయసులో సోషల్ మీడియా ద్వారా తనను తాను నిరూపించుకుంది.ఆ బామ్మ పేరు షెంగ్ హైలిన్. ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించిన ఫోటో సిరీస్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని ఏళ్లుగా కష్టపడి షెంగ్ చైనా సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. సోషల్ మీడియాలో ఆమె పేరెంటింగ్ సలహాలు, వంట వీడియోలు, ప్రేరణాత్మక విషయాలు పంచుకుంటోంది.60 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు? షెంగ్ ఏకైక కుమార్తె టింగ్టింగ్, అల్లుడు పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే 2009లో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో మృతి చెందారు. ఆ విషాదం, ఒంటరితనంతో తీవ్రంగా కలత చెందిన షెంగ్, 60 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయం చైనాలో సంచలనం రేపింది.గర్భధారణ సమయంలో తీవ్రమైన వాపులు, రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, షెంగ్ 2010లో జిజి, హుయ్హుయ్ అనే కవల పాపలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. షెంగ్, ఆమె భర్త జీవితాల్లో ఆ కవల పిల్లలు కొత్త ఆశ నింపినా వృద్ధాప్యంలో పిల్లలను పెంచడం సవాలుగా మారింది. షెంగ్ పదవీ విరమణకు ముందు ఆసుపత్రి డైరెక్టర్గా పని చేసింది. ఆమె భర్త యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. అయినా పిల్లల సంరక్షణ, విద్య, రోజువారీ ఖర్చులు కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.కుటుంబాన్ని పోషించడం కోసం షెంగ్ చైనా అంతటా తిరుగుతూ ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. తన కుమార్తెలకు నాణ్యమైన విద్యతో పాటు పియానో, డ్యాన్స్ వంటి శిక్షణ అందించేందుకు ఆమె నిరంతరం శ్రమించింది.అయితే, 2016లో షెంగ్ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబం మరో భారీ విషాదాన్ని ఎదుర్కొంది. అనంతరం గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన 2022లో మృతి చెందారు. అదే సమయంలో నకిలీ పెట్టుబడి మోసంలో షెంగ్ 20 లక్షల యువాన్లకుపైగా డబ్బు కోల్పోయిందని సమాచారం.షెంగ్ ఆన్లైన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 73 ఏళ్ల వయసులో లైవ్స్ట్రీమింగ్, షార్ట్ వీడియోలను ప్రారంభించింది. కుమార్తెల భవిష్యత్తు కోసం సంపాదించడం కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ప్రస్తుతం ఆమె తరచుగా లైవ్స్ట్రీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరెంటింగ్, వృద్ధాప్యం, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతోంది. ఇంటి సామగ్రి, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా విక్రయిస్తోంది. ఆన్లైన్లో “మదర్ షెంగ్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచింది. -
ఆ ఒక్క మాటతో.. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయాడు
జీవితంలో మొదటి అనుభవం ఎవరికీ మరిచిపోలేనిది. అది ప్రేమైనా.. ఉద్యోగమైనా.. మరొకటైనా!. అయితే ఇక్కడో వ్యక్తికి అది మనషుల వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేందుకు.. వాళ్లు ఎప్పటికీ మారరనే సంగతి గుర్తించేందుకు ఉపయోగపడింది. రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఆ పోస్ట్ వివరాలను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి బెంగళూర్ ఎయిర్పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో దూరంగా కూర్చున్న వ్యక్తి అతనికి పరిచయంలా అనిపించి దగ్గరకు వెళ్లాడు. తీరా చూస్తే.. 18 ఏళ్ల కిందట తాను జాబ్ కెరీర్ మొదలుపెట్టింది మేనేజర్ ఆ వ్యక్తేనని నిర్ధారించుకున్నాడు. అంతే సంతోషం పట్టలేక అతనితో మాటలు కలిపాడు. ఆ మాజీ మేనేజర్ కూడా అతన్ని గుర్తు పట్టి పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయాడు. ఇంతలో ఆ వ్యక్తి ఆ పెద్దాయన్ని ఓ ప్రశ్న అడిగాడు. అంతే.. అతని ముఖంలో నవ్వు మాయమైంది. సైలెంట్గా జేబుల్లో చేతులు పెట్టుకుని వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ పరిణామంతో చిన్నగా నవ్వుకున్న ఆ వ్యక్తి.. సోషల్మీడియాలో ఆ ప్రశ్నేంటో చెబుతూ ఇలా రాసుకొచ్చాడు.. 2008లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా చేరిన ఆ వ్యక్తి.. రెండు సంవత్సరాలకు ఆ ఉద్యోగం మానేశాడు. ఒకే తీరు పని, ఆఫీస్ ఫేవరిటిజం, ఎడతెరిపి లేని ప్రయాణాలు అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలయ్యాయట. అయితే.. కంపెనీని వీడే టైంలో హెచ్ఆర్ నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగితే.. అంతే నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు అతను రాసుకొచ్చాడట. అది చూసి మూడు నెలల నోటీసు పీరియడ్ కూడా అక్కర్లేకుండా ఆ కంపెనీ అతన్ని బయటకు పంపించేసింది. కానీ.. అతనికి రిలీవింగ్ లెటర్ మాత్రం ఇవ్వలేకపోయింది. ఇదే విషయమై అతని మేనేజర్ను నిలదీస్తే.. చూద్దాం.. చేద్దాం.. అంటూ చెబుతూ వచ్చాడు. చివరకు ఆ ఫాలోఅప్ విషయంలో మౌనం వహించుకుంటూ వచ్చాడట. విసుగెత్తిపోయిన ఆ యువకుడు అది మరిచిపోయి.. ఎలాగోలా మరో జాబ్ సంపాదించుకోగలిగాడు. కట్ చేస్తే.. 16 ఏళ్ల తర్వాత కలిసి ఆ మాజీ మేనేజర్ను ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న.. ‘నా రిలీవింగ్ లెటర్ సంగతి ఏంటి?’ అని. అందుకే ఆయనగారూ గప్చుప్గా వెళ్లిపోయారట. ఈ సంఘటన రెడ్డిట్లో “My Ex-Manager Remembered Everything Except Accountability” అనే శీర్షికతో పోస్ట్ అయ్యింది. వెంటనే వైరల్ అయింది.దీంతో ఆ ఫీడ్బ్యాక్లో మేనేజర్ గురించి ఏమైనా చెప్పి ఉంటాడా? అనే కుతూహలం రెడ్డిట్ యూజర్లలో పెరిగి ఆరాలు తీస్తున్నారు. చాలామంది కామెంట్స్లో, మేనేజర్ రియాక్షన్ గిల్టీ ఫీలింగ్ వల్లేనని చెప్పారు. కొందరు “ఉద్యోగి ముందుకు వెళ్లిపోయాడు, కానీ మేనేజర్ మాత్రం ఆ పాత తప్పును ఇప్పటికీ మరిచిపోలేదు” అని వ్యాఖ్యానించారు. మరికొందరు రిలీవింగ్ లెటర్స్, మేనేజీరియల్ ఈగో వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంబంధాల్లో బాధ్యత (Accountability) చాలా ముఖ్యం. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా సంవత్సరాల తర్వాత అసౌకర్యంగా మారుతుంది. ఈ ఉద్యోగి వైరల్ కథలోలాగా!. -
జగన్ చేస్తే వినాశనం.. టీడీపీ చేస్తే అభివృద్ధా?
ఎంవీపీ కాలనీ (విశాఖ): విశాఖలో పర్యావరణ విధ్వంసం పెరిగిపోయిందని జనసేన మాజీ నాయకుడు, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖలోని సింహాచలం కొండతో పాటు ముడసర్లోవ, కంబాల కొండ, పావురాల కొండల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగన్ ప్రభుత్వం చేస్తే విధ్వంసం, టీడీపీ చేస్తే అభివృద్ధి అన్న చందంగా విశాఖలో పర్యావరణ విధ్వంసం సాగుతోందన్నారు. దీనిపై కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కట్టడాల కోసం రుషికొండపై నిర్మాణాలు చేస్తే టీడీపీ నానాయాగి చేసిందని.. రుషికొండను బోడిగుండు చేసేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిందన్నారు. అయితే, ఇప్పుడు డేటా సెంటర్ పేరుతో శ్రీ వరాహ నృసింహస్వామి కొలువైన పవిత్ర సింహాచలం, ముడసర్లోవ కొండలతో పాటు ప్రైవేట్ రిసార్ట్స్ కోసం పావురాల కొండలను కొట్టేస్తూ అభివృద్ధి అని చెబుతోందన్నారు. విశాఖకు రక్షణ కవచాలుగా ఉన్న కొండలను విధ్వంసం చేయడం పర్యావరణానికి పెనుముప్పుగా మారిందన్నారు. కొండల తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. ఈ విధ్వంసాన్ని ఆపేందుకు అవసరమైతే నగర ప్రజలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. -
రెడ్ డ్రెస్లో మంచు లక్ష్మీ.. కేన్స్లో కొత్త లోకా బ్యూటీ..!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..మ్యాగజైన్ లుక్లో అనన్య పాండే..జిమ్లో బిగ్బాస్ ఇనయా సుల్తానా కసరత్తులు..రెడ్ డ్రెస్లో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ లుక్స్..కేన్స్లో కల్యాణి ప్రియదర్శన్ సందడి.. View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
అయ్యా విజయ్.. ఇదయ్యా నీ సినిమా ఇంపాక్ట్!
యాక్టర్ టు సీఎం.. సి విజయ్ జోసెఫ్ ప్రస్థానం గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేసింది. ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో అవి మరీ సినిమాటిక్గా అనిపించినా.. భవిష్యత్తులో వాటి ప్రభావం కనిపించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన కెరీర్లో సందేశాత్మక చిత్రాలు తీయడమూ అందుకు ఓ కారణమై ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అయితే..తమిళనాడులో తాజాగా ఓ యువకుడు చేసిన పని నెట్టింట వైరల్గా మారుతోంది. విజయ్ సర్కార్కు విరాళంగా అరుణ్ లోకనాథన్ రూ.22,674 విరాళం అందించారు. ఈ ఫిగర్కు ఓ ప్రాధాన్యం ఉంది. 22-06-1974.. విజయ్ పుట్టిన తేదీ కూడా. దీంతో అభిమానులు ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. అయితే ఆ యువకుడు అలా చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట. విజయ్ నటించిన ఓ సినిమానే తాను ఈ పని చేయడానికి స్ఫూర్తి ఇచ్చిందని అరుణ్ చెబుతున్నాడు.అరుణ్కు పోలియో ఉంది. అతనొక మెంటలిస్ట్, హిప్నాటిస్ట్, మైండ్-రీడర్గా ఈవెంట్లు చేసుకుంటున్నాడు. విజయ్ సీఎంగా ప్రమాణం చేశాక.. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా సరే ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు. విజయ్ చెప్పినదాని ప్రకారం.. తమిళనాడు బడ్జెట్ ఆధారంగా లెక్కలు వేసి వ్యక్తిగతంగా రూ1 లక్షకు పైగా చెల్లించాల్సి వస్తుందని అరుణ్ గుర్తించాడు. అందుకే తన వంతుగా మొదట ఈ నగదును అందించినట్లు చెప్పాడు. ఈ క్రమంలో తమిళన్ సినిమా సీన్ గుర్తు చేశాడు.విజయ్ ప్రధాన పాత్రలో 2002లో తమిళన్ అనే చిత్రం వచ్చింది. అందులో దేశం అప్పులు తీర్చడానికి సూర్య(విజయ్ పాత్ర పేరు) ప్రధానమంత్రికి రూ.4,000 చెక్కును పంపిస్తాడు. అలా ఆ సీన్ ఇన్స్పిరేషన్తో.. ఇప్పుడు పాతికేళ్ల తర్వాత అరుణ్ అదే పని చేసి తన అభిమాన హీరో, ప్రస్తుత సీఎంకు సహకారం అందించాడన్నమాట. ‘‘నేను పంపిన ఈ సొమ్ముతో రాష్ట్రంలో అప్పులు తీరతాయని నేనేం అనుకోను. కానీ, నేను అభిమానించే వ్యక్తికి నా వంతుగా ఉడతా భక్తిగా అందించిన చిన్నసాయం ఇది. ఈ విరాళంతో వీలైతే నాలా పోలియోతో బాధపడుతున్నవాళ్లకు, దివ్యాంగులకు సౌకర్యవంతమైన ప్రదేశాలు, సులభమైన యాక్సెస్ కల్పించాలి’’ విజయ్ సర్కార్ను కోరుతున్నాడు. ఈ ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పు, ముందుగా మీలోనే ఆ మార్పు తీసుకురండి.. అని మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా అరుణ్ ప్రస్తావించాడు. Fulfilling my individual debt responsibility అనే క్యాంపెయిన్ను కొనసాగిస్తానని ప్రకటించాడు. అన్నట్లు తమిళన్ సినిమాలో హీరో సూర్య పాత్ర లాయర్ పాత్ర. అరుణ్ కూడా గతంలో లా చేశాడంట. View this post on Instagram A post shared by Arun Loganathan (@arunthementalist_atm)విజయ్కు టర్నింగ్ పాయింట్విజయ్ సినీ కెరీర్ను తమిళన్కు ముందు.. తమిళ్కు తర్వాత అని కచ్చితంగా చెప్పొచ్చు. అప్పటిదాకా రొమాంటిక్, యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంట్ జానర్ రొడ్డకొట్టుడు చిత్రాలు తీసిన.. తమిళన్లాంటి సందేశాత్మక చిత్రం తీసి అశేష అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి అబ్దుల్ మాజిత్ డైరెక్ట్కాగా, దర్శకనిర్మాత.. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్క్రీన్ప్లే అందించారు. మరో హైలైట్ ఏంటంటే.. ప్రియాంక చోప్రా నటించిన ఏకైక తమిళ చిత్రం(ఇప్పటిదాకా). ఈ సినిమాలో హీరో సూర్య లా విద్యార్థి. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతుంటాడు. జనాల్లో చట్టాలపై అవగాహన కల్పించడం చేస్తుంటాడు. బస్సులో చిల్లర కూడా ఇవ్వకుండా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే కండక్టర్ను.. ప్రయాణికుల సంతకాలతో కోర్టుకు లాంటి సన్నివేశాలు షార్ట్ రీల్స్ రూపంలో ఆ మధ్య వైరల్ కూడా అయ్యాయి. అదే సమయంలో తన కుటుంబాన్ని నాశనం చేసిన కార్పొరేట్ శక్తులపైనా ప్రతీకారం తీర్చుకునే డ్రామా కూడా నడుస్తుంది. అయితే ఈ సినిమా మరీ లిబర్టీక్గా ఉండడంతో కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా.. విజయ్ నటనకు మాత్రం తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాతే ఆయన సందేశాత్మక చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. తెలుగులో ‘‘దమ్ముంటే కాస్కో’’ పేరుతో డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లోనూ అందుబాటులో ఉంది.సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. అమ్మాయిలు కనిపిస్తే వీలైతే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలి. సెలైన్సర్లు పీకేసి బైకులేసుకుని రోడ్ల మీద పడాలి అని కొందరు సోకాల్డ్ హీరోల్లా విజయ్ ఏనాడూ అభిమానులకు చిల్లర పిలుపులు ఇవ్వలేదు. కుర్రహీరోయిన్లతో ఫంక్షన్లలో వెకిలి చేష్టలకు పాల్పడుతూ పరువు తీసుకోలేదు. విజయ్ తన సినిమాలతోనే కాదు ప్రసంగాలతోనూ అభిమానుల్ని ఆలోచింపజేసేవారు.. ‘‘మీరూ ఎదగండ్రా బాబూ..’’ అని మోటివేట్ చేసేవారు. సినిమా అనేది నిజ జీవితంలో మార్పు తెస్తుందా? అనే చాలామంది వ్యక్తం చేసే అనుమానం. కానీ, మార్పు అనే నినాదంతో అధికారం చేపట్టిన విజయ్.. తన సినిమాలతో అది సాధ్యమని తన అభిమాని అరుణ్ ఉదంతంతో శాంపిల్ చూపించారు. పౌరులు కూడా పాలనలో భాగస్వాములు కావాలనే కొత్త సందేశం ఇప్పించారు. -
వీడియో: చున్నీ కోసం పట్టాలపైకి దిగి..
ఏమరపాటులో.. నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో తెలియంది కాదు. పట్టాలు దాటుతూ ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఇందుకు మంచి ఉదాహరణలు. తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ఘటనపై నెట్టింట మిశ్రమ స్పందన లభిస్తోంది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ సంప్రదాయ భారత దుస్తుల్లో రైలు ఎక్కింది. డోర్ దగ్గర నిల్చుని సెల్ఫీ వీడియో(టూరిస్ట్ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ ఏమో!) ఆమె దుప్పట్టా జారిపోయి ఫ్లాట్ఫారమ్కు-రైలుకు మధ్య పట్టాల మీద పడింది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వృద్ధుడు.. అది గమనించాడు. ఆ యువతికి సాయం చేస్తానని ముందుకు వచ్చాడు. ఫ్లాట్ఫారమ్ నుంచే ఆ చున్నీని అందుకునే ప్రయత్నం చేయగా.. అది వీలుపడలేదు. దీంతో సరాసరి పట్టాలపైకి దూకాడు. అయితే ఆ సమయంలో ఆ ఇండోనేషియా మహిళ అప్రమత్తమైంది. త్వరగా పైకి రావాలంటూ ఆయన్ని కోరింది. ఆ వృద్ధుడు కూడా చున్నీని దొరకబుచ్చుకుని పైకి వచ్చేశాడు. ఆమె చేతికి అందగా థ్యాంక్స్ చెప్పడంతో ఫర్వాలేదని చెయ్యి చూపిస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. “ఆయన హీరోలా వచ్చి సహాయం చేశారు. ఎలాంటి ప్రశంసలు ఆశించకుండా నిశబ్దంగా వెళ్లిపోయారు. నిజంగా గ్రేట్” అంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోకు 41 మిలియన్లకుపైగా వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు ఆయనను “జెంటిల్మన్”, “హీరోలా నడిచాడు” అంటూ ప్రశంసించారు. కొందరు తమ అనుభవాలను పంచుకుంటూ, “ఇలాంటి భారతీయ అంకుల్స్ సో స్వీట్” అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హ్యుమాటినీ నా?, సేఫ్టీనా? అంటూ చర్చ నడిచింది. ఆ సమయంలో రైలు కదిలి జరగరానిది జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో అంత రిస్క్ అవసరమా అంకుల్? అని సరదాగా ఆ పెద్దాయన్ని మందలిస్తున్నారు. View this post on Instagram A post shared by Indah A.L ᢉ𐭩 (@indaha.l) -
బిగ్బాస్ దివి అందాలు.. చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక..!
టాలీవుడ్ బిగ్బాస్ దివి అందాలు..ఫారిన్ వెకేషన్లో నమ్రతా శిరోద్కర్.. కేన్స్ వీధుల్లో నిహారిక కొణిదెల సందడి..మంచుకొండల్లో హీరోయిన్ సాయిపల్లవి చిల్..చిన్నపిల్లలా మెరిసిపోతున్న యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
విజయ్- రష్మిక జంట.. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన జంట విజయ్- రష్మిక. కొన్నేళ్లుగా డేటింగ్ ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఈవెంట్ నిర్వహించారు.అయితే విరోష్ జంటగా క్రేజ్ తెచ్చుకున్న వీరిద్దరు ఓ యాడ్ ప్రమోట్ చేశారు. ప్రముఖ ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్లో పాల్గొన్నారు. దీనికి ఏకంగా 9.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఇన్స్టాలో మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ జంటగా విరోష్ జోడీ నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో ఒక యాడ్కు వరల్డ్ వైడ్గా వచ్చిన రెండో అత్యధిక లైక్స్ ఇవే కావడం విశేషం. దీంతో విజయ్- రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా రణబాలిలో కనిపించనున్నారు. మొదటి ప్లేస్ కూడా వీరిదే..ఈ జాబితాలో మొదటి స్థానం రికార్డ్ సైతం వీరిదే కావడం గమనార్హం. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన మాన్యవార్ అనే వెడ్డింగ్ యాడ్ 11.5 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దీనికి తోడు 104 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. ప్రముఖ దిగ్గజాలు మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ ఐకాన్స్ కలిసి చేసిన ఇంటర్నేషనల్ బ్రాండ్ యాడ్స్కు మించిన ఆదరణ విరోష్ జంటకు అందరినీ షాకింగ్కు గురి చేస్తోంది. -
విజయ్ సూటు.. వీధుల్లో ఆమ్బులెన్స్!!
సోషల్ మీడియా ఎఫెక్ట్తో మార్కెటింగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒక ప్రొడక్టును జనాల్లోకి పంపించాలంటే.. దాని నాణ్యత, ధరలతో సంబంధం లేకుండా పోతోంది. వీలైనంత వైవిధ్యంగా జనాలకు దానిని ప్రదర్శించాల్సి వస్తోంది. చిన్నాచితకాలే కాదు బ్రాండెడ్ కంపెనీలు ఈ విషయంలో కూడా పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో అవసరమైతే ఎంతకైనా వెళ్తున్నాయి. ముంబైలో మామిడి పండ్ల కొరతను వైవిధ్యంగా క్యాష్ చేసుకోవాలని ఇన్స్టామార్ట్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆమ్బులెన్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది. ఆంబులెన్స్లాంటి వెహికిల్లో ఓ వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉంటాడు. అతని చుట్టూరా మామిడి పండ్లు ఉంటాయి. అది ఆంబులెన్స్కాదు.. మామిడి ఫీవర్కు ఆమ్ (మామిడి) + అంబులెన్స్=ఆమ్బులెన్స్ అంటూ ఇన్స్టామార్ట్ ప్రచారం ఉవ్వెత్తున్న చేస్తోంది. Reason why India doesn't export mangoes: pic.twitter.com/3Ddy41CMtF— Xavier Uncle (@xavierunclelite) May 13, 2026ఇక.. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసింది తెలిసిందే. సీఎంగా ఆయన సూట్ అవతారం హాట్ టాపిక్గా మారింది. అయితే విజయ్ ట్రెండింగ్లో ఉండడంతో తమిళనాడులోని పలు వస్త్రదుకాణాలు ఆయన ఫొటోలను తెగ వాడేస్తున్నాయి. ది చెన్నై సిల్క్స్ ఓ అడుగు ముందుకేసి ఆ కాంబోపై ఆఫర్లు ప్రకటించింది. ఫ్యాషన్ను ఫన్గా మార్చిన ఈ స్టంట్.. సీఎంను కాస్త “Chief Marketing Influencer” కాన్సెప్ట్తో వస్త్రాలను పరిచయం చేస్తూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. The Chennai Silks : A major textile retailer..introduces CM Vijay look attire!CM - Chief Marketing (Influencer)? pic.twitter.com/6AvxgOcDbn— We Dravidians (@WeDravidians) May 13, 2026వేసవిలో బ్రాండ్లు కేవలం ఉత్పత్తులు అమ్ముకోవడంతో పాటు వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్స్టామార్ట్ ఆమ్బులెన్స్, తమిళనాడు సీఎం విజయ్ వస్త్రధారణ మార్కెట్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ హల్చల్ చేస్తున్నాయి. మార్కెటింగ్లో ఈ రెండు స్టోరీ టెల్లింగులను చూసిన వాళ్లంతా ‘వారెవ్వా.. ఏం వాడకమయ్యా’ అని ఫిదా అయిపోతున్నారు. -
బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి.. వెస్టర్న్ స్టైల్లో మంచు లక్ష్మీ..!
బీచ్లో ఆర్జే మహ్వశ్ చిల్..బ్లాక్ డ్రెస్లో యాంకర్ శ్రీముఖి హోయలు..వెస్టర్న్ లుక్లో నటి మంచు లక్ష్మీ పోజులు..జిమ్లో బాలీవుడ్ భామ దిశా పటానీ కసరత్తులు..యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తోన్న పాయల్ రాజ్పుత్..అక్కినేని కోడలు శోభిత లేటేస్ట్ లుక్స్.. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Dushara Vijayan🧿 (@dushara_vijayan) -
'హైదరాబాద్ ఈవెంట్లో కామెంట్స్.. తప్పుగా అర్థం చేసుకున్నారు'
కోలీవుడ్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ కరుప్పు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్కు అంతా సిద్ధమైంది. తెలుగులో వీరభద్రుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ బాలాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా థియేటర్లకు వచ్చే వారికోసమే తీశామని అన్నారు. అంతేకానీ సోషల్ మీడియాలో సమీక్షించే వారి కోసం కాదన్నారు. దీంతో దర్శకుడు బాలాజీ కామెంట్స్పై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆన్లైన్ సినిమాలను విశ్లేషించే వారిని కించపరిచేలా మాట్లాడారంటూ ట్రోల్స్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించారు. కేరళలో నిర్వహించిన మూవీ ఈవెంట్లో తన కామెంట్స్పై క్లారిటీ ఇచ్చారు.తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆర్జే బాలాజీ అన్నారు. ఎలాంటి ముందస్తు అభిప్రాయం లేకుండా సినిమా చూడమని మాత్రమే తాను ప్రేక్షకులను కోరానని స్పష్టం చేశారు. సినిమాలపై చేసే సమీక్షలను, చర్చలను కొట్టిపారేయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ముందుగానే ఓ అభిప్రాయంతో థియేటర్లకు రావద్దని ప్రేక్షకులను కోరడమే నా ఉద్దేశమని వెల్లడించారు. మీరు విశాల దృక్పథంతో థియేటర్లకు వచ్చి.. సినిమా చూసిన తర్వాతే.. నచ్చిందో లేదో చెప్పాలని కోరుకుంటున్నానని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చాక.. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడాలి.. సమీక్షించాలి. నేను కూడా ఒకప్పుడు సమీక్షకుడినే.. ఇప్పుడే డైరెక్టర్గా మారానని తెలిపారు.సూర్య హీరోగా వస్తోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఇంద్రన్స్, నట్టి సుబ్రమణ్యం, స్వాసిక, శ్శివద, అనఘ మాయ రవి, సుప్రీత్ రెడ్డి, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్, ఆడుకలం నరేన్, నమో నారాయణ, దీపా శంకర్, సభ మారన్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. ఈ చిత్రం మే 14న థియేటర్లలో విడుదల కానుంది. -
‘నువ్వు వద్దు.. నీ ఉద్యోగం వద్దూ’.. జెన్జీ యువతి
తాను పనిచేస్తున్న ఓ సంస్థలో తన బాస్ తనకి గౌరవం ఇవ్వడం లేదనే కారణంతో ఓ జెన్జీ ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్పుగా అనిపించడం లేదు. నిజం చెప్పాలంటే తాను కోరుకున్న దాని కోసం రాజీపడని జెన్జీ నేను గర్వపడుతున్నాను’అని వ్యాఖ్యానించింది. ఓ జెన్జీ ఉద్యోగిని తన బాస్ సమావేశంలో అవమానకరంగా ప్రవర్తించడంతో తీవ్రంగా బాధపడింది. ఆ అవమానం తట్టుకోలేక ఆమె వెంటనే రాజీనామా చేసింది. రాజీనామా అనంతరం తన బాస్కి ఓ సందేశం పంపింది. తక్కువ జీతమా? భరించొచ్చు. కానీ అవమానిస్తే అస్సలు ఊరుకోను. గౌరవం లేని వాతావరణంలో పనిచేయడం అసాధ్యం’అని స్పష్టం చేసింది. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో నేను 2 సంవత్సరాలు 7 నెలలు ఒక సంస్థలో విధులు నిర్వహించా. కష్టపడ్డా. తగినట్లు పేరు సంపాదించాను. అదనపు గంటలు పనిచేశారు. అదనపు గంటలకు వేతనం ఇవ్వమంటే మేనేజర్ అందరిముందు నాపై అరిచారు. ఇది సరైన పద్దతి కాదు. క్షమాపణ అడిగాను. క్షమాపణలు చెప్పలేదు. అవన్నీ జరగనప్పుడు నేను అదే సంస్థలో ఉద్యోగం ఎందుకు చేయాలి. అందుకే రాజీనామా చేశా. ‘నిజం చెప్పాలంటే, అలా చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆమె చెప్పింది.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అనేక మంది యువత ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. ‘ఉద్యోగం కంటే గౌరవం ముఖ్యం’ అని కామెంట్లు చేస్తున్నారు. జెన్జీ తరం ఉద్యోగంలో కేవలం జీతం కోసం కాకుండా, గౌరవం, సౌకర్యం, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by VYLA | Dhrupadi (@vyla.world) -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్దీప్తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
శివ అంకుల్ నా చావుకు కారణం.. ఏటీఎంలా వాడుకున్నాడు..!
విజయనగరం జిల్లా: ‘శివ అంకుల్ నా చావుకు కారణం.. నన్ను ఒక ఏటీఎంలా వాడుకున్నారు.. తీయని మాటలతో నమ్మించి, హోటళ్లకు తీసుకెళ్లి సర్వస్వం దోచుకున్నారు.. 2019 నుంచి తన బాధ్యత, పిల్లల బాధ్యత చూస్తానని నమ్మించి భర్తలా కాపురం చేశాడు... ఆయన స్వార్థానికి నన్ను బలిచేశాడు.. ఆర్థికంగానూ దోచుకున్నాడు. నేను ఏ తప్పూచేయలేదు. నన్ను నీవు నమ్మితే చాలు అంటూ తన కుమారుడికి మెంటాడ మండలానికి చెందిన మహిళా నేత రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చివరి కోరికగా తన భర్తగా చలామణి అయిన శివకేశవనాయుడే తనకు తలకొరివి పెట్టాలని ఆ నోట్లో పేర్కొంది. విశాఖపట్నంలో మంగళవారం వేకువజామున పురుగులు మందు సేవించిన బాధితురాలు ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెంటాడకు చెందిన ‘పచ్చ’ పత్రిక విలేకరి శివకేశవనాయుడు తనను దోచుకున్న తీరు, మోసం చేసిన తీరును బాధితురాలు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఇప్పటివరకు స్థానికంగా ఎలాంటి కేసు నమోదుకాకపోవడం గమనార్హం. ఆ విలేకరి ఓ మంత్రికి అత్యంత ఆప్తుడు కావడమే దీనికి కారణమని స్థానికంగా చర్చ నడుస్తోంది. కేసు నమోదు విషయాన్ని మెంటాడ ఎస్ఐ కె.సీతారాము వద్ద ప్రస్తావించగా ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనగా పేర్కొన్నారు. -
హాఫ్ రేట్కే వందే భారత్ టికెట్లు!
రేటు కాస్త ఎక్కువై అయినా.. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఎక్కుతున్నారు. అయితే ఈ ‘స్పీడ్ రైలు’లో పరిస్థితులు కొత్తలో ఉన్నట్లు కనిపించడం లేదు. కోచ్ల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడం.. నాణ్యతలేని ఆహారం.. ఇలా ఏదో ఒక అంశంతో వివాదాలతో విమర్శల పాలవుతోంది. తాజాగా..మరో వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. వందేభారత్ టికెట్ను ఓ టీసీ సగం రేటుకే అమ్మే ప్రయత్నం చేయగా.. ఓ ప్రయాణికుడు ఆ తతంగాన్ని రికార్డు చేసి నెట్లో వదిలాడు. అదేంటి?.. ఆ టికెట్ ఆన్లైన్లోనే కదా దొరికేది అనుకుంటున్నారా?.. అసలేం జరిగిందో చదివేయండి.. ఫ్లాట్ఫారమ్ మీద కూర్చున్న కొందరు ప్రయాణికుల దగ్గరకు వెళ్లిన టీసీ.. టికెట్ చూపించడమని అడిగాడు. మిగతా వాళ్ల దగ్గర టికెట్ ఉందని.. తన దగ్గర టికెట్ లేదని ఒకతను బదులిచ్చాడు. దీంతో వందే భారత్ ఎక్కాలని ఉందా? అని అడిగాడు. రేటు ఎంత అని అడిగితే.. రూ.700 విలువైన వందే భారత్ టికెట్ను రూ.380కే ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు.. అదంతా రికార్డు చేశాడు.. ఇది అధికారికం కాదు, కానీ, నా చేతుల్లో పని. రైలు ప్రయాణానికి అనుమతిస్తాను అంటూ ఆ టీటీఈ వ్యాఖ్యానించాడు. అయితే వద్దని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. బీహార్ దానాపూర్ డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ రైలులో ఈ ఘటన జరిగింది. పాట్నా రైల్వే డివిజన్లో పని చేసే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) ఈ పని చేయబోయాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026రైల్వే సేవా (Railway Seva), దానాపూర్ డీఆర్ఎం ఈ వైరల్ వీడియోపై అధికారికంగా స్పందించింది. సంబంధిత టీటీఈని విచారించి.. అతన్ని సస్పెండ్ చేసింది. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఈ చర్యను అవినీతి, అధికార దుర్వినియోగంగా విమర్శించారు. మరికొందరు వ్యంగ్యంగా "ఇలాంటి సంఘటనలు సాధారణమైపోయాయి" అంటున్నారు. ఇంకొందరు మాత్రం టీటీఈ ఆ ప్రయాణికుడికి సహాయం చేయాలనుకున్నాడని.. కానీ, అతను ఇలా చేస్తాడని ఊహించలేదని అభిప్రాయపడ్డారు.వందే భారత్ ఎక్స్ప్రెస్ టికెట్లు అధికారికంగా కేవలం ఐఆర్సీటీసీ IRCTC వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారానే లభిస్తాయి. కొన్ని రూట్లలో బయలుదేరే 15 నిమిషాల ముందు వరకు సీట్లు(కరెంట్ బుకింగ్) లభించవచ్చు. ఆన్లైన్ బుకింగ్ తప్ప ఇతర మార్గం లేదు. -
యషిక ఆనంద్ హాట్ పోజులు.. యువరాణిలా ఐటమ్ బ్యూటీ నోరా..!
హీరోయన్ యషిక ఆనంద్ హాట్ పోజులు..సమ్మర్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్..యోగా చేయాలంటోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల..యువరాణిలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహీ..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ.. భర్తకు స్నేహా స్పెషల్ విషెస్..!
నిన్నుకోరి మూవీ రీ రిలీజ్ ఆనందంలో నివేదా థామస్..భర్తకు హీరోయిన్ స్నేహ స్పెషల్ విషెస్..ఎల్లో డ్రెస్లో టాలీవుడ్ నటి బిందు మాధవి హోయలు..వైట్ డ్రెస్లో ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ అందాలు..కూతురితో బిగ్బాస్ శివజ్యోతి మదర్స్ డే సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Divya Arundati (@divya_arundathi) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Vennela Manthri (@vennelamanthri) -
హీరోయిన్ త్రిషకు షాకింగ్ కౌంటర్ : డా.శివరంజని పోస్ట్ వైరల్
అనేక ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మధ్య ఎట్టకేలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంప్రదాయ చీరకట్టులో హాజరైన నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలం రంగు పట్టుచీరలో, కొప్పున మల్లెలతో కనిపించడమే కాదు, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆనందబాష్పాలతో నిండిన కళ్లతో భావోద్వేగానికి లోనవుతున్న వీడియో సంచలనం రేపింది. ఆ తరువాత తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టింది. ప్రేమ ఎప్పుడూ గొప్పదే అంటూ ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో విజయ్-త్రిష మధ్య ప్రేమానుబంధంపై రకరకాల వాదనలు, పుకార్లు హాట్ టాపిక్గా మారాయి.అయితే చిన్నపిల్లల వైద్యురాలు, ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేసిన హైదరాబాద్కు చెందిన డా. శివరంజని ఇన్స్టా పోస్ట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా త్రిష పోస్ట్కు కౌంటర్గా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చకు దారి తీసింది. ‘ప్రేమ ఎప్పటికీ గొప్పది కాదు. ద్రోహం. విచ్ఛిన్నమైన కుటుంబాల నిశ్శబ్దం బాధాకరం. ముఖ్యంగా పిల్లలకు’ అని అర్థం వచ్చే పిక్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. View this post on Instagram A post shared by Dr Sivaranjani Santosh (@drsivaranjanionline) నెటిజనుల స్పందనవావ్..ఎంత అద్భుతమైన సమాధానం, వావ్. మీపై గౌరవం పదివేల రెట్లు పెరిగింది అంటూ ఆమెను కొనియాడగా, మహిళలు ఆమెనే ఎందుకు నిందిస్తున్నారు, దీనికి ఆ వ్యక్తి ( విజయ్) బాధ్యుడు కాదా? నిజం ఏమిటంటే, ప్రతీ వివాహం శాశ్వతంగా నిలవాలని లేదు. కొన్నిసార్లు విడిపోవడమేమంచిది. ఆరోగ్యకరం కూడా. అందుకే చాలా జంటలు సమాజం కారణంగా కలిసి జీవిస్తాయి. వారు తమలో నింపుకున్న ద్వేషం చాలా లోతుగా పాతుకుపోయి, చాలాసార్లు దానిని పిల్లలకు కూడా అందిస్తారు అని మరొకరు కమెంట్ చేశారు.చిన్నప్పుడు నేను దీనిని అనుభవించాను. అది నా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది, ఇప్పటికీ నన్ను ప్రభావితం చేస్తూనే ఉంది! ఈ విషయాన్ని గట్టిగా చెప్పినందుకు ధన్యవాదాలు అని మరొకరు సమాధానం ఇవ్వడం విశేషం.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను‘ప్రతి ఒక్కరూ వివాహేతర సంబంధాన్ని సాధారణీకరించి, దాన్ని గొప్పగా కీర్తిస్తుండటం అత్యంత అసహ్య కరమైన విషయం. పిల్లలు మోయబోయే బాధ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పిల్లలు తమ తల్లికి చాలా గట్టిగా అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నేళ్లూ భార్య వెన్నెముకలా నిలబడింది, అకస్మాత్తుగా మరో స్త్రీ వచ్చింది. ఇది ఇద్దరి వ్యక్తుల తప్పే. అతను ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు, కానీ తన పిల్లల ముందు ఓడిపోయాడు.ఆమెను వేడుకకు తీసుకువచ్చి, పిల్లలను, భార్యను అవమానించడం అత్యంత ఘోరమైన విషయం.’ ఇది మరో స్పందన.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?ఒక పిల్లల వైద్యురాలిగా, విడిపోయిన లేదా, విచ్ఛిన్నమైన కుటంబాలలోని పిల్లలు అనుభవించే మానసిక క్షోభ, ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆమె వ్యాఖ్యలు చేశారని, పిల్లలపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం అంటున్నారు మరికొందరు. ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే? -
మోదీ చెప్పినట్లే.. ఆ దేశంలో జరుగుతోందా?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సికింద్రాబాద్ బహిరంగ సభ నుంచి దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విమర్శలు-ప్రతివిమర్శలు ఒకవైపు.. ఆర్థిక, ఇతర రంగాల నిపుణుల విశ్లేషణలు మరోవైపు.. ఇంకోవైపు సోషల్ మీడియా ఈ అంశంతో ఊగిపోతోంది. ఈ దరిమిలా మోదీ చెప్పినట్లే ఆ దేశంలో జరుగుతోందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. చమురు ఆదాపై మోదీ ఏమన్నారు.. దేశంలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సమస్యలను వివిధ దేశాలతో మాట్లాడి అధిగమిస్తాం. దీర్ఘకాలంలో చమురు వినియోగాన్ని మనం తగ్గించుకోవాలి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను(EV) ప్రోత్సహిస్తున్నాం. రైల్వే రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ అవసరం మనకు భారీగా తగ్గుతుంది. వర్క్ఫ్రమ్ హోమ్, వర్చువల్ మీటింగులు మళ్లీ పెరగాలి. వ్యక్తిగత వాహనాలు తగ్గించి.. ప్రజా రవాణా వినియోగం పెంచాలి. చమురు వాడకం తగ్గితే.. విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది.అక్కడ ఏం జరుగుతోంది?ఇండోనేషియా రాజధాని జకార్తాలో కార్ ఫ్రీ డే అని ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ప్రతీ ఆదివారం ఉదయం రోడ్లపై కార్లు, ఇతర వాహనాలకు కనిపించవు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ మాత్రమే ఒక లేన్లో తిరుగుతాయి. మరో లేన్లో ప్రజలు ఉత్సాహంగా జాగింగ్, సైక్లింగ్, యోగా, సామాజిక కార్యక్రమాలతో వీధులన్నీ నిండిపోతాయి. దీని వెనుక ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం. ఇది స్థానిక ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన చర్యలో భాగమైంది.2001లో సెప్టెంబర్ 22న జకార్తాలో కార్ ఫ్రీ డే మొదలైంది. నెదర్లాండ్స్ నుంచి ప్రేరణతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ప్రస్తుతానికి ఇది ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల దాకా నడుస్తోంది. జూన్ నుంచి ఉదయం 5.30గం. నుంచి 10గం. దాకా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. మోదీ తాజా సూచన కూడా దాదాపు ఇంచుమించుగా ఇక్కడ అమలవుతున్న పాలసీ తరహాలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇక్కడో తేడా ఉంది. The turnout for Jakarta’s weekly car-free day is incredible! pic.twitter.com/PuTLkpMLbf— Chris Kost (@chriskost) May 10, 2026మోదీ సూచనతో కంపేర్ చేస్తే..జకార్తా కార్ ఫ్రీ డేలో వారానికి ఒకసారి జరిగే.. అదీ కొన్నిగంటలు ఆచరించే పాలసీ నిర్ణయం కాగా, మోదీ సూచనలు భారత దేశంలో ప్రజల నిత్యజీవనంలో పాటించాల్సిన మార్గదర్శకాలుగా ఉన్నాయి. అక్కడి పాలసీ ప్రజలకు ఒక సానుకూల అనుభవం, ఒక ఉత్సవంలా మారింది. ప్రతీ ఆదివారం ఉత్సాహంగా పాల్గొంటారువాళ్లు. ఆ రోజున ఏదైనా ఇతర కార్యక్రమాలు ఉంటే.. ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారు. కానీ, మోదీ సూచనలు మాత్రం ప్రజల సంగతి పక్కనపెడితే ప్రతిపక్షాల దృష్టిలో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిన పిలుపుగా నిలిచాయి. ఇంధన వినియోగం తగ్గించాలనే లక్ష్యం ఒకటే అయినా.. జకార్తా కారు ఫ్రీ డే ప్రజల భాగస్వామ్యంతో, ఆనందకరమైన వాతావరణంలో జరుగుతుంది. మోదీ సూచనలు మాత్రం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల త్యాగాన్ని కోరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
నేను ఆరోగ్యంగానే ఉన్నాను
‘‘నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం... వాటిని నమ్మకండి’’ అని సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తెలిపారు. శక్తి కపూర్ మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఈ వార్తలపై ఆయన స్పందించి, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నా మృతి గురించి వస్తున్న వార్తలు అబద్ధం. ఇలాంటి పుకార్లను నమ్మకండి. ఇలాంటి తప్పుడు వార్తలను అందరం ఖండించాలి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’’ అని పేర్కొన్నారాయన. విలన్గా, కమెడియన్గా దాదాపు 700 చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు శక్తి కపూర్. ఆయన కుమార్తె శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ ద్వారా ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జిమ్ డ్రెస్లో నభా నటేశ్.. అనన్య నాగళ్ల స్మైలీ లుక్స్..!
జిమ్ డ్రెస్లో హీరోయిన్ నభా నటేశ్..సద్గురు ఫౌండేషన్లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..స్మైలీ లుక్స్తో హీరోయిన్ అనన్య నాగళ్ల పోజులు..వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్..వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Prakriti 💫 (@prakritikakar) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) -
నిలోఫర్లో రోగి సహాయకురాలిపై దాడి!
హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సహాయకురాలిపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోగి సహాయకురాలిపై ఓ మహిళ సెక్యూరిటీ పిడి గుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోగి సహాయకురాలిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి సద్దుమణిగాక అధికారులు, వైద్యులు బాధితురాలిపై సానిభూతిని ప్రదర్శించి సర్ది చెప్పి బయటికి పంపింనిట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఏ విషయంలో జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై సూపరిండెంట్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
15 కి.మీ.లకు రూ.1200
యశవంతపుర: బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరం ఆటోరిక్షాలో వెళ్లినందుకు రూ.1200 చార్జీ వసూలు చేసినట్లు ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది, అందువల్ల స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్లాను, ఇందుకు రూ.1200 వసూలు చేశారు, ఇది చాలా ఎక్కువ అని వివరించారు. ఈ పోస్టుపై సాన్యా సింగ్ అనే నెటిజన్ స్పందిస్తూ, బెంగళూరులో ఇలా ఉంటుందని ఊహించలేదు. మంగళవారం తన స్నేహితులతో కలిసి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించినందుకు 12 వందలు చార్జీ చేశారు. ఈ డబ్బుతో రెండుసార్లు ఇంటి సరుకులను కొనవచ్చు. బెంగళూరులో వయొలిన్ కంటే హార్న్ శబ్దమే జోరుగా వినపడుతుంది. కాలేజీలో ప్రవేశం కంటే ఇక్కడ రైడ్ను బుక్ చేయడం కష్టంగా ఉంటుంది అని విమర్శించారు. మన కెరియర్ పెరుగుతుందో, లేదో తెలియదు. ఆటో డ్రైవర్లు మాత్రం శ్రీమంతులు అవుతారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో చార్జీ చేయటం అన్యాయమంటూ కొందరు పేర్కొన్నారు. ఈ పోస్టుతో బెంగళూరులో ఆటో, క్యాబ్ చార్జీలు చర్చనీయాంశమయ్యాయి. -
విష్ణుప్రియ స్టన్నింగ్ పోజులు.. శారీలో పుష్ప బ్యూటీ పావని..!
రెడ్ డ్రెస్లో యాంకర్ విష్ణు ప్రియ స్టన్నింగ్ పోజులు..ఏప్రిల్ జ్ఞాపకాలు నెమరు వేసుకున్న యషిక ఆనంద్..శారీలో మరింత అందంగా పుష్ప బ్యూటీ పావని..బంగారంలా మెరిసిపోతున్న బాలీవుడ్ భామ నుస్రత్..చీరతో ముసుగేసిన ఐటమ్ సాంగ్ గర్ల్ నోరా ఫతేహీ.. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Vishnu Priya Bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Pavani Karanam (@livpavani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
వర్షం పడితే చాలు దోపిడీ
దేశ ఐటీ రాజధానిగా, ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా పేరుగాంచిన బెంగళూరులో వర్షం కురిస్తే చాలు జనజీవనం స్తంభించడంతోపాటు రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది. తాజాగా కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఛార్జీ కింద ఏకంగా రూ.1,200 వసూలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న ఈ సర్జ్ ప్రైసింగ్ (అధిక ఛార్జీలు) వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగింది?ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాన్యా సింగ్ తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో కేవలం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆటో డ్రైవర్ రూ.1,200 డిమాండ్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఆమె అంత మొత్తం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా ట్రాఫిక్ కారణంగా ఇంటికి చేరుకోవడానికి ఆమెకు ఏకంగా 3 గంటల సమయం పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.గందరగోళంబెంగళూరు వర్షాల గురించి సాన్యా సింగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘బెంగళూరులో వర్షం కురిసినప్పుడు వయోలిన్ సంగీతం వినిపించదు. కేవలం హారన్ల మోత మాత్రమే వినిపిస్తుంది. కాలేజీలో అడ్మిషన్ పొందడం కంటే వర్షం సమయంలో ఆటో బుక్ చేయడం చాలా కష్టమైన పని. మా కెరీర్లు ఎలా ఉన్నా ఆటో డ్రైవర్లు మాత్రం ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Sanya Singh (@sanya.unfiltered)సోషల్ మీడియాలో..ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ‘వర్షం పడితే చాలు ఆటోలు, క్యాబ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’ అని ఒక వినియోగదారుడు పేర్కొన్నారు. ‘డిమాండ్, సరఫరా పేరుతో డ్రైవర్లు ఇష్టానుసారంగా ధరలను పెంచేస్తున్నారు. దీనిని నియంత్రించే వ్యవస్థ లేదా నియమ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి?’ అని మరొకరు ప్రశ్నించారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
నా చావుకు కారణం మీ అనుచరులే..
నిడదవోలు రూరల్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనుచరుల టార్చర్ వల్లే నేను చనిపోతున్నాను.. అకారణంగా ఓ కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్టా మణికంఠ సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో మణికంఠ ఆచూకీ తెలపాలని టీడీపీ నాయకులు నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మరో వైపు మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సెల్ఫీ వీడియో సారాంశం ఇదీ.. ‘నా పేరు కట్టా మణికంఠ. మాది నిడదవోలు మండలం సింగవరం. నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నాను. మంత్రి కందుల దుర్గేష్ గారూ.. నేను తెలుగుదేశం కార్యకర్తను. మా నాన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 1989 నుంచి అదే టీడీపీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజ్, స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దానిపై మా నాన్న 14 నెలలుగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ బూత్ ఇన్చార్జినైన నా మీద కేసులు పెడితే ఇంకా ఎందుకు సార్ పార్టీ. మీ నియోజకవర్గంలో బీసీలంటే అంత చులకనా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నా ఫోన్ సీజ్ చేశారు. ఎస్సై, సీఐ పట్టించుకోవడం లేదు. నేను పనిచేసిన చోటుకు వచ్చి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నాకు గుండె దడగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి, పెన్మత్స చందు వర్మ, అచ్యుత్ పవన్, సాయిలక్ష్మణ్ అడ్డాల, ఎస్సై జగన్మోహన్రావు, సీఐ తిలక్లే. నేను చనిపోతున్నాను.. నా వల్ల కావడం లేదు.’ అని పోస్టు చేశాడు. -
గ్రీన్ డ్రెస్లో నిహారిక కొణిదెల.. డిఫరెంట్ అవుట్ఫిట్లో సుప్రీత..!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ..ఆరెంజ్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందాలు..పచ్చని డ్రెస్లో ప్రకృతిలో కలిసిపోయిన నిహారిక కొణిదెల..పార్టీలో యాంకర్ రష్మీ గౌతమ్ చిల్..డిఫరెంట్ అవుట్ఫిట్లో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ సుప్రీత.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
జ్ఞాపకాల్లో మెగా డాటర్ నిహారిక.. శారీలో సీతారామం బ్యూటీ..!
మూవీ ఈవెంట్లో మెరిసిన పాయల్ రాజ్పుత్..బిగ్బాస్ సావిత్రి ఇంట 21 రోజుల వేడుక..గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిఖా సురేంద్రన్..శారీలో మృణాల్ ఠాకూర్ హోయలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రాశి ఖన్నా హోయలు.. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
సముద్ర తీరాన హన్సిక చిల్.. పెళ్లి కూతురిలా మెరిసిపోతున్న శ్రీలీల..!
సముద్ర తీరాన చిల్ అవుతోన్న హన్సిక..బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ గ్లామర్ పోజులు..సమ్మర్లో మ్యాంగో తింటూ ఎంజాయ్ చేస్తోన్న సమీరా..బ్లూ డ్రెస్లో బిగ్బాస్ దివి అందాలు..పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ శ్రీలీల.. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwanni (@ihansika) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్తోనే లోక్సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్ను టేప్తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
అస్తిపంజరంతో బ్యాంక్కు.. అసలు జరిగింది ఇదే!
ఓ గిరిజనుడు తన సోదరి సమాధిని తవ్వి, ఆమె అస్థిపంజరాన్ని భుజాన మోసుకుని బ్యాంకు అధికారుల ముందు ప్రదర్శించిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. మీడియా, సోషల్ మీడియా ద్వారా ఇది బాగా వైరల్ అయ్యింది కూడా. ఈ ఘటన కలచి వేసిందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నియంత్రణ శాఖల మంత్రి సురేష్ పూజారి అనడం.. విపక్షాల విమర్శలకూ తావిచ్చింది. అయితే.. ఘటన వైరల్ అయిన నేపథ్యంలో జీతూ ముండాకే ఎక్కువ మంది సపోర్ట్గా నిలిచారు. వ్యవస్థలోని లోపాలు, అవగాహన లోపం, పేదరికం.. అంశాలతో పెద్ద చర్చే నడిచింది. ఏదైతేనేం బాధిత కుటుంబానికి అందాల్సిన డబ్బు అందింది. అయితే సంబంధిత బ్యాంకు మాత్రం వాస్తవాలు తెలుసుకోకుండా సగం సగం సమాచారంతో తమను తొట్టిపోయడం సరికాదని అంటోంది. ఫ్యాక్ట్ చెక్ పేరిట అసలేం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసింది. కేంఝర్ జిల్లా దియానలి గ్రామానికి కల్రా ముండాకు (56) ఒడిశా గ్రామీణ వికాస్ బ్యాంక్ బ్యాంకులో ఖాతా ఉంది. పశువులు అమ్మేయగా వచ్చిన సొమ్మును ఆమె ఆ ఖాతాలో జమ చేసుకుంది. అయితే ఈ ఏడాది జనవరిలో ఆమె కన్నుమూసింది. దీంతో ఆ సొమ్ము కోసం ఆమె సోదరుడు జీతూ ముండా (50) బ్యాంకు అధికారుల్ని సంప్రదించాడు. ఆమె వస్తేనే ఆ డబ్బు ఇవ్వడం కుదరుతుందని బ్యాంకు అధికారులు అతనితో చెప్పారు. ఆమె చనిపోయిందన్నా వినలేదు. దీంతో సాక్ష్యం కోసం ఆమె సమాధి తవ్వి ఎర్రటి ఎండలో భుజాన వేసుకుని బ్యాంకు దగ్గరికి వచ్చాడు. కంగారుపడిపోయిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడం.. ఈలోపు అతన్ని కొందరు వీడియోలు తీసి నెట్లో పెట్టారు. ఈలోపు పోలీసులు కలగజేసుకుని అతనికి న్యాయం చేస్తామని సర్దిచెప్పి.. ఆ అస్తిపంజరాన్ని తిరిగి సమాధిలోకి చేర్చారు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ภาพถึงหน้าแบงค์แล้ว Jitu Munda พยายามถอนเงินประมาณ 20,000 รูปี (6,877.64 บาท) จากบัญชีของพี่สาวผู้ล่วงลับ ธนาคารในรัฐโอดีชา ปฏิเสธ (ให้พาเจ้าของบัญชีมาด้วย) pic.twitter.com/TEi3evavxn— R here (@UvgtdERt4PWmcjF) April 28, 2026ఈ ఘటన వైరల్ కావడంతో.. మంగళవారం అధికారులు స్పందించారు. కల్రా ముండా డెత్ సర్టిఫికెట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు కూడా జీతూ ముండా, మిగతా సోదరీమణుల చేతికి అప్పగించారు. ఆ వెంటనే గ్రామీణ బ్యాంక్ అధికారులు కదిలారు. వాళ్లకు రావాల్సిన రూ.19, 402 సొమ్మును అందజేశారు. అదే సమయంలో రెడ్క్రాస్ సొసైటీ వాళ్లకు ఆ కుటుంబ దీనావస్థ గురించి తెలిసి మరో రూ.30 వేలను అందించింది. అయితే.. బ్యాంకు మాత్రం జరిగింది వేరని చెబుతోంది. విత్డ్రా సొమ్ము కోసం జీతూ ముండా బ్యాంకుకు వచ్చిన మాట వాస్తవమే. కానీ, అప్పటికే ఆయన మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ఉండడం, పైగా నిరక్షరాస్యుడు కావడంతో మా సిబ్బంది చెప్పింది అతనికి అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తి ఖాతాలో ఎమౌంట్ను విత్డ్రా చేసే అధికారం.. నామినీకి తప్ప మూడో వ్యక్తికి ఉండదు. అందుకే డబ్బు ఇవ్వడం కుదరదని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. ఆమె చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకురావాలని.. అదీ కుదరకుంటే నామీనిని అయినా తీసుకు రమ్మని చెప్పారు. అప్పటికే మత్తులో ఉన్న ఆయనకు అదేదీ అర్థం కాలేదు.. మా ఉద్దేశం డిపాజిటర్ డబ్బును రక్షించడం, నియమాలను పాటించడం మాత్రమే. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను వేధింపులకు గురి చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని ఒడిషా గ్రామీణ బ్యాంకుకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒక ట్వీట్ చేసింది. Reported Incident at Odisha Grameen Bank of claimant bringing sister’s skeleton for death claim process.We would like to submit that, today the Government Authorities have issued the Death Certificate and Legal Heir Certificate. Immediately on receipt of these documents, Bank…— Indian Overseas Bank (@IOBIndia) April 28, 2026 ఎవరేమంటున్నారు.. ‘నా సోదరి మరణించిందని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. ఆమెను తీసుకొని వస్తేనే డబ్బు ఇస్తామన్నారు. ఏం చేయాలో పాలుపోక నా సోదరి అస్థిపంజరాన్ని తీసుకొచ్చి ఆమె మరణించిన విషయాన్ని రుజువు చేయాలనుకున్నా’.. జీతూ ముండామా సోదరుడు డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగాడు. అక్కడి సిబ్బంది ఇవ్వకుండా అతన్ని వేధించారు. ఏం చేయాలో సరిగా వివరించలేదు. భరించలేకే ఆ పని చేశాడు. అందుకే అధికారులు దిగొచ్చి మా డబ్బు మాకు ఇచ్చారు .. జీతూ మిగిలిన ఇద్దరు సోదరీమణులుమరణించిన వ్యక్తిని బ్యాంకుకు తీసుకురావాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. అవసరమైన పత్రాలు అందించమని మాత్రమే కోరాం. అవి అందిన వెంటనే రూ.19,402 మొత్తాన్ని ముగ్గురికీ అందించాం.. బ్యాంకు అధికారులుజీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు.. స్థానిక పోలీసులుడబ్బు ఎలా తీసుకోవాలో జీతూ ముండా కుటుంబానికి అవగాహన లేకుండా పోయింది. అదే సమయంలో వాళ్లకు అర్థమయ్యేలా వివరించడంలో బ్యాంకు సిబ్బంది కూడా విఫలమయ్యారు.. గ్రామస్తులుబ్యాంకు అధికారులకు ఆ పెద్దాయన భలే బుద్ధి చెప్పారు అని కొందరు.. ఇలాంటి విషయాల్లో ఖాతాదారులకు కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. -
ఈ డెలివరీ బాయ్ చాలా మంచోడు
చిన్న చిన్న తప్పులు.. ఒక్కోసారి పెద్ద నష్టానికే దారి తీయొచ్చు. అలాంటి టైంలో ఎవరో ఒకరు కాపాడేందుకు ముందుకు వస్తే ఎలా ఉంటుంది?. వాళ్లను రియల్ హీరో అనకుండా ఉండలేం కదా!. ముంబైలో ఒక యువతి అలాంటి అనుభవం ఎదురైంది. డెలివరీ కోసమని వచ్చిన యువకుడు చేసిన పనితో ఆమె ఉబ్బితబ్బిబై నెట్టింట ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. ముంబైకి చెందిన దివ్య ఉన్ని.. పని నిమిత్తం బయటకు వెళ్లింది. ఆ కంగారులో ఇంటికి తాళం సంగతి ఏమోగానీ.. కనీసం డోర్ కూడా దగ్గరకు వేయకుండా వెళ్లిపోయింది. అయితే అప్పటికే ఆమె ఆన్లైన్లో ఓ పార్శిల్ ఆర్డర్ పెట్టింది. ఇంటికి తాళం వేయని సంగతి మర్చిపోయి.. డెలివరీ బాయ్ దానిని బయట పెట్టి వెళ్తాడులే అని అనుకుంది. అయితే డెలివరీ ఇవ్వడానికి వచ్చిన యువకుడు డోర్ తెరిచే ఉన్న విషయాన్ని గమనించాడు. ఇదే విషయాన్ని అతను ఫోన్లో ఆమెకు తెలియజేశాడు. నాలిక్కరుచుకున్న దివ్య.. ఆగమేఘాల మీద ఇంటికి చేరింది. ‘‘అతను కేవలం పార్సెల్ను వదిలి వెళ్లిపోలేదు. ఇంటి ముందు నిలబడి, ఎవరూ లోపలికి వెళ్లకుండా చూసుకున్నాడు. నా పెంపుడు పిల్లి బయటకు పారిపోకుండా చూశాడు. నేను వచ్చేదాకా ఓపికగా అక్కడే ఎదురు చూశాడు. తనను అమ్జాద్ అని పరిచయం చేసుకున్న ఈ డెలివరీ బాయ్కి దివ్య కృతజ్ఞతలు తెలిపింది.ఈ సంఘటనను దివ్య వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్ అయింది. అమ్జాద్ నిజాయితీ, బాధ్యతా భావం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. “ఇలాంటి నిజాయితీకి గుర్తింపు ఇవ్వాలి” అని కొందరు.. అతనికి టిప్ అయినా ఇవ్వాల్సింది అని మరికొందరు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Divya Unny (@divyaunnyfilms) -
అడ్డంగా దొరికిపోయిన రాఘవ్ చద్దా!
రాజకీయాల్లో మార్పులు సాధారణమే. కానీ ఆ మార్పులు డిజిటల్ యుగంలో ప్రజల నమ్మకాన్ని, నేతల ఇమేజ్ను ఒక్కసారిగా కుదిపేస్తాయి. అందుకు రాఘవ్ చద్దానే ఉదాహరణ. ఆమ్ ఆద్మీ పార్టీలో యువ నేతగా ఎదిగిన చద్దా.. బీజేపీలో చేరడానికి జెన్జీ జీర్ణించుకోలేకపోయింది. #UnfollowRaghavChadha అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతూ.. లక్షలాది ఫాలోవర్లు ఆయన్ని వదిలి వెళ్లిపోతున్నారు. తద్వారా దేశంలోనే అతిపెద్ద డిజిటల్ నిరసనకు ఆయన కారణమయ్యారు. చద్దా ఆప్ ఉన్నప్పుడు యువతకు దగ్గరగా ఉన్న నాయకుడిగా, మరీ ముఖ్యంగా సాధారణ సమస్యలపై మాట్లాడే వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. కానీ ఆప్ను తిడుతూ బీజేపీలో చేరిన వెంటనే ఆయనపై విశ్వాసం ఉంచిన యువతలో నిరాశ, కోపం వ్యక్తమైంది. ఈ నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో ఆయనకు ఉన్న ప్రజాదరణను కూడా గణనీయంగా ప్రభావితం చేసింది.కేవలం 24 గంటల్లోనే 1 మిలియన్కి(10 లక్షల మందికి) పైగా ఫాలోవర్స్ తగ్గిపోయారు. ఇప్పటిదాకా మొత్తం 2.3 మిలియన్ల మంది అన్ఫాలో చేశారు. ఇంకా అవుతూనే ఉన్నారు. జెన్జీ ఐకాన్గా పేరు పొందిన రాఘవ్ చద్దా పార్టీ మారడాన్ని యువత నమ్మక ద్రోహంగా ఫీలవ్వడమే ఈ ఫలితమని స్పష్టమవుతోంది. అయితే..ఈ పరిణామం తర్వాత ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రతీ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. డ్యామేజ్ కంట్రోల్కి దిగిన రాఘవ్ చద్దా.. ఫాలోవర్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొన్ని ఆధారాలు చూపించాడు. ఈ ఏడాది ఏప్రిల్లో అదీ ఈ మధ్యే క్రియేట్ చేసిన అకౌంట్ల ద్వారా రాఘవ్ చద్దాను ఫాలో చేయిస్తున్నారని.. వాటిలో పోస్టులు.. ప్రొఫైల్ ఫోటోలు.. ఎలాంటి ఎంగేజ్మెంట్ లేదని.. కేవలం బాట్స్ (bots) ద్వారా ఫాలోవర్స్ సంఖ్యను కృత్రిమంగా పెంచే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. నిజమైన ప్రజాదరణను నకిలీ ఫాలోవర్లతో కాపాడలేరు అని రతీ ఆ వీడియో చేయడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. ఈ వీడియోతో సోషల్ మీడియాలో రాఘవ్ చద్దా విశ్వసనీయతపై పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. సోషల్ మీడియా కాలంలో.. నాయకుల విశ్వసనీయత కేవలం సభల్లో ఇచ్చే ప్రసంగాలపై ఆధారపడదు. వారి డిజిటల్ ఇమేజ్, ప్రజలతో ఉన్న అనుబంధం, ఫాలోవర్ల ప్రతిస్పందన కూడా ముఖ్యమే. రాఘవ్ చద్దా కేసు.. సోషల్ మీడియా యుగంలో ప్రజల నమ్మకం ఎంత త్వరగా మారిపోతుందో, డిజిటల్ ఇమేజ్ ఎంత కీలకమో గుర్తు చేసింది. -
సమాధి తవ్వి.. భుజంపై అక్క అస్థిపంజరంతో..!
న్యాయం కోసం హీరోలు సినిమాల్లో పోరాడడం చూస్తుంటాం. భావోద్వేగంతో విజిల్స్ వేస్తుంటాం.. కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇప్పుడు నిజ జీవితంలోనూ అలాంటి ఓ ఘటనే జరిగింది. అయితే ఈ కథలో బాధితుడే ఓ హీరో. ఆ వ్యక్తి సహనానికి అధికారులు పరీక్ష పెట్టారు. ఓపిక నశించిన ఆ పెద్దాయన చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.50 ఏళ్ల జీతు ముండాది ఒడిషా కియోంజర్ జిల్లా డియానాలి గ్రామం. అతని అక్క కల్రా ముండా(56) ఈ జనవరిలో అనారోగ్యంతో చనిపోయింది. మరణించే ముందు ఆమె తన పశువుల్ని అమ్మింది. అలా వచ్చిన సొమ్ము రూ.20 వేలను ఒడిశా గ్రామీణ బ్యాంక్లో జమ చేసింది. అయితే ఆ సొమ్ము కోసం జీతు ఒజీవీ బ్యాంక్ మలిపోసి బ్రాంచ్కు వెళ్లాడు.కల్రా తన సోదరి అని, ఆమె మరణించిందని.. ఎవరూ లేకపోవడంతో ఆ సొమ్ము తనకు ఇవ్వమంటూ బ్యాంక్ అధికారుల్ని కోరాడు. అయితే సిబ్బంది అది వినిపించుకోలేదు. అకౌంట్ హోల్డర్ను తీసుకురావాల్సిందేనని పట్టుబట్టారు. అలా పదులసార్లు బ్యాంకుకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు మేనేజర్ కూడా చేతులెత్తయడంతో జీతూకి మండిపోయింది.సరాసరి అక్క సమాధి దగ్గరికి వెళ్లి.. ఆ అస్తిపంజరాన్ని ఓ సంచిలో మూటగట్టకున్నాడు. ఎర్రటి ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా ఆ సంచి మోసుకుంటూ బ్యాంకుకు వచ్చాడు. దారిన స్థానికులు కొందరు ఆ చర్యను చూసి షాక్కు గురయ్యారు. తమ మొబైల్స్లో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. అస్థిపంజరాన్ని చూపించి.. తన సోదరి చనిపోయిందని ఆధారాలు చూపించాడు. జీతూ చేసిన పనితో బ్యాంకు అధికారులు హడలి పోయారు. పోలీసులకు సమాచారం అందించారు.A man in Odisha dug up his deceased sister’s grave and brought her skeleton to the bank Just to prove she had died.He had been trying to withdraw ₹20,000 from her account, but bank officials kept insisting he bring the account holder in person. Despite repeatedly telling them… pic.twitter.com/hICEqwvPFu— Woke Eminent (@WokePandemic) April 28, 2026అనుమతి లేకుండా పాతిన శవాన్ని బయటకు తీయడం నేరమని.. జీతూ మీద కేసు పెట్టమని బ్యాంకు అధికారులు పోలీసుల మీద ఒత్తిడి చేశారు. కానీ, పోలీసులు మాత్రం ఆ పెద్దాయనకే సపోర్ట్గా నిలిచారు. వాళ్ల జోక్యంతో బ్యాంకు అధికారులు దిగి వచ్చారు. జీతు ముండాకి ఇవ్వాల్సిన సొమ్మును ఇచ్చే ఏర్పాటు చేశారు. ‘‘జీతు ముండా, కల్రా ముండాలు నిరక్షరాస్యులు. నామినీ, లీగల్ హెయిర్ అనే విషయాల గురించి తెలియదు. అకౌంట్లు ఇచ్చే సమయంలో అత్యుత్సాహం చూపించే సిబ్బంది కూడా సరైన విధంగా వివరించలేదు’’ అని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. తనకు తెలియకుండానే చేసిన ఈ నిరసన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భలే పని చేశాడని.. బ్యాంకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాడని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మన దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలు, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకుల్లో కోట్లాది డబ్బులు మూలుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో క్లైమ్ చేయని డిపాజిట్లు, టీడీఎస్ రీఫండ్లు కలిపి సుమారు లక్ష కోట్ల రూపాయలు ప్రజలకు చెందిన డబ్బు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి.బ్యాంకుల్లో క్లయిమ్ చేయని డిపాజిట్లుజనవరి 2026 నాటికి మొత్తం రూ.72,454 కోట్లుపబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో: రూ.60,571 కోట్లుప్రైవేట్ బ్యాంకుల్లో: రూ.9,608 కోట్లువిదేశీ బ్యాంకుల్లో: రూ.2,275 కోట్లు.. ఈ మొత్తాన్ని RBI నిర్వహించే Depositor Education and Awareness (DEA) Fundకి బదిలీ చేశారు.టీడీఎస్ రీఫండ్లుక్లైమ్ చేయని TDS రీఫండ్లు: సుమారు రూ3,000 కోట్లు. ఇవి ప్రభుత్వ ఖజానాలో ఉంటాయి, కానీ పన్ను చెల్లించిన వ్యక్తులు ITR ఫైలింగ్ ద్వారా తిరిగి పొందవచ్చు.ఎందుకు క్లయిమ్ చేయబడటం లేదు?అకౌంట్ హోల్డర్ మరణం, నామినీ లేకపోవడంప్రజల్లో అవగాహన లోపంక్లిష్టమైన పేపర్వర్క్, ప్రక్రియలు -
‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం!
ఇస్లామాబాద్: సోషల్ మీడియాలో ఏదైనా జోక్ వేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన వింత పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. తమ రోజువారీ ట్రాఫిక్ కష్టాలను వర్ణిస్తూ, ఓ యువకుడు సరదాగా చేసిన ఓ పోస్ట్ ఏకంగా అతన్ని కటకటాల వెనక్కి నెట్టివేసింది.ఇస్లామాబాద్లోని టార్నోల్ రైల్వే క్రాసింగ్ వద్ద నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీపై ఓ యువకుడు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశాడు. ‘టార్నోల్ రైల్వే క్రాసింగ్.. హార్ముజ్ జలసంధికి ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ దీన్ని మూసివేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి’ అని అందులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాంటి సున్నితమైన అంశాన్ని స్థానిక రైల్వే గేటుకు ముడిపెడుతూ, చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్గా మారింది.పోలీసుల యాక్షన్.. కఠిన సెక్షన్ల కింద కేసుఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇస్లామాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ఫోన్ను సీజ్ చేసి ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, అక్రమ నిర్బంధం, నేరానికి యత్నించడం వంటి పాకిస్తాన్ పీనల్ కోడ్లోని పలు కఠినమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా సెక్షన్ 144 అమల్లో ఉందని, అందుకే ముందస్తు భద్రతలో భాగంగానే ఈ అరెస్ట్ చేశామని పోలీసులు ఈ చర్యను సమర్థించుకుంటున్నారు.భావప్రకటనా స్వేచ్ఛపై మొదలైన తీవ్ర చర్చఅయితే, భద్రత పేరుతో పోలీసులు చేసిన ఈ అరెస్ట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం డార్క్ హ్యూమర్తో చేసిన ఓ చిన్న కామెంట్ను జాతీయ భద్రతా ముప్పుగా భావించి, అరెస్ట్ చేయడం ఏంటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పలువురు మండిపడుతున్నారు. భద్రత, పౌర హక్కుల మధ్య సమతుల్యత పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, ఒక జోక్కు ఇంతలా స్పందించడం సరికాదని స్థానిక పత్రికలు సైతం తమ సంపాదకీయాల్లో పోలీసుల తీరును ఎండగడుతున్నాయి.ఇది కూడా చదవండి: షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?
యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిందితుడు బీకే దిగంత్.. బెంగళూరు మెట్రో చిక్స్ అనే ఇన్స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
హైదరాబాద్లో పెట్రో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. భారీ క్యూలు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ దొరకదంట.. అర్జంట్గా పోయి ట్యాంకు ఫుల్ చేయించుకోవాలి అంటూ బంకు దగ్గరికి వెళ్లిన రామారావుకి జనం కాస్త ఎక్కువగా కనబడ్డారు. కాస్త ముందుకు వెళ్తే మరో బంక్ ఉంది కదా అనుకుని వెళ్తే.. మైండ్ బ్లాక్ అయ్యే దృశ్యం కనిపించింది. చూస్తే కిలోమీటర్పైగా బండ్లు క్యూ కట్టాయి. పోనీలే ఇంకో బంక్ అనుకుంటూ మరో రెండు కిలోమీటర్లు వెళ్లి చూస్తే అక్కడ ‘‘నో స్టాక్ బోర్డు’’.హైదరాబాద్లో సోమవారం నుంచి పెట్రో బంకుల వద్ద పరిస్థితి ఇది. మంగళవారం ఉదయం నాటికి అది తీవ్రతరంగా మారింది. పెట్రోల్ బంకుల ముందు ద్విచక్ర వాహనాలు, కార్లు భారీగా వరుస కట్టాయి. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాతే పెట్రోల్, డీజిల్ అంటూ చెబుతున్నారు బంకు నిర్వాహకులు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో బంకుల వద్ద దృశ్యాలు ఇవే. తొలుత ఏపీలో కేవలం డీజిల్ కొరత మాత్రమే ఉందని చర్చ జరగ్గా.. ఆ వెంటనే అది పెట్రోల్కు కూడా పాకింది. ఆ వెంటనే తెలుగు రాష్ట్రాల సరిహద్దుల గుండా నెమ్మదిగా అంతటా ‘పెట్రో కొరత వైరస్’ వ్యాపించేసింది. కంపెనీల నిర్వాకమా?యుద్ధ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. అయితే దేశీయంగా ఇంధన ధరలు పెరగకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టాలను భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్లకు సరఫరాను తగ్గించగా.. మరికొన్ని ‘రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ సంస్థల బంకులపై అదనపు భారం పడుతోంది. ఒకేసారి డిమాండ్ పెరగడంతో గంటల తరబడి వాహనాలు క్యూ కడుతుండగా.. సాధారణంగా రెండు మూడు రోజులకు సరిపడే స్టాక్ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతోంది. ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు. ‘‘పెట్రోల్, డీజిల్ అయిపోతోంది’’, ‘‘ఇరాన్ యుద్ధం జరుగుతోంది కదా ఇక కష్టమే’’, ‘‘ధరలు పెరుగుతాయి” ఇలాంటి వదంతులతో ప్రజలు అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం, బాటిళ్లు, క్యాన్లలో నిల్వ చేసుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని అధికారులు అంటున్నారు. ఫలితంగా.. అవసరం ఉన్న వాహనదారులు మాత్రమే కాదు వ్యవసాయ, వ్యాపార, పరిశ్రమ.. ఇతర రంగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్!తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందనే ప్రచారం సోషల్ మీడియాకే పరిమితమైందని ప్రభుత్వం అంటోంది. అలాగే తగినంత నిల్వలు.. సరఫరా సాఫీగానే ఉందని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. కానీ, పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తూ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులను రంగంలోకి దించినట్లు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, అది పూర్తి స్థాయిలో జరగడం లేదన్నది జనం మాట. ఈ విషయంలో ఇరు ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అవుతున్నాయని తిట్టిపోస్తున్నారు. ఆయిల్ కంపెనీలు సరైన సమాచారం అందించి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఈ భయాందోళనలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.Again I could see big queues at Petrol bunks #Hyderabad— Vinay (@vinay_a9) April 27, 2026Visited 3 petrol bunks in Hyderabad after 9PM, no service anywhere. Shortage again? 🤨#Hyderabad #PetrolShortage— Rishi. (@Rushiver_k) April 27, 2026Long queues in front of all petrol bunks in hyderabad . Shooting was interrupted today because of scarcity of diesel. 🙏🙏🙏— Sateesh Botta (@bkrsatish) April 27, 2026@TelanganaCMO @TelanganaCS @PetroleumMinToday almost all petrol Bunks in #Hyderabad have displayed "no stock" boards.And which bunk the stock is available have kilometres of Queue line for #petrol and #diesel.Is this a real shortage of fuel? pic.twitter.com/0xenXCN8dj— JALIGAMA PAVAN 🇮🇳 (@JaligamaPavan) April 27, 2026petrol crisis in hyderabad, most of the petrol bunks are closed and there's a huge rush wherever it's opened! pic.twitter.com/TjZws7nZwn— Vipul (@vipul_devis) April 27, 2026 -
వరల్డ్ రిచెస్ట్ సిటీ.. అట్ట పెట్టెల్లో నివాసం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసించే ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంకాంగ్. అయితే, ఇక్కడ నివసిస్తున్న గృహ కార్మికులు, సామాన్య ఉద్యోగుల సంబంధించిన జీవన శైలి తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీకెండ్స్లో కార్మికులు, ఉద్యోగులు అట్ట పెట్టెల్లో నివాసం ఉండటం, అండర్పాస్ల కింద సేద తీరడం వంటికి వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇంతకీ వాళ్లంతా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే..సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు హాంకాంగ్లో కార్మికుల జీవన శైలి, అక్కడి పరిస్థితులను వివరించారు. హాంకాంగ్లో గృహ నిర్మాణ కార్మికులు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలను తెలియజేశారు. పలువురు కార్మికులు అండర్పాస్లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో “కాఫిన్ హోమ్స్” (అట్ట పెట్టెల్లాంటి గదులు) నివసించడం ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్బంగా వారందరికీ నివాసం ఉండేందుకు సొంత ఇళ్లు లేదని చెప్పుకొచ్చారు. కార్డ్బోర్డ్ పెట్టెలతో తాత్కాలిక "గదులను" నిర్మించుకుంటారు. ఈ క్రమంలో.. హాంకాంగ్ ధనికులకు నివాసం కల్పించడానికి నిరాకరించే శ్రమశక్తిపైనే హాంకాంగ్ ఆధారపడి నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Rapha | Travel Tips & Itineraries 🌏 (@the.tale.of.travel) అయితే, “కాఫిన్ హోమ్స్” అనేవి అత్యంత చిన్న, కిక్కిరిసిన నివాస స్థలాలు. వీటిలో కార్మికులు మరియు తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు నిద్రించాల్సి వస్తుంది. ఎందుకంటే హాంకాంగ్లో గృహ ధరలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో, ప్రతీ ఆదివారం(సెలవు రోజున) ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాకు చెందిన వేలాది మంది మహిళలు తాము శుభ్రపరిచే విలాసవంతమైన అపార్ట్మెంట్ల నుండి, నగరంలోని ఉన్నత వర్గాల వారిని చూసుకునే కేర్ సెంటర్ల నుండి బలవంతంగా బయటకు పంపించేయబడుతున్నారు. వారికి సెలవు రోజున నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. సొంత నివాసాలు లేకపోవడంతో ఇలా అండర్పాస్లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో సేద తీరుతున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి కూడా వీటిని “మానవ గౌరవానికి అవమానం”గా పేర్కొంది.ప్రధాన కారణం.. హాంకాంగ్లో గృహ సంక్షోభానికి ప్రధాన కారణం భూమి కొరత, అధిక గృహ ధరలు, మరియు ప్రభుత్వ విధానాలే కారణం. హాంకాంగ్లో భూమి పరిమితంగా ఉండటం, ఎక్కువ భాగం పర్వతాలు లేదా రక్షిత ప్రాంతాలు కావడం ప్రధాన కారణం. మరోవైపు.. 2004–2021 మధ్య గృహ ధరలు 239% పెరిగాయి, కానీ వేతనాలు కేవలం 7.1% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం భూమి అమ్మకాలపై ఆధారపడటం వల్ల, అధిక విలువ గల ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ధరలను మరింత పెంచాయి. దీంతో, సామాన్యులు, కార్మికులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు. Hong Kong’da pazar izni gerçeği: Binlerce ev işçisi, çalıştıkları evden çıkmak zorunda kaldığı için köprü altlarında karton kutularla kendine “oda” yapıyor.Modern şehir dediğimiz şey bazen sadece pahalı binalardan ibaret. pic.twitter.com/ZTz9OvrB6M— 🐺Özet Geç 🦅 (@_OzetGec_) April 26, 2026కాఫిన్ హోమ్స్ అంటే ఏమిటి?.పరిమాణం: 11–25 sq ft (సాధారణంగా ఒక పార్కింగ్ స్థలం లేదా జైలు గది పరిమాణం).రూపకల్పన: పాత అపార్ట్మెంట్లను విభజించి, లోపల పెట్టెల్లాంటి గదులు తయారు చేస్తారు.సౌకర్యాలు: కిటికీలు లేకపోవడం, గాలి ప్రసరణ తక్కువగా ఉండటం, ప్రైవసీ లేకపోవడం.నివాసులు: తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు, డెలివరీ వర్కర్లు, వృద్ధులు, కొంతమంది విద్యార్థులు.సవాళ్లు..అద్దెలు పెరగడం: కొత్త నియమాలు గృహ ప్రమాణాలను మెరుగుపరుస్తాయి కానీ అద్దెలు పెరిగే అవకాశం ఉంది.సామాజిక అసమానత: తక్కువ ఆదాయం గల కార్మికులు ఇంకా “కాఫిన్ హోమ్స్” లేదా subdivided flatsలోనే ఉండే ప్రమాదం ఉంది.రాజకీయ ప్రభావం: డెవలపర్లు మరియు ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలు ప్రజా గృహాల విస్తరణను అడ్డుకుంటాయి.సమస్యలు, పరిష్కారాలుసమస్య: హాంకాంగ్లో గృహ ధరలు అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల కార్మికులు ఇలాంటి “కాఫిన్ హోమ్స్”లో నివసించాల్సి వస్తోంది.ప్రభుత్వ చర్యలు: తాత్కాలిక గృహాలు (transitional housing) అందిస్తున్నారు, కానీ 2 సంవత్సరాలకే పరిమితం.సామాజిక ప్రభావం: ఇది హాంకాంగ్లోని ఆర్థిక అసమానతకు స్పష్టమైన ఉదాహరణ. -
పెళ్లి వేడుకలో మెరిసిన నమ్రతా.. ఫుల్ గ్లామరస్గా ఆషిక రంగనాథ్..!
పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్ సందడి..శారీలో బాలీవుడ్ భామ కాజోల్ అందాలు..చుడిదార్లో హీరోయిన్ ప్రియమణి పోజులు..డిగ్రీ ఫోటోను షేర్ చేసిన హీరోయిన్ మాధవీలత..ఫుల్ గ్లామరస్గా కనిపించిన నా సామిరంగ బ్యూటీ..సముద్ర తీరాన నటి ఐశ్వర్య రఘుపతి చిల్.. View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Siddhi Idnani (@siddhi_idnani) -
అభిమాని ప్రీమియర్ లీగ్..
ఈ నెల 20న.. ముంబై ఇండియన్స్ –గుజరాత్ టైటాన్స్ మ్యాచ్..! హైదరాబాదీ కుర్రాడు తిలక్వర్మ ధాటిగా ఆడలేకపోతున్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా వచ్చి అతడితో ఏదో గట్టిగా మాట్లాడాడు. ఆ తర్వాత తిలక్ రెచి్చపోయి బాదేశాడు. సెంచరీ కొట్టాడు. తెల్లవారి చూస్తే, తిలక్తో వేడిగా సాగిన హార్దిక్ సంభాషణ సోషల్ మీడియా రీల్గా మారిపోయింది.సీఎస్కేతో మ్యాచ్లో ఓ బ్యాట్స్మన్ అవుటైన సమయానికి, స్టాండ్స్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) అభిమాని నిమ్మకాయతో కనిపించడం వైరల్ అయింది. దీంతో అతీంద్రియ శక్తులను ఆపాదిస్తూ హాస్యభరిత వీడియోలు ఆన్లైన్లో సందడి చేశాయి.సాక్షి,హైదరాబాద్ : మైదానంలో క్రీడాకారులు బంతులతో, బ్యాట్స్తో ఆడుకుంటుంటే.. మైదానం వెలుపల వారిని యువ వీక్షకులు రీల్స్తో, మీమ్స్తో ఆడేసుకుంటున్నారు. ఈ క్రియేటర్ల ధాటికి జెంటిల్మన్ గేమ్ నేడు చిలిపి సందడికి చిరునామాగా మారిపోయింది. వినోద ప్రధానంగా రూపుదిద్దుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కాన్సెప్ట్ సోషల్ మీడియా విజృంభణతో ఊహించని స్థాయిలో హై‘పిచ్’ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా మారింది. ఇన్స్ట్రాగామ్ రీల్స్ నుంచి ఎక్స్లో పోస్టుల వరకు, ట్రోలింగ్ అంతటా వ్యాపించింది. అత్యంత నేర్పుగా... ఆద్యంతం కట్టిపడేసేలా చేసిన ఎడిట్లు, ఫన్నీ రియాక్షన్లు నిమిషాల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. జెన్ జీ ట్రెండ్.. ఐపీఎల్ సీజన్ సందర్భంగా, రీల్స్ మీమ్స్తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జెన్ జెడ్... ఐపీఎల్తో మీమ్స్, రీల్స్ ఫాంటసీ లీగ్ల ద్వారా ఎక్కువగా మమేకమవుతున్నారు. ఈ ప్లాట్ఫామ్స్ తాజా లీగ్ను ‘మీమ్ పండగ’గా మార్చాయి. ఐపీఎల్లో జరుగుతున్న చిన్నచిన్న ఘటనలను కూడా శరవేగంగా వైరల్ అయ్యేలా చేస్తున్నాయి. కాదేదీ కామెడీకి అనర్హం ఒక అభిమాని ఇన్స్ట్రాగామ్ రీల్ కోసం పాపులర్.. ‘రింగ్ టాస్’ ట్రెండ్ను ప్రయత్నిస్తూ రూ.70 వేల విలువైన ఉంగరాన్ని పోగొట్టుకోవడం వైరల్ అయింది. ఆ ఉంగరం జారిపోయి... దొరక్కపోవడంతో దీనిపై ఆన్లైన్లో మీమ్స్ స్పందనలు వెల్లువెత్తాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంపియన్ చెన్నూ సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య పోటీలు, జట్ల ప్రదర్శన, కెప్టెన్సీ.. అంతులేని మీమ్స్ను సృష్టించాయి. ‘ఈ సాలా కప్ నమదే’ జోకులు, ‘తలా ఫర్ ఎ రీజన్’ మీమ్స్ సందడి చేశాయి. ఆయా జట్ల మద్దతుదారులు చెలరేగి నాన్స్టాప్గా ట్రోలింగ్కు దిగారు.ఆపాదించుకుని.. ఆస్వాదిస్తూ ఒకప్పుడు లైవ్ క్రికెట్ను చూడడానికి మాత్రమే అలవాటు పడిన నగర వాసులు.. ఇప్పుడు క్రికెట్లో పరోక్షంగా పాల్గొనడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మాŠయ్చ్ పరిస్థితులను ఆపాదించుకుని రీల్స్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. వాటిలో స్వయంగా నటిస్తూ తామూ క్రికెటర్లమేనన్న అనుభూతిని పొందుతున్నారు. సహజంగానే వినూత్నతను ఇష్టపడే యువత.. ఈ తరహా ట్రెండ్తో మరింత మజా పొందుతున్నారు. దానికి తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ.. ఇతరుల కామెంట్లు కూడా చదువుతూ ఆనందిస్తున్నారు. -
10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఝలక్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చద్దాకు భారీ షాక్ తగిలింది. పార్టీకి, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేశారన్న ఆరోపణల మధ్య చద్దాకు సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. అతి తక్కువ కాలంలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఫేస్బుక్ , ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై చద్దాను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమేకాదు లక్షలాది మంది అన్ ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా ఈ పరిణామం సోషల్ మీడియాపై బాగా ప్రభావం చూపించింది.Unfollow Raghav Chadha సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతరాఘవ్ చద్దా రాజకీయ మార్పు వార్త బయటకు రాగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్లో ఆయనపై విమర్శల వర్షం కురిసింది.ఫాలోవర్ల సంఖ్యగా భారీగా తగ్గిపోయింది. ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుండి 1.37 కోట్లకు పడిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో సుమారు 80,000 పైగా ప్రతికూల కామెంట్లు రాగా, ఫేస్బుక్లో వేలమంది యూజర్లు ఆయనను అన్ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు.నెటిజన్లు ఆయనను ఉద్దేశించి “హీరో టు జీరో”, “పంజాబ్ గద్దర్” (పంజాబ్ ద్రోహి), , “అన్ఫాలో రాఘవ్ చద్దా” చద్దా కాదు చడ్డీ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఫలితంగా 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయన్ను అన్ఫాలో చేశారు.సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే, ఇటివలి పరిణామాలు, కేజ్రీవాల్కి లిక్కర్ స్కాంనుంచి ఊరట లభించగానే చద్దాపై చర్యలు, పథకం ప్రకారం ఆరుగురి ఎంపీలతో కలిసి చద్దా పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు మరియు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్ ,అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అంత్యక్రియల్లో బార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!
థాయ్లాండ్లో ఒక వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక మనిషి చివరి కోరిక తీర్చడం, కనీసధర్మంగా పాటించడం ఆనవాయితీ. అలా వారి ఆత్మశాంతిస్తుందని కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢంగా నమ్ముతారు. కానీ అలా చేసినందుకు ఒక థాయ్ కుటుంబం విమర్శల పాలైంది. అసలింతకీ ఏమైంది? అతని చివరి కోరిక ఏంటి?బ్యాంకాక్ పోస్ట్ నివేదిక ప్రకారం,దక్షిణ థాయ్లాండ్లోని నఖోన్ సి తమ్మారత్ ప్రావిన్స్లో ఉన్న వాట్ థెప్పనోమ్ చుయట్ అనే బౌద్ధ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. ఏప్రిల్ 15న మరణించిన 59 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియలను ఏప్రిల్ 21న నిర్వహించారు. అయితే అతని దహన సంస్కారాలకు ముందు ప్రదర్శన ఇవ్వడానికి 'కొయెట్ డాన్సర్స్' గా పిలిచే ముగ్గురు మహిళా నృత్యకారులను ఏర్పాటు చేసింది. (అతి తక్కువ బట్టలతో నృత్యం చేస్తారు. సాధారణంగా బార్ టేబుళ్ల మీద, నైట్క్లబ్లలో లేదా ఇతర కార్యక్రమాలలో నృత్యం చేస్తారు) దీనికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి.ఏం జరిగింది?బౌద్ధ సన్యాసులు ప్రార్థనలు పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత, చితికి నిప్పంటించే ముందు ఈ నృత్య ప్రదర్శన జరిగింది. ముగ్గురు యువతులు శవపేటిక ముందు నిలబడి డ్యాన్స్ చేశారు. అన్ని వయసుల వారు ఈ ప్రదర్శనను చూస్తుండగా, దీనిని సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుబాధపడుతూ కూర్చోవడం కంటే, మరణించిన వారి ఆఖరి కోరికను గౌరవించడం మంచిదే. దీనివల్ల విషాదం కొంతవరకు తగ్గుతుందని కొందరు సదరు కుటుంబానికి మద్దతుగా నిలిచారు. మరోవైపు మరణించిన వారి కోరికను గౌరవించాల్సిందే, కానీ అంత్యక్రియల వంటి పవిత్రమైన చోట ఇలాంటి నృత్యాలు సరికావు. ముఖ్యంగా చిన్న పిల్లల ముందు ఇలాంటి ప్రదర్శనలు భ్యంతరకరమని మరికొందరు విమర్శించారు. మొత్తానికి, సంప్రదాయానికి, వ్యక్తిగత కోరికకు మధ్య జరుగుతున్న ఈ వివాదం థాయ్లాండ్లో హాట్ టాపిక్గా మారింది.కుటుంబ సభ్యుల వివరణనెటిజన్ల విమర్శల నేపథ్యంలో మృతుడి కుటుంబం వివరణ ఇచ్చింది. "చావు అనేది అనివార్యం, నా అంత్యక్రియల సమయంలో ఎవరూ ఏడవకూడదు, వేడుకలా జరుపు కోవాలి" అనేది అతని చివరి కోరిక అని, దాన్ని నెరవేర్చడం తమ కనీస బాధ్యఅని భావించామని తెలిపారు. అతను జీవించి ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా, జోవియల్గా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చడానికి మరియు శోకతప్త హృదయాల్లో ఆనందాన్ని నింపడానికే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
రెండేళ్లుగా నరకం : పెళ్లంటేనే భయం భయ్యా, వైరల్ వీడియో
గృహ హింస, వేధింపులు బాధితులు కేవలం మహిళలు మాత్రమే కాదు. పురుషులు కూడా అనేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా భార్య చేతిలో వేధింపులకు గురవుతున్న ఒక వ్యక్తి, తన ల్యాప్టాప్ ద్వారా ఆ దాడులను రికార్డ్ చేసి బయట పెట్టాడు. ఇది నెట్టింట ఫెమినిజంపై చర్చకు దారి తీసింది .ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయిఏం జరిగింది అంటే?ఒక వ్యక్తి తన భార్య చేతిలో దారుణ హింసను ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్లపాటు వేధింపులు తరువాత తన ల్యాప్టాప్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ప్రకారం మహిళ తన భర్తతో తీవ్రంగా వాదిస్తోంది. ఆమె అతడిని చెంపదెబ్బలు కొట్టడం, జుట్టు పట్టుకుని లాగడం వంటి దృశ్యాలు ల్యాప్టాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ‘‘పెళ్లి చేసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి" అనే క్యాప్షన్తో ఈ వీడియో నెట్టింట షేర్ అయింది. దీంతో హాట్ టాపిక్గా మారింది.నెటిజన్ల స్పందనఈ వీడియో పురుషులపై జరుగుతున్న గృహహింస గురించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి అంటేనే భయం వేస్తోంది" భయ్యా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు ఇది 'గృహ ఉగ్రవాదం' అని అభివర్ణించారు. అంతేకాదు పనిలో పనిగా ఫెమినిజంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ ఫెమినిస్టులు ఎక్కడ ఉన్నారు? ఈ మహిళను కూడా సమర్థిస్తారా?" అని కొందరు ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇది నిజమైన ఫెమినిజం కాదని, హింస అని విమర్శించారు. ఈ ఘటన వెనుక ఉన్న మహిళ బెంగాలీ అని పేర్కొంటూ, కొందరు బెంగాలీ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇతర వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పురుషులు కూడా బాధితులుగా మారుతున్నారని, వారి కోసం కూడా కఠిన చట్టాలు ఉండాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఇదీ చదవండి: 3 అపార్ట్మెంట్లు, రూ. 38 కోట్లు : వార్తల్లో షారుఖ్ మేనేజర్నోట్ : సాధారణంగా గృహహింస అంటే మహిళలపై జరిగేది అనే భావన ఉంటుంది స్త్రీ-పురుషులతో సంబంధంలేకుండా వేధింపులు, గృహహింస (Domestic Violence) ఎవరు అనుభవించినా అది నేరమే. హింస ఎక్కడ ఉన్నా తప్పే. జెండర్తో సంబంధం లేకుండా హింసను ఎదుర్కోవడం ముఖ్యం అనే అవగాహన పెరగాలి. తమపై దౌర్జన్యాలకు అన్యాయానికి వ్యతిరేకంగా సంబంధిత చట్ట వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం, రక్షణ పొందడం అవసరం. After being abused for the past two years bro recorded these clips on his laptop Think twice before getting married 🙏 pic.twitter.com/1AQLGWjooU— Vishal (@VishalMalvi_) April 23, 2026 -
చాలా ఇష్టమంటోన్న బిగ్బాస్ దివి.. ఫస్ట్ టైమ్ అంటోన్న యషిక ఆనంద్
మొక్కల పెంపకంలో బిజీగా బిగ్బాస్ దివి..శారీలో బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా అందాలు..బీచ్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ సిమ్రత్ కౌర్..ఫస్ట్ టైమ్ ఓటేసిన ఆనందంలో యషిక ఆనంద్ పోజులు..పెళ్లి కూతురిలా ముస్తాబైన మంచు లక్ష్మీ.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
హవ్వ..! మతపైత్యం అదుపులో ఉంచుకోలేరా?
మతాలు, కులాలు మనుషుల మధ్య అడ్డుగోడలుగా నిలవడం ఇవాళ్టి వ్యవహారం కాదు. ఈ గీతలు దాటిన ప్రేమలు ఎన్ని మొగ్గ తొడుగుతున్నప్పటికీ, పెళ్లిళ్లు ఎన్ని జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులోనైనా ఏదో ఒకనాటికి సమసిపోతాయని అనుకునే వాతావరణం మాత్రం లేదు. ఎందుకంటే.. ఎంతగా ఆధునిక సమాజం ఈ అడ్డుగోడల్ని దాటి వికసిస్తున్నదో.. అంతకంటే ఎక్కువగా మనుషుల్లో కుల జాడ్యం, మతమౌఢ్యం మరింతగా వేళ్లూనుకుంటున్న ఉదాహరణలు మనకు సర్వత్రా కనిపిస్తుంటాయి. సున్నితమైన ఈ అంశాల్లో ఎదుటివారి మనోభావాల్ని గాయపరచడం మాత్రమే కాదు.. దారుణంగా రెచ్చగొట్టే భయావహ వాతావరణానికి గురిచేసే ఘటనలు మనకు నిత్యం అనేకం తారసపడుతుంటాయి. బెంగుళూరు నగరంలో కూడా అలాంటిదే ఒక సంఘటన చోటు చేసుకుంది.అబ్బిగెరె ప్రాంతంలో ఓ దంపతులు.. ఒక ముస్లిం వ్యక్తిని అభ్యంతరకరమైన మాటలతో నిందించారు. ‘నువ్వు ముస్లింవి. నువ్వు పాకిస్తానీవి. నువ్వొక టెర్రరిస్టువి’ అంటూ వారు అతడిని తూలనాడారు. ఇలాంటి మాటలు ఒక సాధారణ ముస్లింను ఎంతగా గాయపరుస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. వీరి నిందల పర్యవసానంగా స్థానికంగా ఒక సంస్థకు చెందిన వారు.. ఆ దంపతులకు సదవగాహన కల్పించి, బుద్ధిమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వారి ఇంటికి వచ్చి.. ఇలా ముస్లిం పేరుతో ఒక మనిషిని కించపరుస్తూ మాట్లాడడం, టెర్రరిస్టుగా అభివర్ణించడం తప్పు అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ సంస్థ తరఫున వచ్చిన వారిలో కేవలం ముస్లిములే కాదు. అన్ని మతాల వారూ ఉన్నారు. ముస్లిం అయిన ప్రతీ వ్యక్తిని టెర్రరిస్టుగా చిత్రీకరించి.. సభ్యసమాజంలో అశాంతికి, అపోహలకు బీజం వేసే ఇలాంటి బుద్ధులను ఎండగట్టారు. ఆ దంపతులకు వీరు బుద్ధి మాటలు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారుతోంది.ప్రత్యేకించి ఈ సంఘటనలో మరో సంగతి చెప్పుకోవాలి. ఈ సందర్భంగా ఆ దంపతుల్లో భర్త తమను గురించి తాము ఘనంగా చెప్పుకుంటూ.. నేను డిఫెన్సులో పనిచేస్తున్న వాడినే అంటూ గంభీరంగా సెలవిచ్చారు. డిఫెన్సులో పనిచేస్తున్న వ్యక్తివే అయితే గనుక.. నీలో మరింతగా దేశభక్తి ఉండాలి. ఈ దేశం అన్ని మతాలు, అన్ని ధర్మాల సమ్మేళనం అనే స్పృహ నీకు ఎక్కువగా ఉండాలి. పరమతసహనం కూడా నీలో ఎక్కువగా ఉండాలి.. కనిపించిన ప్రతి ముస్లింను పాకిస్తానీగా, టెర్రరిస్టుగా చిత్రీకరిస్తూ ఎలా మాట్లాడతావు? అంటూ వాళ్లు నిలదీశారు. చివరికి ఆ దంపతులు క్షమాపణ చెప్పబోయినప్పుడు కూడా.. మీరు క్షమాపణ చెప్పడం కాదు.. మీ ఆలోచన మార్చుకోవాలి.. అంటూ వారు హితవు చెప్పి వెళ్లడం గమనించాల్సిన సంగతి.Abbigere, BengaluruA woman and her husband (a former army officer) have been accused of making derogatory remarks to a Muslim man, saying, "You are Muslim, you are Pakistani, you are a terrorist." Subsequently, members of an organization arrived at the scene, protested. pic.twitter.com/5YwFlPieHg— The Muslim (@TheMuslim786) April 22, 2026మనం చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం. ఇళ్లు అద్దెకు తీసుకునేందుకు తిరిగేవారిని మీరు శాకాహారులైతేనే ఇస్తాం’ అని చెప్పే వాళ్లు మనకు పురాతన కాలం నుంచి ఇవాళ్టికీ కనిపిస్తూనే ఉంటారు. ఇలాంటి మనుషుల్ని తప్పుబట్టే వాళ్లూ ఉంటారు. అయితే అలాంటి వారి బాధల్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం అయిన వ్యక్తి కనిపిస్తే చాలు.. ‘మీరంతా పాకిస్తానీలు.. మీరంతా టెర్రరిస్టులు..’ అని నిందించే వారిని ఏమనాలి? పాకిస్తాన్ మీద ఉన్న ద్వేషాన్ని ఒక మతానికి ఆపాదించడమూ, ఆ మతానికి చెందిన అందరి మీదా టెర్రరిజం ముద్ర వేసేయడమూ ఎంత అనైతికం అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది.దుర్మార్గాలు కులాల్ని బట్టి, మతాల్ని బట్టి ఉండవు. కేవలం మనుషుల్లో ఉండే బుద్ధుల్లో మాత్రమే ఉంటాయి. అలాంటి తప్పుడు మనుషులు ఒకే మతంలో లేదా ఒకే కులంలో ఉంటారని అనడం, ఆపాదించడం సుహృద్భావ సమాజ ఆవిష్కరణకు పెనుద్రోహం అవుతుంది. ఆ సత్యం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోగలిగితే.. ఏ ఇద్దరు మనుషుల మధ్య కూడా ఎలాంటి అపోహలూ ఉండని మంచి రోజులు తప్పకుండా వస్తాయి.-యం.రాజేశ్వరి. -
ఫేక్ అయితేనేం... ఫేమ్ అయ్యింది!
సమాజం సవ్యంగా ఉండాలంటే కుటుంబాలు బాగుండాలి. ఆ కుటుంబాల కోసం పిల్లల పెంపకం నుంచి ఇంటిపనుల వరకు మహిళలు ఎంతో శ్రమిస్తారు. తల్లుల కష్టమే కుటుంబ రథానికి ఇంధనం అవుతుంది. అయితే వారి శ్రమ ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతుంటుంది. పైగా... ‘పురుషులు బయటకి వెళ్లి కష్టపడతారు. స్త్రీలు ఇల్లు కదలకుండా సుఖంగా ఉంటారు’ అనే ప్రచారం ఒకటి. వారి శ్రమకు వెల కట్టేవారు లేరు. వారి శ్రమ కనిపించని శ్రమ అయింది. తాజా విషయానికి వస్తే.,...‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందని చెబుతుంటారు.‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొట్టే శిల్పం ఇది. జోస్ లూయిస్ ఫెర్నాండేజ్ రూపొందించారని చెబుతున్న ఈ శిల్పంలో... ఒకవైపు పిల్లలను చేతిలో పట్టుకొని, మరోవైపు... చీపురు, వాషింగ్ మెషిన్, బకెట్లాంటి ఇంటిబరువును వీపున మోస్తున్న స్త్రీ కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలను, ఇంటి పనులను వీపుపై మోస్తున్న ఈ స్త్రీ శిల్పం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ పొందింది. అసలు విషయం ఏమింటే, ఇలాంటి శిల్పం నిజంగా లేదు. పూర్తిగా కల్పితం. అయినప్పటికీ ఈ కల్పిత శిల్పం విపరీతంగా వైరల్ అయింది. లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకొని ‘వైరల్ స్టాచ్యూ’ గా పేరు తెచ్చుకుంది. ‘ఏమీ చేయని స్త్రీ’ అని పేరు పెట్టిన ఒక శిల్పం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. తల్లుల కనబడని శ్రమకు గౌరవసూచకంగా రూపొందించిన ఈ శిల్పం స్పెయిన్లో ఉందట! ‘ఇంటికి పరిమితమైన మహిళలు ఏమీ చేయరు’ అనే పురుషాధిక్య భావజాలాన్నిబద్దలు కొట్టే శిల్పం ఇది. -
తమిళనాడులో బాబు స్పీచ్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్
-
ఎలుకను తరిమి.. బోరుబావిలో పడి..
ఆదివారం ఆటవిడుపులో భాగంగా.. కురుక్షేత్ర ఎంపీ నవీన్ జిందాల్ సరదాగా పోలో మ్యాచ్ ఆడారు. ఆరు గోల్స్ చేసి కురక్షేత్ర టీం కెప్టెన్గా విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారు కూడా. అయితే మ్యాచ్ మధ్యలో సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చి.. ఓ పాతికేళ్ల కుర్రాడిని పరిచయం చేసి దేశం దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు.నవీన్ జిందాల్తో ఉన్న ఆ యువకుడి పేరు ప్రిన్స్. ఆర్మీలో చేరాలనే కసితో పరీక్షలు రాశాడు. కానీ, ఎత్తు రూపంలో అతని కల చెదిరిపోయింది. ఐటీఐ కోర్స్ పూర్తి చేసిన ప్రిన్స్.. ప్రస్తుతం అంబాల నగరంలో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే అతనిలో అంత ప్రత్యేకత ఏముందా? అనుకుంటున్నవాళ్లకు నవీన్ జిందాల్ ఆ కుర్రాడితోనే అసలు విషయం చెప్పించాడు.అది 2006 జులై 21.. కురుక్షేత్ర జిల్లా షాహబాద్ మండలం హల్ధేరీ గ్రామం. తన స్నేహితుడు అంగ్రెజ్తో కలిసి పంట పొల్లాల్లో ఆడుకుంటున్నాడు నాలుగేళ్ల చిన్నోడు ప్రిన్స్. ఇంతలో ఓ ఎలుక వాళ్ల కంట పడింది. దాని వెంట పడుతూ పరుగులు తీశారు ఆ ఇద్దరు. ఇంతలో అది ఓ సంచిని దాటుకుని కలుగులోకి దూరింది. ఆ పాలిథీన్ సంచిపై ఒక్క దూటున దూకారా పిల్లలు. అంగ్రెజ్ పక్కకు పడిపోగా.. ప్రిన్స్ మాత్రం క్షణాల్లో 60 అడుగుల బోరుబావిలోకి జారిపోయాడు. అయితే..అంగ్రెజ్ ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్లి అందరినీ తీసుకొచ్చాడు. జనం, పోలీసులు, అధికారులు, బుల్డోజర్లు.. కాసేపటికే రెస్క్యూ వాతావరణంతో అక్కడి వాతావరణం మారిపోయింది. హర్యానా కావడంతో ఆర్మీ అక్కడికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే నేల స్వభావం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగింది. ఈలోపు దేశం మొత్తం ఆ చిన్నారి క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనలు చేసింది. ఈ మధ్యలో..చిన్నా.. భయపడకు. ఎలాగైనా నిన్ను బయటకు తీస్తాం అంటూ తల్లిదండ్రుల మాటలు, అధికారుల పిచ్చాపాటి సంభాషణలతో ప్రిన్స్ ఏడవకుండా ధైర్యంగా ఉండిపోయాడు. సుమారు 50 గంటల తర్వాత పిల్లాడిని సజీవంగా బయటకు తీయగలిగింది సైన్యం. అంతే దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది.అలా బోర్వెల్ బాయ్గా స్థిరపడిన ఆ చిన్నారి ప్రిన్సే.. ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడిగా నవీన్ జిందాల్తో లైవ్లో కనిపించాడు. ఆనాడు బోరుబావిలో పడ్డాక ఆ చిన్నారి ప్రదర్శించిన ధైర్యాన్ని గుర్తు చేసుకున్న జిందాల్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఆ టైంలో ప్రిన్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. సరైన తిండి లేక ప్రిన్స్ నీరసంగా కనిపించాడు. బోరుబావిలో పడిన సమయంలో.. దేశం నలుమూలల నుంచి ఆ కుర్రాడి కోసం చాక్లెట్లు, బిస్కెట్లు.. ఇతర తినుబండారాలు వచ్చాయి. అదలా కొన్నాళ్లపాటు కొనసాగింది అని గుర్తు చేశారాయన. తాను ఎవరి నుంచి ఎలాంటి సాయం ఆశించడం లేదని.. దేవుడిచ్చిన జీవితం.. సైన్యం ప్రసాదించిన పునర్జన్మతో తన కాళ్ల మీద తాను నిలబడతానని చెబుతున్నాడా మృత్యుంజయుడు. -
Kasu Mahesh Reddy : జరా జాగ్రత్త..!
-
అనుష్క పోస్ట్కి స్పందించిన ర్యాపిడో.. క్షమాపణలు
రైడ్-హైలింగ్ సేవలపై ఫిర్యాదులు పెరిగిపోతున్న రోజులివి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే చేదు అనుభవాలను తరచూ నెట్టింట చూస్తూనే ఉన్నాం. లైంగికంగా వేధించడం.. లేదంటే హయ్యర్ చార్జీలు డిమాండ్ చేస్తుండడాన్ని అందరి దృష్టికి తీసుకెళ్తున్నారు బాధితులు. ఈ తరుణంలో తాజాగా ఓ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ స్పందించాల్సి వచ్చింది.ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో ఘజియాబాద్కు చెందిన ఓ యువతి షేర్ చేయడంతో పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో అతను చేసిన మెసేజ్లను ఆమె స్క్రీన్ షాట్ రూపంలో ప్రదర్శించింది. ఆ యువతి పేరు అనుష్క. తనను గమ్య స్థానంలో దించి వెళ్లిపోయిన కాసేపటికి ఆ డ్రైవర్ తనకు హాయ్ అంటూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘‘నేనెవరో గుర్తుపట్టలేదా?. ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను. మీరు అందంగా ఉన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మరింత బాగుంటారు. మీ వయసు ఎంత?.. ఒంటరిగా ఉంటున్నారా?.. కోపం వద్దు.. రేపు సాయంత్రం అలా బయటకు వెళ్దామా?’’ అంటూ మెసేజ్ చేశాడతను.దానికి ఆమె ‘‘నీ పని నువ్వు చేస్కో భయ్యా..’’ అంటూ బ్లాక్ చేసిందా యువతి. ఆ మొత్తం ఘటనను వీడియో రూపేణా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. దీంతో ర్యాపిడో కంపెనీ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Anushka_Official☀️ (@aanu_shka3)ఆ డ్రైవర్ ప్రవర్తనను “అంగీకరించలేని చర్య”గా పేర్కొంటూ.. వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించే ప్రవర్తన తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ IDని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని కోరుతూ.. కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.ఈ ఘటనతో వినియోగదారులు డేటా గోప్యత, వ్యక్తిగత సమాచారం వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ర్యాపిడో లాంటి ప్రముఖ కంపెనీలు రైడ్-హైలింగ్(Ride-hailing) సేవల టైంలో వినియోగదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
మద్యం మత్తులో యువకుల ఘర్షణ
గుంటూరు: గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలోని కంకరగుంట బ్రిడ్జి వద్ద ఓ వైన్ షాపు భవనం పైనుంచి వేలాడదీసి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పై దాడి చేసిన ఘటన ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రసన్న సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆకులవారితోట ప్రాంతానికి చెందిన దేవరకొండ స్వరూప్, శ్రీనివాసరావు తోట ప్రాంతానికి చెందిన దేవరకొండ శశికుమార్ సోదరులు. వీరు మద్యం తాగేందుకు కొమ్మినేని రత్తయ్యకు చెందిన నిర్మల్ వైన్ షాపు వద్దకు వచ్చారు. మద్యం తాగుతున్న సమయంలో అదే వైన్షాపులో ఉన్న మరో వ్యక్తితో వాగ్వవాదం చోటుచేసుకుంది. దీంతో సోదరులిద్దరు ఆ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మద్యం మత్తులో ఆ వ్యక్తిని వైన్ షాపు భవనం పై నుంచి కిందకు వేలాడ తీసి తీవ్రంగా దాడి చేశారు. ఇది గమనించి వాహనదారులు సెల్ఫోన్లో వీడియాలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది సేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇద్దరు సోదరులను వైన్షాపు నిర్వాహకులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలి చేరుకుని ఇద్దరు సోదరులను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. బల్లి రాజ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి ఇద్దరు సోదరుల దాడికి భయపడి పారిపోవడంతో గాయపడిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని విచారించి ఇద్దరు సోదరులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ వెల్లడించారు. -
బైక్ యాక్సిడెంట్.. ముగ్గురు అన్నదమ్ముల దుర్మరణం
స్పీడ్ థ్రిల్స్.. బట్ ఇట్ కిల్స్.. ఎన్నోసార్లు రుజువు చేసింది. సరదా కోసం కొందరు యువకులు పని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించి.. తల్లిదండ్రులకు గుండె కోత మిగిల్చారు. మధ్యప్రదేశ్లోని మౌగంజ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఏప్రిల్ 14న అన్నదమ్ములైన ఉప్లక్ష్ కోల్, అమ్రిష్ కోల్, హేమరాజ్ కోల్లు ఒకే బైక్పై స్పీడ్గా ప్రయాణించారు. ఆ ముందు మరో బైక్ మీద స్నేహితులు ప్రశాంత్, ప్రదీప్ ద్వివేది వీడియో తీస్తూ ముందుకు సాగారు. వీడియోలో బైక్ చివర కూర్చున్న సోదరుడి చేతితో తుపాకీ కూడా ఉంది. రెండు బైక్లు ఒకదానిని మించి మరొకటి దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. మధ్యలో ఒక ట్రక్కును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇటుకలతో నిండిన ట్రాలీని ఢీ కొట్టింది. मऊगंज में एक सड़क हादसे में तीन भाइयों की मौत हो गई. इस हादसे का एक वीडियो सामने आया है, जिसमें यह साफ देखा जा सकता है कि रफ्तार का जुनून कितना खतरनाक हो सकता है. #mpnews #roadaccident pic.twitter.com/8AV0YNOXSa— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) April 19, 2026ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు అక్కడికక్కడే మరణించారు. వీడియో తీస్తున్న మరో బైక్పై ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా స్కిడ్ అయ్యి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తుపాకీ ఎక్కడిదనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. హెచ్చరిక: వేగం క్షణికానందం పంచొచ్చు.. కానీ నిర్లక్ష్యం ప్రాణాలను తీసుకుపోతుంది -
మీతో పని ఉంది సార్.. రాత్రి ఇంటికి రండి!
అనంతపురం జిల్లా: హనీ ట్రాప్ దందా దుమారం రేపుతోంది. సమాజంలో గౌరవంగా బతుకుతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఈ నయా దందాపై ‘కవ్విస్తారు.. కాటేస్తారు!’ అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనం ఉమ్మడి జిల్లాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై బాధితులు నేరుగా ఎస్పీ జగదీష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో అనంతపురం రూరల్, నాలుగో పట్టణ పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు గ్యాంగ్ లీడరు లేడీబాస్తో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులందరిపైనా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న దందా.. వలపు వయ్యారాలతో బాధితులకు వల వేసి, వీడియో కాల్స్, వ్యక్తిగత సంభాషణలను ఆయుధాలుగా మార్చుకుని రూ.లక్షలు దోచుకుంటున్న ఈ ముఠా కార్యకలాపాలు విస్తృతంగా సాగినట్లు వెల్లడవుతోంది. ముఖ్యంగా ‘లేడీ డాన్’ ఆధ్వర్యంలో ఈ దందా నడుస్తున్నట్టు బయటపడటం కలకలం రేపుతోంది. ఐదేళ్ల కిందట తిరుపతిలో ఒక ఫారెస్ట్ అధికారిని ఇదే తరహాలో బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు వసూలు చేసిన ఘటన కూడా ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తిరుపతిలో కేసు కూడా నమోదైంది. అలాగే కూడేరు మండలానికి చెందిన బాధితుడు ఈ ముఠా వలలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదులు చేయడం, అలాగే ముఠాలో డబ్బుల పంపకాల విషయంలో విభేదాలు రావడం వల్ల ఈ దందా వెలుగులోకి వచ్చింది. లబోదిబోమంటున్న రిటైర్డ్ ఉద్యోగి.. అనంతపురం రూరల్ ప్రాంతానికి చెందిన 70 ఏళ్లకు పైబడి ఉన్న ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత పనిమీద రుద్రంపేట వద్దనున్న డీమార్ట్ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ (అప్పటికే పక్కా ప్రణాళిక రచించారు) తారసపడి.. సదరు రిటైర్డ్ ఉద్యోగి చేస్తున్న పనికి సంబంధించి తమకు అవసరం ఉందని, ఇంటివద్దకు రావాలని చెప్పి ఫోన్ నంబరు తీసుకెళ్లింది. మరుసటి రోజు ఫోన్ చేసి రిటైర్డ్ ఉద్యోగిని రుద్రంపేట శివారులోని ప్రాంతానికి పిలిపించింది. అక్కడ ఇంట్లోకి రాగానే తలుపు దగ్గరగా వేసింది. ‘రండి సార్.. పర్వాలేదు’ అంటూ వలపు మాటలతో రెచ్చగొట్టింది. ఈ పరిణామంతో కంగుతిన్న బాధితుడు ‘అమ్మా...ఏంటిది’ అంటుండగానే అప్పటికే బయట సిద్ధంగా ఉన్న పాత్రధారులు రంగప్రవేశం చేశారు. రిటైర్డ్ ఉద్యోగిని న్యూడ్(నగ్నం)గా నిలబెట్టి వీడియోలు, ఫొటోల్లో బంధించారు. ఆయనతో పాటు ఉన్న మహిళపై తీవ్రస్థాయిలో చిందులేశారు. ‘నువ్వు అవసరం లేదుపో... మా కుటుంబ మర్యాద మంటగలిపావు’ అని అనడంతో ఆ వృద్ధుడికి ఏమి జరుగుతోందో తెలీక బిక్కమొహం వేశాడు. ‘నీ విషయం కూడా బయటపెడతా...ఎలా మా ఇంటికి వస్తావు. పోలీసులకు ఫిర్యాదు చేస్తా. మీ కుటుంబ సభ్యులందరికీ ఫొటోలు, వీడియోలు పంపుతా. సోషల్ మీడియాలోనూ పెడతాన’ని బెదిరించారు. దీంతో ఆయన లబోదిబోమంటూ తనకు ఏపాపమూ తెలీదని చెప్పినా వినలేదు. చివరగా రూ.10 లక్షలు ఇస్తే సమస్య ఇంతటితో ఆపేస్తామని, లేదంటే నీ బండారమంతా బయటపెడతామని చెప్పడంతో తన ఇబ్బందులన్నీ చెప్పుకుని చివరకు రూ.3 లక్షలు సమరి్పంచుకున్నాడు. ఇలాంటి బాధితులు చాలామందే ఉన్నారు. అయితే ఎక్కువగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ధనవంతులను ఈ ముఠా లక్ష్యం చేసుకుంది. -
సడెన్ షాక్ అంటే ఇదేనేమో.. అర్ధరాత్రి వింత అనుభవం..
Viral Video.. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో ప్రమాదకరమైన స్టంట్ చేసిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. సదరు యువతి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రదీప్ చౌదరి అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ వీడియో ప్రకారం.. మద్యం మత్తులో ఇద్దరు యువతులు థార్ వాహనంపైన కూర్చుని ఉన్నారు. మద్యం మత్తులో రాత్రి వేళ ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ క్రమంలో కారు పైన ఉన్న ఒక యువతి సరిగా కూర్చునేందుకు ప్రయత్నించింది. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని వేగంగా ముందుకు కదిలించాడు.సదరు యువతి అలర్ట్గా లేకపోవడం.. సడెన్గా వాహనం ముందుకు కదలడం ఒక్కసారిగా జరిగిపోవడంతో యువతి రోడ్డుపై వెనక్కి పడిపోయింది. అక్కడే కుప్పకూలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఆమె తలకు తీవ్రమైన గాయం కావడానికి, ప్రాణాలకే ముప్పు తెచ్చింది. ఆమె కింద పడగానే చుట్టుపక్కల ఉన్న జనం హుటాహుటిన ఆమె వైపు పరుగెత్తుకు వచ్చారు. ఈమెను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదంతా వీడియోలో కనిపించింది. అనంతరం, ఏం జరిగింది అనే విషయం తెలియలేదు.लड़की पूरी तरह से दारू के नशे में धुत्त है वह थार की छत पर बैठ जाती और ड्राइवर स्टंट कराने की कोशिश करता है लड़की तुरंत नीचे जाकर गिरती है।ऐसे शराबियों के साथ में ऐसा होना बहुत जरूरी होता है ,अब आगे से ये कभी ऊपर नहीं बैठेगी 😂 pic.twitter.com/HisY39UjXy— Pradeep Chaudhary (@pradeepgr63) April 16, 2026ఇక, ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. నెటిజన్లు వీడియోపై స్పందిస్తూ.. సదరు యువతి, డ్రైవర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతారాహిత్యానికి ఇది పరాకాష్ట అని మండిపడుతున్నారు. ఇలాంటి విన్యాసాలు కేవలం చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతరులకు కూడా ముప్పు కలిగిస్తాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేశారు. -
హే అంకుల్ సామ్! బీబీకి దూరం : ట్రంప్పై సెటైర్ల జోరు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైంది మొదలు, ప్రసుత సీజ్ఫైర్ దాకా పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన అనేక వివాదాస్ప, గందరగోళ ప్రకటనలపై ఇరాన్ సోషల్ మీడియా ఘోరంగా ట్రోల్ చేస్తోంది. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ గట్టి కౌంటరే ఇచ్చారు. ట్రంప్ విజయోత్సాహపు వాదనలపై 7 వాదనలు, 7 అబద్ధాలు ('7 claims 7 lies') అంటూ విరుచుకు పడ్డారు. ట్రంప్ విజయోత్సాహం, ఇరాన్ తీవ్ర స్పందనఇరాన్ యుద్ధంలో విజయం సాధించానని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం అబద్ధాలని, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఇరాన్ మండిపడింది.ప్రపంచానికి ఇది ఒక గొప్ప అద్భుతమైన రోజు అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్లో ట్రంప్ రాసుకొచ్చిన వైనంపై జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ సంచలన వ్యాఖ్యానించింది. "ఎక్కువ ఆనందాన్ని ప్రదర్శించవద్దు, కొంచెం హుందాగా ఉండండి. ఫోన్ పక్కన పెట్టి హాయిగా నిద్రపోండి. అలాగే నెతన్యాహు (Bibi)ని ఒక వారం పాటు బ్లాక్ చేయండి" అంటూ ఎద్దేవా చేసింది. అలాగే వివిధ దేశాల్లోని ఇరాన్ రాయబార కార్యాలయాలు ట్రంప్పై సెటైర్లు వేశాయి. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా ఏమీ తక్కువ తినలేదు. ట్రంప్కు ఒక మంచి సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు) అవసరమని ఘాటుగా వ్యాఖ్యానించింది.New Lego video about Drunk Pete Hegseth.. pic.twitter.com/iLGGvBLtTl— PolitMemeAi🔥 (@MemesNoWords) April 17, 2026 ట్రంప్ను ఎగతాళి చేస్తూ, మరో పోస్ట్లో ఇలా కూడా పేర్కొంది, "హే అంకుల్ సామ్! మీరెందుకు ఒక నిర్ణయం తీసుకోరు? హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచాలనుకుంటున్నారా లేక మళ్లీ మూసివేయాలను కుంటున్నారా?!" ఇదీ చదవండి: LPG Gas రూ. 12 వేల కోట్లతో నాలుగు పైప్లైన్ల ప్లాన్కాగా ట్రంప్ అనేక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం, దీనిని ఇకపై ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఉపయోగించరు అని ప్రకటించిన కొన్ని గంటలకే అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేయవచ్చని ఇరాన్ హెచ్చరించింది. మీడియా యుద్ధం ద్వారా ప్రజల అభిప్రాయాలను మార్చాలని అమెరికా చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి ట్రిక్కులకు ప్రభావితం కారని గాలిబాఫ్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
మాజీ డిప్యూటీ సీఎంకు షాకిచ్చిన పోలీసులు..
ఛండీగఢ్: హర్యానాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలాతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనపై గన్ గురిపెట్టారని చౌతాలా సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల మేరకు.. హర్యానాలోని గురు జంబేశ్వర్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనకు సంబంధించి జేజేపీతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై హిసార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సిద్ధాంత్ జైన్ను కలవడానికి మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా వెళ్లారు. ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి తన కారును పోలీసు వాహనంతో అడ్డగించారని, కారును ఢీకొట్టడానికి ప్రయత్నించారని చౌతాలా ఆరోపించారు. సదరు అధికారి అంతటితో ఆగకుండా.. తనపై పిస్టల్ గురిపెట్టినట్టు ఆరోపించారు.BJP ka Nayab HaryanaPolice ke besh main Gunde.....@PMOIndia @NayabSainiBJP pic.twitter.com/uVCBOFyyVf— Dushyant Chautala (@Dchautala) April 17, 2026దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాగా, ఈ వీడియోలో ఒక పోలీసు వాహనం తన కారును అడ్డుకోవడం స్పష్టంగా కనిపించింది. మరో వీడియోలో, చౌతాలా తన వాహనం దిగి పోలీసులను నిలదీయడం కనిపిస్తుంది. ఆ తర్వాత, కదులుతున్న ఆ వాహనాన్ని ఆపడానికి ఆయన అందులోకి ఎక్కడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది, కానీ ఆ వాహనం వేగంగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అనంతరం, ఈ వీడియోను చౌతాలా ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్బంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ నాయబ్ హర్యానా పోలీసులతో దాడి చేస్తున్నాడు. రక్షకుడే వేటగాడిగా మారినప్పుడు, వ్యవస్థను ప్రశ్నించడం అనివార్యమవుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఘటనను పోలీసుల రౌడీయిజంగా అభివర్ణించారు. ఇదే బీజేపీ వారి నయా హర్యానా.. పోలీసు యూనిఫాంలో ఉన్న రౌడీలు అని వ్యాఖ్యానించారు.जब रक्षक ही भक्षक बन जाए, तो व्यवस्था पर सवाल उठना तय है। pic.twitter.com/UGvYm7qEJx— Dushyant Chautala (@Dchautala) April 17, 2026 -
తప్పుడు పోస్టులపై వైఎస్ భారతీరెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికలు మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్లకు లీగల్ నోటీసులు పంపారు. భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈమేరకు నోటీసులిచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులను ప్రచారం చేస్తున్న థింక్ ఆంధ్ర, ఎం9 న్యూస్లకు సైతం నోటీసులు పంపారు.భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డి బాధితులుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి.. అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర.. తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి 9 న్యూస్ కూడా ఇలాంటి కంటెంట్నే సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్ పనే..ఈ కంటెంట్ను భారతీరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్రా ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రణాళికబద్ధంగా సాగుతున్న దాడి...వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతీరెడ్డి వ్యకిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుత లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, మళ్లీ ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..’ అని ప్రద్యుమన్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. -
బ్లాక్ శారీలో నిహారిక అందాలు.. కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ..!
కోలీవుడ్ బ్యూటీ రవీనా రవి స్మైలీ లుక్స్..హీరోయిన్ అనన్య నాగళ్ల బ్యూటీఫుల్ వీడియో..కోట్లో మెరిసిపోతున్న పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్..బ్లాక్ శారీలో నిహారిక కొణిదెల అందాలు..గ్రీన్ డ్రెస్లో హీరోయిన్ రెజీనా హోయలు.. View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanoor Sana Begum (@shanoor_sana) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raveena Ravi (@raveena1166) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
15 మంది మృతి.. ఓ మహిళ మాత్రం ఇన్స్టాగ్రామ్ రీల్తో బతికింది
చండీగఢ్ : 15 మంది ప్రాణాలు బలిగొన్న పడవ ప్రమాదంలో ఓ మహిళ మాత్రం చావు అంచున ఉన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ను గుర్తు చేసుకుని అద్భుతంగా ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పోలీసుల వివరాల ప్రకారం, గత వారం ఉత్తరప్రదేశ్లోని మథురలో పెను విషాదం చోటు చేసుకుంది. వృందావన్లోని యమునా నదిలో 20–30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. వేగంగా వీస్తున్న గాలుల కారణంగా పడవ అదుపు తప్పి, అనంతరం సీ ఘాట్ వద్ద ఉన్న పాంటూన్ వంతెనను ఢీకొనడంతో బోల్తా పడిందని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ రోజు ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నాటికి మొత్తం 15 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, గల్లంతైన వారిలో లూధియానాకు చెందిన 54 ఏళ్ల రాజిందర్ కౌర్ బంగా మాత్రం చావు అంచు నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు నీటిలో మునిగి ఊపిరాడక హాహాకారాలు చేస్తుండగా, బంగా మాత్రం తాను గతంలో ఇన్స్టాగ్రామ్లో చూసిన వీడియోను గుర్తు చేసుకుని ప్రాణాలను కాపాడుకున్నట్లు స్వయంగా మీడియాకు తెలిపారు.‘నేను గతంలో నీటిలో మునిగితే ఎలా బయటపడాలో వివరిస్తూ ఇన్స్టాలో అప్లోడ్ చేసిన టిప్స్ వీడియో చూశాను. ప్రమాద సమయంలో ఆ సూచనలు గుర్తుకు వచ్చాయి. నోరు తెరవలేదు, చేతులను నిటారుగా ఉంచాను, కాళ్లను కదిలించాను. ఈత రాకపోయినా ఆ సూచనల వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాను’ అని ఆమె పేర్కొన్నారు. -
ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్!
సమయం: ఉదయం 10 గంటలు.. స్థలం: మన దేశంలోనే కానీ కచ్చితంగా తెలియదు.. కనుచూపు మేర నుంచి తమవైపే కదలి వస్తున్న ఓ మరమనిషిని చూసి కోళ్లు ‘‘కొకొక్కొ..’’ అంటూ చెల్లాచెదురయ్యాయి. దూరంగా వీధి కుక్కలు.. ఇదేందయ్యా ఇది అన్నట్లు ఓ చూపు చూసి దౌడు అందుకున్నాయి. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు.. అంటూ వీధుల వెంట జనం ఆశ్చర్యపోతూ ఆ దృశ్యాన్నే చూస్తున్నాడు...ఇదేదో కొత్త గేమ్ క్యారెక్టర్లా ఉందే అంటూ ఓ చిన్నారి తన తల్లితో చెబుతూ చప్పట్లు కొడుతూ మురిసిపోతోంది. కాస్త దూరంలో ఉన్న అధికారులు, సిబ్బంది.. ‘హమ్మయ్యా.. వీధుల్లో, గల్లీల్లో తిరిగే జంతువుల్ని కంట్రోల్ చేయడానికి మేం రోడ్డెక్కాల్సిన రావాల్సిన అవసరం లేదు’ అంటూ తెగ సంబరపడిపోయ్యారు. అధికారుల్లో ఒకరు మైక్ అందుకుని.. ‘‘ఇది ఒక రోబో. పేరు ఎడ్వర్డ్.. ఇక నుంచి వీధుల్లో, రోడ్ల మీద జంతువుల్ని తరమి కొడుతుంది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు’’ అంటూ అనౌన్స్ చేశారు. ఇది ఇంకా ఏం చేస్తుందా? అని స్థానికులు గుమిగూడి చూస్తున్నారు. ఈలోపు.. నడిరోడ్డులో డివైడర్కు కాస్త పక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటూ నెమరేస్తున్న ఆవు దగ్గరికి వెళ్లింది ఆ రోబో. ఆవు మాత్రం కదలకుండా ‘‘ఇప్పుడు నిన్ను చూసి భయపడలా?’’ అన్నట్టుగా ఓ చూపు చూసి తన పనిలో తాను ఉండిపోయింది. పాపం ఆ పిచ్చి యంత్రుడు ‘‘ఉషూ.. ఉషూ.. చో’’ అన్నట్లు ఎన్ని సైగలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈలోపు పారిపోతున్న కోళ్లు, వీధి కుక్కలు ఆ సీన్ చూసి ఆగిపోయాయి. పైకి నిలబడిన ఆ ఆవును చూసి కేజీఎఫ్లో రాకీభాయ్లా ఊహించేసుకున్నాయి. ఆవు వెంట కలిసిన ఆ జంతువులు ఆ రోబోను, తమను తరిమేందుకు వచ్చిన అధికారులను రోడ్ల వెంట పరుగులు పెట్టించాయి. ‘‘ఒరేయ్ ఆజామూ.. లగెత్తరోయ్’’ అంటూ అధికారులు.. ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా’’ అంటూ ఎడ్వర్డ్ చెరో వైపు పారిపోయారు. పాపం ఎడ్వర్డ్ వార్చోకి(Edward Warchocki).. పోలాండ్లోని వార్సా నగరంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్(Unitree G1 humanoid robot). వీడు ఈ మధ్యే అడవి పందుల గుంపును వెంబడించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వినోదం కోసం చేసిన ప్రదర్శన మాత్రమే అయినా స్థానికులు దీనిని ఆసక్తిగా చూశారు. ఈ దృశ్యం "సై-ఫై సినిమా"లా కనిపించడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.zaganiam dziki do lasu pic.twitter.com/Pjxkn0kfob— Edward Warchocki (@edwardwarchocki) April 12, 2026కొందరు దీనిని కేవలం మార్కెటింగ్ స్టంట్ అని, మరికొందరు భవిష్యత్తు టెక్నాలజీకి సంకేతం అని భావిస్తున్నారు. మన దేశానికి వస్తే మాత్రం ఎడ్వర్డ్గాడి పరిస్థితి పైన చెప్పుకున్నట్లే ఉంటుందని కొందరు సెటైర్ల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. -
వెర్రితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు ... టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దు్రష్పచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది. ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశ్వంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తుండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పుంఖానుపుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతుండటం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్డడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించవన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించడమే లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ...నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తుండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది. -
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల.. ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల..!
రెడ్ శారీలో హీరోయిన్ శ్రీలీల హోయలు..డెకాయిట్ మూడ్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్..ఎల్లో డ్రెస్లో నిహారిక కొణిదెల అందాలు..కర్లింగ్ జుట్టుతో మంజరి ఫడ్నవీస్ బ్యూటీఫుల్ లుక్..సాగర తీరాన బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిల్..బాలీవుడ్ భామ సురభి జ్యోతి బేబీ బంప్ ఫోజులు.. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Surbhi Jyoti (@surbhijyoti) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
పోలీసుల్ని ఆశ్రయించిన వల్లభనేని వంశీ
సాక్షి,కృష్ణాజిల్లా: వల్లభనేని వంశీపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా ఏఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ కోరారు. -
శ్రీహరినే బయపెట్టాలనుకుంటున్నారా అరెస్ట్ అంబటి రియాక్షన్
-
రీల్స్ మోజులో మెడికోలు.. సేవలు మర్చిపోయారా?
ఆదిలాబాద్టౌన్: రోగులకు వైద్య సేవలు అందించాల రిమ్స్ ఆస్పత్రి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారింది.. కొంతమంది మెడికోలు, జూడాలు, పలువురు వైద్యులు రీల్స్ చేయడం పట్ల చర్చ సాగుతోంది. విధులు నిర్వహించే సమయంలో ‘రీల్స్ మోజు’లో పడి రోగులనే మర్చిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో ఏకంగా ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్సకు ముందు రోగితో డ్యాన్స్ చేయడం, ఆస్పత్రిలోని ఇతర పరికరాలను చేతిలో పట్టుకొని సోషల్ మీడియా కోసం వీడియోలను చిత్రీకరిస్తున్నారు. విధుల్లో ఉన్న సమయంలో కాకుండా ఇతర సమయంలో రీల్స్ చేస్తే పట్టించుకునేది కాదని, ఆస్పత్రి ఆవరణతో పాటు ఆయా వార్డుల్లో వీడియోలు షూట్ చేస్తుండడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే రోగులతో కలిసి వీడియోలు తీయడం ద్వారా ఆ రోగి గోప్యత బయట పడుతుందని పలువురు చెబుతున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగులకు అసౌకర్యంగా మారిందని పేర్కొంటున్నారు.‘లైక్’ల కోసం..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పలువురు ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ వైద్యులు, వారి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్స్ట్రాగామ్లో పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియోలు అంతటా హల్చల్ కావడంతో రిమ్స్లోని పలువురు మెడికోలు, జూడాలు, కొంత మంది వైద్యులు సైతం వారిలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ‘లైక్స్’ కోసం వీడియోలు తీస్తూ రెచ్చిపోతున్నారు. ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు రోగులకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఫాలోవర్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి్సన వీరే ఇలా డ్యాన్సులు చేయడం, రీల్స్ తయారు చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను ఫోన్లో వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని ఫైన్
మనదేశంలో ఇటీవల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. పర్యావరణానికి హాని కలిగించవనే ఉద్దేశంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజస్థాన్లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగౌర్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు నడుపుతున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్షేడ్ అమర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయల జరినామా విధించారు. అక్కడితో ఆగకుండా పొల్యుషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ చూపించాలని వాహనదారుడిని పోలీసు అధికారి అడిగారు. అతడు చూపించకపోవడంతో మరో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని ఎంత చెప్పినా సదరు పోలీసు పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయలేదని, సాక్ష్యం చూపించాలని కోరినా పట్టించుకోలేదు. తనకు అకారణంగా జరిమానా వేసినందుకు కోర్టులో వేస్తానని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్కచేయలేదు. ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజనులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అడగడం హాస్యాస్పదంగా ఉందని.. ఇది కాలిక్యులేటర్ను వాతావరణం గురించి అడిగినట్టుగా ఉందని సెటైర్ వేశారు. తెలియని విషయాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించడాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజనులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని చాలా మంది పోలీసులకు తెలియదని, ఇలాంటి విషయాలపై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు."ఇలాంటి పోలీసు అధికారుల వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించర''ని ఓ నెటిజన్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలోని తెలివితక్కువ వారి వల్లే దేశం నాశనం అవుతుందని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంతకైనా దిగజారతారని మరో నెటిజన్ మండిపడ్డారు. ఈవీకి కచ్చితంగా పీయూసీ వర్తించదని, ఒకవేళ డ్రైవింగ్ సమయంలో కారు కిటికీలకు కర్టెన్లు వేసివుంటే చలానా విధించే అవకాశం ఉందని మరో నెటిజన్ అన్నారు. नागौर पुलिस ने नया कानून लागू किया है इलेक्ट्रिक कार की PUC करवाओ नहीं तो आपके भी PUC का चालान कटेगालो साहब ने काट दिया 1500 की चालान😳😲 pic.twitter.com/uYpFvT0If1— एक नजर (@1K_Nazar) April 8, 2026చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు! -
ఒక రాధ ఇద్దరు కృష్ణులు!
వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధరంగంలా మారింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబం తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు బారాత్లతో, కుటుంబ సభ్యులు.. బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు కుటుంబం సంభల్కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదని భావించిన పెళ్లి కూతురు తండ్రి.. మొరాదాబాద్కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు.అయితే.. సంభల్కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని.. తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుని.. బారాత్తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు బారాత్తో చేరుకుంది. ఇరువర్గాల లౌడ్ మ్యూజిక్, డ్యాన్సులతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరు వైపులా కొట్టుకున్నంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు.. నిర్ణయాన్ని వధువుకు, ఆమె కుటుంబానికే వదిలేశారు. దీంతో మూడు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరకు సంభల్కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించారు. దీంతో చేసేది లేక మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనుదిరగ్గా.. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ ‘డబుల్ బారాత్’ గురించి చర్చ జరగ్గా.. అది నెట్టింటకు చేరింది. -
మోనాలిసా భర్తకు దక్కిన ఊరట
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్ అంటూ భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్ను ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్రాజ్(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్ కంట పడి ఇంటర్నెట్ సెన్సేషన్గా నిలిచింది మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్ అటుపై మూవీ ఆఫర్స్తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్ కిడ్నాప్, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్కార్డ్, బర్త్ సర్టిఫికెట్) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్ వేశారు. ఇంతకు ముందు..మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది. తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.మిస్సింగ్ కలకలం?మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్కు వెళ్లామని.. అజ్మీర్లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే.. ఆమె మిస్ కావడం వెనుక ఫర్మాన్ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. -
బాహుబలి గెటప్లో వరుడు.. శోభన ఫ్లెక్సీ వైరల్!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెళ్లి కొత్త స్టైల్తో హైలైట్ అయింది. ములకలపల్లి మండలం నల్లివారం గూడెంకు చెందిన గోపి పెళ్లి ఈ నెల 10న జరిగింది. కానీ అసలు టాక్ మాత్రం శోభన ఫ్లెక్సీదే! వరుడిని ‘బాహుబలి’ గెటప్లో స్టైలిష్గా డిజైన్ చేసి, “బ్రహ్మచారి జీవితానికి Good Bye.. సంసార జీవితానికి Welcome” అంటూ పెట్టిన క్యాప్షన్ నెటిజన్లను ఆకట్టుకుంది. హీరో లుక్లో ఉన్న వరుడి ఫ్లెక్సీ చూసి గ్రామస్తులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెళ్లిళ్లలో క్రియేటివిటీకి ఇది కొత్త లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు! -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి గానూ ఈ చర్యలకు దిగినట్లు తెలియజేశారామె. ‘‘బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నిరాధార ఆరోపణలు చేస్తూ నాపై పోస్టులు పెడుతోంది. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఈ దుష్ప్రచారానికి ఈ పార్టీ అధినేత కేసీఆర్దే బాధ్యత. అందుకే 48 గంటల్లో ఆ పోస్టులు తొలగించి నాకు ఆయన క్షమాపణలు చెప్పాలి. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయి’’ అని సీతక్క నోటీసుల్లో హెచ్చరించారు.మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు ఫోన్లు పంపిణీ చేశారు. అయితే, ఒక్కో ఫోన్ను మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేసి, కమీషన్లు తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో ఉధృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఇదివరకే ఖండించిన మంత్రి సీతక్క.. ఒక్కో ఫోన్ను రూ.11,650 కే కొనుగోలు చేశామని, దీనిపై పూర్తి పారదర్శకత ఉందని.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
వారమైనా గ్యాస్ సిలిండర్ రాలేదా?
హైదరాబాద్కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్గా ఉండిపోయాడు. వారం గడిచింది.. డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది. ఇదో భారీ స్కామ్?!ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?.. అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ లేదంటే మనీపే యాప్ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు. గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి. ఇలా చేయండి.. సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్కి ఫిర్యాదు చేయండి. బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్షాట్లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దుడీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దుఆన్లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలిచెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గంఫిర్యాదుల కోసం.. • ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555• హెచ్పీ గ్యాస్ (HPCL): 1800-233-3555• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్సైట్లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్షాట్ వంటి సాక్ష్యాలుగా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. -
కిడ్నాప్ చేసి.. హిజ్రాగా మార్చే యత్నం
మైసూరు(కర్ణాటక): యువకున్ని కిడ్నాప్ చేసి బలవంతంగా మంగళముఖిగా వేషం వేసి డబ్బులు వసూలు చేయించడం, రీల్స్ చేయించుకుని డబ్బు సంపాదిస్తూ, అతన్ని కూడా బలవంతంగా హిజ్రాగా మార్చాలని ప్రయత్నించారు. దీంతో బాధిత యువకుడు న్యాయం కోసం మైసూరు లష్కర్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నంజనగూడులోని త్యాగరాజ కాలనీకి చెందిన యువకుడు అనిల్కుమార్ దివ్యాంగుడు కూడా. అతడు 4 నెలల క్రితం మైసూరు రూరల్ బస్టాండులో బస్సు కోసం వేచిఉన్న సమయంలో మంగళముఖి అనిత ముసుగువేసి.. కిడ్నాప్ చేసి, మంగళూరుకు తీసుకు వెళ్లింది. అక్షతగా పేరు మార్చి తరువాత అతనికి చీర , నైటీ, చెవి కమ్మలు వేసి అక్షత అని పేరు మార్చింది. బలంవంతంగా వీధులలో , దుకాణాల వద్ద భిక్షాటన చేయించింది. ప్రతినిత్యం 2 నుంచి 3 వేల రూపాయలు కలెక్షన్ తీసుకు రావాలని బెదిరించింది. రీల్స్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మంగళూరు, కేరళ ప్రాంతాలలో వ్యభిచారానికి పంపింది. అతని ఆధార్ కార్డులో కూడా ట్రాన్స్ జెండర్గా మార్పించింది. వచ్చే నెల ముంబైకి తీసుకు వెళ్లి, సర్జరీ చేయించి పూర్తిగా మంగళముఖిగా మార్చడానికి ప్రణాళిక రూపొందించింది. దీనిని గుర్తించిన అనిల్కుమార్ ఇంటికి వెళ్తానని చెప్పగా, అనిత బెదిరించి చోరీ కేసు పెట్టించింది. ఎలాగోలా మంగళూరు నుంచి తప్పించుకుని వచ్చిన అనిల్.. మైసూరు లష్కర్ స్టేషన్లో అనితపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదుకు స్పందించడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఆమె మరణం తీరని లోటు
‘‘ఓ మధురమైన స్వరాన్ని కోల్పోయాం. ఆమె మరణం తీరని లోటు’’ అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆశా భోంస్లేకి నివాళి అర్పించారు.తరతరాలుగా విభిన్నమైన భావోద్వేగాలను పలికిస్తూ, ఆశా భోంస్లేగారి గాత్రం భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచింది. ప్రతి పాటకూ గ్రేస్, విలక్షణతను తీసుకువచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తాను. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని స్వరాన్ని కోల్పోయింది.– నటుడు చిరంజీవిశాశ్వతమైన గాయనీ...! అంటూ తాను నటించిన ‘చాచీ 420’ సినిమాలో ఆశా భోంస్లే పాడిన పాట ‘జాగో ఘోరీ..’ను, ఆమెతో తాను ఉన్న క్లిప్పింగ్స్ను షేర్ చేశారు.– నటుడు కమల్హాసన్.ఆశా భోంస్లేగారి మరణంతో ఒక శకం నిశ్శబ్దంగా ముగిసింది. ఆమె స్వరం కేవలం సంగీతం మాత్రమే కాదు... మన జీవితాల్లోని ప్రతి దశను స్పృశిస్తూ మనతో జీవించిన ఒక భావోద్వేగం. తరతరాలుగా ఆమెలా ప్రజల హృదయాలను తాకిన కళాకారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె మనల్ని వదిలి వెళ్లిపోయి ఉండొచ్చు. ఆమె స్వరం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – నటుడు మోహన్ బాబుదశాబ్దాల పాటు ఆశా భోంస్లేగారి మ్యాజికల్ వాయిస్ భారతీయ సినిమాకు ్రపాణంగా నిలిచి, లక్షలాది హృదయాలను తాకింది. తరతరాలుగా నిలిచిపోయే జ్ఞాపకాలను ఆమె వదిలి వెళ్లారు. ప్రేమ, గౌరవాలతో ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. – నటుడు ఎన్టీఆర్భారతీయ సంగీతానికి తీరని లోటు. ఆశా భోంస్లేగారి గాత్రం స్వచ్ఛమైన మ్యాజిక్ అండ్ ఎమోషన్ . ఆమె లెగసీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆశాగారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – నటుడు రామ్చరణ్ఆశా భోంస్లేగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచి వేసింది. తరతరాలను నిర్వచించిన ఆమె స్వరం ఎప్పటికీ నిలిచిపోతుంది. – అల్లు అర్జున్భారతీయ సంగీతానికి తీరని లోటు. మీ స్వరానికి సాటి లేదు... మీ పాటలు తరతరాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. – నటుడు సల్మాన్ ఖాన్ఆశా తాయ్ (మరాఠీలో పెద్దక్క అని అర్థం) మరణవార్త బాధ కలిగించింది. భారతీయ సినిమాకు ఆమె గాత్రం ఒక మూలస్తంభంలాంటిది. భవిష్యత్లో శతాబ్దాల పాటు ఆశాగారి గాత్రపు మాధుర్యం కొనసాగుతూనే ఉంటుంది. – నటుడు షారుక్ ఖాన్ఆశాగారి మరణం దుఃఖాన్ని కలిగిస్తోంది. ఆమెకు నేను పెద్ద అభిమానిని. గొప్ప గాయకులు రఫీ, కిషోర్, లతగార్లు లేరు. ఇప్పుడు ఆశాగారూ మనకు దూరమయ్యారు. ఓ శకం ముగిసిందని నాకు అనిపిస్తోంది. ఆశాగారి మరణం ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రమే కాదు... దేశం, ప్రపంచానికే నష్టం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. – నటుడు ఆమిర్ ఖాన్మన దేశానికి స్వాతంత్య్రం లభించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగ’ అనే పాటను ఆమెతో కలిసి రికార్డు చేసే అవకాశం నాకు లభించింది. మా అమ్మని కాకుండా నేను అమ్మా అని పిలిచే మరొక వ్యక్తి ఆశాగారు మాత్రమే. ‘శ్రీవల్లీ..’ సాంగ్ (పుష్ప: ది రైజ్’లోని పాట..) ఆమెకు నచ్చింది. ఆశా అమ్మ... మిమ్మల్ని చాలాసార్లు కలిసే చాన్స్ నాకు దక్కింది. అది నాకు పెద్ద ఆశీర్వాదం. సంగీతం పట్ల మీ అంకితభావం, ప్యాషన్ ను నేను ప్రత్యక్షంగా చూశాను. – సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ఆమె గాత్రం ఒక మ్యాజిక్. ఆమెతో ఓ సాంగ్ను షేర్ చేసుకునే గౌరవం నాకు లభించింది. ఆశాగారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. భారతీయ సంగీతానికి ఆమె మరణం తీరని లోటు. – నటుడు సంజయ్ దత్ఒక శకం ముగిసింది. నేను ముంబైలో ఎక్కడున్నా ప్రభుకుంజ్ (ముంబైలో ఆశా ఎక్కువ కాలం నివసించిన భవనం) దాటి వెళ్తున్నప్పుడు తొలుత లతాగారికి ఫోన్ చేసేదాన్ని. ఆ తర్వాత ఆశాజీగారిని కలిసేదాన్ని. ఆమె స్థానాన్ని మరొక సింగర్ భర్తీ చేయలేరు.– గాయని ఉషా ఉతుప్మనందరికీ, భారతీయ సంగీతానికి ఎంతో బాధాకరమైన రోజు ఇది. మన ప్రియమైన ఆశా సోదరి ఇక లేరన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆమె స్వరం ఎప్పటికీ జీవించే ఉంటుంది.– గాయకుడు–సంగీతదర్శకుడు శంకర్ మహదేవన్తన పాటలకు జీవకళను అద్ది, ఎంతో ప్రత్యేకతను చాటుకున్న ఆశాగారు ఇక లేరనే విషయం నమ్మశక్యంగా లేదు. ఆశాగారితో నాకు ప్రత్యేకమైన భావోద్వేగంతో కూడిన అనుబంధం ఉంది. అందుకే ఆమె ఇక లేరన్న విషయం నాకు కష్టంగా అనిపిస్తోంది. నేను నటించిన సినిమాల్లోని పాటలను ప్రత్యేకమైన తన గాత్రం, శైలితో పాపులర్ చేశారామె. చిత్ర పరిశ్రమలో నా ఎదుగుదలలో భాగస్వామ్యమైన లతా, ఆశాగార్లతో నాకు మంచి అనుబంధం ఉంది. – నటి హేమ మాలినిభారతీయ చిత్రసీమలో అత్యంత ప్రతిభాశాలి అయిన ఒక గాయనిని కోల్పోయిన రోజు ఇది. ఆమె నాతో ఎంత ప్రేమాభిమానాలతో ఉండేవారో, గాయనిగా అంతే గౌరవమర్యాదలతో నడుచుకునేవారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరచిపోలేని ఓ స్థానంలో ఉంటారామె. వేరే ఏ స్వరంతోనూ పోల్చలేని ఓ ప్రత్యేకమైన స్వరం ఆమెది. ఆమె ఎప్పుడు చెన్నైకి వచ్చినా నన్ను కలిసేవారు. నా ఆత్మీయ సోదరి. – సంగీతదర్శకుడు ఇళయరాజాఆశాగారు తన గాత్రంతో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఆమె గొప్ప కళాకారిణి. – సంగీతదర్శకుడు, ఏఆర్ రెహమాన్ఆమె గొప్పతనాన్ని వర్ణించడానికి మాటలు సరిపోతాయా? ఆమె సాధించలేనిదంటూ ఏమైనా ఉందా? పనులు ఎలా చేయాలో మా అందరికీ చూపించిన వ్యక్తి. నిజమైన మార్గదర్శకురాలు. – గాయని చిన్మయిఆశాజీ మరణవార్త విని నేను పూర్తిగా కుప్పకూలిపోయాను. ఆశాజీని కోల్పోవడం అంటే మా అమ్మగారిని రెండోసారి కోల్పోయిన ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంగీత ప్రపంచంలో నా వేలు పట్టుకుని, నా చేత తొలి అడుగులు వేయించి, నాకు మార్గనిర్దేశకత్వం చేస్తూ, నా మొట్టమొదటి స్వరకల్పనకు గాత్రం అందించారు ఆమె. బహుముఖ ప్రజ్ఞాశాలి. అద్భుతమైన గాయని. ఆమెలా మరొకరు ఎప్పటికీ రారు. ఒక శకం ముగిసింది. – గాయకుడు అనూ మాలిక్ఆశా తాయ్ ఒక సింగర్గా, మంచి మానవతావాదిగా, లెజెండ్లా ఎప్పటికీ నిలిచిపోయే ఉంటారు. ఆమె స్వరానికి తగ్గట్లుగా మేం నటించేందుకు ముందే ప్రిపేర్ అయి, వస్తుంటాం. నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆశాగారి సాంగ్ రికార్డింగ్ చూశాను. ఓ సినిమా చూసిన అనుభూతి కలిగింది. ఆ మెలోడి సాంగ్కు ఆమె చూపిన ప్రతభలో నటిగా నేను పది శాతం ప్రతిభ చూపినా నేనో గొప్ప యాక్టర్ అవుతానని ఆమెకు చెప్పాను. – నటి కాజోల్నా ఆల్టైమ్ ఫేవరెట్ సింగర్ ఆశాగారి మరణం నన్ను ఆలోచనల్లో పడేసింది. అప్పట్లో రెహమాన్ లాంటి కొత్త సంగీత దర్శకుడితో ప్రయోగాలు చేయాలనే ఉత్సుకతతో వచ్చి, విప్పారిన కళ్లతో చూసిన ఓ పాపలా ఆమె కనిపించారు. చిన్న అడ్జెస్ట్మెంట్తో సింగిల్ టేక్లోనే ఈ పాట పూర్తయింది. ఆశ్చర్యకరంగా నా ‘కంపెనీ’ సినిమాలో ఆమె ‘ఖల్లాస్’ పాటను పాడారు. ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తవుతున్నాయి. శాస్త్రీయ సంగీత మూలాలను, ఆధునిక లయల్లో విభిన్నమైన భావోద్వేగాలతో పలు భాషలకు అనుసంధానిస్తూ ఆమె స్వరం తరతరాలుగా నదీ ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది. మానవ భావోద్వేగాలను ఆమె ఆవిష్కరించినట్లు మరెవరూ ఆవిష్కరించలేరు. ఆశాజీ... మీరు మరొక చోటుకు వెళ్లి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ సంగీతం శాశ్వతంగా నిలిచే ఉంటుంది.– దర్శకుడు రామ్గోపాల్ వర్మఆశా భోంస్లేగారు మధురమైన గానంతో ఎన్నో తరాలను అలరించారు. ఆమె ప్రతిభ, ఆమె స్వరం ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయి ఉంటాయి. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సేవలు అమూల్యమైనవి. ఈరోజు చాలా దుఃఖమైన రోజు. మహాగాయని మనతో లేకపోవడాన్ని నమ్మలేకపోతున్నాను. ఆమె నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తి. బాలీవుడ్లో తన అద్భుతమైన స్వరంతో నాకిచ్చినటువంటి అమోఘమైన పాటలు మరపురానివి. ‘శరాబీ’ చిత్రంలో ‘దే దే ప్యార్ దే..’, ‘తోఫా తోఫా’ పాటలు కానీ... తెలుగులో ‘పాలు నీళ్లు’ సినిమాలో ‘ఇది మౌనగీతం...’ అనే పాటను కానీ అద్భుతంగా ఆలపించారు. లతా మంగేష్కర్గారు కానీ, ఆశా భోంస్లే దీదీ కానీ నా జీవితంలో నాకిచ్చినటువంటి ఈ అనుభూతిని మర్చిపోలేను. ఆశా భోంస్లే లేని లోటు నాకే కాదు... వ్యక్తిగతంగా ప్రజలకు, సంగీత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ వారికి చెప్పలేని లోటు. అలాంటి గాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇక మనకు దొరకరేమో! – నటి జయప్రద -
నిషేధం కాదు... కంటెంట్ కావాలి!
సోషల్ మీడియాపై చర్చ కొత్త దశకు చేరుకుంది. 16 ఏళ్ల లోపు బాలల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధిస్తు న్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. డిజిటల్ వ్యసనం, ఆన్లైన్లో అపరిమిత కాలాన్ని వెచ్చిస్తున్నందువల్ల కొన్ని పరిమితులు తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు కూడా అదే బాట పట్టే అవకాశముందని వార్తలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మైనర్లను నిషేధిస్తూ ఆస్ట్రేలియా ఒక చట్టం తెచ్చింది. అదే తరహా విధానాలు అనుసరించడంపై ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాలు చర్చిస్తున్నాయి. మానసిక ఆరోగ్యం దెబ్బ తినడం, సైబర్ బెదిరింపులు, నిద్రలో అవాంతరాలు వంటి సమ స్యలు తలెత్తుతున్నమాట వాస్తవమే. ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ వంటి సంస్థల అధ్యయనాలు కూడా ఆ సంగతిని ధ్రువీకరిస్తున్నాయి. బాలలు ఎలక్ట్రానిక్ తెరల ముందు రోజూ ఏడు గంటలకు పైగా గడుపుతున్నారని అవి తెలుపుతున్నాయి.సోషల్ మీడియా ‘కత్తి’ లాంటిది!ఎడతెగని ఫార్వర్డ్లు, సంచలనాత్మక అభిప్రాయాలు వ్యక్తపర చడం గురించి సోషల్ నెట్వర్క్ వాడకందారులు ఎవరికైనా వేరే చెప్పనవసరం లేదు. వాట్సాప్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫారాలు తప్పుడు సమాచారానికి కారణమవుతున్నాయని నిందలు మోస్తున్నాయి. ఎన్నికల సందర్భాలలోనైతే చెప్పనే అక్కర లేదు. ఏది బూటకమో, ఏది వాస్తవమో నిర్ధారణ కాకపోయినా ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ముద్ర వేసుకుని వచ్చేస్తాయి. ఫలితాలను ప్రభావితం చేయడంలో, హింసకు పురిగొల్పడంలో వాటి పాత్రను తోసిపుచ్చలేం. ఢిల్లీలో 2020 నాటి అల్లర్లను దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో నిషేధించడం, లేదా నియంత్రించడం తప్ప గత్యంతరం లేదు. కానీ, ఆ యా వేదికలది తప్పా, లేక వాటిని వినియోగించుకుంటున్న మన తీరులో లోపం ఉందా అనే ప్రశ్న వెన్నాడుతూనే ఉంటుంది. సోషల్ మీడియా దానికదే విషపూరితమైనది కాదు. క్యాట్ వీడియోలు, కుట్ర సిద్ధాంతాలు, కవ్వించే మాటల వంటి అల్పమైన విషయాల వరదలో టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, ఘర్షణ ప్రాంతాల నుంచి పౌరులు నేరుగా నివేదించే కథనాల వంటి మంచి సంగతులు కూడా కొట్టుకొస్తాయి. ఇస్రో రాకెట్ ప్రయోగాల ప్రత్యక్ష వీడియోల వంటివి యువతలో స్ఫూర్తిని నింపుతాయి. అటువంటి సంగతులు మాధ్యమం తటస్థమైనదేననే సంగతిని గుర్తుచేస్తాయి. ఇదీ కత్తి లాంటిదే! దానితో కూరగాయలు తరగ వచ్చు. ఒంటికి గాయమూ చేసుకోవచ్చు. చరిత్ర నేర్పుతున్న పాఠాలుగూటెన్బర్గ్ 1440లో ముద్రణా యంత్రం కనుగొనడంతో విషయ పరిజ్ఞానం అందరికీ అందడం మొదలైంది. పునరుజ్జీవన, సంస్కరణవాద ఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. యూరప్లో అక్షరాస్యత 10 శాతం నుంచి దాదాపు నూరు శాతానికి చేరుకుంది. అదే సమయంలో మూఢ నమ్మకాలను, కక్ష సాధింపు ప్రాపగాండాను పెంపొందించే కరపత్రాలు కూడా పుట్టుకొచ్చాయి. అయినా, నిషేధాలు నిలువలేదు. టెక్నాలజీయే కొనసాగింది. రేడియో వాడుకలోకి వచ్చినప్పుడు కూడా అదే ధోరణి పునరా వృతమైంది. జర్మనీలో 1930లలో హిట్లర్ విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తికి అది కారణమైంది. ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ ఉత్తేజపూరిత ప్రసంగాలు అమెరికా ఐక్యానికి దోహదపడ్డాయి. టెలివిజన్ రాకతో నిరాధారమైన ఆరోపణలతో ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేసే పద్ధతి ఊపందుకుంది. అదే సమయంలో, పౌర హక్కులకు రక్షణ కల్పించి, మార్పునకు చేయూతనందించింది. నేడు సోషల్ మీడియా కూడా అదే బాటలో ఉంది. 50 కోట్ల మంది యూజర్లు, ప్రపంచంలోనే పెద్ద మార్కెట్గా మన దేశాన్ని మార్చారు. ‘నాసా’ కృష్ణబిల చిత్రాలను కొన్ని అందిస్తే, భ్రమలను తొలగిస్తూ నోబెల్ బహుమతి గ్రహీతలు చెప్పే మాటలను మరికొన్ని అందిస్తున్నాయి. వన్యప్రాణులపై డిస్కవరీ ఛానల్ రీల్స్ వస్తున్నాయి. అలా వేదికలు రకరకాలుగా ఉపయోగపడుతున్నాయి. వదంతులను వ్యాప్తి చేస్తోందని ట్విట్టర్ను తిట్టుకున్నాం. కానీ, కోవిడ్ మృతుల విషయంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి ఇచ్చిన తాజా సమాచారాన్ని కూడా ట్విట్టరే ఎప్పటికప్పుడు అందించింది. డిజిటల్ ఎకో సిస్టంనిజమైన సవాల్ నిషేధించడంలో కాక, ఎకో సిస్టంను సుసంపన్నం చేయడంలో ఉంది. దేశంలోని 1.4 బిలియన్ల మందిలో మూడొంతుల మంది 35 ఏళ్ళ లోపువారు. వార్తలకు వారు డిజిటల్ మార్గాలపైనే ఆధారపడుతున్నారు. యువతలో 80 శాతం మంది సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల నుంచి పొందు తున్నారు. ప్రజానిధులతో ప్రభుత్వం కూడా బోలెడంత సమాచా రాన్ని ఎత్తిపోస్తోంది. వాటిలో నీతి ఆయోగ్ నివేదికలు, విశ్వ విద్యాలయ గ్రాంట్ల సంఘ పరిశోధన పత్రాలు, రక్షణ పరిశోధన – అభివృద్ధి సంస్థ నవీకరణలు కూడా ఉన్నాయి. కానీ, అవన్నీ ప్రాచుర్యానికి నోచుకోని ఎక్కడెక్కడో సైట్లలో పీడీఎఫ్ల రూపంలో మూలుగుతున్నాయి. కొందరు ఉన్నత విద్యావంతులు మాత్రమే వాటిని చూస్తున్నారు. మంత్రిత్వ శాఖల నివేదికలలో 70 శాతం ఏటా వెయ్యికన్నా తక్కువ మంది చూపరుల దృష్టికి మాత్రమే ఆనుతున్నాయని 2023 నాటి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో తేలింది. సోషల్ మీడియా ఒక పరిష్కారాన్ని ఇవ్వజూపుతోంది. వ్యవసాయ చట్టాలను, లేదా వాతావరణ డేటాను వివరించే రీల్స్ చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లతో వివిధ మంత్రిత్వ శాఖలు భాగస్వామ్యం కుదుర్చుకుంటే? ప్రాచీన చరిత్రపై విశ్వవిద్యాలయాలు టిక్టాక్ సిరీస్ చేస్తే? వేదాలను వైరల్ చేస్తే? నివేదికలను ఇన్ఫోగ్రాఫిక్స్గా మార్చేందుకు యువ క్రియేటర్ల సేవలను ఇస్రో, ఐఐటీలు, ఐసీఎంఆర్ వంటి ప్రభుత్వ సంస్థలు వినియోగించుకుంటే? వేదికలను సద్వినియోగం చేసుకునేటట్లు విద్యావేత్తలు, స్కాలర్లు తమ వంతు పాత్ర పోషించాలి. ‘పనికిమాలిన’వంటూ ప్లాట్ ఫారాలను చిన్నచూపు చూసే బదులు వారు క్వాంటమ్ ఫిజిక్స్, లేదా ఎన్నికల డేటాపై థ్రెడ్లను పోస్ట్ చేయవచ్చు. ఉన్నత ప్రమా ణాలతో కూడిన కంటెంట్ పెడుతున్నవారిని ఆ యా ప్లాట్ ఫారాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి. కాకపోతే విచక్షణా జ్ఞానంతో అన్వేషిస్తూ పోవాలి. మేరీ క్యూరీ 1 గ్రాము రేడియం కోసం 8 టన్నుల పిచ్ బ్లెండ్ను జల్లెడ పట్టవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆమెకు కాలిన గాయాలయ్యాయి. సోషల్ మీడియా కూడా అదే రకమైన శ్రమను డిమాండ్ చేస్తోంది. చిందర వందర మధ్యలో అసలైన దాన్ని వెతికి పట్టుకోవాలి. సైట్ విశ్వస నీయతకు సంబంధించి న్యూస్ గార్డ్ వంటి టూల్స్ రేటింగ్ ఇస్తున్నాయి. ప్రభుత్వం కేవలం పోలీసుగానే వ్యవహరించకుండా, స్వయంగా క్వాలిటీ కంటెంట్ అందించాలి. వార్తాహరుడిని చంపే బదులు అతన్ని సమాచారంతో బలోపేతం చేయాలి.శివప్రసాద్ ఖేనేడ్వ్యాసకర్త సైన్స్ కమ్యూనికేటర్, మ్యూజియంవృత్తి నిపుణుడు (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
శ్రీలంక వెకేషన్లో హీరోయిన్ ప్రణీత.. హాఫ్ శారీలో సురేఖవాణి కూతురు..!
శ్రీలంక వేకేషన్లో చిల్ అవుతోన్న హీరోయిన్ ప్రణీత..లంగా ఓణిలో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..లైట్ పింక్ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..బాలీవుడ్ భామ ఇషితా దత్తా హాట్ ఫోజులు..శారీలో ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ లుక్స్.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ishita Dutta Sheth (@ishidutta)


