breaking news
Social Media
-
బీచ్లో సాయిపల్లవి సిస్టర్.. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్!
బీచ్లో సాయి పల్లవి సిస్టర్ చిల్.. బ్లూ డ్రెస్లో మరింత హాట్గా బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్. సిస్టర్ మెహందీ వేడుకల్లో మెరిసిన బుల్లితెర నటి శివంగి జోషి.. డిఫరెంట్ స్టైల్లో అతియా శెట్టి లుక్..యూఎస్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ కార్తీక నాయర్.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లిషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है। ▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు. -
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.శ్రీలంక, నేపాల్లో జెన్జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది. కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్ -
హాయ్ స్విగ్గీ.. వాట్ ఏ సడన్ సప్రైజ్!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్ఫాస్ట్ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. శశి థరూర్ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. pic.twitter.com/DdF1yiheT3— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2025 यह हमारे लिए अत्यंत हर्ष का विषय है कि हमें श्री थरूर जी को क्षेत्र की सर्वश्रेष्ठ इडली परोसने का अवसर प्राप्त हुआ। हमारी आशा है कि हमारी टोली उनके स्वादेंद्रियों को तृप्त करने में सफल रही होगी तथा इन पाक-कला के अनुपम चमत्कारों से उन्हें परमानंद की स्थिति मिली होगी। https://t.co/oTaJ2Ykrsn pic.twitter.com/PifmOlitQF— Swiggy Food (@Swiggy) September 28, 2025ఇంతకీ శశిథరూర్ ఇడ్లీ గురించి ఏమన్నారంటే.. ఈ మధ్య ఓ నెటిజన్ ఇడ్లీ గురించి అభివర్నిస్తూ.. steamed regret అని ఓ పోస్ట్ చేశారు. అయితే దానికి స్పందిస్తూ శశి థరూర్ తనదైన ఇంగ్లీష్తో కవితాత్మకంగా ఓ కౌంటర్ పోస్ట్ చేశారు. ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం అని అభివర్ణించారు. అంతేకాదు.. ఇడ్లీ వేస్తున్నట్లుగా ఏఐ ఫొటోను ఆయన షేర్ చేశారు.మొత్తం భారతీయ సంస్కృతిలో ఇడ్లీని అత్యుత్తమ ఆహార సంపద అని పేర్కొన్న ఆయన.. ఠాగూర్, ఎంఎఫ్ హుస్సేన్, సచిన్ టెండూల్కర్ల ప్రతిభతో దానిని పోల్చారు. దీంతో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఆహారంపై థరూర్ అభిప్రాయం మాత్రమే కాదని.. భారతీయత కలబోసిన గొప్ప ప్రశంస అని కామెంట్ సెక్షన్లో పోస్టులు పెడుతున్నారు.దక్షిణాది ప్రసిద్ధ ఫలహార వంటకం ఇడ్లీని ఇంతకంటే గొప్పగా ఎవరూ వర్ణించలేరు..థాంక్యూ సర్. https://t.co/eg46kbwIV7— తెలుగు తీపి (@kkmohan73) September 28, 2025 -
ఇవి స్మార్ట్ రోడ్లు కావు సామి షార్ట్ రోడ్లు!
‘‘యస్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లు అధ్వాన్నమైన రోడ్లు అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. కానీ, దేశంలో ఎక్కడ కూడా బెంగళూరులో చేసినట్లు మాత్రం రిపేర్లు చేసి ఉండరు..’’ సోషల్ మీడియాలో బెంగళూరు రోడ్ల దుస్థితి గురించి ఓ నెటిజన్ చేసిన జోక్ ట్వీట్ ఇది.మొన్నటిదాకా బెంగళూరు ట్రాఫిక్ రద్దీ గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఈ మధ్య అధ్వాన్నమైన రోడ్ల గురించి కూడా(Bengaluru Roads) చర్చించుకుంటున్నారు. ఓ ప్రముఖ కంపెనీ రోడ్లు బాగోలేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నగర శివారు నుంచి తరలిపోయింది. దీంతో రాజకీయంగానూ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తామేమీ ఖాళీగా లేమని.. తమ ప్రయత్నం తాము చేస్తున్నామంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) చెబుతున్నారు. అంతేకాదు.. బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను కూడా సంబంధిత మంత్రిగా(పట్టణాభివృద్ధి) ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో.. ఇప్పుడు నెట్టింట విమర్శలు మరింత పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్ల రిపేర్ పనులు కొనసాగుతున్న వేళ.. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. ఆ ప్యాచ్ వర్క్లు రెండు, మూడు రోజులకు మించి ఉండడం లేదు. వీటికి తోడు కొత్తగా కొట్టిన రోడ్లు కూడా 48 గంటలు తిరగకముందే పాడైపోతున్నాయి. ఫలితంగా.. ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో కొందరు ఆ రోడ్లనే ఎక్కుతున్నారు. మొన్నీమధ్యే కాక్స్ టౌన్లోని వెబ్స్టర్ రోడ్డులో రిపేర్లు చెదిరిపోయి మళ్లీ గుంతలు దర్శనమిచ్చాయి. దీంతో భారతినగర్ ప్రజలు ఆ గుంతలకు పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి మరికొందరు కూడా అలాగే గుంతలను పూలతో అలంకరించి.. పసుపు, కుంకుమ చల్లి తమను చల్లగా చూడాలంటూ వీడియోలు చేసి వైరల్ అయిపోయారు. తాజాగా.. ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో చన్నసంద్ర సర్కిల్ వద్ద రిపేర్ అయిన రోడ్ల పరిస్థితి తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. చన్నసంద్ర సర్కిల్ వద్ద సెప్టెంబర్ 27న రోడ్డుకు మరమ్మతులు చేశారట. గట్టిగా ఒక్క వాన పడితే ఈ రోడ్డు ఉండదు అంటూ ఆ వ్యక్తి ఆ వీడియోను క్యాప్షన్ ఉంచాడు. దీనికి Greater Bengaluru Authority (@GBA_office) ను ట్యాగ్ చేశాడు. They repaired this section - Channasandra Circle on 27th September. It's 29th September today and the road is gone. What kind of patchwork doesn't last 48hrs? Are your engineers and contractors so much unqualified @GBA_office?You see the water in the video? - it's leaking… https://t.co/2NfPTEA1sN pic.twitter.com/kOH0ExjG8J— Auro (@weekendbiker) September 29, 2025బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ.. వివిధ కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. నగరంలో దీర్ఘకాలిక రోడ్డు అభివృధ్ది ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు ఖర్చు చేయబోతుండగా.. ఇందులో కేవలం రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.750 కోట్లు కేటాయించారు. గుంతల పూడిక, వైట్ టాపింగ్, బ్లాక్టాపింగ్, కొత్త స్మార్ట్ రోడ్ల నిర్మాణం అన్నీ ఇందులోనే జరగనున్నాయి. అక్టోబర్ 31లోగా నగరంలో 10వేల గుంతలను పూడ్చాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డెడ్లైన్ విధించారు. అయితే.. వర్షాలు, నిర్మాణ నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాల కారణంగా విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. -
స్నేక్హితుడు..!
శ్రీకాకుళం జిల్లా: ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఓ వైపు సాగు చేస్తూనే.. మరోవైపు ఎల్రక్టీషియన్, మెకానిక్గా కూడా రాణిస్తున్నాడు. అన్నింటికీ మించి అలవోకగా పాముల ను పట్టే నేర్పరి. అలాగని ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించాడు హిరమండలం మండలం ఎం.అవలంగికి చెందిన లోలుగు వేణుగోపాలరావు. ఇప్పటివరకు 10 వేలకుపైగా పాములను పట్టి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టిన ఘనత ఆయనది. ఆయనను ‘సాక్షి’ పలకరించగా ఆసక్తికర విషయా లను వెల్లడించారు. 20 ఏళ్ల వయస్సులోనే ఆసక్తి వేణుగోపాలరావుకు ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సు. 20 ఏళ్లలోనే పాములు పట్టాలన్న ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో భాగంగా ఎంతోమంది పాముకాటుకు గురై అవస్థలు పడిన ఘటనలు చూసిన వేణుగోపాలరావుకు మనస్సు కలచివేసిందట. అదే సమయంలో పాములను చంపేస్తున్న ఘటనలు చూసి బాధపడేవాడు. దీంతో అప్పుడే పాములు పట్టాలన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే పెద్ద సంచులు, గొట్టాలతో పట్టడం, వాటికి ఉరి వేసి బంధించడం క్రమేపీ అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన ప్రస్థానం 35 ఏళ్ల కిందట ప్రారంభమైంది. అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పాములు పట్టడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. క్రమేపీ చాకచక్యంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. 2018 తితిలీ తుపాను సమయంలో ఏకంగా 1,500 పాములు పట్టి రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఏడాదికి 500 వరకూ పాములు పడుతుంటాడు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్కు సైతం వెళ్లి పాములు పడుతుంటారు. అందుకే తన నంబర్తో పాటు ప్రత్యేక యూట్యూబ్ చానల్ సైతం ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియాలో తనను సంప్రదిస్తే వీలైనంత వేగంగా అక్కడకు వెళ్తుంటారు. అయితే పాములు పట్టడం అనేది తనకు ఉపాధి కాదని.. కేవలం మనుషుల ప్రా ణాలు పోకూడదని.. అలాగే జీవహింస లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని వేణుగోపాలరావు చెబుతున్నాడు. పాములు ప డితే డబ్బులు డిమాండ్ ఉండదని.. వారి సంతోషంగా ఇచ్చిందే తీసుకుంటామని చెబుతున్నాడు. ఎక్కడైనా పాములు పట్టాలంటే 93951 42681 నంబర్ను సంప్రదించాలని సూచిస్తున్నాడు. -
చిన్ని అద్భుతం రాబోతోంది : స్టార్ సింగర్, ఫోటోలు వైరల్
-
కరూర్ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు
ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత.. చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ ఆర్థించిన వృద్ధురాలు.. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన.. ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం.. ఇవన్నీ ఇప్పుడు కరూర్ విషాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. కరూర్ వెలుచామైపురం టీవీకే ర్యాలీలో ఘోర విషాదం.. 39 మందిని బలిగింది. అనుమతించిన దానికంటే రెట్టింపు సంఖ్యల్లో జనం హాజరు కావడం, వాళ్లను పోలీసులు అదుపు చేయలేకపోవడం, ఆంబులెన్స్లకు దారి ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీవీకే పరిహారాలు ప్రకటించాయి. న్యాయపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో.. ఈ ఘటనకు సంబంధించిన ఘటన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చెల్లా చెదురైన చెప్పులు, టీవీకే జెండాలు అక్కడి పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నేతలకు తన రెండేళ్ల బిడ్డ విగతజీవిగా మారిందని చూపిస్తూ ఓ తండ్రి పెట్టిన రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.So disturbing! Heart-breaking! 😢We need to get out of the hero-worshipping mentality. No celebrity is worth risking a life. #KarurStampede#VijayRally pic.twitter.com/FAlgDjKUkG— Satish Acharya (@satishacharya) September 28, 2025த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025உரிய பாதுகாப்பு வழங்கப்பட்டதாக தெரியவில்லை - Karur People !#TVK #JanaNayagan #KarurStampede pic.twitter.com/VkTqbB5mU5— MAHI (@MahilMass) September 28, 2025#KarurStampede 🚨 Heartbreaking Tragedy in Tamil Nadu 🚨What was meant to be a moment of hope and celebration at #TvkVijay’s rally in Karur has turned into an unimaginable nightmare.💔 31 innocent lives lost in a stampede-like situation.💔 Families who came with joy have… pic.twitter.com/y9cl6hW4RT— Akash (@AdvAkashji) September 27, 2025மீளமுடியாத துயர் 💔#JusticeForKarurRally #Karur #KarurStampedepic.twitter.com/bjvyACOnqS— Prakash (@prakashpins) September 28, 2025#KarurStampede #TVKVijayStampede #Karurpic.twitter.com/9BpJWtY2u3— Manoj Trichy (@manoj4trichy) September 28, 2025#KarurStampede#கொலைகாரன்_விஜய் pic.twitter.com/JRpXLGqDVL— த.சந்தோஷ்குமார் (@MKPSandy) September 28, 2025 -
‘ఓజీ’ నిర్మించిన డీవీవీ క్రియేషన్స్పై కేసులు వేస్తాం
పంజగుట్ట: ఓజీ సినిమాను తీసిన డీవీవీ క్రియేషన్స్పై త్వరలో పరువునష్టంతో పాటు, కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యాయవాది బర్ల మల్లేష్ యాదవ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తాను కోర్టులో పిటీషన్ వేయగా..రేట్లు పెంపుదలను కోర్టు నిలిపివేసిందన్నారు. ఈ నేపథ్యంలో తనను అవమాన పరుస్తూ డీవీవీ క్రియేషన్స్ వారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేసేలా ప్రోత్సహించారని మల్లేష్ ఆరోపించారు. దీనిపై తాను మళ్లీ కేసు వేస్తానని చెప్పారు. పేదలకు వినోదం తక్కువ ధరకే అందాలనే ఉద్దేశంతోనే తాను టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకించానని పేర్కొన్నారు. -
మహిళలపై ట్రోలింగ్.. అలావాటు పడిపోయాం: హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రస్తుతం దల్దాల్ అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ ఏడాది మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో మెప్పించిన బ్యూటీ.. ఇప్పుడు ఓటీటీ సిరీస్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్కు హాజరైన బాలీవుడ్ భామ మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్పై మాట్లాడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారని.. వీటిని ఎదుర్కోవడంతో ఉమెన్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. "ట్రోలింగ్.. బెదిరింపులు.. దీన్ని మీరు ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. ఇంకో మార్గం లేనందున నన్ను నేనే సర్ది చెప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నాపై వచ్చే ట్రోల్స్ను ఎలాగైనా తట్టుకోగలగనని తెలుసుకున్నా" అని తెలిపింది.సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయించే ఈ రోజుల్లో జీవించడం నిరంతరం భిన్నమైన అభిప్రాయాలను తీసుకొస్తుందని తెలిపింది. నా జీవితంలో పరిస్థితులు నాకు చాలా ఎక్కువగానే నేర్పించాయని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా సినిమా తన జీవితాన్ని మార్చేసిందని భూమి తెలిపింది. టీనేజ్ వయసులో ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనే పెద్ద కలతో నా ప్రయాణాన్ని ప్రారంభించానని పేర్కొంది. అప్పట్లో అవకాశాల కోసం వేచి చూసేదాన్ని అని వెల్లడించింది. కానీ ఈ రోజు నా లక్ష్యంతో పాటు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందానని భూమి పెడ్నేకర్ పంచుకుంది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే భూమి చివరిసారిగా ది రాయల్స్లో అనే వెబ్ సిరీస్లో కనిపించింది. -
సముద్ర ఒడ్డున టాలీవుడ్ నటి.. స్విమ్మింగ్పూల్లో శ్రియా శరణ్!
సముద్రపు ఒడ్డున టాలీవుడ్ నటి సాహితి హోయలు..స్విమ్మింగ్పూల్లో చిల్ అవుతోన్న శ్రియా శరణ్..బుల్లితెర నటి తేజస్వినీ గౌడ నవరాత్రి సెలబ్రేషన్స్..బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ శారీ లుక్..గ్రీన్ శారీలో హీరోయిన్ భూమిక చావ్లా.. View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
సాయి భార్గవ్ ను అరెస్ట్ చేసిన సీఐడీ
-
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ అరెస్ట్ చేసిన సీఐడీ
గుంటూరు: యూరియా అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే అభియోగంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలు ,దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాప్ లు చేసే వ్యక్తులపై పెట్టే 111 (3)(4)(5)సెక్షన్ను సాయి భార్గవ్పై పెట్టారు. అనంతరం సాయి భార్గవ్ను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సోషల్ మీడియా కేసులో 111(3)(4)(5) సెక్షన్ వర్తించదని వాదనను వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. విచారణ సందర్భంగా సిఐడి పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి తెలిపిన సాయి భార్గవ్. ఇన్ కెమెరా ప్రొసీడింగిడ్స్ తో సాయి భార్గవ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిఐడి పోలీసులు తనను కొట్టారని సాయి భార్గవ్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంపై అతన్ని వైద్య పరీక్షల కోసం న్యాయవాది సమక్షంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. -
ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకతే వేరు, నటుడుగా, వ్యాఖ్యాతగా, హోస్ట్గా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1973, జూన్ 3న బాలీవుడ్ హీరోయిన్ జయ బచ్చన్ వివాహం చేసుకున్నారు. అయిదుదశాబ్దాల వైవాహిక జీవితంలో అత్యంత నిత్యనూతన జంట అనడంలో సందేహంలేదు. పాతికేళ్లుగా కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే గేమ్ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న అమితాబ్ తాజాగా బిగ్ బీ తన భార్య జయాబచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఎపిసోడ్లో, తన భార్య జయ గురించి ఒక జోక్ వేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. కేబీసీ షోలో ఆశా ధిర్యన్ అనే కంటెస్టెంట్ తో బిగ్బీ మాట్లాడుతూ 'అద్భుత మహిళ'గా ఆశాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు 60 సెకన్లలో తనను తాను ప్రశంసించుకోవాలని కోరారు. తనను తాను పొగుడుకోవడం పూర్తి చేసిన తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ని తన భార్య జయ గురించి ఏదైనా మంచిగా చెప్పమని కోరింది. దీంతో 52 ఏళ్లుగా ఆమె నన్ను భరిస్తోంది,దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది? అయినా పొట్టి వాళ్లతో తిట్లు తినడం తనకు కొత్తేమీ కాదు అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న బిగ్బా తన భార్య జయా బచ్చన్ హైట్పై కామెడీ చేసేవారికి సరియైన జవాబు చెప్పారు.ఈ షోలో ఆశా తన ప్రేమకథ గురించి, ఎత్తు విషయంలో తమజంట మధ్య ఉన్న తేడా, ఫ్రెండ్స్ జోకులు గురించి చెప్పుకుంది.చాలా పొడవుగా ఉండే తన భర్త తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని షోలో చెప్పింది. ఆమె కథ విన్న బిగ్ బి రియాక్ట్ అయ్యాడు, ఆమె చెప్పింది తనకు చాలా నచ్చిందని, అయితే తాను బాగా కనెక్ట్ అయ్యే ఒక విషయం ఉందని, ఆమె కథను వినడం తనకు నచ్చిందని చెబుతూ ఒక పొట్టి వ్యక్తి ఒక పొడవాటి వ్యక్తిని తిట్టడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూసాయి.కాగా అమితాబ్-జయ జంట పిల్లలే అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా. అమితాబ్ వారసుడిగాఅభిషేక్ బచ్చన్ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక అమితాబ్ కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఐశ్వర్య ఆ ఫ్యామిలీకి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. -
పోలీసుల బరితెగింపు..హైకోర్టుకు బురిడీ... ఆదేశాలు బేఖాతర్
సాక్షి అమరావతి/సాక్షి,గుంటూరు: రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పోలీసులే కిడ్నాపర్లుగా మారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది.అంతేకాదు.. ఏకంగా హైకోర్టుకే బురిడీ కొట్టించేందుకు యత్నించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. కేసు నమోదు చేయకుండా.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందరరెడ్డి(సవీంద్రరెడ్డి)ని ప్రత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు. తన భార్య లక్ష్మీప్రసన్నతో కారులో వెళ్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సౌందరరెడ్డి భార్యను రోడ్డుపై వదిలేసి ఆయన్ను కారుతో సహా అపహరించడం తీవ్ర కలకలం రేపింది. తాము తాడేపల్లి పోలీసులమని.. ఓ కేసులో విచారించి అరగంటలో ఆయన్ను పంపేస్తామని ఆమెతో నమ్మబలికారు. అయితే ఆమె తాడేపల్లి స్టేషన్కు వెళ్లగా.. అసలు సౌందరరెడ్డిని తాము తీసుకురాలేదని అక్కడి పోలీసులు చెప్పడం గమనార్హం. దాంతో తన భర్తను పోలీసుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం ఉదయం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మేం అదుపులోకి తీసుకోనే లేదు.. హైకోర్టుకు పోలీసుల బురిడీ..! హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా పోలీసులు మరింత బరి తెగించారు. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ కేసు విచారణకు రాగా... అసలు సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోనేలేదని హైకోర్టుకు పోలీసులు చెప్పడం గమనార్హం. ఆయన తమ అదుపులోనే లేరని చెప్పారు. మా ఎదుటే హాజరుపరచండి.. సౌందరరెడ్డిని బుధవారం తమ ఎదుట హాజరుపర్చాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు.. ఆయన్ను మరే ఇతర మేజిస్ట్రేట్ కోర్టులోనూ హాజరుపరచవద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరున్యాయస్థానం ఇంత స్పష్టంగా చెప్పినా పోలీసుల తీరు మారలేదు! హైకోర్టు ఆదేశాలు అంటే తమకు ఏమాత్రం లెక్క లేదన్నట్టు వ్యవహరించారు. సౌందరరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారు. ఆయన్ను సోమవారం రాత్రంతా గుంటూరు సీసీఎస్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ప్రత్తిపాడు పోలీసు స్టేషన్కు తరలించి గంజాయి కేసులో ఆరో ముద్దాయిగా అక్రమంగా చేర్చారు. అంతటితో పోలీసులు ఆగలేదు.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ సౌందరరెడ్డిని గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో హాజరుపరిచారు. అక్రమంగా గంజాయి కేసులో నిందితుడుగా చేరుస్తూ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఉండటంతో పోలీసులు అతడిని తన ఎదుట హాజరుపరచడం సరికాదని మేజిస్ట్రేట్ స్పష్టంచేశారు. సౌందరరెడ్డిని బుధవారం ఉదయం హైకోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకూ న్యాయవాది సమక్షంలో ప్రత్తిపాడు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.నిర్భీతిగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. రాష్ట్రంలో పోలీసులు ఎంత చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నది... అక్రమ కేసులతో ఎంతగా వేధిస్తున్నారన్నది ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. అంతేకాదు.. అవాస్తవ సమాచారంతో ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నిచడం తీవ్రంగా విస్మయ పరుస్తోంది. ఏకంగా హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించడం పోలీసుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. పోలీసుల తీరుపై హైకోర్టు బుధవారం ఎలా స్పందిస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
పౌరులను పట్టుకెళుతున్నా చూస్తూ ఊరుకోవాలా?
ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?– ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్రసాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై పోలీసుల అరాచకాలు ఆగడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు. తీరు మార్చుకోవడం లేదు. అబద్ధాలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఇలాగే కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డి అలియాస్ సవీంద్రరెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు అసలు ఆయన ఎక్కడున్నాడో తమకు తెలియనే తెలియదంటూ బుకాయించి హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. అయితే ఖాకీల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైంది. సౌందరరెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందేనని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన్ను మరో కేసులో అరెస్ట్ చేశామంటూ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందరరెడ్డిని నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే.. అతడిని తమ ముందే హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకు, మేజిస్ట్రేట్కు స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజకు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్టు సౌందరరెడ్డిని ఒంగోలు పోలీసు ట్రైనింగ్ అకాడమీ (పీటీఏ)లో అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న నేపథ్యంలో, పీటీఏ డైరెక్టర్ను ఈ వ్యాజ్యంలో సుమోటో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.అక్రమ నిర్బంధంపై లంచ్మోషన్ పిటిషన్..గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, అరగంటలో ఇంటికి పంపేస్తామంటూ తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది.ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు..పిటిషనర్ తరఫున న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఇంటికి వెళుతున్న సౌందరరెడ్డిని తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ కేసులో తీసుకెళుతున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? లాంటి వివరాలు ఏమీ చెప్పలేదన్నారు. ఆయన జాడ ఇప్పటివరకు తెలియడం లేదన్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. బాధితుడు ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నట్లు తెలిసిందని రామలక్ష్మణరెడ్డి చెప్పారు. దీనిపై ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. దీనిపై హైకోర్టు ధర్మాసనం పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజను వివరణ కోరగా.. సౌందరరెడ్డిని ఏ పోలీసు అధికారీ తాడేపల్లి స్టేషన్కు తీసుకురాలేదని చెప్పారు. అసలు సౌందరరెడ్డి ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. ఆయన్ను ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదన్నారు. తన భర్తను కొందరు తీసుకెళ్లారంటూ పిటిషనర్ లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేశారని, దానిని తాము జనరల్ డైరీలో నమోదు చేశామని కోర్టుకు నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని చెబుతానన్నారు. అయితే పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు.. అసలు ఓ మహిళ ఫిర్యాదు చేస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం జనరల్ డైరీలో మాత్రమే నమోదు చేయడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఆచూకీ తెలుసుకుని బుధవారం తమ ముందు హాజరుపరిచి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసి..వాస్తవానికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సౌందరరెడ్డిని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేశారు. అయితే ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తెలిసినప్పటికీ ఆయన కోర్టుకు వాస్తవాలు వెల్లడించలేదు. అసలు సౌందరరెడ్డి తమ అధీనంలోనే లేరంటూ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలలోపు సౌందరరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైన పోలీసులు.. అనంతరం అసలు ఆయన తమ అధీనంలోనే లేరని సాయంత్రం 4 గంటల సమయంలో హైకోర్టుకు చెప్పడం గమనార్హం.తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం...!పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసుల తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వప్రత్యేక న్యాయవాది ప్రయత్నించారు. సౌందరరెడ్డిని ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదని తొలుత చెప్పిన ఆయన తరువాత మాట మార్చారు. ఒకవేళ ఏదైనా ఇతర కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉంటే..! అంటూ కప్పదాటు వైఖరి అనుసరించారు. అప్పటికే ధర్మాసనానికి మొత్తం వ్యవహారం అర్థం కావడంతో.. సౌందరరెడ్డిని ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏ కేసులోనైనా సరే.. సౌందరరెడ్డిని తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాలని ధర్మాసనం పోలీసులకు అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో మరో మాటకు తావు లేదంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
నవరాత్రి సెలబ్రేషన్స్లో శుభ శ్రీ రాయగురు.. బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర స్టిల్స్!
నవరాత్రి సెలబ్రేషన్స్లో బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు..బ్యూటీ మూవీ హీరోయిన్ నీలఖి పాత్ర స్టిల్స్..గ్రీన్ డ్రెస్లో ఊర్మిళ హోయలు..యాంకర్ లాస్య నవరాత్రి సంబురాలు.బీచ్లో బిగ్బాస్ బ్యూటీ కిర్రాక్ సీత చిల్.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Seetha/Supraja🦋🇮🇳 (@kirrakseetha) -
అమెరికాలో టిక్టాక్ బాధ్యత ఒరాకిల్కు
వాషింగ్టన్: అమెరికాలో సామాజిక మాధ్యమం టిక్టాక్ బాధ్యతలను ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ చేపట్టనుంది. అమెరికా వినియోగదారుల కోసం అవసరమైన అల్గారిథమ్ను త్వరలో టిక్టాక్ అందజేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్ సంభాషణ సందర్భంగా ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి వెల్లడించారు. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ కంపెనీ యాజమాన్యంలో టిక్టాక్ పనిచేస్తోంది. తాజా ఒప్పందంతో అమెరికాలోని టిక్టాక్ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనా కంపెనీ తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ఆందోళనలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో సిల్వర్ లేక్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టిక్టాక్ను అమెరికా కంపెనీకి అమ్మేయాలని లేదా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని బైట్డ్యాన్స్ను హెచ్చరిస్తూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గత అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ట్రంప్..బైడెన్ విధించిన నిషేధం గడువును పలుమార్లు పొడిగించారు. టిక్టాక్తో చర్చలను సైతం కొనసాగించారు. తాజాగా, జిన్పింగ్తో ఫోన్ కాల్ సందర్భంగా దీనిపై ట్రంప్ ఒక అంగీకారానికి వచ్చారు. -
వీక్షణల కోసం.. వేలంవెర్రి
రీల్స్ చేస్తున్నవాళ్లు, రీల్స్ చూస్తున్నవాళ్లు.. సమాజంలో ఉన్నది ఇప్పుడు ఈ రెండే వర్గాలు అన్నంతగా సోషల్ మీడియా మార్చేసింది. ఉన్నవారు–లేనివారు.. స్త్రీలు–పురుషులు.. రాత్రి–పగలు.. ఇంట–బయట.. ఇవేవీలేవు, ప్రతి ఒక్కరూ రీల్స్కి అతుక్కుపోతున్నారు. వాళ్లు అలా అతుక్కుపోయేలా కంటెంట్ క్రియేటర్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. అయితే ఎంతోమందికి ఆనందాన్నిస్తున్న రీల్సే.. ఆ రీల్స్ చేస్తున్న వ్యక్తులు ముఖ్యంగా మహిళల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. పరువు కోసం కుటుంబ సభ్యులే వారి ఉసురు తీసేందుకు ప్రేరేపిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్నిక్కీ భాటీ.. గ్రేటర్ నోయిడాకు చెందిన 26 ఏళ్ల ఈమెను ఇటీవల ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టి నిప్పంటించటంతో మరణించింది. మొదట దీన్ని వరకట్న హత్య అని పోలీసులు భావించారు. అయితే నిక్కీ రీల్స్ చేయటంపై అభ్యంతరం తెలిపిన ఆమె మెట్టినింటివారు.. ఆమె తమ మాట వినకపోవటంతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి, నిప్పంటించారని తర్వాత వెల్లడించారు!వద్దని చెప్పినందుకు.. నిక్కీ మరణానికి కొన్ని నెలల ముందు ఇలాంటి ఘటనే హరియాణాని గురుగావ్లో జరిగింది. 25 ఏళ్ల రాధిక యాదవ్ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక సోషల్ మీడియా రీల్స్ చేయడంపై ఆయన తీవ్రంగా కలత చెందారని, ఆ మనోవ్యథ ఆగ్రహంగా మారి కూతుర్ని చంపేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక మహిళ తను రీల్స్ చేయటానికి అడ్డు చెప్పినందుకు భర్తపై కత్తితో దాడి చేసింది. ఆ రీల్స్ రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆ భర్త మనో వేదన. దేశమంతా ఇదే గొడవదేశంలోని చాలాచోట్ల కొందరు చేస్తున్న రీల్స్, షార్ట్స్ కుటుంబాలలో అశాంతికి, ఆవేదనకు, ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. లైక్లు, కామెంట్లు, వాటి ద్వారా వచ్చే పేరు, డబ్బు కోసం కొందరు అశ్లీలత, అసభ్యత నిండిన కంటెంట్తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉన్నా, భారతీయ సమాజం మాత్రం ఈ రీళ్ల సుడిగాలిని తట్టుకోలేక సతమతం అవుతోంది. పల్లెల నుంచి మహా నగరాలకు వలస వచ్చిన వారు అక్కడి వెలుగు జిలుగుల నవ నాగరికతలకు ఎలాగైతే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతారో.. కంటెంట్ క్రియేటర్ల జీవితాల్లోకి రీల్స్, షార్ట్స్ అంతటి థ్రిల్ తెచ్చిపెట్టాయి. వీక్షకులు చూస్తున్నకొద్దీ వారు ఇంకా ఇంకా చూసేలా కంటెంట్ మోతాదును పెంచుకుంటూ పోతున్నారు.‘మిస్టేకెన్ మోడర్నిటీ’?!తాత్కాలికమైన ఆనందంతో చురుకు పుట్టించే ‘డోపమైన్–బూస్టింగ్’ కంటెంట్ను ఆస్వాదించటంలో వీక్షకులు, అలాంటి కంటెంట్ను సృష్టించటంలో కంటెంట్ క్రియేటర్లు.. అదే లోకంగా ఉండటంతో సమాజంలో ప్రమాదకరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లవుతోంది! కంటెంట్ క్రియేటర్లలో కనిపించే ఈ దూకుడును ‘మిస్టేకెన్ మోడర్నిటీ’ (ఆధునికతను వేరేలా అర్థం చేసుకోవటం) అని సామాజిక నిపుణులు అంటున్నారుఉపయోగపడేవీ ఉన్నాయిరీల్స్, షార్ట్స్.. అసభ్యత లేనంతవరకూ ఎవరికీ ఇబ్బంది కావు. అశ్లీలత కానంతవరకూ ఎవరికీ హాని చేయవు. ఒక వర్గాన్ని, మతాన్ని, ఒకరి శరీరాన్ని, వైకల్యాన్ని వెక్కిరిస్తూ, వెకిలిచేష్టలతో చేసే వీడియోలు సమాజానికి ప్రమాదకరం. యువతను పెడదారిపట్టించే కంటెంట్ ఉన్న షార్ట్స్.. ఏ జనరేషన్కీ మంచివికావు. మరి, ఉపయోగపడే రీల్స్, షార్ట్స్ లేవా అంటే ఎందుకు లేవూ, చాలా ఉన్నాయి. సరదాగా, నవ్వించేవి.. విజ్ఞానాన్ని పంచేవి.. సరికొత్త విషయాలు తెలియజేసేవి.. వంటలవీ, ఆధ్యాత్మికతవీ.. ఇలాంటి ఎన్నో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.వీక్షకులే తిరస్కరించాలిలైకుల కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం కంటెంట్ క్రియేటర్లు అశ్లీలమైన, అసభ్యకరమైన రీల్స్కి అడ్డుకట్ట వేసేదెలా? చాలా సింపుల్ అంటున్నారు మానసిక నిపుణులు. ‘అలాంటి కంటెంట్ను ఆదరించకపోవటం లేదా వారిని బ్లాక్ చేయడం ద్వారా వారికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వీడియోలు చేయడం ఒక మానసిక సమస్య కూడా కావచ్చు’ అంటున్నారు మానసిక నిపుణులు.రీల్సే లోకం!» ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’, గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఇప్సోస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 33 పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.» షార్ట్స్, రీల్స్ భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి.» ముఖ్యంగా దేశంలో అత్యధికులు చూసే షార్ట్ ఫామ్ వీడియో ఫార్మాట్గా రీల్స్ అవతరించాయి.» 97 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా తక్కువ నిడివిగల వీడియోలు చూస్తున్నారు. ఇందులో సింహభాగం రీల్సే.» ఈ ట్రెండ్ జెన్ జెడ్ యూజర్లలో ఎక్కువగా ఉంది.వీటిని చూడటం ఎంటర్టైన్మెంట్ స్థాయిని దాటి.. దైనందిన కార్యకలాపంలా మారిపోయింది. -
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు. ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు. మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్. ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations. 📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025 (చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..) -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
మీ పేరెంట్స్ మీతోనే ఉంటారా? ఈ ప్రశ్న అవసరమా?
సాధారణంగా ఏదైనా ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం చేసే ఇంటర్వ్యూలు అభ్యర్థి నైపుణ్యాలు, అర్హతలు, ఆ సంస్థలో వారిని తీసుకోవాలనుకుంటున్న హోదాకు తగిన అర్హతను అంచనా వేయడం పైనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిగత రంగంలోకి వెళతాయి. ఇటీవల ఓ అభర్థి ఎదుర్కొన్న అలాంటి ఒక ప్రశ్న – ‘మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా?’ అది విన్న ఆ అభ్యర్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజానికిది ఎటువంటి ఇబ్బందీ కలిగించని ప్రశ్నే అయినప్పటికీ కొంతమంది రిక్రూటర్లు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది. నిజమే కదా... ఎందుకు అడుగుతారు? ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఒకరిద్దరు అభ్యర్థులు వేర్వేరు ఇంటర్వ్యూయర్లు తమని తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా అని అడిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొదటిసారి ఇది జరిగినప్పుడు, కంపెనీ తరువాత ఉద్యోగ ఆఫర్ను పొడిగించింది, కానీ అభ్యర్థి దానిని తిరస్కరించాడు. తరువాతి ఇంటర్వ్యూలో, మరొక రిక్రూటర్ ఆ ప్రశ్నను పునరావృతం చేసి, ఆపై ఇతర ఉద్యోగ ఆఫర్ల వివరాల కోసం, వాటిని తిరస్కరించడానికి గల కారణాల కోసం ఒత్తిడి చేశాడు.ప్రశ్న సముచితమైన దేనా అని ఖచ్చితంగా తెలియదని, అభ్యర్థి ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడతాడా? లేక అతనిపై తల్లిదండ్రుల సంరక్షణ భారం ఎంతమేరకు పడుతుందా అని అంచనా వేయడానికి ఇలాంటి ప్రశ్నలు వేయవలసి వచ్చిందని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కుటుంబంతో కలిసి జీవిస్తున్నారంటే తక్కువ ఖర్చులు అని రిక్రూటర్లు భావించవచ్చని, తగ్గిన జీతాన్ని మేనేజ్ చేయడం సులభం అవుతుందని వారి అంచనా. నియామక ప్రక్రియలో అసమతుల్యతపై వారు నిరాశ వ్యక్తం చేశారు, ఇంటర్వ్యూయర్లు ఉద్యోగ పనితీరుకు సంబంధం లేని విషయాలను కూడా పరిశీలించవచ్చు. అర్థరహిత వ్యాఖ్యతో, కృత్రిమ మేధస్సు అటువంటి పద్ధతులను పూర్తిగా భర్తీ చేయగలదా అని అభ్యర్థి ఆశ్చర్యపోయాడు.చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియోకమ్యూనిటీ స్పందనఇలాంటి ప్రశ్నలు ఆఫర్ ఎంత తక్కువగా ఉంటుందో నిర్ణయించే ప్రయత్నాన్ని సూచిస్తాయన్నారు. కుటుంబంతో కలసి ఉండటం వల్ల అభ్యర్థిపైన తక్కువ ఆర్థిక ఒత్తిడి పడుతుందని వాళ్ల ఉద్దేశంగా భావించ వచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎలా ఎదుర్కోవాలి?ఈ పరిస్థితులను నిర్వహించడానికి అనేక మంది వినియోగదారులు తమ ఆలోచనలను ఇలా పంచుకున్నారు, వాటిలో ‘‘మీరు ఎందుకు అడుగుతారు?’’ అనే ఆసక్తితో స్పందించడం లేదా ప్రశ్నలోని అసంబద్ధతను ఎత్తి చూపడం వంటివి ఉన్నాయి. నిరుద్యోగ భృతి లేదా వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి యజమానులు అడిగిన ఇలాంటి అనుభవాలను కొందరు వివరించారు. ఈ చర్చ ఒక సాధారణ భావనను నొక్కి చెప్పింది: కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం గురించి తక్కువగా ఉండవచ్చు లేదా తమ సంస్థలో వీలైనంత తక్కువ ప్యాకేజీకే ఒప్పించేందుకు తగిన అవకాశాలను గుర్తించడం గురించి ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారంటే వారు బాధ్యతతో పని చేస్తారని ఇంటర్వ్యూయర్లు భావించవచ్చు. ఇదీ చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్ -
అధికారులే బాధ్యులు.. మాట మార్చడం చిటికెలో పని!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని, యూరియాతోపాటు మొత్తం 94,892 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు మూడో తారీఖున ప్రకటించిన బాబుగారు.. పదహారవ తేదీ వచ్చేసరికి యూరియా సరఫరాలో విఫలమయ్యామని, మానవ తప్పిదం జరిగిపోయిందని, అధికారులు తానిచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడంతోనే ఈ విపత్తు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో వాపోయారు! తద్వారా ఏం తేలింది? రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయనడం తన ఘనతగానూ.. లేమికి కారణం అధికారులదిగానూ తేల్చేసినట్ట అయ్యింది!యూరియా కొరత లేదని దబాయించినప్పుడు... వాస్తవపరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు బాబుగారు ఎంత హడావుడి చేశారని? వైఎస్సార్ కాంగ్రెస్ బుద్ది, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, దుష్ప్రచారం చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతోందని, వారు మనుషులా, పశువులా అని కూడా పెడబొబ్బలు పెట్టారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా.. ఖబడ్డార్! అని హెచ్చరించారు కూడా. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని రైతులు, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ హూంకరింపులన్నీ సోషల్మీడియాను బెదిరించేందుకే అన్నది స్పష్టం. టీడీపీకి వంతపాడే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికలలో యూరియాపై రైతులు పడుతున్న పాట్లను ఫోటోలతో సహా కథనాలు ఇస్తూంటే ఆ విషయం బాబుగారికి తెలియకుండా పోతుందా? స్టేట్ పేజీలలో తన బెదిరింపు ప్రకటనలకే టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇస్తుండడంతో అదే నిజమని జనం నమ్మాలని భావించారా అన్నది తెలియదు. యూరియా సమస్యపై నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. దాంతో ఇప్పుడు యూరియా సరఫరాపై ప్లాన్ ఇచ్చానని నాలుక మడతేశారు. అదేమిటో చెబితే అధికారులకు తెలిసేది కదా! టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడంతో రైతులకు ఈ కష్టాలొచ్చాయని అంటున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటలు వల్ల ప్రజలకు కేన్సర్వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించ లేదని, రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికార్లు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.ఇందుకు బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమోటా ధరలు కూడా పడి పోయాయని, ఈ టైమ్లో రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ లను కోరడం మంచిదే అయినా, కాని వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను కాల్వలలో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. . ఆయన చెబుతున్న సంగతులన్నిటికి కేవలం అధికారులే బాధ్యులా? అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనివ్వకుండా ప్రచారానికి వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు.దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమోటా, ఉల్లి పంటలు అధికం.ప్రతి నెల మొదటి తేదీన అదనపు ఫించన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగువేలు ఇవ్వడానికి హెలికాఫ్టర్ వేసుకుని జిల్లాలకు సి.ఎమ్. వెళుతున్నారు.అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య వంటివాటిపై ఎందుకు వీరు దృష్టి పెట్టలేదు? లేదా రాజంపేట, కర్నూలు, అనంతపురం వంటి చోట్లకు చంద్రబాబే వెళ్లారు కదా! ఈ మధ్య ఆయన బడ్డి కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు వెళ్లడం, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం వంటివి చేస్తున్నారు కదా! ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి వంటి పంటల ధరల గురించి తెలిసేది కదా! యూరియా అవసరమైన మేర వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు యూరియా వాడవద్దని, కాన్సర్ వస్తుందని చెబితే రైతులకు పుండుపై కారం చల్లినట్లు ఉండదా? అందుకే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వేస్తున్నారు. యూరియా వినియోగిస్తే కేన్సర్ వస్తుందని చెబుతున్నారు. మరి మద్యం తాగితే ఎలాంటి జబ్బు రాదా? దానిని ఎందుకు విచ్చలవిడిగా అమ్మిస్తున్నారని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. యూరియా వాడకపోతే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడు ఉన్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్దపడతారా? ఇలాంటి వాటిని ఎప్పుడు చెప్పాలి. సీజన్ రావడానికి నెలల ముందు కదా! అందుకు తగు ప్రత్యామ్నాయాలు ఏమిటో రైతులకు వివరించాలి కదా? అవన్ని వదలివేసి ఇప్పుడే ఏదో తెలిసినట్లు మాట్లాడితే రైతులు విశ్వసిస్తారా? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయల చొప్పున ప్రతీ రైతుకు ఇస్తామని చెప్పి, ఒక ఏడాదిపాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఐదువేలు ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తు ఉండదా? భూసార పరీక్షలు జరగలేదని ఆయనే చెప్పారు.అవి ఎప్పుడు జరగాలి. ఎందుకు జరగడం లేదు? దానికి ఆయన, వ్యవసాయ మంత్రి బాధ్యులు కారా? ఇలాంటి సమస్యలన్నిటిని తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతులకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పని చేయిస్తే, ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందా? లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేవా? కావా? ఆ ఐదేళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవావిధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! తప్పులేదు. గతప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తే దానిని కొనసాగించవచ్చు. అలా కాకుండా ద్వేషంతోనో, జగన్కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు మూడువేల కోట్లను కేటాయించి ఖర్చు చేసేది. మరి ఇప్పుడు ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? ఏది ఏమైనా ఒక సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. పది,పన్నెండు రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా ఇలాంటి అనుచిత మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జేసీబీతో పప్పు కలిపేశారు!
న్యూఢిల్లీ: కాలువలు తవ్వడానికి, పాత ఇళ్లు కూల్చడానికే కాకుండా వంటలు వండడానికి, పప్పు కలపడానికి కూడా జేసీబీ ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇక్కడ అచ్చంగా అదే చేశారు. భారీ పాత్రలో ఉడుకుతున్న పప్పును జేసీబీతో చక్కగా కలిపారు. అదే పప్పును అదే జేసీబీతో ట్రాక్టర్ ట్రాలీలోకి ఎత్తి, తర్వాత వేలాది మంది అతిథులకు వడ్డించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీరాజాద్ అనే వ్యక్తి దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ క్షణాల్లోనే ఇంటర్నెట్లో పాకిపోయింది. జేసీబీనే మాస్టర్ చెఫ్గా మారిందని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తిండి తింటే ఇంకేమైనా ఉందా? మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. తిండి విషయంలో శుభ్రత గురించి కాస్తయినా పట్టించుకోండి అని సూచిస్తున్నారు. ఇదొక గొప్ప ఆవిష్కరణ అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చని మాకు ఇప్పటిదాకా తెలియదని అంటున్నారు. మట్టిని తవ్వడానికి వాడే యంత్రాన్ని వంటలు వండే ప్రదేశం దాకా తీసుకురావడమే పెద్ద తప్పు, అలాంటిది దాంతోనే పప్పు కలపడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జేసీబీతో కలిపిన పప్పు భలే టేస్టు అంటూ సెటైర్లు సైతం విసురుతున్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది ప్రభుత్వాన్ని కోరారు. -
షీ జిన్పింగ్కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. వచ్చే నెలలో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ జిన్పింగ్తో మాట్లాడానని, టిక్టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్పింగ్ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు. -
తూమక్ తూమక్
సోషల్ మీడియాలో ‘తూమక్ తూమక్’ అనేది వైరల్ ట్రెండ్గా మారింది. కర్మ అనే టీచర్ చిన్న పిల్లలతో కలిసి వేసిన ‘తూమక్ డ్యాన్స్’ ఆహా అనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టీచర్ వేసిన పాపులర్ ట్రెండ్ స్టెప్స్ను చిన్ని స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా అనుసరించి ‘వారేవా’ అనిపించారు.‘మీరు నమ్ముతారో లేదోగానీ నేను ఈ వీడియోను వందసార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒక యూజర్. ‘నా వయసు 26 సంవత్సరాలు. మీ స్కూల్లో విద్యార్థిగా మారవచ్చా?’ అని సరదాగా అడిగింది ఒక యూజర్. ప్లేబ్యాక్ సింగర్ నేహా బాషిన్ ‘జుట్టి మేరీ’ ఆల్బమ్ పాపులర్ అయింది. ఈ పాటలోని తూమక్ స్టెప్స్కు ఆన్లైన్ లోకం ఫిదా అయింది. గతవారం క్లాస్రూమ్లో చిన్న అమ్మాయి ఒకరు చక్కని హావభావాలతో వేసిన తూమక్ తూమక్ స్టెప్స్ వీడియో కూడా వైరల్ అయింది. -
బీచ్లో సాయిపల్లవి సిస్టర్ చిల్.. దుబాయ్లో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్!
గ్రీన్ డ్రెస్లో బ్యూటీ హీరోయిన్ హోయలు..దుబాయ్లో చిల్ అవుతోన్న ప్రియా ప్రకాశ్ వారియర్..సిస్టర్తో కలిసి బీచ్లో సాయి పల్లవి చిల్.. వేకేషన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న అనసూయ.. ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తోన్న వితికా శేరు.. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) -
నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సాధారణ ఆహారాన్ని తీసుకోకుండానే గత 33 ఏళ్లుగా జీవిస్తున్నాడట. అదేంటి? ఎలా? అని ఆశ్చర్య పోతున్నారా? మరదే కదా స్టోరీ.. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ మాత్రమే సేవిస్తాడు. అందుకే లోకల్గా ‘ఆయిల్ కుమార్’గా పాపులర్ అయ్యాడట. దీనికి సంబంధించి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో రైస్ , చపాతీలు ఇస్తే తీసుకోలేదు. దీనికి బదులుగా ఇంజిన్ ఆయిల్ బాటిల్ను ఎత్తి గటా గటా తాగేశాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనికి ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ,ఆరోగ్యకరమైన జీవిస్తున్నానని తెలిపాడు పైగా అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమవుతుందని అయ్యప్ప వేషధారణలోఉన్న ఆయిల్ కుమార్ చెప్పుకొచ్చాడు.తన విశ్వాసమే దీన్ని భరించే సామర్థ్యాన్ని ఇస్తోందనీ, ఆ అయ్యప్ప స్వామి దయ ద్వారా మాత్రమే తాను జీవిస్తున్నాననేది అతని విశ్వాసం.నిపుణులేమంటున్నారంటేఅయితే, వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మోటారు ఆయిల్లో మానవులకు విషపూరితమైన పెట్రోలియం ఆధారిత సమ్మేళనాలు ఉంటాయని, చాలా ప్రమాదమ నొక్కి చెప్పారు. ఇలాంటి పదార్థాలను మింగడం లేదా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి పీల్చినట్లయితే, తక్షణ , దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్,శ్వాసకోశ వైఫల్యం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చుని పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావం చూపుతుంది.నోరు, గొంతు , కడుపులో కాలిపోవచ్చు.అంతర్గత రక్తస్రావం. వాంతులు, కొన్నిసార్లు రక్తపు వాంతులు కావచ్చు. అల్సర్లు, పుండ్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తలనొప్పి, తలతిరగడం, దిక్కుతోచని స్థితి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలొస్తాయి. ఈ విషపూరిత సమ్మేళనాలతో కాలేయం,మూత్రపిండాలకు దెబ్బతినేఅవకాశం ఉంది. హైడ్రోకార్బన్ కంటెంట్ కారణంగా గుండెజబ్బు లాంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by AvalakkiPavalakki (@avalakki_pavalakki) -
మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ మరోసారి కేన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్-4లో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా నఫీసా సోషల్మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని,విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో పోరాడాలని పలువురు అభిమానులు ప్రార్థిస్తున్నారు.2018లో స్టేజ్ 3 పెరిటోనియల్, అండాశయ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడారు. కోలుకొని అప్పటినుంచి కేన్సర్ ఫ్రీగా ఉన్న ఆమెమళ్లీ కేన్సర్ బారిన పడ్డారు. కేన్సర్ తిరిగి వచ్చిందంటూ నటి , రాజకీయ నాయకురాలు నఫీసా అలీ సోధి ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సాధ్యం కాదుకాబట్టి, కీమోథెరపీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. "ఈరోజు నుండి నా ప్రయాణంలో కొత్త అధ్యాయం. నేను నిన్న PET స్కాన్ చేయించుకున్నాను... కాబట్టి శస్త్రచికిత్స సాధ్యం కానందున కీమోథెరపీ చేయించుకోబోతున్నాను. బిలీవ్ మీ.. నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను."అంటూ తన పోస్ట్లో ఎంతో ధైర్యంగా తన హెల్త్ అప్డేట్ గురించి తెలియజేశారు.దీంతోపాటు స్క్రీన్షాట్ను, వరుస ఫోటోలను షేర్ చేశారు. ఒక రోజు నా పిల్లలు, అమ్మా, నువ్వు వెళ్లిపోతే..మమ్మల్ని ఎవరు చూస్తారు అని అడిగారు? తోబుట్టువులైన మీరే ఒకరికొకరు తోడు. అదేనేను మీకిచ్చిన గొప్ప బహుమతి . సిబ్లింగ్స్మధ్య ప్రేమ, జ్ఞాపకాలు, జీవితంలో సోదర బంధం చాలా ధృఢమైంది అని చెప్పాను అని తెలిపారు. మరో ఫోటోలో ద పవర్ ఆఫ్ లవ్ అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi)అండాశయ మరియు పెరిటోనియల్ కేన్సర్ అంటే?ప్రతి రోగిలోను కేన్సర్ భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ రకమైన కేన్సర్లో పునరావృతం కావడం చాలా సాధారణం. ప్రారంభ దశ వ్యాధితో పోలిస్తే .. అడ్వాన్స్డ్ స్టేజ్లో మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువే. దశ-3 అండాశయ కేన్సర్ పునరావృత రేటు 70-90శాతం మధ్య ఉంటుంది. నఫీసాకు కేన్సర్ అండాశయాలను దాటి ఉదర కుహరం (పెరిటోనియం) లేదా సమీపంలోని శోషరస కణుపుల లైనింగ్లోకి వ్యాపించింది. చికిత్సలో భాగంగా కేన్సర్ కణాలను తొలగించడానికి శస్త్రచికిత్స,మిగిలిన కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు కీమోథెరపీని చికిత్స అవసరం. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి లాంటి సాధారణ లక్షణాలు ప్రారంభదశలో ఉంటాయి. సాధారణంగా ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే బయటపడతాయి. ప్రారంభ దశల్లో గుర్తిస్తే నయం చేయవచ్చు.అండాశయ కేన్సర్ను నివారణకు మహిళలు ఏమి చేయాలి?ఊబకాయం అతిపెద్ద ప్రమాద కారకం. కాబట్టి స్త్రీలు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. ఇంకా మద్యం, ధూమపానం , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తోపాటు, కుటుంబ చరిత్ర ఉంటే జన్యు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.నఫీసా అలీ ప్రముఖ గోల్ఫర్ , అర్జున్ అవార్డీ కల్నల్ సోధిని పెళ్లాడిన నఫీసాకు కుమార్తెలు అర్మానా , పియా,కుమారుడు అజిత్ ముగ్గురు సంతానం ఉన్నారు. 1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన ‘జునూన్’ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చైర్ పర్సన్గా వ్యవహరించారు. సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్పై పోటీ చేశారు.నఫీసా అలీ అనేక రంగాలలో విజయాలు సాధించారు. 1972 నుండి 1974 వరకు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. 1976లోఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి. 2వ రన్నరప్గా నిలిచారు. 1979లో అలీ కలకత్తా జింఖానాలో జాకీగా కూడా పనిచేశారు. -
అన్ని మతాలనూ గౌరవిస్తా
న్యూఢిల్లీ: తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆయన గురువారం స్పందించారు. ఆరోపణలను ఖండించారు. తన వ్యాఖ్య లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో యునె స్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఖజు రహో ఆలయ ప్రాంగణంలో ఉన్న జవేరీ టెంపుల్లో భగవాన్ విష్ణుమూర్తి వి గ్రహం దెబ్బతిన్నదని, ఆలయాన్ని పునర్ నిర్మించి, అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పా టు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్తోపాటు జస్టిస్ కె.వినో ద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టింది. పిటిషన్ను తిరస్కరించింది. అది ప్రచార ప్రయోజన వ్యాజ్యం అంటూ ఆక్షేపించింది. విగ్రహం విషయంలో మీరు ఆరాధిస్తున్న విష్ణుమూర్తినే ఏదో ఒకటి చేయమని అడగండి అంటూ పిటిషనర్కు జస్టిస్ గవాయ్ సూచించారు. అలా చేస్తే మీరు నిజమైన విష్ణు భక్తులవుతారు అని చెప్పారు. దేవుడిని ప్రార్థించి, తర్వాత యోగా చేయండి అని పేర్కొన్నారు. శివుడికి మీరు వ్యతిరేకం కాకపోతే అక్కడే ఖజురహోలో పెద్ద శివలింగం ఉంది, దాన్ని పూజించండి అని జస్టిస్ గవాయ్ చెప్పారు. విష్ణుమూర్తి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జనం తప్పుపట్టారు. జస్టిస్ గవాయ్కి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అండగా నిలిచారు. జస్టిస్ గవాయ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన అన్ని మతాల ఆధ్యాత్మిక, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తుంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా భావిస్తుంటారని తెలిపారు. భగవంతుడిని కించపర్చడం ఆయన ఉద్దేశం కాదని అన్నారు. న్యూటన్ నియమం ప్రకారం ఒక చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుందని వివరించారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఒక చర్యకు తప్పుడు అతి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలను వక్రీకరించడం దురదృష్టకరమని స్పష్టంచేశారు. సోషల్ మీడియా పోస్టులను జస్టిస్ వినోద్ చంద్రన్ ఖండించారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా మారిందని విమర్శించారు. -
అసంతృప్త యువతరం
యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్–జెడ్ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, కోవిడ్–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది. డేవిడ్ జి.బ్లాంచ్ఫ్లవర్, అలెక్స్ బ్రైసన్, జియావోయ్ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్ లైఫ్ అన్హ్యాపినెస్ హంప్’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు. స్కీ స్లోప్లోకిజెన్ జెడ్అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్కమ్ కంట్రీస్)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్– జెడ్ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి. » యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది. » 2023 గ్యాలప్ సర్వేలో జెన్ జెడ్లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు. » 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.సమస్యలకు కారణాలు.. » సోషల్ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు. » కోవిడ్–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. » రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.పరిష్కారాలు..» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. » మెంటల్ హెల్త్ సర్వీసెస్ను పెంచాలి. » కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్–సేఫ్టీ చర్యలు చేపట్టాలి. » సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి. » స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.- సాక్షి, హైదరాబాద్ -
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే.. మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...నిజానికి ఈ స్టోరీని సాద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్ రోనిన్ మోటర్ సైకిల్ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్ తన ఎక్స్ ఖాతాలో ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్, ట్విట్టర్, ఎఫ్బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్ అనేది అందుకే మరి!. టెక్ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్కు జై అనాల్సిందే! -
ప్రధాని మోదీకి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మాదిరిగానే తానూ భారత్-అమెరికా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో.. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోనులో మాట్లాడాను. ఆయనకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.PM Modi posts, "Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH— Press Trust of India (@PTI_News) September 16, 2025దీనికి బదులుగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ‘అధ్యక్షుడు ట్రంప్ నా 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందుకు నా మిత్రునికి ధన్యవాదాలు. మీ మాదిరిగానే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేపట్టిన చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 17 తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్ స్వల్ప ధరలకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే భారత్పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. అలాగే భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ పలుమార్లు ఖండించింది. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
సోలో వేకేషన్లో అనసూయ చిల్.. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అనన్య నాగళ్ల!
కలర్ ఫుల్ శారీలో బిగ్బాస్ దివి...దక్ష లుక్లో మంచు లక్ష్మీ..వేకేషన్లో చిల్ అవుతోన్న అనసూయ..రెడ్ శారీలో బ్యూటీ హీరోయిన్ నిలాఖి పాత్ర లేటేస్ట్ లుక్..ఆరెంజ్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..సాగర తీరాన శోభిత ధూలిపాళ్ల చిల్..మ్యాచ్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
టిక్టాక్పై డీల్ కుదిరింది
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ సోషల్మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్మీడియా ఖాతా లో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. ‘అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవా రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడుతా’అని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ బైట్డ్యాన్స్ సృష్టించిన టిక్టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
ఏసీ కోచ్లో యువతి స్మోకింగ్.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్.. మీకెందుకంత బాధ?’
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్ లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్.. ఇది నీ ట్రైన్ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని.. ఈ సిగరెట్ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్లో సిగరెట్ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది. నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s— Tushar Rai (@tusharcrai) September 15, 2025 -
‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా విధులు నిర్వహించే మనారామ్తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సోషల్ మీడియా అంటేనే హడలిపోతున్న హీరోయిన్స్
-
డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్ డోపమిన్’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ డోపమిన్? డోపమిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. దీనిని ‘సంతోష హార్మోన్’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్ హార్మోనే ఇప్పుడు సోషల్ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్ హార్మో న్ విడుదలవుతుంది. అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్మీడియా యాప్లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. డిజిటల్ డోపమిన్ సంకేతాలు» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం » సోషల్ ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా లేనప్పుడు ఆందోళన చెందడం» సమయం తెలియకుండా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోవటం» ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చడం » ప్రతికూల కంటెంట్తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్ విరమణ (క్రాష్) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. » డోపమిన్ హార్మోన్ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్ క్రాష్ అంటారు. » ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. » చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. »ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్సిరీస్ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. » డోపమిన్ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్ మీడియా ఒకటి. ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్ చిన్నస్థాయిలో డోపమిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్ షాపింగ్, మితిమీరిన గేమింగ్ వంటి వాటికి కూడా విస్తరించింది. » డిజిటల్ డోపమిన్ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్లోని సోషల్, డిజిటల్ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.‘డిజిటల్’ వాడకం తగ్గించుకోవటమే మార్గం డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్ డోపమిన్’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్ సిస్టమ్లో భాగంగా క్విక్ గ్రాటిఫికేషన్ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్ సర్క్యూట్ను సోషల్మీడియా అధిక వినియోగం హైజాక్ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్.సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్ డోపమిన్ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్లోని మహీంద్రా షోరూమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్తో పని చేస్తోందని అప్పటికే సేల్స్మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ.. వేకేషన్లో హంసానందిని చిల్!
వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్.. 8 హీరోయిన్ అనంతిక సనీల్కుమార్ స్మైలీ లుక్స్... బ్లాక్ బ్యూటీ శృతిహాసన్ హోయలు.. వేకేషన్లో ఫుల్గా చిల్ అవుతోన్న హంసానందిని.. శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్.. View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Surveen Chawla (@surveenchawla) -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
ఈ నెపో కిడ్స్ విలాసాలు.. చూస్తే మతిపోవాల్సిందే!
నేపాల్లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు. నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్టాక్ లాంటి కొద్ది ప్లాట్ఫారమ్లలో వాళ్ల లైఫ్స్టైల్ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్ట్యాగ్ మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా మొదలై..అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్జెడ్కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు! ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పిందిఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు -
నయా నానో బనానా ట్రెండ్
రోజుల వ్యవధిలోనే సోషల్ మీడియాలో రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ నానో బనానా ట్రెండ్. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘గో విత్ ది ట్రెండ్’ అంటూ బనాన ట్రెండ్ ఫాలో కావడం విశేషం.ఇంతకీ ఏమిటీ ట్రెండ్?ఈ సరికొత్త వైరల్ త్రీడి ఫిగరీన్ ట్రెండ్ అనేది గూగుల్ వారి జెమిని 2.5 ఫ్లాస్ ఇమేజ్ టూల్కు సంబం«ధించింది. ఈ ట్రెండ్ను ‘నానో బనానా’ అనే నిక్నేమ్తో కూడా పిలుస్తున్నారు. ఈ పవర్ఫుల్ ఏఐ టూల్ క్షణాల వ్యవధిలోనే ఏ ఫోటోను అయినా వాస్తవికత ఉట్టిపడేలా త్రీడీ మోడల్లోకి మారుస్తుంది. ఈ టూల్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.టాలీవుడ్ నుంచి హాలివుడ్ వరకు హీరోల అభిమానులు ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్లో మీరూ భాగం కావాలనుకుంటే ఇలా చేయండి...∙గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్: గో టు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్లాలి. ∙ట్రై నానో బనాన ఆప్షన్ ఎంచుకోవాలి ∙ఫొటో ప్లస్ ప్రాంప్ట్ అనేది రికమెండెడ్ మెథడ్ ∙ప్లస్ బటన్ నొక్కి ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. ప్రాంప్ట్ ఇవ్వాలి -
యూరియా దొరక్కపోతే చచ్చిపోవాలనుకుంటున్నాను..
-
టోరంటోలో జాన్వీ కపూర్ హోయలు.. ఊహల్లో తెలిపోతున్న బిగ్బాస్ దివి!
గుజరాత్లో శ్వేతా బసు ప్రసాద్ టూర్..డిజైనర్ డ్రెస్లో రష్మిక మందన్నా సూపర్బ్ లుక్..టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..అంతా నీ ఆలోచనలే అంటూ బిగ్బాస్ దివి ప్రేమ కావ్యం..బ్లాక్ బ్యూటీలా జ్యోతి పూర్వాజ్ హోయలు.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బిచ్చగాడు 3' లో కొత్త సోషల్ మెసేజ్ ఏమిటి?
-
నేపాల్లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్
ఖాట్మాండు: నేపాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్లో ‘జన్ జి’ పేరుతో యువతరం చేపట్టిన ఆందోళనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. యువత ఆందోళనలు చివరకు హింసకు దారితీశాయి. సహనం కోల్పోయిన నిరసనకారులు, పాలకులను తరిమి తరిమికొట్టారు. ఈ క్రమంలో నేపాల్కు చెందిన ఓ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని హెలికాప్టర్లో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. నేపాల్లో సోషల్ మీడియాపై బ్యాన్ అనంతరం దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో నిరసనకారులు రెచ్చిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత.. మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసంపై రాళ్లు రువ్వారు. నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే.. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్న దృశ్యాలు, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.Parliment in Nepal. Better than voting. pic.twitter.com/NtFehqsycr— ADAM (@AdameMedia) September 10, 2025మరోవైపు..మాజీ ప్రధాని దేవ్బా ముఖానికి రక్తమోడుతూ నిస్సహాయంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు. ఖాట్మాండు హోటల్పై ఎగురుతున్న హెలికాప్టర్లో అధికారులను తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగాయి. పలువురు మంత్రులు హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.Politicians escaping the wrath of the people in Nepal pic.twitter.com/tia5JjkqmL— jim Njue (@jimNjue_) September 10, 2025ఇదిలా ఉండగా.. నేపాల్లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు సైతం వ్యాపించాయి. జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు. మరోవైపు.. నేపాల్లో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. అల్లర్లతో అస్తవ్యస్తమైన నగరంలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తోంది.🚨 BREAKING: In response to growing unrest in Nepal, the Nepalese Army deployed a Hindustan ALH Dhruv NA-054 helicopter to transport members of parliament to a safer location. The move comes amid rising tensions and concerns over security. 🇳🇵 #NepalUpdate pic.twitter.com/TuKEoKupn2— Fahad Naim (@Fahadnaimb) September 9, 2025 -
నేపాల్కు నిప్పు పెట్టిందెవరు?
కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్ఫోన్లో సోషల్మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు. మద్దతు పలికిన మాజీ ప్రధాని విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్ హెచ్చరించారు. ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్జీవో సంఘాలు హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్ జెడ్ నేపాల్, హమీ నేపాల్ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్జెడ్ నేపాల్ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్జెడ్ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేపాల్ ప్రధానిగా సుశీల?
కాఠ్మండు: కల్లోల నేపాల్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. మద్దతుగా 2,500 మంది సంతకాలు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ను, అనంతరం అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.ఎవరీ జస్టిస్ సుశీల? నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.మోదీజీ కో నమస్కార్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు. భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. -
భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు
సాక్షి, అమరావతి : ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ (భావ ప్రకటనా స్వేచ్ఛ) అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు ఎవరూ విఘాతం కల్పించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా అంశం రాష్ట్ర పరిధిలో లేదని గుర్తు చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నందున దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఆ చట్టం (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000)లోని సెక్షన్–66–ఏ కు కేంద్రం ఒక సవరణ చేస్తే.. దాన్ని సుప్రీంకోర్టులో శ్రేయ సింఘాల్ సవాల్ చేశారని గుర్తు చేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఆ సవరణ వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ లోని భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు అని స్పష్టం చేసిందని వివరించారు. అసెంబ్లీలో తగినంత సమయం ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలుగుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం. అది మాదే. అయినా మాకు ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనకు అది ఇష్టం లేదు. అందుకు కారణం ప్రజల సమస్యలు కనిపించకూడదు.. ప్రజల గొంతు వినిపించకూడదు అనేదే ఆయన ఉద్దేశం’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘మమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదన్న దానిపై హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. దానికి ఇప్పటికీ స్పీకర్ సమాధానం చెప్పడం లేదు’ అంటూ గుర్తు చేశారు.కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరగాలిస్థానిక ఎన్నికల్లో అక్రమాలకు ఈవీఎంలు పరిష్కారం కాదని.. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా రిగ్గింగ్ చేయించిందని ఎత్తి చూపారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక సంస్థలు నిర్వహిస్తేనే పారదర్శకంగా జరుగుతాయని పునరుద్ఘాటించారు. ‘యూరియా కొరత వల్ల రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అసలు ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా? ఖరీఫ్లో పంట చేలకు ఎన్నిసార్లు, ఎంత యూరియా వేస్తారో తెలియదు.. కనీసం దాన్నయిన అచ్చెన్నాయుడును తెలుసుకోమనండి’ అంటూ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ‘తురకపాలెంలో వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం ఏ విషయమూ స్పష్టంగా చెప్పడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే అర్థం లేని విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారు. అందుకే అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా తేలితే నేను వెళ్తాను’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. -
నివురుగప్పిన నిప్పులా నేపాల్
కాఠ్మండు/న్యూఢిల్లీ/డెహ్రాడూన్/జైపూర్: హిమాలయాల నేపాల్లో సోషల్మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చి డజన్లమందిని పొట్టనబెట్టుకుని బుధవారానికి చాలామటుకు శాంతించింది. కానీ బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాంతో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ఫ్యూను కఠినంగా అమలుచేస్తోంది. ఉద్యమబాట వీడి చర్చల పథంలో సాగాలంటూ విద్యార్థి సంఘాలకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘జెన్ జెడ్ నేపాల్’విద్యార్థి సంఘం ప్రతినిధులు నేపాల్ సైన్యంతో బుధవారం తొలిదఫా చర్చలు జరిపారు. రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి ఏకాభిప్రాయం కుదర్లేదు. మరోమారు చర్చలు జరపనున్నారు. నేపాల్ మాజీ మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కరీ్క, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, మాజీ విద్యుత్ బోర్డ్ సీఈఓ కుల్మాన్ ఘిసింగ్లలో ఏవరో ఒకరి సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశాన్ని నిరసనోద్యమ అగి్నకీలల్లోకి తోసేశారన్న ఆరోపణలను విద్యార్థులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. శాంతియుతంగా పోరాటంచేస్తుంటే బయటిశక్తులు దూరి విధ్వంసం సృష్టించాయని స్పష్టంచేశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినా ఆందోళనలు చల్లారకపోవడంతో సైన్యం మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగింది. అత్యంత సమస్యాత్మకంగా మారిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. దేశవ్యాప్త కర్ఫ్యూను విధించింది. అయితే హింసాత్మక ఘటనల్లో మరణాల సంఖ్య బుధవారానికి 33కు పెరిగింది. 1,033 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం దాకా కఠిన ఆంక్షలను అందరూ పాటించాలని, లూటీ, దోపిడీ వంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యాత్ర, పర్యటన కోసమొచ్చి చిక్కుకుపోయిన విదేశీయులను భద్రంగా స్వదేశాలకు తరలించే ప్రక్రియ మొదలెడతామని ఆర్మీ భరోసా ఇచ్చింది. ఆలోపు విదేశీ పర్యాటకులు, యాత్రికులకు తగు సాయం చేయాలని హోటళ్లు, టూరిజం సంస్థలను ఆర్మీ ఆదేశించింది. కాఠ్మండులో దుకాణాలు కొల్లగొట్టిన అల్లరిమూకల సభ్యులను ఆర్మీ అరెస్ట్చేసింది. వారి నుంచి భారీ ఎత్తున నగదు, 31 ఆయుధాలు, విలువైన వస్తువులను స్వా«దీనంచేసుకుంది. నేపాల్లో తాజా పరిస్థితిని గమనిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ బుధవారం చెప్పారు. పారిపోయిన ఖైదీలు ఆందోళనకారులు జైళ్లను బద్దలుకొట్టడంతో వాటిల్లోని 13,000 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. ఢిల్లీబజార్ జైలు, ఛిత్వాన్, నఖూ, ఝుంప్కా, కంఛన్పూర్, జలేశ్వర్, కస్కీ, డాంగ్, జుమ్లా, సోలూఖుంబు, గౌర్, బజ్హాంగ్లోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారు. ఆకొద్ది సమయంలో పారిపోవడం సాధ్యంకాని ఖైదీలు కారాగారాల్లో ఘర్షణలకు దిగుతున్నారు. పశ్చిమ నేపాల్లోని బాంకే ప్రాంతంలోని నౌబస్తా ప్రాంతీయ జైలు పరిధిలోని బాలనేరస్తుల కేంద్రంలో కొందరు జైలువార్డన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు తెగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు బాలలు చనిపోయారు. కొన్ని జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను సైన్యం ఎలాగోలా వెతికి పట్టుకుని మళ్లీ జైల్లో పడేసింది.పర్యాటకుల ఆక్రందనలు పొఖారా పట్టణంలో వాలీబాల్ లీగ్ మ్యాచ్ల కోసం వచి్చన భారతీయ మహిళ ఉపస్థ గిల్ ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకున్నారు. తనను రక్షించాలని, స్వదేశానికి పంపించాలని భారతసర్కార్ను వేడుకుంటూ ఆమె ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియో పోస్ట్చేశారు. ‘‘మ్యాచ్ కోసం ఇక్కడికొచ్చా. హోటల్ స్పాలో ఉన్నప్పుడు ఆందోళనకారులు పెద్ద కర్రలతో వెంటబడ్డారు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్నా. కానీ నా లగేజీ మొత్తం హోటల్లోనే ఉండిపోయింది. ఆ హోటల్కు నిరసనకారులు నిప్పుపెట్టి కాల్చేశారు. దయచేసి నన్ను భారత్కు పంపేయండి. రోడ్ల మీద ఎక్కడ చూసిన మంటలే చెలరేగుతున్నాయి. ఇక్కడ దారుణ పరిస్థితులున్నాయి’’అని ఆమె వీడియోలో వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు నేపాల్లో చిక్కుకుపోయి సురక్షిత తిరుగుప్రయాణం కోసం ప్రభుత్వ సాయం అర్థిస్తున్నా రు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నేపా ల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎయిర్ఇండియా, ఇండిగో విమానాల్లో భారతీయులను వెనక్కి రప్పిస్తామని పౌరవిమాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్కు కానీ, టూర్కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్ని, ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అల్లుడిని చూసి మురిసిపోతున్న నిహారిక.. బ్లాక్ శారీలో బిగ్బాస్ బ్యూటీ దివి!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్..విదేశాల్లో చిల్ అవుతోన్న నటి మంజు వారియర్..వరుణ్ తేజ్ కుమారుడితో నిహారిక కొణిదెల పిక్..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..హాలీవుడ్ పాపలా పోజులిచ్చిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
నేపాల్ సంక్షోభం నుంచి నేర్వవలసిన పాఠం!
‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని కొన్ని దశాబ్దాలకిందట ఆక్రోశించాడు ఓ సినీకవి. ఈ జెనరేషన్ కుర్రాళ్లంతా ఇంతే.. ఏదీ పట్టదు,, పక్కవాళ్ల గురించి పట్టించుకోరు.. సమాజం గురించి ఆలోచించారు.. తమ సొంత ప్రపంచంలోనే ముడుక్కుని ఉండిపోతుంటారు.. అని విలపించేవాళ్లు, మనకు ప్రతిరోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తుంటారు. కానీ.. యువతరం గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ అపోహలే! వారిలో చైతన్యం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సజీవంగానే ఉంది. ఉంటుంది. కాకపోతే.. దానిని జ్వాలగా రాజేసే సరైన నిప్పుకణిక ఉన్నప్పుడు.. జ్వాలలు రేగుతాయి. ప్రభుత్వాలలోనూ వేడిపుట్టిస్తాయి.‘సోషల్ మీడియా’ అనే పదం వినగానే చాలామంది ఏదో బూతు పదాన్ని విన్నట్లుగా మొహం గంటు పెట్టుకుంటారు. ఇక యువతరం విషయంలో అయితే- సోషల్ మీడియా అనేది వారిని సమూలంగా సర్వనాశనం చేస్తున్న విషపురుగు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటల్ని ఏకపక్షంగా సమర్ధించలేం. కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేస్తున్న వెర్రి తలలు ప్రతిరోజు వార్తల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా విశృంఖల రూపాలు వాడుక లోకి రావడం ప్రమాదకరమైన సంకేతం.అదే సమయంలో యువతరానికి సోషల్ మీడియా చేస్తున్న మేలు గురించి కూడా గమనించాలి. నేపాల్ వంటి దేశాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో యువతరం ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగుతూ వస్తోంది. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు కూడా అనేకులు. అలాంటి వారందరికీ స్వదేశంలోని తమ సొంత వాళ్లతో కనీసం అప్పుడప్పుడు అయినా మాట్లాడుకోవడానికి, అనుబంధాలను నెమరు వేసుకోవడానికి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి వారికి దొరికే ఏకైక మార్గం సోషల్ మీడియా మాత్రమే. నేపాల్ లో మరీ దారుణంగా వాట్స్అప్ యూట్యూబ్ వంటి వాటిని కూడా నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులు పెద్ద అగ్నిజ్వాలలనే పుట్టించాయి. యువతలో పెల్లుబికిన ఆగ్రహాన్ని అణచివేయడానికి ప్రభుత్వం మిలిటరీని ప్రయోగించడం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలితీసుకుంది. ప్రధాని ఓలి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆగ్రహజ్వాలలు సర్కారీ పెద్దల భవనాలకు అంటుకుని.. ప్రాణాలనూ బలితీసుకున్నాయి. ఇంకా చాలా చాలా జరిగాయి.స్థూలంగా గమనించినప్పుడు.. తొలుత అనుకున్న సంగతిని మనం సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఇవాళ్టి యువతరం నిజంగానే నిస్తేజంగా ఉంటున్నదా? పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి వారిలో కొరవడిందా? అలాంటి సందేహాలకు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే.. అవన్నీ యువతరంలో సజీవంగానే ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని ప్రదర్శించడానికి యువతరం ఏమాత్రమే వెనుకాడే పరిస్థితి లేదని ఈ నేపాల్ దృష్టాంతం నిరూపిస్తోంది. పదిహేనేళ్ల కిందటి మధ్యప్రాచ్య దేశాలను కుదిపేసిన ఉద్యమం అరబ్ స్ప్రింగ్ ను ఇది గుర్తుకు తెస్తోంది. 2011లో టునీషియాలో సోషల్ మీడియా అణచివేతకు వ్యతిరేకంగా రాజుకున్న పోరాటం ఈజిప్టు నుంచి లిబియా వరకు అన్ని దేశాలను కుదిపేసింది. నేపాల్ ఇవాళ అదే పునరావృతం అయింది. జెన్ జీ యువతరం సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసింది.యువతరంలో పోరాట స్ఫూర్తి లేదని అనుకోవడం సరికాదు. సోషల్ మీడియాకు యువత వ్యసన పరులు అయ్యారని, అందువల్లనే వారంతా ఇలాంటి తిరుగుబాటుకు ఒడిగట్టారని ఏకపక్షమైన వాదన సరికాదు. రోడ్డు మీదికి వచ్చి పోరాడిన వాళ్లు, ప్రాణాలు అర్పించిన వాళ్లు కేవలం రీల్స్ చేసుకోవడం మీదనో, చూడడం మీదనో మోజు ఉన్నవాళ్లు మాత్రమే కాదు. ఇలాంటి నిషేధాజ్ఞలతో వ్యక్తి స్వేచ్ఛను హరించేయాలని అనుకుంటున్న నియంతృత్వపు పోకడలను ఈసడించుకున్న వాళ్లు మాత్రమే అనేది గుర్తించాలి. స్వేచ్ఛ పట్ల ఇవాళ్టి యువతరంలో ఉండే మమకారాన్ని తెలుసుకోవాలి. నిజానికి నేపాల్ లో చెలరేగిన తిరుగుబాటు, విధ్వంసకాండ.. భారతదేశంలోనూ అనేక రాష్ట్రాల పాలకులకు కనువిప్పు కలిగించాలి. నిషేధాల వంటి జోలికి ఇక్కడి పాలకులు ఇంకా దృష్టి సారించడం లేదు. సోషల్ మీడియాను తాము కూడా వాడుకుంటున్నారు. కాకపోతే.. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపునకు ఈ చట్టాలను, సోషల్ మీడియా బూచిగా వాడుకుంటున్నారు. పాలకుల, ఇలాంటి దుర్మార్గపు పోకడలు కామన్ మ్యాన్ కు కూడా ఏదో ఒక రోజున ఆగ్రహం తెప్పిస్తాయి. అలాంటప్పడు.. ఆ ప్రభుత్వాలు భస్మీపటలం కాక తప్పదు. నేపాల్ తరహా తిరుగుబాటు ఇక్కడ వస్తుందని కాదు.. కానీ.. ప్రజాస్వామికంగానే ఆ పతనం నిర్దేశం అవుతుంది.:::ఎం. రాజేశ్వరి -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
మోదీతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్పోర్ట్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్గంజ్లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్వే మీద హిమాలయ ఎయిర్లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్లైట్లు రన్వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్లలో తలదాచుకున్నారు. పార్లమెంట్ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
ఏమ్మా ఎలా ఉన్నావు?
‘ఏమ్మా...ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు?ఎంత మంది పిల్లలు, చిన్నవాళ్లేనా?నాకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టవచ్చు కదా!... ఈ మాటలు విని పెద్దగా నవ్వుకోవడానికి ఏముంది!అయితే ఇంటర్నెట్వాసులు మాత్రం తెగ నవ్వుతున్నారు. అసలు విషయంలోకి వద్దాం... ఒక బామ్మ చాట్జీపీటీతో ముచ్చటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ‘ఎక్కడుంటావు? ఎంత మంది పిల్లలు?’ అని అడిగింది.బామ్మ అమాయకత్వానికి నవ్వులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ ఫన్నీ రియాక్షన్స్తో నిండిపోయింది. బామ్మలు ఏఐ చాట్బాట్స్తో సరదాగా సంభాషించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. -
జనరేషన్ జెడ్ హీరో.. నేపాల్కి కొత్త ప్రధాని.. ఎవరీ బాలెన్ షా?
కాఠ్మాండు: నేపాల్లో జనరేషన్ జెడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్మీడియాపై ప్రభుత్వ ఆంక్షల్ని విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ రాజధాని కాఠ్మాండులో జనరేషన్ జెడ్ యువత రోడ్డెక్కింది. ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత తదుపరి ప్రధాని ఎవరు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆ దేశంలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నేపాల్ తదుపరి నూతన ప్రధాని బాలేంద్ర షా (బాలెన్) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్మీడియాపై బ్యాన్, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువతే బాలేంద్ర షాకు మద్దతు పలుకుతున్నాయి. అతనే నేపాల్ నూతన ప్రధాని అంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వయిస్తున్నాయి. రాపర్ నుంచి మేయర్ వరకు: బాలెన్ షా ప్రయాణంబాలెన్ షా ఒకప్పుడు అండర్గ్రౌండ్ హిప్-హాప్ రాపర్. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదాన్ అనే పాటకు యూట్యూబ్లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన బాలెన్, 2022లో స్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మాండు మేయర్గా ఎన్నికయ్యారు.జెన్జీ ఆవేశాల్ని అర్ధం చేసుకోగలను నేపాల్లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించడంపై ఆందోళన చేపట్టిన జనరేషన్ జెడ్కు మద్దతుగా బాలెన్ షా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వయస్సు పరిమితి కారణంగా వారి ఆందోళనలో నేను పాల్గొనలేను.కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను’అని పేర్కొన్నారు.నేపాల్లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించిన తర్వాత ప్రారంభమైన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. జనరేషన్ జెడ్ యువత ఆధ్వర్యంలో సాగిన ఈ ఉద్యమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సైన్యం ఆదేశాలతో ప్రధాని కేపీ శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. ఓలీ తన రాజీనామా లేఖలో.. సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరం. అందుకు నేను రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఓలీ రాజీనామా అనంతరం ఎయిర్పోర్టులను మూసివేశారు. మంత్రులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ఈ క్రమంలో జనరేషన్ జెడ్ కేపీ ఓలీ తర్వాత తదుపరి ప్రధానిగా బాలెన్ షాయేనంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పార్టీల కోసం పని చేసే నాయకులు కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి’ అనే నినాదంతో బాలెన్ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాష్ట్రపతి వద్దకు బాలెన్ షాప్రధాని ఓలి రాజీనామాతో రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ కొత్త నూతన ప్రధాని అభ్యర్ధి పేర్లను పరిశీలిస్తున్నారు. జనరేషన్ జెడ్ సైతం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ వద్దకు బాలెన్ షా పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. -
Nepal: జెన్ జెడ్ తిరుగుబాటు సారధి సుడాన్ గురుంగ్ ఎవరు?
ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించడంతో యువత నుంచి నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో 20 మంది మరణించగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ‘జనరేషన్ జెడ్’నిరసనలు చోటుచేసుకున్న దరిమిలా హోంమంత్రి రమేష్ లేఖక్ నైతిక కారణాలతో రాజీనామా చేశారు. ఈ నిరసనలపై స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ హింసకు అవాంఛనీయ శక్తుల చొరబాటే కారణమని ఆరోపించారు. కాగా ఈ నిరసనలకు స్వచ్ఛంద సంస్థ ‘హామీ నేపాల్’ అధ్యక్షుడు సుడాన్ గురుంగ్(36) సారధ్యం వహించాడని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో గురుంగ్.. సోషల్ మీడియా యాప్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలకు పిలుపు నిచ్చాడని సమాచారం.2015లో నేపాల్లో సంభవించిన భూకంపంలో సుడాన్ గురుంగ్ తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటన దరిమిలా సుడాన్ సమాజంలోని సమస్యలపై ఉద్యమాలను చేపడుతూ వస్తున్నాడు. ఒకప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్న ఆయన విపత్తు ఉపశమన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సుడాన్ పిలుపు మేరకు వేలాది మంది యువ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పార్లమెంటు వెలుపల భారీ ర్యాలీని నిర్వహించారు. సోషల్ మీడియా సైట్లపై ప్రభుత్వ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్, లైవ్ రౌండ్లను కూడా ప్రయోగించారు. -
Nepal: సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ, అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు చెలరేగాయి. పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని, 20మంది మృతి చెందారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు రెడిట్, ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించటంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూలు యూనిఫారాల్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవటంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. 1997–2012 మధ్య పుట్టిన యువత (జనరేషన్– జెడ్) మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి పెద్దగా నియంత్రణలేవీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవటానికైనా, సంపాదనకైనా, సంభా షించుకోవటానికైనా సోషల్ మీడియాయే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించటంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించటంతో... దానికి వ్యతిరేకంగా టిక్టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత... ‘నిషేధించాల్సింది అవినీతిని... సోషల్ మీడియాను కాదు’అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండల వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని ఖట్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంపై జెన్–జెడ్ చేస్తున్నవి మాత్రమే కాదని, ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ ఖట్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంటు గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. -
నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం.. కాల్పుల్లో 20 మంది మృతి
కఠ్మాండు: మొబైల్ ఫోన్ వద్దంటే ఇళ్లలోనే గొడవలైపోతున్న ఈ రోజుల్లో... దేశమంతటా సోషల్ మీడియాను నిషేధించి నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు రెడిట్, ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించటంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూలు యూనిఫారాల్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవటంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. 1997–2012 మధ్య పుట్టిన యువత (జనరేషన్– జెడ్) మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి పెద్దగా నియంత్రణలేవీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవటానికైనా, సంపాదనకైనా, సంభా షించుకోవటానికైనా సోషల్ మీడియాయే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించటంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించటంతో... దానికి వ్యతిరేకంగా టిక్టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత... ‘నిషేధించాల్సింది అవినీతిని... సోషల్ మీడియాను కాదు’అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండల వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని ఖట్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మా నిర్ణయం సరైనదే: కేపీ శర్మ ఓలీ నిరసనల నేపథ్యంలో నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. కొందరు యువత బ్లాక్మెయిల్ చేస్తే వారికి లొంగేది లేదని, తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ చెప్పారు. మంత్రులంతా దీనికి మద్దతివ్వాలని కోరారాయన. అయితే ప్రభుత్వంలో భాగమైన నేపాలీ కాంగ్రెస్ మంత్రులు తక్షణం నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఓలీ మొండి వైఖరికి నిరసనగా కేబినెట్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కాగా ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంపై జెన్–జెడ్ చేస్తున్నవి మాత్రమే కాదని, ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ ఖట్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. పార్లమెంటు వద్ద హింసాత్మకం ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంటు గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. నిషేధం ఎందుకంటే... సోషల్ మీడియా సంస్థలు ఆగస్టు 28లోగా తమ దేశంలో రిజిస్టరు చేసుకోవాలని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ డెడ్లైన్ ముగిసినా ప్రధాన సోషల్ మీడియా సంస్థలేవీ రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో నిషేధం విధిస్తున్నట్లుగా ఈ నెల 4న ప్రభుత్వం ప్రకటించింది. -
నేపాల్ ప్రధాని కేపీ ఓలి కుటుంబ సభ్యులపై రాళ్లదాడి.. హోం మంత్రి రాజీనామా
కాఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారుల్ని నిలువరించేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు చేసిన ప్రయత్నాల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.అయినప్పటికీ నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జెడ్ జనరేషన్ మొదలు పెట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన కారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పూర్వీకుల ఇంటిపై రాళ్లు విసిరారు. రాజధాని కాఠ్మాండూతో పాటు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాని ఓలి స్వస్థలమైన దమక్ వరకు ఈ ఉద్యమం విస్తరించింది. కోశీ ప్రావిన్స్లోని ఇతర ప్రాంతాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.నేపాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తోంది. ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో యువతకు భయపడిన నేపాల్ ప్రభుత్వం గత గురువారం(సెప్టెంబరు 4) మెటా,యూట్యూబ్,ఎక్స్.కామ్ ఇలా మొత్తం 26 సోషల్ మీడియా ఛానెల్స్ను బ్యాన్ చేసింది. దీంతో నేపాల్ యువత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెదవి విరిచింది. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఆదేశాల్ని నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.ఈ నేపథ్యంలో గత గురువారం నుంచి, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. జెనరేషన్జెడ్ యువత రాజధాని కాఠ్మాండూ నగర వీధుల్లో ఉద్యమాన్ని సోమవారం ముమ్మరం చేసింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి పారద్రోలడం,సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయడంతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ హోం మంత్రి రాజీనామానేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను ప్రధాని కేపీ ఓలికి అందజేశారు. -
తగలబడుతున్న నేపాల్ 16మంది మృతి.. 100 మందికిపైగా..!
-
వచ్చే ఏడాది త్వరగా వచ్చేయ్ వినాయక.. శ్వేతాబసు ప్రసాద్ పోస్ట్ (ఫొటోలు)
-
కల్లోలంగా నేపాల్.. అసలేం జరుగుతోంది? వాళ్ల డిమాండ్లేంటి??
నేపాల్లో అక్కడి జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం(Gen-Z Protest) అదుపు తప్పింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ఖాట్మాండులో కొనసాగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా 20 మంది మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.నేపాల్ రాజధాని ఖాట్మాండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘోరాహీ వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో.. పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని కె.పి. శర్మ ఓలి స్వస్థలం ధమాక్కూ ఈ నిరసనలు విస్తరించాయి.ఆందోళన వెనుక కారణాలుకిందటి ఏడాది ఆగస్టు/సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీం కోర్టు.. అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలి అని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్.. కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి.. 7 రోజుల గడువుతో అధికారిక నోటీసు ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్లను(యాప్లను) బ్లాక్ చేసి పడేసింది.అభ్యంతరాలు అందుకే..ప్రభుత్వ చర్యలను Gen-Z యువత సెన్సార్షిప్గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్లో కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్టాక్ లాంటి ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో.. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తు అని.. మరి తమ పరిస్థితి ఏంటని? నిలదీస్తున్నారు. ఈ క్రమంలో.. రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొసమెరుపు ఏంటంటే.. టిక్టాక్ను కిందటి ఏడాది నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్ను ఎత్తేసింది. ఇప్పుడు అదే ప్లాట్ఫారమ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది.ప్రభుత్వం స్పందననియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశం అని ప్రభుత్వం చెబుతోంది.స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం అని అంటోంది. నిరసనల్లో.. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ తూటాలు ప్రయోగించారు. పలు చోట్ల కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులు గాయపడ్డారు. ఖాట్మాండు బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరించబడింది. ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం.. నేపాల్లో కోటి 35 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. 36 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. వ్యాపారాలపై కోసం చాలామంది ఆధారపడి ఉన్నారు. అలా.. బ్యాన్ నేపథ్యంలో అన్నివిధాల నిరసనలు ఊపందుకున్నాయి. Gen-Z (Generation Z) అనేది 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన వ్యక్తుల తరం. జెన్ జెడ్ ఏం చెబుతోంది అంటే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం కాదు, అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం. ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేసే ఆలోచనలో నేపాల్ ప్రభుత్వం ఉన్నట్లు అక్కడి మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో చోరీ.. ముసుగులతో వచ్చి.. వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఇండోర్లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ నివాసంలోకి దొంగలు ప్రవేశించారు. ఐదుగురు వ్యక్తులు ముసుగు ధరించి వారు దొంగతనానికి ప్రయత్నించారని జితు పట్వారీ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘శుక్రవారం అర్థరాత్రి ఇండోర్లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు’ అని పోస్ట్ చేసింది.Indore में Congress प्रदेश अध्यक्ष Jitu Patwari के घर डकैती की कोशिश...#congress #mpnews #indorenews #latestnews #trendingnow #samaynow pic.twitter.com/dBYqzOHqty— Swatantra Samay (@SamaySwatantra) September 6, 2025ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఐదుగురు వ్యక్తులు జితు పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Breaking Attempted robbery at Madhya Pradesh #Congress President Jitu Patwari’s residence.Five masked men caught on cam pic.twitter.com/rFVbtrs1Cl— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) September 6, 2025 -
టీ కెటిల్తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ..
మానవతావాదులు తాము ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయం చేయడానికి రంగంలోకి దిగుతారు. భారీ వర్షాల వల్ల పంజాబ్లో జన జీవితం అస్తవ్యస్తం అయింది. ఒక వృద్ధుడు టీ కెటిల్తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ, తడుస్తూ ఎక్కడ వరద బాధితులు కనిపించినా వారికి టీ అందజేస్తూ వెళుతున్నాడు. బాధితులకు ధైర్యవచనాలు చెబుతున్నాడు.నిజానికి అతడు కూడా వరద బాధితుడే! వర్షాల దెబ్బకు వంట అనేది లేకుండా ఆకలిదప్పులతో నీరసించిపోయిన బాధితులకు ఆ కాస్త టీ ఎంతో కొంత ఉమశమనం ఇచ్చింది. క్రికెటర్ హర్బజన్సింగ్ (Harbhajan Singh) ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా?‘పంజాబీలను అనుకరిస్తూ కొద్దిమంది జోక్లు చేస్తుంటారు. ఈ వీడియో చూసి అయినా వారిలో మార్పు రావాలి. పంజాబీ ప్రజల మానవత్వాన్నికి చిన్న ఉదాహరణ ఈ వీడియో’‘ కష్టాలు... అని బాధపడుతుంటాంగానీ ఆ కష్టాలే మనుషులను దగ్గర చేస్తాయి. మానవత్వాన్ని పరీక్షిస్తాయి’... ఇలా రకరకాలుగా స్పందించారు యూజర్లు.When volunteers went to deliver relief materials, the flood-affected family despite having lost almost everything prepared tea and served it to the volunteers in return. That’s the spirit of Panjab. Rab de bande. #Punjab #PunjabFloods pic.twitter.com/EVdCuHlKuP— Harbhajan Turbanator (@harbhajan_singh) September 3, 2025 -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
Pakistan: గుడ్డు విసిరింది ఎవరు?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్కు చేదు అనుభవం ఎదురైంది. రావల్పిండి అడియాలా జైలు బయట ఆమెపై కోడి గుడ్డు దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సొంత పార్టీ మహిళా కార్యకర్తలనే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. తోషాఖానా కేసులో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్తో శుక్రవారం ములాఖత్ అయిన అనంతరం అలీమా జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమెపైకి గుడ్డును విసిరారు. అది ఆమె గదవకు తాకి పగిలిపోయి దుస్తుల మీద పడిపోయింది. గుడ్డు విసిరింది ఎవరు? అంటూ గట్టిగా గదమాయించారు. వెంటనే తేరుకుని ఫర్వాలేదు.. వదిలేయండి అంటూ ఆమె తన ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమెపైకి గుడ్డు విసిరింది ఇద్దరు మహిళలని, వాళ్లు పీటీఐ మద్దతుదారులేనని, జర్నలిస్టుల గుంపులో వచ్చి గుడ్డు విసిరారని, వాళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.తయ్యబ్ బాలోచ్ అనే సోషల్ మీడియా జర్నలిస్టు.. అలీమ మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్టులు చేశారు. దీంతో పీటీఐ మద్దతుదారులు ఆ జర్నలిస్టును టార్గెట్ చేశారు. ఇదే విషయమై అలీమాకు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె దాటవేశారు. ‘‘మీడియా అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.. బాలోచ్ను బెదిరించడం ఏంటి?.. ప్రశ్నించడమే నేరమా?’’ అని మీడియా ప్రతినిధులు ఆమెను నిలదీశారు. అయినా ఆమె మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఆమెపై గుడ్డు పడింది. అయితే.. ఈ దాడిని పీటీఐ ఖండించింది. అది తమ కార్యకర్తల పని కాదని అంటోంది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికి భయపడే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, PML-N పార్టీ ఈ దాడి చేయించారని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు, ఆర్మీ వర్గాలు స్పందించాల్సి ఉంది.Strongly condemn the disgraceful act of throwing an egg at Aleema Khanum, sister of former Prime Minister Imran Khan. No political disagreement should ever justify such disrespect. Pakistan’s politics need dialogue, not humiliation. #AleemaKhanum #StayStrongAleemaKhan pic.twitter.com/U5e2J1djPc— SAQIB (@saqibhussaiinn) September 5, 2025పాక్తో తోషాఖానా(ధనాగారం) కేసు సంచలనం సృష్టించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు.. తోషాఖానాలో ఉన్న విలువైన బహుమతులను దొడ్డిదారిన అమ్మేశాడని ఆరోపణలు వచ్చాయి. రూ. 14 కోట్ల (అంటే సుమారు $500,000) విలువైన బహుమతులను అమ్మినందుకు.. 2023 ఆగస్టులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 8న జరగనుంది. -
సోషల్ మీడియా దెబ్బ.. చంద్రబాబు అబ్బా..
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.-సిమ్మాదిరప్పన్న -
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
ఫేస్బుక్లో జుకర్ బర్గ్ బ్యాన్.. కేసేసిన జుకర్ బర్గ్
వాషింగ్టన్: ఫేస్బుక్లో తనని బ్యాన్చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్బుక్) తన అకౌంట్ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా. డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్బుక్ నా అకౌంట్ను బ్యాన్ చేయడంతో బిజినెస్ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్సైట్ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్లైన్లో క్లయింట్స్కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు. ‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్బర్గ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది. -
నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్తో డిప్యూటీ సీఎం వాగ్వాదం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. సోలాపూర్లో కర్మలా తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో, ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే.. సబ్-డివిజనల్ పోలీసు అధికారి ఐపీఎస్ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. ఎన్సీపీ నాయకుడు ఒకరు.. ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్ సూచించగా.. అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే, అజిత్ పవార్ వాయిస్ను ఆమె గుర్తించలేదు. దీంతో, ఆగ్రహానికి లోనైన అజిత్.. ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను.. నన్ను గుర్తించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా?. నీపై చర్యలకు సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు. అనంతరం, తనకు వాట్సాప్లో వీడియో కాల్ చేయాలని సూచించారు. సదరు అధికారి వెంటనే వీడియో కాల్ చేయడంతో అజిత్ను చూసి మాట్లాడారు.करमाळ्याच्या पोलिस उपअधिक्षक अंजली कृष्णा यांना उपमुख्यमंत्री अजित पवारांना फोनवरुन ओळखता आले नाही. त्यानंतर रागावलेल्या अजित पवारांनी अंजली कृष्णा यांना खडेबोल सुनावत थेट व्हिडीओ काॅलच केला.#ajitpawar #AnjaliKrishna pic.twitter.com/ag2DNuf3do— Ankita Shantinath Khane (@KhaneAnkita) September 2, 2025అయితే, ఆమె సమాధానం పవార్ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఈ సందర్బంగా అజిత్..‘నేను మీపై చర్య తీసుకుంటాను. నేనే మీతో మాట్లాడుతున్నాను అంటే మీకు సరదాగా ఉందా?. మీకు నిజంగా అంత ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.మరోవైపు.. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రభుత్వం, అజిత్ పవార్పై విమర్శలు వచ్చాయి. దీంతో, రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తత్కరే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా సునీల్ తత్కరే స్పందిస్తూ..‘అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ దాదా సదరు అధికారిని మందలించి ఉండవచ్చు. ఆమె చర్యను పూర్తిగా ఆపాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. పవార్ ఎప్పుడూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు అని చెప్పుకొచ్చారు. -
శారీలో బిగ్బాస్ దివి హోయలు.. మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ అందాలు!
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ మాల్వికా రాజ్..ఫ్లైట్లో మన్మధుడు హీరోయిన్ చిల్.. శారీలో మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ హోయలు..లేటేస్ట్ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ హన్సిక..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..శారీ అందాలతో టాలీవుడ్ ముద్దుగుమ్మ దివి.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Shwetha Menon (@shwetha_menon) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!
అధికి బరువు సమస్యకు చెక్పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్కట్లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్ని కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..తాను ఎలాంటి షార్ట్ కర్ట్లు అనుకరించలేదని అన్నారు. మైండ్ఫుల్నెస్గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు. దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్ఫుల్నెస్గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..) -
ఫ్యామిలీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. రేణుకా దేశాయ్ లేటేస్ట్ లుక్!
యాంకర్ లాస్య అదిరిపోయే డ్యాన్స్..షూటింగ్ సెట్ జ్ఞాపకాల్లో సీతారామం బ్యూటీ మృణాల్..నటి రేణుకా దేశాయ్ లేటేస్ట్ లుక్..హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ చిల్..ఫ్యామిలీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్స్ట్రాగామ్ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్రావు,సంతోష్రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్రావు,సంతోష్రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్రెడ్డి,పల్లా రాజేశ్వర్రెడ్డి,ప్రశాంత్రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
మరణం, అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్ పోస్ట్ వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్య వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ట్రుత్ వేదికగా ట్రంప్.. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్ మీడియా వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.ఇక, అంతకుముందు.. ట్రంప్ మద్దతుదారుడు, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డీసీ డ్రైనో ట్రంప్ ఆరోగ్యంపై ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా డైసీ.. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారాల పాటు ప్రజల ముందుకు రాకుండా ఉంటారు. కానీ మీడియా ఆయన 'చురుగ్గా' ఉన్నారు.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతారు. ఇలాగే ఆయన డైపర్లు ధరించి నిద్రపోతున్నారు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ట్రంప్ 24 గంటలు కనిపించకపోతే మీడియా గగ్గోలు పెడుతోంది. ఇది హాస్యాస్పదమైన ద్వంద్వ ప్రమాణం. అమెరికా చరిత్రలోనే అందరి అధ్యక్షుల కంటే ట్రంప్ ఎక్కువ సమయం ప్రజా పనుల్లో గడిపారు అని వివరించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను’ అని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేతులు, కాళ్లపై గాయాలు ఉండడం, వాటిని కవర్ చేసేందుకు ట్రంప్ మేకప్ వేసుకుని మీడియాకు దొరికిపోవడంతో.. అంతా ఆయన ఏదో అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కానీ ఏదైనా అనుకోని భయంకరమైన విషాదం జరిగితే తానే అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ ఆరోగ్యంపై మరింత అనుమానం పెరిగింది. -
భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు
భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్టాక్ మళ్ళీ భారత్లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.బైట్డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ కంపెనీ వెబ్సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.టిక్టాక్ వెబ్సైట్లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాటిక్టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్టాక్కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్టాక్తో పాటు 58 ఇతర చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
క్రెడిట్ లాగితే కాల్ దొరికింది
తీగ లాగితే డొంక కదిలినట్లు క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ గురించి ఆరా తీస్తే, అంతర్జాతీయ కాల్ డైవర్షన్ వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు 2009లో ఈ అనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.సాధారణంగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై భద్రతా సంస్థల నిఘా ఉంటుంది. అనుమానాస్పద కాల్స్ వచ్చే నంబర్లను అవసరమైతే టాప్ చేస్తుంటారు కూడా! అంతర్జాతీయ కాల్స్పై నిఘా కోసం వాడే ఉపకరణాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్వే లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) ఆపరేటర్ల వద్ద ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే కాల్స్ అక్కడి ఎక్స్చేంజ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్కు చేరుతాయి. అక్కడి నుంచి ఐఎల్డీ ఆపరేటర్కు వచ్చి, ఆపై ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇవి ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్కతాలలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్స్చేంజీల ద్వారా ఇక్కడ రిసీవ్ చేసుకునే ఫోన్కు వస్తుంది.సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు నిర్ణీత మొత్తాలు చెల్లిస్తారు. ్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే ఈ సంస్థలు తమ ఆదాయం నుంచి నిర్దేశిత మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తాయి. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా కొన్నేళ్ల కిందట కాల్ డైవర్షన్ పద్ధతిని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంతమందికి సోషల్ మీడియా ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తుంటారు. ఇలా ఈ బాక్సులు ఏర్పాటైన తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆపరేటర్కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మార్చేస్తారు. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారి వద్ద ఏర్పాటు చేయించిన బాక్సులకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే Vó ట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీగా పిలిచే పరికరాలకు చేరుతుంది. స్థానికంగా తీసుకున్న సిమ్కార్డులను ఈ సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీల్లో నిక్షిప్తం చేస్తారు. విదేశీ గేట్వే నుంచి డేటా రూపంలో వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్గా మారిపోయి, అందులో నిక్షిప్తం చేసిన సిమ్కార్డు నంబరు నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వ్యక్తికి చేరుతుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి కాల్ చార్జీలు తగ్గుతాయి. వాట్సాప్ నిషేధం ఉన్న దేశాల నుంచి ఈ కాల్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఫలితంగా దేశంలోని ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటాయి. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్స్ ఆ మొత్తాన్ని మిగుల్చుకుని, ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంటారు.విదేశాల్లో ఉంటున్న ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్తో ఈ–మెయిల్ ద్వారా పరిచయం పెంచుకున్న హైదరాబాదీలు వి.రమేష్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్, ఆర్డీ శ్రీనివాస్, నజీబ్ అహ్మద్ ఖాన్ కాల్ డైవర్షన్కు సహకరించడానికి అంగీకరించారు. వీరు హైదరాబాద్లోని రెండు ప్రాంతాల్లో గేట్వేలతో కూడిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వినియోగించే సిమ్కార్డులను మారుపేర్లతో సంగ్రహించారు. వాటి బిల్లులు చెల్లించడానికి క్లోనింగ్ చేసిన క్రెడిట్ కార్డులను వినియోగించారు. ఇలాంటి కాల్ డైవర్షన్స్ను ఎక్కువగా వాట్సాప్ నిషేధంగా ఉన్న దేశాల్లో ఉంటున్న వారితో పాటు ఉగ్రవాదులు, మాఫియా కార్యకలాపాలు సాగించేవారు వాడుతున్నారు. ఈ విధానంలో ఫోన్ ఎక్కడ నుంచి వస్తోందనేది తెలుసుకోవడం స్థానికంగా డైవర్షన్ పరికరాలు ఏర్పాటు చేసిన వారికీ సాధ్యం కాదు. ఈ ముఠా టాస్క్ఫోర్స్ పోలీసులకు చిత్రంగా చిక్కింది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు 2009 జనవరి 29న సికింద్రాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నారని, క్లోనింగ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని ఓ కానిస్టేబుల్కు సమాచారం అందింది. ఆయన ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.రమేష్, మహ్మద్ ఖుద్దూస్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమకు క్లోనింగ్ క్రెడిట్ కార్డులను ముంబైకి చెందిన ముగ్గురు వ్యక్తులు అందిస్తున్నారంటూ బయటపెట్టారు. వీటితో షాపింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు, వీరి వస్తువులను సోదా చేశారు. రమేష్ దగ్గర లభించిన ఓ పుస్తకంలో సీడీఎమ్ఏ ఫోన్కు చెందిన ‘9298’ సిరీస్తో సీరియల్గా 20కి పైగా నంబర్లు కనిపించాయి. వీటిని చూసి అనుమానించిన పోలీసులు కాస్త లోతుగా విచారించారు. ఫలితంగా పంజగుట్టలోని సఫైర్ అపార్ట్మెంట్స్, మాసబ్ట్యాంక్లోని మహేశ్వరి కాంప్లెక్స్ల్లో అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేసి, అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ను లోకల్స్గా మారుస్తూ జరుగుతున్న కాల్ డైవర్షన్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతాల్లో దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితులను పట్టుకుని, కాల్ డైవర్షన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.· -
ట్రంప్ వచ్చేశారు.. అదంతా ఫేక్ ప్రచారమే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చనిపోయారంటూ, కనిపించడం లేదంటూ వస్తున్న వార్తలకు తెర పడింది. ఎట్టకేలకు అధ్యక్షుడు ట్రంప్.. దర్శనమిచ్చారు. ఈ మేరకు వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా ట్రంప్ తన వర్జీనియా క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో వైట్హౌస్ షేర్ చేసింది. దీంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు క్లారిటీ వచ్చేసింది.ఇక, వైట్హౌస్ ఈ సందర్బంగా స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ట్రంప్ తన మనుమరాలు కయి ట్రంప్, మనువడు ఫ్రెడరిక్ ట్రంప్తో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిపింది. ఇక, ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి, అమెరికా గ్రేట్ క్యాప్ ధరించి కనిపించారు. కాగా, తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని తేల్చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో, ట్రంప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. మీమ్స్, వీడియోలు చక్కర్లు కొట్టాయి.#JUSTIN: Trump is aliveDonald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30, 2025, heading to Trump National Golf Club in Sterling, Virginia.#Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump… pic.twitter.com/rDvhVWgPXX— upuknews (@upuknews1) August 30, 2025 -
ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయి.. మరొకరిని మనువాడి!!
ఒక హీరోయిన్ ఉంటది. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి పారిపోతుంది. దారిలో కలిసిన హీరోను ఈ ఇద్దరు సాయం కోరతారు. ఆ ప్రయాణంలో హీరోహీరోయిన్ల మధ్య టన్నుల కొద్దీ లవ్ పుడుతుంది. చివరకు పాపం ఆ ప్రియుడు కూరలో కరివేపాకులా సైడ్ అయిపోతాడు. కాస్త అటు ఇటుగా ఇదే లైన్తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. సినిమా వరకు ఇది బాగానే ఉంది.. ఇదే రియల్ లైఫ్లో జరిగితే!!వారం రోజులుగా తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఆందోళనలో ఉన్న ఆ తల్లిదండ్రులకు పోలీసులు షాకిచ్చారు. ఓ వ్యక్తిని పెళ్లాడి వచ్చిందని వాళ్లిచ్చిన సమాచారంతో వాళ్లు మరింత గందరగోళానికి గురయ్యారు. పైగా అతను ఆమె ప్రేమించిన వ్యక్తి కాదని.. ఇంకెవరో వ్యక్తి అని చెప్పడంతో మరింత కంగుతిన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధిలోని ఓ పీఎస్లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..ఇండోర్లో బీబీఏ ఫైనలియర్ చదువుతున్న శ్రద్ధా తివారీ ఆగస్టు 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. సీసీటీవీ ఫుటేజీలో.. అర్ధరాత్రి పూట ఆమె కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోయినట్లు రికార్డయ్యింది. దీంతో ఆమెను ట్రేస్ చేయడం కష్టతరంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారంపాటు గాలించారు. అయినా ఆమె జాడ తెలియరాలేదు.ఈలోపు.. ఇండోర్ పీఎస్లో శ్రద్ధా ప్రత్యక్షమైంది. తాను సార్థక్ అనే యువకుడికి మనసిచ్చానని, పేరెంట్స్ అంగీకరించరనే భయంతో అతనితో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నానని పోలీసులు చెప్పసాగింది (పోలీసులు ఊ.. కొట్టసాగారు). అయితే.. సార్థక్ స్టేషన్కు రాలేదని.. అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడని.. దాంతో గుండెబద్ధలైన తాను ఒంటరిగానే తాను రత్లంకు వెళ్లే రైలు ఎక్కానని తెలిపింది. అయితే రత్లం స్టేషన్ బయట ఒంటరిగా ఉన్న తనను కరణ్దీపక్ అనే వ్యక్తి ఓదార్చాడని.. తన పరిస్థితి చెప్పడంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించాడని.. ఇద్దరం కలిసి మాంద్సర్లో రైలు దిగి.. మహేశ్వర్కు వెళ్లి ఓ గుడి పెళ్లి చేసుకున్నామని.. అక్కడి నుంచి ఓ ఆలయాన్ని సందర్శించుకుని.. నేరుగా ఇక్కడికే వచ్చామని తెలిపింది(పోలీసులు నోర్లు వెల్లబెట్టి వినసాగారు )అయితే పోలీసులు ఆమె చెప్పింది నమ్మలేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాలని కోరారు. అయితే ఆమె ఫొటోలు మాత్రం చూపించింది. ఈలోపు తల్లిదండ్రులకు, సార్థక్కు కబురు పంపించారు. శ్రద్ధ తనకు వారం రోజులుగా టచ్లో లేదని సార్థక్ తేల్చేశాడు. ఆమె తండ్రి మాత్రం విచిత్రమైన వాదనలు వినిపించాడు. తన కూతురి మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని.. కూతురి ఫొటోను ఇంట్లో తలకిందులుగా వేలాడదీయని ఓ మాంత్రికుడు చెప్పాడని.. పైగా తన కూతురి ఆచూకీ చెబితే రూ.51వేల నజరానా ప్రకటించానని.. అలా చేసినందుకే తన కూతురు తిరిగి వచ్చిందని అంటున్నాడు. అయితే వివాహం జరిగిందనే విషయాన్ని మాత్రం ఆ తండ్రి అస్సలు నమ్మడం లేదు.కరణ్దీప్ నాకు ఫోన్ చేసి తాను ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నానని, శ్రద్ధ ఆత్మహత్య చేసుకోబోతే ఆపానని చెప్పాడు. ఆ తర్వాత నా కూతురు నాతో ఫోన్లో మాట్లాడింది. డబ్బులు అయిపోయానని, పంపిస్తే తిరిగి వస్తానని చెప్పింది. అలా నేను ఆమెకు డబ్బు పంపించా. తీరా ఇప్పుడొచ్చి మేం పెళ్లి చేసుకున్నాం.. కలిసి జీవిస్తామంటే ఎలా నమ్మేది? ఎలా ఒప్పుకునేది?.. అని అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. శ్రద్ధ మేజర్(22 ఏళ్లు) కావడంతో ఆమెకు ఇష్టం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని పోలీసులు ఆ తండ్రికి బదులిచ్చారు. దీంతో ఆమె ఎటు పోయినా తమకు సంబంధం లేదంటూ ఆ తండ్రి పీఎస్ నుంచి వెళ్లిపోయాడు. అయితే.. శ్రద్ధ చెబుతున్న విషయాలను పోలీసులు ఇంకా నమ్మడం లేదు. ఈ క్రమంలో.. కరణ్, శ్రద్ధను కలిపి కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈ ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉండి ఉండొచ్చని, ఆమె సినిమా కథ చెప్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతియాజ్ అలీ డైరెక్షన్లో 2007లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా జబ్ వీ మెట్ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమాలో తన ప్రియుడితో కలిసి పారిపోయిన కరీనా, షాహిద్ కపూర్లు రత్లం అనే స్టేషన్లో అనుకోకుండా దిగిపోతారు. అక్కడి నుంచి సినిమా అసలు మలుపు తిరుగుతుంది. ఇద్దరూ రైలు మిస్ అయ్యి.. కలిసి ప్రయాణించే క్రమంలో ప్రేమ బంధంతో ఒక్కటవుతారు. అలా ఈ చిత్రంతో రత్లం స్టేషన్కు గుర్తింపు దక్కింది(ఒరిజినల్గా షూట్ జరిపింది మనాలిలో సెట్ వేసి). ఇప్పుడు శ్రద్ధా తివారీ అదే స్టేషన్ పేరు చెబుతుండడంతో జబ్ వీ మెట్ తెరపైకి వచ్చింది. -
ట్రంప్ నిజంగానే క్షేమమా? వైట్హౌజ్ గప్చుప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్ మిస్సింగ్పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత 24 గంటలుగా సోషల్ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఓ ట్రెండ్ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్ మరింత దారుణంగా మారింది. ట్రంప్ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. JD Vance Says He’s Prepared to Assume Presidency if Trump...#Jdvance #vance #prepare #assume #office #president #donaldtrump #trump #health #wellbeing #transitions #rickwilson #conservative #strategist #maga #games #trending #viral #fyp #xviral #viralx pic.twitter.com/Jlt5BbvaZ6— FANmily TV (@FanmilyTV) August 30, 2025ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్హౌజ్గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్హౌజ్ సౌత్ లాన్లో ఆయన గోల్ఫ్ ఆడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. #JUSTIN Trump is alive Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30 #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive #Kai #Virginia pic.twitter.com/fAUCijwwCR— ViralVolt🟦 (@ViralVolT1) August 30, 2025ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది. #BREAKING: Trump makes an appearance at his golf club this morning, putting to rest swirling health rumors. #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive pic.twitter.com/VfvOaGsVj0— Mukund Shahi (@Mukundshahi73) August 30, 2025మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.భారత్+రష్యా+చైనా = ట్రంప్నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్ కామిక్ సిరీస్ను ఉద్దేశించి.. ట్రంప్ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్ మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్, ఎలాన్ మస్క్లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్ పెట్టారు కూడా.Simpsons predicted Donald Trump died of heart attack in 2025 in a forgotten episode & that's why Americans are searching "TRUMP IS DEAD", "TRUMP DIED" Trump#DonaldTrump #Trump #TrumpHealth #TrumpHealthCrisisCoverup #Simpsons #TrumpDead #TrumpDied pic.twitter.com/7vbANhE0wu— Marwdi Londa (@Marwdi45032) August 30, 2025Congratulations 🎉 Donal Trump Donald Trump is alive again after dying#donaldtrumpisdead #DonaldTrump pic.twitter.com/rfTwXSm0OL— Xi Jinping (@xijinpiing_) August 30, 2025 Elon Musk when he checks why Donald Trump is trending💀😂#DonaldTrump pic.twitter.com/Zvotz6n599— The Sarcastic Indian (@_Sarcasticindia) August 30, 2025🚨 Breaking: Senior official says Trump is perfectly fine and will go out to play golf today, according to Axios report.Now imagine after exploding the internet by trending “Trump is Dead” he suddenly appears👇🏻#trump | #trumpdead | #DonaldTrump | #TrumpIsDead pic.twitter.com/zgBLpv4gvK— GeoWireDaily (@geowiredaily) August 30, 2025if "TRUMP IS DEAD" i will give 1000 dollars to anyone who likes this tweet.#DonaldTrump#whereistrump #donaldtrumpisdead pic.twitter.com/enKe7zWGgt— GR Jaam k (@grjaam7) August 30, 2025ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!. -
అమెరికాలో టెన్షన్.. ట్రంప్కు ఏమైంది.. ఎక్కడ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ‘మిస్సింగ్’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి.వివరాల ప్రకారం.. ట్రంప్ అనారోగ్యంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున సంగతి తెలిసిందే. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ట్రంప్ బయట కనిపించలేదు.. మీడియా ముందుకు సైతం రాలేదు. ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో, ట్రంప్ విషయమై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.🚨 BREAKING: Curiosity is rising: Trump hasn’t been seen in 3 days.No public events. No appearances. Silence everywhere.Speculation about his health & power moves grows louder…Is it strategy or concern? 👀What do you think—is this calculated or "Where is Donald Trump" pic.twitter.com/4AvG7heGUw— RX (@TheReal_RX) August 30, 2025నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ..‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ను ట్రెండింగ్లోకి తెచ్చారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.🚨MAJOR BREAKING: Whispers are traveling through the Washington press pool that Donald Trump has not been seen since Tuesday and has zero publicly planned events through the weekend. This clip is apparently one of the last times Trump was seen by the press. What’s going on? pic.twitter.com/sM4sd0PQMK— CALL TO ACTIVISM (@CalltoActivism) August 30, 2025🚨PRAY FOR PRESIDENT TRUMP 🇺🇸 🙏 Reports coming out of America suggest that Donald trump hasn't been seen publicly or privately since Tuesday Also, the White House website is seemingly out of order.This news is very worrying for MAGA after photos released last week of an… pic.twitter.com/wsM2MYtjrm— BRITAIN IS BROKEN 🇬🇧 (@BROKENBRITAIN0) August 30, 2025 -
వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే..?
వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడడం సహజం. అయితే అందరికీ ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఒంటరి వృద్ధులు ఇతరుల మీద అంతగా ఆధారపడనవసరం లేకుండా 66 సంవత్సరాల మీనాక్షి మీనన్ టెక్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది.‘జెన్స్ లైఫ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లాట్ఫామ్ లాబ్ టెస్ట్ సర్వీసులు, ట్రావెల్, టాక్స్ ఫైలింగ్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ, సైబర్ సేఫ్టీ.. మొదలైన విషయాలలో వృద్ధులకు ఉపకరిస్తుంది. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా కన్సల్టింగ్లలో మీనాక్షికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అయిదు స్టార్టప్లకు యజమాని.‘పిల్లలను ఎలా పెంచాలి? అనే అంశంపై వందలాది పుస్తకాలు వచ్చాయి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే అంశంపై రాలేదు. ఈ నేపథ్యంలోనే వృద్ధులైన తల్లిదండ్రులకు సహాయపడే యాప్ రూపొందించాలనుకున్నాను’ అంటుంది మీనాక్షి మీనన్.(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
టీడీపీ ఎమ్మెల్యే...కోటంరెడ్డి కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను పెంచి పోషించిందే శ్రీధర్రెడ్డి అనే విషయం రాజకీయ నాయకులకు, పోలీసులకు తెలిసిందే. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలంటూ సిఫార్సు చేసి అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్రెడ్డి ఆ బురద కడుక్కునేందుకు ఎవరికైనా సిఫార్సు లేఖ ఇవ్వడం సాధారణమే అంటూ తప్పించుకునే యత్నం చేశారు. తాజాగా తన హత్యకు రౌడీషీటర్లు కుట్ర చేస్తున్నారనే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించి కొత్త డ్రామా ఆడుతూ, వైఎస్సార్సీపీ పైకి నెట్టివేసే కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన హత్యకు జీవిత ఖైదీ శ్రీకాంత్ సైన్యం కుట్ర పన్నారంటూ హడావుడి చేస్తుండడంతో నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఏదో రకంగా కొత్త డ్రామాలు ఆడడం కోటంరెడ్డి అలవాటు.. ఇది ఆ కోవలోనిదే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీడియోలోని వారంతా ఎమ్మెల్యే బ్రదర్స్, రూప్కుమార్ అనుచరులే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక అనుచరుడు జగదీ‹Ù, కోటంరెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి అనుచరుడు మహేశ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ ముఖ్య అనుచరుడు దార్ల వినిత్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. కోటంరెడ్డి అనుచరులే ఆయన హత్యకు ఎలా కుట్ర చేస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రౌడీమూకల ద్వారానే నెల్లూరులో కోటంరెడ్డి సెటిల్మెంట్లు, దందాలు, రౌడీయిజాలు చేయించినట్లు ఇటీవల పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కోటంరెడ్డి అండదండలున్నాయని వెలుగులోకి రావడం, అరుణ ఫోన్ సంభాషణల్లో నిగూఢ రహస్యాలు వెలుగులోకి వస్తుండడం, అన్నింట్లో కూడా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్ దందాలు చేసినట్లు ఉండడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అతన్ని కాపాడేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర డీజీపీ కూడా నెల్లూరుకు వచ్చి పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలిచ్చి వెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం డైవర్షన్లో భాగంగా రౌడీమూకలు హోటల్ గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే చిత్రీకరించి సోషల్ మీడియాలో లీకు చేయించారని తెలుస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీకి అంట గట్టే యత్నాలను చూసి నెల్లూరు నగర వాసులు ఛీదరించుకుంటున్నారు. పెంచి పోషించిన వారే హత్య చేస్తారా? జీవిత ఖైదీ శ్రీకాంత్ ఆది నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడే. ఇటీవల అరుణ ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనను 50 శాతం మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగిలిన 50 శాతం ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రేమిస్తున్నాడని వెల్లడించిన విషయం విదితమే. నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా శ్రీకాంత్కు సకల సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్ను ఆదేశించిన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. పెరోల్ రద్దయిన తర్వాత కూడా ములాఖత్ ఇవ్వకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే ఫోన్ చేసి ములాఖత్ ఇప్పించినట్లుగా జైలు శాఖ అధికారులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం వీడియోలో ఉన్న రౌడీమూకలు సైతం ఎమ్మెల్యే వీరవిధేయులు. ఆయన కనుసన్నల్లోనే వారు పని చేస్తున్న విషయం బహిరంగమే. ఎమ్మెల్యే కీలక అనుచరులూ వీరి ద్వారానే సెటిల్మెంట్లు చేయిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్ భర్త సెటిల్మెంట్ చేసి రూ.కోటి విలువైన స్థలాన్ని బహుమానంగా తీసుకున్నారు. అందులోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా జరిగిన హత్యాయత్నాలు, ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసిన వారిలో ఈ రౌడీషీటర్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కనుసన్నల్లో పని చేసే వారే ఆయన్ను హత్యకు కుట్ర చేస్తున్నారనే ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక పోలీసులే తేల్చాల్సి ఉంది. -
ట్రెడిషనల్ శారీలో యాంకర్ లాస్య.. సోనాలి బింద్రే వినాయక చవితి పూజలు!
హీరోయిన్ శ్వేతా మీనన్ వినాయక చవితి సెలబ్రేషన్స్..గణపతికి ఇంద్ర హీరోయిన్ సోనాలి బింద్రే పూజలు..వరుణ్ సందేశ్- వితికా శేరు దంపతుల గణేశ్ చతుర్థి పూజలు..గణపతి బప్పా మోరియా అంటోన్న శివంగి జోషి..ట్రెడిషనల్ శారీ లుక్లో యాంకర్ లాస్య View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు. అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలుఅనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది. -
విద్యార్థులా?.. కూలీలా?
సాక్షి, మైదకూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తరగతి గదిలో కూర్చోవాల్సిన విద్యార్థులు.. రాళ్లు, మట్టి ఎత్తుతున్నారు. విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే వారితో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైదుకూరు మండలం జీవిసత్రం సమీపంలోని నంద్యాలపేట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.జడ్పీ పాఠశాలలో కొత్త బిల్డింగ్ పనుల సందర్భంగా విద్యార్థులతో రాళ్లు, మట్టి ఎత్తిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై విద్యార్థులు పేరెంట్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు, ఐసీడీఎస్, కార్మిక శాఖ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.This is totally unacceptable @ncbn garu.How can your govt allow such abuse of children studying in govt school?Is this how you expect the children to grow under your stewardship @naralokesh?Shameful to even say this. https://t.co/dJk7TmXslT— PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) August 27, 2025 -
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్లో వచ్చారు. రోహితాష్ లాయర్తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
జపాన్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్!
జపాన్లో చిల్ అవుతోన్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి..హ్యాపీ ఇంటర్నేషనల్ డాగ్ డే అంటూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్..హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ లేటేస్ట్ లుక్..ఇటలీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్..చెన్నై ట్రిప్లో జెనీలియా దేశ్ ముఖ్..గ్రీన్ శారీలో మెరిసిపోతున్న సోనాలి బింద్రే.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
నాకు తెలిసిన శక్తిమంతమైన మహిళ: పీవీ సింధు భావోద్వేగం (ఫొటోలు)
-
బొజ్జ గణపయ్యను ముస్తాబు చేసిన నటి మేకింగ్ వీడియో వైరల్
వినాయకచవితి వేడుకల కోసం దేవ్యాప్తంగా భక్తజనం సన్నాహాల్లో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేషులనే పూజించాలని ఇటు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మట్టి గణపతే మహా గణపతి అనే నినాదంతో గ్రీన్ గణేషుడికి జై కొడుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరో వితికా షేరు కూడా ఈ నినాదాన్నే ముందుకు తీసుకెడుతూ మట్టితో బొజ్జగణపయ్య విగ్రహాన్ని అందొగా రూపొందించింది. దీనికి సంబంధించిన వీడియోన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మా వినాయకుడు రెడీ జై బోలో గణేష్ మహారాజ్ కి మా గణపతి ఎలా అనిపించారో చెప్పండి అని తెలిపింది. దీంతో అటు అభిమానులు, ఇటు పర్యావరణ ప్రేమికులు వితికా ప్రయత్నాన్ని, ప్రచారాన్ని ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) చదవండి: పొలాల్లో ప్లాస్టిక్ భూతం! బయోపాస్టిక్లూ విషపూరితమే!వినాయక చవితి సందర్భంగా మట్టి గణేషుని తయారు చేసే విషయంలో వితిక తన ట్యాలెంట్తో నెటిజన్లను మెస్మరైజ్ చేసారు. మట్టితో వినాయకుడిని తయారు చేసి, అందంగా బుజ్జి గణేషున్ని తయారు చేసి. సహజ సిద్ధమైన రంగులతో మరింత అందంగా రూపొందించింది. ఈ తయారీ విధానాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందించింది. ప్రస్తుతంఈ వీడియో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: Yoga మైగ్రేన్తో భరించలేని బాధా? బెస్ట్ యోగాసనాలు మట్టి గణపతినే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం! -
కోనేరులో కాళ్లు కడిగిన బిగ్బాస్ బ్యూటీ.. అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి
దేశంలో ప్రసిద్ది పొందిన శ్రీకృష్ణ ఆలయాల్లో కేరళ త్రిసూర్ గురువాయూర్ దేవాలయం ఒకటి. ఓటీటీ సినిమాలతో ఈ ఆలయం తెలుగువారికి సుపరిచితమే. అలాంటిచోట అపవిత్రం జరిగిందంటూ మంగళవారం ఆలయ శుద్ధి పనులు చేపట్టారు నిర్వాహకులు. ఓ మహిళా యూట్యూబర్ అతిచేష్టలే అందుకు కారణంగా తెలుస్తోంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ జాస్మిన్ జాఫర్.. వారం కిందట గురువాయూర్ ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలో కోనేరులో కాళ్లు కడుగుతూ.. ఆ ప్రాంగణమంతా కలియ దిరుగుతూ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో రీల్ రూపేణా పోస్ట్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.గురువాయూర్ ఆలయంలో ఇలా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం నిషేధం!. దీంతో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఆచారాన్ని మంటగలిపిందంటూ పలువురు ఆమె చర్యపై మండిపడ్డారు. ఒక హిందూయేతర మహిళ.. అందునా ఆలయ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరించిందంటూ ఇటు ఆలయ నిర్వాహకులు సైతం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో..రుద్రతీర్థం(కోనేరు పేరు) అపవిత్రమైందంటూ ఆలయ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దైవదర్శనాన్ని పూర్తిగా నిలిపివేశారు. అంతేకాదు.. ఘటన జరిగి ఆరు రోజులు కావస్తుండడంతో.. ఈ ఆరురోజులపాటు జరగాల్సిన 18 పూజలు, 18 శీవెలీలు తిరిగి నిర్వహిస్తున్నారు. పూజలన్నీ పూర్తయ్యాకే నలంబలంలో(గురువాయూర్ సమీపంలోని నాలుగు ఆలయాలు) ప్రవేశానికి అనుమతిస్తామని.. కాస్త ఓపికగా సహకరించాలని భక్తులకు దేవస్థానం వారు విజ్ఞప్తిచేశారు.మరోవైపు ఈ ఘటనపై పాలనాధికారి అరుణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియమాలను ఉల్లంఘించి మరీ ఆమె వీడియో తీసిందని మండిపడ్డారు. పవిత్రత రిత్యా కోనేరు సహా ఆలయ ప్రాంగణంలో కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి చిత్రీకరణలకు వీల్లేదని గతంలో కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారమే కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. జాస్మిన్ జాఫర్(25).. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్నర ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేమ్తోనే బిగ్బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా పాల్గొంది. ఆ సీజన్లో సెకండ్ రన్నరప్గా ఆమె నిలిచింది. అటుపై ఆమె ఫేమ్ మరింత పెరిగింది. అయితే తాజా వివాద నేపథ్యంలోనే ఆ వీడియో తొలగించిన జాఫర్.. ఆ పరిమితుల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరిగిందని తప్పు ఒప్పుకుంది. -
జలపాతం వద్ద రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్ యూట్యూబర్
సోషల్ మీడియా పిచ్చి, షేర్, లైక్స్ మోజులో పడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాకు చెందిన యువ యూట్యూబర్ సాహసం విషాదకరంగా మారింది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటన కెమెరాలో సంఘటన రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల అవుతోంది. ఈ సంఘటన రీల్స్ కోసం, సోషల్ మీడియా కంటెంట్ కోసం చేస్తున్న ప్రమాదకర సాహసాలు, ప్రమాదాలపై చర్చలకు దారితీసింది.తన యూట్యూబ్ ఛానెల్ కంటెంట్ కోసం జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో చివరికి ప్రాణాలే కోల్పోయిన ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని గంజాం జిల్లాలోని బెర్హంపూర్కు చెందిన 22 ఏళ్ల సాగర్ (సాగర్ టుడు)గా గుర్తించారు. సాగర్, అతని స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి, పర్యాటక ప్రదేశాల వీడియోలు చేసేందుకు కోరాపుట్ వెళ్లాడు. అక్కడ మధ్యాహ్నం సాగర్ జలపాతం సమీపంలోని ఒక రాతిపై నిలబడి డ్రోన్ కెమెరాను ఉపయోగించి రీల్స్ తీస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అలామ్తాపుట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా మచ్చకుండ ఆనకట్ట అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు, దీనితో జలపాతం వద్ద నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఇక్కడ సాగర్ వీడియో రికార్డ్ చేస్తూ ప్రవాహా ధాటికి ఒక రాతిపై చిక్కుకుపోయాడు. పర్యాటకులు ,స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నీటి వేగం ముందువారి ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. తమ కళ్ల ముందే స్నేహితుడు కొట్టుకుపోవడంతో అతని ఫ్రెండ్స్ కన్నీటి పర్యంతమైనారు. మచకుండ పోలీసులు,అగ్నిమాపక దళం నుండి రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాలింపు చర్యలు చేపట్టాయి.సాగర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల తర్వాత ఆనకట్ట నుండి సుమారు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ముందు మచకుండ అధికారులు దిగువన ఉన్న నివాసితులను అప్రమత్తం చేశారుమరోవైపు వర్షాకాలంలో ప్రమాదకరమైన సహజ ప్రదేశాలలో. పర్యాటకులు , కంటెంట్ సృష్టికర్తలు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని , జలపాతాలు మరియు ఆనకట్టల దగ్గర జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారుఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ! -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్తున్న ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో జీఆర్పీ కానిస్టేబుల్ ఆశిష్ గుప్తా విధులు నిర్వహిస్తున్నాడు. సదరు రైలులో మహిళల భద్రత కోసం అతడిని విధుల్లో పెట్టారు. అయితే, రైలులో మహిళల భద్రతను కాపాడాల్సిన కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. రాత్రివేళలో లైట్లు ఆఫ్ చేసి ఉండటాన్ని అవకాశంగా తీసుకున్న అతను, నిద్రలో ఉన్న ఓ మహిళను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. కోచ్లో చీకటిగా ఉండడంతో తన చర్యలను ఎవరూ గమనించలేరనే ఉద్దేశంతో ఈ పాడుపనికి పాల్పడ్డాడు.GRP constable Ashish Gupta suspended for inappropriately touching a sleeping girl on a Delhi-Prayagraj train. Victim recorded video of incident, showing constable apologizing.pic.twitter.com/JoG7T0m6em— Ghar Ke Kalesh (@gharkekalesh) August 23, 2025ఈ క్రమంలో వెంటనే యువతి నిద్రలేచి అతడిని పట్టుకుంది. దీంతో, ఆందోళనకు గురైన కానిస్టేబుల్ తనను క్షమించాలని వేడుకున్నాడు. దండం పెట్టి ఆమెను క్షమాపణలు కోరారు. అయితే, సదరు మాత్రం ఇదంతా తన ఫోన్లో వీడియో తీసింది. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఆధారంగా ఉన్నతాధికారులు స్పందించి ఆశిష్ గుప్తాను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
బిడ్డ భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.దుబాయ్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్తో ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Nora & Khalid (@noraandkhalid) -
పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : షాకింగ్ వీడియో
అంగరంగ వైభవంగా పెళ్లి.... వేల మంది అతిథులు వేల కోట్ల రూపాయల ఖర్చు ఇలా మన దేశంలో ముఖేష్ అంబానీ ,అదానీ లాంటి కుబేరుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ల గురించి తెలుసు. భారీ కట్నాలు, కానుకల గురించి మరీ బహిరంగంగా కాకపోయినాఅప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. మనదేశంలో వరుడుకిచ్చిన షాకింగ్ కట్నం చర్చనీయాంశంగా మారింది.ఇండియా వరకట్నం చట్టపరంగా నేరం. కానీ కట్న కానుకలివ్వడం లోపాయికారీగా జరిపోతూనే ఉంది. కానీ ఈ వీడియోలో వరుడికిచ్చిన కట్నం గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఏకంగా ఒక పెట్రోల్ పంపు, 210 ఎకరాల భూమి, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల నగదును కట్నంగా ఇచ్చారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ప్రస్తావించడం విశేషం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Wednesday @Shizukahuji అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారుఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ Love marriage vo kya hota hai 💀 pic.twitter.com/otmFucQnep— Wednesday (@Shizukahuji) August 20, 2025 దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆదాయ పన్ను శాఖ, ఈడీ ఎక్కడ ఉన్నాయి అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా కట్నం తీసుకుంటోంటే పోలీసులు స్పందించరా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు.ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ -
మాల్దీవుస్లో నేహా శెట్టి చిల్.. బాలిలో ఎంజాయ్ చేస్తోన్న హన్సిక!
మాల్దీవుస్లో చిల్ అవుతోన్న నేహా శెట్టి..వైట్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ సోనియా ఆకుల..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న హన్సిక మోత్వాని..బ్లూ డ్రెస్లో ఆండ్రియా జెరెమా బ్యూటీఫుల్ లుక్..మిస్ యూనివర్స్తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) -
Gen Z: ఉదయం ఉద్యోగంలో చేరి.. మధ్యాహ్నానికే ‘గుడ్బై’!
ఢిల్లీ: వామ్మో..నేను బతుకుంటే.. బలుసాకైనా అమ్ముకుని బతికేస్తా.. కానీ మీ కంపెనీలో మాత్రం ఉద్యోగం చేయను బాబోయ్ అంటూ ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే..లంచ్ టైంలో జాబ్కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల్లో టాక్సిక్ వర్క్ కల్చర్కు అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్గా మారింది.ఆ ట్వీట్ సారాశం ఏంటంటే?. నా స్నేహితుడు ఢిల్లీకి చెందిన స్టార్టప్లో చేరాడు. చేరిన తొలిరోజు లంచ్ టైం వరకు పనిచేశాడు. లంచ్ టైం తర్వాత తన ల్యాప్ట్యాప్ను కూడా డెస్క్పై వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత..సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ వాటికి రిప్లయి ఇవ్వలేదు.కానీ చివరికి కంపెనీ హెచ్ఆర్ నుంచి ఫోన్ రావడంతో రిప్లయి ఇవ్వక తప్పలేదు. హెచ్ఆర్తో బతుకుంటే బులుసాకైనా అమ్ముకుంటా కానీ మీ కంపెనీలో నేను పని చేయనని తేల్చి చెప్పాడు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.ఆ ట్వీట్పై నెటిజన్లు పాజిటీవ్గా స్పందిస్తున్నారు. చేరిన తొలిరోజే ఉద్యోగానికి రిజైన్ చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. స్టార్టప్ కల్చర్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబే. ఇది ఆశ్చర్యకరం కాదు. స్టార్టప్ కల్చర్ కొన్నిసార్లు తట్టుకోలేని విధంగా ఉంటుంది.మొదటి రోజే వర్క్ ప్లేస్ సరిగా అనిపించకపోతే,వెళ్లిపోవడం మంచిదే’అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అమలు చేస్తారు’అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ సంఘటన జెన్జీ వర్క్ కల్చర్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జెన్జీకి వర్క్ కల్చర్ బాగుండాలి. అంటే పనిచేసే కార్యాలయం తమ మనసుకు అనుగుణంగా ఉంటే ఫర్లేదు. లేదుంటే మానసిక ప్రశాంతను చెడగొట్టుకుని పనిచేకపోవడం ఇష్టం ఉండదు. అందుకే వెంటే రాజీనామా చేస్తారు. A friend told me about this guy who joined a startup here in Delhi. On his very first day, he left his laptop on his desk during lunch and just never came back. He ignored everyone’s calls initially but later picked up HR’s, and just said he cannot work there 😭— Poan Sapdi (@Poan__Sapdi) August 19, 2025 -
బర్త్డే గిఫ్ట్గా యూరియా బస్తాలు.. ఎక్కడో తెలుసా?
యూరియా కష్టాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్రచర్చ నడుస్తున్న వేళ.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. పుట్టినరోజు జరుపుకున్న ఓ రైతుకు తోటి స్నేహితులు యూరియా బస్తా కానుకగా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్గా మారిందనే చర్చా నడుస్తోంది.కథలాపూర్ మండలం తాండ్రియాలలో ముక్కెర మధు అనే రైతు పుట్టినరోజు నాడు.. అతని స్నేహితులు యూరియా బస్తాను బహుకరించారు. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి ఇచ్చామంటున్నారు. ఈ తరుణంలో.. ప్రభుత్వంపై సెటైర్ గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.మొన్నీమధ్యే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు ఆయన మిత్రులు.పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలో పడిగాపులు పడలేక చెప్పులను ఉంచుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చూశాం. అందుకే యూరియా కోసం ప్రభుత్వాన్ని బతిమాలడం చూస్తున్నాం. పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు.అయితే విమర్శల వేళ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. రైతులకు ఎరువులు అందించడంలో కేంద్రం విఫలమైంది. సరిపడా యూరియాను అందించలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం పోరాడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా యూరియా బస్తాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారాయన. -
మెట్రో రైలులో బ్యాగులకు చలానా
బెంగళూరు: బెంగళూరు మెట్రో రైలులో 30 కేజీల బ్యాగును తీసుకెళ్లిన ప్రయాణికునికి సిబ్బంది రూ.30 రుసుము విధించారు. దీంతో అతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆగ్రహం వ్యక్తంచేశాడు. రూ.30 ఫీజు చెల్లించాలని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాను. బెంగళూరు నమ్మ దేశంలోనే అత్యంత ఖరీదైనది. బ్యాగ్ ఫీజులు చెల్లించాలంటే మరింత భారమవుతుంది. ప్రజలు రాకుండా మెట్రో అధికారులే అడ్డుకొంటున్నారు అనేందుకు ఇదే ఉదాహరణ అని మండిపడ్డాడు. మెట్రో లగేజీ నియమాలు ఇలా నమ్మ మెట్రోలో ఓ వ్యక్తి 15 కేజీల లోపు బ్యాగ్ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఎక్కువ బ్యాగులు, బరువు ఉంటే ప్రతి బ్యాగ్కు రూ.30 చెల్లించి టికెట్ పొందాలి. ఈ లగేజ్ టికెట్ను వినియోగదారుల సేవా కేంద్రంలో కొనుగోలు చేయవచ్చని సిబ్బంది తెలిపారు. అదనపు బ్యాగ్కు టికెట్ కొనుగోలు చేయకపోతే రూ.250 జరిమానా విధించబడుతోంది. ఆ ప్రయాణికున్ని రైలు నుంచి బయటకు పంపించే అధికారం కూడా ఉంటుంది. -
ఈదురు గాలిలో భారీ వాన.. విమానం సురక్షిత ల్యాండింగ్.. ప్రయాణికుల ఆనందం
ముంబై: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, ముంబై సహ పలు నగరాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. వరద నీరు కారణంగా ముంబై నగరం అతలాకుతలమైంది. వర్షాల ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. ఈ క్రమంలో భారీ వర్షంలో కూడా ఎయిరిండియా విమానాన్ని ఓ పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో, సదరు పైలట్పై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ముంబై ఎయిర్పోర్టులో మంగళవారం ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఓ ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అయ్యేందుకు విమనాశ్రయానికి వచ్చింది. ల్యాండింగ్కు సిద్ధమైన సమయంలో ఈదురు గాలులు, వర్షం పడుతున్న క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ పైలట్ నీరజ్ సేథీ ఎలాంటి అలజడి లేకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఇలా విమానం ల్యాండింగ్ చేయడం పట్ల ప్రయాణికులు నీరజ్పై ప్రశంసలు కురిపించారు. విమానంలోని ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పైలట్కు కృతజ్ఞతలు తెలిaపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీరజ్ సేథీ ‘నిజమైన హీరో’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.#MumbaiRain #AirIndia Landing at Mumbai airport midst of heavy rain ,Hats off to captain Neeraj Sethi for landing 🛬 safely with less visibility pic.twitter.com/MBrndAmKrF— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) August 20, 2025ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఎనిమిది విమానాలను దారి మళ్లించారు. ఇక, బుధవారం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్జెట్ తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల విమానాలు ఆలస్యం కావచ్చని లేదా రద్దయ్యే అవకాశం ఉందని, ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సరిచూసుకోవాలని సూచించాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్లు నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా 17 లోకల్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే, నవీ ముంబై, లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి. కుండపోత వానల కారణంగా బాంబే హైకోర్టు సైతం మధ్యాహ్నం 12:30 గంటలకే కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, గురువారం నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
సబ్మెరైన్ సర్వీస్ ప్రారంభం.. ముంబై వర్షాలపై మీమ్స్ వైరల్
ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు మంచి స్టప్ దొరికేసింది. ‘‘నగరం మునిగిపోతున్నప్పుడు కూడా మేము మీమ్స్ చేస్తాం" అంటూ సరదాగా నవ్వులు పూయిస్తున్నారు. వరదలపై నెటిజన్లు కాస్త గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓ యూజర్.. ముంబైలో కొత్త సేవలు ప్రారంభమయ్యాయంటూ.. సబ్మెరైన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫన్నీగా మిమ్స్ను రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి.. నగరంలోని కుండపోత వర్షానికి అలవాటు పడ్డామంటూ సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వర్షం కురుపిస్తున్నారు. "స్పిరిట్ ఆఫ్ ముంబై" అనే పదాన్ని కొంతమంది విమర్శిస్తూ కూడా మీమ్స్ చేస్తున్నారు. వర్షాలపై ప్రజలు మీమ్స్ ద్వారా తమ అనుభవాలను వ్యక్తపరస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.New service launched in Mumbai 😂 #MumbaiRainspic.twitter.com/gDIlVjyDPo— V🐧 (@Vtxt21) August 18, 2025నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం అంచనా వేసింది. నాందేడ్ జిల్లాలోని ముఖెడ్ తాలుకాలో వర్షాలు, వరదల్లో ఏడుగురు చనిపోయారు. వరదల్లో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.Mumbaikar right now. #MumbaiRains #MumbaiRain pic.twitter.com/79LMu8LrBt— Siddhanth Pilania (@sidhanthpilania) August 18, 2025ఆర్మీ బృందాన్ని సహాయక చర్యల కోసం పంపించారు. జిల్లాలోని లెండి డ్యామ్లో భారీగా వరద చేరింది. ఇంకా, మహానగరం ముంబైలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఉదయం రెడ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడటంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.మాతుంగ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద నీటిలో నిలిచిపోయిన స్కూలు బస్సు నుంచి ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో కొన్ని విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. ఒక విమానాన్ని దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు తెలిపారు. అవసరమైతేనే ఇళ్లు వదిలి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.అరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో సోమవారం 6 నుంచి 8 గంటల వ్యవధిలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దీంతో, లోకల్ రైళ్లు కనీసం 10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. సబర్బన్ రైళ్లు, సెంట్రల్ రైల్వే మార్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముంబైలోని విద్యాసంస్థలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సెలవు ప్రకటించారు. వర్షాలు కొనసాగే అవకాశాలుండటంతో మంగళవారం సైతం సెలవు ప్రకటించారు.Mumbaikar stuck on roads everyday..#MumbaiRains pic.twitter.com/cqVrkWJbK6— KKthewealthcoach (@MemeOverlord_kk) August 18, 2025 -
‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’
అమెరికాలో 14 ఏళ్లు పనిచేసి న్యూయార్క్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి స్టార్టప్ సంస్థ ప్రారంభించినట్లు తెలిపిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. యూఎస్ నుంచి ఇండియా వచ్చే సమయంలో తన తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.90,000 మాత్రమే ఉన్నాయని లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా 11 నెలల చిన్నారితో యూఎస్ నుంచి భారత్ వస్తున్న తనను తన భార్య ఓ పిచ్చిడిలా చూసినట్లు చెప్పుకొచ్చారు. వివేక్ తిరువేంగడం చేసిన ఈ పోస్ట్కాస్తా వైరల్గా మారింది.‘యూఎస్ నుంచి భారత్ రావాలని నిర్ణయించుకొని 2020 డిసెంబర్ 23న న్యూయార్క్ నుంచి చెన్నైకి వన్-వే ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నాను. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో రూ.90,000 ఉన్నాయి. 11 నెలల చిన్నారిని, నా భార్యను తీసుకొని విమానం ఎక్కాను. నా భార్య నన్నో పిచ్చోడిలా చూసింది. ఇండియా వచ్చేది మరో కంపెనీలో చేరడానికో.. మంచి వేతనం కోసం పని చేసేందుకో కాదు. స్టార్టప్ కంపెనీ పెట్టాలని భావించాను. కొవిడ్ సమయంలో అది అంత సులువు కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. జాబ్ లేదు, ఆఫీస్ లేదు, ఇన్వెస్టర్లు లేరు. కేవలం ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉన్నాయి’ అని తిరువేంగడం ఉన్నారు.‘వర్కింగ్ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ఫిట్నెస్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాను. కానీ కరోనా ప్రభావం కారణంగా ఇంకొంత కాలం వెయిట్ చేయమని కొందరు సలహా ఇచ్చారు. వారి మాటలు పట్టించుకోకుండా వెంటనే సంస్థను మొదలు పెట్టాను. ఐదేళ్ల తర్వాత చూస్తే నా కంపెనీలో 750+ ఉద్యోగులున్నారు. ఆరుగురితో కూడిన ప్రత్యేక బృందం కంపెనీని నడుపుతోంది’ అని చెప్పారు. ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘14 ఏళ్లుగా అమెరికాలో ఉంటే కేవలం రూ.90వేలు మాత్రమే మిగిలాయా? ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇలాంటి సాహసం చేయడం నిజంగా భయంకరమైన విషయం’ అని మరొకరు చెప్పారు.ఇదీ చదవండి: పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్పజీవితంలో ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అందరికీ ఇలా విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే సాహసోపేత నిర్ణయం తీసుకునేముందు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఏదైనా అత్యవసర సమయాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే లైఫ్స్టైల్కు అవసరమయ్యేలా కనీసం ఏడాదిపాటు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
ఒక తల్లిగా ఆందోళనగా ఉంది.. ఐశ్వర్య రాయ్ వ్యాఖ్యలపై ప్రశంసలు
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ప్రముఖ కాస్మెటిక్ బ్రాండ్ కోసం చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సోషల్ మీడియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు యూత్ను ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఈమేరకు ఆమెపై నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుర్తింపు కోసం సోషల్మీడియా మాయ ప్రపంచంలో చిక్కుకుంటున్నారని.. ఈ అంశం తనకు ఎక్కువ ఆందోళన కలిగిస్తుందంటూ ఐశ్వర్య వ్యాఖ్యలు చేశారు.సోషల్మీడియాలో వచ్చే లైక్స్, కామెంట్స్ మన జీవితాలను నిర్ణయించలేవని ఐశ్వర్య రాయ్ చెప్పుకొచ్చారు. 'నేటి సమాజంలో మన విలువను ఎవరూ నిర్ణయించలేరు. చాలామంది సోషల్మీడియా ట్రాప్లో పడుతున్నారు. వారు చేసే పోస్ట్లకు వచ్చే లైక్స్, కామెంట్లు, షేర్లు చూసుకొని సంబరపడుతుంటారు. వాటిలో ఎవీ కూడా మనలోని ఆత్మవిశ్వాసాన్ని ఈ ప్రపంచానికి చూపలేవు. కానీ, నువ్వు నీలా ఉంటే అసలైన ప్రపంచం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆత్మగౌరవం కోసం ఇంటర్నెట్లో వెతకొద్దు. ఒక్కసారి దానిని దాటి ముందుకు రండి మీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా దొరుకుతుంది. సోషల్మీడియా అంశంపై ఒక మహిళగా, తల్లిగా నాకు ఆందోళన కలుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనికి బానిసలు అవుతున్నారు.. దయచేసి అందులో నుంచి బయటపడండి.' అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. దీంతో ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేటి యూత్కు కావాల్సిన మెసేజ్ను అందించారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలో సగం మంది ఆమె చెప్పేది అర్థం చేసుకుంటే బాగుండు అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఈ యుగంలో చాలా అవసరమైన సందేశాన్ని అందించారంటూ చాలామంది ఆమెను ప్రశంసించారు. -
ఒక్క మెయిల్.. గుండెపోటు వచ్చినంత పనైంది!
ఉద్యోగం చేస్తున్నవారిలో చాలామంది కోరుకునేది.. వాళ్ళను కంపెనీ నుంచి తొలగించకూడదనే. అయితే అనుకోకుండా జాబ్ నుంచి తీసేస్తున్నట్లు మెయిల్ వస్తే?, గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?..టెర్మినేషన్ అనే సబ్జెక్ట్ లైన్తో.. హెచ్ఆర్ నుంచి కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ మెయిల్ అందింది. ఈ మెయిల్ చూడగానే దాదాపు ఉద్యోగులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉద్యోగం నుంచి తొలగించేసారమో భయపడ్డారు. అయితే ''భద్రతా ఉల్లంఘనల కారణంగా ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్లు'' ఆ మెయిల్ సారాంశం. చదివిన తరువాత ఊపిరి పీల్చుకున్నారు.మెయిల్ చూడగానే.. గుండెపోటు వచ్చినంత పనైందని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. వారికి వచ్చిన మెయిల్ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి ఇలాంటి మెయిల్స్.. కోవిడ్ సమయంలో చాలామంది అందుకున్నారు. అప్పటి నుంచి ఇలాంటి మెసేజస్ వస్తే.. ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టేస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఉద్యోగులు మెయిల్ చూడగానే భయపడినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? -
ఏడేళ్ల క్రితం నాటి మధుర క్షణాలు షేర్ చేసిన రష్మిక (ఫోటోలు)
-
రూ.13 వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?
యాడ్-టెక్ కంపెనీ అయిన యాప్ నెక్సస్ (AppNexus) కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ (Brian O'Kelley) భారీ విరాళాన్ని ప్రకటించారు. 2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయంలో (రూ. 14,036.64 కోట్లు)ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశానని వెల్లడించారు. ప్రపంచమంతా కోట్లకు పడగలెత్తాలని, రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్లుగా, బిలియనీర్లుగా ఎదగాలని కలలుకంటోంటే.. ఈయన మాత్రం తనకు బిలియనీర్ల మీద పెద్దగా మోజులేదని చెప్పుకురావడం విశేషం.ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాల ప్రకారం.. 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసంకేవలం 100 మిలియన్ డాలర్ల సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. ఇది పోగా దాదాపు 13 వేల కోట్లను ఛారిటీకిచ్చేశారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చదవండి: గ్రాండ్మా, మోటీ.. పట్టించుకోలే : కానీ ఏడాదిలో 23 కిలోలు తగ్గాఅంతేకాదు తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనేదే తనఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు.న్న నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందంటా రాయాన.ఇదీ చదవండి: నిన్నగాక మొన్న నోటీసులు, యూట్యూబర్ రెండో భార్య రెండో ప్రెగ్నెన్సీ ప్రస్తుతం సప్లయ్ ఉద్గారాలను ట్రాక్ చేయడంపై దృష్టి సారించిన కొత్త స్టార్టప్, స్కోప్3కి నాయకత్వం వహిస్తున్న ఓ'కెల్లీ, తన తదుపరి వెంచర్ విజయవంతమైనా, తనకు బిలియనీర్ అయ్యే ప్రణాళికలు లేవనిప్రకటించడం గమనార్హం. -
‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.మన భారతం.. మహా మార్కెట్..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్లకు మన దేశం కీలకమైన మార్కెట్గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుందిపోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్బక్స్ వంటి విదేశీ బ్రాండ్లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.నిరసనల వెల్లువ..అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం. తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్బీ ఉండాలి’ అని కారు డ్రైవర్ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్ల స్నానపు సబ్బులు, టూత్పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు- సత్య బాబు -
వీడియో: ట్రంప్ ఓవరాక్షన్ ప్లాన్.. పుతిన్నే భయపెట్టే ప్రయత్నం!
అలాస్కా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసిన వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఎంత బలమైన దేశమో.. చెప్పేందుకు పుతిన్కు చూపించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ పెద్ద ప్లానే చేశారు. పుతిన్ను ట్రంప్ ఆహ్వానిస్తున్న సమయంలో స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్స్ విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు వెళ్లారు. ఈ సందర్భంగా విమానం దిగిన పుతిన్కు ట్రంప్ ఘన స్వాగతం పలికారు. అయితే, వారిద్దరూ ముందుకు సాగుతున్న సమయంలో అనూహ్యంగా స్టెల్త్ బాంబర్లు, F-22, F-35 ఫైటర్ జెట్లువిమానాలు గాల్లో దర్శనమిచ్చాయి. ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. దీంతో, ట్రంప్ చప్పట్లు కొడుతూ.. పుతిన్తో ఏదో మాట్లాడారు. మరోవైపు.. పుతిన్ మాత్రం వాటిని చూస్తూ ముందుకు కదిలారు.Trump flies a B-2 over Putin’s head in a show of strength, look at the Trump’s body language, it’s all about dominance pic.twitter.com/cleGOmuedF— Prayag (@theprayagtiwari) August 15, 2025ఇక, ట్రంప్-పుతిన్ సమావేశం జరుగుతున్నంత సేపూ కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి. దీని ద్వారా పుతిన్ అమెరికా సైనిక శక్తిని గ్రహించాలని ట్రంప్ భావించారు. గత నెలలో ఇరాన్ అణు కర్మాగారాలను ట్రంప్ సైన్యం ఇదే బీ-2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించి నాశనం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. అందరి కంటే తానే బలవంతుడు, తన దేశమే బలమైన దేశం అని నిరూపించాలని ట్రంప్ ఇలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పుతిన్ను హెచ్చరించేందుకే ట్రంప్ ఇలా చేశారని మరి కొందరు అంటున్నారు. 🔥 THIS is how you negotiate.Trump forced Putin and his motorcade to drive past a HUGE lineup of F-22s and attack helicopters on his way to the meeting…… Immediately after buzzing Putin’s head with a B-2 Stealth BomberIt’s pretty obvious who’s in the power position 🇺🇸 pic.twitter.com/0SF8sqDXQr— Nick Sortor (@nicksortor) August 15, 2025Trump made B-2 bombers fly over Putin in Alaska.What an insecure guy! Flexing military muscle for a guest he himself invited after failing to make any impact in Ukraine, like a scared kid trying to look tough with gimmicks. pic.twitter.com/29aFCTEvJD— THE SKIN DOCTOR (@theskindoctor13) August 15, 2025 -
గ్రేడ్ పేరెంట్స్ కాదు.. గ్రేట్ పేరెంట్స్!
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు. ‘ఈసారి వస్తాయిలే..!’తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు. ఇది మంచి పరిణామంబోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.‘కేక్, పిజ్జా తెప్పించారు’ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు. ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు. ‘ముందే చెప్పేశా..’మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు. ‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!వెల్డన్ పేరెంట్స్» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు. -
శ్వాన్సింగ్ కోసం దిగొచ్చిన భారత ఆర్మీ.. పాక్ యుద్ధంలో ఏం చేశాడంటే?
సాయం చేయాలన్న ఆలోచన ఎవరికైనా ఎప్పుడైనా కలగొచ్చు. కానీ, తమ శక్తికి మించిన సాయం చేయడమనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమనే చెప్పాలి. అయితే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. సరిగ్గా ఆ మనసు కలిగినవాడే శ్వాన్ సింగ్. ఇంతకీ శ్వాస్ సింగ్ ఏం చేశాడంటే..ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎదురుదాడులకు పాల్పడగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పదేళ్ల శ్వాస్ సింగ్ మన సైనికులకు బాసటగా నిలిచాడు. వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. ఇప్పటికే ఆ బాలుడి సేవలను ప్రశంసించిన సైనికాధికారులు.. తాజాగా అతడి చదువుకయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ ఇతనికి ఉద్యోగం వచ్చే వరకు మొత్తం తన చదువు ఖర్చునంతా భరించబోతోంది.పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో మామ్ డోట్ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ శ్వాన్ సింగ్. శ్వాన్ సింగ్ ఇంటికి సరిగ్గా పాతిక కిలోమీటర్ల దూరంలోనే పాకిస్తాన్ ఉంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్.. పంజాబ్లోని మామ్ డోట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఆపరేషన్ సింధూర్ తరువాత పాకిస్తాన్ మన దేశంపై చేస్తున్న దాడులను మన సైన్యం విజయవంతంగా ఎదుర్కొంది. ఆ నేపధ్యంలో శ్వాన్ సింగ్ ఇంటి ప్రాంతంలో కొంతమంది ఇండియన్ ఆర్మీ డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ తుపాకులు, బాంబుల మోతతో అట్టుడికిపోతున్న ఆ ప్రాంతంలో చీమ కూడా బయటకు రాలేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి నుండి చల్లని లస్సీ తయారు చేసుకుని అలసిపోతున్న ఆర్మీ అధికారులకు అందించాడు మన శ్వాన్ సింగ్. అది కూడా ఏమాత్రం బెరుకు, భయం లేకుండా దాదాపు 10 రోజులు అలా ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ శ్వాన్సింగ్ చేసిన ఈ సాయానికి, తెగువకు ముచ్చటపడి తన చదువును స్పాన్సర్ చేస్తోంది.🇮🇳 The Indian Army will sponsor the education of 10-yr-old Shvan Singh from Ferozepur, Punjab — the youngest warrior of #OperationSindoor, who served soldiers with food day & night during the op.#IndianArmy #ShvanSingh #OperationSindoor #RealHero pic.twitter.com/Bqn1Vot8TD— Aman Dev Barman (@AmanDevBar67676) July 21, 2025ఇక, తాజాగా శ్వాన్సింగ్ను ‘సాక్షి’ ఎక్స్క్లూజివ్గా పలకరించింది. సాక్షి అడిగిన పలు ప్రశ్నలకు శ్వాన్సింగ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. అతడు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నాడు.. అతడి పేరెంట్స్ ఏం చేస్తారు.. పది రోజుల పాటు తాను ఇండియన్ ఆర్మీతో గడిపిన క్షణాలను.. యుద్ధం నాటి పరిస్థితులను వివరించాడు.. ఈ వివరాల గురించి కింది వీడియోలో.. -
షేరెంటింగ్ ముప్పు...పేరెంట్స్ పారాహుషార్
సోషల్ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి విస్తృతి కలిగిన సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్లైన్లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించ లేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్ఫింగ్తో మహా ప్రమాదంపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటా న్ని ‘షేరెంటింగ్’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్లైన్ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.అన్నీ చెప్పేసుకుంటే ముప్పుపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు.దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు షేర్ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.పేరెంట్స్.. పారాహుషార్కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.భవిష్యత్తుపై ప్రభావం : కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్లో తిప్పేవారు ఉంటారు. చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు. (Independence day ఫ్యాషన్ క్లిక్.. మువ్వన్నెల వస్త్రాలు)వేటాడే కళ్లకు చిక్కినట్లే! పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్ అవుతుంటాయి. సైబర్ క్రిమినల్స్లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్సైట్లకు షేర్ చేసే ప్రమాదం ఉంటుంది.ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్ను సృష్టించి అన్లైన్లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. వేధింపులు – బెదిరింపులు!ఆన్ లైన్లో : షేర్ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్ చేయవచ్చు. మరెవరికైనా షేర్ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవా రుంటారు. కొందరు మీమ్స్ కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి. పోస్ట్లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవారూ ఉంటారు. ఇదీ చదవండి: జన్మాంతర సాఫల్యం అంటే ఎంటో తెలుసా? -
బేబీ బంప్తో మాళవికా రాజ్.. స్విమ్ షూట్లో మన్మధుడు బ్యూటీ!
బేబీ బంప్ ఫోటోలతో మాళవికా రాజ్ బగ్గా..బ్లాక్ డ్రెస్లో సుప్రీత స్టన్నింగ్ లుక్..మాతృత్వం ఆస్వాదిస్తోన్న మహాతల్లి..స్విమ్ షూట్లో మన్మధుడు హీరోయిన్ అన్షు..గుర్రంపై బిగ్బాస్ ఇనయా సవారీ..బ్లూ డ్రెస్లో మెరిసిపోతున్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్..గ్రీన్ డ్రెస్లో మోనాల్ గజ్జర్ స్టైలిష్ లుక్.. View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
‘షేరెంటింగ్’...
సోషల్ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి విస్తృతి కలిగిన సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్లైన్లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్ఫింగ్తో మహా ప్రమాదంపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటా న్ని ‘షేరెంటింగ్’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్లైన్ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.అన్నీ చెప్పేసుకుంటే ముప్పుపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు. దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!» పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. » తల్లిదండ్రులు షేర్ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.పేరెంట్స్.. పారాహుషార్» కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. » పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.భవిష్యత్తుపై ప్రభావం» కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. » మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్లో తిప్పేవారు ఉంటారు. చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు.వేటాడే కళ్లకు చిక్కినట్లే!పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్ అవుతుంటాయి. సైబర్ క్రిమినల్స్లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్సైట్లకు షేర్ చేసే ప్రమాదం ఉంటుంది. » ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్ను సృష్టించి అన్లైన్లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. వేధింపులు – బెదిరింపులు! » ఆన్ లైన్ లో షేర్ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్ చేయవచ్చు. మరెవరికైనా షేర్ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.» అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవా రుంటారు. కొందరు మీమ్స్ కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి.» పోస్ట్లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవారూ ఉంటారు. -
బ్లాక్ బ్యూటీలా చాహల్ గర్ల్ ఫ్రెండ్.. బాలిలో బిగ్బాస్ దివి ఐస్ బాత్!
బ్లాక్ బ్యూటీలా చాహల్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్..జిమ్లో చెమడ్చోడుస్తున్న బాలీవుడ్ బ్యూటీ నికితా శర్మ..అరుణాచల్ ప్రదేశ్ పర్వతాల్లో వితికా శేరు చిల్..బాలిలో బిగ్బాస్ దివి ఐస్ బాత్ పిక్స్..సింహాచలం ఆలయంలో హీరోయిన్ లయ పూజలు..శ్రీదేవితో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హీరోయిన్ మహేశ్వరి.. View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
వానాకాలం కదా.. మరి స్పెషల్ అలవెన్స్ ఉందా?
ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటలకొద్దీ పని చేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తన బుర్రకు పని చెప్పి ఆ సంస్థకు తన సేవలు అందించడం. అందుకే కంపెనీల్లో చాలావరకు జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఉద్యోగిని సంతృప్తి పరిచేందుకు కూపన్లని, బోనస్లని, అలవెన్సులని ఎక్సెట్రా.. ఎక్సెట్రా అందిస్తుంటాయి.సాధారణంగా ఇంటర్వ్యూలలో జీతం ఎక్కువ ఇవ్వమనో లేకుంటే వాళ్ల వాళ్ల అవసరాలను హెచ్ఆర్లకు తెలియజేస్తుంటారు. అయితే.. ఓ ఉద్యోగాభ్యర్థి ‘లెక్క’ మాత్రం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంపెనీలు కొత్త పాలసీ తీసుకురావాలన్న చర్చ డిమాండ్కు దారి తీసింది. ఢిల్లీ కంపెనీ హెచ్ఆర్ ఒకరు.. తాజాగా ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అయితే తనకు ఇవ్వబోయే ప్యాకేజీకి వానకాలంలో కాస్త అదనంగా జీతం చేర్చాలని ఆ హెచ్ఆర్ను కోరాడతను. అందుకు కారణం ఏంటి? అని హెచ్ఆర్ అడగ్గా.. వానాకాలంలో తన ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చును కంపెనీనే భరించాలన్నాడు. ‘‘సాధారణ రోజుల్లో నాకు అయ్యే ఖర్చు కంటే వానాకాలంలో కాస్త ఎక్కువే. కాబట్టి కంపెనీ రెయిన్ అలవెన్స్ చెల్లించాలి’’ అని కోరాడతను. అయితే మునుపెన్నడూ వినని ఆ ప్రస్తావనతో హెచ్ఆర్ కాస్త అయోమయానికి గురైనా వెంటనే తేరుకుని.. అలాంటి పాలసీ తమ కంపెనీలో లేదని బదులిచ్చారు... ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులాంటి మహానగరాల్లో వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్ చిక్కులు షరామామూలేనని, అలాంటి సమయంలో క్యాబ్ తరహా సేవల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని.. అలాంటప్పుడు రెయిన్ అలవెన్స్ కోరడం ఎంతవరకు సబబని ఆ హెచ్ఆర్ ఆ ఉద్యోగ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి సాధారణ రోజుల్లో తనకు అయ్యే ఖర్చును.. వానాకాలంలో ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చను లెక్కేసి మరీ హెచ్ఆర్కు వివరించారు. అదే సమయంలో.. అలాంటి చెల్లింపులు(రెయిన్ అలవెన్స్) వీలులేని పక్షంలో వర్క్ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాలని, అదీ కుదరకుంటే ఆలస్యంగా వచ్చేందుకైనా అనుమతించాలని కోరాడతను. ఆ వ్యక్తి సెలక్ట్ అయ్యాడో లేదో తెలియదుగానీ.. ఈ ఇంటర్వ్యూ వివరాలను ఆ హెచ్ఆర్ రెడ్డిట్లో పంచుకున్నారు. దీంతో ఆ ఉద్యోగ అభ్యర్థికి మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అంతెందుకు ఆ హెచ్ఆర్ కూడా ఆ వ్యక్తి కోరింది సబబుగానే ఉందంటే ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఇంటర్వ్యూలో విచిత్రంగా అనిపించిన అతని కోరిక.. ఇప్పుడు సబబుగానే అనిపిస్తోంది’’ అంటూ పోస్ట్ చేశారా హెచ్ఆర్. అంతేకాదు.. తాను కూడా ఆఫీస్కు క్యాబ్లలోనే వెళ్తానని, వానకాలంలో అతను చెప్పినట్లు పోల్చుకుంటే అధిక ఖర్చులే ఉంటున్నాయని.. అతను కోరింది విచిత్రమైనదేం కాదని ఆ పోస్టులో ఆ హెచ్ఆర్ పేర్కొన్నారు. వానాకాలం కావడం, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. -
హాలీడే ట్రిప్లో ఐశ్వర్య రాజేశ్ చిల్.. వర్షంలో బలగం బ్యూటీ ఎంజాయ్!
నేను.. నా శివయ్యా అంటోన్న సురేఖవాణి కూతురు సుప్రీత..జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్..పార్క్లో చెమట్చోడుస్తున్న బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు..ఆరెంజ్ డ్రెస్లో మెరిసిపోతున్న హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా..హాంకాంగ్ ట్రిప్లో బాలీవుడ్ భామ నైరా బెనర్జీ..హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్.. View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Nyrraa M Banerji (@nyra_banerjee) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
భార్య గర్భవతి : రూ. కోటిన్నర జాబ్ వదిలేశాడు
భార్యామణికోసం, ఆమె ప్రేమకోసం అందమైన ప్రేమ మందిరాన్ని నిర్మించిన ఘనత మనది. ఉద్యోగం ఒక లెక్కా అనుకున్నాడో ఏమోగానీ తాజాగా గర్భవతి అయిన జీవిత భాగస్వామి కోసం కోటి రూపాయలిచ్చే ఉద్యోగాన్ని ఒక భారతీయుడు. కోటి రూపాయల ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన ఘటన నెట్టింట సందడిగా మారింది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందించారు.గర్భవతిగా ఉన్న భార్యను చూసుకోవడానికి అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశానంటూ ఇండియన్ పెట్టిన రెడ్డిట్పోస్ట్ వైరల్గా మారింది. జయనగర్లో రూ. 1.2 కోట్ల జీతం, వర్క్ఫ్రం హోంఅ యినా భార్యకంటే ఇవేవీ ముఖ్యం కాదు అంటూ రాసుకొచ్చాడుఅతగాడు.. తన భార్య గర్భధారణ ప్రయాణంలో ఆమెతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. గర్భం అని తెలియగానే మొదట ఉద్యోగం వదిలేయమని అడిగిన భార్య ఆ తరువాత ఉద్యోగం చేయాలని కోరిందని అయితే ఆమెను కంటికిరెప్పలా కాపాడుకునేందుకు తానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అయితే తనకున్న పరిచయాలు, ,అనుభవంతో ఎప్పుడైనా మార్కెట్లోకి తిరిగి రాగలననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. లైఫ్లో సరైన సమయంలో సరైన ప్లేస్లో ఉండటం చాలా ముఖ్యమైందంటూ తన పోస్ట్ను ముగించాడు. ఈ సందర్భంగా తన జీవిత విశేషాలను కూడా కొన్ని పంచుకున్నాడు. ‘‘కాలేజీ డ్రాపౌట్, స్టార్టప్లలో పనిచేస్తూ 7 సంవత్సరాలలో 0 నుండి 7కోట్లకు చేరుకున్నా’’ అని తెలిపాడు.ఇదీ చదవండి: లండన్నుంచి వచ్చి అవకాడో సాగు... కోటి రూపాయల టర్నోవర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టాలనే అతని నిర్ణయాన్ని చాలామంది అభినందించినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకునే స్థోమతలో అందరూ ఉండరని చాలామంది వ్యాఖ్యానించారు. “మీరు.. మీ భార్య అదృష్టవంతులు, కానీ అందరి స్టోరీ ఒకేలా ఉండదు. చాలామందికి ఉద్యోగాలను కోల్పోవడం చాలా దుర్భరం, “ చాలా బాగుంది, జీవిత ప్రాధాన్యతలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ఇది ఉత్తమ నిర్ణయం అని నేను భావిస్తున్నాను, జీవిత వాస్తవ అనుభవం లేదా కేవలం అనుభవానికి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి అంటి కొందరు అభినందనలు తెలిపారు. “తెలివైన మనిషి!తక్కువ ఒత్తిడితో కూడిన సంపాదన అవకాశాలను అన్వేషించే వీలు చిక్కుతుంది. ఇది మీ బిడ్డను చూసుకుంటూ మీరు సంపాదించేలా చేస్తుంది.’’ అని మరొకరు విషెస్ తెలిపారు. -
నా ప్రజలను, నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నా..
గాజా: గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు వారిలో అనాస్ జమాల్ అల్–షరీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిలో మరణించడానికి ముందు అనాస్ రాసిన మెసేజ్ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందేశం ప్రజల హృదయాలను కదలిస్తోంది. అది చదివితే గుండె బరువెక్కడం ఖాయం. అన్సార్ సందేశం ఏమిటంటే... వారిని అల్లా క్షమించడు ‘‘ఇది నా వీలునామా. నా చివరి సందేశం. నా మాటలు మీకు చేరాయంటే దాని అర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయడంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయ, ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండడానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగినదంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్లు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా. నా జీవిత కాలాన్ని అల్లా పొడిగిస్తాడని ఆశపడుతున్నా. దానివల్ల నా స్వస్థలం ఆక్రమిత అస్కెలాన్(అల్–మజ్దాల్)కు చేరుకొని, కుటుంబంతో, ప్రియమైనవారితో గడపగలను. కానీ, అల్లా ఆదేశమే ఫైనల్. దానికి తిరుగులేదు. ఇన్నాళ్లూ ఎన్నో బాధలు అనుభవించా. కష్టాలు నష్టాలు నాకు కొత్త కాదు. ఎంతో కోల్పోయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మా చావులకు కళ్లారా చూస్తున్నవారిని, మా మారణాలను ఆమోదిస్తున్నవారిని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయినవారిని, గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణహోమాన్ని ఆడ్డుకోనివారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవడం లేదు. నా బిడ్డ నా కంటి వెలుగు పాలస్తీనా అంటే మాకెంతో ప్రేమ. ముస్లిం ప్రపంచం అనే కిరీటలో విలువైన రత్నం పాలస్తీనా. ప్రపంచంలో ప్రతి స్వేచ్ఛా జీవి గుండె చప్పుడు పాలస్తీనా. మా ప్రజలను మీకు అప్పగిస్తున్నా. కలలు కనడానికి సమయం లేని, స్వేచ్ఛగా, శాంతితో జీవించే అవకాశం లేని మా అమాయక చిన్నారులను అప్పగిస్తున్నా. మా ప్రజల దేహాలు వేలాది టన్నుల బరువు కింద ఛిద్రమైపోయాయి. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు వారి శరీరాలను ముక్కలు చేశాయి. ఆ ముక్కలన్నీ వెదజల్లినట్లుగా దూరంగా పడిపోయాయి. నిర్బంధాలు, హెచ్చరికలు మిమ్మల్ని ఆపకూడదు. సరిహద్దులు మీకు అడ్డంకి కాకూడదు. మీరంతా గొంతు విప్పండి. మా కోసం మాట్లాడండి. మా భూమి విముక్తికి, మా ప్రజలకు మధ్య వారధిగా మారండి. ఆక్రమణకు గురైన మా భూభాగంపై గౌరవం, స్వేచ్ఛ పరిఢవిల్లేదాకా గొంతు విప్పుతూనే ఉండండి. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మీకు అప్పగిస్తున్నా. నా ముద్దుల కూతురు షామ్ జాగ్రత్త. ఆమె నా కంటి వెలుగు. ఆమె ఎదుగుదలను కళ్లారా చూసే అదృష్టం నాకు దక్కలేదు. అది కలగానే మిగిలిపోయింది. నా కుమారుడు సలాహ్ను కూడా అప్పగిస్తున్నా. నా భారాన్ని మోసే, ఆశయాన్ని నెరవేర్చే బలవంతుడిగా మారేదాకా అతడికి అండగా ఉండాలనుకున్నా. ఇక నా తల్లి బాధ్యత కూడా మీదే. ఆమె ఆశీస్సులు, ప్రార్థనలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. ఆమె ఇచి్చన వెలుగే నాకు దారిగా మారింది. నా తల్లికి బలాన్ని ఇవ్వాలని అల్లాను ప్రారి్థస్తున్నా. అల్లా ఆమెను కరుణించాలి. నా జీవన సహచారి ఉమ్ సలాహ్ బాధ్యతను సైతం మీ చేతుల్లో పెడుతున్నా. ఈ యుద్ధం నన్ను నా భార్య నుంచి దూరం చేసింది. అయినప్పటికీ మా బంధానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమె తన బలం, విశ్వాసంతో నా బాధ్యతలను స్వీకరించి, భుజాన వేసుకొని మోసింది. అల్లా తర్వాత మీరే రక్షణ నా కుటుంబానికి అల్లా తర్వాత మీరే రక్షణగా నిలవాలి. ఒకవేళ నేను మరణిస్తే, నా ఆశయాలకు కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకుంటే.. అల్లా ముందుకు వెళ్లి, మీ ఆదేశాలు శిరసావహించానని చెబుతా. శాశ్వతంగా అల్లా సన్నిధికి చేరడం సంతోషకరమే కదా. అమర వీరుల్లో ఒకడిగా నన్ను చేర్చుకో అని అల్లాను వేడుకుంటున్నా. నా పాపాలన్నింటినీ క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రజలకు, నా కుటుంబానికి కలి్పంచే స్వేచ్ఛా మార్గాన్ని మెరిపించడానికి నా రక్తాన్ని ఒక కాంతిగా మార్చాలని ప్రారి్థస్తున్నా. మీ ప్రార్ధనల్లో గాజాను మర్చిపోవద్దు... నన్నూ మర్చిపోవద్దు.’’ – అనాస్ జమాల్ అల్–షరీఫ్ -
బిగ్ బాస్ సోనియా సీమంతం ఫోటోలు.. పసిడిలా మెరిసిపోతున్న జాన్వీ కపూర్!
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ సోనియా..రెస్టారెంట్లో చిల్ అవుతోన్న ఇనయా సుల్తానా..శారీలో మరింత బ్యూటీఫుల్గా సింగర్ చిన్మయి..అరుణాచల్ ప్రదేశ్ వేకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న వితికా శేరు..శారీలో మెరిసిపోతున్న టాలీవుడ్ నటి రోహిణి.. బంగారంలా ధగధగ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Gayatri Bhargavi (@gayatri_bhargavi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) -
వీడియో: డే కేర్ సెంటర్ నిర్వాకం.. పిల్లల విషయంలో జాగ్రత్త!
నోయిడా: చిన్నారులను వారి పేరెంట్స్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పాల్సిన పని లేదు. కానీ.. ప్రస్తుత జనరేషన్లో ఉద్యోగాలు, ఇతర కారణాల రీత్యా.. వారి పిల్లలను చూసుకునేందుకు కొందరు పేరెంట్స్కి సమయం ఉండటం లేదు. ఈ కారణంగా చిన్నారులను డే కేర్ సెంటర్లలో వదిలేసి వెళ్తున్నారు. ఇక, కొన్ని డే కేర్ సెంటర్లలో చిన్నారుల పట్ల అక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంటోంది. తాజాగా నోయిడాలోని ఓ డే కేర్ సెంటర్లో 15 నెలల చిన్నారిని తీవ్రంగా కొట్టిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డే కేర్ అంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగస్తులు కావడంతో.. తమ 15 నెలల పసిబిడ్డను స్థానికంగా ఉన్న ఓ డేకేర్ సెంటర్లో జాయిన్ చేశారు. అయితే ఆగస్టు 4వ తేదీన ఆ ఆడశిశువు ఎందుకో గుక్కపట్టి ఏడ్చింది. దీంతో డే కేర్లో యువతి.. ఏడుస్తున్న పాపను లాలించాల్సింది పోయి.. క్రూర మృగంలా ప్రవర్తించింది. ఏడుస్తున్న ఆ పసిబిడ్డను ఎత్తుకుని పలుమార్లు నేలకేసి కొట్టింది. అయినా ఏడుపు మానడం లేదని తలను గోడకేసి కొట్టింది. చెంప దెబ్బలతో తీవ్రంగా గాయపరిచింది. అంతటితో ఆగకుండా.. బ్యాట్తో కొట్టడంతో తొడలకు తీవ్ర గాయాలయ్యాయి.#Noida DAY CARE HORROR: A 15-month-old child was beaten, head smashed against a wall, dropped on the ground and bitten.Every working parent's worst nightmare! pic.twitter.com/KttIyyL0g3— Karan Singh (@Journo_Karan) August 11, 2025అదే రోజున సాయంత్రం కావడంతో డే కేర్ సెంటర్కు వచ్చిన పేరెంట్స్.. తమ బిడ్డను ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ పసిపాప శరీరంపై ఉన్న గాయాలను చూసి షాక్ అయ్యారు. తొడపై కొరికనట్టు గాయం, పలుచోట్ల ఎర్రగా కమిలిపోయి ఉండటంతో ఆవేదనకు గురైన పేరెంట్స్.. బిడ్డను తీసుకుని స్థానిక ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించారు. ఈ గాయాలన్నీ ఎవరో కొట్టినవి అని.. సదరు డాక్టర్ నిర్ధారించడంతో ఖంగుతిన్నారు.దీంతో డే కేర్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజీని బాధిత చిన్నారి పేరెంట్స్ పరిశీలించారు. చంటిబిడ్డను పనిమనిషి హింసించిన భయానక దృశ్యాలను చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. దీంతో డే కేర్ సెంటర్ హెడ్తో పాటు పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు డే కేర్ సెంటర్ నిర్వాకంపై మండిపడుతున్నారు. Noida - Sector-137 - पारस टियरा सोसायटी डे-केयर में 15 महीने की बच्ची से मारपीट और दांत काटने का आरोपमेड ने थप्पड़ मारा, पटक दिया, प्लास्टिक बेल्ट से मारा और काटाबच्ची जोर-जोर से रोती हुई दिखीआरोपी मेड को पुलिस ने गिरफ्तार कियाअपने बच्चों को किसी के सहारे ना छोड़े 🙏🏻 pic.twitter.com/iTkb95I0VB— Rimjhim Jethani (@RimjhimJethani1) August 11, 2025 -
టోల్ప్లాజా వద్ద ఏనుగు హల్చల్.. భయంతో వణికిపోయిన వాహనదారులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని టోల్ ప్లాజా వద్ద ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. టోల్ ప్లాజా వద్ద క్యూ లైన్లో ఉన్న వాహనాలపై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-హరిద్వార్ హైవేలోని లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ లైన్లో వెళ్తున్నాయి. వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో మెల్లగా కదులుతుండగా.. ఓ ఏనుగు పక్కనే ఉన్న అడువుల్లోకి వెళ్లోంది. ఈ క్రమంలో టోల్ ప్లాజ్ వద్ద ఆగి ఉన్న వాహనాల వైపు వెళ్లింది. అనంతరం, లైన్లో ఉన్న ఓ కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. తన తొండంతో కారు పైకి లేపి పడేసే ప్రయత్నం చేసింది.Elephant Creates Chaos at Lachhiwala Toll Plaza, Lifts and Smashes Barrier; Incident Comes Days After Same Elephant Overturned Devotees’ Tractor-Trolley on Dehradun-Haridwar Highway. pic.twitter.com/4Fmp0zu5Sv— Krishna Chaudhary (@KrishnaTOI) August 9, 2025..వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ స్పీడ్గా కారును ముందుకు కదిలించాడు. దీంతో, ప్రమాదం తప్పింది. అనంతరం, పక్కనే ఉన్న వాహనాలను కూడా తాకుతూ ఏనుగు ముందుకు సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. వాహనాదారులు ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ టోల్ ప్లాజా మార్గంలో ప్రతీరోజు ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని
టాలీవుడ్ యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్(Sameera Shareef) ఒకతల్లిగా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సమీరా NICU శిశువుల కోసం 6 లీగటర్లకు పైగా తల్లిపాల (Breast Milk)ను భద్రపర్చారు. కేవలం ఒక నెల రోజుల్లోనే అల్లా, తాను తనబిడ్డ సయ్యద్ అమీర్(రెండోబిడ్డ)ఇది సాధించామని ఇకముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లి పాలను డొనేట్ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు. దీంతో సమీరాపై అభినందనలు కురిపిస్తున్నారు అభిమానులుఆరు నెలల వరకు శిశువులకు తల్లి పాలు చాలా అవసరం. అలా తల్లి పాల విశిష్టతను తెసుకున్న చాలామంది మాతృమూర్తులు, తమ బిడ్డలకు పట్టగా మిగిలిన పాలను (బ్రెస్ట్మిల్క్)ను దానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమీరా కూడా తన పాలను డొనేట్ చేశారు. అంతేకాదు దీనివలన తల్లులకు ఎలాంటి నష్టం జరగదనీ, తల్లిపాలు ఇవ్వడం అంత కష్టమేమీ కాదని పాలిచ్చే తల్లులకు ప్రోత్సాహానిచ్చారు. . మీ బాడీ మీద, మీమీద, మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు. ఒత్తిడి లేకుండా ఉండండి, విశ్రాంతి తీసుకోండి. బాగా తినండి, హైడ్రేటెడ్ గా ఉండండి, బాగా తినండి, సంతోషంగా ఉండండి అని చెప్పారు. అలాగే ఎంత ఎక్కువగా పాలు ఇస్తే..అంత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి భయపడాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చారు. View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief)fy"> టీవీ నటిగా, యాంకర్గా తెలుగు ఆడియన్స్కు దగ్గరైన సమీరా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆడపిల్ల, అభిషేకం ముద్దుబిడ్డ, మూడు ముళ్ల బంధంలాంటి సీరియల్స్లో తన నటనతో ఆకట్టుకుంది సమీరా. 2019లో అన్వర్ జాన్(Anwar Jahn)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంటకు అర్హాన్, ఆమీర్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. -
వెంటాడిన వెబ్సిరీస్
మొబైల్ఫోన్, అందులోని ఇంటర్నెట్, సోషల్ మీడియా, గేమ్స్ అనేవి డ్రగ్స్ మాదిరిగా వ్యసనమవుతున్నాయి. ఎంతోమంది జీవితాలను బలిగొంటున్నాయి. ముఖ్యంగా బాలలు, యువకులు మొబైల్ గేమ్స్ మాయలో పడి విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి రెండు విషాద సంఘటనలు బెంగళూరులో సంభవించాయి.బనశంకరి: సిలికాన్ సిటీలో చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీస్స్టేషన్ పరిదిలో 14 ఏళ్లుబాలుడు గాంధార్ డెత్నోట్రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లిదండ్రులు జి.గంగాధర్, సవిత గాన సంగీత కళాకారులు కాగా, ఘటన సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాలుడు పద్మనాభనగరలో ప్రైవేటు స్కూలులో 7వ తరగతి చదివేవాడు. ఇంట్లో ఎలాంటి సమస్య లేదు, తల్లిదండ్రులు, సోదరునితో అన్యోన్యంగా ఉండే గాంధార్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి షాక్ ఇచ్చింది.స్వర్గంలో ఉంటానురాత్రి అందరితో కలిసి భోజనం చేసి తన పెంపుడు శునకంతో నిద్రకు ఉపక్రమించిన గాంధార్ తెల్లవారుజామున తన గదిలో ఉరివేసుకునే ముందు డెత్నోట్ను రాశాడు. తల్లిదండ్రులను ఉద్దేశించి.. మీరు నన్ను 14 ఏళ్లు బాగా పెంచారు. మీతో చాలా సంతోషంగా ఉన్నాను, కానీ నేను వెళ్లే సమయం వచ్చింది. మీరు ఈ లేఖ చదివేలోగా నేను స్వర్గంలో ఉంటాను అని రాశాడు. అందులో కొన్ని బొమ్మలను కూడా గీశాడు.ఆ వెబ్ సిరీసే..బాలుడు చిన్న వయసులో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్న తలెత్తింది. పోలీసులు విచారణ జరపగా కలవరపరిచే అంశాలు బయటపడ్డాయి. గాంధార్ జపనీస్ భాషలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డెత్నోట్ వెబ్ సిరీస్ను క్రమం తప్పకుండా చూసేవాడు. అంతేగాక వెబ్సీరీస్లో వచ్చే ఒక పాత్రను గాంధార్ తన రూమ్లో గీశాడు. ఈ వెబ్సీరీస్లో ఒక పాత్ర ఉంది. ఈ పాత్ర చెప్పినట్లు హీరో నడుచుకుంటాడు. ఆ మాయా బుక్లో ఎవరిపేరు రాసి వారు ఎలా చనిపోవాలి అనే ఊహించుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా చనిపోతాడు. చెడ్డవారు ఎవరూ కూడా భూమిపై ఉండరాదు, వారందరినీ అంతం చేయాలి అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈ డెత్నోట్ వెబ్సిరీస్ను నిరంతరం చూసి దీని ప్రభావానికి లోనైన గాంధార్ ఆ మాదిరిగా ప్రాణాలు తీసుకున్నాడనే అనుమానం వ్యక్తమవుతోంది. బాలుని మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
భారతీయ దుస్తుల్లో ఎందుకొచ్చారు?.. జంటకు రెస్టారెంట్లోకి నో ఎంట్రీ!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారతీయ వస్త్రధారణతో రెస్టారెంట్కు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో వెళ్లిన కారణంగా వారిని రెస్టారెంట్లోకి అనుమతించ లేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ.. వింత సమాధానం ఇవ్వడం గమనార్హం.వివరాల ప్రకారం.. ఢిల్లీలో పితాంపురలో ఉన్న రెస్టారెంట్కి ఓ జంట డిన్నర్కు వెళ్లారు. భారతీయ వస్త్రధారణతో వారిద్దరూ వెళ్లడంతో సదరు రెస్టారెంట్ జంటకు లోపలికి అనుమతించలేదు. సిబ్బంది అనుమతి నిరాకరించారు. రెస్టారెంట్లోకి ఇతరులను అనుమతించగా.. తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది. దీంతో, వారికి ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం, ఈ వీడియో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఈ అంశాన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారని మంత్రి కపిల్ మిశ్రా ట్విట్టర్లో వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై రెస్టారెంట్ యజమానులు కస్టమర్స్కు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించరని పేర్కొన్నారు.How can a restaurant in India stop entry in India for wearing an Indian wear…Dear @KapilMishra_IND ji,Please look into the matter. pic.twitter.com/f1ueFvPIco— MANOGYA LOIWAL मनोज्ञा लोईवाल (@manogyaloiwal) August 8, 2025ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ స్పందించారు. తమ రెస్టారెంట్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవంటూ తోసిపుచ్చారు. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చారు. రెస్టారెంట్లో ఎలాంటి వస్త్రధారణ విధానం లేదన్నారు. కస్టమర్స్ అందరికీ ఆహ్వానం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై మండిపడుతున్నారు. ఇలా ప్రవర్తించే రెస్టారెంట్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.This is unacceptable in Delhi पीतमपुरा के एक रेस्टोरेंट में भारतीय परिधानों पर रोक का वीडियो सामने आया है ये अस्वीकार्य है CM @gupta_rekha जी ने घटना का गंभीरता से संज्ञान लिया है अधिकारियों को इस घटना की जांच व तुरंत कार्यवाही के निर्देश दिए गए हैं https://t.co/ZUkTkAZmAT— Kapil Mishra (@KapilMishra_IND) August 8, 2025 -
చిటపట చినుకుల్లో అమ్మాయి ‘క్రేజీ’ స్టంట్, చివరకు..
‘‘స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది. ఏదో ఒక వీడియో క్రేజీగా చేసేద్దాం. వీలైతే వైరల్ అయిపోదాం’’ అనే ఆలోచనకు వయసు నిమిత్తం లేకుండా పోతోంది. చిన్నపిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలిదాకా.. ఏదో ఒక వీడియోతో ఓవర్నైట్లో ఫేమ్ అయిపోవడం(ఆ ఒక్క వీడియోతోనే) చూస్తున్నాం కూడా. అలా.. ఇక్కడ ఓ అమ్మాయి అనుకుంది. కానీ, ఆ ఆలోచన బెడిసి కొట్టింది.జోరుగా వాన పడుతోంది. ఆ వానలో ఓ అమ్మాయి సరదాగా రీల్ చేయాలని అనుకుంది. అయితే కారెక్కి కూర్చుని చేస్తే క్రేజీగా ఉంటుందని భావించింది. ఆమె స్నేహితుడు వాహనం నడుపుతుంటే.. ఆమె ఆ వాహనం టాప్ మీద కూర్చుని వానలో ఫోన్లో సెల్ఫీలు దిగుతూ మురిసిపోయింది. ఆ డేంజరస్ స్టంట్ను ఆ దారినపోయే కొందరు వీడియో తీశారు. దానిని నెట్టింట వదిలారు అంతే..గురుగ్రామ్ పోలీసులు ఆ వీడియోకు స్పందించారు. జాతీయ హైవే 48 మీద ఆ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ రీల్ స్టంట్ కోసం వాడిన వాహనాన్ని సీజ్ చేశారు. తనకు తెలియకుండా తన కొడుకు తన కారును తీసుకెళ్లాడని ఆ తండ్రి చెబుతున్నాడు. కారు నడిపిన ఆ యువకుడు, పైన కూర్చున్న అమ్మాయి ఇద్దరూ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో వాళ్లను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతారో తెలియదుగానీ.. కటకటాలు మాత్రం లెక్కించాల్సి వస్తోందని పలువురు కామెంట్లు పెడుతున్నారు.Gurugram’s viral stunt turns into trouble! 🚨Man seen hanging out of moving Thar in rain — police launch investigation.#thejournalists #newsupdate #Gurugram #ViralVideo #TharStunt #TrafficRules #RoadSafety #PoliceInvestigation #HaryanaNews #DangerousDriving pic.twitter.com/LxkmoPM1Nj— The Journalists News (@TheJournalists_) August 8, 2025 -
సారా టెండూల్కర్ కొత్త చాలెంజ్ క్రియేటివ్ వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రత్యేకతే వేరు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభించిన కమ్ అండ్ సే ‘జీ’డే రూ.1137 కోట్ల భారీ ప్రచారానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది. తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.చిన్న చిన్న క్రియేటివ్ మూమెంట్స్తో సంతోషాన్ని, ఆనందాన్ని వెతుక్కుంటూ ఇన్స్టాలో సందడి చేస్తోంది. ఆత్మ , మనస్సు రెండింటినీ ఉత్తేజపరుస్తూ కొత్త అభిరుచిని కనుగొంది. ‘‘ఫైండ్ సారా ఎ న్యూ హాబీ" అనే ఇన్స్టాగ్రామ్ సిరీస్లో సారా టెండూల్కర్ తన ఖాళీ సమయంలో ఉత్తేజకరమైన మానసిక శ్రేయస్సును మెరుగుపరిచే హాబీని ప్రదర్శించింది.సారా రగ్ టఫ్టింగ్లో తన టాలెంట్ను పరీక్షించుకుంది. ఆకుపచ్చ రంగు నూలును ఎంచుకుని టఫ్టింగ్ ద్వారా పావ్ ప్రింట్ రగ్ను తయారు చేయాలని నిర్ణయించుకుంది. టఫ్టింగ్ పూర్తైన తరువాత జిగురుతో అంటించింది కూడా. రగ్ టఫ్టింగ్ పూర్తి చేయడానికి సంబంధించిన వీడియో నెట్టింట్ సందడిగా మారింది.చదవండి: ‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) రగ్ టఫ్టింగ్ అంటే ఏమిటిటఫ్టింగ్ అనేది ఒక టెక్స్టైల్ టెక్నాలజీ. టఫ్టింగ్ గన్ను ఉపయోగించి నూలుతో కాన్వాస్ మీద కుట్టడం. వివిధ రకాల మెటీరియల్స్ ఉపయోగించడం వల్ల, టఫ్టింగ్ ప్రక్రియలో సమస్యలు రావచ్చు. ఉదాహరణకు, నూలు చిక్కుకుపోవడం, లేదా కాన్వాస్ చిరిగిపోవడం వంటివి జరగవచ్చు. టఫ్టింగ్ తర్వాత, రగ్గును శుభ్రపరచడం, అంచులు కత్తిరించడం, ఇతర మెరుగులు పెట్టడం కూడా ముఖ్యమైనవి. ఇందులో విభిన్న అల్లికలు, మోడల్స్ ఉంటాయి.టఫ్టింగ్ ప్రక్రియ ఒక ఫౌండేషన్ ఫాబ్రిక్ను ఫ్రేమ్పై గట్టిగా సాగదీయడంతో ప్రారంభమవుతుంది. ఆపై ఒక డిజైన్ ఫాబ్రిక్పైకి మారుస్తారు. కావలసిన డిజైన్స్ కట్స్ చేస్తారు. చివరగా, రగ్ వెనుక భాగంలో రబ్బరు పాలు జిగురుతో అంటిస్తారు. టఫ్టింగ్కు అవసరమైన కొన్నిప్రాథమిక సాధనాల్లో టఫ్టింగ్ గన్, నూలు, టఫ్టింగ్ ఫ్రేమ్,బ్యాకింగ్ ఫాబ్రిక్, అంటుకునే, చెక్కే సాధనాలు, షీరింగ్ కోసం కత్తెర తదితర టూల్స్ అవసరం.ఇదీ చదవండి: ఒకే ఒక్క టిప్తో స్లిమ్గా కీర్తి సురేష్ : కానీ ఈ రెండూ కీలకం -
బంధువుల పెళ్లిలో శోభిత ధూళిపాల.. శారీలో బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ!
బంధువుల పెళ్లిలో అక్కినేని కోడలు శోభిత సందడి..ఇష్టమైన సాంగ్తో చిల్ అవుతోన్న బిగ్బాస్ బ్యూటీ రీతూ చౌదరి..సిస్టర్ పెళ్లి మూడ్లోనే సింగర్ మధుప్రియ..వరలక్ష్మీ వ్రతం ఫోటోలు పంచుకున్న ప్రియాంక జైన్..బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ భామ శోభా దే.. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Shobhaa De (@shobhaade) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
బ్యూటిఫుల్ ఐల్యాండ్లో మంచు లక్ష్మీ చిల్.. దుబాయ్లో చాహల్ గర్ల్ఫ్రెండ్!
సిసిలీ ఐల్యాండ్లో మంచు లక్ష్మీ చిల్..బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో రష్మిక పోజులు..దుబాయ్లో చిల్ అవుతోన్న చాహల్ గర్ల్ఫ్రెండ్..స్విమ్మింగ్ పూల్ వద్ద బిగ్బాస్ బ్యూటీ దివి క్రేజీ లుక్..పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న యాంకర్ లాస్య... View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?
ఈ ప్రశ్న వేసింది వాన్షివ్ టెక్నాలజీస్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ ఖేటర్పాల్. తనను బాధ పెట్టిన సంఘటన గురించి తలుచుకుంటూ ఆయన ఈ ప్రశ్న వేశారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న వార్తలను తరచుగా వింటున్నాం. కని, పెంచి ప్రయోజకులను చేసిన పేరెంట్స్ను చివరి రోజుల్లో ఒంటరిగా వదిలేస్తున్న వారు ఎందరో. కనీసం కన్నవారి చివరిచూపునకు కూడా నోచుకోకుండా కన్నుమూస్తున్న తల్లిదండ్రులు కోకోల్లలు. ఈ నేపథ్యంలో గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఆన్లైన్లో చర్చకు దారితీసింది. అమెరికాలో ఉంటున్న తన స్నేహితుడొకరు.. తండ్రి చివరి రోజుల్లో వ్యవహరించిన తీరును తన పోస్ట్ ద్వారా వెల్లడించారు.'15 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న స్నేహితుడొకరు ఇటీవల తన తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో అతడి తండ్రి (84) జైపూర్లో ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల ముందు తెల్లవారుజామున 3 గంటలకు నాకొక ఫోన్ కాల్ (Phone Call) వచ్చింది. తన తండ్రి ఆరోగ్యం బాలేదని, వెళ్లి చూడమని అమెరికా నుంచి ఫ్రెండ్ ఫోన్లో చెప్పాడు. కొంతమంది స్నేహితులతో కలిసి నేను వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించాను. గుండెపోటు, అవయవాలు పనిచేయకుండా పోవడంతో పెద్దాయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. సరైన సమయంతో మంచి వైద్యం అందిచడంతో ఆయన కోలుకుకున్నారు. బంధువులు ఆయన చూడటానికి వచ్చారు. కానీ ఎవరూ ఎటువంటి బిల్లులు చెల్లించలేదు సరికదా, ఆయన బాధ్యత భుజానికెత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. ఇక పెద్దాయన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తండ్రి ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతుంటే కొడుకు మిలియన్ డాలర్ల ఒప్పందం కోసం అమెరికాలోనే ఉన్నాడు. తండ్రిని చూడటానికి రాలేదు. గత వారమే పెద్దాయన ప్రాణాలు వదిలారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇండియాకు వచ్చిన కొడుకు మళ్లీ 3 రోజులకే తిరుగు పయనమయ్యాడు.నన్ను కదిలించినది ఏమిటంటే..అంతిమ గడియల్లో ఉన్న తండ్రి కంటే అమెరికా కలే అతడికి ముఖ్యమైంది. తండ్రి చనిపోయినప్పుడు కూడా అతడి భార్య, పిల్లలు రాలేదు. వాళ్లు అమెరికాలోనే ఉండిపోయారు. "ఆమెకు ఉద్యోగం ఉంది, పిల్లలకు చదువు ఉంది" అని అతడు అన్నాడు - నమ్మశక్యం కాదు!నేను, నా స్నేహితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించి, ఖర్చులు చూసుకుంటూ, వంతులవారీగా ఆస్పత్రికి వెళుతూ అతడి తండ్రిని చివరి శ్వాస వరకు వెన్నంటే ఉన్నాం. కానీ నగరంలోని అతడి బంధువులెవరూ మర్యాదపూర్వకంగా కలవడం తప్ప ఎటువంటి సహాయం చేయలేదు.తండ్రి చనిపోయిన మూడో రోజునే నా స్నేహితుడు స్వదేశం విడిచి వెళ్లాడు. తండ్రి అస్థికలను నిమజ్జనం కూడా చేయకుండానే అతడు అమెరికా వెళ్లిపోయాడు.భారతీయ కుటుంబ విలువలు, మన ఆచారాలు, బంధాలు ప్రపంచంలో మరెక్కడా లేనంత మెరుగ్గా.. బలంగా ఉన్నాయని ఇప్పటివరకు నేను నమ్మాను. కానీ ఈ సంఘటన నన్ను పూర్తిగా కదిలించింది! భారతీయ సమాజం ఎటు పయనిస్తోంది, మన కుటుంబ విలువలు ఎక్కడ కనుమరుగవుతున్నాయ'ని గౌరవ్ ఖేటర్పాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. విదేశాల్లో ఉంటూ కెరీర్ కొనసాగిస్తువారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది మాత్రం విచ్ఛిన్నమవుతున్న భారతీయ కుటుంబ విలువల గురించే ఆందోళన చెందారు.స్నేహితుడిని బద్నాం చేస్తారా?మరికొందరైతే గౌరవ్పై విరుచుకుపడ్డారు. ట్వీట్ కోసం స్నేహితుడిని బద్నాం చేస్తారా అంటూ ప్రశ్నించారు. 'కేవలం 3 రోజుల కోసమే అమెరికా (America) నుంచి ఎవరూ ఇండియాకు రారు. ప్రయాణానికే ఒక రోజు పడుతుంది. జెట్ లాగ్ ఎలాగూ ఉంటుంది. అతడి తండ్రికి అప్పటికే 84 ఏళ్లు, తన కొడుకుతో ఉండటానికి నిరాకరించి ఉండవచ్చు. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం, చలి వాతావరణం కారణంగా అమెరికాలో వృద్ధులు నివసించడం కష్టం. అతడు తన తండ్రిని చూసుకోవడానికి సహాయకులను నియమించుకునే ఏర్పాటు చేసి ఉండాలి. మీరు ఎటువంటి రుజువు ఇవ్వకుండానే ఇక్కడ మీ స్నేహితుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఆసుపత్రి బిల్లులు కూడా చెల్లించారని కూడా మీరు పేర్కొన్నారు. మీరు నిజం చెబుతుంటే, ఆసుపత్రి పత్రాలు, బిల్లులతో పాటు వృద్ధుడు, అతడి కొడుకు వివరాలను వెల్లడించండి' అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేశాడు. దీనిపై ఖేటర్పాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'మీ స్పందన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మొత్తం మీద.. 3 రోజుల కోసం ఎవరూ అమెరికా నుంచి భారతదేశానికి రారు అనే వాస్తవాన్ని మీరు ఇప్పుడే గమనించారు. మీ IQ వేరే స్థాయిలో ఉందంటూ' సమాధానమిచ్చారు.చదవండి: టాలెంట్ వదిలేసి బొట్టుపై ట్రోల్స్విదేశాల్లో స్థిరపడే వారి సంఖ్యలో గతంలో చాలా తక్కువగా ఉండేదని, ప్రస్తుతం ఈ సంఖ్య బాగా పెరుగుతుండడంతో.. తల్లిదండ్రులకు చివరి రోజుల్లో ఎడబాటు తప్పడం లేదని మరో నెటిజన్ (Netizen) అభిప్రాయపడ్డారు. అఖరి గడియాల్లో పిల్లల కోసం వేచిచూసి తనువు చాలిస్తున్న పేరెంట్స్ సంఖ్య నానాటికీ పెరగడం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు. చాలా మంది పిల్లలకు.. తల్లిదండ్రులు వెళ్లిపోయిన తర్వాత, ఆస్తులన్నీ అమ్మేసి ముందుకు సాగడమే ఏకైక లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు దాదాపు 2 లక్షల మంది భారతీయులు (Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు ఇటీవల వెల్లడించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.ఎవరీ గౌరవ్ ఖేటర్పాల్?రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్నారు గౌరవ్ ఖేటర్పాల్ (Gaurav Kheterpal). గూగుల్ డెవలపర్ ఏఐ ఎక్స్పర్ట్ అయిన గౌరవ్కు ఐటీ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మల్టీ-క్లౌడ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్గానూ ఆయన పేరు గాంచారు. చాలా దేశాల్లో ఐటీపై ప్రసంగాలు ఇచ్చారు. గ్లోబల్ మొబైల్ డెవలపర్ చాలెంజ్, యాప్స్ హకథాన్ వంటి పలు రకాల పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వాన్షివ్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించి సీఈవోగా కొనసాగుతున్నారు. Is the Indian family system dead?A friend (let's call him 'X') recently lost his father. He's been living in the US for the last 15 years while his father lived alone in Jaipur - his mother passed away 3 years back. Few days earlier, I received a frantic call from him at 3 AM…— Gaurav Kheterpal (@gauravkheterpal) August 3, 2025 -
రేవంత్.. మంచి చెడులు రాశులు పోసి ఉండవు!
‘నవ తెలంగాణ’ పత్రిక వార్షికోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని అభ్యంతరకరం. మరికొన్ని అర్ధసత్యాలు. ఇంకొన్ని పూర్తిగా అసత్యాలు. కొంతమంది తీరు చూస్తే చెంప చెళ్లుమనిపించాలని అనిపిస్తుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అనడం భావ్యం కాదు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలలో పనిచేసే వారిని జర్నలిస్టులుగా గుర్తించేందుకు ఆయన ఇష్టపడకపోవచ్చు వారి వల్ల ఆయనకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమైనా అంతా పద్దతిగా ఉందని ఆయన చెప్పగలరా? లోపాలు ఎక్కడైనా ఉండవచ్చు.ప్రముఖ పత్రికలు, టీవీ ఛానళ్లు కొన్ని చేస్తున్న అసత్య ప్రచారాలు, వాటి యజమానులు కొందరు చేసే పైరవీలు, రాజకీయ బ్రోకరిజాలు రేవంత్కు తెలియవని అనుకుంటే పొరపాటే. ఒకరిద్దరితో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. వారు చెప్పిన మాట జవదాటరని కూడా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారిలో రేవంత్కు సత్యసంధత కనిపిస్తోందా? అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం ఇస్తారు?. ప్రధాన మీడియా ఇవ్వని అనేక విశ్లేషణలు, ముఖ్యమైన వార్తా కథనాలను డిజిటల్ మీడియా ఇస్తోంది. రేవంత్ సహా పలువురు రాజకీయ వేత్తలు డిజిటల్ మీడియాను పూర్తిగా వాడుకుంటున్నారు. కొందరు పార్టీ కార్యాలయాలలో వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ తమ అనుకూల స్టోరీలతోపాటు ప్రత్యర్థి పార్టీపై, గిట్టని నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. వీటిలో చాలా అబద్దాలు ఉంటున్నాయన్న అభిప్రాయం ఉంది. సాధారణ జర్నలిస్టులు నిర్వహించే యూట్యూబ్ ఛానళ్ల కన్నా, రాజకీయ పక్షాలు నడిపే ఛానళ్లే సమాజానికి హానికరంగా మారుతున్నాయని. వాటి గురించి రేవంత్ ఏమి చెబుతారు!.రాజకీయాలలో మాదిరే జర్నలిజంలో కూడా విలువలు తగ్గిన మాట నిజమే. నాలుగు ముక్కలు రాయడం రాకపోయినా ప్రతి వాడు జర్నలిస్టునే అని చెప్పుకుంటున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో కొంతవరకు నిజం లేకపోలేదు. అక్షర జ్ఞానం అవసరమే కావచ్చు. కానీ, మారిపోయిన కాలమాన పరిస్థితులను కూడా ఆయన అర్థం చేసుకోవాలి. గతంతో పోలిస్తే సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టు కావచ్చంటారు. వారందరిని జర్నలిస్టులు అనాలా?.. వద్దా అన్నది ప్రభుత్వ ఇష్టం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రధాన స్రవంతిలో ఉన్న జర్నలిస్టుల కన్నా, సోషల్ మీడియాలో, ప్రత్యేకించి యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న కొందరు చెప్పే విషయాలను జనం శ్రద్దగా వింటున్నారు. వారికి లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వస్తున్నాయి.ఈ మధ్య కొన్ని సామాజిక సమస్యలపై ఒక మహిళా జర్నలిస్టు ఇచ్చిన కథనాలు, ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి. కర్ణాటకలోని ధర్మస్థళలో యువతులపై జరిగిన ఘోర అకృత్యాలు, అనేక మంది కనిపించకుండా పోయిన ఘటనపై యూట్యూబ్ మీడియానే సంచలనాత్మక స్టోరీలు ఇచ్చింది. కొందరు రాజకీయ పార్టీలకు సంబంధించి ఇస్తున్న విశ్లేషణలు కూడా గుర్తింపు పొందుతున్నాయి. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తారంగా వస్తుంటాయి. జర్నలిస్టులకు ఇది ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. జర్నలిస్టు అంటే ఎవరన్నది నిర్వచించడం కష్టమైన పరిస్థితి ఇది. యూట్యూబ్ ఛానల్లో పని చేసే వారికి ప్రభుత్వపరమైన ప్రత్యేక గుర్తింపు లేదు. సాయం ఉండదు. కాకపొతే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల పేరుతో బ్లాక్ మెయిలింగ్, పైరవీలు వంటివి చేస్తుంటారు. ఆహ్వానం లేకపోయినా ఆయా కార్యక్రమాలలో పాల్గొనడం, అర్థం పర్థం లేని ప్రశ్నలు వేయడం వంటివి చేస్తుండవచ్చు. అలాంటి వారి వల్ల రేవంత్కు చికాకు కలిగి ఉండవచ్చు. కాని కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి వారి చెంపపై కొట్టాలనిపిస్తుందని ఎలా అంటారో అర్థం కాదు.రాజకీయాలలో ఉన్న వారంతా సుద్దపూసలని ఆయనే అంగీకరించ లేదు. వారిలో చాలామందికి పెద్దగా పదవులు ఉండవు. ఆయా నేతల వెనుక అనుచరులమని చెప్పుకుని తిరుగుతుంటారు. దందాలు కూడా చేస్తుంటారు. భూ కబ్జాలు జరుగుతుంటాయి. రాజకీయ నేతలపై ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలిపే సంస్థలు ఉన్నాయి. అలా కేసులు ఉన్నవారు పదవులలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. రేవంతే ఒక సందర్భంలో చెప్పినట్లు ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. అవన్ని నిజమైనవా? కావా? అన్నది వేరే చర్చ. కొందరు చిన్న, చితక రాజకీయ నేతలు విజిటింగ్ కార్డులు పెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూ పైరవీలు సాగిస్తుంటారు. వారందరిని అరికట్టే వ్యవస్థ ప్రభుత్వంలో ఉందా అన్నది ప్రశ్న. ఇంటి పేరు మాదిరి జర్నలిస్టు అని తగిలించుకుంటున్నారని రేవంత్ అనడం సబబు కాదు. ఎవరి స్వేచ్చ వారిది. వారు తమ ప్రతిభను చాటుకోగలిగితే జర్నలిస్టుగా పేరు తెచ్చుకుంటారు. రాణించగలుగుతారు. రోడ్లపై ఆవారాగా తిరిగేవారు, తిట్లు వచ్చిన వారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని అన్నారు. రాజకీయాల్లోనూ ఇదే రీతిలో పలువురు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది.రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా గురించి కూడా మాట్లాడారు. కొన్ని పత్రికలు తాము ఫలానా పార్టీకి చెందిన విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకోగలుగుతున్నాయి. వాటిలో ఇబ్బంది లేదు. అవి రాసే, లేదా టీవీలలో ప్రసారం చేసే వాటిపై స్పష్టత ఉంటుంది. కాని స్వతంత్ర పాత్రికేయం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలపై పచ్చి అబద్దాలను ప్రచారం చేసే మీడియాతోనే ఇప్పుడు ఉన్న సమస్య. కాంగ్రెస్ పార్టీ కూడా మీడియాను నిర్వహించేది. అలాగే వామపక్షాలకు చాలాకాలంగా మీడియా ఉంది. ఒకప్పుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు మీడియాపై విరుచుకుపడే వారు. కానీ, ఇప్పుడు అదే మీడియాను, అవే పార్టీలను రేవంత్ పొగుడుతున్నారు. తప్పులేదు. కాలం మారింది. కొన్నిసార్లు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీచేసి అధికారంలోకి వస్తున్నాయి. కొన్నిసార్లు విబేధించుకుంటున్నాయి.ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేసింది. నక్సలిజానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంది. కానీ, ఇప్పుడు అదే సాయుధ పోరాటం గొప్పది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రముఖ గాయకుడు గద్దర్ వంటి నక్సల్ నేతల పేరు మీద సినీ అవార్డులు కూడా ఇస్తున్నాయి. అంతెందుకు కాంగ్రెస్ను, సోనియా గాంధీని రేవంత్ ఎంతగా దునుమాడింది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంతగా పొగుడుతున్నది చూస్తున్నాం. తప్పులేదు. కాలం మారింది. రాజకీయాలు మారాయి.మరో సంగతి చూద్దాం. కొన్ని పత్రికలు ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి, మరో రాష్ట్రంలో ఇంకో పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్కు సపోర్టు చేస్తోంది. అంతకు ముందు ఇదే మీడియాలో ఒక భాగం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేది. రాజకీయ పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలలో తమాషా రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ కూటమిలోని టీడీపీ ప్రభుత్వానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా సహకరిస్తోందన్న ప్రచారం ఉంది. ఏపీలో కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమికే పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న అభిప్రాయం ఉంది. అది నైతికమా?. అలా చేసే రాజకీయ నేతలను నిరోధించగలమా?. ప్రజలను మోసం చేయకపోతే వారు ఓట్లు వేయరన్న ఫిలాసఫీ కూడా రాజకీయ నేతలలో ఉంది కదా!. అమెరికాలో ఒక సందర్భంలో రేవంత్ చేసిన ఆ తరహా వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఆయన నిజమే చెప్పి ఉండవచ్చు. కానీ, అది మోసం చేయడం అవ్వదా అన్నది పాయింట్. తాను నిజాలు చెప్పకపోవచ్చని, కాని అబద్దాలు ఆడనని రేవంత్ అంటున్నారు. దానికి, దీనికి పెద్ద తేడా ఉంటుందా?.రాజకీయ నేతల మాదిరే జర్నలిస్టులు కూడా వారి స్వేచ్చకు అనుగుణంగా ఉండవచ్చు. ఎటు వచ్చి అబద్దాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, తిట్ల పురాణాల జోలికి వెళ్లనంతవరకు ఓకే. అలా కాకపోతే ఎటూ చట్టాలు ఉండనే ఉన్నాయి. కాకపోతే తమకు నచ్చని యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వాలు దాడులు చేస్తుంటాయి. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను బాగా వాడుకున్న వ్యక్తే అని అంటారు. ఇప్పుడు దానిపై ఆయనకు ఎందుకు ఏవగింపు కలిగిందో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా బాగా ఉపయోగపడిందన్న భావన కూడా ఉంది. ఏది ఏమైనా ఏ మీడియా అయినా, ఏ రాజకీయ సమాజం అయినా బాధ్యతగా ఉండటమే శ్రేయస్కరం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బిగ్బాస్ సోనియా సీమంతం ఫోటోలు.. వరలక్ష్మీ శరత్కుమార్ ఫస్ట్ మ్యారేజ్ డే చిల్!
సీమంతం ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ సోనియా..దుబాయ్లో చిల్ అవుతోన్న చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ..షూటింగ్లో బిజీగా బిగ్బాస్ అశ్విని శ్రీ..మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న వరలక్ష్మీ శరత్కుమార్..బ్లాక్ శారీలో కాజోల్ బ్యూటీఫుల్ లుక్.. View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Soniya Akula (@soniya_akula_official) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
లిక్కర్ కేసు.. వెంకటేష్ నాయుడు పచ్చదొంగే!
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్కు వైఎస్సార్సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.టీడీపీ నాయకులతోనే సంబంధాలువెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది. -
వరద నీటిలో బాహుబలి సీన్ రిపీట్.. వరద నీటిలో పోలీసు అధికారి స్విమ్మింగ్
లక్నో: బాహుబలి సినిమాలో నదీ ప్రవాహంలో మునిగిపోకుండా ఒంటిచేత్తో పసిబిడ్డను పైకెత్తి పట్టుకున్న శివగామి పాత్ర గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాగే నదీ ప్రవాహంలో నిజమైన నయా బాహుబలి ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. దాదాపు భుజం ఎత్తులో ప్రయాగ్రాజ్ నగరాన్ని గంగానదీ ప్రవాహం ముంచెత్తడంతో తమ బిడ్డను ఒక జంట ఇలా పైకెత్తి పట్టుకుని భద్రంగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది. ఆదివారం ప్రయాగ్రాజ్ నగర వీధిలో తీసిందీ ఫొటో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రయాగరాజ్లో గంగా నది నీళ్ల తన ఇంటి వద్దకు చేరడంతో యూపీకి చెందిన పోలీసు అధికారి ఒకరు.. వరద నీటికి పూజ చేశారు. అనంతరం, తన ఇంటి రెండో అంతస్తు నుంచి వరద నీటిలో దూకి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. The Ganga river has entered the residential areas or residential areas have encroached the Ganga river area? pic.twitter.com/PAiel3Fcqw— Piyush Rai (@Benarasiyaa) August 2, 2025 Sub-inspector saab has upper his game - Dive from first floor. - Two camera set-up- Audience https://t.co/kksn2GCchs pic.twitter.com/4HT0EpJl3G— Piyush Rai (@Benarasiyaa) August 3, 2025 -
పోలవరం ఎమ్మెల్యే వంద కోట్లు సంపాదించాడట!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే రూ.100 కోట్లు సంపాదించాడంట.. ఆయన గొప్పతనం యూట్యూబ్లో ఇప్పుడే కనిపించింది.. ఏడాదిలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎట్లా.. పవన్ కళ్యాణ్ ఏమీ పట్టించుకోరా..’ అంటూ మాజీ మంత్రి, టీడీపీ ముఖ్య నేత దేవినేని ఉమ.. జనసేన కీలక నేత కరాటం రాంబాబుతో వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ.100 కోట్లు సంపాదించాడనే విషయంతోపాటు, తరచూ వివాదాస్పద నేతగా మీడియాలో హాట్ టాపిక్గా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు.. అందుకు సంబంధించిన ఓ వీడియో చూసి, మరో టీడీపీ నేత ఫోన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్, జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య సాగిన సంభాషణ శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదేమి దోపిడీ అన్నట్టు టీడీపీ నేత ఉమా జనసేన నేతను ప్రశ్నించడం.. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా అని ఆరా తీయడం.. తమకూ చాలా ఇబ్బందిగా ఉందని జనసేన నేత చెప్పడం.. ఏడాదిగా ఏ ఒక్కరూ తనతో మాట్లాడలేదని బదులివ్వడం.. కూటమి పారీ్టల్లో హాట్ టాపిక్గా మారింది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రధానాంశాలు.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు: రాంబాబు గారూ.. బాగున్నారా.. ఎక్కడ ఉన్నారు.. ఏదో యూట్యూబ్లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకు వచ్చారు. సంవత్సరంలోనే వంద కోట్లంటే దేశ చరిత్రలోనే గొప్ప విషయం. జనసేన కీలక నేత కరాటం రాంబాబు: ఇప్పుడు వ్యవస్థ అంతా పాడైపోయింది. ఉమా: సంవత్సరంలోనే ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు.. ఇంకా నాలుగేళ్లు ఉందిగా? కరాటం: నాలుగేళ్లు ఉండటమేమిటండీ.. చెడ్డ పేరు తెచ్చుకోవడమేమిటండీ. పార్టీకి ఇంత డ్యామేజీ. ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చినప్పుడు కేకలు వేస్తూనే ఉంటాను. అల్లరి ఎక్కువగా జరుగుతోంది.. ఉమా గారు.. మీరు ఎక్కడ ఉన్నారండీ.. ఉమా: నా మీద 82 కేసులున్నాయి కదా.. కోర్టు పని మీద రాజమండ్రికి వచ్చాను. ఇదంతా యూట్యూబ్లో చూసి ఎలా ఉన్నారు.. ఏమిటని అడుగుదామని ఫోన్ చేశాను. చాలా కష్టపడి మీరు తీసుకువచ్చి పెట్టారు. అందరిని కలుపుకుని మీరు కూడా అంతా తగ్గి ఒప్పించారు. కరాటం: ఇబ్బందిగానే ఉందండి. మాకున్నదే దానం చేశాం.. ఎప్పడూ చెయ్యి చాచడం అంటే తెలియదండీ.. కంట్రోల్ చేస్తున్నానండి. మళ్లీ మాములు స్థితికి తీసుకురావాలి. కూటమి అంతా దెబ్బ తినేస్తుంది. ఉమా: ఇదంతా పవన్ కళ్యాణ్కు తెలుస్తుంది కదా.. కరాటం: ఏమోనండి.. మరీ ఏం జరుగుతుందో.. ఉమా: మిమ్మల్ని కూడా అడగటం లేదా? కరాటం: ఇప్పటి వరకు నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఉమా: అసలు రాంబాబు గారు ఎలా ఉన్నారని గానీ, ఏమిటని గానీ.. కరాటం: ఇప్పటి వరకు అసలు ఏ ఫోన్ రాలేదు. వాళ్లు ఫోన్ చేయనప్పుడు నేను కూడా సైలెంట్గానే ఉన్నానండి. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు పని చేసిపెట్టాను. ఆ సోంబాబు ఏం చేశాడు కోటి రూపాయలు తీసుకున్నానని పెట్టాడు. ఉమా: ఆ.. అదంతా పట్టించుకోకండి.. కరాటం: జైలులోకి వెళ్లిపోతాడంటే కాపాడింది నేనండి.. ఉమా: అవునండీ.. నాకు తెలుసండీ.. కలుద్దాం.. అటు వైపు వచ్చినప్పుడు కలుద్దామండీ.. కరాటం: అలాగేనండీ.. -
జిమ్లో బిగ్బాస్ బ్యూటీ ఇనయా.. స్విమ్మింగ్ పూల్లో రకుల్ ప్రీత్ సింగ్ చిల్!
జిమ్లో చెమట్చోడుస్తున్న ఇనయా సుల్తానా..స్విమ్మింగ్ చేస్తూ చిల్ అవుతోన్న రకుల్ ప్రీత్ సింగ్..పార్టీలో మెరిసిన విశ్వంభర్ బ్యూటీ మౌనీరాయ్..మహబలిపురంలో బిగ్బాస్ బ్యూటీ దివి..బీచ్లో డాగ్తో ఆడుకుంటోన్న బిగ్బాస్ అశ్విని శ్రీ.. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Satya Sri (@me_satyasri) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
రేయ్.. ఎవరురా మీరంతా?
ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న నగరం.. బెంగళూరు(కర్ణాటక). వర్షాలు.. వరదలు, ట్రాఫిక్ రద్దీ, లైంగిక వేధింపులు, భాష ప్రతిపాదికన దాడుల ఘటనలు ఏవో ఒకటి నగరాన్ని నిత్యం వార్తల్లో ఉండేలా చేస్తున్నాయి. ఈ తరుణంలో.. మరో తరహా ఘటనలు ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారి తీస్తున్నాయ్.. నోయెల్ రాబిన్సన్, యూనెస్ జారో.. ఈ ఇద్దరూ ఆషామాషీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్లకి. అయితే తాజాగా ఈ ఇద్దరికీ బెంగళూరులోనే చేదు అనుభవం ఎదురైంది. వేర్వేరు ఘటనలో వీళ్లిద్దరు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చింది.జర్మన్ టిక్టాకర్ నోయెల్ రాబిన్సన్.. గుబురు జుట్టేసుకుని జనం మధ్య డ్యాన్సులు వేస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముంబై, ఢిల్లీ, కోల్కతా సహా పలు నగరాల్లో ఇప్పటికే వీడియోలతో భారతీయులకూ దగ్గరయ్యాడు. అయితే.. బెంగళూరు వీధుల్లో సంప్రదాయ పంచెకట్టులో డాన్స్ చేస్తూ వీడియో చేయబోయాడు. దీంతో జనం భారీగా గుమిగూడారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ పేరుతో అతన్ని స్టేషన్కు లాక్కెళ్లారు. ఆ సమయంలో అతనితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. తీరా పీఎస్కు తీసుకెళ్లాక ఓ పావు గంట తర్వాత అతని నుంచి వివరణ తీసుకుని.. జరిమానా విధించి వదిలేశారు. దీనిని అంతే తేలికగా తీసుకున్న నోయెల్.. దానిని ఓ ఫన్నీ వీడియోగా ప్రమోట్ చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Noel Robinson (@noel)మరో ఘటనలో.. పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ యూనస్ జారో నగరంలోని చర్చి స్ట్రీట్ వద్దకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే అతని రాకతో అక్కడ జనం గుమిగూడారు. ఇంతలో సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతన్ని పీఎస్కు తరలించి.. ఫైన్ విధించి పంపించారు. ఆ సమయంలోనూ అతను వాళ్లతో షేక్ హ్యాండ్ ఇస్తూ మరో ఫొటో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Younes Zarou (@youneszarou)ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 9వ తేదీన బ్రిటిష్ మ్యూజీషియన్ ఇద్ షరీన్ రోడ్డు మీద ప్రదర్శన ఇస్తుండగా.. కుబ్బన్ పోలీసులు అంతరాయం కలిగించి అక్కడి నుంచి వెళ్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అటు ఫ్యాన్స్తో పాటు అతిథి దేవోభవకు బెంగళూరు పోలీసులు తూట్లు పొడిచారంటూ ఇటు నెటిజన్లు నగర పోలీసుల తీరుపై మండిపడ్డారు.International artist @edsheeran was stopped playing in #Bangalore at church street. Even though, he had the permission. Literally! The cops pulled the plug. Damn sad! #Karnataka pic.twitter.com/C0F9tdm26g— Imran Khan (@KeypadGuerilla) February 9, 2025 అయితే.. పోలీసులు మాత్రం తమ అనుమతులు లేకుండా రోడ్లపై అలాంటి షోలను అనుమతించమని.. జనం గుమిగూడి జరగరానిది ఏదైనా జరిగితే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో జరిగిన తొక్కిసలాట ఘటన.. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో.. కర్ణాటక ప్రభుత్వం క్రౌడ్ కంట్రోల్ బిల్ - 2025 తెర మీదకు తెచ్చింది. ఈ రకమైన ఈవెంట్లు గనుక అనుమతులు లేకుండా నిర్వహిస్తే.. గరిష్ఠంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా విధించాలని ఈ చట్టం తేబోతోంది. -
రెడ్బుక్ అరాచకం ఖాకీల క్రౌర్యం
జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. టీడీపీ ముష్కర మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాష్టీకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. అధికారం చేజిక్కిన రోజు నుంచి ప్రభుత్వ భవనాల శిలాఫలకాల ధ్వంసాలతో ప్రారంభమైన ఆటవిక హింసను పదమూడు నెలలుగా కొనసాగిస్తున్నారు. వీరి చర్యలను అడ్డుకునేందుకు సాహసించలేక సామాన్య ప్రజలు మౌనంగా రోధిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో నెలల కాలంగా జైల్లో ఉండేలా చేస్తున్నారు. మరో వైపు రాజకీయ విమర్శల నేపథ్యంలో పచ్చమూకలు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో పోలీసుల సాక్షిగా విధ్వంసం సాగించినా ఇంత వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీరిని పరామర్శించేందుకు వచ్చే మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలకు తెరతీశారు. సాక్షిప్రతినిధి, నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు ‘నారా’ ఆటవిక కుట్రలకు తెర తీశారు. రెడ్బుక్ అరాచకానికి.. ఖాకీల పైశాచికం తోడు కావడంతో జిల్లాలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా పర్యటన ఆగదని స్పష్టం కావడంతో పోలీస్ యంత్రాంగం పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఆంక్షలు, బెదిరింపులతో భయానక వాతావరణం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఎవరూ వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి వెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇప్పటి వరకు జరిగిన జగన్ పర్యటనల కంటే మిన్నగా నెల్లూరుకు ఉప్పెనలా జన ప్రభంజనం పోటెత్తే అవకాశం ఉందని చెప్పడంతో కొత్త కుట్రలకు తెర తీశారు. జిల్లా జైల్లో ఉన్న ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు వస్తున్న వైఎస్ జగన్ పర్యటనకు అనుమతులిచ్చిన పోలీసులు తాజాగా కాకాణిని పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం నారా కుట్రలకు అద్దం పడుతోంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కే యత్నం ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు కూటమి సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితి సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా పరిగణించి హత్యాయత్నాలు, దాడులతో భయానక వాతావరణం నెలకొల్పడమే కాకండా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతూ వికట్టహాసం చేస్తోంది. ప్రభుత్వం చేతిలో కీలు»ొమ్మలుగా మారిన ఖాకీలు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపడమే ప్రథమ కర్తవ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో పాత నేరస్తులు, రౌడీïÙటర్లు, అసాంఘిక శక్తులు పేట్రేగిపోతుండటంతో ప్రజలు అభద్రతా భావంతో బతుకుతున్నారు. పోలీస్ శాఖ పూర్తిగా కూటమి ప్రజాప్రతినిధిల కనుసన్నల్లో పనిచేస్తుండడంతో జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. హత్యలు, అత్యాచారాలతో రౌడీ మూకలు పేట్రేగి పోతున్నా పట్టించుకోని ఖాకీలు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అదుపు తప్పిన శాంతిభద్రతలు జిల్లాలోని కొందరు పోలీసు అ«ధికారులు రెడ్బుక్ అమల్లో కనబరుస్తున్న శ్రద్ధ నేరాల అదుపులో చూపడం లేదు. దీంతో శాంతిభద్రతలు క్షీణదశకు చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుశాఖలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. పోస్టింగ్లన్నీ దాదాపు అధికా ర పార్టీ నేతలను ప్రసన్నం చేసిన వారికే దక్కాయి. దీంతో సదరు పోలీసు అధికారులు తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పిందే తడువుగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమపై దాడు లు, దౌర్జన్యాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నేతలు పోలీసులకు చేస్తోన్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నా యి. అందుకు శంకరనగరంలో జరిగిన దౌర్జన్యకాండే నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరంలో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. ఆమెపై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపారు. జైలునుంచి బయట కు వచ్చినా వారిపై దౌర్జన్యాలు అధికమవడంతో అనేకమంది ఊరు విడిచి వెళ్లిపోయారు. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పుట్టగొడుగుల్లా బెల్టుషాపులు వెలిశాయి. గంజాయి, మద్యం 24 గంటలూ అందుబాటులో ఉండడంతో మత్తులో నేరాలు జరుగుతున్నాయి. గచడిన ఏడాదికాలంలో జిల్లాలో 42కుపైగా హత్యలు, 165కుపైగా హత్యాయత్నాలు, 33కుపైగా బాలికలపై లైంగికదాడులు, దాడియత్నాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. ఒక్క నెల్లూరు నగరంలోనే గడిచిన ఏడునెలల్లో 13కుపైగా హత్యలు జరగడం శాంతిభద్రతలు ఏస్థాయిలో క్షీణదశకు చేరాయో ఇట్టే అవగతమవుతోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి పెద్దల పైశాచిక చర్యలపై ప్రజల్లో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్లపరెడ్డి ఇంట్లో విధ్వంసం చేసినా దిక్కులేదు జిల్లా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా కూటమి నేతలు నీచ సంస్కృతికి తెరలేపారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతో వందలాది మంది టీడీపీ ముష్కర మూకలు సాగించిన విధ్వంసంపై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవడంలో మీనవేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 7న రాత్రి వేళ ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకునే సమయంలో కూడా విధ్వంసకారులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. విధ్వంసం జరిగిన తీరు, చేసిన వ్యక్తులకు సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రసన్నకుమార్రెడ్డి దర్గామిట్ట పోలీసులకు అందజేíశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు కేసు నమోదులో తీవ్ర జాప్యం చేశారు. ఆరు రోజుల అనంతరం నామమాత్రపు సెక్షన్లతో గుర్తులేని వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై ఆగమేఘాల మీద నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు మాజీ మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్యాదవ్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, మరో ముగ్గురిపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి అధికార పార్టీ నేతలపై తమ పచ్చభక్తిని చాటుకున్నారు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో జరిగిన విధ్వంసకర చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించినా పోలీసులు ఎఫ్ఐఆర్తో సరిపట్టారు. కాకాణిపై రుస్తుం కేసుతో.. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ హామీల అమల్లో అసమర్థత, అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతోపాటు స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాలను మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఎప్పటికప్పుడు ఎండగట్టుతూ వచ్చారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకయ్యారు. దీనిని జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 13 అక్రమ కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులపై కేసులు బనాయించి హక్కులను కాలరాస్తోంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ, అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఎక్సైజ్ శాఖలో చార్జిషిట్ వేసిన కేసుల్లో సైతం పునరి్వచారణ పేరుతో కాకాణిని నిందితుడిగా చేర్చుతూ కేసుల పరంపర కొనసాగిస్తూ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోంది. ఆయన జైలు నుంచి బయటకు వస్తే మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావించి సంబంధం లేని కేసుల్లో ఆయన పేరును ఇరికించి 67 రోజులుగా వేధిస్తోంది. ఆయా కేసుల్లో బెయిల్ రాకుండా పోలీస్ కస్టడీ విచారణ పేరుతో అడ్డుకుంటోంది. సీడీ ఫైల్స్ లేకుండానే పోలీసులు కస్టడీ వేస్తూ కాకాణిపై వేధింపుల పర్వాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇదే కేసులోనే మాజీ మంత్రి డాక్టర్ అనిల్కుమార్యాదవ్ను ఇరికించినట్లు తెలుస్తోంది. -
బిగ్బాస్ బ్యూటీ ఇనయా గ్లామరస్.. బేబీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా స్టైలిష్ లుక్..బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా చిల్..బేబీతో ఆడుకుంటోన్న కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి..సారా అలీ ఖాన్ బ్యూటీఫుల్ వీడియో..భర్తతో కలిసి లాస్య మంజునాథ్ ఫ్యాషన్ లుక్.. View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
చిన్నోడి డ్యాన్స్కు ఫిదా అవుతున్నారు!
పడవ స్పీడుగా దూసుకెళుతోంది.ఆ స్పీడ్కు తగినట్లుగా దిఖా చేసిన మ్యాజిక్ డ్యాన్స్ సంచలనం సృష్టించింది. ఈ ఆన్లైన్ సంచలనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.పదకొండు సంవత్సరాల ఇండోనేషియా అబ్బాయి రెయాన్ అక్రన్ దిఖా చేసిన ఐకానిక్ బోట్ డ్యాన్స్ ‘ఆరా ఫార్మింగ్’ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. తాజాగా ఈ ట్రెండ్లో సింగపూర్ నేవీ సిబ్బందితో పాటు మన ముంబై పోలీసులు (Mumbai Police) కూడా భాగం అయ్యారు.ముంబై పోలీసుల ఐకానిక్ బోట్ డ్యాన్స్ హిట్ కావడంతో, ఒరిజినల్ డ్యాన్స్ చూడని వాళ్లు ఇది చూసి ‘ఆహా’ ‘ఓహో’ అంటున్నారు.ఉన్నతాధికారులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు ఈ ఐకానిక్ బోట్ డ్యాన్స్ ట్రెండ్లో భాగం కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్లో భాగం అవుతున్నవారు స్థానిక మ్యూజిక్ను వీడియోకు జత చేస్తున్నారు.‘ఆరా ఫార్మింగ్’ అనేది ఇప్పుడు ఆన్లైన్లో పాపులర్ అయింది. కదులుతున్న కారుపై.. జనమంతా చూస్తుండగా కదులుతున్న కారుపై ముంబై మహిళ ఒకరు చేసిన ఆరా ఫార్మింగ్ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అయింది. నవీ ముంబైలోని ఖార్ఘర్లో కదులుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్పై నజ్మీన్ సుల్దే అనే 24 ఏళ్ల మహిళ చెప్పులు లేకుండా డాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. చదవండి: రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన.. ఏకంగా 170 గంటల పాటు.. నజ్మీన్తో పాటు కారు నడిపిన ఆమె ప్రియుడు అల్-ఫెష్ షేక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిద్దరితో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించినందుకు భారతీయ న్యాయ సంహిత, మోటారు వాహన చట్టం కింద వారిని అరెస్ట్ కూడా చేశారు. అల్-ఫెష్ షేక్కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని వార్తలు కూడా వచ్చాయి.🔥🚨BREAKING: This young man named Dika has taken over the Internet on all platforms for ‘legendary aura farming’ he can be seen dancing on the front of boat races in Indonesia to boost moral. The viral kid stealing hearts at Pacu Jalur, His dance isn't just moves, it's pure… pic.twitter.com/awify23gFh— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) July 7, 2025 View this post on Instagram A post shared by Nazmeen Sulde (@nazmeen.sulde) -
మేడమ్.. ఓసారి ఇటు చూడండి
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. అంటుంది చట్టం. మరి ఈ విషయంలో రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తారో చూడాలి. వైఎస్సార్ కడప జిల్లాలో ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవీరెడ్డి (MLA Madhavi Reddy) గన్మేన్ ఆమె హ్యాండ్ బ్యాగును మోస్తూ కెమెరాకు చిక్కారు.ఇటీవల రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ములాఖత్లో కలుసుకోవడానికి వెళ్లినప్పుడు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాగ్, దిండు మోశారని ఆయన గన్మేన్ను చిత్తూరు జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ చర్యను హోంమంత్రి అనిత సమర్థించారు. గన్మేన్ భద్రతకు మాత్రమేనని, అతడితో అటెండర్ పని ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. మరిప్పుడు కడప ఎస్పీ ఏ చర్యలు తీసుకుంటారు, హోం మంత్రి ఎలా స్పందిస్తారు.. అని ప్రజలు చర్చించుకుంటున్నారు. చదవండి: ఎమ్మెల్సీ నాగబాబుకు జనసేన వీరమహిళ షాక్ -
నిత్యం డ్రగ్స్.. రోజంతా మత్తులోనే
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది. అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది. శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు. గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్లేషన్తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్గానే చెబుతుంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ... గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు. దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది.