breaking news
Social Media
-
గోల్డెన్ క్రియేటర్
ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్స్టా సంస్థ బంగారు రింగ్ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్స్టా ప్రొఫైల్లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్ని ఇన్స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి. -
ఫ్యామిలీతో కాజల్ అగర్వాల్ చిల్.. ప్రియాంక చోప్రా దివాళీ సెలబ్రేషన్స్!
దీపావళి ఫెస్టివ్ వైబ్లో వితికా శేరు.. బాలీవుడ్ భామ అతియాశెట్టి లేటేస్ట్ పోస్ట్.. పింక్ డ్రెస్లో జోర్దార్ సుజాత స్టిల్స్.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ దివాళీ సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా దివాళీ వెబ్స్.. గ్రీన్ శారీలో మెహరీన్ ఫిర్జాదా స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్
బాలీవుడ్ జంట్ దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్వీర్(Ranveer Singh) దివాలీ సందర్భంగా తమ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమ ముద్దుల తనయ ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా జాగ్రత్త పడిన దీపికా, రణ్వీర్ దంపతులు ఎట్టకేలకుల తమ గారాలపట్టి దువాను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. ముద్దుగా రెండు పిలకలు, నోట్లో వేలు, అమ్మ ఒడిలో కూర్చొని రెండు చేతులూ జోడించి దణ్నం పెట్టడం ఇలా ప్రతీ ఫోటో చాలా అందంగా ఉన్నాయి. దీంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మహారాణిలా ఉంది, ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రశంసిస్తున్నారు. డిటో రణవీర్, దీపికా డింపుల్స్ వచ్చేశాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. కుమార్తె దువా దీపావళి పూజ ఫోటోలను దీపికా పంచుకోవడంపై చాలా మంది సెలబ్రిటీలు, సహనటీనటులు స్పందించారు. డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సు, రెండు చిన్ని పిలకలతో పాపాయి అందంగా ఉంది అంటూ నెటిజనులు, సో క్యూట్ అంటూ హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మురిసిపోగా, దీపికా పదుకొనే కూతురు దువా ఫోటోలకు అలియా భట్ స్పందన విశేషంగా నిలిచింది. పాప ఫోటోలకు లవ్ ఎమోజీతో తన ప్రేమను ప్రకటించింది అలియా.సబ్యసాచి దుస్తుల్లో మెరిసిన యువరాణిక్లాసిక్ గ్రేస్ కు పేరుగాంచిన దీపికా పదుకొనే, కస్టమ్ క్రిమ్సన్ సబ్యసాచి డిజైన్ దుస్తుల్లో అందంగా కనిపించారు. గోల్డ్ జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేయబడిన కస్టమ్ కుర్తా సెట్,మ్యాచింగ్ దుపట్టాతో పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా మెరిసారు. తన లుక్కు సరిపోయేలా, పచ్చలతో కూడిన పోల్కి చైన్ చెవిపోగులు , గాజులను ఎంపిక చేసుకున్నారు. ఇక దీపికతో పాటు, ఆచిన్న యువరాణి దువా కూడా సబ్యసాచి క్రియేషన్కు సరిపోయే చిన్న క్రిమ్సన్ కుర్తా, చేతితో తయారు చేసిన గోటా-పట్టి బార్డర్లతో ధరించింది. ఎర్రటి చిన్న బొట్టు, పిలకలో జంట తోకల సుందరిగా మెరిసింది. అలాగే రణ్వీర్ సింగ్ తెల్లటి కుర్తా సెట్లో నెహ్రూ జాకెట్,పసుపు రంగు షేడ్స్ ఉన్న అందమైన, పొడవైన బంగారు నెక్లెస్లో అందంగా కనిపించారు. కాగా దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ల లవ్ స్టోరీ సినీ అభిమానులకు తెలియందికాదు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ తమ ఇనీషియల్స్ను టాటూ కూడా వేయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని, వారి వారి కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. రణబీర్, అలియాభట్ను పెళ్లి చేసుకోగా, వీరికి ఒక పాప ఉంది. -
బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర లేటేస్ట్ లుక్.. బిగ్బాస్ దివి దీపావళి వైబ్స్!
ఫ్యామిలీతో హీరోయిన్ స్నేహ దీపావళి వేడుకలు..బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర దివాళీ లుక్..మెగా డాటర్ నిహారిక దీపావళి సెలబ్రేషన్స్..బిగ్బాస్ బ్యూటీ దివి దివాళీ లుక్స్..ఫ్యామిలీతో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి ..కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ దివాళీ వైబ్స్.. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
అనన్య నాగళ్ల దీపావళి సెలబ్రేషన్స్.. అమ్మ శారీలో హీరోయిన్ నభా నటేశ్!
భర్తతో కలిసి మౌనీరాయ్ దీపావళి పూజలు.. పచ్చ ఓణిలో అనన్య నాగళ్ల దీపావళి లుక్స్.. దీపావళి వెలుగుల్లో వితికా శేరు హోయలు.. అమ్మ చీరలో మెరిసిన హీరోయిన్ నభా నటేశ్.. గ్రీన్ డ్రెస్లో నిక్కీ గార్లానీ దివాళీ లుక్.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Nikkii Galrani Pinisetty (@nikkigalrani) -
‘నడుములు విరుగుతున్నాయ్!’.. ఇక్కడ 90శాతం గుంతలు..2శాతమే రోడ్లు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్కు ట్యాగ్ చేశారు. ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.Normally the Road size will be 98% and the Pothole size would be 2%.In this photo shot on 17th October 2025 in Bengaluru, Road is only 2% and LakeHole is 98% 🙏@GBAChiefComm ji, can we make Varthur-Gunjur Pothole Free?#FI pic.twitter.com/pYYLKpG63O— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) October 18, 2025 -
కారులో వచ్చి 50 కోతులు కొన్న వ్యాపారి.. ఎన్ని లక్షలంటే?
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్ హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు ఆదివారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎర్టిగా కారులో ఒకరు 50 కోతులకు ఓ కాంట్రాక్టర్కు రూ.2 లక్షల వరకు సొమ్ము చెల్లించి తరలించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టుకున్న కోతులను ఏటూరునాగారం అడవుల్లోకి తర లించాల్సిన కాంట్రాక్టర్ వ్యాపారికి విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు ఓ జర్నలిస్టు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా.. కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికా ర్డు అయినట్లు చర్చ జరుగుతోంది. ఈవిషయ మై సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. తనకు కూడా సమాచారం అందిందని, సోమ వారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాల యంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కోతు లను విక్రయించినట్టు తేలితే సదరు కాంట్రాక్ట ర్పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
Telangana: పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్పే, గూగుల్పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్ను వేలాడదీసి దానిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్హ్యాండ్తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
నువ్వో డ్రగ్ డీలర్
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత. కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు. -
మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. దివాళీ పార్టీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే !
బ్లాక్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్.. దివాళీకి మెరిసిపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. ఫస్ట్ దివాళీ పార్టీ అంటోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. పారిస్లో చిల్ అవుతోన్న మాళివిక మోహనన్.. దివాళీ మూడ్లో చాహల్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
కచ్చా బాదం సింగర్ గుర్తున్నాడా? గుడిసెలో నుంచి కొత్తింట్లోకి!
ఫేమస్ అవడం ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కొందరు ఎంత కష్టపడ్డాసరే పెద్దగా గుర్తింపు అందుకోరు. మరికొందరు ఏం చేయకపోయినా సరే ఇట్టే ఫేమస్ అవుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం! వచ్చిన ఫేమ్ను కాపాడుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఇండస్ట్రీకి చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. సోషల్ మీడియాలోనూ అంతే.. సడన్గా కొందరు వైరలవుతుంటారు.. అంతలోనే కనుమరుగవుతుంటారు. అలా అప్పట్లో కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్ బాగా పాపులర్ అయ్యాడు.పాత సామాన్లకు పల్లీలుపశ్చిమ బెంగాల్కు చెందిన భూబన్ (Bhuban Badyakar).. పాత సామాన్లు, పగిలిన వస్తువులకు పల్లీలు ఇస్తానంటూ వీధుల్లో తిరిగేవాడు. పాట రూపంలోనే పల్లీలు అమ్ముకున్నాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్కవడంతో బాగానే డబ్బు సంపాదించాడు. ఇకపై పల్లీలు అమ్ముకోను, సింగర్గా కొనసాగుతా.. నా క్రేజ్ చూసి కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందని పోలీసులను ఆశ్రయించాడు. అతడి బిల్డప్ చూసి అందరూ అవాక్కయ్యారు.కారు కొన్నాక యాక్సిడెంట్కొందరు విమర్శించారు కూడా! దీంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. ఆర్టిస్ట్గా కొనసాగుతానని, అవకాశాల్లేనప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకోక ఇంకేం చేస్తానని మాట మార్చాడు. అప్పటికీ ఆగలేదు.. సంతోషం, డబ్బు రెండూ ఎక్కువైపోయేసరికి కారు కొన్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్ అయి కొద్దిరోజులు ఆస్పత్రిపాలయ్యాడు. తర్వాత అడిగినవారికల్లా అప్పులిచ్చుకుంటూ పోయి వసూలు చేయలేకపోయాడు. కొంతకాలంగా కనిపించని సింగర్చూస్తుండగానే సంపాదించినదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలాకాలంగా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఓ యూట్యూబర్ పుణ్యమా అని అతడెలా ఉన్నాడో తెలిసింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న భూబన్ అదే స్థానంలో ఇల్లు కట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. వైరల్ సాంగ్ వల్ల నాకు బాగా సంపాదించాను. కానీ, ఆ పాట కాపీ రైట్స్ ఇప్పుడు నావి కావు, ఓ కంపెనీ సొంతం చేసుకుంది. అలా అని నా జీవితం అక్కడితో ఆగిపోలేదు.జీవితం మెరుగైందిజనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్కు, రియాలిటీ షోలకు రమ్మని పిలుస్తున్నారు. నా జీవితం కాస్త మెరుగుపడింది. జనాలు నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భూబన్ గౌరవంగా బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి ఇంట్లో అవార్డులతో పాటు భూబన్ పెయింటింగ్ ఉండటం విశేషం.చదవండి: దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు! -
బ్లూ శారీలో సీతారామం బ్యూటీ.. ఆదితి రావు హైదరీ స్టన్నింగ్ లుక్!
బ్లూ శారీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్.. హీరోయిన్ శ్రియా శరణ్ డిఫరెంట్ అవుట్ఫిట్.. సింగర్ శ్రేయా ఘోషల్ దివాళీ సెలబ్రేషన్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సోనాలి బింద్రే హోయలు.. స్టన్నింగ్ లుక్లో ఆదితి రావు హైదరీ.. View this post on Instagram A post shared by shreyaghoshal (@shreyaghoshal) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
కెనడాలో రీతూ వర్మ చిల్.. రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్!
కెనడాలో చిల్ అవుతోన్న హీరోయిన్ రీతూ వర్మ..పదహారణాల అమ్మాయిలా ముస్తాబైన హీరోయిన్ మాధవీలత..హీరోయిన్ రెజీనా స్టన్నింగ్ అవుట్ఫిట్..కలర్ఫుల్ డ్రెస్లో పాలక్ తివారీ హోయలు..శారీలో సింగర్ గీతా మాధురి ట్రెడిషనల్ లుక్.. View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Leader ll Runs NGO ll (@actressmaadhavi) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) -
రాకేష్ కిషోర్పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్లో మహిళతో రాసలీలలు..
ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా ఓ జడ్జీ.. లైవ్లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన చండీగఢ్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్లైన్లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్లో వీడియో మోడ్ను ఆన్ చేసిన సంగతి మర్చిపోయాడు.ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు. -
తాలిబాన్ల చేతిలో.. పాక్కు ఘోర అవమానం
పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో.. కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ ఔట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్హార్ ప్రావిన్స్లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో అఫ్గన్ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్ వాసి ఒకరు తెలిపారు.బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. Viral video: Afghan Taliban displaying pants of Pakistani Army soldiers - who were captured by Afghanistan, in the recent border clashes.Why does Pakistani Army always surrender with their pants open? 🤔pic.twitter.com/JqcKw28aou— Treeni (@TheTreeni) October 15, 2025 Again #Pakistan Begging For Cease fire from #Afghanistan .Wait for tomorrow and they will claim victory ! Afghans Celebrating with the pants of their Pak army men hanging in their Bazaar. Pak army is getting battered from all sides .#PakistanArmy pic.twitter.com/HN0Rgz45sc— Meena K (@Raagmaand) October 15, 2025 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్ లైన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. మరోవైపు.. అఫ్గనిస్తాన్ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి. కాబూల్లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.ప్లీజ్.. మధ్యవర్తిత్వం వహించరా?కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్, పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి! -
‘తెర’ వెనుక తెగిపోయిన కల
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని శాంతి నగర్, ఆ రోజు అక్టోబర్ 12. ఆ మధ్య తరగతి కుటుంబంలో ఎప్పుడూ ఉండే ఆనందం, నవ్వులు.. ఆరోజు భయంకరమైన నిశ్శ బ్దంలో కొట్టుకుపోయాయి. తండ్రి ఒక రియల్ ఎస్టేట్ డీలర్, తల్లి గృహిణి, 12వ తరగతి చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు.. ఇంతే ఆ కుటుంబం. పద్నాలుగేళ్ల ఆ బాలునికి ఈ తరం పిల్లల్లాగే సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది. తన గదిలోనే ఏదో కొత్త వీడియో తీయాలనే ఉత్సాహంతో ఉన్నా డు. అప్పుడు తెలియదు, ఆ ఉత్సాహమే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని వేళ, తన గదిని ఓ చిన్న స్టూడియోలా మార్చుకున్నాడు. మొబైల్ ఫోన్ను ఒక చోట పెట్టి, ’ఆత్మహత్యను అనుకరించే’ దృశ్యాన్ని రికార్డు చేయడం మొదలు పెట్టాడు. తెరపై చూపించే ఉత్కంఠను తానూ అనుభూతి చెందాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నంలో, బాలుడు నిల్చున్న కుర్చీపై నుంచి కాలు జారింది. అంతే.. క్షణాల వ్యవధిలో అంతా మారిపోయింది. బాలుడికి ఊపిరి అందలేదు. కొద్దిసేపటి తరువాత, తల్లిదండ్రులు గదిలోకి వచ్చి చూడగానే.. వారి గుండెలు బద్దలయ్యా యి. ఆందోళనతో వెంటనే దగ్గర్లోని ఆసు పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ సంఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఆ బాలుడు వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి ఉండవచ్చు. వీడియో ఫుటేజీ లోని బాలుని హావభావాలు చూస్తే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది’.. అని పేర్కొన్నారు. బీజేఆర్ఎం ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి బాలుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమా దవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. -
హీరోయిన్ ప్రణీత స్టన్నింగ్ లుక్.. బిగ్బాస్ బ్యూటీ ట్రేడిషనల్ లుక్!
అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత హాట్ ట్రీట్..బర్త్ డే డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకున్న దివ్యాంగణ సూర్యవన్షీ..బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ ట్రేడిషనల్ లుక్..బ్లాక్ శారీలో హీరోయిన్ కాజోల్ గ్లామరస్ లుక్స్..థామా ప్రమోషన్స్లో బిజీ బిజీగా రష్మిక.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’
జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా కొన్ని రోజులు దూరంగా ఉంటానని ప్రకటించారు. కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని కోడ్లను మరింత సమర్థవంతంగా సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇటీవల కాలంలో ఎక్స్ వంటి సామాజిక మధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్న వెంబు తాను రన్ చేయాలనుకునే కొన్ని కోడ్లను మెరుగుపరిచేందుకు కొంతకాలం ఆన్లైన్ ఎంగేజ్మెంట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పడం కంటే మనమే ఆ పనిని సమర్థంగా చేసి చూపించాలన్నారు. తన సోషల్ మీడియా అనుచరులకు ఇలా కఠినమైన పరిమితిని విధించవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని చెప్పారు.ఇటీవల కాలంలో కంపెనీ తయారు చేసిన దేశీయ ఆన్లైన్ కమ్యునికేషన్ ప్లాట్ఫామ్ అరట్టై యాప్కు ఆదరణ పెరుగుతోంది. ఆ యాప్ను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా తాను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలుఅరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
అలసిపోయా.. ఇక ఆడలేను
బెంగళూరు: ఆడాలని ఉన్నా ఆరోగ్యం, శరీరం సహకరించడం లేదని, అందుకే భారమైన హృదయంతో ఆటను మానేశానని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లా మణిపాల్ పట్టణంలో ఆమె మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఔత్సాహిక క్రీడాకారులకు తర్పీదు ఇచ్చేందుకు కూడా తనకు ఆసక్తి లేదన్నారు. హైదరాబాద్లో బ్యాడ్మింటన్ శిక్షణ ఇచ్చేందుకు మంచి అకాడమీలు ఉన్నాయని చెప్పారు. ‘శిక్షణ ఇవ్వడం చాలా కష్టమైన పని. అది ఆడడం కన్నా కష్టం. 10–15 గంటలపాటు నిలబడి శిక్షణ ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. అయితే పిల్లలకు ఆటల్లో ఆసక్తి కలిగించేలా పని చేస్తున్నా’ అని వివరించారు. పిల్లలు సోషల్ మీడియాకు స్వస్తి చెప్పి అన్ని రకాల క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. గతంలో తాను జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, 25 ఏళ్లు కుటుంబం, ఆహారం, స్నేహితులు అందరికీ దూరమైనట్లు తెలిపారు. -
ఒంగోలులో నకిలీ బీరు కలకలం
ఒంగోలు టౌన్: నగరంలో నకిలీ బీరు బాటిల్ కలకలం సృష్టించింది. నగర శివారులోని కొప్పోలులో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో మంగళవారం ఒక కస్టమర్ మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన అతడు ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షించాడు. తొలుత మాన్షన్ హౌస్ లిక్కర్ తీసుకొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మద్యం బాటిల్ వివరాలు వచ్చాయి. ఆ తరువాత బీర్ బాటిల్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్కు స్కాన్ చేశాడు. ఎర్రర్ అని వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసిన సదరు కస్టమర్ ఒంగోలులోని వైన్ షాపుల్లో నకిలీ బీర్ విక్రయిస్తున్నారని, మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. నకిలీ బీరు తాగుతున్నామంటూ మందుబాబులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్లో కేవలం నకిలీ లిక్కర్ను మాత్రమే గుర్తించే సౌకర్యం ఉందని, బీరు బాటిళ్లను గుర్తించే సౌకర్యం లేదని ఎక్సైజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కేవలం లిక్కర్ బాటిళ్ల స్కానింగ్కు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. బీరు బాటిళ్ల మీద కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ యాప్కు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 🚨 Public Alert! Be Cautious! 🚨A shocking incident has come to light at Koppole Road, Ongole.At Sai Wines, when people scanned the Mansion House QR code, it worked successfully but when they scanned a beer bottle, the code showed an error on the official AP consumer website.… pic.twitter.com/uTOsi9ilqc— VoiceOfAndhra (@VoicesOfAndhra) October 14, 2025 -
న్యాయం గెలిచింది!
సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్లో ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. కూటమి ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టులా మారింది. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను యావత్ ప్రజానీకం తప్పుపడుతోంది. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడం ప్రజాస్వామ్యంలో సరికాదని సూచిస్తోంది. సంక్షేమం విస్మరించి వేధింపులకు దిగడం పద్ధతి కాదని స్పష్టం చేస్తోంది. సర్కారు విధానాలను ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికీ ఉంటుందని వెల్లడిస్తోంది.సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టును తిరుపతి మూడో అదనపు జూనియర్ జడ్జి తిరస్కరించారు. 41 నోటీసులు సరిపోతాయని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై తిరుపతి వాసులు మండిపడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించి సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 41 నోటీసులు ఇచ్చి విడిచి పెట్టాల్సిన కేసులో సోషల్ మీడియా కార్యకర్తలు నవీన్, చంద్రశేఖర వెంకటేష్ని టెర్రరిస్ట్లను అరెస్ట్ చేసినట్టు ముసుగులేసి, రోడ్లపై నడిపిస్తూ కోర్టులో హాజరుపరచంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వారిద్దరి రిమాండ్ను న్యాయస్థానం మంగళవారం రాత్రి తిరస్కరించింది. అణగదొక్కడం సరికాదు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకుంటే ప్రతిపక్ష పార్టీ ఎండగడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. విమర్శలను పాలకులు సానుకూలంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా తప్పులను ఎత్తి చూపిన వారిని కేసులతో వేధించడం, ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు యతి్నంచడం సరికాదని వెల్లడిస్తున్నారు. బెల్ట్ షాపులను అరికట్టడం వదలేసి ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదల తిరుపతి లీగల్: తిరుపతి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నాయకుడు బృంగి నవీన్ అలియాస్ నాని, తిరుపతి, ఎంఆర్ పల్లి, శాంతినగర్కు చెందిన సి.వెంకటేష్ పై ఈస్ట్ పోలీసులు నమోదు చేసిన కేసులో వ్యక్తిగత పూచీ కత్తుపై ఇద్దరినీ విడుదల చేస్తూ తిరుపతి మూడవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు యుగంధర్ రెడ్డి, కొత్తపల్లి విజయ్కుమార్, ఐ.చంద్రశేఖర్ రెడ్డిలు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వు ప్రకారం ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో 41 ఏ నోటీసు ఇవ్వాలని తీర్పు ఉండగా పోలీసులు రిమాండ్కు తీసుకురావడం చట్టవిరుద్ధమన్నారు. వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే! తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం సేవించిన కొందరు రోడ్డుపై పడి ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టకి చెందిన నవీన్, చంద్రశేఖర్ వెంకటేష్ వైరల్ చేశారని కూటమి నేతలు ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి చేశారు. కూటమి నేతల ఒత్తిడితో సోమవారం వారిద్దరిపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రాత్రి రిమాండ్కు తరలించారు. రిమాండ్ను సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. దీంతో రిమాండ్ను తిరస్కరిస్తూ మూడో అదనపు జూనియర్ జడ్జి తీర్పు ఇచ్చారు.రెడ్బుక్ రాజ్యాంగం అమలు పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరంకుశంగా రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతిలో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారని, అక్రమంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని వెల్లడిస్తున్నారు. పోలీసులు సైతం కూటమి నేతల కళ్లలో ఆనందం చూసేందుకు ౖవైఎస్సార్సీపీ సోషల్ మీడియా సభ్యులు బృంగి నవీన్, చంద్రశేఖర్ వెంకటే‹Ùను అదుపులోకి అవమానించారని వివరిస్తున్నారు. ఐటీ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తిని టెర్రరిస్టు మాదిరిగా ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచారని విమర్శిస్తున్నారు. -
పాపం మెలోనీ! అటు ట్రంప్.. ఇటు ఎర్డోగాన్
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ శర్మ్ షేక్-ఎల్ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే.. Trump to Giorgia Meloni:“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“pic.twitter.com/YZEdsZjwSU— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో జరిగిన సంభాషణా వైరల్ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె. Erdogan to Meloni in Cairo:“You look great but I have to get you to stop smoking”🇮🇹🇹🇷 pic.twitter.com/f1CzICF1tq— Visegrád 24 (@visegrad24) October 13, 2025ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్తో కలిసి స్మోక్కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు.. టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చూడండి: బాబోయ్.. ఇదేం భజన?: పాక్ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్ -
సిటీ పోలీసుల ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’
సాక్షి, సిటీబ్యూరో: ‘సహాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పకు. అతడిని ముగ్గురికి సహాయం చేయమని చెప్పి ఆ ముగ్గురూ మరో ముగ్గురికి చొప్పున సహాయం చేసేలా ప్రోత్సహించు...’ సినీ నటుడు చిరంజీవి కథా నాయకుడిగా నటించిన స్టాలిన్ సినిమాలోని కాన్సెప్ట్ ఇది. నగర కొత్త కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ దీన్ని పోలిన వినూత్న కార్యక్రమానికి డిజైన్ చేశారు. ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ పేరుతో సోషల్మీడియా కేంద్రంగా సోమవారం ప్రారంభించారు. తొలి దశలో హెల్మెట్, సీట్బెల్ట్ ధారణపై దృష్టి పెట్టిన కమిషనర్ వాటి వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.సోషల్మీడియా, వైరల్... ఇవే ట్రెండ్స్ రహదారి భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై వాహనచోదకులకు అవగాహన కల్పించడానికి కొన్నేళ్లుగా ట్రాఫిక్ విభాగం వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల కాలంలో సోషల్మీడియా ట్రెండ్ నడుస్తోంది. అందులో తమ ఫొటోలు, వీడియోలు వైరల్ కావాలని ఆశించే వాళ్లు అనేక మంది ఉంటున్నారు. ఈ ధోరణి యువతలో ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వాహనచోదకులు.. ప్రధానంగా యువతలో అవగాహన పెంచడానికే సజ్జనర్ ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను డిజైన్ చేశారు. అనునిత్యం ఏదో ఒక ఫొటో, వీడియో, కామెంట్లను పోస్టు చేసే నెట్జనుల దృష్టిని రహదారి భద్రత వైపు మళ్లించడానికి, ఈ అంశాలను ప్రచారం కల్పించడానికి అనువుగా దీన్ని కమిషనర్ రూపొందించారు. ప్రయాణం ప్రారంభానికి ముందు... దీనికి సంబంధించిన విధివిధానాలను కొత్వాల్ సజ్జనర్ సోమవారం తన అధికారిక ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ ఛాలెంజ్లో భాగంగా వాహనచోదకుడు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు హెల్మెట్ (ద్విచక్ర వాహనం), సీట్బెల్ట్ (తేలికపాటి వాహనం) కచ్చితంగా ధరించాలి. అలా తాను రహదారి భద్రత నిబంధనలు పాటిస్తున్నట్లు చిన్న ఫొటో లేదా వీడియో తీసుకోవాలి. దాన్ని తమ సోషల్మీడియా ఖాతా ద్వారా ‘సేఫ్ రోడ్ ఛాలెంజ్’ అనే హ్యాష్ట్యాగ్ ద్వారా షేర్ చేయాలి. ఆ సమయంలో తమ ఫ్రెండ్స్ లిస్ట్ లేదా ఫాలోవర్స్లో ఉన్న ముగ్గురు స్నేహితులు లేదా బంధువుల్ని ఎంచుకోవాలి. వాళ్లు సైతం ఈ ఛాలెంజ్ను స్వీకరించేలా ట్యాగ్ చేస్తూ ప్రోత్సహించాలి. గత వారమే చిరంజీవితో భేటీ... తొలిదశలో హెల్మెట్, సీట్బెల్ట్ వాడకం పెంచేలా, వీటిపై అవగాహన కలిగేలా, కలిగించేలా నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ చేపట్టిన ఈ ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ను కొనసాగించనున్నారు. దశల వారీగా వివిధ రకాలైన రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎన్స్ఫోర్స్మెంట్తో (జరిమానాల విధింపు) పాటు ఎడ్యుకేషన్కు సమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్న కొత్వాల్ ఈ దిశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘హ్యాష్ట్యాగ్ సేఫ్ రోడ్ ఛాలెంజ్’ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలోని కాన్సెప్ట్ను పోలి ఉంది. గత శనివారం చిరంజీవితో పాటు ఆయన కుమార్తె సుస్మిత బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో సజ్జనార్ను మర్యాదపూర్వగా కలిసి భేటీ కావడం గమనార్హం. భద్రత అనేది నిత్యనూతన ఫ్యాషన్: విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ రహదారి భద్రత అనేది ఎప్పటికీ పాతబడని, నిత్యనూతనంగా ఉండే ఫ్యాషన్. ప్రతి ప్రయాణం మిమ్మల్ని, మీరు ప్రేమించే వారిని సురక్షితంగా ఉంచాలనే తీర్మానంతోనే మొదలవ్వాలి. నగరవాసులం అంతా కలిసి 2025లో భద్రతనే ఓ వైరల్ ట్రెండ్గా మారుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్లో ఉత్సాహంగా పాల్గొనాలి. ఈ విధంగా ఒకరి నుంచి మరొకరికి స్ఫూర్తిపొందుతూ, యువతలో ట్రాఫిక్ నియమాలపై గౌరవాన్ని పెంచాలి. సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను ఓ అలవాటుగా మార్చా లన్నదే ఈ ఛాలెంజ్ ప్రధాన లక్ష్యం. ఇది ప్రతి ప్రయాణానికి ముందు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం, హెల్మెట్ కచ్చితంగా ధరించడం, ఈ నియమాలను పాటించేలా ఇతరులకూ స్ఫూర్తినివ్వడం... ఈ మూడు ముఖ్యమైన సూత్రాలను గుర్తు చేస్తుంది. ఈ డిజిటల్ ఛాలెంజ్లో ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయడం ద్వారా, నగర రహదారులపై భద్రత, బాధ్యతతో కూడిన సంస్కృతిని నిర్మిద్దాం. -
పాలక్ తివారీ బర్త్ డే సెలబ్రేషన్.. బంగారంలా మెరిసిపోతున్న విష్ణుప్రియ!
బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న పాలక్ తివారీ.. బంగారం లాంటి శారీలో మెరిసిపోతున్న విష్ణుప్రియ.. దివాళీ మూడ్లో హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ సన్నింగ్ లుక్.. ఎల్లో డ్రెస్లో ఇంద్ర బ్యూటీ సోనాలి బింద్రే..కలర్ఫుల్ శారీలో అనసూయ బ్యూటీ లుక్స్... View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
ఉచితాలపై పవన్, నాదెండ్ల కొత్త పాట.. ఏకిపారేసిన నెటిజన్లు
సాక్షి, అమరావతి: ‘యువత ఉచితాలను అడగడం లేదు. సంక్షేమ పథకాలను కోరుకోవడం లేదు.’ అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. తిత్లీ తుపాను సమయంలో 2018 అక్టోబర్ 12వ తేదీన పవన్ కళ్యాణ్తో కలిసి తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయాలను గుర్తు చేసుకుంటూ జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్టు పెట్టారు.ఈ క్రమంలో దానికి కొందరు యువతతో కూర్చుని మాట్లాడుతున్న ఫొటోను జత చేశారు. ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఆ పర్యటనలో మేం అక్కడివారితో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగలేదు. వారు ఎటువంటి సంక్షేమ పథకాలనూ అడగలేదు. కానీ, వారు మాకు 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వండి.. ఉచితాలను కాదని గట్టిగా చెప్పారు. మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చడం కోసం వారిని అర్థం చేసుకోవడానికి నేను యువతను కలుస్తూనే ఉంటాను’ అని పవన్కళ్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’ We need to tap the true potential of our youth. I will keep… https://t.co/8bWCtI1ryL— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2025నెటిజన్ల ప్రశ్నలు..పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుపై పలువురు ప్రతిస్పందించారు. ‘యువత ఉచిత, సంక్షేమ పథకాలు కోరుకోకపోతే గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం రూ.1.2లక్షల కోట్లు ఖర్చయ్యే సంక్షేమ, ఉచిత పథకాలను అమలు చేస్తామని ఎందుకు ప్రచారం చేశారు..? అంటూ పలువురు పవన్కళ్యాణ్ పోస్టుపై స్పందిస్తూ రీ పోస్టులు పెట్టారు. ఎన్నికల సమయంలో పవన్కళ్యాణ్ యువతకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ కొందరు పోస్టు చేశారు. మరోవైపు ఎన్నికల ముందు టీడీపీ–జనసేన కూటమిని గెలిపిస్తే నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని, వాటి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, పది రూపాయలను అదనంగా ఇస్తామని చెప్పారు.ఈ విషయం పదే పదే ప్రజలకు చెప్పాలని జనసేన కార్యాలయంలో 2024 ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. టీడీపీ నాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తామని, పెద్దపెద్ద కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తే ఉదారంగా వదిలేస్తున్నారని పవన్కళ్యాణ్ చెప్పారు. ఇలాంటి హామీలన్నింటినీ ప్రశ్నిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Mari nuvvu untunna nee government lo freebies ni Enduku Prothsahistunnav? Schemes teseyochu ga,free education and free medical ivvandi chalu,civil cases nyayam ga undetattu cheyandi,drinking water ivvandi,nityavasaralu tagginchandi,land rates tagginchandi chaalu ivi cheyandi.— Dr.High Voltage (@it_RAR4all) October 12, 2025 -
వాళ్లు పదవులోళ్లు.. మనం పనోళ్లం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పదవుల పంపిణీలో ఒక సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కుతోంది తప్ప తక్కిన వారికి అన్యాయం కొనసాగుతోందనిఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలు, కూటమి పార్టీల నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘పదవులకు వాళ్లు, పనులకు మనమా’ అంటూ అంతర్గత చర్చల్లో పరస్పరం వాపోతున్నారు. ఆయా కుల కార్పొరేషన్లకు మాత్రమే మనం పరిమితమా అని మథనపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు దక్కిన పదవులను బేరీజు వేసుకుంటున్నారు. తాజాగా దుర్గగుడి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ (గాందీ)ని ప్రకటించిన తరువాత టీడీపీలోని పాలకపక్ష సామాజికవర్గీయులు సైతం మండిపడుతున్నారు. పాలకమండలి సభ్యుల్లో ఏ వర్గం వారిది మెజారిటీనో కూడా పరిశీలించాలంటున్నారు. ఇదీ వరుస.. తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ లోక్సభ సభ్యుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యేగా యలమంచిలి సుజనాచౌదరి (బీజేపీ) ప్రాతినిధ్యం వహిసున్న సంగతి తెలిసిందే. నందిగామ, తిరువూరు రిజర్వుడు స్థానాలు అయినందున ఆ వర్గీయులైన కొలికపూడి శ్రీనివాస్, తంగిరాల సౌమ్యలు కాగా విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య ఉన్నారు. కుల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కాకుండా తక్కిన ప్రాధాన్యతా పోస్టులు మాత్రం దాదాపు చంద్రబాబు సామాజికవర్గీయులకే దక్కడం పరిశీలనాంశం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభిరాం, కేడీసీసీబీ చైర్మన్గా నెట్టెం రఘురాం పదవుల్లో కొనసాగుతున్నారు. చివరకు జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీల చైర్మన్లు సైతం ఆ వర్గీయులకే మెజారిటీ దక్కాయి. దుర్గగుడి చైర్మన్ పదవి కూడా.. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ (గాందీ) నియామకం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు సన్నిహితుడు కావడం మినహా రాజకీయంగా గాం«దీకి ఉన్న అర్హతలు ఏంటని టీడీపీ వర్గాలే నిలదీస్తున్నాయి. బాలకృష్ణను అనుసరించడం తప్ప పార్టీలో బాధ్యత, కార్యక్రమాలలో భాగస్వామ్యం ఏపాటిదని ప్రశి్నస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారిగా, ఎల్ఐసీలో పనిచేసిన గాంధీ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)కు అనుచరునిగా కొనసాగారని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను ద్వితీయశ్రేణి నాయకులు ప్రశ్నించగా, ‘మాదేముంది అంతా అధిష్టానం నిర్ణయమేగా’ అని బదులిచ్చి మౌనం దాల్చారని సమాచారం. విజయవాడ పశి్చమ పరిధిలోని ముఖ్య పదవుల్లో సుజనాచౌదరి, గాంధీ, గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్ నర్రా వాసు, దుర్గ గుడి సభ్యురాలు గూడపాటి వెంకట సరోజనిదేవి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. పశి్చమ పరిధిలోని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం రాకముందు నుంచే టీడీపీకి చెందిన చలసాని ఆంజనేయులు కొనసాగుతున్నారు.నందిగామను పరిశీలిస్తే చాలు.. టీడీపీలో పదవుల పంపకం ఎలా ఉన్నాయనేది నందిగామ నియోజకవర్గాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది. పదవులన్నీ ఒక సామాజికవర్గానికేనా అనే చర్చ కూటమి పార్టీల వైపు నుంచి సోషల్మీడియాలో జోరుగానే కొనసాగుతోంది. కంచికచర్ల ఏఎంసీ చైర్మన్గా కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు), నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ చైర్మన్, చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు డి్రస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా పాలకపక్షం వర్గీయులే. తాజాగా దుర్గ గుడి సభ్యురాలిగా మన్నే కళావతికి అవకాశం దక్కింది. మునిసిపల్ చైర్మన్, ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఆ సామాజికవర్గం వారే. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)ల చైర్మన్ల సంగతి సరేసరి. చందర్లపాడు, చింతలపాడు, గుత్తావారిపాలెం, కాసరబాద, కొడవటికల్లు, కోనాయపాలెం, ముప్పాళ్ల, చెవిటికల్లు, గండేపల్లి, కంచికచర్ల, గనిఆత్కూరు, గొట్టుముక్కల, మోగులూరు, పరిటాల, సక్కలంపేట, పెరకలపాడు, అడవిరావులపాడు, కంచెల, ఐతవరం, చౌటపల్లి, పొన్నవరం, వీరులపాడు, వెల్లంకి, జమ్మవరం సొసైటీల చైర్మన్లుగా ఆ సామాజికవర్గీయులే కొనసాగుతుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా ఉంది. మరో ఎనిమిది పీఏసీఎస్ల చైర్మన్లుగా మాత్రమే ఇతరులున్నారు. రూరల్ నియోజకవర్గాల్లో నీటి సంఘాల కమిటీలు, వ్యవసాయ కమిటీలకు అధిక ప్రాధాన్యతనేది తెలిసిందే.విజయవాడ పశ్చిమానికి చెందిన నాగుల్మీరాను రాష్ట్ర నూర్బాషా సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నియమించగా ఆయన అప్పట్లోనే అధిష్టానం వద్దే అయిష్టతను వ్యక్తం చేసినట్లు సమాచారం. శాసనసభా స్థానం నుంచి పోటీచేసిన, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన తనను కుల సంఘానికి పరిమితం చేయడం ఇబ్బందికరమని అన్నట్లు తెలిసింది. నగరంలోని మరికొందరు నాయకులను కూడా కుల సంఘాల పోస్టులకు పరిమితం చేయడం గమనార్హం. జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించాలనే నిర్ణయం జరిగింది. జిల్లా కలెక్టర్ అయిదారు నెలల కిందట నోటిఫికేషన్ కూడా జారీచేశారు. ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుడైన గండ్రాయి గ్రామానికి చెందిన కొటారి సత్యనారాయణ ప్రసాద్ అడ్డంకులు సృష్టించారు. తమ వర్గానికే ఇవ్వాలనడంపై ఎస్సీ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు స్టే ఇచ్చింది. జిల్లా పరిధిలోని పలు దేవాలయాల చైర్మన్ పదవుల నియామకాలు జరగలేదు. మరికొన్ని ఆలయాలకు పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఇతర సామాజికవర్గాల వారికి పాలకమండలి పదవులు దక్కడం ఇష్టంలేక భర్తీచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ట్రం‘పూనకాలు’!
అన్యాయం! ఘోరం! ట్రంప్ గారికి నోబెల్ రాలేదు! నోబెల్ శాంతి బహుమతి 2025 ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రం దక్కలేదు! ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచి్చన మీమ్స్, జోకులు చూస్తే మాత్రం పగలబడి నవ్వకుండా ఉండలేం. ఈ వార్త వినగానే, ఏం జరిగిందో ఊహించగలం కదా? అవును, ట్రంప్ స్పందనను ఊహిస్తూ ‘క్లాస్ పీకుతున్న’మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. మనసు గెలిచిన మచాడో.. ఈసారి బహుమతిని వెనెజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న ఈమెకు ‘వెనెజులాఉక్కు మహిళ’అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ, టైమ్ మ్యాగజైన్ ‘2025లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది’జాబితాలో ‘మచాడో’పేరు ఉందంటే ఆమె ప్రభావాన్ని ఊహించుకోవచ్చు. ట్రంప్ గారే టాక్ ఆఫ్ ది టౌన్! కానీ, ఆన్లైన్లో జనాలు ‘మచాడో’గురించి మాట్లాడకుండా, కేవలం ట్రంప్ కలల బహుమతి గురించి మాత్రమే జోకులు వేసుకున్నారు. ట్రంప్ నోబెల్ గెలవనందుకు ఎంత నిరాశ చెందారో చూపిస్తూ.. ఎక్స్ ప్లాట్ఫాం నిండిపోయింది. ట్రంప్ చిన్న పిల్లాడిలా అలిగి, చిందులు తొక్కుతున్నట్లు మారి్ఫంగ్ చేసిన ఫొటోలు, ఆయనకు బహుమతి దక్కనందుకు ప్రపంచం అంతా పండుగ చేసుకుంటున్న వీడియోలు.. అబ్బో! నెటిజన్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, ఈ అవకాశాన్ని ’ఇంటర్నెట్ గోల్డ్’గా మార్చడానికి అస్సలు ఆలస్యం చేయలేదు. ట్రంప్ ‘శాంతి’ ప్రకటనలు: కామెడీకి కొత్త నిర్వచనం నిజానికి, 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు, ట్రంప్ చాలా పకడ్బందీగా ప్రచారం కూడా చేశారు. ప్రపంచంలో అనేక శాంతి కార్యక్రమాలలో తన పాత్ర ఉందని, అందుకే ఈ గౌరవం తనకే దక్కాలని ఆయన పట్టుబట్టారు. నిజమా?.. మీరే చేసారా? ఆయన నోటి నుంచి ఈ మాటలు వస్తున్నప్పుడు, అంతర్జాతీయ నిపుణులు, విశ్లేషకులు ముఖాలు ఎలా పెట్టుకున్నారో ఊహించుకుంటే చాలు. అన్నీ విన్నాక, ‘నిజంగా మీరు ఇవన్నీ చేసేసారా?’అని అందరూ నవ్వుకుంటూనే ప్రశ్నించారట!. ఏదేమైనా, నోబెల్ శాంతి బహుమతి ఆయనకు దక్కకపోయినా, ఆయన వల్ల మాత్రం నెటిజన్లకు భారీ వినోదం మాత్రం దక్కింది.ఆయన సొంత డబ్బా లిస్ట్ ఇదే.. → ఇజ్రాయెల్–హమాస్, ఆర్మేనియా–అజర్బైజాన్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించారట! → కంబోడియా–థాయిలాండ్ గొడవలు కూడా ఆయనే పరిష్కరించారట! → అంతేకాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య కూడా శాంతి ఒప్పందానికి కృషి చేశానని చెప్పుకొన్నారు (అసలు అదెప్పుడు చేశారో ఎవరికీ తెలియదు). → ఇక, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో–రువాండా, ఈజిప్ట్–ఇథియోపియా, సెర్బియా–కొసావో మధ్య ఉద్రిక్తతలు కూడా ఆయన వల్లే శాంతించాయట! -
భారత్ పిలిచింది..!
బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన యూకే అథ్లెట్ జాక్ ఫెంట్కు ప్రతికూల ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఇండియా గుర్తుకు వచ్చింది. వెంటనే రంగంలో దిగాడు. ‘ఇండియా–80 రోజులు–4,000 కిలోమీటర్లు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.ఇండియాలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి అతడిలో ఉత్సాహం మొదలైంది. ఇండియాలో తన ‘80–డే రన్’ తాలూకు వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ‘ప్రొటెక్టర్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియోలో తనను ప్రమాదం నుంచి రక్షించిన వీధి శునకం గురించి చెప్పాడు.ఆ శునకంతో తనతో పాటు పదమూడు కిలోమీటర్లు నడిచింది. దానికి ‘మనాలి’ అని పేరు పెట్టాడు జాక్.‘80 రోజులలో రోజుకు 50 కిలోమీటర్ల దూరం పరుగెత్తడానికి ఇండియాకు ప్రయాణమవుతున్నాను. మంచుతో కప్పబడిన కొండల నుంచి కేరళ ప్రకృతి అందాల వరకు ఎన్నో చూడబోతున్నాను. బ్రెయిన్ ట్యూమర్ అని నాకు నిర్దారణ అయిన తరువాత నా మనసు భయం, గందరగోళం, దుఃఖంతో నిండిపోయింది. నాకే కాదు భూమి మీద ప్రతి ఒక్కరికీ కష్టాలు కూడా ఉంటాయి. దీంతో పాటు ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇండియాకు వెళ్లాలను కోవడం అనేది నా ఎంపిక. మళ్లీ పూర్వంలా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాను’’ అని తన యాత్ర ప్రారంభానికి ముందు షేర్ చేసిన పోస్ట్లో రాశాడు జాక్ పెయింట్. (చదవండి: వెయిట్ లిఫ్టింగ్తో ఇంత మార్పు..? ఏకంగా 93 కిలోలు నుంచి 50కిలోలు తగ్గిన మహిళ..) -
‘బాలాకోట్’ బిర్యానీ.. ‘షెహబాజ్’ షర్బత్!
అవాక్కయ్యారా!.. ఈ పేర్లన్నీ మన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ (2019), ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత్ దెబ్బ తగిలిన పాకిస్థాన్ ప్రాంతాల పేర్లే కదూ అనిపించిందా! మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 93వ వార్షికోత్సవం సందర్భంగా, ఒక ఫేక్ మెనూ సోషల్ మీడియాలో వైరలైంది.. దేశం మొత్తం గట్టిగా నవ్వుకునేలా చేసింది! ఈ మెనూని తయారుచేసింది ఎవరో కాదు, మన ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఈ ఏఐకి, ఆ మెనూ పేర్లు పెట్టిన మన సైనికులకు పద్మశ్రీ ఇవ్వొచ్చు!. మెనూ చూడగానే, ’అమ్మో! ఎంత ఘాటుగా ఉందో!’ అనిపించేలా ఉంది. ఆ మెనూలో ఉన్న పేర్లు చదివితే, మనోళ్లు మామూలోళ్లు కాదు సుమీ.. అనిపించక మానదు. ఆ మెనూలో పాకిస్థాన్ను ఓ రేంజ్లో ఆడేసుకున్నారంతే..! ఇవి చదివాక.. ’ఆహో! వంటకాల పేర్లలో కూడా మన సైన్యం సత్తా చాటిందే!’ అనుకున్నారంతా. బహావల్పూర్ నాన్.. రావల్పిండి చికెన్ టిక్కా మసాలా మెయిన్ కోర్సుగా బహావల్పూర్ నాన్, రావల్పిండి చికెన్ టిక్కా మసాలా పెట్టారు.. వారి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినట్టు.. మురిద్కే, ముజఫరాబాద్ పేర్లతో చేసిన డెసర్ట్లు వడ్డించారు. ‘మా విందులో మీకు ఘాటుగా టిక్కా మసాలా ఉంది, తీయగా తిరామిసు ఉంది. కానీ మాకు మాత్రం... మీ టెర్రర్ క్యాంపులు నాశనం చేసిన కిక్ ఉంది!’ అన్నట్టుగా ఉంది ఈ ఫేక్ మెనూ వెనుక ఉన్న ‘పకడ్బందీ ప్లాన్’! ఈ మెనూ చూసి సైనికులు, ఆర్మీ వెటరన్స్ కూడా పగలబడి నవ్వారంటే, దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు!మన సైనికుల సెటైర్ సూపరెహే.. ‘షెహబాజ్’ అంటే.. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ను ఆడుకోవడం. ఇక, ‘రఫీఖీ’ అనేది పాకిస్థాన్లోని ఓ ముఖ్యమైన ఎయిర్ బేస్ పేరు. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం ఆ ఎయిర్ బేస్ను కూడా దెబ్బ కొట్టింది. అంటే, ‘షెహబాజ్ గారూ.. మీ రఫీఖీ బేస్ను కొట్టేశాం’.. అని గాలిలోనే సరదాగా వారి్నంగ్ ఇచ్చినట్టు ఉందీ వ్యవహారం. ఏఐ పుణ్యమా అని వైరలైన ఈ ఫేక్ మెనూ, సరదాగా చేసిన ఈ విమానాల నామకరణం చూస్తే.. మన సైనికుల ఫైటింగ్ స్పిరిట్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. వాళ్ళు యుద్ధంలోనే కాదు, సెటైర్ వేయడంలోనూ దిట్ట!. మరి ఈ ఫన్నీ మెనూ చూశాక మీకేం అనిపించింది?.. మీరూ.. కొత్త ‘శత్రువుల కడుపు మంట’ వంటకాలు కనిపెట్టారా?విమానాలకు కూడా ‘పేరు’! ఇక, విందు మెనూతో పాటు, అంతకంటే ఫన్నీగా జరిగిన ఇంకో విషయం ఉంది. ఐఏఎఫ్ డేకి ముందు.. ఆకాశంలో కనిపించిన రెండు విమానాలకు పెట్టిన సంకేత నామాలు చూస్తే, ఇక నవ్వు ఆపుకోవడం ఎవరి వల్లా కాదు. ఇ130ఒ విమానం సంకేత నామం: ‘రఫీఖీ’ అn32 విమానం సంకేత నామం: ‘షెహబాజ్’– న్యూఢిల్లీ -
రాణి అనే నేను ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నాను...
ఇజ్రాయెల్ అనే మాట వినిపించగానే యుద్ధబీభత్సాలు, దాడులు గుర్తుకు వస్తాయి. కొద్దిమంది నెటిజనులకు మాత్రం ఇజ్రాయెల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాణి గోర్సెర. ‘ఇజ్రాయెల్లో కేర్గివర్గా పనిచేస్తున్నాను’ అని చెప్పే రాణి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ ఆసక్తికరమైన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటుంది.‘కేర్గివర్’గా వృద్ధులను కన్నబిడ్డలా చూసుకుంటుంది. ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వృద్ధులతో కబుర్లు చెప్పడం... ఇలా ఎన్నో చేస్తూ ఉంటుంది. ‘కేర్గివర్గా నా జీవితంలో ఒకరోజు’ కాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియోలో కబుర్లు చెబుతూ, నవ్విస్తూ, ఒక వృద్ధురాలి కాళ్లని శుభ్రం చేయడం, నెయిల్ పెయింట్ వేయడం.. .మొదలైన దృశ్యాలు కనిపిస్తాయి. View this post on Instagram A post shared by Rani Gorsera (@rani_gorsera) నవరాత్రి ఉత్సవాలలో ఉత్సాహంగా నృత్యం చేయడం మరో వీడియోలో కనిపిస్తుంది. ‘చాలామంది వృద్ధులు ఒంటరితనం అనే దీవిలో దిగులుగా జీవిస్తున్నారు. అలాంటి వారికి రాణిలాంటి వారు సరికొత్త జీవనోత్సాహాన్ని ఇస్తున్నారు. వృత్తిపరంగా ఆమె కేర్గివర్ కావచ్చు గానీ వృద్ధులకు ఆమె ఆత్మీయతను పంచే కన్నకూతురు’ అని ఒక నెటిజన్ కామెంట్ రాశారు. ఇదీ చదవండి : హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్! -
బ్లాక్ డ్రెస్లో శోభిత గ్లామర్..శారీలో అనన్య నాగళ్ల అందాలు!
హీరోయిన్ అనన్య నాగళ్ల గ్లామరస్ పిక్స్..బ్లాక్ డ్రెస్లో అక్కినేని శోభిత ధూళిపాల అందాలు..బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను పంచుకున్న మంచు లక్ష్మీ..పెట్స్తో చిల్ అవుతోన్న హీరోయిన్ స్నేహ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్పిట్లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్పిట్లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్లోనే నరకం -
హైవేపై ట్రక్కులు ఢీ.. సిలిండర్లు పేలుళ్ల ధాటికి మంటలు..
జైపూర్: రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తీసుకెళుతున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో హైవేపై భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనతో సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జైపూర్-అజ్మేర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఎల్పీజీ సిలిండర్లను తీసుకువెళ్తున్న ట్రక్కు, మరో ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ధాటికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. కారణంగా సమీపంలోని వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని కిలోమీటర్ల మేర పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ఘటనతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు ఎగిసిపడుతుండంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.Huge Fire on Jaipur-Ajmer Highway! 🚨Gas tanker overturns near Sawarada Puliya, Dudu, causing a massive blaze. 😱 Praying for safety & recovery. 🙏 Stay safe, everyone! 💪 #JaipurAjmerHighway #Emergency🔥 RT to spread the word! 🔔 pic.twitter.com/y9cnSEqvjG— Pramod Kumar Saxena (@PramodKuma79446) October 7, 2025మరోవైపు.. ఈ ప్రమాద ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వాను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో రెండు ట్రక్కుల డ్రైవర్లు, క్లీనర్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. వారి జాడ కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదని తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. VIDEO | A truck carrying LPG cylinders caught fire following a collision with a tanker on the Jaipur-Ajmer highway on Tuesday night. Deputy CM Premchand Bairwa (@DrPremBairwa) said, "A truck hit a stationary vehicle. The situation is under control now. One casualty has been… pic.twitter.com/nHzKbyK7OM— Press Trust of India (@PTI_News) October 8, 2025 Big Breaking 🚨🚨 on the Jaipur-Ajmer highway a massive fire broke out near the Sawarda culvert in the Mauzamabad area, after a vehicle allegedly hit a truck loaded with gas cylinders.Watch video 📷 pic.twitter.com/7P35AI3B2j— Globally Pop (@GloballyPop) October 7, 2025 -
తిరుమలలో మరో అపచారం.. వెకిలి చేష్టలతో అసభ్యకర రీల్స్
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు వెలసిన పవిత్రక్షేత్రం తిరుమలలో(tirumala) రీల్స్ తీసి వాటికి పాటలు జోడించి వెకిలి చేష్టలతో సోషల్ మీడియాలో(Social Media Reels) హల్చల్ చేస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. శ్రీవారి దర్శనానికి తిరుమల వస్తున్న కొందరు యువతీ యువకులు రీల్స్ పేరుతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం మాడవీధుల్లో, ఆలయ గోపురాలు కనిపించే విధంగా కొన్ని అసభ్యకరమైన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా శ్రీవారి ఆలయం ముందు ఓ యువతి రీల్స్ చేశారు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొందరు యువకులు మాడవీధుల్లో రీల్స్ చేయడం కూడా వైరల్గా మారింది. టీటీడీకి సంబంధించిన కొందరు వ్యక్తుల ద్వారా వీరు మాడవీధుల్లోకి ప్రవేశించారని, భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వామి సేవలో నిత్యం పాల్గొనేవారే ఇలా సోషల్ మీడియా వారితో కలిసి రీల్స్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రీల్స్ చేయడమే కాదు, తిరువీధుల్లోకి ఎలా వచ్చామో కూడా వారు తమ రీల్స్లో చెప్పుకొచ్చారు.చూశారా తమ్ముళ్లు మన మంచి ప్రభుత్వంలో తిరుమలలో కూడ రీల్స్ చేసుకునే సదుపాయం కల్పించాం pic.twitter.com/ZHj0oJyGq8— Ꮩᴀʀsʜᴀ Ꭱᴇᴅᴅʏ 🐬 (@YSvarshareddy) October 6, 2025గతంలో తిరుపతిలోని అలిపిరిలో డ్యాన్స్ చేస్తున్న యువతి వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కొండపైనే సోషల్ మీడియా వ్యక్తులు వెర్రిపోకడలు పోతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. తిరుమలలో అసభ్యకరమైన రీల్స్ తీయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీటీడీ పాలకమండలి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గుడిముందు ఇంత జరుగుతున్నా టీటీడీ మొద్దునిద్ర పోతోందా అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో వెంగమాంబ అన్నదాన సత్రంలో సోషల్ మీడియా రీల్స్ చేయించడం పై శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/8bUxzZ8W62— TOVINO𓃵 (@Vamos_Rafa23) October 7, 2025 -
‘ఏదో సరదాగా అన్నంత మాత్రాన..’: సీజేఐ గవాయ్
న్యూఢిల్లీ: కోర్టుల్లో కేసుల విచారణల సమయంలో న్యాయమూర్తులు సరదాగా చేసే వ్యాఖ్యలను కూడా సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(CJI BR Gavai) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో తనపై దాడి జరిగిన మరుసటిరోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది(Lord Vishnu Shoe Attack Row).సర్వీస్ కండిషన్స్, వేతనాలు, వృత్తిగతమైన పురోగతిపై ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కలిసి జస్టిస్ గవాయ్ మంగళవారం విచారించారు. ఈ సందర్భంగా జస్టిస్ కే వినోద్తో తన గత అనుభవాన్ని జస్టిస్ గవాయ్ వివరించారు. ‘ఇటీవల ధీరజ్ మోర్ కేసు విచారణ సందర్భంగా నా సహోదరుడు (జస్టిస్ కే వినోద్ని ఉద్దేశించి..) ఏదో వ్యాఖ్యానించబోయారు. ఆయనను నేను ఆపాను. లేదంటే తెల్లారి సోషల్ మీడియాలో ఏమేం ప్రచారం చేసేవారో తెలియదు. అందుకే ఆయనను నాకు మాత్రమే వినపడేలా చెప్పమన్నాను’అని జస్టిస్ గవాయ్ తెలిపారు. కాగా, ఈ కేసు విచారణను ధర్మాసనం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కొద్దిరోజుల క్రితం ఖజురహో ఆలయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ‘‘మీరు విష్ణువు భక్తులని అంటున్నారు. కాబట్టి, మీరు వెళ్లి ప్రార్థన చేయండి. కోర్టులకు కాకుండా దైవాన్నే అడిగి చూడండి’’ అంటూ పిటిషనర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఖజురహో ఆలయ సముదాయం యూనెస్కో (UNESCO) వారసత్వ స్థలంగా గుర్తించబడింది. కాబట్టి విగ్రహ పునఃస్థాపనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అనుమతి అవసరమని కోర్టు అభిప్రాయపడుతూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యలపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో జస్టిస్ గవాయ్ ఆ తర్వాత వివరణ కూడా ఇచ్చారు. తనకు అన్ని మతాలు సమానమే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. సనాతన ధర్మాన్ని కించపరిస్తే దేశం సహించబోదు అంటూ కోర్టులోనే జస్టిస్ గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసిరేయటం సంచలనం సృష్టించింది(Attack on BR Gavai).ఇదీ చదవండి: బూటు విసిరింది ఆ దేవుడే! -
వీడియో: 18వేల అడుగుల ఎత్తు! సెల్ఫీ తీయబోతే పట్టు తప్పి..
సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది. చైనా సిచువాన్లోని మౌంట్ నామా(Mount Nama) శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్.. సేఫ్టీ రోప్ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది. Terrifying Footage Shows Tourist Sliding To His Death After Taking A Selfie On Mount Nama Feng In Sichuan, 🇨🇳He reportedly unclipped his safety harness to take a picture, but slipped on the ice and was sent plummeting into the abyss - to the horror of fellow climbers. pic.twitter.com/Z4Wa5esHlT— sanjay patel (@Sanjaypatel12Dr) October 3, 2025 ఇదిలా ఉంటే.. హంగ్తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ అంటోంది.ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా? -
84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్సైజ్లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma)ఈ ఏజ్లో కూడా అమ్మ ఫిట్నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు. -
ఉప్పెన బ్యూటీ స్టన్నింగ్ లుక్.. బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ!
సెప్టెంబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్..డిఫరెంట్ శారీ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..టాలీవుడ్ నటి అనసూయ స్టన్నింగ్ లుక్..బ్లాక్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ ఐశ్వర్య రాజేశ్..బ్లాక్ బ్యూటీలా ఓజీ భామ శ్రియా రెడ్డి.. View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
వెండి బతుకమ్మ.. భర్తతో కలిసి ఆడిన పీవీ సింధు (ఫొటోలు)
-
ఏఆర్ రెహ్మాన్ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీ
తిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు -
లైవ్లో అమ్మేస్తున్నారు!
వ్యాపారం చేయాలంటే ఓ భారీ స్థాయి మాల్ కాకపోయినా.. చిన్న దుకాణం అయినా పెట్టుకోవాలి. లేదా రోడ్డుపై తోపుడు బండి అయినా నిర్వహించాలి. అదీ కాదంటే వాహనం ఆసరాగా చేసుకుని విక్రయాలు సాగించాలి. ఇదంతా సంప్రదాయ పోకడ. ఆన్ లైన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కాస్తా ‘సోషల్ కామర్స్’ అయిపోయింది. అంటే ప్రత్యక్షంగా దుకాణాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కోట్ల మందికి ఇప్పుడీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అడ్డాలుగా అవతరించాయి.ఆన్ లైన్ లో ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. ఓ ఫోన్ నంబర్ ద్వారా వ్యాపారం చేయడం సాధారణం. ఈ–కామర్స్లో ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కొత్త ట్రెండ్. విక్రేతలు యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా రియల్ టైమ్లో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. వీక్షకులు తమ కామెంట్స్ ద్వారా హోస్ట్తో సంభాషించవచ్చు. లైవ్ పోల్స్ నిర్వహించేందుకు హోస్ట్కు వీలవుతుంది.తెలివైన విక్రేతలు తాము తదుపరి వారం/తేదీన పరిచయం చేయబోయే ఉత్పత్తి గురించి ముందుగానే కొన్ని వివరాలను టీజర్ రూపంలో వెల్లడించి వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అంతేగాక 24 గంటల కౌంట్డౌన్ నిర్వహించి తమ ఫాలోవర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంటున్నారు. సోషల్ కామర్స్ భారత్లో 2025లో సుమారు రూ.1,80,000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో 90 కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 25 శాతానికిపైగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. వర్ధిల్లు వ్యాపారాలుతాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు, పిండి వంటలు, కళాఖండాలు, అల్లికలు, పెయింటింగ్స్.. ఒకటేమిటి, వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ఔత్సాహికులు తక్కువ పెట్టుబడితో తమ కాళ్లమీద తాము నిలబడవచ్చు. చేతిలోని సెల్ఫోన్ తో వీడియోలు, ఫొటోలే కాదు.. లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి తాము విక్రయించే ఉత్పాదనను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. లైవ్ వీడియో చేయాలంటే పెద్దగా సాంకేతికంగా అవగాహన కూడా అవసరం లేదు. ఎడిటింగ్ భారం అసలే లేదు.దశాబ్దాల నుంచి..వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీడియోలు ఉపయోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు, షార్ట్స్ చూడటం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవడానికి వీడియోలను చూసే ధోరణి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్ స్ట్రీమింగ్తో షాపింగ్ ఎక్స్పీరియెన్స్ మారుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అలీ ఎక్స్ప్రెస్ చెబుతోంది.వాయిదాలకు ఫుల్స్టాప్ఈ–కామర్స్ వెబ్సైట్లలో చాలామంది కస్టమర్లు తాము చూసిన ఉత్పాదనను తరువాత కొనొచ్చులే అని కార్ట్లో నిక్షిప్తం చేస్తారు. చాలా సందర్భాల్లో అవి కార్ట్కే పరిమితం అవుతాయి. అదే లైవ్లో అయితే.. నచ్చగానే ఆర్డర్ పెట్టేయొచ్చు. హోస్ట్ మీద, ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పడితే.. వెంటనే ఆర్డర్ చేసేలా మనస్సు కూడా వీక్షకులను ప్రేరేపిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తరచూ వాయిదాలు వేసే కస్టమర్ల విషయంలో విక్రేతలకు లైవ్ స్ట్రీమింగ్ కలిసి వస్తుందని వారు చెబుతున్నారు.ప్రత్యక్షంగా వీక్షించి..ఆన్ లైన్ వ్యాపారంలో భాగంగా విక్రేతలు ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం సర్వసాధారణం. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే వ్యక్తి (హోస్ట్) లైవ్ వీడియోలో ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు వీలవుతుంది. లైవ్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లకు ప్రత్యక్షంగా అవి చేరతాయి. సందేహాలు ఉంటే నివృత్తి అవుతాయి. హోస్ట్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఇక్కడ కీలకం. ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటే ఉత్పత్తి పట్ల కస్టమర్లలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకతలు, వారంటీ, గ్యారంటీ, ధర, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తాము విక్రయించే ప్రొడక్ట్ విశేషాలను కస్టమర్లతో నేరుగా పంచుకోవచ్చు. -
Cow Cess: ఇదేందయ్యా ఇది.. ఇది మేం చూడలే!
పన్నులు కట్టే విషయంలో ఎంతో శ్రద్ధ కనబరిచే భారతీయులు.. వాటి విషయంలో కాస్త తేడా వచ్చినా సరే అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంటారు. సోషల్ మీడియాలో తరచూ జరిగే డిస్కషన్లే అందుకు నిదర్శనం. అయితే బార్లో మందు తాగిన ఓ వ్యక్తికి.. బిల్లును తీక్షణంగా చూసే సరికి దిమ్మ తిరిగిపోయింది. అందులో 20 శాతం ఆవు పన్ను(Cow Cess) వేశారంటూ లబోదిబోమన్నాడు. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. దీంతో కొంపదీసి ఇలాంటి ఓ కొత్త ట్యాక్స్ వచ్చిందా? అని మందుబాబులు తెగ ఫీలైపోతున్నారు. రాజస్థాన్ జైపూర్ పార్క్ ప్లాజాలో ఉన్న ఓ బార్కి వెళ్లాడు ఓ వ్యక్తి. ఆరు బీర్లు, ఫుల్గా స్టఫ్ ఆర్డర్ ఇచ్చాడు. వీటి విలువ రూ.2,650లే. అయితే జీఎస్టీలతో కలిపి మొత్తం రూ.3,262 అయ్యింది. అందులో 20 శాతం అంటే.. రూ.90 కౌ సెస్ అని ఉండడం చూసి ఆ వ్యక్తి కంగుతిన్నాడు. ఇదేందయ్యా ఇది.. అంటూ నెట్లో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పన్నుపై తీవ్రస్థాయిలో చర్చ నడిచింది. అయితే.. ఆ తాగుబోతు రాజస్థాన్కు కొత్తేమోనంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు. ఎందుకంటే.. రాజస్థాన్లో ఇదేం కొత్త వ్యవహారం కాదట. గత ఏడేళ్లుగా జరుగుతున్నదేనని ప్రభుత్వ వర్గాలు, ఇటు హోటల్ వాళ్లు ఈ వైరల్ బిల్లుపై స్పష్టత ఇచ్చారు. సదరు బార్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. రాజస్థాన్లో గో సంరక్షణ కోసం ఏడేళ్ల కిందటే ఈ పన్ను తీసుకొచ్చారని తెలిపారు. అయితే చాలా వరకు బార్ అండ్ హోటల్స్ దీనిని సర్ఛార్జ్గా వ్యవహరిస్తుంటాయని, తాము మాత్రం కౌ సెస్ అని పేర్కొనడమే ఇప్పుడు ఈ చర్చకు దారి తీసిందని అంటున్నాడాయన. అంతేకాదు.. ప్రభుత్వ పోర్టల్స్లోనూ ఆ పేరుతోనే తాము వచ్చిన సొమ్మును జమ చేస్తామని తెలిపారు. అలాగే.. లిక్కర్ సేల్స్ వ్యాట్ మీద మాత్రమే ఈ పన్ను వసూలు చేస్తామని, ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉందని స్పష్టత ఇచ్చాడాయన. ఇదిలా ఉంటే.. ఇటు రెవెన్యూ సెక్రటరీ ఒకరు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. 2018 జూన్ 22న వసుంధర రాజే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుల చేసింది. రాజస్థాన్ వాట్ యాక్ట్ 2003 ప్రకారం.. బార్లలో అన్ని రకాల లిక్కర్ పైనా 20 శాతం ఆవుల సంరక్షణ పేరిట సర్ చార్జ్ వసూలు చేస్తారు. ఆ సొమ్ము గోరక్షణ నిధికి చేరుతుంది. అక్కడి నుంచి గో సంరక్షణ కేంద్రాలకు పంపించి వాటి నిర్వాహణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగించింది.ఇదిలా ఉంటే రాజస్థాన్ ప్రభుత్వం ఆవుల సంరక్షణ కోసం ఏటా సుమరు రూ. 2000 కోట్లకు పైగా గ్రాంట్లు, సబ్సిడీల రూపంలో ఖర్చు చేస్తోంది. ఇందులో రూ. 600 కోట్లకు పైగా నేరుగా గోశాలలకు వెళ్తుంది. అయితే, ఆ మొత్తం ఖర్చు కేవలం 'కౌ సెస్' ద్వారా సమకూరదు. అదనంగా ప్రభుత్వ గ్రాంట్లు, బడ్జెట్ కేటాయింపుల రూపంలోనూ వెళ్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
కంగారు పెట్టకండి.. గుద్దితే నాకే బొ*.. : మంత్రి నారా లోకేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఇందులో నేతలకు ఓ పద్ధతి అంటూ ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నేతల బూతు పురాణాలు నిత్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా.. స్వయంగా చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవువుతున్నాయి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ మహిళా ఆటోడ్రైవర్ పక్కనే కూర్చున్న లోకేష్.. ఆమె కంగుతినే రేంజ్లో మాట అన్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.. ఇతర నేతలంతా ఆటోలో ప్రయాణించారు. ఆ సమయంలో.. ఆటో వెనుక రాసిన కొటేషన్లు చదువుతూ, లోకేష్ హాస్యం చేయబోయారు. ‘‘కంగారు పెట్టకండి..గుద్దితే నాకే బొ*’’ అంటూ లోకేష్ నోట మాట వచ్చింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ ఒక్కసారిగా కంగుతింది. అయితే మంత్రిగారూ ఫీలవుతారనుకుందో ఏమో.. ఆమె కూడా ఇబ్బందిగానే నవ్వుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. కనీస గౌరవం లేకుండా ఓ మహిళ ముందు ఇలాగేనా మాట్లాడేంది అంటూ ప్రశ్నిస్తున్నారు పలువురు. -
ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నియంతృత్వ పోకడకు సిద్ధమవుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులు, భావ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇప్పటికే రెడ్బుక్ పేరుతో అరాచకపు పాలన సాగిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సర్కారు సోషల్ మీడియా కట్టడికి రంగం తయారు చేస్తోంది. రెడ్బుక్ సృష్టికర్త, మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ సార్థ్యలోనే ఈ కమిటీ పని చేయబోతుండడం ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి. మంత్రుల కమిటీ బాధ్యతల ఉత్తర్వులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను రెడ్బుక్తో భయపెట్టడానికి చేసిన యత్నం విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త అంకానికి తెరతీసినట్లు అర్థబవుతుంది. తమ దుర్మార్గపు పాలనకు పరాకాష్టగా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టంపై వైఎస్సార్సీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై 15 నెలల్లో 2300 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్లు రాష్ట్రంలోను, వందల కొద్ది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని, తద్వారా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై నిరంతరం విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుఎ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్తోపాటు విదేశాల్లోనూ ఉన్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలకు గురి అవుతున్న లోకేశ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది? వాటికి ఉండే పవిత్రత ఏమిటి? సోషల్ మీడియా నియంత్రణకు ప్రస్తుతమున్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకేదో చేయాలని తెగబడడమేమిటి? కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలు వీళ్లు ఎలా మారుస్తారు? అని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పోన్నవోలు సుధాకరరెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాతో పాటు, తన వైఫల్యాలను పదే, పదే గుర్తు చేసే ప్రదాన మీడియాను ముఖ్యంగా సాక్షి మీడియాను నియంత్రించడానికే ఈ ప్రయత్నంలా కనబడుతోంది. సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్న తీరు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్న వైనం పై న్యాయ స్థానాలు తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియా యాక్టివిస్టు సవిందర్ రెడ్డి కేసులో అయితే ఏకంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసుల అరాచకపు ప్రవర్తనను తేటతెల్లం చేసింది. హోం మంత్రి అనిత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాపై అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు తమ పేరులో రెడ్డి అని ఉన్నప్పటికీ ఆ పదం వాడడం లేదని, మరికొందరు రెడ్డి అయినప్పటికీ చౌదరి అని పెట్టుకుంటున్నారంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చి అప్రతిష్టకు గురయ్యారు. ఆమె చెప్పిన వారిలో ఒకరైన విజయ్ కేసరి ఎప్పుడూ అభ్యంతరకర విశ్లేషణలు చేయలేదు. ప్రభుత్వం మంచి, చెడులను గణాంకాలతో సహా విశ్లేషిస్తారు. ఆయన రెడ్డి అని బాధ్యత కలిగిన హోం మంత్రి మాట్లాడడం అందరిని నివ్వెరపరచింది. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ఏమైనా వస్తుంటే చెప్పాలి తప్ప, ఫలానా కులం అని చెప్పడం ఏపాటి విజ్ఞత? అలాగే మరొకరు చలపతి చౌదరి అని పేరు పెట్టుకుని యూ ట్యూబ్ నడుపుతున్నారని, అతని పేరు ముకేష్ రెడ్డి అని హోం మంత్రి అసెంబ్లీలో చెబితే, ఆ యువకుడు తన ఆధార్ కార్డు చూపి మరీ తాను చలపతి చౌదరినేనని రుజువు చేసుకున్నారు. దాంతో ఈ ప్రభుత్వ డొల్లతనం, మంత్రిగారి తొందరపాటుతనం అన్నీ బయటపడ్డాయి.మంత్రి అనిత చెప్పేది ప్రామాణికం అయితే స్వాతిరెడ్డి అనే పేరుతో సోషల్ మీడియాలో వైసిపిని విమర్శించే ఒకరు చౌదరి అట. పైగా ఆమెను గతంలో చంద్రబాబు అభినందించిన ఘట్టం కూడా జరిగిందట. ఆమె గురించిన సమాచారం అనిత వద్ద లేదా? లేక ఆమె తమ పార్టీ కనుక వదలి వేశారా అని కొందరు ప్రశ్నించారు. ఇక జగన్ ను ఉద్దేశించి మంత్రి ఎంత అనుచితంగా మాట్లాడేది అందరికి తెలిసిందే. అంతేకాదు. గతంలో ఈ మంత్రిగారు జగన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చట్టసమ్మతమేనా అని మరికొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మంత్రిగారు కూడా ఈ కమిటీలో సభ్యురాలు. ఇక ప్రభుత్వ పెద్దలు నిత్యం అబద్దాలు ఆడుతారన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన దారుణ వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని లోకేశ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా? గతంలో పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ చేసిన దారుణమైన అబద్దపు ప్రచారంపై ఈ కమిటీ ఏమైనా విశ్లేషిస్తుందా! సోషల్ మీడియా యాక్టివిస్టులు వ్యతిరేక ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని చూస్తున్న ఈ కమిటీ ప్రభుత్వంలో అబద్దాలు ఆడే వారిపై కూడా కేసులు పెట్టవచ్చని సిఫారస్ చేయగలుగుతుందా? అప్పుడు ఈ కమిటీకి విలువ వస్తుంది.కాని అలా చేయలేరు. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత దుష్ప్రచారం చేసింది చంద్రబాబు, లోకేశ్ లకు తెలిసినట్లుగా మరెవ్వరికి తెలియకపోవచ్చు. దానిని ఎవరూ గుర్తు చేయకుండా ఉండడం కోసం, ఇప్పుడు ఈ కమిటీ ప్రయత్నిస్తుందన్న విమర్శ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది.వాటిని ఎపి పోలీసులు సరిగా పాటించడం లేదు. ఏడేళ్ల శిక్షకు అవకాశం ఉన్న సోషల్ మీడియా కేసులలో నోటీసు ఇచ్చి పంపాలి. అలా చేయడం ఇష్టం లేని రెడ్బుక్ రాజ్యంగం అమలు చేస్తున్న పోలీసులు పలు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ కమిటీ అలాంటి పోలీసులపై చర్య తీసుకోవడానికి సిఫారస్ చేస్తుందా? ఈ కమిటీ జవాబుదారితనం గురించి ఆలోచిస్తుందట. ముందుగా ప్రభుత్వంలో ఉన్నవారి జవాబుదారితనం గురించి ఈ కమిటీ చర్చించి, నిర్ణయాలు చేసి, అప్పుడు సోషల్ మీడియావారి జోలికి వెళితే మంచిది కదా! అంతర్జాతీయ ఉత్తమ పద్దతులను అధ్యయనం చేస్తారట. అదేమిటో తెలియదు. హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలలో ఎలా స్పందించాలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై అప్రమత్తంగానే ఉంటుంది. అయినా ఆ పేరుతో పద్దతిగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులను నియంత్రించాలన్న ఉద్దేశం ఉందేమో అని పలువురు అనుమానిస్తున్నారు. పౌరహక్కులను కాపాడడంపై సలహా ఇవ్వాలన్నది ఈ కమిటీ బాధ్యతట. అదే నిజమైతే ప్రభుత్వం ఇంతవరకు అక్రమంగా అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులన్నిటీని సమీక్షించి, అన్యాయంగా అరెస్టు అయినవారిని విడుదల చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలి. అప్పుడు ఈ కమిటీకి విలువ పెరుగుతుంది. ఆ పని చేస్తారా? నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలను పెట్టాలట. అంటే ఇప్పుడు ఉన్న పోలీసుల బెదిరింపులు చాలవన్నట్లుగా కొత్తగా కొన్ని సంస్థలను సృష్టించి వారికి కోట్ల రూపాయలు చెల్లించి సోషల్ మీడియా వారిని బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారన్న డౌటు రావడం లేదా? ఇదంతా మీడియా గొంతు నొక్కడమేనని వైఎస్సార్సీపీ అభిప్రాయపడింది. ఈ కమిటీలో బీజేపీ నుంచి మంత్రి సత్య ప్రసాద్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి పార్థసారథి కూడాఉన్నప్పటికీ, అంతిమంగా లోకేశ్ ఏమి డిక్టేట్ చేస్తే అది ఫైనల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే! ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి తమ రాష్ట్రంలో రెడ్ లేదా పింక్, లేదా బ్లూ బుక్ లు ఏవీ ఉండవని, ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని, అది చట్టాల ప్రకారమే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు, ఏపీలో రెడ్ బుక్ అరాచకపు పాలనకు చెంపపెట్టు అనడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలదా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా?
కడప అర్బన్: ‘పోలీస్స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా? వెంటనే నిందితునికి 41ఏ నోటీసులిచ్చి విడుదల చేయాల’ని కడప వన్టౌన్ పోలీసులపై వైఎస్సార్ కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం సామాజిక మాధ్యమంలో ఒక పోస్టును షేర్ చేస్తేనే అరెస్టుచేసి రిమాండ్కు పెడతారా అని ఆమె ప్రశ్నించారు. వివరాలివీ.. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరును నిరసిస్తూ టీడీపీ సీనియర్ మహిళలు 2024 ఎన్నికల్లో మూసాపేట సర్కిల్లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన వీడియోలను అంజద్ బాషా పీఏ ఖాజా ఇటీవల షేర్ చేశారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబరు 29న పోలీసులు ఖాజాపై కేసు నమోదు చేశారు. ఈనెల 1న హైదరాబాద్లో ఖాజాను పోలీసులు అరెస్టుచేసి కడపకు తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం గురువారం మధ్యాహ్నం కోర్టులో ఖాజాను హాజరుపరిచారు. అయితే, పోలీసుల అక్రమ అరెస్టుపై కడప జిల్లా మూడో అదనపు మేజిస్ట్రేట్ విజయలక్ష్మి మండిపడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం సోషల్ మీడియా పోస్ట్ షేర్చేస్తేనే రిమాండ్కి పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 41ఏ నోటీసులిచ్చి వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో అంజాద్ బాషా పీఏ ఖాజాను పోలీసులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. -
సోషల్ మీడియా కట్టడికి మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు దానిని కట్టడి చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మానవ వనరులు, ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాలు, సమాచార శాఖ, హోం శాఖ మంత్రులతో కూడిన బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సమాచార శాఖ డైరెక్టర్ ఈ బృందానికి కన్వీనర్గా వ్యవహరిస్తారు. కమిటీ ఎవరైనా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.మంత్రుల బృందం బాధ్యతలివీ» దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వర్తించే ప్రస్తుత చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను సమీక్షించాలి.» జవాబుదారీతనం, సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలి.» అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి. పారదర్శకత ప్రమాణాలు, ప్లాట్ఫామ్ బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చర్యలతో సహా సోషల్ మీడియా జవాబుదారీతనానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలి.» హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్లైన్ దుర్వినియోగం, జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలి.» ఫిర్యాదుల పరిష్కారం, నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలి. పౌర హక్కులను కాపాడటంపై సలహా ఇవ్వాలి.» నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించడం లేదా బలోపేతం కోసం సిఫార్సు చేయాలి. » నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి త్వరగా సమర్పించాలి. -
ఫెస్టివ్ మూడ్..ప్రెటీ శారీ..ఫన్నీ కాప్షన్ ప్లీజ్అంటున్న ఈ భామను చూశారా? (ఫొటోలు)
-
బీచ్లో సాయిపల్లవి సిస్టర్.. బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్!
బీచ్లో సాయి పల్లవి సిస్టర్ చిల్.. బ్లూ డ్రెస్లో మరింత హాట్గా బుల్లితెర భామ జ్యోతి పూర్వాజ్. సిస్టర్ మెహందీ వేడుకల్లో మెరిసిన బుల్లితెర నటి శివంగి జోషి.. డిఫరెంట్ స్టైల్లో అతియా శెట్టి లుక్..యూఎస్లో ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ కార్తీక నాయర్.. View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Karthika Nair (@karthika_nair9) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) -
స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లిషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి!
విద్యాబుద్దులుచెప్పే గురువు గారంటే పిల్లలకు చాలా అభిమానం. ఆరు నూరు అయినా మా టీచర్ చెప్పిందే కరెక్ట్ అని వాదిస్తారు చదువుకునే పిల్లలు. అంత గురి నమ్మకం తమ టీచర్లంటే.. మరి అలాంటి టీచర్లే భయంకరమైన తప్పులు రాస్తే.. ఇక వారి వద్ద విద్యనభ్యసించే పిల్లల పరిస్థితి ఏంటి? తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలిస్తే. ఎవరైనా అయ్యో.. రామ! అని నోరెళ్ల బెట్టాల్సిందే.హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ రాసిచ్చిన చెక్కే ఇపుడు హాట్టాపిక్. ఈ చెక్ మీద ఉన్న ఇంగ్లిషు భాషను చూసి బ్యాంకు తిరస్కరించింది. సెప్టెంబర్ 25వ తేదీన ‘ద హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ కు చెందిన చెక్కు ఇచ్చారు. అట్టర్ సింగ్ పేరుతో రూ.7,616కు ప్రిన్సిపాల్ సంతకం చేసి ఉందీ చెక్. సాధారణంగా చెక్ ఇచ్చేటపుడు అక్రమాలకు తావులేకుండా ఆ మొత్తాన్ని అక్షరాల్లో (Inwords) రాయాల్సి ఉంటుంది. అలా తానిచ్చిన రూ. 7,616 ఇంగ్లిషులో భయంకరమైన తప్పిదం చేశారు. ఒక వర్డ్ అంటే పొరబాటు అనుకోవచ్చు. ఇంగ్లీష్లో సెవెన్ ( Seven) రాయాల్సిన చోట సావెన్ (Saven)అని థౌజండ్ రాయాల్సిన చోట థర్స్ డే, హండ్రెడ్ (Hundred) కు బదులు హరేంద్ర (Harendra, సిక్స్ టీన్కు బదులు సిక్స్టీ అని రాశారు. తప్పుల తడక చెక్కు చూసి బ్యాంక్ అధికారులే విస్తుపోయారు. అందుకే వెనక్కి పంపించారు.₹7,616 ..…“ सेवन थर्सडे सिक्स हरेन्द्र सिक्सटी रूपीस ओनली ”📍 सिरमौर के रोनहाट स्थित सरकारी वरिष्ठ माध्यमिक विद्यालय के प्रधानाचार्य द्वारा जारी ₹7,616 का चेक सुर्खियों में है। ▪️ रकम से ज़्यादा यह चेक अपने शब्दों की वजह से वायरल हो गया है pic.twitter.com/Uhmz7mojDy— The Modern Himachal (@I_love_himachal) September 29, 2025ఈ ఘటనకు సంబంధించిన చెక్ సోషల్మీడియాలో వౌరల్ అవుతోంది. నెటిజన్ల ఛలోక్తులు, వ్యాఖ్యాలు వెల్లువెత్తాయి. "పెన్ ఆటోకరెక్ట్ సిస్టమ్లో లోపం.." ఒకరు చమత్కరించగా, స్వయంగా స్కూల్ ప్రిన్సిపల్ స్వయంగా ఇన్ని తప్పులు రాస్తే ఇక చదివే పిల్లల పరిస్థితేమిటని మరికొందరు వాపోయారు. -
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.శ్రీలంక, నేపాల్లో జెన్జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది. కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్ -
హాయ్ స్విగ్గీ.. వాట్ ఏ సడన్ సప్రైజ్!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్ఫాస్ట్ను అందించింది. ఊహించని ఈ పరిణామంతో ఆయన అవాక్కై.. ఆపై తేరుకుని ఆనందం వ్యక్తం చేశారు. శశి థరూర్ గారికి ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఇడ్లీలు అందించగలిగిన అవకాశం కలిగినందుకు మాకు అత్యంత ఆనందంగా ఉంది. రుచికరమైన ఆయన అభిరుచిని ఇవి తృప్తిపరిచాయని ఆశిస్తున్నాం అని స్విగ్గీ(Swiggy) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. దానికి ఆయన స్పందిస్తూ.. నా ఇడ్లీపై పోస్ట్కి స్పందనగా స్విగ్గీ ఇడ్లీలు పంపించి ఆశ్చర్యపరిచింది! ధన్యవాదాలు అంటూ బదులిచ్చారు. ఈ సందర్భంగా స్విగ్గీ సిబ్బందితో ఆయన దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. pic.twitter.com/DdF1yiheT3— Shashi Tharoor (@ShashiTharoor) September 27, 2025 यह हमारे लिए अत्यंत हर्ष का विषय है कि हमें श्री थरूर जी को क्षेत्र की सर्वश्रेष्ठ इडली परोसने का अवसर प्राप्त हुआ। हमारी आशा है कि हमारी टोली उनके स्वादेंद्रियों को तृप्त करने में सफल रही होगी तथा इन पाक-कला के अनुपम चमत्कारों से उन्हें परमानंद की स्थिति मिली होगी। https://t.co/oTaJ2Ykrsn pic.twitter.com/PifmOlitQF— Swiggy Food (@Swiggy) September 28, 2025ఇంతకీ శశిథరూర్ ఇడ్లీ గురించి ఏమన్నారంటే.. ఈ మధ్య ఓ నెటిజన్ ఇడ్లీ గురించి అభివర్నిస్తూ.. steamed regret అని ఓ పోస్ట్ చేశారు. అయితే దానికి స్పందిస్తూ శశి థరూర్ తనదైన ఇంగ్లీష్తో కవితాత్మకంగా ఓ కౌంటర్ పోస్ట్ చేశారు. ఇడ్లీ.. ఓ మేఘం. ఓ తీయని కల.. అదొక కళాత్మక అద్భుతం అని అభివర్ణించారు. అంతేకాదు.. ఇడ్లీ వేస్తున్నట్లుగా ఏఐ ఫొటోను ఆయన షేర్ చేశారు.మొత్తం భారతీయ సంస్కృతిలో ఇడ్లీని అత్యుత్తమ ఆహార సంపద అని పేర్కొన్న ఆయన.. ఠాగూర్, ఎంఎఫ్ హుస్సేన్, సచిన్ టెండూల్కర్ల ప్రతిభతో దానిని పోల్చారు. దీంతో పలువురు నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఆహారంపై థరూర్ అభిప్రాయం మాత్రమే కాదని.. భారతీయత కలబోసిన గొప్ప ప్రశంస అని కామెంట్ సెక్షన్లో పోస్టులు పెడుతున్నారు.దక్షిణాది ప్రసిద్ధ ఫలహార వంటకం ఇడ్లీని ఇంతకంటే గొప్పగా ఎవరూ వర్ణించలేరు..థాంక్యూ సర్. https://t.co/eg46kbwIV7— తెలుగు తీపి (@kkmohan73) September 28, 2025 -
ఇవి స్మార్ట్ రోడ్లు కావు సామి షార్ట్ రోడ్లు!
‘‘యస్.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పినట్లు అధ్వాన్నమైన రోడ్లు అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్యే. కానీ, దేశంలో ఎక్కడ కూడా బెంగళూరులో చేసినట్లు మాత్రం రిపేర్లు చేసి ఉండరు..’’ సోషల్ మీడియాలో బెంగళూరు రోడ్ల దుస్థితి గురించి ఓ నెటిజన్ చేసిన జోక్ ట్వీట్ ఇది.మొన్నటిదాకా బెంగళూరు ట్రాఫిక్ రద్దీ గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఈ మధ్య అధ్వాన్నమైన రోడ్ల గురించి కూడా(Bengaluru Roads) చర్చించుకుంటున్నారు. ఓ ప్రముఖ కంపెనీ రోడ్లు బాగోలేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నగర శివారు నుంచి తరలిపోయింది. దీంతో రాజకీయంగానూ కర్ణాటక కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తామేమీ ఖాళీగా లేమని.. తమ ప్రయత్నం తాము చేస్తున్నామంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) చెబుతున్నారు. అంతేకాదు.. బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను కూడా సంబంధిత మంత్రిగా(పట్టణాభివృద్ధి) ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈ తరుణంలో.. ఇప్పుడు నెట్టింట విమర్శలు మరింత పెరిగిపోయాయి. బెంగళూరు రోడ్ల రిపేర్ పనులు కొనసాగుతున్న వేళ.. పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. ఆ ప్యాచ్ వర్క్లు రెండు, మూడు రోజులకు మించి ఉండడం లేదు. వీటికి తోడు కొత్తగా కొట్టిన రోడ్లు కూడా 48 గంటలు తిరగకముందే పాడైపోతున్నాయి. ఫలితంగా.. ట్రాఫిక్ జాములు, ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో కొందరు ఆ రోడ్లనే ఎక్కుతున్నారు. మొన్నీమధ్యే కాక్స్ టౌన్లోని వెబ్స్టర్ రోడ్డులో రిపేర్లు చెదిరిపోయి మళ్లీ గుంతలు దర్శనమిచ్చాయి. దీంతో భారతినగర్ ప్రజలు ఆ గుంతలకు పూజలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూసి మరికొందరు కూడా అలాగే గుంతలను పూలతో అలంకరించి.. పసుపు, కుంకుమ చల్లి తమను చల్లగా చూడాలంటూ వీడియోలు చేసి వైరల్ అయిపోయారు. తాజాగా.. ఓ వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో చన్నసంద్ర సర్కిల్ వద్ద రిపేర్ అయిన రోడ్ల పరిస్థితి తెలియజేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. చన్నసంద్ర సర్కిల్ వద్ద సెప్టెంబర్ 27న రోడ్డుకు మరమ్మతులు చేశారట. గట్టిగా ఒక్క వాన పడితే ఈ రోడ్డు ఉండదు అంటూ ఆ వ్యక్తి ఆ వీడియోను క్యాప్షన్ ఉంచాడు. దీనికి Greater Bengaluru Authority (@GBA_office) ను ట్యాగ్ చేశాడు. They repaired this section - Channasandra Circle on 27th September. It's 29th September today and the road is gone. What kind of patchwork doesn't last 48hrs? Are your engineers and contractors so much unqualified @GBA_office?You see the water in the video? - it's leaking… https://t.co/2NfPTEA1sN pic.twitter.com/kOH0ExjG8J— Auro (@weekendbiker) September 29, 2025బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల బాధ్యతలను గ్రేటర్ బెంగళూరు అథారిటీ.. వివిధ కాంట్రాక్టర్లకు అప్పజెప్పింది. నగరంలో దీర్ఘకాలిక రోడ్డు అభివృధ్ది ప్రాజెక్టులకు రూ.1,100 కోట్లు ఖర్చు చేయబోతుండగా.. ఇందులో కేవలం రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.750 కోట్లు కేటాయించారు. గుంతల పూడిక, వైట్ టాపింగ్, బ్లాక్టాపింగ్, కొత్త స్మార్ట్ రోడ్ల నిర్మాణం అన్నీ ఇందులోనే జరగనున్నాయి. అక్టోబర్ 31లోగా నగరంలో 10వేల గుంతలను పూడ్చాలంటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ డెడ్లైన్ విధించారు. అయితే.. వర్షాలు, నిర్మాణ నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాల కారణంగా విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. -
స్నేక్హితుడు..!
శ్రీకాకుళం జిల్లా: ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఓ వైపు సాగు చేస్తూనే.. మరోవైపు ఎల్రక్టీషియన్, మెకానిక్గా కూడా రాణిస్తున్నాడు. అన్నింటికీ మించి అలవోకగా పాముల ను పట్టే నేర్పరి. అలాగని ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించాడు హిరమండలం మండలం ఎం.అవలంగికి చెందిన లోలుగు వేణుగోపాలరావు. ఇప్పటివరకు 10 వేలకుపైగా పాములను పట్టి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టిన ఘనత ఆయనది. ఆయనను ‘సాక్షి’ పలకరించగా ఆసక్తికర విషయా లను వెల్లడించారు. 20 ఏళ్ల వయస్సులోనే ఆసక్తి వేణుగోపాలరావుకు ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సు. 20 ఏళ్లలోనే పాములు పట్టాలన్న ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో భాగంగా ఎంతోమంది పాముకాటుకు గురై అవస్థలు పడిన ఘటనలు చూసిన వేణుగోపాలరావుకు మనస్సు కలచివేసిందట. అదే సమయంలో పాములను చంపేస్తున్న ఘటనలు చూసి బాధపడేవాడు. దీంతో అప్పుడే పాములు పట్టాలన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే పెద్ద సంచులు, గొట్టాలతో పట్టడం, వాటికి ఉరి వేసి బంధించడం క్రమేపీ అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన ప్రస్థానం 35 ఏళ్ల కిందట ప్రారంభమైంది. అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పాములు పట్టడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. క్రమేపీ చాకచక్యంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. 2018 తితిలీ తుపాను సమయంలో ఏకంగా 1,500 పాములు పట్టి రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఏడాదికి 500 వరకూ పాములు పడుతుంటాడు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్కు సైతం వెళ్లి పాములు పడుతుంటారు. అందుకే తన నంబర్తో పాటు ప్రత్యేక యూట్యూబ్ చానల్ సైతం ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియాలో తనను సంప్రదిస్తే వీలైనంత వేగంగా అక్కడకు వెళ్తుంటారు. అయితే పాములు పట్టడం అనేది తనకు ఉపాధి కాదని.. కేవలం మనుషుల ప్రా ణాలు పోకూడదని.. అలాగే జీవహింస లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని వేణుగోపాలరావు చెబుతున్నాడు. పాములు ప డితే డబ్బులు డిమాండ్ ఉండదని.. వారి సంతోషంగా ఇచ్చిందే తీసుకుంటామని చెబుతున్నాడు. ఎక్కడైనా పాములు పట్టాలంటే 93951 42681 నంబర్ను సంప్రదించాలని సూచిస్తున్నాడు. -
చిన్ని అద్భుతం రాబోతోంది : స్టార్ సింగర్, ఫోటోలు వైరల్
-
కరూర్ కన్నీరు.. హృదయవిదారక దృశ్యాలు
ఊపిరి సలపని పరిస్థితుల్లో ప్రాణాల కోసం పాకులాడిన యువత.. చేతులు జోడించి ప్రాణభిక్ష కోరుతూ ఆర్థించిన వృద్ధురాలు.. తన బిడ్డ కనిపించడం లేదంటూ ఓ తల్లి పడ్డ ఆవేదన.. ఆ పక్కనే పడి ఉన్న ఓ చిన్నారి మృతదేహం.. ఇవన్నీ ఇప్పుడు కరూర్ విషాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. కరూర్ వెలుచామైపురం టీవీకే ర్యాలీలో ఘోర విషాదం.. 39 మందిని బలిగింది. అనుమతించిన దానికంటే రెట్టింపు సంఖ్యల్లో జనం హాజరు కావడం, వాళ్లను పోలీసులు అదుపు చేయలేకపోవడం, ఆంబులెన్స్లకు దారి ఇచ్చే క్రమంలో తొక్కిసలాట జరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు టీవీకే పరిహారాలు ప్రకటించాయి. న్యాయపరమైన విచారణ జరుగుతోంది. అదే సమయంలో.. ఈ ఘటనకు సంబంధించిన ఘటన హృదయ విదారక దృశ్యాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చెల్లా చెదురైన చెప్పులు, టీవీకే జెండాలు అక్కడి పరిస్థితి తీవ్రతను అద్ధం పడుతున్నాయి. పరామర్శకు వచ్చిన నేతలకు తన రెండేళ్ల బిడ్డ విగతజీవిగా మారిందని చూపిస్తూ ఓ తండ్రి పెట్టిన రోదన అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.So disturbing! Heart-breaking! 😢We need to get out of the hero-worshipping mentality. No celebrity is worth risking a life. #KarurStampede#VijayRally pic.twitter.com/FAlgDjKUkG— Satish Acharya (@satishacharya) September 28, 2025த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025உரிய பாதுகாப்பு வழங்கப்பட்டதாக தெரியவில்லை - Karur People !#TVK #JanaNayagan #KarurStampede pic.twitter.com/VkTqbB5mU5— MAHI (@MahilMass) September 28, 2025#KarurStampede 🚨 Heartbreaking Tragedy in Tamil Nadu 🚨What was meant to be a moment of hope and celebration at #TvkVijay’s rally in Karur has turned into an unimaginable nightmare.💔 31 innocent lives lost in a stampede-like situation.💔 Families who came with joy have… pic.twitter.com/y9cl6hW4RT— Akash (@AdvAkashji) September 27, 2025மீளமுடியாத துயர் 💔#JusticeForKarurRally #Karur #KarurStampedepic.twitter.com/bjvyACOnqS— Prakash (@prakashpins) September 28, 2025#KarurStampede #TVKVijayStampede #Karurpic.twitter.com/9BpJWtY2u3— Manoj Trichy (@manoj4trichy) September 28, 2025#KarurStampede#கொலைகாரன்_விஜய் pic.twitter.com/JRpXLGqDVL— த.சந்தோஷ்குமார் (@MKPSandy) September 28, 2025 -
‘ఓజీ’ నిర్మించిన డీవీవీ క్రియేషన్స్పై కేసులు వేస్తాం
పంజగుట్ట: ఓజీ సినిమాను తీసిన డీవీవీ క్రియేషన్స్పై త్వరలో పరువునష్టంతో పాటు, కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యాయవాది బర్ల మల్లేష్ యాదవ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓజీ సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ తాను కోర్టులో పిటీషన్ వేయగా..రేట్లు పెంపుదలను కోర్టు నిలిపివేసిందన్నారు. ఈ నేపథ్యంలో తనను అవమాన పరుస్తూ డీవీవీ క్రియేషన్స్ వారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను ట్రోల్ చేసేలా ప్రోత్సహించారని మల్లేష్ ఆరోపించారు. దీనిపై తాను మళ్లీ కేసు వేస్తానని చెప్పారు. పేదలకు వినోదం తక్కువ ధరకే అందాలనే ఉద్దేశంతోనే తాను టికెట్ రేట్ల పెంపును వ్యతిరేకించానని పేర్కొన్నారు. -
మహిళలపై ట్రోలింగ్.. అలావాటు పడిపోయాం: హీరోయిన్
ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రస్తుతం దల్దాల్ అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ ఏడాది మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో మెప్పించిన బ్యూటీ.. ఇప్పుడు ఓటీటీ సిరీస్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్కు హాజరైన బాలీవుడ్ భామ మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్పై మాట్లాడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారని.. వీటిని ఎదుర్కోవడంతో ఉమెన్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. "ట్రోలింగ్.. బెదిరింపులు.. దీన్ని మీరు ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. ఇంకో మార్గం లేనందున నన్ను నేనే సర్ది చెప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నాపై వచ్చే ట్రోల్స్ను ఎలాగైనా తట్టుకోగలగనని తెలుసుకున్నా" అని తెలిపింది.సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయించే ఈ రోజుల్లో జీవించడం నిరంతరం భిన్నమైన అభిప్రాయాలను తీసుకొస్తుందని తెలిపింది. నా జీవితంలో పరిస్థితులు నాకు చాలా ఎక్కువగానే నేర్పించాయని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా సినిమా తన జీవితాన్ని మార్చేసిందని భూమి తెలిపింది. టీనేజ్ వయసులో ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనే పెద్ద కలతో నా ప్రయాణాన్ని ప్రారంభించానని పేర్కొంది. అప్పట్లో అవకాశాల కోసం వేచి చూసేదాన్ని అని వెల్లడించింది. కానీ ఈ రోజు నా లక్ష్యంతో పాటు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందానని భూమి పెడ్నేకర్ పంచుకుంది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే భూమి చివరిసారిగా ది రాయల్స్లో అనే వెబ్ సిరీస్లో కనిపించింది. -
సముద్ర ఒడ్డున టాలీవుడ్ నటి.. స్విమ్మింగ్పూల్లో శ్రియా శరణ్!
సముద్రపు ఒడ్డున టాలీవుడ్ నటి సాహితి హోయలు..స్విమ్మింగ్పూల్లో చిల్ అవుతోన్న శ్రియా శరణ్..బుల్లితెర నటి తేజస్వినీ గౌడ నవరాత్రి సెలబ్రేషన్స్..బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ శారీ లుక్..గ్రీన్ శారీలో హీరోయిన్ భూమిక చావ్లా.. View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) -
సాయి భార్గవ్ ను అరెస్ట్ చేసిన సీఐడీ
-
సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ అరెస్ట్ చేసిన సీఐడీ
గుంటూరు: యూరియా అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడనే అభియోగంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ సాయి భార్గవ్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరాలు ,దోపిడీలు, దొమ్మీలు, కిడ్నాప్ లు చేసే వ్యక్తులపై పెట్టే 111 (3)(4)(5)సెక్షన్ను సాయి భార్గవ్పై పెట్టారు. అనంతరం సాయి భార్గవ్ను సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సోషల్ మీడియా కేసులో 111(3)(4)(5) సెక్షన్ వర్తించదని వాదనను వినిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. విచారణ సందర్భంగా సిఐడి పోలీసులు తనను కొట్టారని న్యాయమూర్తికి తెలిపిన సాయి భార్గవ్. ఇన్ కెమెరా ప్రొసీడింగిడ్స్ తో సాయి భార్గవ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిఐడి పోలీసులు తనను కొట్టారని సాయి భార్గవ్ న్యాయమూర్తి ముందు ఇచ్చిన వాంగ్మూలంపై అతన్ని వైద్య పరీక్షల కోసం న్యాయవాది సమక్షంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. -
ఐదు దశాబ్దాలుగా నన్ను భరిస్తోంది.. అంతకంటే ఏం కావాలి! బిగ్ బీ
బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేకతే వేరు, నటుడుగా, వ్యాఖ్యాతగా, హోస్ట్గా సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 1973, జూన్ 3న బాలీవుడ్ హీరోయిన్ జయ బచ్చన్ వివాహం చేసుకున్నారు. అయిదుదశాబ్దాల వైవాహిక జీవితంలో అత్యంత నిత్యనూతన జంట అనడంలో సందేహంలేదు. పాతికేళ్లుగా కౌన్ బనేగా కరోడ్పతి (KBC) అనే గేమ్ షోను విజయవంతంగా నిర్వహిస్తున్న అమితాబ్ తాజాగా బిగ్ బీ తన భార్య జయాబచ్చన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా ఎపిసోడ్లో, తన భార్య జయ గురించి ఒక జోక్ వేయడం నెట్టింట చర్చకు దారి తీసింది. కేబీసీ షోలో ఆశా ధిర్యన్ అనే కంటెస్టెంట్ తో బిగ్బీ మాట్లాడుతూ 'అద్భుత మహిళ'గా ఆశాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు 60 సెకన్లలో తనను తాను ప్రశంసించుకోవాలని కోరారు. తనను తాను పొగుడుకోవడం పూర్తి చేసిన తర్వాత, బాలీవుడ్ సూపర్ స్టార్ ని తన భార్య జయ గురించి ఏదైనా మంచిగా చెప్పమని కోరింది. దీంతో 52 ఏళ్లుగా ఆమె నన్ను భరిస్తోంది,దీని కంటే పెద్ద పొగడ్త ఇంకేముంటుంది? అయినా పొట్టి వాళ్లతో తిట్లు తినడం తనకు కొత్తేమీ కాదు అంటూ ఛలోక్తులు విసిరారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్న బిగ్బా తన భార్య జయా బచ్చన్ హైట్పై కామెడీ చేసేవారికి సరియైన జవాబు చెప్పారు.ఈ షోలో ఆశా తన ప్రేమకథ గురించి, ఎత్తు విషయంలో తమజంట మధ్య ఉన్న తేడా, ఫ్రెండ్స్ జోకులు గురించి చెప్పుకుంది.చాలా పొడవుగా ఉండే తన భర్త తనతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడని షోలో చెప్పింది. ఆమె కథ విన్న బిగ్ బి రియాక్ట్ అయ్యాడు, ఆమె చెప్పింది తనకు చాలా నచ్చిందని, అయితే తాను బాగా కనెక్ట్ అయ్యే ఒక విషయం ఉందని, ఆమె కథను వినడం తనకు నచ్చిందని చెబుతూ ఒక పొట్టి వ్యక్తి ఒక పొడవాటి వ్యక్తిని తిట్టడం తనకు కొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూసాయి.కాగా అమితాబ్-జయ జంట పిల్లలే అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా. అమితాబ్ వారసుడిగాఅభిషేక్ బచ్చన్ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇక అమితాబ్ కుటుంబంలో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలిగిన ఐశ్వర్య ఆ ఫ్యామిలీకి మరింత వన్నె తెచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. -
పోలీసుల బరితెగింపు..హైకోర్టుకు బురిడీ... ఆదేశాలు బేఖాతర్
సాక్షి అమరావతి/సాక్షి,గుంటూరు: రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పోలీసులే కిడ్నాపర్లుగా మారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది.అంతేకాదు.. ఏకంగా హైకోర్టుకే బురిడీ కొట్టించేందుకు యత్నించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. కేసు నమోదు చేయకుండా.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరులో సోషల్ మీడియా కార్యకర్త సౌందరరెడ్డి(సవీంద్రరెడ్డి)ని ప్రత్తిపాడు పోలీసులు సోమవారం రాత్రి అపహరించారు. తన భార్య లక్ష్మీప్రసన్నతో కారులో వెళ్తున్న ఆయన్ని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సౌందరరెడ్డి భార్యను రోడ్డుపై వదిలేసి ఆయన్ను కారుతో సహా అపహరించడం తీవ్ర కలకలం రేపింది. తాము తాడేపల్లి పోలీసులమని.. ఓ కేసులో విచారించి అరగంటలో ఆయన్ను పంపేస్తామని ఆమెతో నమ్మబలికారు. అయితే ఆమె తాడేపల్లి స్టేషన్కు వెళ్లగా.. అసలు సౌందరరెడ్డిని తాము తీసుకురాలేదని అక్కడి పోలీసులు చెప్పడం గమనార్హం. దాంతో తన భర్తను పోలీసుల పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు లక్ష్మీప్రసన్న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. దీనిపై సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం ఉదయం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మేం అదుపులోకి తీసుకోనే లేదు.. హైకోర్టుకు పోలీసుల బురిడీ..! హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సందర్భంగా పోలీసులు మరింత బరి తెగించారు. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ కేసు విచారణకు రాగా... అసలు సౌందరరెడ్డిని తాము అదుపులోకి తీసుకోనేలేదని హైకోర్టుకు పోలీసులు చెప్పడం గమనార్హం. ఆయన తమ అదుపులోనే లేరని చెప్పారు. మా ఎదుటే హాజరుపరచండి.. సౌందరరెడ్డిని బుధవారం తమ ఎదుట హాజరుపర్చాలని విచారణ సందర్భంగా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అంతేకాదు.. ఆయన్ను మరే ఇతర మేజిస్ట్రేట్ కోర్టులోనూ హాజరుపరచవద్దని కూడా స్పష్టంగా తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరున్యాయస్థానం ఇంత స్పష్టంగా చెప్పినా పోలీసుల తీరు మారలేదు! హైకోర్టు ఆదేశాలు అంటే తమకు ఏమాత్రం లెక్క లేదన్నట్టు వ్యవహరించారు. సౌందరరెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు బనాయించారు. ఆయన్ను సోమవారం రాత్రంతా గుంటూరు సీసీఎస్ పోలీసు స్టేషన్లో నిర్బంధించారు. అనంతరం పోలీసులు మంగళవారం ఉదయం ఆయన్ను ప్రత్తిపాడు పోలీసు స్టేషన్కు తరలించి గంజాయి కేసులో ఆరో ముద్దాయిగా అక్రమంగా చేర్చారు. అంతటితో పోలీసులు ఆగలేదు.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరీ సౌందరరెడ్డిని గుంటూరు ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో హాజరుపరిచారు. అక్రమంగా గంజాయి కేసులో నిందితుడుగా చేరుస్తూ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించేందుకు రిమాండ్ రిపోర్ట్ రూపొందించారు. అయితే హైకోర్టు ఆదేశాలపై సమాచారం ఉండటంతో పోలీసులు అతడిని తన ఎదుట హాజరుపరచడం సరికాదని మేజిస్ట్రేట్ స్పష్టంచేశారు. సౌందరరెడ్డిని బుధవారం ఉదయం హైకోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకూ న్యాయవాది సమక్షంలో ప్రత్తిపాడు పోలీసు కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.నిర్భీతిగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. రాష్ట్రంలో పోలీసులు ఎంత చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నది... అక్రమ కేసులతో ఎంతగా వేధిస్తున్నారన్నది ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. అంతేకాదు.. అవాస్తవ సమాచారంతో ఏకంగా హైకోర్టునే బురిడీ కొట్టించేందుకు యత్నిచడం తీవ్రంగా విస్మయ పరుస్తోంది. ఏకంగా హైకోర్టు ఆదేశాలను నిర్భీతిగా ఉల్లంఘించడం పోలీసుల బరితెగింపును బట్టబయలు చేస్తోంది. పోలీసుల తీరుపై హైకోర్టు బుధవారం ఎలా స్పందిస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
పౌరులను పట్టుకెళుతున్నా చూస్తూ ఊరుకోవాలా?
ఓ పౌరుడిని పోలీసులు చాలా క్యాజువల్గా వచ్చి పట్టుకుపోయి తిప్పుతూ ఉంటే.. మేం చూస్తూ ఊరుకోవాలా? ఇంత చేస్తున్నా కూడా మేం జోక్యం చేసుకోకూడదా? తన భర్త సౌందరరెడ్డిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని అతడి భార్య ఫిర్యాదు ఇస్తే జనరల్ డైరీ (జీడీ)లో ఎంట్రీ చేసి మౌనంగా ఉండిపోతారా? ఓ మహిళ ఫిర్యాదు ఇస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయరా? మీరు ఇంత చేస్తుంటే.. మమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండమంటారా..?– ఖాకీల తీరుపై హైకోర్టు కన్నెర్రసాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై పోలీసుల అరాచకాలు ఆగడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు. తీరు మార్చుకోవడం లేదు. అబద్ధాలతో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా ఇలాగే కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. సోషల్ మీడియా యాక్టివిస్టు కుంచాల సౌందరరెడ్డి అలియాస్ సవీంద్రరెడ్డిని అక్రమంగా నిర్బంధించిన పోలీసులు అసలు ఆయన ఎక్కడున్నాడో తమకు తెలియనే తెలియదంటూ బుకాయించి హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. అయితే ఖాకీల తీరు గురించి బాగా తెలిసిన హైకోర్టు వెంటనే అప్రమత్తమైంది. సౌందరరెడ్డి ఎక్కడున్నా సరే గాలించి బుధవారం తమ ముందు హాజరుపరచాల్సిందేనని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులను ఆదేశించింది. ఆయన్ను మరో కేసులో అరెస్ట్ చేశామంటూ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కూడా వీల్లేదని హెచ్చరించింది. సౌందరరెడ్డిని నేరుగా తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకవేళ సౌందరరెడ్డిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైతే.. అతడిని తమ ముందే హాజరుపరిచి తీరాలన్న తమ ఉత్తర్వుల గురించి సంబంధిత పోలీసులకు, మేజిస్ట్రేట్కు స్పష్టంగా చెప్పి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) టి.విష్ణుతేజకు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా యాక్టివిస్టు సౌందరరెడ్డిని ఒంగోలు పోలీసు ట్రైనింగ్ అకాడమీ (పీటీఏ)లో అక్రమంగా నిర్బంధించారని పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న నేపథ్యంలో, పీటీఏ డైరెక్టర్ను ఈ వ్యాజ్యంలో సుమోటో ప్రతివాదిగా చేరుస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచి తీరాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.అక్రమ నిర్బంధంపై లంచ్మోషన్ పిటిషన్..గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు తన భర్తను అక్రమంగా నిర్బంధించారని, అరగంటలో ఇంటికి పంపేస్తామంటూ తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ సౌందరరెడ్డి భార్య లక్ష్మీప్రసన్న మంగళవారం అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది.ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు..పిటిషనర్ తరఫున న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఇంటికి వెళుతున్న సౌందరరెడ్డిని తాడేపల్లి పోలీసులు తీసుకెళ్లారన్నారు. ఏ కేసులో తీసుకెళుతున్నారు..? ఎక్కడికి తీసుకెళుతున్నారు..? లాంటి వివరాలు ఏమీ చెప్పలేదన్నారు. ఆయన జాడ ఇప్పటివరకు తెలియడం లేదన్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. బాధితుడు ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఉన్నట్లు తెలిసిందని రామలక్ష్మణరెడ్డి చెప్పారు. దీనిపై ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. దీనిపై హైకోర్టు ధర్మాసనం పోలీసుల తరఫున హాజరవుతున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజను వివరణ కోరగా.. సౌందరరెడ్డిని ఏ పోలీసు అధికారీ తాడేపల్లి స్టేషన్కు తీసుకురాలేదని చెప్పారు. అసలు సౌందరరెడ్డి ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. ఆయన్ను ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదన్నారు. తన భర్తను కొందరు తీసుకెళ్లారంటూ పిటిషనర్ లక్ష్మీప్రసన్న ఫిర్యాదు చేశారని, దానిని తాము జనరల్ డైరీలో నమోదు చేశామని కోర్టుకు నివేదించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని చెబుతానన్నారు. అయితే పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన హైకోర్టు.. అసలు ఓ మహిళ ఫిర్యాదు చేస్తే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం జనరల్ డైరీలో మాత్రమే నమోదు చేయడం ఏమిటని సూటిగా ప్రశ్నించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. సౌందరరెడ్డి ఎక్కడ ఉన్నా కూడా ఆచూకీ తెలుసుకుని బుధవారం తమ ముందు హాజరుపరిచి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేసి..వాస్తవానికి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీసులు సౌందరరెడ్డిని సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలలోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు రిమాండ్ రిపోర్ట్ సైతం సిద్ధం చేశారు. అయితే ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తెలిసినప్పటికీ ఆయన కోర్టుకు వాస్తవాలు వెల్లడించలేదు. అసలు సౌందరరెడ్డి తమ అధీనంలోనే లేరంటూ చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలలోపు సౌందరరెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచేందుకు సిద్ధమైన పోలీసులు.. అనంతరం అసలు ఆయన తమ అధీనంలోనే లేరని సాయంత్రం 4 గంటల సమయంలో హైకోర్టుకు చెప్పడం గమనార్హం.తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నం...!పరిస్థితి చేయిదాటి పోతుండటంతో పోలీసుల తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వప్రత్యేక న్యాయవాది ప్రయత్నించారు. సౌందరరెడ్డిని ఏ పోలీసూ అదుపులోకి తీసుకోలేదని తొలుత చెప్పిన ఆయన తరువాత మాట మార్చారు. ఒకవేళ ఏదైనా ఇతర కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఉంటే..! అంటూ కప్పదాటు వైఖరి అనుసరించారు. అప్పటికే ధర్మాసనానికి మొత్తం వ్యవహారం అర్థం కావడంతో.. సౌందరరెడ్డిని ఏ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏ కేసులోనైనా సరే.. సౌందరరెడ్డిని తమ ముందు మాత్రమే హాజరుపరిచి తీరాలని ధర్మాసనం పోలీసులకు అల్టిమేటం జారీ చేసింది. ఈ విషయంలో మరో మాటకు తావు లేదంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
నవరాత్రి సెలబ్రేషన్స్లో శుభ శ్రీ రాయగురు.. బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర స్టిల్స్!
నవరాత్రి సెలబ్రేషన్స్లో బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు..బ్యూటీ మూవీ హీరోయిన్ నీలఖి పాత్ర స్టిల్స్..గ్రీన్ డ్రెస్లో ఊర్మిళ హోయలు..యాంకర్ లాస్య నవరాత్రి సంబురాలు.బీచ్లో బిగ్బాస్ బ్యూటీ కిర్రాక్ సీత చిల్.. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Urmila Matondkar (@urmilamatondkarofficial) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Subhashree Rayaguru (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Seetha/Supraja🦋🇮🇳 (@kirrakseetha) -
అమెరికాలో టిక్టాక్ బాధ్యత ఒరాకిల్కు
వాషింగ్టన్: అమెరికాలో సామాజిక మాధ్యమం టిక్టాక్ బాధ్యతలను ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ చేపట్టనుంది. అమెరికా వినియోగదారుల కోసం అవసరమైన అల్గారిథమ్ను త్వరలో టిక్టాక్ అందజేయనుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఫోన్ సంభాషణ సందర్భంగా ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి వెల్లడించారు. చైనాకు చెందిన బైట్డ్యాన్స్ కంపెనీ యాజమాన్యంలో టిక్టాక్ పనిచేస్తోంది. తాజా ఒప్పందంతో అమెరికాలోని టిక్టాక్ వినియోగదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనా కంపెనీ తారుమారు చేసేందుకు అవకాశం ఉందనే ఆందోళనలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో సిల్వర్ లేక్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కూడా భాగస్వామిగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. టిక్టాక్ను అమెరికా కంపెనీకి అమ్మేయాలని లేదా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని బైట్డ్యాన్స్ను హెచ్చరిస్తూ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గత అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన ట్రంప్..బైడెన్ విధించిన నిషేధం గడువును పలుమార్లు పొడిగించారు. టిక్టాక్తో చర్చలను సైతం కొనసాగించారు. తాజాగా, జిన్పింగ్తో ఫోన్ కాల్ సందర్భంగా దీనిపై ట్రంప్ ఒక అంగీకారానికి వచ్చారు. -
వీక్షణల కోసం.. వేలంవెర్రి
రీల్స్ చేస్తున్నవాళ్లు, రీల్స్ చూస్తున్నవాళ్లు.. సమాజంలో ఉన్నది ఇప్పుడు ఈ రెండే వర్గాలు అన్నంతగా సోషల్ మీడియా మార్చేసింది. ఉన్నవారు–లేనివారు.. స్త్రీలు–పురుషులు.. రాత్రి–పగలు.. ఇంట–బయట.. ఇవేవీలేవు, ప్రతి ఒక్కరూ రీల్స్కి అతుక్కుపోతున్నారు. వాళ్లు అలా అతుక్కుపోయేలా కంటెంట్ క్రియేటర్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. అయితే ఎంతోమందికి ఆనందాన్నిస్తున్న రీల్సే.. ఆ రీల్స్ చేస్తున్న వ్యక్తులు ముఖ్యంగా మహిళల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. పరువు కోసం కుటుంబ సభ్యులే వారి ఉసురు తీసేందుకు ప్రేరేపిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్నిక్కీ భాటీ.. గ్రేటర్ నోయిడాకు చెందిన 26 ఏళ్ల ఈమెను ఇటీవల ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టి నిప్పంటించటంతో మరణించింది. మొదట దీన్ని వరకట్న హత్య అని పోలీసులు భావించారు. అయితే నిక్కీ రీల్స్ చేయటంపై అభ్యంతరం తెలిపిన ఆమె మెట్టినింటివారు.. ఆమె తమ మాట వినకపోవటంతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి, నిప్పంటించారని తర్వాత వెల్లడించారు!వద్దని చెప్పినందుకు.. నిక్కీ మరణానికి కొన్ని నెలల ముందు ఇలాంటి ఘటనే హరియాణాని గురుగావ్లో జరిగింది. 25 ఏళ్ల రాధిక యాదవ్ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక సోషల్ మీడియా రీల్స్ చేయడంపై ఆయన తీవ్రంగా కలత చెందారని, ఆ మనోవ్యథ ఆగ్రహంగా మారి కూతుర్ని చంపేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక మహిళ తను రీల్స్ చేయటానికి అడ్డు చెప్పినందుకు భర్తపై కత్తితో దాడి చేసింది. ఆ రీల్స్ రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆ భర్త మనో వేదన. దేశమంతా ఇదే గొడవదేశంలోని చాలాచోట్ల కొందరు చేస్తున్న రీల్స్, షార్ట్స్ కుటుంబాలలో అశాంతికి, ఆవేదనకు, ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. లైక్లు, కామెంట్లు, వాటి ద్వారా వచ్చే పేరు, డబ్బు కోసం కొందరు అశ్లీలత, అసభ్యత నిండిన కంటెంట్తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉన్నా, భారతీయ సమాజం మాత్రం ఈ రీళ్ల సుడిగాలిని తట్టుకోలేక సతమతం అవుతోంది. పల్లెల నుంచి మహా నగరాలకు వలస వచ్చిన వారు అక్కడి వెలుగు జిలుగుల నవ నాగరికతలకు ఎలాగైతే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతారో.. కంటెంట్ క్రియేటర్ల జీవితాల్లోకి రీల్స్, షార్ట్స్ అంతటి థ్రిల్ తెచ్చిపెట్టాయి. వీక్షకులు చూస్తున్నకొద్దీ వారు ఇంకా ఇంకా చూసేలా కంటెంట్ మోతాదును పెంచుకుంటూ పోతున్నారు.‘మిస్టేకెన్ మోడర్నిటీ’?!తాత్కాలికమైన ఆనందంతో చురుకు పుట్టించే ‘డోపమైన్–బూస్టింగ్’ కంటెంట్ను ఆస్వాదించటంలో వీక్షకులు, అలాంటి కంటెంట్ను సృష్టించటంలో కంటెంట్ క్రియేటర్లు.. అదే లోకంగా ఉండటంతో సమాజంలో ప్రమాదకరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లవుతోంది! కంటెంట్ క్రియేటర్లలో కనిపించే ఈ దూకుడును ‘మిస్టేకెన్ మోడర్నిటీ’ (ఆధునికతను వేరేలా అర్థం చేసుకోవటం) అని సామాజిక నిపుణులు అంటున్నారుఉపయోగపడేవీ ఉన్నాయిరీల్స్, షార్ట్స్.. అసభ్యత లేనంతవరకూ ఎవరికీ ఇబ్బంది కావు. అశ్లీలత కానంతవరకూ ఎవరికీ హాని చేయవు. ఒక వర్గాన్ని, మతాన్ని, ఒకరి శరీరాన్ని, వైకల్యాన్ని వెక్కిరిస్తూ, వెకిలిచేష్టలతో చేసే వీడియోలు సమాజానికి ప్రమాదకరం. యువతను పెడదారిపట్టించే కంటెంట్ ఉన్న షార్ట్స్.. ఏ జనరేషన్కీ మంచివికావు. మరి, ఉపయోగపడే రీల్స్, షార్ట్స్ లేవా అంటే ఎందుకు లేవూ, చాలా ఉన్నాయి. సరదాగా, నవ్వించేవి.. విజ్ఞానాన్ని పంచేవి.. సరికొత్త విషయాలు తెలియజేసేవి.. వంటలవీ, ఆధ్యాత్మికతవీ.. ఇలాంటి ఎన్నో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.వీక్షకులే తిరస్కరించాలిలైకుల కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం కంటెంట్ క్రియేటర్లు అశ్లీలమైన, అసభ్యకరమైన రీల్స్కి అడ్డుకట్ట వేసేదెలా? చాలా సింపుల్ అంటున్నారు మానసిక నిపుణులు. ‘అలాంటి కంటెంట్ను ఆదరించకపోవటం లేదా వారిని బ్లాక్ చేయడం ద్వారా వారికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వీడియోలు చేయడం ఒక మానసిక సమస్య కూడా కావచ్చు’ అంటున్నారు మానసిక నిపుణులు.రీల్సే లోకం!» ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’, గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఇప్సోస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 33 పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.» షార్ట్స్, రీల్స్ భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి.» ముఖ్యంగా దేశంలో అత్యధికులు చూసే షార్ట్ ఫామ్ వీడియో ఫార్మాట్గా రీల్స్ అవతరించాయి.» 97 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా తక్కువ నిడివిగల వీడియోలు చూస్తున్నారు. ఇందులో సింహభాగం రీల్సే.» ఈ ట్రెండ్ జెన్ జెడ్ యూజర్లలో ఎక్కువగా ఉంది.వీటిని చూడటం ఎంటర్టైన్మెంట్ స్థాయిని దాటి.. దైనందిన కార్యకలాపంలా మారిపోయింది. -
యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం
కార్లుపైకి లేచి దొర్లుకుంటూ వచ్చే భయానక ప్రమాదాలు సినిమాల్లోనే చూస్తుంటాం. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలైతే ఏ రైంజ్లో కార్లు పైకి లెగుస్తాయో తెలిసిందే. అచ్చం అలాంటి భయానక ప్రమాదం మన కళ్లముందు జరిగి..పొరపాటు ఆ ఘటనలో చిక్కుకుంటే అమ్మో..! ఏ జరుగుతుందో అన్నది ఊహకే అందనిది. అలాంటి యాక్సిడెంట్ బారినేపడి జస్ట్ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డాడు. చెప్పాలంటే చావు అంచులదాక వెళ్లొచ్చాడని చెప్పొచ్చు. ఈ ఘటన అమెరికాలోని నెబ్రాస్కా గ్యాస్ స్టేషన్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జాన్సన్ అనే వ్యక్తి బ్రాడీ గేటు వద్ద తన ట్రక్కును పార్కింగ్ చేసి, విండోని క్లీన్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక కారు పల్టీలు కొడుతూ అతడివైపుకి దూసుకువస్తుంది. రెప్పపాటులో స్పందించి తప్పించుకున్నాడు లేదంటే ఆ కారుకింద నుజ్జు నుజ్జు అయ్యి ఉండేవాడు. మృత్యువుని చాలా దగ్గర నుంచి చూశాడు. ఏ మాత్రం ఆలస్యం చేసిన జాన్సన్ అక్కడికక్కడే ప్రాణాలు గాల్లో కలసిపోయావు. అంతటి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకుని ఆ కారులోని డ్రైవర్ ఏ పరిస్థితుల్లో ఉన్నాడని కనుక్కోవడానికి వెళ్లడం విశేషం. మితిమీరిన వేగంతో వచ్చిన డ్రైవర్ని తప్పుపట్టక, అతడి బాగోగులు గురించి ఆలోచించి.. తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు జాన్సన్. ఈ వీడియోని చూసిన నెటజన్లు కూడా సదరు కారు డ్రైవర్పై విమర్శలు ఎత్తడమే గాక, త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ..బ్రో నువ్వు మాములు లక్కీవి కాదు అంటూ పొగడ్తల జల్లు కురిపించారు.WATCH: Like an action movie… A man cleaning his windshield at a Nebraska gas station dodges an out-of-control car that flips on its side. He suffered only minor injuries. The speeding driver faces multiple citations. 📹: Lincoln County Sheriff’s Office pic.twitter.com/Yfg7qgNMHU— John-Carlos Estrada 🎙️ (@Mr_JCE) September 17, 2025 (చదవండి: ప్రకృతి సోయగం..! ఆహ్లాదం, ఆనందం..) -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
భార్య కోసం 175కి.మీ. దాటి, చివరకు..
అన్యోన్యంగా ఉన్న ఆ ఆలుమగల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు జరిగాయి. అంతే.. భార్య అతన్ని విడిచి దూరంగా వెళ్లిపోయింది. ఆమెను వెతుక్కుంటూ ఆ భర్త ఊర్లు దాటి వెళ్లాడు. పశ్చాత్తాపంతో.. బతిమాలైనా సరే ఆమెను వెనక్కి తీసుకువద్దామని అతను అనుకున్నాడేమో అని మీరు పొరపడేరు!. కానే కాదు.. షేక్ అంజాద్కు, అతని భార్యకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొంతకాలంగా గొడవలు పడ్డారు. ఈ క్రమంలో.. ఆమె భర్తను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ తెలుసుకున్న ఆ భర్త.. 175 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె దగ్గరకు చేరాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడుతూ.. బతిమాల సాగాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకున్నాడో ఏమో.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాళ్ల గొడవను ఫోన్లో రికార్డు చేశాడు. అయితే.. భార్యతో సరదాగా మాట్లాడుతూనే ప్యాంట్ జేబులో ఉన్న కత్తిని అంజాద్ బయటకు తీశాడు. బతిమాలుతున్నట్లు కనిపిస్తూనే.. హఠాత్తుగా ఆమె గొంతు కోశాడు. ఆపై కోపంతో జుట్టు పట్టి లాగి నడిరోడ్డు మీదకు విసిరేశాడు. ఆ పరిణామంతో ఆ వీడియో రికార్డు చేసే వ్యక్తి సహా అక్కడున్నవాళ్లంతా అంతా హాహాకారాలు చేశారు. ఆ మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పారిపోయే ప్రయత్నం చేసిన ఆంజాద్ను పట్టుకుని పోలీసులకు అప్పప్పించారు. సెప్టెంబర్ 18వ తేదీ గురువారం మధ్యాహ్నాం ఒడిశా బాలాసోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దంపతుల స్వస్థలం కటక్గా పోలీసులు ధృవీకరించుకున్నారు. మనస్పర్థలతోనే అతను అలా చేశాడని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు అంటున్నారు. ఆ భర్త గొంతు కోసిన వీడియో నెట్టింటకు చేరింది. -
మీ పేరెంట్స్ మీతోనే ఉంటారా? ఈ ప్రశ్న అవసరమా?
సాధారణంగా ఏదైనా ఉద్యోగంలోకి తీసుకోవడం కోసం చేసే ఇంటర్వ్యూలు అభ్యర్థి నైపుణ్యాలు, అర్హతలు, ఆ సంస్థలో వారిని తీసుకోవాలనుకుంటున్న హోదాకు తగిన అర్హతను అంచనా వేయడం పైనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు ప్రశ్నలు అభ్యర్థి వ్యక్తిగత రంగంలోకి వెళతాయి. ఇటీవల ఓ అభర్థి ఎదుర్కొన్న అలాంటి ఒక ప్రశ్న – ‘మీరు మీ తల్లిదండ్రులతో నివసిస్తున్నారా?’ అది విన్న ఆ అభ్యర్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నిజానికిది ఎటువంటి ఇబ్బందీ కలిగించని ప్రశ్నే అయినప్పటికీ కొంతమంది రిక్రూటర్లు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారనే దానిపై ఆన్లైన్లో చర్చకు దారితీసింది. నిజమే కదా... ఎందుకు అడుగుతారు? ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన ఒకరిద్దరు అభ్యర్థులు వేర్వేరు ఇంటర్వ్యూయర్లు తమని తమ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా అని అడిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మొదటిసారి ఇది జరిగినప్పుడు, కంపెనీ తరువాత ఉద్యోగ ఆఫర్ను పొడిగించింది, కానీ అభ్యర్థి దానిని తిరస్కరించాడు. తరువాతి ఇంటర్వ్యూలో, మరొక రిక్రూటర్ ఆ ప్రశ్నను పునరావృతం చేసి, ఆపై ఇతర ఉద్యోగ ఆఫర్ల వివరాల కోసం, వాటిని తిరస్కరించడానికి గల కారణాల కోసం ఒత్తిడి చేశాడు.ప్రశ్న సముచితమైన దేనా అని ఖచ్చితంగా తెలియదని, అభ్యర్థి ఆర్థికంగా తల్లిదండ్రులపై ఆధారపడతాడా? లేక అతనిపై తల్లిదండ్రుల సంరక్షణ భారం ఎంతమేరకు పడుతుందా అని అంచనా వేయడానికి ఇలాంటి ప్రశ్నలు వేయవలసి వచ్చిందని ఆ కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కుటుంబంతో కలిసి జీవిస్తున్నారంటే తక్కువ ఖర్చులు అని రిక్రూటర్లు భావించవచ్చని, తగ్గిన జీతాన్ని మేనేజ్ చేయడం సులభం అవుతుందని వారి అంచనా. నియామక ప్రక్రియలో అసమతుల్యతపై వారు నిరాశ వ్యక్తం చేశారు, ఇంటర్వ్యూయర్లు ఉద్యోగ పనితీరుకు సంబంధం లేని విషయాలను కూడా పరిశీలించవచ్చు. అర్థరహిత వ్యాఖ్యతో, కృత్రిమ మేధస్సు అటువంటి పద్ధతులను పూర్తిగా భర్తీ చేయగలదా అని అభ్యర్థి ఆశ్చర్యపోయాడు.చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియోకమ్యూనిటీ స్పందనఇలాంటి ప్రశ్నలు ఆఫర్ ఎంత తక్కువగా ఉంటుందో నిర్ణయించే ప్రయత్నాన్ని సూచిస్తాయన్నారు. కుటుంబంతో కలసి ఉండటం వల్ల అభ్యర్థిపైన తక్కువ ఆర్థిక ఒత్తిడి పడుతుందని వాళ్ల ఉద్దేశంగా భావించ వచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎలా ఎదుర్కోవాలి?ఈ పరిస్థితులను నిర్వహించడానికి అనేక మంది వినియోగదారులు తమ ఆలోచనలను ఇలా పంచుకున్నారు, వాటిలో ‘‘మీరు ఎందుకు అడుగుతారు?’’ అనే ఆసక్తితో స్పందించడం లేదా ప్రశ్నలోని అసంబద్ధతను ఎత్తి చూపడం వంటివి ఉన్నాయి. నిరుద్యోగ భృతి లేదా వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి యజమానులు అడిగిన ఇలాంటి అనుభవాలను కొందరు వివరించారు. ఈ చర్చ ఒక సాధారణ భావనను నొక్కి చెప్పింది: కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేయడం గురించి తక్కువగా ఉండవచ్చు లేదా తమ సంస్థలో వీలైనంత తక్కువ ప్యాకేజీకే ఒప్పించేందుకు తగిన అవకాశాలను గుర్తించడం గురించి ఉండవచ్చు. తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారంటే వారు బాధ్యతతో పని చేస్తారని ఇంటర్వ్యూయర్లు భావించవచ్చు. ఇదీ చదవండి: మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్ -
అధికారులే బాధ్యులు.. మాట మార్చడం చిటికెలో పని!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని, యూరియాతోపాటు మొత్తం 94,892 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు మూడో తారీఖున ప్రకటించిన బాబుగారు.. పదహారవ తేదీ వచ్చేసరికి యూరియా సరఫరాలో విఫలమయ్యామని, మానవ తప్పిదం జరిగిపోయిందని, అధికారులు తానిచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడంతోనే ఈ విపత్తు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో వాపోయారు! తద్వారా ఏం తేలింది? రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయనడం తన ఘనతగానూ.. లేమికి కారణం అధికారులదిగానూ తేల్చేసినట్ట అయ్యింది!యూరియా కొరత లేదని దబాయించినప్పుడు... వాస్తవపరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు బాబుగారు ఎంత హడావుడి చేశారని? వైఎస్సార్ కాంగ్రెస్ బుద్ది, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, దుష్ప్రచారం చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతోందని, వారు మనుషులా, పశువులా అని కూడా పెడబొబ్బలు పెట్టారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా.. ఖబడ్డార్! అని హెచ్చరించారు కూడా. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని రైతులు, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ హూంకరింపులన్నీ సోషల్మీడియాను బెదిరించేందుకే అన్నది స్పష్టం. టీడీపీకి వంతపాడే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికలలో యూరియాపై రైతులు పడుతున్న పాట్లను ఫోటోలతో సహా కథనాలు ఇస్తూంటే ఆ విషయం బాబుగారికి తెలియకుండా పోతుందా? స్టేట్ పేజీలలో తన బెదిరింపు ప్రకటనలకే టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇస్తుండడంతో అదే నిజమని జనం నమ్మాలని భావించారా అన్నది తెలియదు. యూరియా సమస్యపై నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. దాంతో ఇప్పుడు యూరియా సరఫరాపై ప్లాన్ ఇచ్చానని నాలుక మడతేశారు. అదేమిటో చెబితే అధికారులకు తెలిసేది కదా! టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించడంతో రైతులకు ఈ కష్టాలొచ్చాయని అంటున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటలు వల్ల ప్రజలకు కేన్సర్వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించ లేదని, రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికార్లు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.ఇందుకు బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమోటా ధరలు కూడా పడి పోయాయని, ఈ టైమ్లో రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ లను కోరడం మంచిదే అయినా, కాని వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను కాల్వలలో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. . ఆయన చెబుతున్న సంగతులన్నిటికి కేవలం అధికారులే బాధ్యులా? అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనివ్వకుండా ప్రచారానికి వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు.దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమోటా, ఉల్లి పంటలు అధికం.ప్రతి నెల మొదటి తేదీన అదనపు ఫించన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగువేలు ఇవ్వడానికి హెలికాఫ్టర్ వేసుకుని జిల్లాలకు సి.ఎమ్. వెళుతున్నారు.అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య వంటివాటిపై ఎందుకు వీరు దృష్టి పెట్టలేదు? లేదా రాజంపేట, కర్నూలు, అనంతపురం వంటి చోట్లకు చంద్రబాబే వెళ్లారు కదా! ఈ మధ్య ఆయన బడ్డి కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు వెళ్లడం, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం వంటివి చేస్తున్నారు కదా! ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి వంటి పంటల ధరల గురించి తెలిసేది కదా! యూరియా అవసరమైన మేర వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు యూరియా వాడవద్దని, కాన్సర్ వస్తుందని చెబితే రైతులకు పుండుపై కారం చల్లినట్లు ఉండదా? అందుకే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వేస్తున్నారు. యూరియా వినియోగిస్తే కేన్సర్ వస్తుందని చెబుతున్నారు. మరి మద్యం తాగితే ఎలాంటి జబ్బు రాదా? దానిని ఎందుకు విచ్చలవిడిగా అమ్మిస్తున్నారని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. యూరియా వాడకపోతే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడు ఉన్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్దపడతారా? ఇలాంటి వాటిని ఎప్పుడు చెప్పాలి. సీజన్ రావడానికి నెలల ముందు కదా! అందుకు తగు ప్రత్యామ్నాయాలు ఏమిటో రైతులకు వివరించాలి కదా? అవన్ని వదలివేసి ఇప్పుడే ఏదో తెలిసినట్లు మాట్లాడితే రైతులు విశ్వసిస్తారా? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయల చొప్పున ప్రతీ రైతుకు ఇస్తామని చెప్పి, ఒక ఏడాదిపాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు. రెండో సంవత్సరం ఐదువేలు ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తు ఉండదా? భూసార పరీక్షలు జరగలేదని ఆయనే చెప్పారు.అవి ఎప్పుడు జరగాలి. ఎందుకు జరగడం లేదు? దానికి ఆయన, వ్యవసాయ మంత్రి బాధ్యులు కారా? ఇలాంటి సమస్యలన్నిటిని తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతులకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పని చేయిస్తే, ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందా? లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేవా? కావా? ఆ ఐదేళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవావిధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! తప్పులేదు. గతప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తే దానిని కొనసాగించవచ్చు. అలా కాకుండా ద్వేషంతోనో, జగన్కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు మూడువేల కోట్లను కేటాయించి ఖర్చు చేసేది. మరి ఇప్పుడు ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? ఏది ఏమైనా ఒక సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. పది,పన్నెండు రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా ఇలాంటి అనుచిత మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జేసీబీతో పప్పు కలిపేశారు!
న్యూఢిల్లీ: కాలువలు తవ్వడానికి, పాత ఇళ్లు కూల్చడానికే కాకుండా వంటలు వండడానికి, పప్పు కలపడానికి కూడా జేసీబీ ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇక్కడ అచ్చంగా అదే చేశారు. భారీ పాత్రలో ఉడుకుతున్న పప్పును జేసీబీతో చక్కగా కలిపారు. అదే పప్పును అదే జేసీబీతో ట్రాక్టర్ ట్రాలీలోకి ఎత్తి, తర్వాత వేలాది మంది అతిథులకు వడ్డించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీరాజాద్ అనే వ్యక్తి దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియదు గానీ క్షణాల్లోనే ఇంటర్నెట్లో పాకిపోయింది. జేసీబీనే మాస్టర్ చెఫ్గా మారిందని పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి తిండి తింటే ఇంకేమైనా ఉందా? మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. తిండి విషయంలో శుభ్రత గురించి కాస్తయినా పట్టించుకోండి అని సూచిస్తున్నారు. ఇదొక గొప్ప ఆవిష్కరణ అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చని మాకు ఇప్పటిదాకా తెలియదని అంటున్నారు. మట్టిని తవ్వడానికి వాడే యంత్రాన్ని వంటలు వండే ప్రదేశం దాకా తీసుకురావడమే పెద్ద తప్పు, అలాంటిది దాంతోనే పప్పు కలపడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జేసీబీతో కలిపిన పప్పు భలే టేస్టు అంటూ సెటైర్లు సైతం విసురుతున్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది ప్రభుత్వాన్ని కోరారు. -
షీ జిన్పింగ్కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్పింగ్ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడడం ఇది రెండోసారి. వచ్చే నెలలో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ జిన్పింగ్తో మాట్లాడానని, టిక్టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్పింగ్ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు. -
తూమక్ తూమక్
సోషల్ మీడియాలో ‘తూమక్ తూమక్’ అనేది వైరల్ ట్రెండ్గా మారింది. కర్మ అనే టీచర్ చిన్న పిల్లలతో కలిసి వేసిన ‘తూమక్ డ్యాన్స్’ ఆహా అనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు 21 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టీచర్ వేసిన పాపులర్ ట్రెండ్ స్టెప్స్ను చిన్ని స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా అనుసరించి ‘వారేవా’ అనిపించారు.‘మీరు నమ్ముతారో లేదోగానీ నేను ఈ వీడియోను వందసార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒక యూజర్. ‘నా వయసు 26 సంవత్సరాలు. మీ స్కూల్లో విద్యార్థిగా మారవచ్చా?’ అని సరదాగా అడిగింది ఒక యూజర్. ప్లేబ్యాక్ సింగర్ నేహా బాషిన్ ‘జుట్టి మేరీ’ ఆల్బమ్ పాపులర్ అయింది. ఈ పాటలోని తూమక్ స్టెప్స్కు ఆన్లైన్ లోకం ఫిదా అయింది. గతవారం క్లాస్రూమ్లో చిన్న అమ్మాయి ఒకరు చక్కని హావభావాలతో వేసిన తూమక్ తూమక్ స్టెప్స్ వీడియో కూడా వైరల్ అయింది. -
బీచ్లో సాయిపల్లవి సిస్టర్ చిల్.. దుబాయ్లో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్!
గ్రీన్ డ్రెస్లో బ్యూటీ హీరోయిన్ హోయలు..దుబాయ్లో చిల్ అవుతోన్న ప్రియా ప్రకాశ్ వారియర్..సిస్టర్తో కలిసి బీచ్లో సాయి పల్లవి చిల్.. వేకేషన్ ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న అనసూయ.. ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తోన్న వితికా శేరు.. View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) -
నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో
కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి సాధారణ ఆహారాన్ని తీసుకోకుండానే గత 33 ఏళ్లుగా జీవిస్తున్నాడట. అదేంటి? ఎలా? అని ఆశ్చర్య పోతున్నారా? మరదే కదా స్టోరీ.. రోజుకు కేవలం 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్, టీ మాత్రమే సేవిస్తాడు. అందుకే లోకల్గా ‘ఆయిల్ కుమార్’గా పాపులర్ అయ్యాడట. దీనికి సంబంధించి ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోలో రైస్ , చపాతీలు ఇస్తే తీసుకోలేదు. దీనికి బదులుగా ఇంజిన్ ఆయిల్ బాటిల్ను ఎత్తి గటా గటా తాగేశాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. గత కొన్ని దశాబ్దాలుగా రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తాగుతూ జీవిస్తున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు అతనికి ఎలాంటి అనారోగ్యం రాలేదనీ, ఆసుపత్రికి వెళ్లలేదనీ,ఆరోగ్యకరమైన జీవిస్తున్నానని తెలిపాడు పైగా అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేక జీవనశైలి సాధ్యమవుతుందని అయ్యప్ప వేషధారణలోఉన్న ఆయిల్ కుమార్ చెప్పుకొచ్చాడు.తన విశ్వాసమే దీన్ని భరించే సామర్థ్యాన్ని ఇస్తోందనీ, ఆ అయ్యప్ప స్వామి దయ ద్వారా మాత్రమే తాను జీవిస్తున్నాననేది అతని విశ్వాసం.నిపుణులేమంటున్నారంటేఅయితే, వైద్య నిపుణులు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మోటారు ఆయిల్లో మానవులకు విషపూరితమైన పెట్రోలియం ఆధారిత సమ్మేళనాలు ఉంటాయని, చాలా ప్రమాదమ నొక్కి చెప్పారు. ఇలాంటి పదార్థాలను మింగడం లేదా పీల్చడం వల్ల అనేక తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులలోకి పీల్చినట్లయితే, తక్షణ , దీర్ఘకాలిక ప్రమాదాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్,శ్వాసకోశ వైఫల్యం, దీర్ఘకాలిక దగ్గు, శ్వాసలోపం మరియు శ్వాస ఆడకపోవడం ప్రాణాంతక పరిస్థితులకు దారితీయవచ్చుని పేర్కొన్నారు. జీర్ణవ్యవస్థ ప్రభావం చూపుతుంది.నోరు, గొంతు , కడుపులో కాలిపోవచ్చు.అంతర్గత రక్తస్రావం. వాంతులు, కొన్నిసార్లు రక్తపు వాంతులు కావచ్చు. అల్సర్లు, పుండ్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. తలనొప్పి, తలతిరగడం, దిక్కుతోచని స్థితి, మూర్ఛ వంటి నాడీ సంబంధిత సమస్యలొస్తాయి. ఈ విషపూరిత సమ్మేళనాలతో కాలేయం,మూత్రపిండాలకు దెబ్బతినేఅవకాశం ఉంది. హైడ్రోకార్బన్ కంటెంట్ కారణంగా గుండెజబ్బు లాంటి ప్రాణాంతక సమస్యలు రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by AvalakkiPavalakki (@avalakki_pavalakki) -
మళ్లీ కేన్సర్, స్టేజ్-4, ధైర్యంగా ఓడిస్తా : నటి పోస్ట్ వైరల్
బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ మరోసారి కేన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమెకు కేన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్-4లో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా నఫీసా సోషల్మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని,విజయం సాధించాలనే దృఢ సంకల్పంతో పోరాడాలని పలువురు అభిమానులు ప్రార్థిస్తున్నారు.2018లో స్టేజ్ 3 పెరిటోనియల్, అండాశయ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడారు. కోలుకొని అప్పటినుంచి కేన్సర్ ఫ్రీగా ఉన్న ఆమెమళ్లీ కేన్సర్ బారిన పడ్డారు. కేన్సర్ తిరిగి వచ్చిందంటూ నటి , రాజకీయ నాయకురాలు నఫీసా అలీ సోధి ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సాధ్యం కాదుకాబట్టి, కీమోథెరపీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. "ఈరోజు నుండి నా ప్రయాణంలో కొత్త అధ్యాయం. నేను నిన్న PET స్కాన్ చేయించుకున్నాను... కాబట్టి శస్త్రచికిత్స సాధ్యం కానందున కీమోథెరపీ చేయించుకోబోతున్నాను. బిలీవ్ మీ.. నేను జీవితాన్ని ప్రేమిస్తున్నాను."అంటూ తన పోస్ట్లో ఎంతో ధైర్యంగా తన హెల్త్ అప్డేట్ గురించి తెలియజేశారు.దీంతోపాటు స్క్రీన్షాట్ను, వరుస ఫోటోలను షేర్ చేశారు. ఒక రోజు నా పిల్లలు, అమ్మా, నువ్వు వెళ్లిపోతే..మమ్మల్ని ఎవరు చూస్తారు అని అడిగారు? తోబుట్టువులైన మీరే ఒకరికొకరు తోడు. అదేనేను మీకిచ్చిన గొప్ప బహుమతి . సిబ్లింగ్స్మధ్య ప్రేమ, జ్ఞాపకాలు, జీవితంలో సోదర బంధం చాలా ధృఢమైంది అని చెప్పాను అని తెలిపారు. మరో ఫోటోలో ద పవర్ ఆఫ్ లవ్ అంటూ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. View this post on Instagram A post shared by Nafisa Ali Sodhi (@nafisaalisodhi)అండాశయ మరియు పెరిటోనియల్ కేన్సర్ అంటే?ప్రతి రోగిలోను కేన్సర్ భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ రకమైన కేన్సర్లో పునరావృతం కావడం చాలా సాధారణం. ప్రారంభ దశ వ్యాధితో పోలిస్తే .. అడ్వాన్స్డ్ స్టేజ్లో మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువే. దశ-3 అండాశయ కేన్సర్ పునరావృత రేటు 70-90శాతం మధ్య ఉంటుంది. నఫీసాకు కేన్సర్ అండాశయాలను దాటి ఉదర కుహరం (పెరిటోనియం) లేదా సమీపంలోని శోషరస కణుపుల లైనింగ్లోకి వ్యాపించింది. చికిత్సలో భాగంగా కేన్సర్ కణాలను తొలగించడానికి శస్త్రచికిత్స,మిగిలిన కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు కీమోథెరపీని చికిత్స అవసరం. కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి లాంటి సాధారణ లక్షణాలు ప్రారంభదశలో ఉంటాయి. సాధారణంగా ఇవి అడ్వాన్స్డ్ స్టేజ్లోనే బయటపడతాయి. ప్రారంభ దశల్లో గుర్తిస్తే నయం చేయవచ్చు.అండాశయ కేన్సర్ను నివారణకు మహిళలు ఏమి చేయాలి?ఊబకాయం అతిపెద్ద ప్రమాద కారకం. కాబట్టి స్త్రీలు శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. పండ్లు, కూరగాయలు ,తృణధాన్యాలు అధికంగా ఉండే మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చక్కెరను తక్కువగా తీసుకోవాలి. ఇంకా మద్యం, ధూమపానం , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తోపాటు, కుటుంబ చరిత్ర ఉంటే జన్యు పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.నఫీసా అలీ ప్రముఖ గోల్ఫర్ , అర్జున్ అవార్డీ కల్నల్ సోధిని పెళ్లాడిన నఫీసాకు కుమార్తెలు అర్మానా , పియా,కుమారుడు అజిత్ ముగ్గురు సంతానం ఉన్నారు. 1979లో నఫీసా అలీ శశికపూర్ సరసన ‘జునూన్’ అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 2005లో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చైర్ పర్సన్గా వ్యవహరించారు. సినీ రంగంతోనే కాకుండా రాజకీయ రంగంతోనూ నఫీసాకు పరిచయం ఉంది. 2009లో సమాజ్ వాదీ టికెట్పై పోటీ చేశారు.నఫీసా అలీ అనేక రంగాలలో విజయాలు సాధించారు. 1972 నుండి 1974 వరకు జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. 1976లోఈవ్స్ వీక్లీ మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకున్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి. 2వ రన్నరప్గా నిలిచారు. 1979లో అలీ కలకత్తా జింఖానాలో జాకీగా కూడా పనిచేశారు. -
అన్ని మతాలనూ గౌరవిస్తా
న్యూఢిల్లీ: తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టంచేశారు. విష్ణుమూర్తిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణల పట్ల ఆయన గురువారం స్పందించారు. ఆరోపణలను ఖండించారు. తన వ్యాఖ్య లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో యునె స్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఖజు రహో ఆలయ ప్రాంగణంలో ఉన్న జవేరీ టెంపుల్లో భగవాన్ విష్ణుమూర్తి వి గ్రహం దెబ్బతిన్నదని, ఆలయాన్ని పునర్ నిర్మించి, అక్కడ మరో విగ్రహాన్ని ఏర్పా టు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ గవాయ్తోపాటు జస్టిస్ కె.వినో ద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఈ నెల 16న విచారణ చేపట్టింది. పిటిషన్ను తిరస్కరించింది. అది ప్రచార ప్రయోజన వ్యాజ్యం అంటూ ఆక్షేపించింది. విగ్రహం విషయంలో మీరు ఆరాధిస్తున్న విష్ణుమూర్తినే ఏదో ఒకటి చేయమని అడగండి అంటూ పిటిషనర్కు జస్టిస్ గవాయ్ సూచించారు. అలా చేస్తే మీరు నిజమైన విష్ణు భక్తులవుతారు అని చెప్పారు. దేవుడిని ప్రార్థించి, తర్వాత యోగా చేయండి అని పేర్కొన్నారు. శివుడికి మీరు వ్యతిరేకం కాకపోతే అక్కడే ఖజురహోలో పెద్ద శివలింగం ఉంది, దాన్ని పూజించండి అని జస్టిస్ గవాయ్ చెప్పారు. విష్ణుమూర్తి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో జనం తప్పుపట్టారు. జస్టిస్ గవాయ్కి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అండగా నిలిచారు. జస్టిస్ గవాయ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని, ఆయన అన్ని మతాల ఆధ్యాత్మిక, పవిత్ర క్షేత్రాలను దర్శిస్తుంటారని చెప్పారు. అన్ని మతాలను సమానంగా భావిస్తుంటారని తెలిపారు. భగవంతుడిని కించపర్చడం ఆయన ఉద్దేశం కాదని అన్నారు. న్యూటన్ నియమం ప్రకారం ఒక చర్యకు అంతే సమానమైన ప్రతిచర్య ఉంటుందని వివరించారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో ఒక చర్యకు తప్పుడు అతి ప్రతిస్పందన ఉంటుందని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలను వక్రీకరించడం దురదృష్టకరమని స్పష్టంచేశారు. సోషల్ మీడియా పోస్టులను జస్టిస్ వినోద్ చంద్రన్ ఖండించారు. సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా మారిందని విమర్శించారు. -
అసంతృప్త యువతరం
యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్–జెడ్ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, కోవిడ్–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది. డేవిడ్ జి.బ్లాంచ్ఫ్లవర్, అలెక్స్ బ్రైసన్, జియావోయ్ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్ లైఫ్ అన్హ్యాపినెస్ హంప్’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు. స్కీ స్లోప్లోకిజెన్ జెడ్అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్కమ్ కంట్రీస్)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్– జెడ్ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి. » యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది. » 2023 గ్యాలప్ సర్వేలో జెన్ జెడ్లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు. » 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.సమస్యలకు కారణాలు.. » సోషల్ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు. » కోవిడ్–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. » రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.పరిష్కారాలు..» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. » మెంటల్ హెల్త్ సర్వీసెస్ను పెంచాలి. » కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్–సేఫ్టీ చర్యలు చేపట్టాలి. » సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి. » స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.- సాక్షి, హైదరాబాద్ -
ఈ ర్యాపిడో అన్న జీతం 32 లక్షలు!!
మనసున మనసై.. బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమని ఎప్పుడో చెప్పేశాడు ఓ సినీకవి. నిజం. ఒంటరితనం కొంతసేపు బాగుంటుందేమో కానీ.. సమయం గడుస్తున్న కొద్దీ బాధిస్తుంది. పీడిస్తుంది. మనోవేదనకు గురి చేస్తుంది. పాపం.. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ఉద్యోగి ఒకరికి ఈ విషయం కొంచెం ఆలస్యంగా తెలిసింది. అయితే.. మనోడు ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్లో కూరుకుపోలేదు. ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు కానీ... ఎవరూ ఊహించనట్టు ర్యాపిడో డ్రైవర్ అయ్యాడు!!. హవ్వా.. అంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చినట్టు ఒరాకిల్లో లక్షలు సంపాదించే ఉద్యోగం చేస్తూ ఇదేం పని అనుకోవద్దు. పాపం ఒంటరి తనం నుంచి బయటపడేందుకు తనకు తోచిన మార్గమిదే మరి! వివరాలు ఏమిటంటే...నిజానికి ఈ స్టోరీని సాద్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నాడు. రెండు లక్షల రూపాయల విలువైన టీవీఎస్ రోనిన్ మోటర్ సైకిల్ను ఒక వ్యక్తి ర్యాపిడో రైడ్ల కోసం వాడుతూంటే సాద్కు కుతూహలం ఎక్కువైంది. ర్యాపిడోను నడుపుతున్న వ్యక్తితో మాట మాట కలిపాడు. అప్పుడు తెలిసింది. అతడు ఒరాకిల్లో సాఫ్ట్వేర్ డెవలపర్ అని. సంవత్సరానికి 32 లక్షల రూపాయల జీతం వస్తోంది అని. అంత జీతమొస్తూంటే.. ఈ ర్యాపిడో ఏంటి భయ్యా అని అడిగితే... ‘‘వీకెండ్స్లో ఒంటరి తనాన్ని తట్టుకునేందుకు ఈ పని చేస్తున్నా’’ అన్న సమాధానం వచ్చింది. ర్యాపిడో నడిపేటప్పుడు అపరిచితులు బైక్ ఎక్కుతారు. వారితో మాట్లాడవచ్చు. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి. తద్వారా నా ఒంటరితనం బాధ తగ్గుతుందని ఆ ఇంజినీర్ చెప్పడంతో ఇలాక్కూడా జరుగుతుందా? అని అనిపించిందని సాద్ తన ఎక్స్ ఖాతాలో ఆశ్చర్యపోయారు. ఈ ఉదంతం కాస్తా ఆధునిక జీవితంలో ఉరుకులు, పరుగుల జీవితంపై మరోసారి ఫోకస్ను పెట్టందని చెప్పాలి. ఒంటరితనంతో ఎన్నో రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాట్సప్, ట్విట్టర్, ఎఫ్బీ వంటి బోలడన్నీ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఉన్నా.. నోరు విప్పి మనసారా మాట్లాడుకునేందుకు ఒక వ్యక్తి తోడు లేకపోతే మాత్రం వేస్ట్ అనేది అందుకే మరి!. టెక్ ప్రపంచంలో రోజుకు పది పన్నెండు గంటల ప్రయాణం.. బెంగళూరు లాంటి నగరాల్లోనైతే ఆఫీసులకు వచ్చిపోయేందుకు మూడు నాలుగు గంటల సమయం పడుతూండటాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యక్తిగత సమయం అంటూ ఏదీ లేకుండా పోతుంది. సొంతూళ్లకు, కుటుంబానికి దూరంగా ఉన్న వారి పరిస్థితి మరీ అధ్వాన్నం. ఏది ఏమైనప్పటికీ సామాజిక హోదా, సంపాదనలే విజయానికి కొలమానాలుగా మారుతున్న ఈ తరుణంలో భేషజాలు వదిలి తన సమస్యకు తాను ఒక అందమైన పరిష్కారాన్ని కనుక్కున్న ఆ అజ్ఞాత ఇంజినీర్కు జై అనాల్సిందే! -
ప్రధాని మోదీకి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకుని తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్ మాదిరిగానే తానూ భారత్-అమెరికా భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో.. ‘నా స్నేహితుడు ప్రధాని మోదీతో ఇప్పుడే ఫోనులో మాట్లాడాను. ఆయనకి నేను పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీరు అందించిన మద్దతుకు ధన్యవాదాలు' అని ట్రంప్ పేర్కొన్నారు.PM Modi posts, "Thank you, my friend, President Trump, for your phone call and warm greetings on my 75th birthday. Like you, I am also fully committed to taking the India-US Comprehensive and Global Partnership to new heights. We support your initiatives towards a peaceful… pic.twitter.com/CQGdwOKiBH— Press Trust of India (@PTI_News) September 16, 2025దీనికి బదులుగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు చెబుతూ ‘ఎక్స్’లో ‘అధ్యక్షుడు ట్రంప్ నా 75వ పుట్టిన రోజు సందర్భంగా ఫోన్ చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అందుకు నా మిత్రునికి ధన్యవాదాలు. మీ మాదిరిగానే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం మీరు చేపట్టిన చర్యలకు మేం మద్దతు ఇస్తున్నాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 17 తర్వాత అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ జరగడం ఇదే తొలిసారి. రష్యా నుంచి భారత్ స్వల్ప ధరలకే చమురు దిగుమతి చేసుకొని భారీగా లాభాలు పొందుతోందని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే భారత్పై 50 శాతం అదనపు సుంకాలను విధించారు. అలాగే భారత్- పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు చెప్పారు. దీనిని భారత్ పలుమార్లు ఖండించింది. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
సోలో వేకేషన్లో అనసూయ చిల్.. మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ అనన్య నాగళ్ల!
కలర్ ఫుల్ శారీలో బిగ్బాస్ దివి...దక్ష లుక్లో మంచు లక్ష్మీ..వేకేషన్లో చిల్ అవుతోన్న అనసూయ..రెడ్ శారీలో బ్యూటీ హీరోయిన్ నిలాఖి పాత్ర లేటేస్ట్ లుక్..ఆరెంజ్ డ్రెస్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..సాగర తీరాన శోభిత ధూలిపాళ్ల చిల్..మ్యాచ్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ అనన్య నాగళ్ల.. View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Nilakhi patra (@__officialnilakhipatra__) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
టిక్టాక్పై డీల్ కుదిరింది
వాషింగ్టన్: అమెరికాలో ప్రముఖ సోషల్మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్ భవితవ్యంపై డీల్ కుదిరినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు. సోమవారం ఆయన తన సోషల్మీడియా ఖాతా లో దీనికి సంబంధించి సంస్థ పేరు చెప్పకుండా వివరాలు వెల్లడించారు. ‘అమెరికా, చైనా అధికారుల మధ్య చర్చలు సానుకూలంగా సాగాయి. అమెరికా యువత అత్యధికంగా కోరుకుంటున్న ఒక కంపెనీ విషయంలో ఒప్పందం కుదిరింది. దీనిపై వచ్చే శుక్రవా రం చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడుతా’అని ప్రకటించారు. ఆయన పేరు చెప్పకపోయినా ఆ కంపెనీ టిక్టాక్ అని భావిస్తున్నారు. చైనా కంపెనీ బైట్డ్యాన్స్ సృష్టించిన టిక్టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
ఏసీ కోచ్లో యువతి స్మోకింగ్.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్.. మీకెందుకంత బాధ?’
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్లో ఓ యువతి సిగరెట్ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్ లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్.. ఇది నీ ట్రైన్ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని.. ఈ సిగరెట్ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్లో సిగరెట్ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది. నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s— Tushar Rai (@tusharcrai) September 15, 2025 -
‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా విధులు నిర్వహించే మనారామ్తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇలా ఎలా??
ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల గొంతు నులిమేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలలను ఎండగడుతున్న సామాజిక మాధ్యమాల అణచివేతకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఒకదాన్ని ఏర్పాటు చేసింది. వీరి సిఫారసులు ఎలా ఉంటాయన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వం తీరుతెన్నులను విమర్శిస్తున్న, వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సామాజిక మాధ్యమాలను నకిలీలుగా ముద్రవేసే ప్రయత్నం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏది ఫేక్ ఏది కాదన్నది అందరికంటే బాగా తెలిసింది ప్రజలకే. కానీ ప్రభుత్వం, టీడీపీలు రెండూ తాము చెప్పిన విషయాలే సత్యమని నమ్మించేందుకు, ప్రభుత్వంలో జరుగుతున్న రకరకాల అవినీతి కార్యకలాపాలు బయటకు రాకూడదన్నట్టు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఇష్టారీతిన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన బాబు, పవన్లు వైసీపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉండేది కాదని ఇప్పటికీ విమర్శిస్తూండటం విచిత్రం. ప్రతిపక్షంలో ఉండగా అన్ని వర్గాలను ప్రభుత్వంపై ఉసిగొల్పేలా రెచ్చగొట్టే ఉపన్యాసాలు దంచిన ఈ ద్వయం ఇప్పుడు మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడినా సరే వారి సంగతి చూస్తామని, కొత్త చట్టాలు తెచ్చి అణచివేస్తామని అధికారికంగానే చెప్పుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్లో యూరియాకు పెద్ద కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయాలనే సామాజిక మాధ్యమాలు బాగా హైలైట్ చేశాయి. దీంతో చంద్రబాబు తెగ ఆవేశపడిపోతున్నారు. సామాజిక మాధ్యమాలే లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఆఖరకు ఈ విమర్శ హద్దులు దాటి.. మనుషులా, పశువులా అనే వ్యక్తిగత స్థాయికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రైతుల సమస్యను బహిర్గతం చేస్తున్న సాక్షి మీడియాపై కూడా తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. టీడీపీ అనుబంధ మీడియా సాయంతో సాక్షిలో వచ్చే వార్తలు ఫేక్ అన్న ప్రచారం చేయాలన్నది ఆయన ఉద్దేశం.ప్రతిపక్ష నేత జగన్ కూడా ఏ విమర్శ చేసినా అందులో సహేతుకత ఉండేలా జాగ్రత్తపడతారు. కాగ్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలిచ్చిన సమాచారం ఆధారంగానే టీడీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూంటారు. అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు, పవన్లు అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అబద్ధాల ఆధారంగా రాజకీయాలు చేయడం వీరికి అలవాటే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వీరు చేసిన అసత్యపు అరోపణలు అన్ని ఇన్నీ కావు. హిందూ మతానికి అపచారం జరిగిపోతోందని పదే పదే చెప్పేవారు. ప్రతి చిన్న విషయాన్నీ జగన్కు ఆపాదిస్తూండే వారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ప్రసాదం లడ్డూలో కల్తీ ఆరోపణలు కూడా జగన్పైకే నెట్టేసే ప్రయత్నం చేసిన విషయం ఇటీవలి పరిణామమే. ఇదే సమయంలో జగన్ మాత్రం హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే ఆరోపణలు కూడదని బాబు, పవన్కు హితవు చెప్పారు. తిరుమలకు అప్రతిష్ట తీసుకురావద్దని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ముప్పైవేల మంది మహిళలు మాయమైనట్టు, అందుకు వలంటీర్లు కారణమైనట్టు తనకు కేంద్ర నిఘా వర్గాల వారు చెప్పారని పవన్ చేసిన ఇంకో ఆరోపణ ప్రజలకు గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ఆయన పూర్తిగా మరచిపోయారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జగన్, ఆయన తల్లి విజయమ్మ తదితరులు నివాళి అర్పించారు. ఆ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆమె కుమారుడిని ఆపాయ్యంగా దగ్గరకు తీసుకున్న సన్నివేశాన్ని అంతా చూశారు. అయినా మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు లోకేశ్ దానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఒక వీడియో కూడా ఎడిట్ చేసి టీడీపీ వారు ప్రచారం సాగించారని వైసీపీ ఆరోపించింది. కేంద్రం సూచనల ప్రకారం జగన్ ముఖ్యమంత్రిగా రీసర్వే చేపడితే జగన్ భూములన్నిటిని లాగేసుకుంటారని చంద్రబాబు, పవన్, లోకేశ్లు నానా యాగీ చేశారు. తీరా చూస్తే ఏమంది? అధికారంలోకి వచ్చిన తరువాత వారు కూడా అదే రీసర్వే పథకాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రం అప్పుల గురించి కూడా ఇంతే. అప్పులతో ఆంధ్రప్రదేశ్ కాస్తా శ్రీలంక మాదిరిగా అల్లకల్లోలమైపోతుందని ఒకసారి.. అప్పులు రూ.14 లక్షల కోట్లు దాటిపోయాయని ఇంకోసారి రకరకాలుగా వ్యాఖ్యానించిన అప్పటి ప్రతిపక్ష నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత మాట సవరించుకున్న విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ స్వయంగా రాష్ట్రం అప్పులు రూ.6.5 లక్షల కోట్లని వెల్లడించారు. కానీ చంద్రబాబు ఆ తర్వాత కూడా జగన్ టైమ్లో రూ.పది లక్షల కోట్ల అప్పు అని చెబుతున్నారు. పోనీ అందులో తన 2014 టరమ్ లో చేసిన అప్పు,విభజన నాటి అప్పు కూడా ఉందని చెబుతారా? అంటే అదేమి ఉండదు. ఈ 15 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ. రెండు లక్షల కోట్లకు పైగా అప్పు తీసుకువచ్చారు. ఈ వార్తను సాక్షి ఇచ్చింది. దానిని ఖండించే పరిస్థితి కూటమి సర్కార్కు లేదు. విశాఖలో జరిగిన సోదాల్లో ఒక కంపెనీలో మాదకద్రవ్యాలు వచ్చాయని, అదంతా వైసీపీ వారికి సంబంధించిందన్నట్టు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఎంతగా ప్రచారం చేశాయి? తీరా చూస్తే అవి డ్రగ్స్ కాదని, అక్వా కంపెనీలలో వాడే ఈస్ట్ అని తేలింది. జగన్ టైమ్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదంటూ టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి సైతం తమ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు తెచ్చినట్లుగా చెప్పడం కూడా అందరిని ఆశ్చర్యపరచింది. చంద్రబాబు, పవన్, లోకేశ్లు గతంలో చేసిన ఇలాంటి ఆరోపణలు, చెప్పిన అసత్యాలు, చేసిన ఆచారణ సాధ్యంకాని వాగ్దానాలు మొదలైన వాటన్నిటిని ప్రస్తావిస్తూ నాడు-నేడు కింద సోషల్ మీడియాలో పలువురు గుర్తు చేస్తున్నారు. ఇవి వీరిని బాగా చికాకు పెడుతున్నాయి. తమ ఫేక్ ప్రచారమే తమకు చుట్టుకుంటోందన్నది వారి బాధ కావచ్చు. ఎవరు ఫేక్ ప్రచారం చేసినా తప్పే. అంతేకాదు. సోషల్ మీడియాలో వైసీపీ మహిళా నేతలను, రాజకీయాలతో సంబంధం లేని జగన్ సతీమణి భారతి వంటివారిపై కూడా ఒక వర్గం సోషల్ మీడియా నీచమైన పోస్టులు పెడుతున్నా, ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే టీడీపీ వారిపై ఎవరైనా అభ్యంతరకర పోస్టు పెట్టినా వెంటనే స్పందిస్తారు. ఎవరు అలాంటి పోస్టులు పెట్టినా ఒకే రకంగా పోలీసు వ్యవస్థ స్పందిస్తే మంచిది కదా!. చంద్రబాబు,లోకేశ్లు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టులో పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుంటారని, తప్పుడు ప్రచారాలు చేయిస్తుంటారని వైసీపీ తరచుగా ఆరోపిస్తుంటుంది. అయినా ఇతర సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కూటమి నేతలు భరించలేకపోతున్నారన్న భావన ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను, సాక్షి మీడియాను తరచు బెదిరిస్తున్నారు. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. కుట్రపూరితంగా జర్నలిస్టులను జైళ్లకు పంపుతున్నారు. అయినా వారి వైఫల్యాలు, స్కామ్లు బయటకు వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక చంద్రబాబు అసహనంతో ఏకంగా కొత్తగా చట్టాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అతిగా వ్యవహరించిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్య తీసుకోవాలని యత్నిస్తే చాలు.. నోటీసులు ఇస్తే చాలు..ఇంకేముంది భావ స్వేచ్ఛను అరికడుతున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు తాను అధికారంలో ఉంటే మాత్రం ఎవరికి భావ స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఉండకూండా చూడాలని యత్నిస్తున్నారు.ఇలా ప్రతి అంశంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే చంద్రబాబు అసలు రాజకీయం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సోషల్ మీడియా అంటేనే హడలిపోతున్న హీరోయిన్స్
-
డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్ డోపమిన్’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ డోపమిన్? డోపమిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. దీనిని ‘సంతోష హార్మోన్’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్ హార్మోనే ఇప్పుడు సోషల్ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్ హార్మో న్ విడుదలవుతుంది. అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్మీడియా యాప్లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. డిజిటల్ డోపమిన్ సంకేతాలు» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం » సోషల్ ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా లేనప్పుడు ఆందోళన చెందడం» సమయం తెలియకుండా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోవటం» ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చడం » ప్రతికూల కంటెంట్తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్ విరమణ (క్రాష్) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. » డోపమిన్ హార్మోన్ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్ క్రాష్ అంటారు. » ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. » చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. »ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్సిరీస్ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. » డోపమిన్ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్ మీడియా ఒకటి. ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్ చిన్నస్థాయిలో డోపమిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్ షాపింగ్, మితిమీరిన గేమింగ్ వంటి వాటికి కూడా విస్తరించింది. » డిజిటల్ డోపమిన్ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్లోని సోషల్, డిజిటల్ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.‘డిజిటల్’ వాడకం తగ్గించుకోవటమే మార్గం డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్ డోపమిన్’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్ సిస్టమ్లో భాగంగా క్విక్ గ్రాటిఫికేషన్ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్ సర్క్యూట్ను సోషల్మీడియా అధిక వినియోగం హైజాక్ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్.సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్ డోపమిన్ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి
నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్ విహార్లోని మహీంద్రా షోరూమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్ స్పందించింది. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్(29) తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్ ఫస్ట ఫ్లోర్ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్ సహా భర్త, షోరూమ్ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్మన్ వికాస్, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్తో పని చేస్తోందని అప్పటికే సేల్స్మన్ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్లేటర్ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్ గ్లాస్ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్బాగ్స్ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. View this post on Instagram A post shared by 🌸 (@___maanniiiiii) -
శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ.. వేకేషన్లో హంసానందిని చిల్!
వైట్ డ్రెస్లో బాలీవుడ్ బ్యూటీ సిమ్రత్ కౌర్.. 8 హీరోయిన్ అనంతిక సనీల్కుమార్ స్మైలీ లుక్స్... బ్లాక్ బ్యూటీ శృతిహాసన్ హోయలు.. వేకేషన్లో ఫుల్గా చిల్ అవుతోన్న హంసానందిని.. శారీలో మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్.. View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Surveen Chawla (@surveenchawla) -
ఆ 77 ఏళ్ల తల్లి ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు..!
ఓ తల్లి కొడుకు ఆచూకి కానరాక తల్లడిల్లింది. అది కూడా చెట్టంత కొడుకు ఆసరాగా ఉండాల్సిన వయసులో.. అతడి ఆచూకీకై నిరీక్షించడం అంటే ఆ తల్లికి అదొక శాపం. పాపం ఆ తల్లి బాధను చూడలేక ఆ దేవుడే ఇలా ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి కొడుకును ఆమె వద్దకు చేర్చాడేమో అన్నట్లుగా కలుసుకుంది. ఈ ఘటన ఢిల్లీలోని అమ్రోహాలో చోటు చేసుకుంది.అమ్రెహాకు చెందిన ఇన్స్పెక్టర్ అశ్వని మాలిక్ కేవలం పోలీప్ ఆఫీసర్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ఆయన తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సోషల్ మీడియా ఫ్లాట్ఫాంని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయంలో ఫేమస్. ఒకరోజు మాలిక్ ఎప్పటిలానే తన డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా..రోడ్డు పక్కన ఒంటరిగా కూర్చున్నవ్యక్తిని గమనించాడు. ఆ వ్యక్తి దిక్కుతోచని స్థితిలో అపరిశుభ్రంగా ఎలాంటి భావోద్వేగం లేనట్లుగా కనిపించాడు. దాంతో ఆయన తన సహచర పోలీసులు మొహ్మద్ సల్మాన్, కాషిఫ్ల సాయంతో అతన్ని లోపలకి తీసుకెళ్లి స్నానం చేయించి, బట్టలు శుభ్రం చేసి, ఆహారం ఇచ్చి..అతడి వివరాలను కనుక్కొన్నారు. తర్వాత ఆ వ్యక్తిని మొహమ్మద్ సలీంగా గుర్తించారు. తప్పిపోయిన వ్యక్తులను వారి కుటుంబాలతో కలిపే తన సోషల్ మీడియా సేవలో భాగంగా ఈ వ్యక్తికి సంబంధించిన వీడియోని కూడా నెట్టింట షేర్ చేశాడు. ఆ వీడియో ముంబైలోని సలీం మేనల్లుడు మొహమ్మద్ గుఫ్రాన్ అనే వ్యక్తి దృష్టిని ఆకర్షించింది. అతను సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా ఈ వీడియో కంటపడింది. వెంటనే తన 77 ఏళ్ల అమ్మమ్మ రసుమా బానోకు చూపించాడు. ఆమె వెంటనే ఆ వ్యక్తిని చాలా కాలం క్రితం తప్పిపోయిన తన కొడుకుగా గుర్తించింది. నిజానికి మొహమ్మద్ సలీం ఒకప్పుడూ ఉత్తరప్రదేశ్లోని డియోరియా హరైయా గ్రామంలో నివశించేవాడు. అతను తన భార్య మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అలా ఆ బాధలో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. సుమారు 12 ఏళ్లుగా మళ్లీ తిరిగి రాలేదు. సంవత్సరాల తరబడి ఆ తల్లి కొడుకు చనిపోయాడా లేదా బతికే ఉన్నాడో తెలియక తల్లడిల్లింది. పాపం సలీం తండ్రి కూడా అతడు ఇల్లు వదిలి వెళ్లినప్పుడే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే అతడి తల్లి కొడుకు ఆచూకి కనుగొంటానని గానీ, చూస్తానని గానీ అస్సలు భావించలేదు. నిజానికి అస్సలు ఆమె ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కూడా అనుకోలేదట. ఇన్నాళ్లు బతకాలి కాబట్టి బతుకుతున్నా అన్నట్లుగా ఆ తల్లి రోజులు నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతో తన కొడుకుని ఆ వీడియోలో గుర్తించి కలుసుకుందో తన ఇన్నాళ్ల బాధకు ఒక్కసారిగా తెరపడినట్లయ్యిందని ఆవేదనగా అంటోంది ఆ తల్లి రసుమా బానో. అతడి మేనల్లుడు గుఫ్రాన్ కూడా తన అమ్మమ్మ ఇలాంటి రోజుని చూస్తుందని అస్సలు అనుకోలేదంటూ భావోద్వేగానికి గురయ్యాడు. View this post on Instagram A post shared by Ashwani Kumar (@ashmalikupcop) (చదవండి: వాట్ పబ్లిక్ టాయిలెట్ టూరిస్ట్ స్పాటా..?! రీజన్ ఇదే..) -
ఈ నెపో కిడ్స్ విలాసాలు.. చూస్తే మతిపోవాల్సిందే!
నేపాల్లో యువత ఆందోళనలు, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. గత వారంరోజులుగా సోషల్ మీడియాలో సమాంతరంగా ఇంకో ట్రెండ్ నడుస్తోంది. అదే పొలిటికల్ నెపో కిడ్స్కు వ్యతిరేకంగా సాగుతున్న క్యాంపెయిన్. అందుకే పరిశీలకులు.. నేపాల్ ఆందోళలను కేవలం అవినీతి వ్యతిరేక పోరాటంగానే కాకుండా యువత పట్ల గద్దెదిగిన ప్రభుత్వపు నిర్లక్ష్యం, సామాజిక అసమానతలపైనా తిరుగుబాటుగానూ విశ్లేషిస్తున్నారు. నెపో కిడ్స్.. నేపాల్ జనరేషన్ జెడ్ ఉద్యమానికి కేంద్ర బిందువైందన్న విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఒకవైపు దేశంలో యువత నిరుద్యోగం, ఆయా కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతుంటే.. మరోవైపు రాజకీయ నేతల పిల్లలు మాత్రం విలాసాలకు పోయారు. సోషల్ మీడియా అకౌంట్లలో.. లక్షల రూపాయల విలువైన దుస్తులు, బ్యాగులు ధరించి ఫోజులు, విదేశీ విహారాలు, విలాసవంతమైన జీవనశైలిని రీల్స్.. ఫొటోల రూపంలో ప్రదర్శించుకున్నారు. ఈ హెచ్చుతగ్గులపై నేతలను నిలదీసేందుకు యువత అదను కోసం ఎదురు చూసింది. అప్పటిదాకా అవినీతిపైనే పోరాటం చేయాలనుకున్న వాళ్లకు.. సరిగ్గా ఆ సమయంలో సోషల్ మీడియా బ్యాన్ రూపంలో ఓ ఆయుధం దొరికినట్లయ్యింది.నేపాల్ ఆందోళనలతో అక్కడి యువతకు నెపో కిడ్స్ వ్యవహారాన్ని ప్రశ్నించేందుకు సరైన సమయం దక్కింది. తొలుత అందుబాటులో ఉన్న టిక్టాక్ లాంటి కొద్ది ప్లాట్ఫారమ్లలో వాళ్ల లైఫ్స్టైల్ను ఏకిపారేశారు. బ్యాన్ ఎత్తేశాక.. ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్ వంటి ప్లాట్ఫారమ్లలో ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. అలా.. #NepoBabiesNepal అనే హ్యాష్ట్యాగ్ మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ జాబితాలో.. మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్య మంత్రి కుమార్తె శ్రింఖల ఖటీవాడ, సింగర్.. మాజీ ప్రధాని షేర్ బహాదూర్ డెఉబా కోడలు శివానా శ్రేష్ఠ, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహాల్ "ప్రచండ" మనవరాలు స్మితా దహాల్, గండకి ప్రావిన్స్కు మాజీ మంత్రి బిందు కుమార్ థాపా కొడుకు సౌగత్ థాపాలు.. ఇలా మరికొందరిని తెరపైకి తెచ్చారు. అక్కడి కరెన్సీ ప్రకారం.. వీళ్లు వాడే వస్తువులు అత్యంత ఖరీదైనవే కావడంతో యువతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.వాళ్ల ఒంటి మీద దుస్తుల దగ్గరి నుంచి, వాళ్లు వాడే కార్లు, బ్యాగులు, పర్ఫ్యూములు, చివరకు ఆహార విషయంలోనూ ప్రదర్శించే విలాసాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ల వాళ్ల నివాసాలపై దాడులు చేసినప్పుడు ఆ లగ్జరీ వస్తువుల్ని కొందరు ఎత్తుకెళ్లిపోయారు. మరికొందరు ఆకతాయిలు ఆ లగ్జరీ గూడ్స్ను చూపిస్తూ.. ‘‘చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటూ’’ సెటైర్లు వేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో కొందరు తమ అకౌంట్లను, పేజీలను క్లోజ్ చేసేశారు. మరికొందరు పోస్టులు చేయకుండా ఉండిపోయారు. దాడులు చేస్తారనే భయంతో.. ఈ తరహా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నేతల పిల్లల ఆస్తులపైనా దర్యాప్తు జరిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అలా మొదలై..అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత.. ముఖ్యంగా Gen Z చేపట్టిన ఆందోళనలతో నేపాల్ అట్టుడికిపోయింది. పోలీసుల వల్ల కాకపోవడంతో అక్కడి ప్రభుత్వం నిరసనలను అణచివేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇది హింసాత్మకంగా మారడంతో.. 31 మంది ఆందోళనకారులు మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామం.. జెన్జెడ్కు మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్న నినాదంతో.. కేబినెట్ మంత్రులు, మాజీ నేతల ఇళ్లపై దాడులకు దిగి తగలబెట్టారు. దొరికిన వాళ్లను దొరికినట్లు చితకబాదారు. దీంతో.. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభం తలెత్తినవేళ.. పరిస్థితి అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో సైన్యం రంగంలోకి దిగింది. రాజధాని ఖాట్మండు సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూలు విధించి పహారా కాస్తోంది. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఉద్యమకారుల నేతలకు మధ్య ఉండి ప్రభుత్వ ఏర్పాటు చర్చలను సైన్యమే ముందుకు తీసుకెళ్తోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి సుపరిపాలన దిశగా అడుగు పడాలని, గత మూడు దశాబ్దాలుగా పాలకులు పాల్పడిన అవినీతిపై విచారణకు జరిపించాలని, అలాగే పోరాటంలో మరణించిన వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్ల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని జెన్జెడ్ యువత డిమాండ్లు చేస్తుండడం తెలిసిందే.పేదల బతుకులు చీకట్లతో తడిసిన వేళ..వెలుగుల్లో నేతల వారసులు విలాసాలు ఆరబోశారు! ఆవేదన అగ్గిలా మారి.. సమానత్వం కోసం గళం విప్పిందిఇక చాలు!" అని యువత నినదించగా.. పాలకుల పీఠాలు ఖాళీ అయ్యాయి.ఇది నేపాల్ ఉద్యమం కాదు.. అక్కడి ఒక తరం గుండె చప్పుడు -
నయా నానో బనానా ట్రెండ్
రోజుల వ్యవధిలోనే సోషల్ మీడియాలో రకరకాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ నానో బనానా ట్రెండ్. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ‘గో విత్ ది ట్రెండ్’ అంటూ బనాన ట్రెండ్ ఫాలో కావడం విశేషం.ఇంతకీ ఏమిటీ ట్రెండ్?ఈ సరికొత్త వైరల్ త్రీడి ఫిగరీన్ ట్రెండ్ అనేది గూగుల్ వారి జెమిని 2.5 ఫ్లాస్ ఇమేజ్ టూల్కు సంబం«ధించింది. ఈ ట్రెండ్ను ‘నానో బనానా’ అనే నిక్నేమ్తో కూడా పిలుస్తున్నారు. ఈ పవర్ఫుల్ ఏఐ టూల్ క్షణాల వ్యవధిలోనే ఏ ఫోటోను అయినా వాస్తవికత ఉట్టిపడేలా త్రీడీ మోడల్లోకి మారుస్తుంది. ఈ టూల్ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.టాలీవుడ్ నుంచి హాలివుడ్ వరకు హీరోల అభిమానులు ఈ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఈ ట్రెండ్లో మీరూ భాగం కావాలనుకుంటే ఇలా చేయండి...∙గూగుల్ ఏఐ స్టూడియో వెబ్సైట్: గో టు గూగుల్ ఏఐ స్టూడియోలోకి వెళ్లాలి. ∙ట్రై నానో బనాన ఆప్షన్ ఎంచుకోవాలి ∙ఫొటో ప్లస్ ప్రాంప్ట్ అనేది రికమెండెడ్ మెథడ్ ∙ప్లస్ బటన్ నొక్కి ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. ప్రాంప్ట్ ఇవ్వాలి -
యూరియా దొరక్కపోతే చచ్చిపోవాలనుకుంటున్నాను..
-
టోరంటోలో జాన్వీ కపూర్ హోయలు.. ఊహల్లో తెలిపోతున్న బిగ్బాస్ దివి!
గుజరాత్లో శ్వేతా బసు ప్రసాద్ టూర్..డిజైనర్ డ్రెస్లో రష్మిక మందన్నా సూపర్బ్ లుక్..టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్..అంతా నీ ఆలోచనలే అంటూ బిగ్బాస్ దివి ప్రేమ కావ్యం..బ్లాక్ బ్యూటీలా జ్యోతి పూర్వాజ్ హోయలు.. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Divi (@actordivi) -
బిచ్చగాడు 3' లో కొత్త సోషల్ మెసేజ్ ఏమిటి?
-
నేపాల్లో భయానకం.. మంత్రులు, కుటుంబాలే టార్గెట్
ఖాట్మాండు: నేపాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేపాల్లో ‘జన్ జి’ పేరుతో యువతరం చేపట్టిన ఆందోళనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. యువత ఆందోళనలు చివరకు హింసకు దారితీశాయి. సహనం కోల్పోయిన నిరసనకారులు, పాలకులను తరిమి తరిమికొట్టారు. ఈ క్రమంలో నేపాల్కు చెందిన ఓ మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు.. తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని హెలికాప్టర్లో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. నేపాల్లో సోషల్ మీడియాపై బ్యాన్ అనంతరం దారుణ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో నిరసనకారులు రెచ్చిపోయారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన యువత.. మంత్రులు, ప్రభుత్వ అధికారుల ఇళ్లను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు. డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్ నివాసంపై రాళ్లు రువ్వారు. నేపాల్ ఆర్థిక మంత్రిని వీధిలో నిరసనకారులు వెంబడిస్తుంటే.. ఎదురుగా వచ్చిన ఓ యువకుడు ఆయనను ఎగిరి తన్నుతున్న దృశ్యాలు, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా, ఆమె భర్త, మాజీ ప్రధాని, నేపాలి కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్బాలను ఇంట్లోనే దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.Parliment in Nepal. Better than voting. pic.twitter.com/NtFehqsycr— ADAM (@AdameMedia) September 10, 2025మరోవైపు..మాజీ ప్రధాని దేవ్బా ముఖానికి రక్తమోడుతూ నిస్సహాయంగా కూర్చున్న దృశ్యం కనిపించింది. తరువాత అధికారులు అక్కడకు చేరుకొని ఆయనను రక్షించారు. ఖాట్మాండు హోటల్పై ఎగురుతున్న హెలికాప్టర్లో అధికారులను తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సైన్యానికి చెందిన హెలికాప్టర్లు కొంతమంది మంత్రులు, వారి కుటుంబాలను సురక్షిత ప్రదేశాలకు తరలించగలిగాయి. పలువురు మంత్రులు హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.Politicians escaping the wrath of the people in Nepal pic.twitter.com/tia5JjkqmL— jim Njue (@jimNjue_) September 10, 2025ఇదిలా ఉండగా.. నేపాల్లో ఆందోళనలు, అల్లర్లు జైళ్లకు సైతం వ్యాపించాయి. జైళ్లలో నిప్పుపెట్టి, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దేశవ్యాప్తంగా ఆయా జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు పరారయ్యారు. హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ బజార్ జైలు నుంచి 1,100 మంది, చిత్వన్-700, నక్కు-1,200, సున్సారి జిల్లా జుంప్కా జైలు-1,575.. కంచన్పూర్-450, కైలాలి-612, జలేశ్వర్-576, కాస్కి-773, డాంగ్-124, జుమ్లా-36, సొలుఖుంబు-86, గౌర్-260, బజ్హాంగ్ జైలు నుంచి 65 తప్పించుకున్నారు. మరోవైపు.. నేపాల్లో కల్లోల పరిస్థితులను చక్కదిద్దడానికి సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సైన్యం ఆదేశించింది. అల్లర్లతో అస్తవ్యస్తమైన నగరంలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం కృషి చేస్తోంది.🚨 BREAKING: In response to growing unrest in Nepal, the Nepalese Army deployed a Hindustan ALH Dhruv NA-054 helicopter to transport members of parliament to a safer location. The move comes amid rising tensions and concerns over security. 🇳🇵 #NepalUpdate pic.twitter.com/TuKEoKupn2— Fahad Naim (@Fahadnaimb) September 9, 2025 -
నేపాల్కు నిప్పు పెట్టిందెవరు?
కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్ఫోన్లో సోషల్మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు. మద్దతు పలికిన మాజీ ప్రధాని విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్ హెచ్చరించారు. ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్జీవో సంఘాలు హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్ జెడ్ నేపాల్, హమీ నేపాల్ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్జెడ్ నేపాల్ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్జెడ్ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
నేపాల్ ప్రధానిగా సుశీల?
కాఠ్మండు: కల్లోల నేపాల్లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువతరం ఆరంభించిన పోరాటం నేపాల్ ప్రధానమంత్రి కేపీ వర్మ ఓలీ రాజీనామాకు దారితీసింది. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ‘జనరేషన్ జెడ్’ఆన్లైన్లో సంప్రదింపులు ప్రారంభించింది. యువత తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించాలని చాలామంది సూచిస్తున్నారు. యువతలో ఆమెపట్ల అమితమైన ఆదరణ కనిపిస్తోంది. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో 5 వేల మందికిపైగా పాల్గొన్నారు. మధ్యంతర ప్రభుత్వ అధినేతగా జస్టిస్ సుశీల కర్కీని నియమించాలన్న ప్రతిపాదనకు ఎక్కువమంది ఓటేశారు. తొలుత కాఠ్మండు నగర మేయర్ బాలెన్ షా పేరు వినిపించింది. అయనను సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని జనరేషన్ జెడ్ ప్రతినిధులు చెప్పారు. మరోవైపు కర్కీకి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది. మద్దతుగా 2,500 మంది సంతకాలు మధ్యంతర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలంటూ సుశీల కర్కీని యువత అభ్యర్థించగా.. తనకు మద్దతుగా కనీసం వెయ్యి సంతకాలు సేకరించి, చూపించాలని ఆమె కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెకు అనుకూలంగా సంతకాలు చేసినవారి సంఖ్య 2,500కు చేరినట్లు సమాచారం. మరోవైపు పోటీలో సుశీల కర్కీ ముందంజలో ఉన్నప్పటికీ మరికొన్ని పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్, యువనేత సాగర్ ధాకల్, ధరణ్ సిటీ మేయర్ హర్కా సంపంగ్ పేర్లపైనా చర్చ సాగుతోంది. నేపాల్లోని ప్రముఖ యూట్యూబర్ రందోమ్ నేపాలీ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపించడానికి ఎవరూ మందుకు రాకపోతే తాను ఆలోచిస్తానని ఆయన పేర్కొన్నారు. సుశీల కర్కీ నియామకానికి పెద్ద తతంగమే ఉంటుందని సమాచారం. ఆమె తొలుత నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ను, అనంతరం అధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ను కలుసుకొని మద్దతు పొందాల్సి ఉంటుందని నిపుణులు చెప్పారు.ఎవరీ జస్టిస్ సుశీల? నేపాల్ చరిత్రలో 72 ఏళ్ల సుశీల కర్కీకి ప్రత్యేక స్థానమే ఉంది. సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డుకెక్కారు. భారత్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1975లో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. సుశీల కర్కీ మొదట టీచర్గా పనిచేశారు. 1978లో కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో న్యాయ విద్యలో బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని రాజ్యాంగ మండలి సిపార్సు మేరకు అప్పటి అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ఆమెను చీఫ్ జస్టిస్గా నియమించారు. సుశీల కర్కీ అవినీతికి దూరంగా ఉంటారని, ఎవరికీ భయపడబోరని పేరుంది. అవినీతికి పాల్పడిన మంత్రులను జైలుకు పంపిస్తూ కీలక తీర్పులిచ్చారు. 2006లో నేపాల్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యురాలిగా సేవలందించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో చదుకున్నప్పటి రోజులను సుశీల ఇటీవలే గుర్తుచేసుకున్నారు. అక్కడ డ్యాన్స్ నేర్చుకొనే అవకాశం దక్కిందని చెప్పారు. ఆ యూనివర్సిటీలోనే తనకు ఉద్యోగం వచి్చందని, అక్కడే పీహెచ్డీ పూర్తిచేసే అవకాశం వచ్చిందని అన్నారు. కానీ, విధిరాత మరోలా ఉండడంతో న్యాయమూర్తిగా మారానని తెలిపారు.మోదీజీ కో నమస్కార్ నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీక రించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జస్టిస్ సుశీల చెప్పారు. ఆమె బుధవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మధ్యంతర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలంటూ యువత చేసిన విజ్ఞప్తిని స్వీకరిస్తున్నానని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని నేపాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన ప్రారంభానికి శ్రీకారం చుడదామని అన్నారు. భారత్–నేపాల్ మధ్య దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ అంటే తమకు ఎంతో గౌరవం, ప్రేమ అని స్పష్టంచేశారు. తమ దేశానికి భారత్ వివిధ సందర్భాల్లో ఎంతగానో సాయం అందించిందని చెప్పారు. భారతదేశ పాలకులు, నాయకులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి నమస్కారాలు తెలియజేస్తున్నానని జస్టిస్ సుశీల కర్కీ వ్యాఖ్యానించారు. మోదీజీ అంటే తనకు గౌరవ ప్రప త్తులు, ఆరాధనభావం ఉన్నట్లు వివరించారు. -
భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు
సాక్షి, అమరావతి : ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ (భావ ప్రకటనా స్వేచ్ఛ) అందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుకు ఎవరూ విఘాతం కల్పించలేరని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన స్పందించారు. సోషల్ మీడియా అంశం రాష్ట్ర పరిధిలో లేదని గుర్తు చేశారు. అది పూర్తిగా కేంద్రం పరిధిలో ఉన్నందున దాన్ని నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. గతంలో ఆ చట్టం (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000)లోని సెక్షన్–66–ఏ కు కేంద్రం ఒక సవరణ చేస్తే.. దాన్ని సుప్రీంకోర్టులో శ్రేయ సింఘాల్ సవాల్ చేశారని గుర్తు చేశారు. ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఆ సవరణ వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ లోని భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని, భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు అని స్పష్టం చేసిందని వివరించారు. అసెంబ్లీలో తగినంత సమయం ఇస్తేనే ప్రజా సమస్యలు ప్రస్తావించగలుగుతామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం. అది మాదే. అయినా మాకు ప్రతిపక్ష గుర్తింపు ఇవ్వడం లేదు. ఆయనకు అది ఇష్టం లేదు. అందుకు కారణం ప్రజల సమస్యలు కనిపించకూడదు.. ప్రజల గొంతు వినిపించకూడదు అనేదే ఆయన ఉద్దేశం’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ‘మమ్మల్ని ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదన్న దానిపై హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. దానికి ఇప్పటికీ స్పీకర్ సమాధానం చెప్పడం లేదు’ అంటూ గుర్తు చేశారు.కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరగాలిస్థానిక ఎన్నికల్లో అక్రమాలకు ఈవీఎంలు పరిష్కారం కాదని.. మొన్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో చూశామని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా రిగ్గింగ్ చేయించిందని ఎత్తి చూపారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్థానిక సంస్థలు నిర్వహిస్తేనే పారదర్శకంగా జరుగుతాయని పునరుద్ఘాటించారు. ‘యూరియా కొరత వల్ల రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. అసలు ప్రభుత్వానికి ప్రణాళిక ఉందా? ఖరీఫ్లో పంట చేలకు ఎన్నిసార్లు, ఎంత యూరియా వేస్తారో తెలియదు.. కనీసం దాన్నయిన అచ్చెన్నాయుడును తెలుసుకోమనండి’ అంటూ మరో ప్రశ్నకు బదులిచ్చారు. ‘తురకపాలెంలో వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం ఏ విషయమూ స్పష్టంగా చెప్పడం లేదు. నేను ఎక్కడికైనా వెళ్తానంటే అర్థం లేని విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారు. అందుకే అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా తేలితే నేను వెళ్తాను’ అంటూ మరో ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. -
నివురుగప్పిన నిప్పులా నేపాల్
కాఠ్మండు/న్యూఢిల్లీ/డెహ్రాడూన్/జైపూర్: హిమాలయాల నేపాల్లో సోషల్మీడియాపై నిషేధంతో శాంతియుతంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం ఉగ్రరూపం దాల్చి డజన్లమందిని పొట్టనబెట్టుకుని బుధవారానికి చాలామటుకు శాంతించింది. కానీ బయటిశక్తుల విధ్వంసకర ఉద్యమ ఎగబోతతో నివురుగప్పిన నిప్పులా తయారై తాత్కాలిక ప్రభుత్వానికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. దాంతో సైన్యంరంగంలోకి దిగి దేశవ్యాప్త కర్ఫ్యూను కఠినంగా అమలుచేస్తోంది. ఉద్యమబాట వీడి చర్చల పథంలో సాగాలంటూ విద్యార్థి సంఘాలకు దేశాధ్యక్షుడు రామచంద్ర పౌదెల్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ‘జెన్ జెడ్ నేపాల్’విద్యార్థి సంఘం ప్రతినిధులు నేపాల్ సైన్యంతో బుధవారం తొలిదఫా చర్చలు జరిపారు. రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి ఏకాభిప్రాయం కుదర్లేదు. మరోమారు చర్చలు జరపనున్నారు. నేపాల్ మాజీ మహిళా చీఫ్ జస్టిస్ సుశీల కరీ్క, కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా, మాజీ విద్యుత్ బోర్డ్ సీఈఓ కుల్మాన్ ఘిసింగ్లలో ఏవరో ఒకరి సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలని విద్యార్థులు డిమాండ్చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వదేశాన్ని నిరసనోద్యమ అగి్నకీలల్లోకి తోసేశారన్న ఆరోపణలను విద్యార్థులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. శాంతియుతంగా పోరాటంచేస్తుంటే బయటిశక్తులు దూరి విధ్వంసం సృష్టించాయని స్పష్టంచేశాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినా ఆందోళనలు చల్లారకపోవడంతో సైన్యం మంగళవారం అర్థరాత్రి రంగంలోకి దిగింది. అత్యంత సమస్యాత్మకంగా మారిన ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. దేశవ్యాప్త కర్ఫ్యూను విధించింది. అయితే హింసాత్మక ఘటనల్లో మరణాల సంఖ్య బుధవారానికి 33కు పెరిగింది. 1,033 మంది గాయపడ్డారు. గురువారం ఉదయం దాకా కఠిన ఆంక్షలను అందరూ పాటించాలని, లూటీ, దోపిడీ వంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. యాత్ర, పర్యటన కోసమొచ్చి చిక్కుకుపోయిన విదేశీయులను భద్రంగా స్వదేశాలకు తరలించే ప్రక్రియ మొదలెడతామని ఆర్మీ భరోసా ఇచ్చింది. ఆలోపు విదేశీ పర్యాటకులు, యాత్రికులకు తగు సాయం చేయాలని హోటళ్లు, టూరిజం సంస్థలను ఆర్మీ ఆదేశించింది. కాఠ్మండులో దుకాణాలు కొల్లగొట్టిన అల్లరిమూకల సభ్యులను ఆర్మీ అరెస్ట్చేసింది. వారి నుంచి భారీ ఎత్తున నగదు, 31 ఆయుధాలు, విలువైన వస్తువులను స్వా«దీనంచేసుకుంది. నేపాల్లో తాజా పరిస్థితిని గమనిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ బుధవారం చెప్పారు. పారిపోయిన ఖైదీలు ఆందోళనకారులు జైళ్లను బద్దలుకొట్టడంతో వాటిల్లోని 13,000 మందికిపైగా ఖైదీలు పరారయ్యారు. ఢిల్లీబజార్ జైలు, ఛిత్వాన్, నఖూ, ఝుంప్కా, కంఛన్పూర్, జలేశ్వర్, కస్కీ, డాంగ్, జుమ్లా, సోలూఖుంబు, గౌర్, బజ్హాంగ్లోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయారు. ఆకొద్ది సమయంలో పారిపోవడం సాధ్యంకాని ఖైదీలు కారాగారాల్లో ఘర్షణలకు దిగుతున్నారు. పశ్చిమ నేపాల్లోని బాంకే ప్రాంతంలోని నౌబస్తా ప్రాంతీయ జైలు పరిధిలోని బాలనేరస్తుల కేంద్రంలో కొందరు జైలువార్డన్ల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు తెగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు బాలలు చనిపోయారు. కొన్ని జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీలను సైన్యం ఎలాగోలా వెతికి పట్టుకుని మళ్లీ జైల్లో పడేసింది.పర్యాటకుల ఆక్రందనలు పొఖారా పట్టణంలో వాలీబాల్ లీగ్ మ్యాచ్ల కోసం వచి్చన భారతీయ మహిళ ఉపస్థ గిల్ ఆందోళనకారుల దాడి నుంచి తప్పించుకున్నారు. తనను రక్షించాలని, స్వదేశానికి పంపించాలని భారతసర్కార్ను వేడుకుంటూ ఆమె ఇన్స్టా గ్రామ్లో ఒక వీడియో పోస్ట్చేశారు. ‘‘మ్యాచ్ కోసం ఇక్కడికొచ్చా. హోటల్ స్పాలో ఉన్నప్పుడు ఆందోళనకారులు పెద్ద కర్రలతో వెంటబడ్డారు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్నా. కానీ నా లగేజీ మొత్తం హోటల్లోనే ఉండిపోయింది. ఆ హోటల్కు నిరసనకారులు నిప్పుపెట్టి కాల్చేశారు. దయచేసి నన్ను భారత్కు పంపేయండి. రోడ్ల మీద ఎక్కడ చూసిన మంటలే చెలరేగుతున్నాయి. ఇక్కడ దారుణ పరిస్థితులున్నాయి’’అని ఆమె వీడియోలో వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పర్యాటకులు నేపాల్లో చిక్కుకుపోయి సురక్షిత తిరుగుప్రయాణం కోసం ప్రభుత్వ సాయం అర్థిస్తున్నా రు. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే నేపా ల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఎయిర్ఇండియా, ఇండిగో విమానాల్లో భారతీయులను వెనక్కి రప్పిస్తామని పౌరవిమాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
సోషల్ మీడియా.. ఆ ఆనందం కృత్రిమమే!
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది. నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్కు కానీ, టూర్కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్ని, ప్లేస్ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.– శ్రీకుమార్, విశాఖపట్టణం సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్మీడియా ఒక ΄్లాట్ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు. సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్టూర్లు, కాస్ట్లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
అల్లుడిని చూసి మురిసిపోతున్న నిహారిక.. బ్లాక్ శారీలో బిగ్బాస్ బ్యూటీ దివి!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్టన్నింగ్ పిక్స్..విదేశాల్లో చిల్ అవుతోన్న నటి మంజు వారియర్..వరుణ్ తేజ్ కుమారుడితో నిహారిక కొణిదెల పిక్..బ్లాక్ శారీలో మెరిసిపోతున్న బిగ్బాస్ దివి..హాలీవుడ్ పాపలా పోజులిచ్చిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
నేపాల్ సంక్షోభం నుంచి నేర్వవలసిన పాఠం!
‘కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని కొన్ని దశాబ్దాలకిందట ఆక్రోశించాడు ఓ సినీకవి. ఈ జెనరేషన్ కుర్రాళ్లంతా ఇంతే.. ఏదీ పట్టదు,, పక్కవాళ్ల గురించి పట్టించుకోరు.. సమాజం గురించి ఆలోచించారు.. తమ సొంత ప్రపంచంలోనే ముడుక్కుని ఉండిపోతుంటారు.. అని విలపించేవాళ్లు, మనకు ప్రతిరోజూ పుంఖానుపుంఖాలుగా కనిపిస్తుంటారు. కానీ.. యువతరం గురించి ఇలాంటి అభిప్రాయాలన్నీ అపోహలే! వారిలో చైతన్యం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ సజీవంగానే ఉంది. ఉంటుంది. కాకపోతే.. దానిని జ్వాలగా రాజేసే సరైన నిప్పుకణిక ఉన్నప్పుడు.. జ్వాలలు రేగుతాయి. ప్రభుత్వాలలోనూ వేడిపుట్టిస్తాయి.‘సోషల్ మీడియా’ అనే పదం వినగానే చాలామంది ఏదో బూతు పదాన్ని విన్నట్లుగా మొహం గంటు పెట్టుకుంటారు. ఇక యువతరం విషయంలో అయితే- సోషల్ మీడియా అనేది వారిని సమూలంగా సర్వనాశనం చేస్తున్న విషపురుగు అని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటల్ని ఏకపక్షంగా సమర్ధించలేం. కొట్టి పారేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేస్తున్న వెర్రి తలలు ప్రతిరోజు వార్తల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. సోషల్ మీడియా విశృంఖల రూపాలు వాడుక లోకి రావడం ప్రమాదకరమైన సంకేతం.అదే సమయంలో యువతరానికి సోషల్ మీడియా చేస్తున్న మేలు గురించి కూడా గమనించాలి. నేపాల్ వంటి దేశాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో యువతరం ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడడం జరుగుతూ వస్తోంది. బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు కూడా అనేకులు. అలాంటి వారందరికీ స్వదేశంలోని తమ సొంత వాళ్లతో కనీసం అప్పుడప్పుడు అయినా మాట్లాడుకోవడానికి, అనుబంధాలను నెమరు వేసుకోవడానికి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి వారికి దొరికే ఏకైక మార్గం సోషల్ మీడియా మాత్రమే. నేపాల్ లో మరీ దారుణంగా వాట్స్అప్ యూట్యూబ్ వంటి వాటిని కూడా నిషేధిస్తూ వచ్చిన ఉత్తర్వులు పెద్ద అగ్నిజ్వాలలనే పుట్టించాయి. యువతలో పెల్లుబికిన ఆగ్రహాన్ని అణచివేయడానికి ప్రభుత్వం మిలిటరీని ప్రయోగించడం పదుల సంఖ్యలో ప్రాణాల్ని బలితీసుకుంది. ప్రధాని ఓలి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆగ్రహజ్వాలలు సర్కారీ పెద్దల భవనాలకు అంటుకుని.. ప్రాణాలనూ బలితీసుకున్నాయి. ఇంకా చాలా చాలా జరిగాయి.స్థూలంగా గమనించినప్పుడు.. తొలుత అనుకున్న సంగతిని మనం సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఇవాళ్టి యువతరం నిజంగానే నిస్తేజంగా ఉంటున్నదా? పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి వారిలో కొరవడిందా? అలాంటి సందేహాలకు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే.. అవన్నీ యువతరంలో సజీవంగానే ఉన్నాయని.. సరైన సమయంలో వాటిని ప్రదర్శించడానికి యువతరం ఏమాత్రమే వెనుకాడే పరిస్థితి లేదని ఈ నేపాల్ దృష్టాంతం నిరూపిస్తోంది. పదిహేనేళ్ల కిందటి మధ్యప్రాచ్య దేశాలను కుదిపేసిన ఉద్యమం అరబ్ స్ప్రింగ్ ను ఇది గుర్తుకు తెస్తోంది. 2011లో టునీషియాలో సోషల్ మీడియా అణచివేతకు వ్యతిరేకంగా రాజుకున్న పోరాటం ఈజిప్టు నుంచి లిబియా వరకు అన్ని దేశాలను కుదిపేసింది. నేపాల్ ఇవాళ అదే పునరావృతం అయింది. జెన్ జీ యువతరం సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వాన్ని తల్లకిందులు చేసింది.యువతరంలో పోరాట స్ఫూర్తి లేదని అనుకోవడం సరికాదు. సోషల్ మీడియాకు యువత వ్యసన పరులు అయ్యారని, అందువల్లనే వారంతా ఇలాంటి తిరుగుబాటుకు ఒడిగట్టారని ఏకపక్షమైన వాదన సరికాదు. రోడ్డు మీదికి వచ్చి పోరాడిన వాళ్లు, ప్రాణాలు అర్పించిన వాళ్లు కేవలం రీల్స్ చేసుకోవడం మీదనో, చూడడం మీదనో మోజు ఉన్నవాళ్లు మాత్రమే కాదు. ఇలాంటి నిషేధాజ్ఞలతో వ్యక్తి స్వేచ్ఛను హరించేయాలని అనుకుంటున్న నియంతృత్వపు పోకడలను ఈసడించుకున్న వాళ్లు మాత్రమే అనేది గుర్తించాలి. స్వేచ్ఛ పట్ల ఇవాళ్టి యువతరంలో ఉండే మమకారాన్ని తెలుసుకోవాలి. నిజానికి నేపాల్ లో చెలరేగిన తిరుగుబాటు, విధ్వంసకాండ.. భారతదేశంలోనూ అనేక రాష్ట్రాల పాలకులకు కనువిప్పు కలిగించాలి. నిషేధాల వంటి జోలికి ఇక్కడి పాలకులు ఇంకా దృష్టి సారించడం లేదు. సోషల్ మీడియాను తాము కూడా వాడుకుంటున్నారు. కాకపోతే.. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపునకు ఈ చట్టాలను, సోషల్ మీడియా బూచిగా వాడుకుంటున్నారు. పాలకుల, ఇలాంటి దుర్మార్గపు పోకడలు కామన్ మ్యాన్ కు కూడా ఏదో ఒక రోజున ఆగ్రహం తెప్పిస్తాయి. అలాంటప్పడు.. ఆ ప్రభుత్వాలు భస్మీపటలం కాక తప్పదు. నేపాల్ తరహా తిరుగుబాటు ఇక్కడ వస్తుందని కాదు.. కానీ.. ప్రజాస్వామికంగానే ఆ పతనం నిర్దేశం అవుతుంది.:::ఎం. రాజేశ్వరి -
కొత్తకారుతో నిమ్మకాయల్ని తొక్కించబోయి..
కొత్తగా కారు కొన్నాక కొందరు పూజలు చేయించి నిమ్మకాయలు తొక్కించి బండిని ముందుకు తీసుకెళ్లడం చూస్తుంటాం. అయితే అలాంటి ప్రయత్నాన్ని షోరూమ్లోనే చేయబోయింది ఓ మహిళ. పొరపాటు జరగడంతో 27 లక్షల విలువ చేసే కొత్తకారు యాక్షన్ సినిమాలో మాదిరి అద్దాలు బద్దలు కొట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ నుంచి భూమ్మీద బొక్కబొర్లాపడిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్ అనే మహిళ తన భర్త ప్రదీప్తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్ విహార్కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి బయటకు తేవాలనుకుంది. ఈలోపు.. పొరపాటును ఎక్సలేటర్ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్ఫ్లోర్ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్ సీన్ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆ కారు ధర రూ. 27 లక్షలుగా తెలుస్తోంది. दिल्ली के निर्माण विहार में स्थित महिंद्र शोरूम से महिला ने 27 लाख की थार खरीदी और शोरूम में ही पूजापाठ की, महिला को कार का पहिया नींबू पर चढ़ाना था लेकिन महिला ने ज्यादा एक्सीलेटर दिया और कार बिल्डिंग को तोड़ते हुए 15 फीट नीचे गिर गई#delhi #thar #viralvideo #laxminagar pic.twitter.com/oGgAvDkeZg— Live Viral Breaking News (@LVBNewsOfficial) September 9, 2025అయితే మరికొన్ని మీడియా చానెల్స్ మాత్రం మరోలా కథనాలు ఇస్తున్నాయి. షోరూం సిబ్బంది ఆ భార్యభర్తలకు డెమో ఇచ్చే టైంలో ప్రమాదం జరిగిందనిప్రసారం చేస్తున్నాయి. డెమో ఇచ్చే టైంలో ఆ సిబ్బంది కారు ఇంజిన్ ఆన్ చేశాడని, హఠాత్తుగా ఆ మహిళ ఎక్సలేటర్ తొక్కడంతో కారు బయటకు దూసుకొచ్చిందన్నది ఆ కథనం సారాంశం. ఏదిఏమైనా.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు వ్యంగ్యంగా స్పందిస్తుననారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ పలువురు నెటిజన్లు కోరుతుండడం గమనార్హం. -
మోదీతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఒక పోస్ట్లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. -
ఆగ్రహ జ్వాలలు
కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్ మీడియా యాప్లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్సర్కిల్కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్లోని బాల్కోట్ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్ ఖనాల్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్ బర్న్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. పెల్లుబికిన ఆగ్రహం పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్ జెడ్’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్పోర్ట్ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఎటుచూసినా విధ్వంసమే ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్ఆఫీస్లు, సీనియర్ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్ నేత ఇంటిని తగులబెట్టారు.సింఘదర్బార్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్గంజ్లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్కునేలో కాంతిపూర్ టెలివిజన్ ఆఫీస్ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్బహదూర్ దేవ్బా ఇంట్లో చొరబడి దేవ్బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.దేవ్బా కుమారుడు జైబీర్కు చెందిన కాఠ్మండులో హిల్టన్ ఐదునక్షత్రాల హోటల్కు, అర్జూకు చెందిన ఖుమల్తార్లోని ఉలెన్స్ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌదెల్ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్పోస్ట్లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి. దిగిపోవాలని డిమాండ్ చేసి దింపేశారుమంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్(యునిఫైడ్ మార్కిస్ట్–లెనినిస్ట్) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్ కాంగ్రెస్ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్వి గగన్ థాపా సైతం అంతకుముందే డిమాండ్చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్ ప్రకారం ఈనెలలోనే భారత్లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్వే మీద హిమాలయ ఎయిర్లైన్స్ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి. అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. నేపాల్ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్ ఎయిర్లైన్స్ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్పోర్ట్ రన్వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్లైట్లు రన్వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్లలో తలదాచుకున్నారు. పార్లమెంట్ను రద్దుచేయండి: బాలెన్ షా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ చెప్పారు. చర్చించుకుందాం.. రండి ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్ జెడ్ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్రాజ్ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.అయితే 26 సోషల్మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది. -
ఏమ్మా ఎలా ఉన్నావు?
‘ఏమ్మా...ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు?ఎంత మంది పిల్లలు, చిన్నవాళ్లేనా?నాకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టవచ్చు కదా!... ఈ మాటలు విని పెద్దగా నవ్వుకోవడానికి ఏముంది!అయితే ఇంటర్నెట్వాసులు మాత్రం తెగ నవ్వుతున్నారు. అసలు విషయంలోకి వద్దాం... ఒక బామ్మ చాట్జీపీటీతో ముచ్చటించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే ‘ఎక్కడుంటావు? ఎంత మంది పిల్లలు?’ అని అడిగింది.బామ్మ అమాయకత్వానికి నవ్వులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో 2 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. కామెంట్ సెక్షన్ ఫన్నీ రియాక్షన్స్తో నిండిపోయింది. బామ్మలు ఏఐ చాట్బాట్స్తో సరదాగా సంభాషించడం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్గా మారింది. -
జనరేషన్ జెడ్ హీరో.. నేపాల్కి కొత్త ప్రధాని.. ఎవరీ బాలెన్ షా?
కాఠ్మాండు: నేపాల్లో జనరేషన్ జెడ్ నిరసనలు ఆ దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్మీడియాపై ప్రభుత్వ ఆంక్షల్ని విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ రాజధాని కాఠ్మాండులో జనరేషన్ జెడ్ యువత రోడ్డెక్కింది. ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనలతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా తర్వాత తదుపరి ప్రధాని ఎవరు? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఆ దేశంలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో నేపాల్ తదుపరి నూతన ప్రధాని బాలేంద్ర షా (బాలెన్) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్మీడియాపై బ్యాన్, అవినీతిపై ఆందోళన చేస్తున్న యువతే బాలేంద్ర షాకు మద్దతు పలుకుతున్నాయి. అతనే నేపాల్ నూతన ప్రధాని అంటూ సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్ నిర్వయిస్తున్నాయి. రాపర్ నుంచి మేయర్ వరకు: బాలెన్ షా ప్రయాణంబాలెన్ షా ఒకప్పుడు అండర్గ్రౌండ్ హిప్-హాప్ రాపర్. తన పాటల ద్వారా రాజకీయ అవినీతి, సామాజిక అసమానతలపై విమర్శలు చేశారు. బలిదాన్ అనే పాటకు యూట్యూబ్లో ఏడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందిన బాలెన్, 2022లో స్వతంత్ర అభ్యర్థిగా కాఠ్మాండు మేయర్గా ఎన్నికయ్యారు.జెన్జీ ఆవేశాల్ని అర్ధం చేసుకోగలను నేపాల్లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించడంపై ఆందోళన చేపట్టిన జనరేషన్ జెడ్కు మద్దతుగా బాలెన్ షా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉద్యమం పూర్తిగా జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. వయస్సు పరిమితి కారణంగా వారి ఆందోళనలో నేను పాల్గొనలేను.కానీ వారి ఆవేశాలను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను’అని పేర్కొన్నారు.నేపాల్లో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నిషేధం విధించిన తర్వాత ప్రారంభమైన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. జనరేషన్ జెడ్ యువత ఆధ్వర్యంలో సాగిన ఈ ఉద్యమంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సైన్యం ఆదేశాలతో ప్రధాని కేపీ శర్మ ఓలి మంగళవారం రాజీనామా చేశారు. ఓలీ తన రాజీనామా లేఖలో.. సమస్యకు రాజకీయ పరిష్కారం అవసరం. అందుకు నేను రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఓలీ రాజీనామా అనంతరం ఎయిర్పోర్టులను మూసివేశారు. మంత్రులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ఈ క్రమంలో జనరేషన్ జెడ్ కేపీ ఓలీ తర్వాత తదుపరి ప్రధానిగా బాలెన్ షాయేనంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పార్టీల కోసం పని చేసే నాయకులు కాదు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు కావాలి’ అనే నినాదంతో బాలెన్ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు.‘బాలెన్ దాయ్.. టేక్ ద లీడ్’ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాష్ట్రపతి వద్దకు బాలెన్ షాప్రధాని ఓలి రాజీనామాతో రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ కొత్త నూతన ప్రధాని అభ్యర్ధి పేర్లను పరిశీలిస్తున్నారు. జనరేషన్ జెడ్ సైతం రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ వద్దకు బాలెన్ షా పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. -
Nepal: జెన్ జెడ్ తిరుగుబాటు సారధి సుడాన్ గురుంగ్ ఎవరు?
ఖాట్మండు: నేపాల్ ప్రభుత్వం మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం విధించడంతో యువత నుంచి నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో 20 మంది మరణించగా, 300 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రభుత్వం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ‘జనరేషన్ జెడ్’నిరసనలు చోటుచేసుకున్న దరిమిలా హోంమంత్రి రమేష్ లేఖక్ నైతిక కారణాలతో రాజీనామా చేశారు. ఈ నిరసనలపై స్పందించిన ప్రధాని కేపీ శర్మ ఓలి ఈ హింసకు అవాంఛనీయ శక్తుల చొరబాటే కారణమని ఆరోపించారు. కాగా ఈ నిరసనలకు స్వచ్ఛంద సంస్థ ‘హామీ నేపాల్’ అధ్యక్షుడు సుడాన్ గురుంగ్(36) సారధ్యం వహించాడని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో గురుంగ్.. సోషల్ మీడియా యాప్ల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలకు పిలుపు నిచ్చాడని సమాచారం.2015లో నేపాల్లో సంభవించిన భూకంపంలో సుడాన్ గురుంగ్ తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటన దరిమిలా సుడాన్ సమాజంలోని సమస్యలపై ఉద్యమాలను చేపడుతూ వస్తున్నాడు. ఒకప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్న ఆయన విపత్తు ఉపశమన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. సుడాన్ పిలుపు మేరకు వేలాది మంది యువ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. పార్లమెంటు వెలుపల భారీ ర్యాలీని నిర్వహించారు. సోషల్ మీడియా సైట్లపై ప్రభుత్వ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలోనే పోలీసులు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్, లైవ్ రౌండ్లను కూడా ప్రయోగించారు. -
Nepal: సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత
ఖాట్మండు: హిమాలయ దేశం నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ, అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు చెలరేగాయి. పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని, 20మంది మృతి చెందారు. ఈ పరిణామాల నేపధ్యంలో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు రెడిట్, ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించటంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూలు యూనిఫారాల్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవటంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. 1997–2012 మధ్య పుట్టిన యువత (జనరేషన్– జెడ్) మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి పెద్దగా నియంత్రణలేవీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవటానికైనా, సంపాదనకైనా, సంభా షించుకోవటానికైనా సోషల్ మీడియాయే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించటంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించటంతో... దానికి వ్యతిరేకంగా టిక్టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత... ‘నిషేధించాల్సింది అవినీతిని... సోషల్ మీడియాను కాదు’అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండల వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని ఖట్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కాగా ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంపై జెన్–జెడ్ చేస్తున్నవి మాత్రమే కాదని, ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ ఖట్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంటు గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. -
నేపాల్లో యువత ఆందోళనలు హింసాత్మకం.. కాల్పుల్లో 20 మంది మృతి
కఠ్మాండు: మొబైల్ ఫోన్ వద్దంటే ఇళ్లలోనే గొడవలైపోతున్న ఈ రోజుల్లో... దేశమంతటా సోషల్ మీడియాను నిషేధించి నేపాల్లోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇన్స్టా, యూట్యూబ్, వాట్సాప్తో పాటు రెడిట్, ఫేస్బుక్, ఎక్స్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా యాప్లను, సైట్లను నిషేధించటంపై నేపాల్ యువత భగ్గుమంది. కాలేజీ, స్కూలు యూనిఫారాల్లో సోమవారం రోడ్లపైకి వచ్చిన యువత... దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకోవటంతో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 20 మంది వరకూ మరణించగా 250 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణానికి నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. 1997–2012 మధ్య పుట్టిన యువత (జనరేషన్– జెడ్) మొబైల్ ఫోన్లు చేతికి వచ్చిన దగ్గర్నుంచి పెద్దగా నియంత్రణలేవీ ఎదుర్కోలేదు. వీరికి చదువుకోవటానికైనా, సంపాదనకైనా, సంభా షించుకోవటానికైనా సోషల్ మీడియాయే ఆధారమైపోయింది. జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. అలాంటిది ఒక్కసారిగా టిక్టాక్, వైబర్ మినహా అన్ని ప్రధాన సోషల్ మీడియా సైట్లనూ నిషేధించటంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 4న నిషేధం విధించటంతో... దానికి వ్యతిరేకంగా టిక్టాక్లో చర్చ మొదలైంది. ఆ చర్చ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వ అవినీతివైపు మళ్లింది. ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, బంధుప్రీతి ఎక్కువైందని, నేతల కొడుకులు, కూతుళ్లు రాజ్యమేలుతున్నారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి ఫలితంగా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చిన యువత... ‘నిషేధించాల్సింది అవినీతిని... సోషల్ మీడియాను కాదు’అని ప్లకార్డులు చూపిస్తూ ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. పార్లమెంటు వద్ద, మైటీఘర్ మండల వద్ద భారీగా గుమికూడారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన భద్రతా బలగాలు పలుచోట్ల కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాజధాని ఖట్మండు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మా నిర్ణయం సరైనదే: కేపీ శర్మ ఓలీ నిరసనల నేపథ్యంలో నేపాల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. కొందరు యువత బ్లాక్మెయిల్ చేస్తే వారికి లొంగేది లేదని, తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ చెప్పారు. మంత్రులంతా దీనికి మద్దతివ్వాలని కోరారాయన. అయితే ప్రభుత్వంలో భాగమైన నేపాలీ కాంగ్రెస్ మంత్రులు తక్షణం నిషేధాన్ని తొలగించాలని కోరారు. ఓలీ మొండి వైఖరికి నిరసనగా కేబినెట్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కాగా ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంపై జెన్–జెడ్ చేస్తున్నవి మాత్రమే కాదని, ప్రభుత్వ అవినీతిపై అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనల్ని నేపాల్ జాతీయ మానవహక్కుల సంఘం ఖండించింది. నిరసనకారుల మాట వినాలని, రాజకీయంగా తటస్థ వైఖరి అవసరమని పేర్కొంటూ ఖట్మండు మేయర్ బాలెన్ షా ఆందోళనకారులకు మద్దతు పలికారు. పార్లమెంటు వద్ద హింసాత్మకం ప్రధానంగా పార్లమెంటు వద్దే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా నిరసనకారులు వాటిని తోసుకుంటూ ముందుకొచ్చారు. వారిని నిలువరించడానికి పోలీసులు భాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. ఈ గందరగోళం మధ్యలోనే కొందరు నిరసనకారులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించారు. పార్లమెంటు గేట్లను ధ్వంసం చేశారు. ఈ దశలో పోలీసులు కాల్పులు జరిపారు. నిషేధం ఎందుకంటే... సోషల్ మీడియా సంస్థలు ఆగస్టు 28లోగా తమ దేశంలో రిజిస్టరు చేసుకోవాలని ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఈ డెడ్లైన్ ముగిసినా ప్రధాన సోషల్ మీడియా సంస్థలేవీ రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో నిషేధం విధిస్తున్నట్లుగా ఈ నెల 4న ప్రభుత్వం ప్రకటించింది. -
నేపాల్ ప్రధాని కేపీ ఓలి కుటుంబ సభ్యులపై రాళ్లదాడి.. హోం మంత్రి రాజీనామా
కాఠ్మాండూ: నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ను ఎత్తివేయాలంటూ అక్కడి యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళన కారుల్ని నిలువరించేందుకు పోలీసులు, ఆర్మీ బలగాలు చేసిన ప్రయత్నాల కారణంగా సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు.అయినప్పటికీ నేపాల్ రాజధాని కాఠ్మాండూలో జెడ్ జనరేషన్ మొదలు పెట్టిన ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఆందోళన కారులు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి పూర్వీకుల ఇంటిపై రాళ్లు విసిరారు. రాజధాని కాఠ్మాండూతో పాటు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాని ఓలి స్వస్థలమైన దమక్ వరకు ఈ ఉద్యమం విస్తరించింది. కోశీ ప్రావిన్స్లోని ఇతర ప్రాంతాల్లో కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.నేపాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు యువత సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తోంది. ఎక్కడ అవినీతి జరిగినా క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో యువతకు భయపడిన నేపాల్ ప్రభుత్వం గత గురువారం(సెప్టెంబరు 4) మెటా,యూట్యూబ్,ఎక్స్.కామ్ ఇలా మొత్తం 26 సోషల్ మీడియా ఛానెల్స్ను బ్యాన్ చేసింది. దీంతో నేపాల్ యువత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెదవి విరిచింది. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఆదేశాల్ని నేపాల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.ఈ నేపథ్యంలో గత గురువారం నుంచి, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. జెనరేషన్జెడ్ యువత రాజధాని కాఠ్మాండూ నగర వీధుల్లో ఉద్యమాన్ని సోమవారం ముమ్మరం చేసింది. దేశంలో పెరిగిపోతున్న అవినీతి పారద్రోలడం,సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేయడంతో పాటు ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేపాల్ హోం మంత్రి రాజీనామానేపాల్ హోం మంత్రి రమేశ్ లేఖక్ రాజీనామా చేశారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను ప్రధాని కేపీ ఓలికి అందజేశారు. -
తగలబడుతున్న నేపాల్ 16మంది మృతి.. 100 మందికిపైగా..!
-
వచ్చే ఏడాది త్వరగా వచ్చేయ్ వినాయక.. శ్వేతాబసు ప్రసాద్ పోస్ట్ (ఫొటోలు)
-
కల్లోలంగా నేపాల్.. అసలేం జరుగుతోంది? వాళ్ల డిమాండ్లేంటి??
నేపాల్లో అక్కడి జెడ్ జనరేషన్ మొదలుపెట్టిన ఉద్యమం(Gen-Z Protest) అదుపు తప్పింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ఖాట్మాండులో కొనసాగుతున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఇప్పటిదాకా 20 మంది మరణించగా.. వంద మందికి పైగా గాయాలయ్యాయి. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.నేపాల్ రాజధాని ఖాట్మాండులో జెడ్ జనరేషన్ యువత పెద్ద ఎత్తున అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై నిరసనకు దిగారు. అయితే ఇది కేవలం ఖాట్మాండుకే పరిమితం కాలేదు. పోఖరా, బుట్వాల్, ధరణ్, ఘోరాహీ వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో.. పలువురు మృతి చెందారు. నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ప్రధాని కె.పి. శర్మ ఓలి స్వస్థలం ధమాక్కూ ఈ నిరసనలు విస్తరించాయి.ఆందోళన వెనుక కారణాలుకిందటి ఏడాది ఆగస్టు/సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీం కోర్టు.. అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలి అని ఆదేశించింది. స్థానిక ప్రతినిధిని నియమించాలని, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్.. కంప్లయన్స్ ఆఫీసర్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలొచ్చాయి. ఈ ఏడాది మార్చిలో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఆపై ఆగస్టు 27న చివరికి.. 7 రోజుల గడువుతో అధికారిక నోటీసు ఇచ్చింది. చివరకు సెప్టెంబర్ 4న 26 అప్లికేషన్లను(యాప్లను) బ్లాక్ చేసి పడేసింది.అభ్యంతరాలు అందుకే..ప్రభుత్వ చర్యలను Gen-Z యువత సెన్సార్షిప్గా, అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నంగా అభివర్ణిస్తోంది. ఈ క్రమంలో నేపాల్లో కోర్టు తీర్పు ప్రకారం రిజిస్టర్ అయిన టిక్టాక్ లాంటి ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో.. రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. పొలిటికల్ నెపోటిజానికి తాను వ్యతిరేకమని చాటి చెబుతున్నారు. నేతల పిల్లలకేమో బంగారు భవిష్యత్తు అని.. మరి తమ పరిస్థితి ఏంటని? నిలదీస్తున్నారు. ఈ క్రమంలో.. రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొసమెరుపు ఏంటంటే.. టిక్టాక్ను కిందటి ఏడాది నేపాల్ బ్యాన్ చేసింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరించడంతో ఆ బ్యాన్ను ఎత్తేసింది. ఇప్పుడు అదే ప్లాట్ఫారమ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉవ్వెత్తున సాగేలా చేస్తోంది.ప్రభుత్వం స్పందననియమిత నమోదు లేకుండా పనిచేస్తున్న సంస్థలను నిషేధించడమే ఉద్దేశం అని ప్రభుత్వం చెబుతోంది.స్వేచ్ఛను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నాం అని అంటోంది. నిరసనల్లో.. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ తూటాలు ప్రయోగించారు. పలు చోట్ల కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులు గాయపడ్డారు. ఖాట్మాండు బనేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన కర్ఫ్యూ, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని నివాస ప్రాంతాల వరకు విస్తరించబడింది. ఖాట్మండు పోస్ట్ కథనం ప్రకారం.. నేపాల్లో కోటి 35 లక్షల మంది ఫేస్బుక్ యూజర్లు ఉన్నారు. 36 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. వ్యాపారాలపై కోసం చాలామంది ఆధారపడి ఉన్నారు. అలా.. బ్యాన్ నేపథ్యంలో అన్నివిధాల నిరసనలు ఊపందుకున్నాయి. Gen-Z (Generation Z) అనేది 1997 నుండి 2012 మధ్య కాలంలో జన్మించిన వ్యక్తుల తరం. జెన్ జెడ్ ఏం చెబుతోంది అంటే.. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం కాదు, అవినీతికి వ్యతిరేకంగా మా తరం పోరాటం. ముగించాల్సింది కూడా మేమే అని ప్రకటించుకుంటోంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తేసే ఆలోచనలో నేపాల్ ప్రభుత్వం ఉన్నట్లు అక్కడి మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. -
కాంగ్రెస్ చీఫ్ ఇంట్లో చోరీ.. ముసుగులతో వచ్చి.. వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ముసుగు ధరించి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల విషయమై బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వివరాల ప్రకారం.. ఇండోర్లోని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జితు పట్వారీ నివాసంలోకి దొంగలు ప్రవేశించారు. ఐదుగురు వ్యక్తులు ముసుగు ధరించి వారు దొంగతనానికి ప్రయత్నించారని జితు పట్వారీ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘శుక్రవారం అర్థరాత్రి ఇండోర్లోని ఎంపీ, కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ ఇంట్లో ఐదుగురికి పైగా దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. ముసుగు ధరించిన దుండగులు పట్వారీ కార్యాలయం మొత్తాన్ని కూడా సోదా చేశారు’ అని పోస్ట్ చేసింది.Indore में Congress प्रदेश अध्यक्ष Jitu Patwari के घर डकैती की कोशिश...#congress #mpnews #indorenews #latestnews #trendingnow #samaynow pic.twitter.com/dBYqzOHqty— Swatantra Samay (@SamaySwatantra) September 6, 2025ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. పట్వారీ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనపై జీతు పట్వారీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఐదుగురు వ్యక్తులు జితు పట్వారీ ఇంట్లోకి ప్రవేశించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Breaking Attempted robbery at Madhya Pradesh #Congress President Jitu Patwari’s residence.Five masked men caught on cam pic.twitter.com/rFVbtrs1Cl— Aditi Bhardwaj (@Aditi14Bhardwaj) September 6, 2025 -
టీ కెటిల్తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ..
మానవతావాదులు తాము ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు తమ వంతు సహాయం చేయడానికి రంగంలోకి దిగుతారు. భారీ వర్షాల వల్ల పంజాబ్లో జన జీవితం అస్తవ్యస్తం అయింది. ఒక వృద్ధుడు టీ కెటిల్తో నడుం లోతు నీళ్లలో నడుస్తూ, తడుస్తూ ఎక్కడ వరద బాధితులు కనిపించినా వారికి టీ అందజేస్తూ వెళుతున్నాడు. బాధితులకు ధైర్యవచనాలు చెబుతున్నాడు.నిజానికి అతడు కూడా వరద బాధితుడే! వర్షాల దెబ్బకు వంట అనేది లేకుండా ఆకలిదప్పులతో నీరసించిపోయిన బాధితులకు ఆ కాస్త టీ ఎంతో కొంత ఉమశమనం ఇచ్చింది. క్రికెటర్ హర్బజన్సింగ్ (Harbhajan Singh) ఈ వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.చదవండి: ఏఐ చాట్బాట్లకు లింగ వివక్ష ఉంటుందా?‘పంజాబీలను అనుకరిస్తూ కొద్దిమంది జోక్లు చేస్తుంటారు. ఈ వీడియో చూసి అయినా వారిలో మార్పు రావాలి. పంజాబీ ప్రజల మానవత్వాన్నికి చిన్న ఉదాహరణ ఈ వీడియో’‘ కష్టాలు... అని బాధపడుతుంటాంగానీ ఆ కష్టాలే మనుషులను దగ్గర చేస్తాయి. మానవత్వాన్ని పరీక్షిస్తాయి’... ఇలా రకరకాలుగా స్పందించారు యూజర్లు.When volunteers went to deliver relief materials, the flood-affected family despite having lost almost everything prepared tea and served it to the volunteers in return. That’s the spirit of Panjab. Rab de bande. #Punjab #PunjabFloods pic.twitter.com/EVdCuHlKuP— Harbhajan Turbanator (@harbhajan_singh) September 3, 2025 -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
Pakistan: గుడ్డు విసిరింది ఎవరు?
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్కు చేదు అనుభవం ఎదురైంది. రావల్పిండి అడియాలా జైలు బయట ఆమెపై కోడి గుడ్డు దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సొంత పార్టీ మహిళా కార్యకర్తలనే పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. తోషాఖానా కేసులో జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్తో శుక్రవారం ములాఖత్ అయిన అనంతరం అలీమా జైలు బయట మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమెపైకి గుడ్డును విసిరారు. అది ఆమె గదవకు తాకి పగిలిపోయి దుస్తుల మీద పడిపోయింది. గుడ్డు విసిరింది ఎవరు? అంటూ గట్టిగా గదమాయించారు. వెంటనే తేరుకుని ఫర్వాలేదు.. వదిలేయండి అంటూ ఆమె తన ప్రసంగం కొనసాగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమెపైకి గుడ్డు విసిరింది ఇద్దరు మహిళలని, వాళ్లు పీటీఐ మద్దతుదారులేనని, జర్నలిస్టుల గుంపులో వచ్చి గుడ్డు విసిరారని, వాళ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.తయ్యబ్ బాలోచ్ అనే సోషల్ మీడియా జర్నలిస్టు.. అలీమ మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్టులు చేశారు. దీంతో పీటీఐ మద్దతుదారులు ఆ జర్నలిస్టును టార్గెట్ చేశారు. ఇదే విషయమై అలీమాకు ప్రశ్న ఎదురుకాగా.. ఆమె దాటవేశారు. ‘‘మీడియా అడిగిందానికి సమాధానం ఇవ్వకుండా.. బాలోచ్ను బెదిరించడం ఏంటి?.. ప్రశ్నించడమే నేరమా?’’ అని మీడియా ప్రతినిధులు ఆమెను నిలదీశారు. అయినా ఆమె మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఆమెపై గుడ్డు పడింది. అయితే.. ఈ దాడిని పీటీఐ ఖండించింది. అది తమ కార్యకర్తల పని కాదని అంటోంది. ఇమ్రాన్ ఖాన్ కుటుంబానికి భయపడే ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, PML-N పార్టీ ఈ దాడి చేయించారని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వ వర్గాలు, ఆర్మీ వర్గాలు స్పందించాల్సి ఉంది.Strongly condemn the disgraceful act of throwing an egg at Aleema Khanum, sister of former Prime Minister Imran Khan. No political disagreement should ever justify such disrespect. Pakistan’s politics need dialogue, not humiliation. #AleemaKhanum #StayStrongAleemaKhan pic.twitter.com/U5e2J1djPc— SAQIB (@saqibhussaiinn) September 5, 2025పాక్తో తోషాఖానా(ధనాగారం) కేసు సంచలనం సృష్టించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు.. తోషాఖానాలో ఉన్న విలువైన బహుమతులను దొడ్డిదారిన అమ్మేశాడని ఆరోపణలు వచ్చాయి. రూ. 14 కోట్ల (అంటే సుమారు $500,000) విలువైన బహుమతులను అమ్మినందుకు.. 2023 ఆగస్టులో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 8న జరగనుంది. -
సోషల్ మీడియా దెబ్బ.. చంద్రబాబు అబ్బా..
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.-సిమ్మాదిరప్పన్న -
Anjana Krishna: ఈ ధైర్యం అక్కడి నుంచి వచ్చిందే!
నీకు ఎంత ధైర్యం? అంటూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) ఓ ఐపీఎస్ అధికారిణితో వాగ్వాదం సందర్భంగా ప్రశ్నించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. ఈ వ్యవహారంలో పవార్ ప్రవర్తనపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆ డేరింగ్ యంగ్ ఆఫీసర్ గురించి ఆరా తీస్తున్నారు. 2022–23 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అంజనా కృష్ణ(26) స్వస్థలం కేరళ. ఆమె తండ్రి ఓ చిన్నబట్టల దుకాణం నడిపిస్తున్నారు. తల్లి కోర్టు టైపిస్ట్గా పని చేస్తోంది. పూజప్పురాలోని సెయింట్ మేరీస్ సెంట్రల్ స్కూల్లో చదువుకుంది. చిన్నప్పటి నుంచే అంజనాకు ఐపీఎస్ కావాలనే కల. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో గణితంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆవెంటనే UPSC పరీక్షకు సిద్ధమైంది. అదే సమయంలో అంజనా ఓ ప్రముఖ మలయాళ దినపత్రికలో ఇంటర్న్గా పనిచేసింది కూడా. మలయాళ సాహిత్యాన్ని ఐచ్ఛిక విషయంగా ఎంచుకుని, ఆంగ్ల మాధ్యమంలో యూపీఎస్సీ పరీక్ష రాసింది. అలా.. 2022 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంజనా ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) 355 సాధించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాలా ప్రాంతంలో DSP (Deputy Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్నారు. నిజాయితీతో పాటు ఉత్సాహం, పరిపాలనా నైపుణ్యం, దూకుడు వల్ల ఆమెకు స్థానికంగా మంచి పేరు దక్కింది. View this post on Instagram A post shared by Fortune IAS Academy (@fortune_ias_academy)అసలేం జరిగిందంటే.. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారిణి అంజనా కృష్ణకు ఫిర్యాదులు అందాయి. దీనిపై చర్యలు తీసుకునేందుకు బుధవారం ఆమె ఆ గ్రామానికి వెళ్లారు. ఈక్రమంలో కొందరు గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అయితే.. వాళ్లలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్ ఆమెను ఆదేశించారు. ఈ క్రమంలో.. పవార్: నేను ఉపముఖ్యమంత్రిని మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.అంజనా: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్కు ఒకసారి వీడియో కాల్ చేస్తారా?పవార్: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్ చేయమంటారా?నన్ను చూడాలనుకుంటున్నారుగా.. నాకు వీడియో కాల్ చేయండి.अजित पवार- "इतना आपको डेयरिंग हुआ है क्या?"जब DSP अंजना कृष्णा ने अजीत पवार से कहा, "मैं कैसे मान लूं कि आप डिप्टी चीफ मिनिस्टर हो, वीडियो कॉल करो" #Maharashtra #AjitPawar #MaharashtraPolice #AnjanaKrishna #NCP pic.twitter.com/WUnEtWlfRm— India TV (@indiatvnews) September 5, 2025దీంతో పవార్కు ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ వీడియో కాల్ చేశారు. ఈ సందర్భంగా తక్షణమే చర్యలు ఆపేయాలంటూ పవార్ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. పవార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియోపై పవార్ వర్గ నేత సునీల్ తట్కరే స్పందించారు. కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఐపీఎస్ అధికారిణిని అజిత్ మందలించి ఉండవచ్చన్నారు. ఆమె విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది ఆయన ఉద్దేశం కాదన్నారు. ఇక ఈ ఘటనపై అంజనా కృష్ణ స్పందించాల్సి ఉంది. అయితే పవార్ స్వరం గుర్తించలేకపోయినందున నిర్ధారణ కోసమే కాల్ చేయాలని ఆమె కోరినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎంతో ‘నేరుగా కాల్ చేయండి’ అనే మాట ఆమె ధైర్యాన్ని ప్రతిబింబించే సంకేతంగా మారింది. సోషల్ మీడియాలో ఆమె ధైర్యం, నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. -
ఫేస్బుక్లో జుకర్ బర్గ్ బ్యాన్.. కేసేసిన జుకర్ బర్గ్
వాషింగ్టన్: ఫేస్బుక్లో తనని బ్యాన్చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్బుక్) తన అకౌంట్ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా. డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్బుక్ నా అకౌంట్ను బ్యాన్ చేయడంతో బిజినెస్ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్సైట్ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్లైన్లో క్లయింట్స్కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు. ‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్బర్గ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది. -
నీకెంత ధైర్యం?.. మహిళా ఐపీఎస్తో డిప్యూటీ సీఎం వాగ్వాదం
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిన ఐపీఎస్ అధికారిని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. సోలాపూర్లో కర్మలా తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో, ఇసుక తవ్వకాల విషయాన్ని స్థానికులు.. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే.. సబ్-డివిజనల్ పోలీసు అధికారి ఐపీఎస్ అంజనా కృష్ణ అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. ఇంతలో పలువురు ఎన్సీపీ నేతలు అక్కడికి చేరుకని అంజనా కృష్ణతో మాట్లాడాలని చెప్పి ఆమెను అడ్డుకున్నారు. ఎన్సీపీ నాయకుడు ఒకరు.. ఈ విషయమై డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్ను సదరు అధికారికి ఇవ్వాలని అజిత్ సూచించగా.. అంజనా కృష్ణ ఫోన్లో మాట్లాడారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయితే, అజిత్ పవార్ వాయిస్ను ఆమె గుర్తించలేదు. దీంతో, ఆగ్రహానికి లోనైన అజిత్.. ఆమెపై చిందులు తొక్కారు. నేను డిప్యూటీ సీఎంను.. నన్ను గుర్తించడం లేదా? అని ప్రశ్నించారు. ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా?. నీపై చర్యలకు సిద్ధంగా ఉండు అని హెచ్చరించారు. అనంతరం, తనకు వాట్సాప్లో వీడియో కాల్ చేయాలని సూచించారు. సదరు అధికారి వెంటనే వీడియో కాల్ చేయడంతో అజిత్ను చూసి మాట్లాడారు.करमाळ्याच्या पोलिस उपअधिक्षक अंजली कृष्णा यांना उपमुख्यमंत्री अजित पवारांना फोनवरुन ओळखता आले नाही. त्यानंतर रागावलेल्या अजित पवारांनी अंजली कृष्णा यांना खडेबोल सुनावत थेट व्हिडीओ काॅलच केला.#ajitpawar #AnjaliKrishna pic.twitter.com/ag2DNuf3do— Ankita Shantinath Khane (@KhaneAnkita) September 2, 2025అయితే, ఆమె సమాధానం పవార్ను ఆగ్రహానికి గురిచేసింది. ఐపీఎస్ అధికారిపై చర్య తీసుకుంటామని బెదిరిస్తూ ఆయన ఎదురుదాడి చేశారు. ఈ సందర్బంగా అజిత్..‘నేను మీపై చర్య తీసుకుంటాను. నేనే మీతో మాట్లాడుతున్నాను అంటే మీకు సరదాగా ఉందా?. మీకు నిజంగా అంత ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.మరోవైపు.. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో ప్రభుత్వం, అజిత్ పవార్పై విమర్శలు వచ్చాయి. దీంతో, రాష్ట్ర పార్టీ చీఫ్ సునీల్ తత్కరే దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా సునీల్ తత్కరే స్పందిస్తూ..‘అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ దాదా సదరు అధికారిని మందలించి ఉండవచ్చు. ఆమె చర్యను పూర్తిగా ఆపాలన్నది ఆయన ఉద్దేశ్యం కాదు. పవార్ ఎప్పుడూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరు అని చెప్పుకొచ్చారు. -
శారీలో బిగ్బాస్ దివి హోయలు.. మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ అందాలు!
బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ మాల్వికా రాజ్..ఫ్లైట్లో మన్మధుడు హీరోయిన్ చిల్.. శారీలో మలయాళ బ్యూటీ శ్వేతా మీనన్ హోయలు..లేటేస్ట్ పిక్స్ షేర్ చేసిన హీరోయిన్ హన్సిక..డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతోన్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంక సింగ్..శారీ అందాలతో టాలీవుడ్ ముద్దుగుమ్మ దివి.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Shwetha Menon (@shwetha_menon) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Simratt Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj) -
మైండ్ఫుల్నెస్గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!
అధికి బరువు సమస్యకు చెక్పెట్టేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుని సత్ఫలితాలు పొంది మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. భారంగా ఉండే సమస్యకు చాలామంది ఆరోగ్యకరమైన విధానానికే మద్దతిస్తుండటం విశేషం. షార్ట్కట్లు, ఔషధాలతో కాకుండా శారీరక శ్రమ, ఓపిక, క్రమశిక్షణ అనే ఆయుధాలతో బరువుని కరిగిస్తున్నారు..స్లిమ్గా మారుతున్నారు. అలాంటి కోవలోకి అక్షయ్ కక్కర్ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా చేరిపోయాడు. పైగా గతేడాది గణేష్ చుతర్థికి ఈ ఏడాది గణేష్ చతుర్థికి తనలో భారీగా సంతరించుకున్న మార్పుని సోషల్మీడియా వేదికగా షేర్ చేయడమే గాక అంతలా బరువు తగ్గేందుకు ఉపకరించిన ట్రిక్స్ని కూడా చేసుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ కక్కర్(Akshay Kakkar) వెయిట్లాస్(Weight loss) జర్నీ ఏవిధంగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. అసాధారణమైన తన అధిక బరువుని తగ్గించేందుకు ఎంతలా కష్టపడింది వివరించారు. ఏకంగా 179 కిలోలు పైనే బరువు ఉండే అక్షయ్ కేవలం ఒక్క ఏడాదికే ఊహించనంతంగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 44 కిలోలు పైనే బరువు తగ్గాడు. శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యవంతమైన మార్పుని అందుకున్నాడు. అందుకోసం తనకు క్రమశిక్షణ, సహనం, అచంచలమైన నమ్మకమే ఉపకరించాయని చెబుతున్నాడు అక్షయ్. "అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీకి గతేడాది వినాయక చవితికి..ఈ ఏడాది పండుగకి ఎంతో వ్యత్సాసం ఉంది. ఈ మార్పు నా జీవితంలో అదిపెద్ద బహుమతి. దీని వెనుక ఎంతో శ్రమ, చిందించిన చెమట, పోరాటం ఉన్నాయి. ఈ మార్పుకి ఎంతో సంతోషంగా ఉంది. గణపతి బప్పా నిజంగా అందరికి మంచి చేస్తాడు." అనే క్యాప్షన్ జోడించి మరి తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) ఎలాంటి డైట్, వ్యాయామాలు చేశాడంటే..తాను ఎలాంటి షార్ట్ కర్ట్లు అనుకరించలేదని అన్నారు. మైండ్ఫుల్నెస్గా తినడం, సముతుల్యంగా తినేలా జాగ్రత్త తీసుకోవడం, వంటి వాటి తోపాటు రుచికరమైన ఆహారాన్ని వదులుకోలేదని చెబుతున్నాడు. తన ప్లేట్లో సలాడ్, ప్రోటీన్ ప్యాక్, కూరగాయలు, పిండి పదార్థాల కోసం పప్పు, రోటీ, కరకరలాడే పాపడ్ వంటి ఉన్నాయని చెప్పారు. బరువు తగ్గడం నచ్చిన ఆహారం వదిలిపెట్టడం కాదు సరిగ్గా తినడం, సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం అని చెబుతున్నాడు. దాంతోపాటు కార్డియో వ్యాయామాలు..ముచ్చెమటలు పట్టేలా చేసి త్వరితగతిన బరువు తగ్గేందుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. అలాగే యోగా కూడా బరువు తగ్గడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని అంటున్నాడు. ఇది మానసికంగా బరువు తగ్గేలా బలోపేతం చేస్తుందని చెబుతున్నాడు. కేలరీలు తగ్గేందుకు కార్డియో అద్భుతమైన మ్యాజిక్ చేస్తుందని చెబుతున్నాడు. View this post on Instagram A post shared by Akshay Kakkar (@shezaadakakkar) వర్కౌట్లను మన శరీరాన్ని మంచిగా మార్చే వైద్య ప్రక్రియగా భావిస్తే..భారంగా అనిపించిందని అంటున్నాడు. అలా తను ఒక్క ఏడాదిలోనే 179 కిలోలు నుంచి 139 కిలోలకు వచ్చినట్లు తెలిపాడు. ఇక్కడ కేవలం బరువు తగ్గేందుకు ధైర్యంగా ముందడుగు వేయడం, మైండ్ఫుల్నెస్గా తినడం, ఓపిక, ఒక యోగా భంగిమ..అద్భుతమే చేస్తాయని నమ్మకంగా చెబుతున్నాడు అక్షయ్ కక్కర్.(చదవండి: ఆహారంలో వాపుని ఆపుదాం..! ఫుడ్ ఫర్ ఇన్ఫ్లమేషన్..) -
ఫ్యామిలీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. రేణుకా దేశాయ్ లేటేస్ట్ లుక్!
యాంకర్ లాస్య అదిరిపోయే డ్యాన్స్..షూటింగ్ సెట్ జ్ఞాపకాల్లో సీతారామం బ్యూటీ మృణాల్..నటి రేణుకా దేశాయ్ లేటేస్ట్ లుక్..హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ చిల్..ఫ్యామిలీతో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
16ఏళ్ల ముచ్చటైన కాపురం...రీల్స్ పిచ్చితో ఏడాదిలో సర్వ నాశనం
ఒకప్పుడు పచ్చని కాపురంలో చిచ్చుపెట్టడానికి చుట్టాలో, చుట్టుపక్కల వారో కారణమయేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యత కూడా సోషల్ మీడియానే తీసుకుంది. హాయిగా సాగిపోతున్న ఓ చక్కని కాపురంలో రీల్స్ పేరిట చిచ్చు రాజుకుంది. చివరకు భర్తను హత్య చేసేందుకు సైతం తెగించేలా ఓ భార్యను ప్రేరేపించింది.ఈ ఘటన గత శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియా బాద్లో ఉన్న పారిశ్రామిక వాడ లోనీలో నివసిస్తూ, తన భర్తను కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు 29 ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆ కేసుకు సాక్ష్యంగా నిలిచిన 16 సెకన్ల వీడియోలో ఆ వ్యక్తి తన చేతుల్లో ఒక బిడ్డను పట్టుకుని ఉండగా, ఆ మహిళ అతనిపై కత్తితో దాడి చేస్తోంది. అక్కడే ఉన్న మరో చిన్నారి ఆమెని అడ్డుకుంటూ నుంచి కత్తిని లాక్కునే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.బతుకు జీవుడా అంటూ భార్య కత్తి దాడి నుంచి తప్పించుకున్న అశోక్ విహార్ నివాసి అయిన అనీస్ పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇష్రాత్ను 2009లో వివాహం చేసుకున్నానని, అప్పటి నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతున్నామని, తమకు తొమ్మిది, ఆరు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే తన భార్య 2024లో ఇన్స్ట్రాగామ్ను డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి తమ ఇంట్లోని పరిస్థితులు డౌన్ కావడం మొదలయ్యాయని వెల్లడించాడు. భార్య వ్లాగర్గా మారడంతో పరిస్థితులు మరీ దిగజారిపోయాయయని , రీల్స్ షూట్ చేయడానికి కొత్త ఉపాయాలను కనుగొనే క్రమంలో తరచుగా తమ దంపతుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాలు వాదనలను కూడా ఆమె పోస్ట్ చేసేదని తెలిపాడు. కాలక్రమేణా తన భార్యకు సోషల్ మీడియా ఫాలోయింగ్పై వ్యామోహం బాగా పెరిగిపోయిందని, ఆ క్రమంలో ఇంటి పనులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయంపై అడిగినందుకు తరచుగా తన వంటిపై తానే గ్యాసోలిన్ పోసుకుని ఛస్తానని బెదిరించడం, అలాగే గోడకు తల కొట్టుకోవడం వంటి ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టిందని వివరించాడు.కొన్నిసార్లు, ఆమె అకస్మాత్తుగా విద్యుత్ తీగను పట్టుకునేదని, గ్యాస్ సిలిండర్ను ఉపయోగించి ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించేదని అతను వెల్లడించాడు. తన భార్య గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి రీల్స్ చేస్తోందని అది సరికాదని తాను దానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వారు తనను చంపేస్తామని బెదిరించారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఫిర్యాదు ఆధారంగా, మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు లోనీ ఏసీపీ సిద్ధార్థ్ గౌతమ్ తెలిపారు. -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్రావు,సంతోష్రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్రావు,సంతోష్రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్రెడ్డి,పల్లా రాజేశ్వర్రెడ్డి,ప్రశాంత్రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
మరణం, అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్ పోస్ట్ వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్య వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ట్రుత్ వేదికగా ట్రంప్.. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్ మీడియా వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.ఇక, అంతకుముందు.. ట్రంప్ మద్దతుదారుడు, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డీసీ డ్రైనో ట్రంప్ ఆరోగ్యంపై ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా డైసీ.. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారాల పాటు ప్రజల ముందుకు రాకుండా ఉంటారు. కానీ మీడియా ఆయన 'చురుగ్గా' ఉన్నారు.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతారు. ఇలాగే ఆయన డైపర్లు ధరించి నిద్రపోతున్నారు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ట్రంప్ 24 గంటలు కనిపించకపోతే మీడియా గగ్గోలు పెడుతోంది. ఇది హాస్యాస్పదమైన ద్వంద్వ ప్రమాణం. అమెరికా చరిత్రలోనే అందరి అధ్యక్షుల కంటే ట్రంప్ ఎక్కువ సమయం ప్రజా పనుల్లో గడిపారు అని వివరించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను’ అని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేతులు, కాళ్లపై గాయాలు ఉండడం, వాటిని కవర్ చేసేందుకు ట్రంప్ మేకప్ వేసుకుని మీడియాకు దొరికిపోవడంతో.. అంతా ఆయన ఏదో అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కానీ ఏదైనా అనుకోని భయంకరమైన విషాదం జరిగితే తానే అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ ఆరోగ్యంపై మరింత అనుమానం పెరిగింది. -
భారత్లోకి మళ్ళీ టిక్టాక్?: మొదలైన నియామకాలు
భారతదేశంలో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొంది.. ఇప్పుడు నిషేధంలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా యాప్ 'టిక్టాక్' ఉద్యోగుల కోసం ఎదురు చూస్తోంది. గురుగ్రామ్లోని ఆఫీసులో రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఇందులో ఒకటి కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), మరొకటి మంచి భాగస్వామ్యం.. కార్యకలాపాల లీడ్ కోసం. దీన్నిబట్టి చూస్తుంటే టిక్టాక్ మళ్ళీ భారత్లోకి అందుబాటులోకి రానుందా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.బైట్డాన్స్ యాజమాన్యంలోని షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ కంపెనీ వెబ్సైట్ ఇటీవల భారతదేశంలో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. అయితే.. దేశంలో టిక్టాక్ సేవలను తిరిగి ప్రారంభించడానికి కావలసిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ఆగస్టు 22న, కూడా ఈ చైనా యాప్ భారతదేశంలో తిరిగి అనుమతించారనే వాదనలను అధికారులు తిరస్కరించారు.టిక్టాక్ వెబ్సైట్లోని ల్యాండింగ్ పేజీ ఓపెన్ చేయగానే.. భారతదేశంలో ఇది అందుబాటులో లేదని సందేశాన్ని ప్రదర్శించేది. కానీ గత వారం డెస్క్టాప్ ద్వారా యాక్సెస్ చేసినప్పుడు ఈ ప్లాట్ఫామ్కు సంబంధించిన 'అబౌట్ అస్' పేజీ కనిపించింది. అయితే ఎలాంటి వీడియోలు కనిపించలేదు.ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాటిక్టాక్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. "మేము భారతదేశంలో టిక్టాక్కు మళ్ళీ స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వ ఆదేశాన్ని పాటిస్తూనే ఉన్నాము" అని టిక్టాక్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు.భారత.. చైనా దళాల మధ్య గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత జాతీయ భద్రతా సమస్యలను పేర్కొంటూ భారతదేశం జూన్ 2020లో టిక్టాక్తో పాటు 58 ఇతర చైనీస్ యాప్లను నిషేధించింది. అయితే ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సంకేతాలను కనిపిస్తున్నాయి. ఏడేళ్ల తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. చైనా సోషల్ మీడియా యాప్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందేమో అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
క్రెడిట్ లాగితే కాల్ దొరికింది
తీగ లాగితే డొంక కదిలినట్లు క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ గురించి ఆరా తీస్తే, అంతర్జాతీయ కాల్ డైవర్షన్ వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు 2009లో ఈ అనుభవం ఎదురైంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అసాంఘిక శక్తులకు సహకరిస్తున్న ఈ ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.సాధారణంగా విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై భద్రతా సంస్థల నిఘా ఉంటుంది. అనుమానాస్పద కాల్స్ వచ్చే నంబర్లను అవసరమైతే టాప్ చేస్తుంటారు కూడా! అంతర్జాతీయ కాల్స్పై నిఘా కోసం వాడే ఉపకరణాలు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉన్న ఇండియన్ ఇంటర్నేషనల్ గేట్వే లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) ఆపరేటర్ల వద్ద ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే కాల్స్ అక్కడి ఎక్స్చేంజ్ లేదా సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్కు చేరుతాయి. అక్కడి నుంచి ఐఎల్డీ ఆపరేటర్కు వచ్చి, ఆపై ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లేదా శాటిలైట్ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇవి ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్కతాలలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్స్చేంజీల ద్వారా ఇక్కడ రిసీవ్ చేసుకునే ఫోన్కు వస్తుంది.సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్ గేట్వే ఆఫ్ ఐఎల్డీ ఆపరేటర్, నేషనల్ లాంగ్ డిస్టెన్స్ ఆపరేటర్, బీఎస్ఓ టెలిఫోన్ ఎక్సేంజ్లకు సైతం విదేశీ కాల్ ఆపరేటర్లు నిర్ణీత మొత్తాలు చెల్లిస్తారు. ్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకునే ఈ సంస్థలు తమ ఆదాయం నుంచి నిర్దేశిత మొత్తాన్ని పన్నుగా చెల్లిస్తాయి. విదేశీ ఆపరేటర్లు ఇక్కడి వారికి డబ్బు చెల్లించకుండా ఉండేందుకు, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఉపకరించేలా కొన్నేళ్ల కిందట కాల్ డైవర్షన్ పద్ధతిని రూపొందించారు. ఇక్కడ ఉంటున్న కొంతమందికి సోషల్ మీడియా ద్వారా ఎరవేసి అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసేలా చేస్తుంటారు. ఇలా ఈ బాక్సులు ఏర్పాటైన తర్వాత విదేశంలో ఉన్న ఇంటర్నేషనల్ గేట్వే ఆపరేటర్కు వచ్చిన ఫోన్ కాల్ అక్కడ డేటాగా మార్చేస్తారు. దాన్ని ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఇక్కడి వారి వద్ద ఏర్పాటు చేయించిన బాక్సులకు పంపిస్తారు. వీరి దగ్గర ఉండే Vó ట్వేలు ఈ డేటాను మళ్లీ కాల్గా మారుస్తాయి. వాటిని అనుసంధానించి ఉన్న సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీగా పిలిచే పరికరాలకు చేరుతుంది. స్థానికంగా తీసుకున్న సిమ్కార్డులను ఈ సీడీఎమ్ఏ ఎఫ్డబ్ల్యూటీల్లో నిక్షిప్తం చేస్తారు. విదేశీ గేట్వే నుంచి డేటా రూపంలో వీటికి వెళ్లిన అంతర్జాతీయ కాల్ లోకల్గా మారిపోయి, అందులో నిక్షిప్తం చేసిన సిమ్కార్డు నంబరు నుంచి వస్తున్నట్లు ఆ ఫోన్ అందుకునే వ్యక్తికి చేరుతుంది. దీని వల్ల విదేశాల్లో ఉండే వ్యక్తికి కాల్ చార్జీలు తగ్గుతాయి. వాట్సాప్ నిషేధం ఉన్న దేశాల నుంచి ఈ కాల్స్ ఎక్కువగా చేస్తుంటారు. ఫలితంగా దేశంలోని ఆపరేటర్లకు రావాల్సిన ఆదాయం, ప్రభుత్వానికి రావాల్సిన పన్ను దెబ్బతింటాయి. దేశంలోని సర్వీసు ప్రొవైడర్ల ఆదాయానికి గండి కొట్టడం ద్వారా విదేశీ సర్వీసు ప్రొవైడర్స్ ఆ మొత్తాన్ని మిగుల్చుకుని, ఇక్కడ పరికరాలు ఏర్పాటు చేసి సహకరించిన స్థానికులకు హవాలా రూపంలో కమీషన్ పంపిస్తుంటారు.విదేశాల్లో ఉంటున్న ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్తో ఈ–మెయిల్ ద్వారా పరిచయం పెంచుకున్న హైదరాబాదీలు వి.రమేష్, మహ్మద్ అబ్దుల్ ఖదీర్, ఆర్డీ శ్రీనివాస్, నజీబ్ అహ్మద్ ఖాన్ కాల్ డైవర్షన్కు సహకరించడానికి అంగీకరించారు. వీరు హైదరాబాద్లోని రెండు ప్రాంతాల్లో గేట్వేలతో కూడిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిలో వినియోగించే సిమ్కార్డులను మారుపేర్లతో సంగ్రహించారు. వాటి బిల్లులు చెల్లించడానికి క్లోనింగ్ చేసిన క్రెడిట్ కార్డులను వినియోగించారు. ఇలాంటి కాల్ డైవర్షన్స్ను ఎక్కువగా వాట్సాప్ నిషేధంగా ఉన్న దేశాల్లో ఉంటున్న వారితో పాటు ఉగ్రవాదులు, మాఫియా కార్యకలాపాలు సాగించేవారు వాడుతున్నారు. ఈ విధానంలో ఫోన్ ఎక్కడ నుంచి వస్తోందనేది తెలుసుకోవడం స్థానికంగా డైవర్షన్ పరికరాలు ఏర్పాటు చేసిన వారికీ సాధ్యం కాదు. ఈ ముఠా టాస్క్ఫోర్స్ పోలీసులకు చిత్రంగా చిక్కింది. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు 2009 జనవరి 29న సికింద్రాబాద్ ప్రాంతంలో తిరుగుతున్నారని, క్లోనింగ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని ఓ కానిస్టేబుల్కు సమాచారం అందింది. ఆయన ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వి.రమేష్, మహ్మద్ ఖుద్దూస్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తమకు క్లోనింగ్ క్రెడిట్ కార్డులను ముంబైకి చెందిన ముగ్గురు వ్యక్తులు అందిస్తున్నారంటూ బయటపెట్టారు. వీటితో షాపింగ్స్ చేస్తున్నామని చెప్పారు. వీరిని అరెస్టు చేయడానికి సిద్ధపడ్డ పోలీసులు, వీరి వస్తువులను సోదా చేశారు. రమేష్ దగ్గర లభించిన ఓ పుస్తకంలో సీడీఎమ్ఏ ఫోన్కు చెందిన ‘9298’ సిరీస్తో సీరియల్గా 20కి పైగా నంబర్లు కనిపించాయి. వీటిని చూసి అనుమానించిన పోలీసులు కాస్త లోతుగా విచారించారు. ఫలితంగా పంజగుట్టలోని సఫైర్ అపార్ట్మెంట్స్, మాసబ్ట్యాంక్లోని మహేశ్వరి కాంప్లెక్స్ల్లో అత్యాధునిక ఉపకరణాలు ఏర్పాటు చేసి, అంతర్జాతీయ ఇన్కమింగ్ కాల్స్ను లోకల్స్గా మారుస్తూ జరుగుతున్న కాల్ డైవర్షన్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతాల్లో దాడి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితులను పట్టుకుని, కాల్ డైవర్షన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.· -
ట్రంప్ వచ్చేశారు.. అదంతా ఫేక్ ప్రచారమే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చనిపోయారంటూ, కనిపించడం లేదంటూ వస్తున్న వార్తలకు తెర పడింది. ఎట్టకేలకు అధ్యక్షుడు ట్రంప్.. దర్శనమిచ్చారు. ఈ మేరకు వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా ట్రంప్ తన వర్జీనియా క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో వైట్హౌస్ షేర్ చేసింది. దీంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు క్లారిటీ వచ్చేసింది.ఇక, వైట్హౌస్ ఈ సందర్బంగా స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ట్రంప్ తన మనుమరాలు కయి ట్రంప్, మనువడు ఫ్రెడరిక్ ట్రంప్తో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిపింది. ఇక, ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి, అమెరికా గ్రేట్ క్యాప్ ధరించి కనిపించారు. కాగా, తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని తేల్చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో, ట్రంప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. మీమ్స్, వీడియోలు చక్కర్లు కొట్టాయి.#JUSTIN: Trump is aliveDonald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30, 2025, heading to Trump National Golf Club in Sterling, Virginia.#Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump… pic.twitter.com/rDvhVWgPXX— upuknews (@upuknews1) August 30, 2025 -
ప్రియుడి కోసం ఇంట్లోంచి పారిపోయి.. మరొకరిని మనువాడి!!
ఒక హీరోయిన్ ఉంటది. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి పారిపోతుంది. దారిలో కలిసిన హీరోను ఈ ఇద్దరు సాయం కోరతారు. ఆ ప్రయాణంలో హీరోహీరోయిన్ల మధ్య టన్నుల కొద్దీ లవ్ పుడుతుంది. చివరకు పాపం ఆ ప్రియుడు కూరలో కరివేపాకులా సైడ్ అయిపోతాడు. కాస్త అటు ఇటుగా ఇదే లైన్తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. సినిమా వరకు ఇది బాగానే ఉంది.. ఇదే రియల్ లైఫ్లో జరిగితే!!వారం రోజులుగా తమ అమ్మాయి కనిపించడం లేదంటూ ఆందోళనలో ఉన్న ఆ తల్లిదండ్రులకు పోలీసులు షాకిచ్చారు. ఓ వ్యక్తిని పెళ్లాడి వచ్చిందని వాళ్లిచ్చిన సమాచారంతో వాళ్లు మరింత గందరగోళానికి గురయ్యారు. పైగా అతను ఆమె ప్రేమించిన వ్యక్తి కాదని.. ఇంకెవరో వ్యక్తి అని చెప్పడంతో మరింత కంగుతిన్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధిలోని ఓ పీఎస్లో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..ఇండోర్లో బీబీఏ ఫైనలియర్ చదువుతున్న శ్రద్ధా తివారీ ఆగస్టు 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. సీసీటీవీ ఫుటేజీలో.. అర్ధరాత్రి పూట ఆమె కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోయినట్లు రికార్డయ్యింది. దీంతో ఆమెను ట్రేస్ చేయడం కష్టతరంగా మారింది. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వారంపాటు గాలించారు. అయినా ఆమె జాడ తెలియరాలేదు.ఈలోపు.. ఇండోర్ పీఎస్లో శ్రద్ధా ప్రత్యక్షమైంది. తాను సార్థక్ అనే యువకుడికి మనసిచ్చానని, పేరెంట్స్ అంగీకరించరనే భయంతో అతనితో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నానని పోలీసులు చెప్పసాగింది (పోలీసులు ఊ.. కొట్టసాగారు). అయితే.. సార్థక్ స్టేషన్కు రాలేదని.. అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాడని.. దాంతో గుండెబద్ధలైన తాను ఒంటరిగానే తాను రత్లంకు వెళ్లే రైలు ఎక్కానని తెలిపింది. అయితే రత్లం స్టేషన్ బయట ఒంటరిగా ఉన్న తనను కరణ్దీపక్ అనే వ్యక్తి ఓదార్చాడని.. తన పరిస్థితి చెప్పడంతో వివాహం చేసుకునేందుకు అంగీకరించాడని.. ఇద్దరం కలిసి మాంద్సర్లో రైలు దిగి.. మహేశ్వర్కు వెళ్లి ఓ గుడి పెళ్లి చేసుకున్నామని.. అక్కడి నుంచి ఓ ఆలయాన్ని సందర్శించుకుని.. నేరుగా ఇక్కడికే వచ్చామని తెలిపింది(పోలీసులు నోర్లు వెల్లబెట్టి వినసాగారు )అయితే పోలీసులు ఆమె చెప్పింది నమ్మలేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ చూపించాలని కోరారు. అయితే ఆమె ఫొటోలు మాత్రం చూపించింది. ఈలోపు తల్లిదండ్రులకు, సార్థక్కు కబురు పంపించారు. శ్రద్ధ తనకు వారం రోజులుగా టచ్లో లేదని సార్థక్ తేల్చేశాడు. ఆమె తండ్రి మాత్రం విచిత్రమైన వాదనలు వినిపించాడు. తన కూతురి మానసిక స్థితి ఏమాత్రం బాగోలేదని.. కూతురి ఫొటోను ఇంట్లో తలకిందులుగా వేలాడదీయని ఓ మాంత్రికుడు చెప్పాడని.. పైగా తన కూతురి ఆచూకీ చెబితే రూ.51వేల నజరానా ప్రకటించానని.. అలా చేసినందుకే తన కూతురు తిరిగి వచ్చిందని అంటున్నాడు. అయితే వివాహం జరిగిందనే విషయాన్ని మాత్రం ఆ తండ్రి అస్సలు నమ్మడం లేదు.కరణ్దీప్ నాకు ఫోన్ చేసి తాను ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నానని, శ్రద్ధ ఆత్మహత్య చేసుకోబోతే ఆపానని చెప్పాడు. ఆ తర్వాత నా కూతురు నాతో ఫోన్లో మాట్లాడింది. డబ్బులు అయిపోయానని, పంపిస్తే తిరిగి వస్తానని చెప్పింది. అలా నేను ఆమెకు డబ్బు పంపించా. తీరా ఇప్పుడొచ్చి మేం పెళ్లి చేసుకున్నాం.. కలిసి జీవిస్తామంటే ఎలా నమ్మేది? ఎలా ఒప్పుకునేది?.. అని అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. అయితే.. శ్రద్ధ మేజర్(22 ఏళ్లు) కావడంతో ఆమెకు ఇష్టం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఉందని పోలీసులు ఆ తండ్రికి బదులిచ్చారు. దీంతో ఆమె ఎటు పోయినా తమకు సంబంధం లేదంటూ ఆ తండ్రి పీఎస్ నుంచి వెళ్లిపోయాడు. అయితే.. శ్రద్ధ చెబుతున్న విషయాలను పోలీసులు ఇంకా నమ్మడం లేదు. ఈ క్రమంలో.. కరణ్, శ్రద్ధను కలిపి కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈ ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉండి ఉండొచ్చని, ఆమె సినిమా కథ చెప్తోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతియాజ్ అలీ డైరెక్షన్లో 2007లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా జబ్ వీ మెట్ అనే చిత్రం వచ్చింది. ఆ సినిమాలో తన ప్రియుడితో కలిసి పారిపోయిన కరీనా, షాహిద్ కపూర్లు రత్లం అనే స్టేషన్లో అనుకోకుండా దిగిపోతారు. అక్కడి నుంచి సినిమా అసలు మలుపు తిరుగుతుంది. ఇద్దరూ రైలు మిస్ అయ్యి.. కలిసి ప్రయాణించే క్రమంలో ప్రేమ బంధంతో ఒక్కటవుతారు. అలా ఈ చిత్రంతో రత్లం స్టేషన్కు గుర్తింపు దక్కింది(ఒరిజినల్గా షూట్ జరిపింది మనాలిలో సెట్ వేసి). ఇప్పుడు శ్రద్ధా తివారీ అదే స్టేషన్ పేరు చెబుతుండడంతో జబ్ వీ మెట్ తెరపైకి వచ్చింది. -
ట్రంప్ నిజంగానే క్షేమమా? వైట్హౌజ్ గప్చుప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్ మిస్సింగ్పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత 24 గంటలుగా సోషల్ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఓ ట్రెండ్ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్ మరింత దారుణంగా మారింది. ట్రంప్ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. JD Vance Says He’s Prepared to Assume Presidency if Trump...#Jdvance #vance #prepare #assume #office #president #donaldtrump #trump #health #wellbeing #transitions #rickwilson #conservative #strategist #maga #games #trending #viral #fyp #xviral #viralx pic.twitter.com/Jlt5BbvaZ6— FANmily TV (@FanmilyTV) August 30, 2025ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్హౌజ్గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్హౌజ్ సౌత్ లాన్లో ఆయన గోల్ఫ్ ఆడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. #JUSTIN Trump is alive Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30 #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive #Kai #Virginia pic.twitter.com/fAUCijwwCR— ViralVolt🟦 (@ViralVolT1) August 30, 2025ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది. #BREAKING: Trump makes an appearance at his golf club this morning, putting to rest swirling health rumors. #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive pic.twitter.com/VfvOaGsVj0— Mukund Shahi (@Mukundshahi73) August 30, 2025మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.భారత్+రష్యా+చైనా = ట్రంప్నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్ కామిక్ సిరీస్ను ఉద్దేశించి.. ట్రంప్ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్ మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్, ఎలాన్ మస్క్లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్ పెట్టారు కూడా.Simpsons predicted Donald Trump died of heart attack in 2025 in a forgotten episode & that's why Americans are searching "TRUMP IS DEAD", "TRUMP DIED" Trump#DonaldTrump #Trump #TrumpHealth #TrumpHealthCrisisCoverup #Simpsons #TrumpDead #TrumpDied pic.twitter.com/7vbANhE0wu— Marwdi Londa (@Marwdi45032) August 30, 2025Congratulations 🎉 Donal Trump Donald Trump is alive again after dying#donaldtrumpisdead #DonaldTrump pic.twitter.com/rfTwXSm0OL— Xi Jinping (@xijinpiing_) August 30, 2025 Elon Musk when he checks why Donald Trump is trending💀😂#DonaldTrump pic.twitter.com/Zvotz6n599— The Sarcastic Indian (@_Sarcasticindia) August 30, 2025🚨 Breaking: Senior official says Trump is perfectly fine and will go out to play golf today, according to Axios report.Now imagine after exploding the internet by trending “Trump is Dead” he suddenly appears👇🏻#trump | #trumpdead | #DonaldTrump | #TrumpIsDead pic.twitter.com/zgBLpv4gvK— GeoWireDaily (@geowiredaily) August 30, 2025if "TRUMP IS DEAD" i will give 1000 dollars to anyone who likes this tweet.#DonaldTrump#whereistrump #donaldtrumpisdead pic.twitter.com/enKe7zWGgt— GR Jaam k (@grjaam7) August 30, 2025ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!. -
అమెరికాలో టెన్షన్.. ట్రంప్కు ఏమైంది.. ఎక్కడ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ‘మిస్సింగ్’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి.వివరాల ప్రకారం.. ట్రంప్ అనారోగ్యంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున సంగతి తెలిసిందే. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ట్రంప్ బయట కనిపించలేదు.. మీడియా ముందుకు సైతం రాలేదు. ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో, ట్రంప్ విషయమై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.🚨 BREAKING: Curiosity is rising: Trump hasn’t been seen in 3 days.No public events. No appearances. Silence everywhere.Speculation about his health & power moves grows louder…Is it strategy or concern? 👀What do you think—is this calculated or "Where is Donald Trump" pic.twitter.com/4AvG7heGUw— RX (@TheReal_RX) August 30, 2025నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ..‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ను ట్రెండింగ్లోకి తెచ్చారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.🚨MAJOR BREAKING: Whispers are traveling through the Washington press pool that Donald Trump has not been seen since Tuesday and has zero publicly planned events through the weekend. This clip is apparently one of the last times Trump was seen by the press. What’s going on? pic.twitter.com/sM4sd0PQMK— CALL TO ACTIVISM (@CalltoActivism) August 30, 2025🚨PRAY FOR PRESIDENT TRUMP 🇺🇸 🙏 Reports coming out of America suggest that Donald trump hasn't been seen publicly or privately since Tuesday Also, the White House website is seemingly out of order.This news is very worrying for MAGA after photos released last week of an… pic.twitter.com/wsM2MYtjrm— BRITAIN IS BROKEN 🇬🇧 (@BROKENBRITAIN0) August 30, 2025 -
వృద్ధులైన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలంటే..?
వృద్ధాప్యంలో ఇతరుల మీద ఆధారపడడం సహజం. అయితే అందరికీ ఈ అవకాశం ఉండకపోవచ్చు. ఒంటరి వృద్ధులు ఇతరుల మీద అంతగా ఆధారపడనవసరం లేకుండా 66 సంవత్సరాల మీనాక్షి మీనన్ టెక్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది.‘జెన్స్ లైఫ్’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లాట్ఫామ్ లాబ్ టెస్ట్ సర్వీసులు, ట్రావెల్, టాక్స్ ఫైలింగ్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ, సైబర్ సేఫ్టీ.. మొదలైన విషయాలలో వృద్ధులకు ఉపకరిస్తుంది. అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా కన్సల్టింగ్లలో మీనాక్షికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అయిదు స్టార్టప్లకు యజమాని.‘పిల్లలను ఎలా పెంచాలి? అనే అంశంపై వందలాది పుస్తకాలు వచ్చాయి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి అనే అంశంపై రాలేదు. ఈ నేపథ్యంలోనే వృద్ధులైన తల్లిదండ్రులకు సహాయపడే యాప్ రూపొందించాలనుకున్నాను’ అంటుంది మీనాక్షి మీనన్.(చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
టీడీపీ ఎమ్మెల్యే...కోటంరెడ్డి కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మెడకు చుట్టుకోవడంతో బయట పడేందుకు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని రౌడీ షీటర్లను పెంచి పోషించిందే శ్రీధర్రెడ్డి అనే విషయం రాజకీయ నాయకులకు, పోలీసులకు తెలిసిందే. శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వాలంటూ సిఫార్సు చేసి అడ్డంగా దొరికిపోయిన శ్రీధర్రెడ్డి ఆ బురద కడుక్కునేందుకు ఎవరికైనా సిఫార్సు లేఖ ఇవ్వడం సాధారణమే అంటూ తప్పించుకునే యత్నం చేశారు. తాజాగా తన హత్యకు రౌడీషీటర్లు కుట్ర చేస్తున్నారనే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయించి కొత్త డ్రామా ఆడుతూ, వైఎస్సార్సీపీ పైకి నెట్టివేసే కొత్త కుట్రలకు తెర తీశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన హత్యకు జీవిత ఖైదీ శ్రీకాంత్ సైన్యం కుట్ర పన్నారంటూ హడావుడి చేస్తుండడంతో నగర ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఏదో రకంగా కొత్త డ్రామాలు ఆడడం కోటంరెడ్డి అలవాటు.. ఇది ఆ కోవలోనిదే అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీడియోలోని వారంతా ఎమ్మెల్యే బ్రదర్స్, రూప్కుమార్ అనుచరులే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక అనుచరుడు జగదీ‹Ù, కోటంరెడ్డి సోదరుడు గిరిధర్రెడ్డి అనుచరుడు మహేశ్, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ ముఖ్య అనుచరుడు దార్ల వినిత్తోపాటు మరో ఇద్దరు ఉన్నారు. కోటంరెడ్డి అనుచరులే ఆయన హత్యకు ఎలా కుట్ర చేస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ రౌడీమూకల ద్వారానే నెల్లూరులో కోటంరెడ్డి సెటిల్మెంట్లు, దందాలు, రౌడీయిజాలు చేయించినట్లు ఇటీవల పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో కోటంరెడ్డి అండదండలున్నాయని వెలుగులోకి రావడం, అరుణ ఫోన్ సంభాషణల్లో నిగూఢ రహస్యాలు వెలుగులోకి వస్తుండడం, అన్నింట్లో కూడా ఎమ్మెల్యే అనుచరులు సెటిల్మెంట్ దందాలు చేసినట్లు ఉండడంతో పోలీసులు సైతం నివ్వెరపోయారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అతన్ని కాపాడేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్ర డీజీపీ కూడా నెల్లూరుకు వచ్చి పోలీసుల నుంచి ఎలాంటి లీకులు రాకూడదని ఆదేశాలిచ్చి వెళ్లారని తెలిసింది. ఈ వ్యవహారం డైవర్షన్లో భాగంగా రౌడీమూకలు హోటల్ గదిలో మద్యం తాగుతూ మాట్లాడుకున్న వీడియోను ముందస్తు వ్యూహంతోనే చిత్రీకరించి సోషల్ మీడియాలో లీకు చేయించారని తెలుస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీకి అంట గట్టే యత్నాలను చూసి నెల్లూరు నగర వాసులు ఛీదరించుకుంటున్నారు. పెంచి పోషించిన వారే హత్య చేస్తారా? జీవిత ఖైదీ శ్రీకాంత్ ఆది నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడే. ఇటీవల అరుణ ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనను 50 శాతం మాత్రమే ప్రేమిస్తున్నాడని, మిగిలిన 50 శాతం ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రేమిస్తున్నాడని వెల్లడించిన విషయం విదితమే. నెల్లూరు సెంట్రల్ జైల్లో కూడా శ్రీకాంత్కు సకల సౌకర్యాలు కల్పించాలని సూపరింటెండెంట్ను ఆదేశించిన విషయం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. పెరోల్ రద్దయిన తర్వాత కూడా ములాఖత్ ఇవ్వకుంటే సాక్షాత్తు ఎమ్మెల్యే ఫోన్ చేసి ములాఖత్ ఇప్పించినట్లుగా జైలు శాఖ అధికారులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం వీడియోలో ఉన్న రౌడీమూకలు సైతం ఎమ్మెల్యే వీరవిధేయులు. ఆయన కనుసన్నల్లోనే వారు పని చేస్తున్న విషయం బహిరంగమే. ఎమ్మెల్యే కీలక అనుచరులూ వీరి ద్వారానే సెటిల్మెంట్లు చేయిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్ భర్త సెటిల్మెంట్ చేసి రూ.కోటి విలువైన స్థలాన్ని బహుమానంగా తీసుకున్నారు. అందులోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. గతంలో కూడా జరిగిన హత్యాయత్నాలు, ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసాన్ని ధ్వంసం చేసిన వారిలో ఈ రౌడీషీటర్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యమే. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి కనుసన్నల్లో పని చేసే వారే ఆయన్ను హత్యకు కుట్ర చేస్తున్నారనే ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక పోలీసులే తేల్చాల్సి ఉంది. -
ట్రెడిషనల్ శారీలో యాంకర్ లాస్య.. సోనాలి బింద్రే వినాయక చవితి పూజలు!
హీరోయిన్ శ్వేతా మీనన్ వినాయక చవితి సెలబ్రేషన్స్..గణపతికి ఇంద్ర హీరోయిన్ సోనాలి బింద్రే పూజలు..వరుణ్ సందేశ్- వితికా శేరు దంపతుల గణేశ్ చతుర్థి పూజలు..గణపతి బప్పా మోరియా అంటోన్న శివంగి జోషి..ట్రెడిషనల్ శారీ లుక్లో యాంకర్ లాస్య View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) -
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్లో ఈ వివాహం జరిగింది. ఈ జంట సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దీంతో అభిమానులుఫుల్ ఖుషీగాఉన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.అనుశ్రీ సాంప్రదాయ నారింజ రంగు చీరలో చాలా అందంగా కనిపించింది. నెక్లెస్, రాణి హార్, కమర్బంద్, మాంగ్ టీకా, ఝుంకాలు, బ్యాంగిల్స్ , ఇతర టెంపుల్ జ్యుయల్లరీతో అందంగా మెరిసిపోయింది. మరోవైపు, వరుడు రోషన్ బంగారు కుర్తాను , మ్యాచింగ్ ధోతీని ధరించాడు. అనుశ్రీ - రోషన్ వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలుఅనుశ్రీ - రోషన్ వివాహానికి మెహందీ, హల్ది లాంటి ప్రీవెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారుఘీ సన్నిహిత వేడుకల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి. అభిమానులు, సన్నిహితులు హృదయపూర్వక శుభాకాంక్షలతో వెల్లువెత్తాయి.అనూశ్రీ భావోద్వేగం: రోషన్ మంగళసూత్రాన్ని కట్టుకుంటుండగా అనుశ్రీ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకుంది. కన్నడనాట అనుశ్రీ తన టాలెంట్, యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను, పాపులారిటీని సంపాదించుకుంది. బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొంది. మంగళూరులో జన్మించిన అనుశ్రీ, చిన్నతనంలోనే తండ్రి విడిచి పెట్టడంతో తల్లితో పాటు పెరుగుతూ అనేక కష్టాలను ఎదుర్కొంది. అలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించింది. కరియర్లో నిలదొక్కుకుని తన తల్లి కోసం ఒక ఇల్లు కూడా నిర్మించింది, ఆమె సోదరుడు తన సొంత హోటల్ వ్యాపారాన్ని స్థాపించాడు. తన కుటుంబం బాధ్యతలను నెరవేర్చిన ఇన్నాళ్లకు అనుశ్రీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది. భార్యగా తన కొత్త పాత్రను స్వీకరించింది. -
విద్యార్థులా?.. కూలీలా?
సాక్షి, మైదకూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తరగతి గదిలో కూర్చోవాల్సిన విద్యార్థులు.. రాళ్లు, మట్టి ఎత్తుతున్నారు. విద్యా బుద్దులు చెప్పాల్సిన టీచర్లే వారితో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మైదుకూరు మండలం జీవిసత్రం సమీపంలోని నంద్యాలపేట జడ్పీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.జడ్పీ పాఠశాలలో కొత్త బిల్డింగ్ పనుల సందర్భంగా విద్యార్థులతో రాళ్లు, మట్టి ఎత్తిస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా విద్యార్థులు పనిచేస్తున్నారు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై విద్యార్థులు పేరెంట్స్, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు, ఐసీడీఎస్, కార్మిక శాఖ ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.This is totally unacceptable @ncbn garu.How can your govt allow such abuse of children studying in govt school?Is this how you expect the children to grow under your stewardship @naralokesh?Shameful to even say this. https://t.co/dJk7TmXslT— PVS Sarma - పి వి ఎస్ శర్మ - પી વી એસ શર્મા (@pvssarma) August 27, 2025 -
కోతి చేతిలో కరెన్సీ నోట్లు.. ఎగబడిన జనం
మంకీ మేనియా అంటే ఇదేనేమో!. కోతి చేతిలో కరెన్సీ కోసం జనం ఎగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చివరకు ఆ సొమ్ము అసలు ఓనర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగా.. దొరికిన నోట్లను పట్టుకుని జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఉత్తర ప్రదేశ్ ఔరయ్య Auraiya జిల్లా డొండాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అనూజ్ కుమార్ అనే రైతు తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి భూమి నమోదు కోసం రూ.80,000 నగదు తీసుకుని మోపెడ్లో వచ్చారు. రోహితాష్ లాయర్తో పత్రాలు సిద్ధం చేస్తుండగా.. ఓ కోతి మోటార్ సైకిల్ ట్రంక్ తెరచి నగదు సంచిని లాక్కొని సమీప చెట్టుపైకి ఎక్కింది. ఊహించని పరిణామంతో ఆ తండ్రీకొడుకులు షాక్లో ఉండిపోయారు. ఈలోపు చెట్టు మీద నుంచి కోతి నోట్లను చింపుతూ చుట్టూ విసరడం ప్రారంభించింది. ఆ ప్రాంగణంలో ఉన్నవారు నోట్ల వర్షాన్ని చూసి పరుగులు పెట్టారు. నోట్లు ఎరుకోవద్దని ఆ తండ్రీ కొడుకులు బతిమాలినా ఎవరూ వినలేదు. దీంతో నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.उत्तर प्रदेश के औरैया में एक हैरान करने वाला मामला सामने आया। तहसील परिसर में बंदर किसान की बाइक से बैग ले उड़ा और पेड़ पर चढ़कर उसमें से नोट उड़ाने लगा। अचानक हुई "नोटों की बारिश" देख लोग इकट्ठा होकर पैसे लूटने लगे, जबकि किसान बेबस निहारता रह गया।#ViralVideo #Auraiya #Monkey pic.twitter.com/yEOueSxt9y— Headlines Trend (@headlinetrend) August 27, 2025చివరికి, రోహితాష్ కోతి ఎత్తుకెళ్లిన మొత్తంలో రూ.52,000 మాత్రమే తిరిగి పొందగలిగారు. కోతి చింపగా.. జనాలు ఎరుకుని పోయిన సొమ్ము రూ.28,000 ఉన్నట్లు వాపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. బిధూనా తహసీల్ ప్రాంతంలో కోతుల సమస్య చాలా కాలంగా ఉంది. కోతుల దాడి చేస్తాయనే భయంతో ఆ చుట్టుపక్కల ఎలాంటి ఆహార పదార్థాలను అమ్మరంట. ఇలాంటి సంఘటనలు నవ్వు తెప్పించడమే కాకుండా జంతు సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని కూడా సోషల్ మీడియాలో పలువురు గుర్తుచేస్తున్నారు. -
జపాన్లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్!
జపాన్లో చిల్ అవుతోన్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి..హ్యాపీ ఇంటర్నేషనల్ డాగ్ డే అంటూ మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్..హార్ధిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ లేటేస్ట్ లుక్..ఇటలీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్ లక్ష్మీ రాయ్..చెన్నై ట్రిప్లో జెనీలియా దేశ్ ముఖ్..గ్రీన్ శారీలో మెరిసిపోతున్న సోనాలి బింద్రే.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
నాకు తెలిసిన శక్తిమంతమైన మహిళ: పీవీ సింధు భావోద్వేగం (ఫొటోలు)