viral
-
ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!
ట్రక్లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే..నాగ్పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్. తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్. (చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..) -
చాట్ జీపీటీ బామ్మ..!
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్బాట్ అయిన ‘చాట్జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.బామ్మ: హాయ్చాట్జీపీటీ: హాయ్బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?చాట్జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్గా ఉంది.బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?చాట్జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?మనవడు: ఉండొచ్చుబామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Shashank Jacob (@shashankjacob)(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్లోంచి తీసేశారు..! కట్చేస్తే..) -
Driver Neelam: ఆటో డ్రైవర్ సీట్లో ఆమె.. సలాం కొట్టాల్సిందే!
కుటుంబం అనే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో.. తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ‘ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా..’ అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా.. మగవాళ్లు వంకర చూపులు చూస్తున్నా.. ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతోంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.ఆమె పేరు నీలమ్(Neelam). ఢిల్లీలో బిజీ రోడ్లపై ఆటో డ్రైవర్గా కనిపిస్తోంది. నిత్యం మెట్రోలో వెళ్లే ఓ ఉద్యోగిణి.. ఎందుకనో ఆ ఆటో ఎక్కాల్సి వచ్చింది. ‘‘ఆటోను నడిపేది ఓ మహిళనా?’’ అని తొలుత ఆమె కూడా అందరిలా ఆశ్చర్యపోయింది. ఈ పనినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందని నీలమ్ను కుతూహలంతో అడిగిందామె. అక్కడి నుంచి జీవితం ఒకసారి నీలమ్ ఎదుట గిర్రున తిరిగింది.అందరిలాగే పెళ్లై కోటి ఆశలతో అత్తింటి అడుగు మోపిందామె. కానీ, ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే (Domestic Violence) ఎదురయ్యాయి. చివరకు.. కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె.. అది నశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా.. పుట్టింటి వాళ్ల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అందుకనే.. ఇలా ఆటో నడుపుతున్నట్లు నవ్వుతూ చెప్పిందామె.కానీ, ఆ మహిళా ఆటో డ్రైవర్(Woman Auto Driver) పెదాలపై నవ్వు కంటే ఆమె గొంతులో దిగమింగుకుంటున్న బాధ, కళ్లలో కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని పడుతున్న ఆరాటం రెండూ కనిపించాయి. అందుకే నీలమ్ కథను ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమాజంలో మార్పును స్వాగతించేవాళ్లెందరో నీలమ్ నిర్ణయాన్ని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. -
Harsh Goenka: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు..!
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు. బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది. అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!) -
కనువిప్పు కలిగించే సలహ..! పోస్ట్ వైరల్
ప్రస్తుతం అందరివి బిజీ బిజీ జీవితాలే. క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా పరుగులు.కనీసం వేళకు తిండి తిప్పలు లేకుండా బతికేస్తున్నాం. పైగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు ఫోజులు కొడుతుంటాం. మన స్థాయి కంటే చిన్నవాళ్లు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేవాళ్లు అద్భుతమైన సలహలిస్తుంటారు. వాటిని విన్నప్పుడు ఒక్క క్షణం నేనెందుకు ఇలా ఆలోచించలేకపోయానా..? అనిపిస్తుంది. మంచి ఆలోచనలనేవి ఉన్నత స్థితి నుంచి కాదు, అంతకుమించిన ఉన్నతమైన మనసు ఉన్నవారికేనని అర్థమవుతుంది. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ మహిళకు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకుంది.ముంబైకి చెందిన మహిళ(Mumbai woman) ఉబెర్ ఆటో బుక్ చేసుకుంది. అది వచ్చేలోపే అక్కడే కొబ్బరిబొండాలు అమ్ముకునే వ్యాపారి(Coconut Seller) వద్దకు వెళ్లి..కొబ్బరి బొండం ఇమ్మని అడుగుతుంది. అయితే ఆమె ఉబర్ఆటో వచ్చేస్తుందని తొందరగా కొబ్బరి బొండం కొట్టివ్వమని చెబుతుంది. దీంతో అతడు మేడమ్ ప్రజలంతా డబ్బు సంపాదించడానికే అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు గానీ ఆ సంపాదన కాసేపు నిశ్చంతంగా తినడానికి తాగడానికి అవకాశం ఇవ్వలేప్పుడు వేస్టే కథా మేడమ్ అంటాడు. దీంతో ఆ మహిళకి అతడి మాటలు ఏదో మంత్రం చల్లినట్లుగా అనిపిస్తాయి. నిజమే కదా..అనే భావన కలిగుతుంది ఆమెలో. తానెందుకు ఇలా ఆలోచించలేకపోయాను, ఒక సాధారణ వీధి వ్యాపారి చెబితేగానీ తెలుసుకోలేకపోయానా అని ఫీలవుతుంది. పని.. పని..అంటూ పరుగులు పెట్టేస్తాం. కానీ పనిని కాసేపు వదిలేసినా అలాగే ఉంటుంది. అంతేతప్ప ఏం కాదు. కనీస ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆ తర్వాత పని కాదు కదా..మనల్ని చూసుకునేవాడు కావాల్సిన దుస్థితి వస్తుంది. అంతటి పరిస్థితి వచ్చేలోపే మేల్కొంటే మంచిది అంటూ ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. మరికొందరూ కూడా తమ అనుభవాలను షేర్ చేస్తూ..మన గురించి మనల్ని పట్టించుకోవడం మర్చిపోతున్నాం అంటూ తమకెదురైన అనుభవాలను పంచుకున్నారు. కాబట్టి మనం క్షణ తీరిక లేని బిజీ లైఫ్తో అనారోగ్యం పాలవ్వడం కంటే..ముందుగానే మేల్కొని కొద్ది సమయమైన మనకోసం కేటాయించడం బెటర్ కదూ..!.told bhaiya to cut my coconut fast because my uber was on the way & man casually said “itna paisa kyu kamate ho? kaam toh chalta rahega lekin khane peene ko time dena chahiye” nice grounding advice pic.twitter.com/wz66mFqnUn— gargi (@archivesbygargi) February 7, 2025 (చదవండి: పాప్ రాక్ ఐకాన్, గ్రామీ అవార్డు గ్రహితకు చేదు అనుభవం..!) -
ఆ... భరణం అచ్చం అలాగే!
సినిమా తారలు ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నప్పుడు వారు ధరించిన వస్త్రాలు, ఆభరణాలను అంతా ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. అత్యంత ఖరీదైన ఆ డ్రెస్సులు, ఆభరణాలు వారిని మరింత ప్రత్యేకంగా చూపుతుంటాయి. యునిక్గా కనిపించే వాటిని అచ్చం అలాగే తయారు చేయించుకోవడమే కాదు మార్కెట్లోనూ ఆ రెప్లికా డిజైన్స్ లభిస్తుంటాయి. ఆభరణాలలో కనిపించే ఈ ట్రెండ్స్ వివాహ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురువారం తన సోదరుడు సిద్ధార్థ్ మెహందీ వేడుకలో పది కోట్ల రూపాయలకు పైగా విలువైన బల్లారి నెక్లెస్ను ధరించి, అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆ మధ్య నీతా అంబానీ తన కుమారుడి పెళ్లిలో కోట్ల ఖరీదైన పచ్చల హారాన్ని ధరించింది.వేడుకలలో స్టార్ సెలబ్రిటీలు ధరించే జ్యువెలరీ ధర కోట్లలో ఉంటుంది. అంత ఖరీదు మనం పెట్టలేం, అలాంటి డిజైన్ని పొందలేం అని ఈ రోజుల్లో వెనకంజ వేయనక్కర్లేదు. కొన్ని రోజులలోనే అలాంటి డిజైన్లు మార్కెట్లో కనిపిస్తుంటాయి. సెలబ్రిటీలు ధరించిన ఆభరణాల రెప్లికా డిజైన్స్ రూ.1500 నుంచి పది వేల రూపాయల వరకు లభిస్తున్నాయి. View this post on Instagram A post shared by Patty Cardona (@jerryxmimi) మెరుపు తగ్గకుండా! ఇమిటేషన్, వన్గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్.. ఆభరణాలను కొత్తగా ఉంచడానికి వాటిని శుభ్రంగా ఉంచాలి. ఆభరణాన్ని వాడిన ప్రతిసారి మృదువైన, పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి. దీనివల్ల మురికి, చెమట తొలగిపోతాయి ఆభరణాల నాణ్యతను కాపాడుకోవడానికి సరైన విధంగా భద్రపరచుకోవాలి. తక్కువ ఖరీదు అనో, టైమ్ లేదనో.. అన్నింటినీ ఒకే బాక్స్లో పెట్టేస్తుంటారు. బీడ్స్, స్టోన్స్పై గీతలు పడకుండా, పాడవకుండా ఉండాలంటే ప్రతి ఆభరణాన్ని ప్రత్యేక కంపార్ట్మెంట్లలో ఉంచాలి ఏ కాస్త తేమ ఉన్నా ఆభరణాల రంగు మారుతుంది. ఆభరణాలను ఉంచే పెట్టెలో అదనపు తేమను గ్రహించడానికి మీరు సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించవచ్చు పెర్ఫ్యూమ్లు, లోషన్లు ఉపయోగించిన తర్వాతనే ఆభరణాలను అలంకరించుకోవాలి. లేదంటే వాటిలోని రసాయనాలు ఆభరణాలను మసకబారిస్తాయి ∙ఆర్టిఫిషియల్ ఆభరణాలలో ఒకేరకాన్ని తరచూ ధరించకూడదు. దీనివల్ల ఆ ఆభరణం త్వరగా రంగుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఆభరణాలలో ఏదైనా నష్టం గమనించినట్లయితే, వెంటనే మరమ్మతు చేయించాలి. వదులుగా ఉన్న రాళ్ళు లేదా విరిగిన వాటిని సకాలంలో గమనించినట్లయితే సులభంగా మరమ్మతు చేయవచ్చు. ఈ ఆభరణాలను బాగు చేసే షాపులు కూడా ఉంటాయి. వాటి ద్వారా నగను మరో రూపంగా కూడా మార్చుకోవచ్చు.బీడ్స్ .. చోకర్స్ఇప్పుడు వివాహ వేడుకలలో ట్రెండ్లో ఉన్నవి బీడ్స్, చోకర్స్. అన్నిరకాల బీడ్స్ లేయర్లుగా ఉన్నవి బాగా ఇష్టపడుతున్నారు. శారీ, డ్రెస్ కలర్కు మ్యాచింగ్ బీడ్స్ హారాలు, చోకర్స్ బాగా నప్పుతుంటాయి. వీటికి గోల్డెన్ బాల్స్, స్టోన్స్ లాకెట్స్ జత చేయడంతో గ్రాండ్గా కనిపిస్తుంటాయి. వేడుకలలో ఆకర్షణీయంగా కనిపించాలి, ఫొటో, వీడియోలలో అందంగా కనిపించాలనుకునేవారు వీటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు. బంగారం ధరలు బాగా పెరిగిపోవడం, ప్రతీ వేడుకకు కొత్త హారం కావాలనుకోవడం వల్ల కూడా ఇలాంటివాటికి బాగా డిమాండ్ ఉంటోంది.ఫోటో సెండ్ చేస్తే... ఆభరణం తయారీ..ఎంత గ్రాండ్ డిజైన్ అయినా, సెలబ్రిటీలు వేసుకున్న ఆభరణాలైనా.. నచ్చిన డిజైన్ ఫోన్లో ఫోట్ సేవ్ చేసుకొని, మాకు ఇస్తే ఆర్డర్ మీద ఆ డిజైన్ని తయారుచేసి ఇస్తుంటాం. వివాహ వేడుకలలో హైలైట్గా నిలిచే రెప్లికా డిజైన్స్, బీడ్ జ్యువెలరీని మూడు దశాబ్దాలుగా తయారుచేస్తున్నాం. స్టోన్స్, బీడ్స్, వడ్డాణం, చేతి పట్టీలూ.. పూర్తి సెట్ వారి పెళ్లి శారీ కలర్ కాంబినేషన్ బట్టి తయారుచేయించుకుంటున్నారు. సంప్రదాయ వేడుకలలో ఇప్పుడు ఫ్యాషన్ జ్యువెలరీ ఎంపికే ముందు వరసలో ఉంటుంది. – ఎల్.పద్మ, ఇమిటేషన్ జ్యువెలరీ మేకర్, హైదరాబాద్ (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..
కొందరూ బట్టతలను చాలా అవమానంగా చూస్తారు. అందులోనూ పెళ్లి అవ్వకమునుపే వస్తే ఆ బాధ మరీ వర్ణనాతీతం. కానీ కొందరూ బట్టతలే అందం అంటూ ఆత్మవిశ్వాసంగా ముందుకొచ్చి అందాలపోటీల్లో పాల్గొని స్ఫూర్తినిస్తున్నారు. కురులే సౌందర్య చిహ్నం అని చూసే రోజులు కాదివి అంటూ ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇక్కడ అలానే ఓ భారత సంతతి వధువు ఎలాంటి విగ్గులు ధరించకుండా పెళ్లి చేసుకుని నెటిజన్ల మనసులను దోచుకుంది.అమెరికాకు చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నీహార్ సచ్దేవా భారత మూలాలున్న అమ్మాయి. ఆమె అందానికి ఉండే ప్రమాణాలను సవాలు చేసేలా తన అసలైన రూపంతోనే పెళ్లి చేసుకుంది. ఆమెకు చిన్న వయసులోనే అలోపేసియా బారినపడింది. దీని కారణంగా బాధితులకు కురులు ఉండవు. ఎందుకంటే అలోపేసియా(alopecia) అనేది రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడిచేసే పరిస్థితి. దీని ఫలితంగా జుట్టు ఘోరంగా రాలిపోతుంది. అయితే వివాహం వంటి కార్యక్రమాల్లో జుట్టు లేని అమ్మాయి/అబ్బాయి ఇద్దరు కూడా ఆ వేడుకల సంప్రదాయం రీత్యా విగ్గులు(wigs) ధరించే పెళ్లిచేసుకుంటారు. గానీ ఈ అమ్మాయి ఆ నిబంధనలను సవాలు చేసేలా ఆత్మవిశ్వాసంగా తానెలా ఉన్నానో అలానే పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చింది. అలానే వివాహ దుస్తుల్లో బట్లతల(Bald)తోనే వివాహం(wedding) గ్రాండ్గా చేసుకుంది. తనను అలానే ఇష్టపడాలి అన్నట్లుగా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లంతా ఆ అమ్మాయిని ఔను..! "బట్టతల అందమే" అంటూ ప్రశంసిస్తూ ఆమెకు మద్దతు పలికారు. అంతేగాదు ఈ సమస్యను మనం ముందుగా మనస్పూర్తిగా అంగీకరిస్తే అవతివాళ్లు కూడా సహృద్భావంతో అంగీకరించగలుగుతారని అంటోంది కంటెంటట్ క్రియేటర్ నీహార్. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నీహార్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Neehar Sachdeva (@neeharsachdeva) (చదవండి: కేన్సర్ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!) -
'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!
కేన్సర్ వ్యాధి నిర్ధారణతోనే ఎన్నో కుటుంబాలు అతలాకుతలమైపోతాయి. నయం అయి బయటపడితే పర్లేదు..నరకయాతనల మారి బాధపెడితే అనుభవిస్తున్నవారికి, సన్నిహితులకు మాటలకందని వేదనను అనుభవిస్తారు. ఈ కేన్సర్లలో కొన్ని చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి ఏకంగా శరీరంలో కేన్సర్ సోకిన లేదా ప్రభావిత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో బాధితులు దివ్యాంగులుగా మారిపోతారు. అలాంటి అరుదైన కేన్సర్ వ్యాధి బారినే పడింది ఇక్కడొక మహిళ. అయితే ఆ కోల్పోయిన భాగానికి సరికొత్తగా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఊహించని పరిస్థితి ఎదురైతే అవమానంతో కాదు..దాన్ని అంగీకరిస్తూ కొత్త జీవితానికి ఎలా ఆహ్వానం పలకాలో చెప్పింది. పైగా తనలాంటి ఎందరో కేన్సర్ బాధితులకు ప్రేరణగా నిలిచింది. ఆ మహిళ కేన్సర్ కన్నీటి గాథ వింటే..కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. ఇంతకీ ఈ కథేంటంటే..అమెరికా(US)సంయుక్త రాష్ట్రాలకు చెందిన 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్(social media influencer ) ఎల్డియారా డౌసెట్(Eldiara Doucette) అరుదైన కేన్సర్ సైనోవియల్ సార్కోమా(synovial sarcoma) బారిన పడింది. ఈ కేన్సర్తో పోరాటం కారణంగానే సోషల్ మీడియాలో “బయోనిక్ బార్బీ" గా పేరుగాంచింది. అలా తన అరుదైన కేన్సర్కి సంబంధించిన విషయాలు నెటిజన్లతో పంచుకోవడంతో ఇదే సమస్యతో బాధపడుతున్న ఎందరో ఆమెకు స్నేహితులుగా మారారు. అంతేగాదు దాదాపు ఐదు లక్షల మంది ఫాలోయింగ్ని సంపాదించిపెట్టింది. ఆమెకు మూడేళ్లక్రితం ఈ అరుదైన కేన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయినప్పటి నుంచి ఈ సోషల్ మీడియా జర్నీ ప్రారంభమైంది. ఒక రకంగా ఈ వ్యాధి తనలాంటి ఎందరో భాధితులని ఆమెకు ఆత్మబంధువులుగా చేసింది. అదే ఆమెకు ఈ మహమ్మారితో పోరాడే శక్తిని, స్థైర్యాన్ని అందించింది. అయితే ఈ కేన్సర్ మహమ్మారి బయోనిక్ బార్బీగా పిలిచే ఎల్డియారాపై గెలవాలనుకుందో ఏమో..!. తన విజృంభణతో ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కేన్సర్ పునరావృతమవుతూనే ఉంది. ఎడతెగని కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో అలిసిపోయింది. ఆ మహమ్మారిపై గెలుస్తున్న ప్రతిసారి దాడి చేసి తిరగబెడుతూనే ఉండేది. దీంతో ఆమె ఆరోగ్యం దిగజారడం మొదలైంది. ఇక ఆమె బతకాలంటే కేన్సర్కణాల ప్రభావం ఎక్కువగా ఉన్న కుడిచేతి(right arm)ని తొలగించక తప్పని స్థితికి వచ్చింది. ఆ కేన్సర్ వ్యాధిని కట్టడిచేయాలంటే ఆ చేతిని కోల్పోక తప్పని స్థితి. ఆ విషమ పరిస్థితుల్లోనే కుడిచేతి మెచేయి వరకు కోల్పోయి కేన్సర్ని విజయవంతంగా జయించింది. అయితే ఆ కోల్పోయిన కుడి చేతితో తాను చేసే పనులన్నీ గుర్తొచ్చి ఎల్డియారాకు కన్నీళ్లు ధారగా వచ్చేశాయి . పుట్టుకతో వికలాంగురాలిగా ఉండటం వేరు..మధ్యలో హఠాత్తుగా వచ్చి పడిన వైకల్యాన్ని అధిగమించడం అంత ఈజీ కాదు. ఇక తాను ఒంటి చేత్తోనే జీవించాలన్న ఆలోచన కూడా జీర్ణించుకోలేనంత బాధను కలుగజేసిందామెకు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియా పోస్ట్లో "తన చేయే తనన అంతం చేయాలనుకుంది. కట్చేస్తే..అదే బాధితురాలిగా మారిందని ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. అయినా కేన్సర్ని ఓడించగలిగానూ, కాబట్టి తాను కోల్పోయిన చేతికి గ్రాండ్గా వీడ్కోలు పలుకుతూ అంత్యక్రియలు చేయలని నిర్ణయించుకున్నట్లు స్థైర్యంగా చెప్పింది. ఇది తనలా కేన్సర్ కారణంగా అవయవాలు కోల్పోయిన వారిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలని చేస్తున్నట్లు పోస్ట్లో వివరించింది. ఇన్నాళ్లు ఎంతగానో ఉపకరించి ఎన్నో పనుల్లో హెల్ప్ చేశావు, అలాగే ఎందరినో ఓదార్చడానికి ఉపయోగపడ్డ ఆ చేతికి కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికింది. పైగా ఆ కోల్పోయిన చేతిని నైయిల్ పాలిష్తో డెకరేట్ చేసి మరీ అంతక్రియలు నిర్వహించింది. "మనకు ఇలా జరగాలని రాసి పెట్టి ఉంటే మార్చలేం లేదా ఆపలేం. అయితే దాన్ని అంగీకరిస్తూ అధిగమిస్తే అంతిమంగా మనమే గెలుస్తామని చెబుతుంది". ఎల్డియా. అలాగే తన జీవితంలోకి వచ్చిన వైకల్యాన్ని అంగీకరించడమే గాక రోబోటిక్ ప్రొస్థెటిక్ మెటల్ రాడ్ను అమర్చుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. ఆనందంగా ఉండటం అనేది మన చేతిల్లోనే ఉంది. కోల్పోయమనో లేదా పొందలేకపోయమనో బాధపడిపోవడం కాదు..ఆ పరిస్థితిని కూడా మనకు సంతోషాన్ని ఇచ్చేదానిగా మార్చుకుని ఆనందభరితంగా చేసుకోవడమే జీవితం అని చాటిచెబుతోంది ఎల్డియారా. అంతటి పరిస్థితులోనూ తాను ఆనందంగా ఉండటమే గాక ఇతరులు కూడా తనలా అలాంటి పరిస్థితిని అధిగమించి సంతోషంగా ఉండాలని కోరుకోవడం నిజంగా గ్రేట్ కదూ..!. View this post on Instagram A post shared by el deer uh ᯓ★ (@semibionicbarbie) (చదవండి: దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..) -
ఆ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది..!
కాసేపట్లో పెళ్లితో కళకళలాడాల్సి వేదిక కాస్త ఒక్కసారిగా నిశబ్దమైపోయింది. పాపం వరుడు ఏదో సరదాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటే..అదే తనకు ఊహించని బాధని, అవమానాన్ని మిగిల్చింది. ఏ పాటకు కాలు కదిపితే బాగుంటుందో సంమయనంతో ఆలోచిస్తే బాగుండేది. లేదంటే ఇలాంటి దుస్థితి పట్టేది కాదేమో. కొన్ని విషయాల్లో కామెన్ సెన్స్తో వ్యవహరించాలి. లేదంటే ఆ వరుడిలా చేదు అనుభవాన్ని ఎదుర్కొనక తప్పేదేమో..!. ఈ ఘటన న్యూఢిల్లీ(New Delhi)లో చోటు చేసుకుంది. వరుడు(Groom) ఊరేగింపుతో న్యూఢిల్లీలోని వివాహ మండపం వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి స్నేహితులు నృత్యం చేయమని బలవంతం చేయడంతో ప్రసిద్ధ బాలీవుడ్ పాట(Bollywood Song) 'చోళీ కే పీఛే క్యా హై'కి డ్యాన్స్ చేశాడు. అందులోనూ సాక్షాత్తు వరుడు ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో వధువు తండ్రికి చాలా అవమానంగా అనిపించింది. కాబోయే అల్లుడు తీరు ఇలా ఉందేంటని వెంటనే పెళ్లి(Wedding)ని అర్థాంతరంగా ఆపేసి వివాహ తంతుని రద్దుచేసుకుంది వధువు కుటుంబం. వరుడు చర్యలు కుటుంబ విలువలను అవమానించేలా ఉన్నాయని చెబుతూ వధువు కుటుంబం అక్కడ నుంచి నిష్రమించినట్లు సమాచారం. ఈ ఘటనతో వధువు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే వరుడు ఇదంతా ఏదో ఫన్ కోసం అని వధువు తండ్రిని ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం..వధువు తండ్రికి వరుడు చేసిన పని చాలా ఆగ్రహం తెప్పించిందని, ఆయన అందుకే తక్షణమే పెళ్లిని నిలిపేసినట్లు చెబుతున్నారు బంధువులు. అలాగే తన కుమార్తెతో ఆ వరుడు కుటుంబం ఎలాంటి సంబంధాలు నెరకూడదని వధువు తండ్రి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు మాత్రం ఆ తండ్రి సరైన నిర్ణయం తీసుకున్నాడు. లేదంటే ఈ డ్యాన్స్ రోజు చూడాల్సి వచ్చేదంటూ వధువు తండ్రికే మద్దతిస్తూ పోస్టులు పెట్టారు. ఈ కథ మన చుట్టు ఉన్నవాళ్లు, స్నేహితులు ఫన్ అంటూ ఏదేదో చేయమంటారు. కానీ అది సరైనదా కాదా అని ఆలోచించి అడుగు వేయపోతే నష్టపోయేది మనమే. ఆ ఫన్ సంతోషం తెప్పించకపోయినా పర్లేదు..మన చేత కన్నీళ్లు పెట్టించేదిగా ఉండకూడదు.probably the funniest ad placement i’ve seen till date 😂 pic.twitter.com/a189IFuRPP— Xavier Uncle (@xavierunclelite) January 30, 2025(చదవండి: 'ది గ్రామఫోన్ గర్ల్': శాస్త్రీయ సంగీతాన్ని జస్ట్ మూడు నిమిషాల్లో..!) -
ట్రంప్ వీరవిధేయుడి నోట ‘జై శ్రీ కృష్ణ’
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. భారతీయ మూలాలను, సంప్రదాయాలను, విలువలనూ పాటించే వ్యక్తులు తరచూ తారసపడుతుంటారు. అది ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా!. అలాంటి వాళ్లలో ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్బీఐ డైరెక్టర్ పదవికి నామినీ అయిన కశ్యప్ పటేల్ ఒకరు. తాజాగా ఆయన చేసిన చర్య ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.44 ఏళ్ల కశ్యప్ క్యాష్ పటేల్.. తాజాగా(గురువారం) సెనేట్ జ్యూడీషియరీ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో తనకు మద్ధతు తెలపడానికి సుదూరాల నుంచి వచ్చిన తల్లి అంజనా, తండ్రి, సోదరిని కమిటీకి ఆయన పరిచయం చేశారు. చివర్లో ‘జై శ్రీ కృష్ణ’ అంటూ ముగించారు. అంతకు ముందు.. కమిటీ విచారణ ప్రారంభానికి ముందు ఆయన తన తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.WATCH | FBI Director-Designate Kashyap Patel delivers opening statement at confirmation hearing, thanks his parents who flew from India and concludes with “Jai Shri Krishna.”#FBI #KashyapPatel #US pic.twitter.com/mFLx0uEVAz— Organiser Weekly (@eOrganiser) January 30, 2025విచారణ ఎందుకంటే..ఎఫ్బీఐ డైరెక్టర్ నామినీ అయిన కశ్యప్ పటేల్ను సెనేట్ జ్యూడీషియరీ కమిటీ విచారణ జరుపుతుంది. సాధారణంగా ఈ కమిటీ ఆ పదవికి నామినీకి ఉన్న అర్హతలను సమీక్షించడంతో పాటు గతంలో చేసిన వ్యాఖ్యలను, వివాదాస్పద చర్యలను పరిశీలిస్తుంది. చివరకు సదరు నామినేషన్ను అంగీకరించాలా? తిరస్కరించాలా? అనేది ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుంది.ఇక విచారణలో భాగంగా గతంలో.. జర్నలిస్టులను ప్రాసిక్యూషన్ చేయాలని, ఎఫ్బీఐ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేయాలని కశ్యప్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ట్రంప్ను ఆయనకు ఉన్న అనుబంధంపైనా ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వీటితో పాటు జాత్యహంకారానికి గురయ్యారా?అనే ప్రశ్నకు.. ఆయన అవుననే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘‘గతంలో నేనూ గతంలో జాత్యహంకారానికి గురయ్యాను. అమెరికాలో ఎలాంటి హక్కు లేని ఓ వ్యక్తిగా నన్ను పేర్కొనేవారు. మీరు ఎక్కడినుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లిపోవాలంటూ నాకు మెసేజ్లు వచ్చేవి. చట్టాన్ని కాపాడుతున్న ఎంతోమంది వ్యక్తులు ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే నాకు జరిగింది చాలా చిన్నదిగా అనిపించింది. నా కుటుంబసభ్యులు ఇక్కడ ఉండగా.. ఆ సంఘటనను గురించి పూర్తిగా వెల్లడించలేను’’ అని పటేల్ అన్నారు. కాష్ పటేల్ గురించి..ట్రంప్కు వీరవిధేయుడిగా కాష్ పటేల్కు పేరుంది. గుజరాత్లో ఈయన కుటుంబమూలాలు ఉన్నాయి. ఈయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. అయితే ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా కాష్ తండ్రి అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ పుట్టాడు. ప్రస్తుతం ఆయన కొలంబియాలో ఉంటున్నారు. కాష్ పటేల్ పూర్తి పేరు.. కశ్యప్ ప్రమోష్ వినోద్ పటేల్. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా.. కొలువు లభించలేదు. దీంతో అతడు మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్మెంట్లో చేరారు.కాష్ పటేల్ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు. దీంతో ఆయన 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయం చేశారు. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యాలు కశ్యప్కు బాగా తెలుసు. ఐసిస్ నాయకుడు అల్ బాగ్దాదీ, అల్-ఖైదా హెడ్ అల్ రిమి వంటి ఆపరేషన్లకు సంబంధించి పనిచేశారు. అంతేకాదు పలుచోట్ల బందీలుగా ఉన్న అమెరికన్లను సురక్షితంగా దేశానికి రప్పించడంలో ఈయన పాత్ర ఉంది. జస్టిస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆపరేషన్ కమాండ్లో లైజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహించారు కూడా. ట్రంప్ రహస్య పత్రాల వ్యవహారం విచారణ సమయంలోనూ ఈయన పేరు ప్రముఖంగానే వినిపించింది. అయితే..ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక.. సెంట్రల్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి కొత్త చీఫ్ ఎవరవుతారనే చర్చ నడిచింది. ఆ సమయంలో రేసులో కాష్ పటేల్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అమెరికా మాజీ గూఢచారి జాన్ రాట్క్లిఫ్ ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు ఎఫ్బీఐ డైరెక్టర్ పదవికి ఆయన పేరును ట్రంప్ నామినేట్ చేశారు. సెనేట్ కమిటీ గనుక ఆయన పేరుకు క్లియరెన్స్ ఇస్తే.. దాదాపుగా ఆయనకు అగ్రరాజ్య దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ పగ్గాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. భారతీయ మూలాలు ఉన్న కాష్ పటేల్ చరిత్ర సృష్టించినట్లే!. -
రెడ్ కలర్ శారీలో స్రవంతి.. కళ్లు చెదిరిపోయే స్టిల్స్
-
ఈ ముద్దుగుమ్మ చీరకడితే అలా చూస్తూ ఉండాల్సిందే
-
‘స్టూడెంట్తో పెళ్లి’.. వివాదంలో మహిళా ప్రొఫెసర్
పవిత్రమైన బంధాల్లో గురుశిష్యుల బంధం ఒకటి. అయితే అతిజుగుప్సాకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నవాళ్లను తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్కు సంబంధించిన ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ను కుదిపేస్తోంది. తన స్టూడెంట్నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘటా టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గరి నుంచి.. దండలు మార్చుకోవడం, ఏడగుడులు వేయడం ఇలా అన్నీ సంప్రదాయ పద్ధతిలో క్లాస్రూంలోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కామెంట్లతో పాటు సీరియస్గా విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.VIDEO Credits: HornbillTV అది నిజం వివాహం కాదని, సరదా కోసం చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్ను నిర్వహించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తానంటే గిట్టని వాళ్లు ఆ వీడియోను బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క.. ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ సుముఖత చూపించకపోవడం గమనార్హం. -
క్రికెట్ చరిత్రలో అసాధారణ రనౌట్
క్రికెట్ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్ నమోదైంది. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ అండర్-19 జట్టు ఆటగాడు ఆర్యన్ సావంత్ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్ 3వ రోజు సావంత్ 11 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తూ జేసన్ రౌల్స్ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. అయితే బంతి షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్విక్ హెల్మెట్ను బలంగా తాకి, స్టంప్స్పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్కు అప్పీల్ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్కు తాకి గాయపడిన జోరిచ్ను పరామర్శించే పనిలో పడ్డారు. The first and last time you'll see a run out like this... @collinsadam pic.twitter.com/ZIEFI8s1Te— Brent W (@brentsw3) January 28, 2025దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్ మెల్లగా పెవిలియన్ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ వెల్లడించింది. సావంత్ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.కాగా, ఈ మ్యాచ్లో సావంత్ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ను కొనసాగించిన ఇంగ్లండ్, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్తో పోలిస్తే 20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో థామస్ ర్యూ (71) టాప్ స్కోరర్గా నిలిచాడు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్ అహ్మద్, జాక్ హోమ్ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్ బుల్బులియా, జేసన్ రౌల్స్ అర్ద సెంచరీలు చేశారు. -
ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
-
ప్రపంచం మొత్తంలో బుద్ధిమంతుడైన పిల్లాడు.. లవ్ యూ: తిలక్ వర్మ(ఫొటోలు)
-
Karimnagar: సీఐ బాత్రూం బకెట్లో 3లక్షలు.. ఫోన్ కాల్ వైరల్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నేను మీ తమ్ముడిని.. ఇవన్నీ పిట్టకథలు వద్దు... బాజప్తా మీ బాత్రూంలో రూ.3 లక్షలు పెట్టిన.. అని ఆడియో లీక్కాగా, మరునాడు సామాజిక కార్యకర్త సదరు సీఐని విచారణ చేయాలంటూ వీడియో విడుదల చేయడం రెండు రోజులుగా జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట టౌన్ సీఐ, సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీతో డబ్బుల విషయంలో మాట్లాడిన సంభాషణ ఆడియో రికార్డు సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. సదరు ఆడియోలో ఎస్సీ, ఎస్టీ కేసులో సీఐకి మూడు లక్షల రూపాయలు లంచంగా సీఐ ఛాంబర్లోని వాష్రూమ్లో పెట్టి అందజేసినట్లు ఆడియోలో ఉంది. తాజాగా ఆడియోలో మాట్లాడిన సామాజిక కార్యకర్త షేక్సాబీర్ అలీ మరిన్ని వివరాలతో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో షేక్సాబీర్ అలీ మాట్లాడుతూ.. ‘జెర్రంశెట్టి కృష్ణారావు, గోవిందరెడ్డి, మర్రుతో పాటు ఎస్ఆర్కే డెయిరీ చైర్మన్ బండారు మాధురి మధ్య ఉన్న వివాదాల్లో మధ్యవర్తిత్వం కోసం కృష్ణారావు నన్ను ఆశ్రయించారు. గత అక్టోబర్ 28 నుంచి 30 వరకు వివాదం పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లో సీఐ రవితో మాట్లాడటం జరిగింది. కృష్ణరావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయొద్దంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితులతో మాట్లాడి రూ.3 లక్షలు తీసుకొచ్చి సీఐ వద్దకు వెళ్లగా, సీఐ ఛాంబర్లోని బాత్రూంలోని బకెట్లో పెట్టాలని సూచించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడు’ అని వీడియోలో పేర్కొన్నాడు. దీంతో గత ఏడాది డిసెంబర్ 30న సీఐకి ఫోన్చేసి, రూ.3 లక్షలు తీసుకొని బాధితుడిపైనే కేసు ఎలా నమోదు చేస్తారని సూటిగా అడిగిన. దానికి అతడు తడబడ్డాడు కానీ.. పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్పై కెమెరాతో రికార్డు చేశానని చెప్పడంతో నిన్ను నమ్మటం తప్పా అని సీఐ అన్నాడని అందులో చెప్పాడు. తర్వాత ఆరోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మారేపల్లి రాజుతో రోడ్డుపై నడిచి వెళ్తుండగా నా మొబైల్ను పల్సర్ బైక్మీద వచ్చిన ఇద్దరు ప్రైవేట్ యువకులు లాక్కోనిపోయారు. అప్పటికే సదరు ఆడియోను మా మిత్రులకు షేర్చేసి చేసిన కాబట్టి ఆ ఆడియోను మీడియాకు లీక్ చేయగలిగాను. గతంలో ఇలా ప్రశ్నించినప్పుడు నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా కేసులు బనాయించే అవకాశం ఉంది. బాధితులను బెదిరించి డబ్బులు ఇవ్వలేదని చెప్పించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు గత ఏడాది అక్టోబర్ 28 నుంచి 30 వరకు పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సదరు వీడియోలో షేక్ సాబీర్ అలీ పేర్కొన్నారు. పోలీసుల మౌనం వెనక అనుమానాలురెండు రోజులుగా జిల్లాలో ఆడియో, వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నా... పోలీస్ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం పలుఅనుమానాలకు తావిస్తోంది. మధ్యవర్తి తేదీ, సమయంతో పాటు పూర్తివివరాలు చెబుతుండడం, లీకైన ఆడియోలో సామాజిక కార్యకర్త సీఐను ఏకవచనంతో సంభోదించటం, పదేపదే డబ్బులు ఇచ్చానని చెప్పుతున్నా... సీఐ మాత్రం స్టేషన్కి రా మాట్లాడుకుందాం అంటూ సున్నితంగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మాట్లాడటం.. నిన్ను నమ్మడం తప్పా అని సీఐ అనటంలో అంతర్యం ఏంటని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ జమ్మికుంట ఎపిసోడ్లో విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే గురువారం రాత్రి జమ్మికుంట పోలీసులు మీడియాకు ప్రెస్నోట్ విడుదల చేశారు. అందులో ఆడియో, వీడియోలోని మాటలను ఖండించకుండా కేవలం సాబీర్ అలీ బ్లాక్మెయిలర్, అతడిపై గతంలో చాలా కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొనడం గమనార్హం. రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలిజమ్మికుంట పట్టణ సీఐ వరిగంటి రవి అవినీతి తిమింగలంగా మారి రూ.3లక్షలు లంచం తీసుకోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చ. పోలీస్ యూనిఫామ్ ధరించి ప్రజల నమ్మకాన్ని దోచుకోవడం దుర్మార్గం. తెలంగాణ డీజీపీ, ఏసీబీ డీజీపీ, కరీంనగర్ సీపీలు ఇలాంటి అవినీతి పురుగులను రిమాండ్ చేసి సస్పెండ్ చేయాలి. ప్రజల రక్షణ కోసం ఉన్న యూనిఫామ్కి మచ్చ తెచ్చే వారిని వదిలిపెట్టవద్దు.– పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యేషాక్కు గురయ్యా సాబీర్ నా మీద అంత పెద్ద ఆరోపణ చేసేసరికి ఒక్కసారిగా షాక్ తిన్న. అందుకే, కాస్త వెనక్కి తగ్గినట్లు మాట్లాడాను. అతన్ని పట్టుకునేందుకు రప్పిద్దామని అనుకున్నా. సాబీర్పై గతంలోనూ అనేక కేసులు ఉన్నాయి. ఈ ఘటన విషయంలో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాం.– వి.రవి, జమ్మికుంట టౌన్ సీఐ -
మహాకుంభ్ మేళా తేనే కళ్ల బ్యూటీ.. ఏకంగా సినిమాలో ఆఫర్!
సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు. ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్నైట్ స్టార్ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు. తేనేలాంటి కళ్లతో మహాకుంభ్ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.మహాకుంభ్ మేళాలో అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న తేనేకళ్ల సుందరి మోనాలిసా. ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు. దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ అట్రాక్షన్ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు. ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
ట్రంప్ విందులో నీతా స్పెషల్ లుక్.. ఈ చీరకు 1900 గంటలు పట్టిందట!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మరోసారి , ఫ్యాషన్ లుక్స్ విషయంలో తన శైలిని మరోసారి నిరూపించుకున్నారు. సందర్భాన్ని బట్టి తగ్గట్టు దుస్తులను ఎంపిక చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ధరిస్తుంటారు. ఐపీఎల్, బిజినెస్ ఈవెంట్స్లో అటు మోడ్రన్గానూ, ఇటు తనకు ఎంతో ఇష్టమైన చీర కట్టునే (traditional sarees) ఎంచుకుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జరిగిన ప్రత్యేక విందులో నీతా అంబానీ అందమైన 'జామేవర్' చీరలో అంతర్జాతీయంగా అందర్నీ ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె ధరించిన చీర విశేషాలపై భారీ ఆసక్తి నెలకొంది.రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యాపారవేత్తగా, దాతగా తనను తాను అనేక సందర్భాల్లో నిరూపించుకుంటూనే ఉన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూనే ఫ్యాషన్ ఐకాన్గా నిలుస్తున్నారు. ఖరీదైన చీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ యాక్ససరీస్కు ఆమె వార్డ్ రోబ్ పెట్టింది పేరు. ముఖ్యంగా చీరల ఎంపికలో ఆమె తర్వాతే ఎవరైనా. స్టార్-స్టడెడ్ డిన్నర్లో ఈ విషయాన్నే మరోసారి నిరూపించుకున్నారు.ఈ చీరకు 1,900 గంటలు పట్టిందిడొనాల్డ్ ట్రంప్ విందులో, నీతా అంబానీ తరుణ్ తహిలియాని కలెక్షన్లోని అందమైన జామేవర్ చీరను ధరించారు. ఇంత ప్రత్యేకమైన చీరను నేయడానికి దాదాపు 1,900 గంటలు పట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా డిజైనర్ ఇన్స్టాలో షేర్ చేశారు. దీని ప్రకారం క్లాసిక్ ఆరి వర్క్ , ఫ్రెంచ్ నాట్స్తో కలబోతగా దీన్ని రూపొందించారు. ఈ చీరకు కాలర్డ్ బ్లౌజ్తో జత చేసి 60 ఏళ్ల నీతా తన రూపానికి మరింత అందాన్ని తెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Tarun Tahiliani (@taruntahiliani) నీతా అంబానీ ధరించిన ఈ బ్లౌజ్ మధ్యలో వజ్రం పొదిగిన బ్రూచ్ మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ఇంకా డైమండ్ స్టడ్స్, హెయిర్ స్టయిల్, మేకప్ అన్నీ సమానంగా, అందంగా అమిరాయి అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో కూడా నీతా అంబానీ చాలా స్పెషల్గా కనిపించారు. ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ కాంచీపురం చీరలోహుందాగా కనిపించారు. అలాగే 200 ఏళ్ల పురాతనమైన అరుదైన భారతీయ లాకెట్టును ధరించడం విశేషంగా నిలిచింది. పింక్, గ్రీన్ బోర్డర్తో కూడిన నలుపు రంగు పట్టుచీరను తమిళనాడులోని దేవాలయాల శిల్ప కళను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. దీనికి జతగా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన మోడ్రన్ బ్లౌజ్ను ధరించారు. దీంతోపాటు 18వ శతాబ్దపు వారసత్వ భారతీయ ఆభరణాలతో ముస్తాబయ్యారు. దక్షిణ భారతదేశంలో తయారు చేసిన 200 సంవత్సరాల పురాతన, అరుదైన స్టేట్మెంట్ నెక్ పీస్ లో పచ్చలు, భారతీయ లాకెట్టు హైలైట్గా నిలిచింది. చిలుక ఆకారపు ఈ లాకెట్టులో పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు వంటి విలువైన రత్నాలను పొదిగి తయారు చేశారట. -
మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! కనీసం తండ్రి శవాన్ని..!
బరువు తగ్గడం అతి పెద్ద టాస్క్లా ఉంది. ఎందుకంటే డెస్క్ జాబ్లు కావడంతో నూటికి తొంభైతొమ్మిది మంది అధిక బరువు సమస్యతో అల్లాడిపోతున్నారు. తినేది ఏం లేకపోయిన అధిక బరువు భారంగా మారి ఇబ్బంది పెడుతోంది. అయితే దీన్ని మంచి ఆహారపు అలవాట్లతో సరైన విధంగా చెక్పెట్టొచ్చని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ విధంగా చేసి కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి ఓ ఫిట్నెస్ ఔత్సాహికుడు చేరిపోయాడు. అతడి వెయిట్ లాస్ జర్నీ చూస్తే నోటమాటరాదు. ఇంత అధిక బరువుని ఎలా తగ్గించుకున్నాడ్రా బాబు అని ఆశ్చర్యపోతారు. మరి అదెలాగో చూద్దామా..ఇన్స్టాగ్రామ్ యూజర్ అజార్ హసన్ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీతో నెట్టింట వైరల్గా మారాడు. ప్రముఖ ఇంగ్లీష్ ఛానెల్ ఎంటీవీ రోడిస్ సీజన్20లో కనిపించిన ఈ ఫిట్నెస్ ఔత్సాహికుడు తన వెయిట్ లాస్ జర్నీ గురించి వీడియో రూపంలో షేర్ చేయండంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడిస్టోరీ సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తిని రగిలించింది. ఏకంగా అన్ని కిలోలు బరువుని తగ్గించుకోవాలంటే ఎంతో నిబద్ధత అవరం అంటూ అతడిపై ప్రశంసలతో మంచెత్తారు నెటిజన్లు. ఆ వీడియోలో హసన్ తాను ఒకప్పుడు 145 కిలోల అధిక బరువుతో ఎలా ఉండేవాడో చూపించారు. తన శరీర కొవ్వు శాతం సుమారు 55% ఉండేదని చెప్పారు. తన వెయిట్లాస్ జర్నీతో దాన్ని దాదాపు 9% వరకు తగ్గించుకోగలిగానని అన్నారు. ఇప్పుడు 75 కిలోలు బరువు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తన బరువు తగ్గించే ఈ జర్నీలో తండ్రే తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పుకొచ్చారు. తన తండ్రితో ఎలాగైన బరువు తగ్గుతానని ఛాలెంజ్ చేసినట్లు చెప్పారు. అలా తాను ఏడు నెలల్లో మొత్తం కొవ్వుని కోల్పోయి..దాదాపు 55 కిలోల వరకు బరువు తగ్గినట్లు తెలిపారు. అయితే తన విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీని చూడకమునుపే తండ్రి మరణించినట్లు వెల్లడించారు. అంతేగాదు తన తండ్రి శవాన్ని ఖననం చేసే నిమిత్తం సమాధిలోకి దించలేకపోయినట్లు వివరించారు. అప్పుడే తనకు ఈ అధిక బరువుతో చాలా ఇబ్బందులు తప్పవని తెలిసిందన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతలా తాను బరువు తగ్గి స్లిమ్గా మారినట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Azhar hassan (@fitflashh) (చదవండి: నాజూకు నడుము కోసం ఏకంగా పక్కటెముకలనే..!) -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిలిచినా మీటింగ్కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో మహా కుంభమేళ(Maha Kumbh) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొని గంగా స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఎందరో ప్రముఖులు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసి సన్యాసులగా మారిన మేధావులను కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేగాదు ఈ మహత్తర వేడుకలో పాల్గొని తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తుల లక్షలాదిమందిగా కదిలి రావడం విశేషం. తాజాగా ఈ వేడుకలో ఒక అందమైన సాధ్వి(beautiful sadhvi) తళుక్కుమంది. ఆమె అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్లో అందంగా ఉన్న ఆ యువతి సాధ్వీగా జీవిస్తోందా..? అని అంతా విస్తుపోయారు. ఇది నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది. అయితే ఆమె అంతా అనుకున్నట్లు సాధ్వి కాదని తేలింది. కేవలం అది గెటప్ అని ఆమె ఎలాంటి దీక్ష తీసుకోలేదని ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ అందమైన సాధ్వి పేరు హర్ష రిచారియా. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్టుయెన్సర్. గతంలో కూడా తాను ఇలా రీల్స్ద్వారా సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విశేషాలను ప్రజలకు తెలియజేశానని చెప్పుకొచ్చింది. అలానే ఈసారి ఈ కుంభమేళలో వారిలా సాధ్విగా గెటప్ వేసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి..ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలియజే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈ గెటప్లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఇలా సాధ్విలా కనిపించడంపై సోషల్మీడియా ట్రోల్కి గురయ్యింది. ఆధ్మాత్మికత అంటే నవ్వులాటగా ఉందా..?. ఆ వేషధారణలోనే తెలుసుకునే యత్నం చేయాలా అంటూ నెటిజన్లు తింటిపోశారు. (చదవండి: ఆ రెండు అస్సలు వదిలిపెట్టని రమ్యకృష్ణ.. అందుకే 50 ఏళ్లు దాటినా అంత ఫిట్గా..!) -
ఆ ఫ్రాక్చర్ని ఏఐ పసిగట్టింది..కానీ డాక్టర్లు..
ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ అంటేనే అమ్మో అని హడలిపోతున్నారు జనాలు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువని చాలమంది విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం. చెప్పాలంటే దీన్ని వ్యతిరేకించేవారి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా నిరుద్యోగం ఎక్కువవతుందనేది అందరి ఆందోళన. అయితే దీన్ని సరిగా ఉపయోగించుకుంటే మన ఎదుగదలకు దోహదపడుతుందనే ఓ సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. సవ్యంగా ఉపయోగిస్తే నష్టాన్ని కూడా లాభంగా మార్చుకోవచ్చు. ఏదైనా మనం ఉపయోగించే విధానంలో ఉంటుందన్నా.. పెద్దల నానుడిని గుర్తు చేసేలా ఓ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన ఓ రకంగా ఏఐపై ఉన్న నెగిటివిటీకి స్వస్తి చెప్పేలా జరిగింది. ఏం జరిగిందంటే..ఓ తల్లి సోషల్ మీడియాలో తన ఏఐ అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఈ పోస్ట్ నెట్టింట సంచలనంగా మారి చర్చలకు దారితీసింది. ఆమె తన కుమార్తె కారు ప్రమాదంలో చిక్కుకుందని. ఆ సమయంలో ఎలాంటి గాయాలు అవ్వకపోయినా ఆమె మణికట్టు నుంచి మోచేయి భాగం వరకు విపరీతమైన నొప్పిని ఎదుర్కొంది. వైద్యులు వద్దకు తీసుకెళ్తే..ఎముకలు ఫ్రాక్చర్ కాలేదని చెప్పి ఇంటికి పంపించేశారు. కానీ ఆమె నొప్పితోనే విలవిలలాడుతూ ఉండేది. దీంతో అనుమానంతో ఎలాన్ మస్క్(Elon Musk ఫ్లాట్ఫామ్ ఏఐ చాట్బాట్(AI chatbot) గ్రోక్(Grok)లో తన సందేహం నివృత్తి చేసుకునే యత్నం చేసింది. అందుకోసం తన కుమార్తె ఎక్స్ రేని అప్లోడ్ చేసి ఫ్రాక్చర్(fracture) అయ్యిందో కాలేదా అని ప్రశ్నించింది. అయితే గ్రోక్ డిస్టల్ రేడియస్లో స్పష్టమైన ఫ్రాక్చర్ లైన్ ఉందని పేర్కొంది. అయితే ఇదే ఈసందేహం ఆ తల్లికి ముందే తట్టింది. అయితే అప్పుడు ఆ వైద్య బృందాన్ని అడిగితే..అది గ్రోత్ ప్లేట్ అని చెప్పి భయపడాల్సిన పనిలేదని ఆ తల్లికి నమ్మకంగా చెప్ప్పారు. కానీ ఇక్కడ ఏఐ ఆ తల్లి అనుమానమే నిజమని తేల్చింది. దీంతో ఆమె మరో చేతి ఎముకల స్పెషలిస్ట్ని కలవగా డోర్సల్ డిస్ప్లేస్మెంట్తో డిస్టల్ రేడియల్ హెడ్ ఫ్రాక్చర్ ఉందని, తక్షణమే సర్జరీ చేయాలని చెప్పడం జరిగిందని పోస్ట్లో రాసుకొచ్చింది. త్రుటిలో తన కూతురు ఆ నొప్పి నుంచి బయటపడగలిగింది లేదంటే చేతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడేదని చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు ఏఐ మానవుడిని మించిపోయిందని ఒకరు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి విషయాల్లో దీన్ని ఎంతవరకు నమ్మగలం అని మరోకరూ అనుమానం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.True story: @Grok diagnosed my daughter’s broken wrist last week. One of my daughters was in a bad car accident last weekend. Car is totaled but she walked away. Everyone involved did, thankfully. It was a best case outcome for a serious, multi-vehicle freeway collision.… pic.twitter.com/fRNh81WX0N— AJ Kay (@AJKayWriter) January 11, 2025 (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ
‘జెరోదా’ సహ వ్యవస్థాపకుడు(Zerodha co-founder) నిఖిల్ కామత్(Nikhil Kamath)కు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తొలి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు గంటల సుదీర్ఘ ఇంటర్వ్యూలో పలు అంశాలపై విస్తారంగా ముచ్చటించారు. ముఖ్యంగా భోజనం విషయంలో తన ఆహార వ్యవహారంకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్వూలో కామత్ ఇటలీలో జరిగిన G7 సమ్మిట్(G7 Summit) గురించి మాట్లాడుతూ ఇటలీ గురించి మోదీకి బాగా తెలుసనని ప్రజలు అంటున్నారని నవ్వుతూ అన్నారు. ఇంటర్నెట్లలో ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని పేరుతో వచ్చిన మెలోడి మీమ్లు గురించి కూడా ప్రస్తావించారు. వాటన్నింటిని తోసిపుచ్చుతూ..తనకు ఇటలీ నుంచి తనకెంతో ఇష్టమైన పిజ్జా వచ్చిందని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఆహారం విషయంలో తాను ఎలా ఉంటాననే దాని గురించి వివరించారు. తాను స్వతాహాగా ఫుడ్డీని కాదన్నారు. ఏదేశంలోనైనా తనకు ఏది వడ్డించినా సంతోషంగా తింటా. ప్రత్యేకంగా ఇది అని నియమం లేదు. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలనేది షరతు. ఇప్పటికీ తనికి రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మెనూ ఇవ్వగానే ఏం తినాలో తెలియదని, అదసలు తనకు అర్థం కాదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో తన తొలినాళ్ల నాటి కథను గుర్తుచేసుకున్నారు. ఆ టైంలో తనకు దివంగత అరుణ్ జైట్లీ తరచుగా తనకు ఆహారం ఆర్డర్ చేయడంలో ఎలా సహాయం చేశారో చెప్పారు. తనకు కూడా ఫుడ్ని ఆర్డర్ చేయమని కోరేవాడిని. అయితే అది శాకాహారమే అయ్యి ఉండాలని షరతు విధించేవాడినని నాటి రోజులని గుర్తు చేసుకున్నారు. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ శ్రోతలకు ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని మరింతగా పరిచయం చేసింది. (చదవండి: నాడు టెక్కీ ఇవాళ లెహంగాల వ్యాపారవేత్త.. ఏడాదికి రూ. 5 కోట్లు.. ) -
‘ఇన్ఫోసిస్లో ఇదీ పరిస్థితి.. అందుకే జాబ్ మానేశా’
దేశంలో టాప్ 2 ఐటీ కంపెనీలో ఉద్యోగం.. ఇంట్లో సంపాదించే వ్యక్తి తనొక్కడే.. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేదు.. అయినా ఇన్ఫోసిస్లో (Infosys) చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు పుణేకు చెందిన ఒక ఇంజనీర్ (Pune techie). ఇంత కఠిన నిర్ణయం తాను ఎందుకు తీసుకున్నాడు.. ఇన్ఫోసిస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. జాబ్ వదులుకునేందుకు దారితీసిన కారణాలు ఏమిటి.. అన్నది ఓ సోషల్ మీడియా పోస్ట్లో పంచుకోగా ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.మరో ఆఫర్ చేతిలో లేకుండానే ఇన్ఫోసిస్లో తన ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడో లింక్డ్ఇన్ పోస్ట్లో పంచుకున్నారు పుణేకు చెందిన భూపేంద్ర విశ్వకర్మ. తాను రాజీనామా చేయడానికి ఆరు కారణాలను పేర్కొన్నారు. నారాయణ మూర్తి స్థాపించిన టెక్ దిగ్గజంలోని వ్యవస్థాగత లోపాలను, అనేక మంది ఉద్యోగులు నిశ్శబ్దంగా భరించే సవాళ్లను వెలుగులోకి తెచ్చారు."నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొన్నాను. చివరికి చేతిలో ఎటువంటి ఆఫర్ లేకపోయినా నిష్క్రమించాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. కార్పొరేట్ వర్క్ప్లేస్లలో చాలా ఎదుర్కొంటున్న ఈ సవాళ్ల గురించి నేను బహిరంగంగా మాట్లాడాలనుకుంటున్నాను" అని భూపేంద్ర తన పోస్ట్లో పేర్కొన్నారు.జాబ్ మానేయడానికి భూపేంద్ర పేర్కొన్న కారణాలు» ఆర్థిక వృద్ధి లేదు: జీతం పెంపు లేకుండా సిస్టమ్ ఇంజనీర్ నుండి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. మూడేళ్లు కష్టపడి నిలకడగా పనిచేసినా భూపేంద్రకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం కనిపించలేదు.» అన్యాయమైన పనిభారం: భూపేంద్ర బృందాన్ని 50 నుండి 30 మంది సభ్యులకు కుదించబడినప్పుడు అదనపు పనిభారం మిగిలిన ఉద్యోగులపై పడింది. అయినా పరిహారం, గుర్తింపు లేవు. కేవలం పని ఒత్తిడి మాత్రం పెరిగింది.» అస్పష్టంగా కెరీర్ పురోగతి: నష్టం తెచ్చే పనిని అప్పగించారు. ఇందులో భూపేంద్ర ఎదుగుదలకు అవకాశం కనిపించలేదు. పరిమిత జీతాల పెంపుదల, అస్పష్టమైన కెరీర్ పురోగతి వృత్తిపరమైన డెడ్వెయిట్గా భావించేలా చేసింది.» టాక్సిక్ క్లయింట్ వాతావరణం: తక్షణ ప్రతిస్పందనల కోసం అవాస్తవిక క్లయింట్ అంచనాలు అధిక ఒత్తిడి వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపాటి సమస్యలపైనా పదేపదే ఒత్తిడి పెరగడం వల్ల ఉద్యోగి శ్రేయస్సును దెబ్బతీసే విషపూరితమైన పని సంస్కృతికి దారితీసింది.» గుర్తింపు లేకపోవడం: సహోద్యోగులు, సీనియర్ల నుండి ప్రశంసలు పొందినప్పటికీ, ఇది ప్రమోషన్లు, జీతం పెంపు, లేదా కెరీర్ పురోగతి రూపంలోకి మారలేదు. భూపేంద్ర తన కష్టానికి ప్రతిఫలం కాకుండా దోపిడీకి గురవుతున్నట్లు భావించారు.» ఆన్సైట్ అవకాశాల్లో ప్రాంతీయ పక్షపాతం: ఆన్సైట్ అవకాశాలు మెరిట్ ఆధారంగా కాకుండా మాట్లేడే భాష ఆధారంగా ఇస్తున్నారు. నిర్దిష్ట భాషలు మాట్లాడే ఉద్యోగులు తనలాంటి హిందీ మాట్లాడే ఉద్యోగులను పక్కన పెట్టారని ఆరోపించారు.ఇదీ చదవండి: ముప్పు అంచున మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు.. కలవరపెడుతున్న కంపెనీ ప్లాన్కంపెనీల్లో పని సంస్కృతి, పని ఒత్తిడి పెంచే కార్పొరేట్ అధిపతుల వ్యాఖ్యల నడుమ విస్తృత చర్చలు సాగుతున్న తరుణంలో తాజాగా భూపేంద్ర పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. ఆన్లైన్లో మరింత చర్చకు దారితీసింది. ఈ పోస్ట్పై చాలా మంది యూజర్లు ప్రతిస్పందిస్తున్నారు. భూపేంద్రను సమర్థిస్తూ కొందరు, విభేదిస్తూ మరికొందరు కామెంట్లు పెట్టారు. -
ప్రయాణించకుండానే విమానంలో నిద్రపోవచ్చు..!
భూమి నుంచి దూరంగా వెళ్లకుండా విమానంలో స్పెండ్ చేయడం గురించి విన్నారా..?. ఆ ఆలోచనే వెరైటీగా ఉంది కదూ..!. అలాంటి కోరిక ఉంటే వెంటనే ఉత్తర అమెరికాలో అలాస్కాకి వచ్చేయండి. శీతాకాలపు మంచు అందాల తోపాటు విమానంలో గడిపే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందామా..!ఆ వీడియోలో 1950ల నాటి విమానం(Airplane) వింటేజ్ డీసీ-6 విమానం విలక్షణమైన విమానహౌస్(Airplane House)గా రూపాంతరం చెందింది. ఇది ఒకప్పుడూ మారుమూల అలాస్కా(Alaska) గ్రామాలకు ఇంధనం, సామాగ్రిని సరఫరా చేసేది. ఇందులో రెండు బెడ్ రూమ్లు, ఒక బాత్రూమ్తో కూడిన వెకేషనల్ రెంటల్ హౌస్గా మార్చారు. చుట్టూ మంచుతో కప్పబడి ఉండే ప్రకృతి దృశ్యం మధ్యలో ప్రత్యేకమైన విమాన ఇల్లులో అందమైన అనుభూతి.ఇలా సర్వీస్ అయిపోయిన విమానాలను అందమైన టూరిస్ట్ రెంటల్ హౌస్లుగా తీర్చిదిద్ది పర్యాటకాన్ని ప్రోత్సహించొచ్చు అనే ఐడియా బాగుంది కదూ..!. చూడటానికి ఇది ప్రయాణించకుండానే విమానంలో గడిపే ఓ గొప్ప అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. చెప్పాలంటే భూమి నుంచి దూరంగా వెళ్లకుండానే విమానంలో గడిపే ఫీలింగ్ ఇది. అయితే ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు వావ్ చాలా బాగుందని ఒకరూ, లోపల ఎలా ఉంటుందో చూడాలని యాంగ్జైటీగా ఉందని మరొకరూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ ప్రత్యేకమైన విమాన ఇంటిలో బస చేయాలంటే ఒక్క రాత్రికి సుమారు రూ. 30 వేలు పైనే ఖర్చువుతుందట. View this post on Instagram A post shared by DEBORAH + TYLER | Alaska Adventures (@raarupadventures) (చదవండి: భారతదేశపు తొలి స్టంట్ విమెన్..ధైర్యానికి కేరాఫ్ అడ్రస్..!) -
నిజమైన ప్రేమ అంటే ఇది కదా..!
ఇటీవల రోజుల్లో దాంపత్యం అన్న మాట విలువలేనిదిగా అయిపోతోంది. ఎక్కడ చూసినా..విడాకులు కేసులే అధికమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వృద్ధ జంటను చూస్తే భార్యభర్తల బంధం అంటే ఇది కదా అనిపిస్తుంది. ప్రేమ అనే ఒక్క పదం ఇరువురి మధ్య ఉంటే ఎలాంటి వైకల్యమైనా జయించొచ్చు అనిపిస్తుంది. ఈ ఏజ్లో తమ కాళ్లపై తాము నిలబడాలనే తపనతో ఆ జంట పడుతున్న పాట్లు చూస్తే..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంతకీ ఎవరంటే వారు..థానే రైల్వే స్టేషన్(Thane Station) వద్ద స్నాక్ అమ్ముకుని జీవించే వృద్ధ జంట(Elderly Couple). వారితో ఇన్స్టాగ్రామ్ వ్లాగర్(vlogger) సిద్ధేష్ లోకారే మాటలు కలిపి..ఆ సంభాషణను నెట్టింట వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వృద్ధ జంట కథ నెట్టింట వైరల్గా మారింది. బీం రావు శోభ దంపతులతో వ్లాగర్ సిద్ధేష్ సంభాషిస్తూ..మీకు ఎప్పుడు పెళ్లి అయ్యిందని ప్రశ్నిస్తారు. వారు 1982లో పెళ్లై అయ్యిందని బదులిస్తారు. మూడు దశాబ్దాలకు పైగా కలిసే ఉన్నామని అంటారు. ఇక్కడకి ప్రతిరోజు వచ్చి స్నాక్స్ అమ్ముతామని, ఎవ్వరైన స్నాక్స్/స్వీట్లు కావాలని ఆర్డర్ చేస్తే ఇంటికి కూడా వెళ్లి డెలివరీ చేస్తామని చెప్పారు. బీంరావు తాను రెండేళ్ల వయసులో చూపుకోల్పోగా, భార్య శోభాకు ఒక చేయి సరిగా లేదు. అయినా ఇరువరు ఎంతో అన్యోన్యంగా ఉంటామని చెప్పారు. రోజువారీ పనులను ఎలా ఇరువురు చకచక చేసుకోగలరో కూడా వివరించారు. అంతేగాదు భీంరావు తనకు చూపులేకపోయినా తన భార్యకు వంట చేయడంలో సహకరిస్తారట. పైగా కూరగాయాలు కట్ చేయడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని భర్తపై ప్రశంసలు జల్లు కురిపిస్తోంది శోభా. ఆ జంటని వ్లాగర్ సిద్ధేష్ ప్రేమంటే ఏంటనీ అడగగా..వారు "ఒకరికొకరు" అని గొప్పగా సమాధానం ఇచ్చారు. యవతకు మీరిచ్చే సందేశం ఏంటని అడిగితే.." "కష్టపడితే దేన్నైనా పొందగలం". అలాగే నీ కోసం బతకడం కాదు ఇతరుల మేలు కోరితేనే జీవితానికి అసలైన అర్థం అని చెప్పారు". చివరిగా వ్లాగర్ మీకు ఏదైనా కావాలా అని అడగగా..ఒక స్టాల్ ఉంటే బాగుండునని, ఇంతలా నిలబడాల్సిన శ్రమ ఉండదని నవ్వుతూ చెబుతారు ఆ దంపతులు. ఈ వీడియో నెటిజన్లను కదలించింది. ప్రేమకు అసలైన నిర్వచనం ఆ దంపతులు అని ప్రశంసిస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: ఏజ్లో సెంచరీ కొట్టిన మరో బామ్మ..హెల్త్ సీక్రెట్ ఏంటంటే..) -
బర్గర్లు టేస్టీగా ఉండటానికి కారణం ఇదా..!
అమెరికాలోని ఓ రెస్టరెంట్ వందేళ్లుగా ఒకే వంటనూనెను మళ్లీ మళ్లీ వాడి బర్గర్స్ను తయారుచేస్తోంది. పైగా ఇదే తమ అసలు రహస్యమంటూ ప్రచారం కూడా చేస్తోంది. అమెరికాలోని మెంఫిస్ పట్టణంలో ‘డయ్యర్స్ బర్గర్స్’ రెస్టరెంట్ రుచికరమైన బర్గర్స్కు ఫేమస్. 1912లో ఎల్మెర్ డాక్ దీనిని స్థాపించాడు. ఒకరోజు అతను పాన్లోని నూనెను మార్చడం మర్చిపోయి, తర్వాతి రోజు అలాగే బర్గర్ తయారు చేశాడు. ఆ బర్గర్ తీసుకున్న వ్యక్తి ‘నా జీవితంలో నేను తిన్న రుచికరమైన బర్గర్ ఇదే!’ అని చెప్పడంతో డాక్ అప్పటి నుంచి ఆ నూనెను మార్చలేదు. అవసరానికి తగ్గట్టుగా దానికి మరింత నూనెను కలుపుతూ అలాగే వాడుతున్నాడు. గత వందేళ్లుగా ఇలాగే చేస్తున్నట్లు ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో డాక్ కుమారుడు రాబర్ట్ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్గా మారింది. కొంతమంది ఇదంతా అబద్ధమని, అసలు రహస్య పదార్థం వేరే ఉందని చెబుతుంటే, మరికొందరు దీనిని నమ్మి, బర్గర్ను ప్యాక్ చేయడానికి ముందు ఆ నూనెలో మరోసారి ముంచి డబుల్ డిప్ బర్గన్ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. ఏది ఏమైనా డయ్యర్స్ బర్గర్స్ ఎంతో రుచికరంగా ఉంటాయని అక్కడి వారందరూ ఒప్పుకుంటారు.(చదవండి: కృత్రిమ మేధాజాలం వంటింట్లో మయాజాలం -
గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది..!
భారతీయ వివాహాలు అంటేనే లగ్జరీగా ఉంటాయి. ఖర్చులు, వేస్ట్ రెండూ అధికంగానే ఉంటాయి. పెళ్లి అనంగానే డెకరేషన్ దగ్గర నుంచి భోజనంలో పెట్టే యూజ్ అండ్ త్రో ప్లేట్లు,గ్లాస్లు, వడ్డించే భోజనం వరకు ఎంత చెత్త వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేవిధంగా వృధా కూడా చేస్తుంటాం. అవన్నీ పర్యావరణానికి నష్టమే. ముఖ్యంగా రిటర్న్ గిఫ్ట్ల పేరుతో ఇచ్చే బహుమతులు.. ప్యాకే చేసే పాలిథిన్ కవర్లు వంటి చెత్త ఎంతో వస్తుంది. ఇలా వాటన్నింటికీ చెక్పెట్టేలా పర్యావరణమే పరవశించి దీవించేలా వివాహం చేసుకుంది ఓ జంట. వారెవ్వా వెడ్డింగ్ అంటే ఇది కదా..! అని అంతా అనుకునేలా పర్యావరణ స్ప్రుహ కలిగించేలా పెళ్లి చేసుకుంది. మర్చంట్ నేవీలో చీఫ్ ఆఫీసర్ అశ్విన్ మాల్వాడే అతని భార్య, మార్కెటింగ్ ప్రొఫెషనల్ నుపుర్ అగర్వాల్ జీరో వేస్ట్ వెడ్డింగ్తో ఒక్కటయ్యారు. అందరిలో పర్యావరణం పట్ల బాధ్యతతో వ్యవహరించాలనే ఆలోచనకు నాందిపలికేలా సరికొత్త విధంగా వివాహం చేసుకున్నారు. ముంబైలోని వెర్సోవా బీచ్లో బీచ్ క్లీనప్ డ్రైవ్ కారణంగా.. ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా తొలిసారిగా కలుసుకున్న ఈ ఇద్దరు తమ అభిరుచులు కూడా ఒక్కటే కావడంతో వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. తమ అభిరుచికి అనుగుణంగా తమ వివాహం పర్యావరణహితంగా ఉండేలా ప్లాన్ చేశారు. అలానే తమ వెడ్డింగ్ డెకరేషన్లో మొత్తం పూలు, ఆకుపచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఊరేగింపులకు కర్బన ఉద్గారాలు తగ్గించేలా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే భోజనాల్లో మిగిలిపోయిన ఆహారం పేదలకు పంపిణీ చేశారు. దీంతోపాటు వారి పెళ్లిలో వచ్చిన వ్యర్థాలను కంపోస్ట్ చేయడమే గాక ప్రతిగా సుమారు 300కు పైగా చెట్లను నాటారు. పర్యావరణ స్ప్రుహతో ఈ జంట చేసుకున్న వివాహం అందిరికీ స్ఫూర్తిగా నిలిచింది. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఈ ఏడాది తిరుగులేదు అనేలా సంతోషభరితంగా సాగిపోవాలంటే..!) -
న్యూ ఇయర్ ట్రెండ్..ఈ రాత్రికి '12 గ్రేప్స్' ట్రై చేసి చూస్తారా..!
ప్రపంచమంతా కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంబరాలకు సిద్ధమవుతోంది. కొన్ని దేశాలు కొత్త ఏడాదికి ఆహ్వానం పలికేశాయి కూడా. అయితే న్యూ ఇయర్ రాగానే మొదటగా ఈ పని చేయాలి, ఇలా ఉండాలంటూ రిజల్యూషన్స్ పనిలో పడ్డారు కొందరు. నెట్టింట కూడా ఈ చర్చే. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలకడం కోసం 12 ద్రాక్ష పండ్లను సిద్ధం చేసుకోండి అంటూ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఏంటిది వీటిని తింటే మంచి జరుగుతుందా? నిజమేనా అంటే..న్యూ ఇయర్(New Year)కి స్వాగతం పలుకుతూ..అర్థరాత్రి(Midnight) 12 ద్రాక్ష పండ్లు(12 grapes) తినడం అనేది స్పానిష్ సంప్రదాయం. వాళ్లు ఇలా తినడం వల్ల రాబోయే ఏడాదిలో అదృష్టాన్ని ప్రేమను పొందుతారనేది వారి నమ్మకం. శాస్త్రీయంగా ఇది నిజం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు గానీ.. రానున్న కొత్త ఏడాది నేపథ్యంలో ఈ ఆచారం తెగ వైరల్ అవుతోంది సోషల్ డియాలో. ముఖ్యంగా మహిళలు ఈ ఆచారాన్ని పాటించేందుకు రెడీ అవుతున్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేగాదు ఏడాదిలో అదృష్టాన్ని, ప్రేమను పొందేందుకు ఇది తప్పక ట్రై చేయండి అని పోస్టుల వెల్లువెత్తాయి. అంతేగాదు ఈ కొత్త ఏడాది 2025లో కొత్త భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు లేదా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా 12 గ్రేప్స్ తినండి అంటూ ఓ ట్రెండ్ ఊపందుకుంది. 12 పండ్లే ఎందుకంటే..ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమే కాదు, స్పానిష్ సంప్రదాయంలో భాగం కూడా. దీన్ని "లాస్ డోస్ ఉవాస్ డి లా సూర్టే" అని పిలుస్తారు. దీని అర్థం '12 ద్రాక్షల అదృష్టం' అట. ఇలా ద్రాక్షలు తినే సంప్రదాయ 1800ల చివరలో ప్రారంభమైందట. అయితే ఇప్పుడు పాప్ కల్చర్లో భాగంగా మన దేశంలో కూడా ఈ ఆచారం ట్రెండ్ అవుతోంది. ఇక్కడ 12 ద్రాక్షల్లో ఒక్కొక్కటి కొత్త ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయి. ఇలా ఈ పన్నెండు తింటే.. ఏడాదంతా జీవితం సంతోషంగా సాగిపోతుందనేది వారి నమ్మకం. విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ట్రెండ్పై తమ అనుభవాలను కూడా చెప్పేస్తూ ఊదరగొట్టేస్తున్నారు. దీంతో అందరూ ఈ ట్రెండ్ని అడాప్ట్ చేసుకునేలా పడ్డారు. నిజానికి ఇలా చేస్తే మంచి జరుగుతుందో లేదో తెలియదు గానీ తేలికపాటి పండ్లే కాబట్టి నిరంభ్యంతరంగా ప్రయత్నించొచ్చు. కానీ చలికాలం కాబట్టి రాత్రి టైంలో అలా తింటే ఆరోగ్య పరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏ ఆచారమైన మన నమ్మకాల నుంచే వస్తాయి. హాని కలిగించని ఫన్నీ నమ్మకాలతో ఈ కొత్త ఏడాదిని సంతోషభరితంగా సెలబ్రెట్ చేసుకుని ఖుషీగా ఉందాం. (చదవండి: నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!) -
36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
‘ఛాయ్.. ఛాయ్.. టీ కావాలా మేడమ్.. సర్ ఛాయ్ ఇమ్మంటారా?’ సాధారణంగా బస్సు స్టాప్లోనో లేదా రైళ్లలోనూ ఇలా టీ సర్వ్ చేయడం చూస్తూంటారు. కానీ ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో టీ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది.. విమానంలో టీ సర్వ్ చేసి ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఈమేరకు తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి లేచి ‘ఛాయ్.. ఛాయ్..’ అంటు తోటి ప్రయాణికులకు టీ సర్వ్ చేశాడు. అందుకు మరో ప్రయాణికుడు సాయం చేశాడు. డిస్పోజబుల్ గ్లాస్లో తోటి ప్యాసింజర్లకు టీను అందిస్తున్నట్లు తీసిన వీడియోను ఎయిర్క్రూ అనే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Aviation/CabinCrew's HUB 🇮🇳 (@aircrew.in)ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..‘ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు టీ ఎలా తీసుకుళ్లుంటారు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఒక భారతీయుడు మాత్రమే టీని ఎప్పుడైనా ఎక్కడైనా సర్వ్ చేయగలడు’ అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. -
భార్యకు రోహిత్ శర్మ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్
-
సినిమాని తలపించే ప్రేమకథ..వింటే కన్నీళ్లు ఆగవు..!
ఎన్నో ప్రేమ కథలు చూశాం. వాటిలో కొన్ని మాత్రం విషాదంగా ముగిసిపోతే..మరికొన్ని కన్నీళ్లు తెప్పించేస్తాయి. అలాంటి భావోద్వేగపు గాథే ఈ ప్రేమ జంట కథ. సుఖాల్లో ఉన్నప్పుడు ఉండే ప్రేమ.. కష్టాల్లో కనుమరుగైపోతుందంటారు పెద్దలు. కానీ ఈ జంట మాత్రం కష్టాల్లో అంతకు మించి..ప్రేమ ఉందని ప్రూవ్ చేసింది. విధికే కన్నుకుట్టి వారి ప్రేమను పరీక్షించాలనుకుందో, కబళించాలనుకుందో గానీ కేన్సర్ మహమ్మారి వారి ప్రేమను దూరం చేయాలనుకుంది. కానీ ఈ నేపాలీ జంట తమ ప్రేమ అత్యంత గొప్పదని నిరూపించుకుని కష్టమే కుంగిపోయేలా చేశారు.సృజన, బిబేక్ సుబేదిలు తమ జీవితాన్ని డాక్యుమెంట్ రూపంలో ఇన్స్టాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ జంట ప్రేమకథ అందరి దృష్టిని ఆకర్షించింది. బిబేక్ కేన్సర్తో భాదపడుతున్నాడు. కేన్సర్ ఫస్ట్ స్టేజ్ నుంచి ఫోర్త్స్టేజ్ వరకు తామెలా కష్టాలు పడుతుంది తెలియజేసింది. చెప్పాలంటే నెటిజన్లంతా సృజన కోసమైనా.. అతడు మృత్యవుని జయిస్తే బావుండనని కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. బిబేక్ ఆ మహమ్మారి కారణంగా తనకెంతో ఇష్టమైన భార్యను కూడా గుర్తించలేని స్థాయికి వచ్చేశాడు సృజన పోస్ట్ చేసిన చివరి రీల్లో. అంతేగాదు ఇన్స్టాలో బిబెక్ 32వ పుట్టిన రోజుని సెలబ్రెట్ చేసిన విధానం అందర్నీ కంటతడి పెట్టిస్తుంది. ఎందుకంటే అప్పటికే అతడి పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. ఏ పరిస్థితిలోనూ అతడి చేతిని వీడక ఎంతో ప్రేమగా చూసుకున్న సృజన తీరు అందరి మనసులను తాకింది. సృజన అధికారికంగా అతడు చనిపోయాడని ప్రకటించనప్పటికీ..నిశబ్ద వాతావరణంతో పరోక్షంగా బిబేక్ ఇక లేరనే విషయం వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి సృజన నుంచి ఎలాంటి వీడియో పోస్ట్ కాకపోయినా.. నెటిజన్లంతా సృజనకు ధైర్యం చెప్పడమేగాక, బిబేక్ లేకపోయినా.. మీప్రేమ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇలాంటి కాలంలో ఇంత గొప్ప ప్రేమలు కూడా ఉన్నాయని చూపించారంటూ సృజనను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Crzana Subedi (@crzana_subedi_) (చదవండి: చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..) -
నిహారిక బర్త్డే సెలబ్రేషన్స్ .. దగ్గరుండి కేక్ కట్ చేయించిన అన్నావదిన (ఫోటోలు)
-
‘మిత్రమా.. మనకు అన్యాయం జరిగింది!’
బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి విదేశాల్లో దాక్కొన్న బిలియనీర్ విజయ్ మాల్యా.. లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్ మాల్యాకు ఇవాళ లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించారు. ఈ క్రమంలో చర్చ తాజా పరిణామాలపైకి దారి మళ్లింది.‘‘నా ప్రియమైన మిత్రుడు విజయ్మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనిద్దరమూ అది చూశాం. అయ్యిందేదో అయ్యింది.. రాబోయే సంవత్సరం నీదే మిత్రమా. ప్రేమ.. చిరునవ్వులతో సంతోషంగా ఉండూ.. అంటూ పోస్ట్ చేశారు. దానికి విజయ్ మాల్యాస్పందిస్తూ.. థ్యాంక్యూ మై డియరెస్ట్ ఫ్రెండ్. దేశానికి మనం ఎంతో చేశాం.. అయినా మనకు అన్యాయమే జరిగింది అనే అర్థం వచ్చేలా బదులిచ్చారు.Wishing you my friend #vijaymallya a very #happybirthday - life sure has its ups and downs we have both seen it. This too shall pass. May the year ahead be your year. And you are surrounded by love and laughter. Big big hug 🤗🥰🙏🏽@TheVijayMallya pic.twitter.com/ca5FyMFnqr— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024ఇదిలా ఉంటే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఈ ఏడాది ఎగవేతదారుల నుంచి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేస్తున్నామని.. ఈ ఏడాది రూ.22,280 కోట్లు రాబట్టామని.. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రకటనపైనా విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. అలాగే సీబీఐ తన మీద పెట్టిన కేసు గురించి.. జప్తు గురించి మరో ట్వీట్ చేశారు. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి కూడా లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్డే శుభాకాంక్షలు’’ అంటూ మరో పోస్ట్ చేశారు. ఇక ఈ ఇద్దరి మధ్య సంభాషణపై నెటిజన్లు జోకులేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ మాల్యా తీరుపై మండిపడుతున్నారు.This too shall pass my friend @TheVijayMallya and wish a very happy birthday today my friend https://t.co/HYJYKe1mcx— Lalit Kumar Modi (@LalitKModi) December 18, 2024 Government and my many critics say that I have CBI criminal cases to answer. What criminal cases filed by CBI ? Never borrowed a single rupee, never stole, but as guarantor of KFA debt I am accused by CBI together with many others including IDBI Bank officials of fraudulently…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024Whatever I have stated about my liabilities as guarantor of KFA loans is legally verifiable. Yet more than Rs 8000 crores have been recovered from me over and above the judgement debt. Will anyone, including those who freely abuse me, stand up and question this blatant injustice…— Vijay Mallya (@TheVijayMallya) December 18, 2024 ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్లో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఇటీవల ఓ పాడ్కాస్ట్లో లలిత్ మోదీ వెల్లడించారు. ఇక.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వివిధ కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ చర్యలు తీసుకోవడంతో నష్టపోయిన బ్యాంకులు కొంత ఉపశమనం పొందాయన్నారామె. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులను విక్రయించి వెయ్యి కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి మరో రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసి వేలం వేయబోతున్నట్లు ప్రకటించారామె. -
‘సజ్జనార్ సార్.. ఇలాంటి వారిని ఏం చేయలేమా?’
తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగానే కాదు.. పోలీస్ అధికారికానూ సోషల్ మీడియాలో తన వంతు బాధ్యతను నిర్వహిస్తుంటారు. ఆలోచింపజేసే కంటెంట్ను పోస్ట్ చేస్తూ.. అదే సమయంలో కొన్ని విషయాలపై జనాల్ని అప్రమత్తం చేస్తుంటారు కూడా. తాజాగా.. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు ఆయన కామెంట్ సెక్షన్లోనే చర్చ జరుపుతున్నారు.సజ్జనార్ ఓ వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశం ఉంచారు. అందులో.. ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చెబుతూ.. అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఆ వీడియోను పోస్ట్ చేసిన సజ్జనార్.. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండి అని మెసేజ్ ఇచ్చారు. అయితే.. ఆ వీడియోపై పలువురు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. ఇలాంటి వాళ్లను అరెస్ట్ చేయలేమా? అని..చూశారా.. ఎంతకు తెగిస్తున్నారో...!! అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి… pic.twitter.com/ziiiYKZqkc— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 19, 2024ఈ వీడియోలో కుర్రాడు మాత్రమే కాదని.. ఇలాంటి వాళ్లు బోలెడు మంది ఉన్నారని.. అలాంటి వారిని అరెస్ట్ చేయలేమా? అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాగే.. ఇలాంటి వారిని స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపేయాలని, గట్టి చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి.. ముందు ఆ వీడియోలోని వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ట్యాగ్ చేశాడు. అయితే ఆ కామెంట్లకు సజ్జనార్ నుంచి ఏదైనా బదులు వస్తే బాగుండు అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. తెలంగాణ, ఆ మాటకొస్తే.. దేశంలో ఆన్లైన్ జూదాలకు బలైపోతున్నవాళ్లు ఎందరో. అలాంటి ముఠాలను చట్టాలు సైతం కట్టడి చేయలేకపోతున్నాయి. మరోవైపు వాటిని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకునేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పేరిట సోషల్ మీడియా ఫిగర్లు, యూట్యూబర్లు, కొందరు సెలబ్రిటీలు కూడా వీటిని బహిరంగంగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయాలని, వాటని ప్రమోట్ చేసేవాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు బలంగా కోరుకుంటున్నారు.ఇదీ చదవండి: పస్రా పట్టింపు లేదా? నగరంలో కొత్త సంస్కృతి! -
కాబోయే భర్తతో కలిసి పీవీ సింధు డ్యాన్స్ ప్రాక్టీస్(ఫొటోలు)
-
అతుల్ సుభాష్కు బిల్లు నివాళి..!
అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించింది. చట్టాలన్ని ఆడవాళ్లకేనా అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. భార్య కుటుంబం పెడుతున్న తప్పుడు కేసులతో ఎంతోమంది అతుల్ సుభాష్ లాంటి భర్తలు వేధింపులకు గురవ్వుతున్నారనే వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన వైవాహిక చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని బాధిత భర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పాలంటే ఆ టెక్కీ మరణం చర్చనీయాంసంగా మారడమే గాక బీటలు వారిపోతున్న వైవాహిక వ్యవస్థ, చట్టంలోని లోసుగులను లేవనెత్తింది. ప్రస్తుతంఈ విషయమే హాట్టాపిక్ మారింది. ఈ తరుణంలో ఢిల్లీ రెస్టారెంట్ చెందిన జంబోకింగ్ ఫ్రాంచైజీ ఆ టెక్కీ అతుల్కి వినూత్నంగా నివాళి ఆర్పించడం నెట్టింట వైరల్గా మారింది. హౌజ్ ఖాస్ అనే గ్రామంలోని జంబోకింగ్ ఫ్రాంచైజీ అవుట్లెట్కి ఓ వ్యక్తి వెళ్లాడు. అతను అక్కడ తినేసి తిరిగి వెళ్లేటప్పడూ అందుకున్న రసీదు అతడిని ఆకర్షించింది. అందులో "జస్టీస్ ఫర్ అతుల్ సుభాష్ అనే హ్యాష్ ట్యాగ్తో అతడి ఆత్మహత్యకు తాము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అతని జీవితం అందిరిలానే అత్యంత ముఖ్యమైనది. మీకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం." అని రాసి ఉంది. అతడు వెంటనే ఆ రసీదుని ఫోటో తీసి తన స్నేహితుడికి పంపండంతో రెడ్డిట్లో వైరల్గా మారింది. ఆ జంబోకింగ్ ఫ్రాంచైజీని స్వామి సమర్థ్ ఫుడ్స్ నడుపుతోంది. అందర్ని కదలించిన ఆ టెక్కీ ఆవేదనను సహృద్భావంతో అర్థం చేసుకుని ఇలా వినూత్నంగా నివాళులర్నించడమే గాక అతడికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ.. అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది. పైగా అందుకోసం ఇలా రసీదుని ఉపయోగించుకోవడమనేది ప్రశంసనీయం. అంతేగాదు సదరు వ్యక్తి ఈ విషయమై జంబోకింగ్ ఫ్రాంచైజీ యజమానిని ప్రశ్నించగా.. దానికి ఆ వ్యాపారి ప్రతీది వ్యాపారం కాదని తన దైన శైలి బదులిచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు. నెటిజన్లు కూడా.. ఆ వ్యాపారి విశాల హృదయాన్ని ప్రశంసించగా, ఇలా జొమాటా, స్విగ్గీలు కూడా చెయ్యొచు గదా అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: గట్ హెల్త్పై దృష్టి పెడదాం..ఆరోగ్యంగా ఉందాం..!) -
Wah Ustad Wah: జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్
‘‘ఎంతటి కళాకారుడైనా.. ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగానే ఉండాలి’’.. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పే మాట ఇది. మూడేళ్ల వయసుకే తబలాపై చిట్టి చేతులేసి.. ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి.. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు.. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సంగీత ప్రయాణం ముగిసింది. జాకీర్ హుస్సేన్ మరణంతో.. ఆయన జ్ఞాపకాలను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఆయన నేపథ్యం, ఆయన పరిచయాలు, ఆసక్తికర ఘటనలు.. ఇలా ఎన్నింటినో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ తబలా విద్వాంసుడు.. చివరి పోస్టుగా ‘అద్భుతమైన క్షణం’ ఉంచారు. View this post on Instagram A post shared by Zakir Hussain (@zakirhq9)ఈ అక్టోబర్లో అమెరికాలో ఉన్న ఆయన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రకృతి వీడియోను స్వయంగా చిత్రీకరించి షేర్ చేశారాయన. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది.ఓ గురువు నేర్పడం కాదు.. ఓ విద్యార్థి నేర్చుకోవడం అనేది ముఖ్యం. గురువును ఆ విద్యార్థి నేర్పే విధంగా ఇన్స్పైర్ చేయాలి. అంటూ ఆయన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే.. నా మొదటి గురువు నా తండ్రే. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. ఓ కళాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు.గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామన్నారు. వారి మాటలు నాలో స్ఫూర్తినింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను.. అని జాకీర్ హుస్సేన్ మాటలు ‘‘వహ్ ఉస్తాద్ వహ్..’’ అని నెటిజన్లతో అనిపిస్తున్నాయి.క్లిక్ చేయండి: ఇక సెలవు మిత్రమా.. చితి వద్ద జాకీర్ హుస్సేన్ కన్నీళ్లు -
పేదరికం నుంచి భారత్ బయటపడాలంటే..: నారాయణమూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. పని గంటలపై తన వాదనను మరోసారి సమర్థించుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాల్సిందేనని కుండ బద్ధలు కొడుతూ.. లేకుంటే పేదరికం నుంచి ఎలా బయటపడగలమని? ప్రశ్నించారాయన. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ..‘‘ఇన్ఫోసిస్ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి... వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?. భవిష్యత్తు కోసం మనమంతా కలసికట్టుగా బాధ్యత తీసుకోవాలి’’ అని నారాయణమూర్తి పిలుపు ఇచ్చారు.ఆ మధ్య ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్’ అనే పాడ్కాస్ట్ తొలి ఎపిసోడ్లో నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్తలు, టెకీలు స్పందిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తపర్చారు. పలు దేశాల్లో పని గంటలపై చర్చ ఆ సమయంలో జరిగింది. అంతేకాదు.. ఇటీవల జపాన్లో వారానికి నాలుగు రోజుల పని దినాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. నారాయణమూర్తిని నెట్టింట ట్రోల్ చేశారు కూడా.నారాయణమూర్తి ఏమన్నారంటే..‘ది రికార్డ్’ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువని అన్నారు. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే! -
లేడీ లవ్తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
కేజ్రీవాల్ తలవంచడు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పుష్ప–2 సినిమా మేనియా నడుస్తోంది. అదిప్పుడు రాజకీయాలనూ ప్రభావితం చేస్తోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు ‘తగ్గేదే లే’అంటున్నారు. తాజాగా ఆయన పుష్ప అవతారమెత్తారు. ‘కేజ్రీవాల్.. ఝుకేగా నహీ’అనే ట్యాగ్ లైన్ తో ఆప్ రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కేజ్రీవాల్ కుంభకోణాల సాలీడు గూడు’అంటూ బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్కు ఆప్ ఇచ్చిన కౌంటర్ ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది. ఎన్నికలకు రెండు నెలల ముందే బీజేపీ వర్సెస్ ఆప్ పోస్టర్ వార్ చలి కాలంలోనూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బీజేపీ పోస్టర్లో ఏముంది?ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మోసాల కు పాల్పడుతోందంటూ బీజేపీ శనివారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీ నర్ కేజ్రీవాల్ను హైలైట్ చేసింది. మద్యం విధానంలో కుంభకోణం ఆరోపణలు, మొహల్లా క్లినిక్, హవాలా, భద్రత, రేషన్, పానిక్ బటన్, శీష్ మహల్, మందులు, ఢిల్లీ జల్ బోర్డ్, క్లాస్రూమ్, సీసీటీవీ స్కామ్లను ప్రస్తావిస్తూ. ’కేజ్రీవాల్ కుంభకోణాల సాలెగూడు’అని ట్యాగ్లైన్ పెట్టింది.కేజ్రీవాల్ పుష్ప అవతార్బీజేపీ పోస్టర్కు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ.. పాన్ ఇండియా సినిమా పుష్ప రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. పుష్ప పోస్టర్లో హీరో అల్లు అర్జున్ ముఖాన్ని తీసేసి ఆ స్థానంలో కేజ్రీవా ల్ ఫేస్ పెట్టారు. ఒక చేతిలో ఆ పార్టీ గుర్తు చీపురు పట్టుకున్నట్లు చూపించారు. ’కేజ్రీవా ల్ ఝుకేగా నహీ (కేజ్రీవాల్ తలవంచడు)’ టైటిల్ పెట్టారు. పోస్టర్ కింద ‘కేజ్రీవాల్ ఫోర్త్ టర్మ్ కమింగ్ సూన్’అంటూ ట్యాగ్లైన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ ఇదే పోస్టర్ను ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. 1998 నుంచి బీజేపీ ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉంది. 2015 నుంచి ఇక్కడ ఆప్ సొంతంగా అధికారంలో ఉంది. -
మల్లిఖార్జుని సన్నిధిలో నూతన దంపతులు చై- శోభిత (ఫోటోలు)
-
పుష్ప రాజ్ మేనియా.. టీచర్కి షాక్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా? -
అడల్ట్ సినిమాతో మెప్పించిన 'చంద్రికా రవి' సిల్క్ స్మితగా వచ్చేస్తుంది (ఫోటోలు)
-
77 ఏళ్ల నాటి కేకు ముక్క..!
బ్రిటిష్ రాణి ఎలిజబెత్ పెళ్లి కేకు ముక్క ఇది. ఎలిజబెత్ పెళ్లి 1947 నవంబర్ 20న జరిగింది. ఆ వేడుక కోసం తయారు చేసిన కేకులో ఒక ముక్కను గడచిన డెబ్భయి ఏడేళ్లుగా పదిలంగా భద్రపరచి ఉంచారు. బ్రిటిష్ రాచదంపతులు అప్పట్లో ఈ కేకు ముక్కను ఒక పెట్టెలో ఉంచి, ఎడిన్బర్గ్లోని హోలీరూడ్ హౌస్ను పర్యవేక్షించే మారియన్ పోల్సన్కు కానుకగా పంపారు. నాటి నుంచి పెట్టెతో సహా ఈ కేకు ముక్కను భద్రంగా దాచారు. బ్రిటిష్ రాచదంపతుల నుంచి ఈ కేకు ముక్కలు అప్పట్లో మరికొందరికి కూడా కానుకగా అందాయి. వాటిలో కొన్నింటిని దశాబ్దాల పాటు దాచి, తర్వాతి కాలంలో వేలంలో అమ్ముకున్నారు. ఇటీవల ఈ కేకు ముక్క కూడా వేలానికి వచ్చింది. రీమన్ డెన్సీ వేలంశాల నిర్వహించిన వేలంలో ఈ కేకు ముక్కకు 2,200 పౌండ్లు (సుమారు రూ.2.40 లక్షలు) ధరకు అమ్ముడుపోయింది. (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!) -
స్లిమ్గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!
చాలామంది వెయిట్ లాస్ జర్నీలో అంత ఈజీగా విజయవంతం కాలేరు. ఎన్నో డైట్లు, వర్కౌట్ల అనంతరం స్లిమ్గా మారతారు. అయితే కొందరు మాత్రం ఏదో మాయ చేసినట్లుగా తక్కువ వ్యవధిలోనే స్లిమ్గా అయ్యిపోతారు. అంత సింపుల్గా ఎలా బరువు తగ్గించుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతుంటే..వాళ్లు మాత్రం తాము ఏం చేయలేదని ఇంట్లో వండిన భోజనమే తిన్నమని సింపుల్గా చెబుతారు. అలాంటి కోవకు చెందిందే ఈ పంజాబీ నటి, మోడల్, గాయని అయిన హిమాన్షి ఖురానా. ఆమె వెయిట్లాస్ స్టోరీ తెలిస్తే కంగుతింటారు. ఆమె ఏం చేసిందంటే..హిమాన్షి ఖురానా ఒక హెల్త్ ప్రోగ్రామ్లో తన వెయిట్లాస్ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. మానసిక ఆర్యోగానికి ప్రాధాన్యత ఇస్తేనే సత్ఫలితాలను పొందగలమని నమ్మకంగా చెబుతుంది. అయితే తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి జిమ్కి వెళ్లలేదని తెలిపింది. వారానికి రెండు సార్లు మాత్రం పైలేట్స్ వర్కౌట్లు తప్పనిసరిగా చేస్తానని అంటోంది. సాధారణ ఆహారంతోనే తాను 11 కేజీల వరకు బరువు తగ్గినట్లు వెల్లడించింది. అలాగే ఇష్టమైన ఆహారాన్ని ఎప్పటికీ వదులుకోనని చెబుతోంది. ఇంట్లో వండేవన్నీ తింటుందట. ముఖ్యంగా పరాఠాలంటే మహా ఇష్టమట. ప్రతిరోజు అవి తినకుండా రోజు ప్రారంభమవ్వదని అంటోంది. అయితే ఇటీవల బరువు తగ్గడం అనేది ఓ ట్రెండ్గా మారిందని అందుకోసం అనారోగ్యకరమైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. ఇది అస్సలు సరైనది కాదని అంటోంది. బరువు తగ్గడం కంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండటం ప్రధానం అని నొక్కి చెప్పింది. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తే ఆటోమేటిగ్గా బరువు తగ్గడం జరుగుతుందని అంటోంది. అలాగే ఒత్తిడి, ఆందోళన ఎలా శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో కూడా వివరించింది. ప్రస్తుత పోటీ వాతావరణంలో పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు దారితీసేలా ఒత్తిడికి గురవ్వుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారిస్తే.. మొత్తం ఆరోగ్యం తోపాటు అధిక బరువు సమస్యకు కూడా సులభంగా చెక్ పెట్టొచ్చని చాలా సింపుల్గా చెప్పేసింది నటి, మోడల్ హిమాన్షి ఖురానా. View this post on Instagram A post shared by 𝓗𝓲𝓶𝓪𝓷𝓼𝓱𝓲 𝓴𝓱𝓾𝓻𝓪𝓷𝓪 (@himanshian_) (చదవండి: నీతా అంబానీకి అత్యంత ఇష్టమైన చీర! ఏకంగా 900 ఏళ్ల నాటి..!) -
ఇదేం మేకప్ సామీ..కన్నీళ్లు పెట్టించేస్తున్నారుగా!
అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్ల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు. ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది. అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. (చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
కూతుళ్లంతా అమ్మ చీర కట్టుకుంటుంటే..ఆమె మాత్రం నాన్న..!
అబ్బాయిలు నాన్న షర్ట్ వేసుకుని ‘లేని మీసాలను’ మెలి తిప్పటం, అమ్మాయిలు అమ్మ చీర కట్టుకుని ‘మోయలేని పెద్దరికాన్ని’ అభినయించటం... ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ఎదుగుతున్న పిల్లలకు అవి సరదాలు. పెద్దలకు తమ టీనేజ్ని గుర్తుకు తెచ్చే మురిపాలు. పెద్దయ్యాక బాయ్స్ నాన్న ప్యాంటూ షర్టు వేసుకోవటం కనిపించదు కానీ, గర్ల్స్ అమ్మ చీరను కట్టుకుని ఏ ఫంక్షన్లోనో బంధు మిత్రులకు సాక్షాత్కరిస్తుంటారు. వధువులు కూడా కొందరు అపురూపంగా దాచి ఉంచిన అమ్మ పెళ్లి నాటి చీరను ధరించి, పీటల మీద కూర్చుంటారు. అదొక సెంటిమెంట్ కూతుళ్లకు. కానీ నివేషి కాస్త డిఫరెంట్గా ఉంది! బహుశా.. నాన్నంటే అఫెక్షన్, అమ్మంటే క్రమశిక్షణలా ఉంది ఈ అమ్మాయికి. తనేం చేసిందో చూడండి! పెళ్లినాటి నాన్న సూట్ను బయటికి తీయించి, చిన్న చిన్న మార్పులు చేసి తను తొడుక్కుంది. భారీ బ్రౌన్ టూపీస్ పెళ్లి సూట్లో ఉన్న నాన్న ఫొటోను, ఆ సూట్ను వేసుకున్న తన ఫొటోను కలిపి ఆ వీడియో క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. ‘‘అమ్మాయిలు తమ తల్లి పెళ్లి చీరను కట్టుకుంటారు. నేను మా నాన్న పెళ్లి సూట్ను వేసుకున్నాను’’ అని ఆ క్లిప్కు క్యాప్షన్ పెట్టింది. ఇకనేం, లైకుల మీద లైకులు. నివేషి డిజిటల్ క్రియేటర్. తండ్రి సూట్ను తనకు సరిపడేలా మార్చటంలోని ఆమె సృజనాత్మక నైపుణ్యాన్ని చూసి, ‘‘మీ కోసమే మీ నాన్న తన పెళ్లి సూట్ను ఎంపిక చేసుకున్నట్లు న్నారు..’’ అని ఒక నెటిజెన్ ప్రశంసించారు. మరొకరు.. ‘‘మీరు మీ నాన్నను గర్వపడేలా చేశారు’’ అని కామెంట్ పెట్టారు. చలువ కళ్లద్దాలు ధరించి, సూటులో రెండు చేతులు పెట్టుకుని ఠీవిగా నడిచి వెళుతున్న నివేషి రెట్రో స్టెయిల్ ఎవర్నీ చూపు తిప్పుకోనివ్వటం లేదు! View this post on Instagram A post shared by 𝑵𝒊𝒗𝒆𝒔𝒉𝒊 (@_niveshi) (చదవండి: -
వీధి వ్యాపారి కాస్త స్టార్ చాయ్వాలాగా మారి ఏకంగా ..!
ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్వాలా అంటే..?అతడే డాలీ చాయ్వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే. దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్తో ఫ్యాషన్ లుక్లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్గా సర్వ్ చేస్తాడు. అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్ల వరకు పలు ఈవెంట్లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్. View this post on Instagram A post shared by Dolly Ki Tapri Nagpur (@dolly_ki_tapri_nagpur) (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..) -
అంబానీ వారసుల గురించేనా?.. ఇలాంటి వారి గురించి కూడా తెలియాలి
ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ఓ వ్యక్తి చేసే ప్రయాణం కథాంశంగా రాబిన్ శర్మ రాసిన పుస్తకం The Monk Who Sold His Ferrari ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అదే చరిత్రలో.. గౌతమ బుద్ధుడు ఇలా రాజభోగాలను వదిలేసి సన్యాసం తీసుకున్నాడని చదువుకున్నాం. కానీ.. నిజ జీవితంలో ఇలా కోట్ల సంపదను వదిలేసి సన్యాసి జీవితం గడుపుతారా?. అయితే.. ఈ మోడ్రన్ డే సిద్ధార్థుడి కథ చదవాల్సిందే. శ్రీలంక- తమిళ సంతతికి చెందిన ఆనంద్ కృష్ణన్. మలేషియాలో బిలియనీర్. ఆ దేశ ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. సుమారు రూ. 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి. ఆయన ఒక్కగానొక్క కొడుకే పైన ఫొటోలో ఉన్న వెన్ అజన్ సరిపన్యో.👉మలేషియాలో మూడో అత్యంత సంపన్నుడిగా పేరున్న తండ్రిని.. ఆయనకున్న టెల్కాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాదనుకున్నారు అజన్ సరిపన్యో. ఒకానొక టైంలో సీఎస్కే టీంకు స్పాన్సర్ చేసిన ఎయిర్సెల్ కంపెనీకి ఓనర్ ఈయన తండ్రే.👉రెండు పదుల వయసొచ్చేదాకా రిచ్చెస్ట్ పర్సన్ కొడుకుగానే తన ఇద్దరు సోదరీమణులతో లండన్లో పెరిగాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలపై అనర్గళంగా పట్టు సాధించారు. ఇక్కడ మరో విషయం.. ఈయన తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్ థాయ్లాండ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తే. అయితే ఈ మూలాలే అతని జీవితాన్ని మార్చిపడేసింది.👉తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు థాయ్లాండ్ వెళ్లాడు అజన్ సరిపన్యో. వెళ్లేముందు ఆ ట్రిప్ సరదాగా సాగుతుందని భావించాడు. కానీ, అది అతని జీవితంలో ఊహించని మార్పు తెచ్చింది. అక్కడ ఆధ్యాత్మికత అతన్ని ఎంతగానో ఆకర్షించింది. ఇదే తన జీవిత పరమార్థం అనుకుని.. భోగభాగ్యాలను వదులుకుని సన్యాసం పుచ్చేసుకున్నాడతను.👉గౌతమబుద్ధుడి స్ఫూర్తితో అజన్ అవన్నీ వదులుకుని సన్యాసిగా మారిపోయి స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవ చేస్తున్నాడు. వేల కోట్ల సంపదలో ఈ ఆనందం దొరకదంటాడాయన. మయన్మార్-థాయ్లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ ఓ మఠాధిపతిగా ఉంటూనే.. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ అభినవ బుద్ధుడు.👉తన ఆస్తులన్నీ అజన్ సరిపన్యోకు అప్పగించాలనుకుని విశ్రాంతి తీసుకోవాలనుకుని భావించాడు ఆనంద్ కృష్ణన్. కానీ, అజన్ మాత్రం పెద్ద షాకే ఇచ్చాడు. ఆ నిర్ణయం బాధించేదే అయినా అజన్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఆ తండ్రి గౌరవించాడు. 👉తండ్రి బాటలో అడుగులు వేసి వ్యాపారరంగంలో రాణిస్తున్న అంబానీ వారసుల గురించే కాదు.. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగితేలుతున్న అజన్ గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియాల్సిందే కదా. -
ముద్దబంతిలా మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ.. (ఫొటోలు)
-
వాట్ ఏ ఆఫర్: డ్యాన్స్ చెయ్యి..కాఫీ తాగు..!
కొన్ని కేఫ్లు ప్రజలను సంతోష పెట్టేలా మంచి ఆఫర్లు అందిస్తాయి. అవి వినడానికి చూడటానికి చాలా వింతగా ఉంటాయి. కానీ ఈ కేఫ్ ఇచ్చిన ఆఫర్ మాత్రం సంతోషం తోపాటు మంచి రుచిని కూడా ఆస్వాదించేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ నెట్టింట తెగ వైరల్గా మారింది. యూఎస్లోని కేఫ్లోకి డ్యాన్స్ చేస్తూ.. ఎంటర్ అయ్యితే చాలు మంచి రుచికరమైన ఓ కప్పు కాఫీని సిప్ చెయ్యొచ్చు అంటూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది. అంతే జనాలంతా తమ టాలెంట్ని వెలికి తీసి మరీ మంచి మంచి స్టెప్పులతో అలరించారు. వృద్ధులు సైతం ఈ ఆఫర్ కోసం ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెలకోసారైనా..ఈ ఫన్ ఇనిషియేటివ్ని అందివ్వాలని కేఫ్ ఓనర్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా ఉదారంగా ఆలోచించే కేఫ్లు దొరకడం అత్యంత అరుదు. View this post on Instagram A post shared by Hope Rises (@hoperisesnetwork) (చదవండి: నాడు బెదిరింపులు, నిషేధానికి గురైన అమ్మాయి..నేడు ప్రపంచమే..!) -
బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్లో పెళ్లి
పని, పని పని.. కార్పొరేట్ కల్చర్లో ఇది ఎక్కువైంది. కార్యాలయాల్లో పని ఒత్తిడి.. ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలకు సైతం సరిగా లీవ్లు కూడా ఇవ్వని పరిస్థితి తలెత్తుతోంది. కానీ ఎంత పెద్ద ఉద్యోగమైన, ఎంత పెద్ద పదవిలో ఉన్న జీవితంలో జరిగే పెళ్లికి ప్రతి ఒక్కరూ తప్పక సెలవులు పెడతారు. అయితే టర్కీలో ఓ ఉద్యోగికి తన పెళ్లికి బాస్ లీవ్ ఇవ్వలేదు. దీంతో అతను వర్చువల్గా వివాహం చేసుకోవాలసి వచ్చింది.హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జంట ఆన్లైన్ వీడియో కాల్ సాక్షిగా ఒక్కటైయ్యారు. పెళ్లి కూతురు మండిలో.. పెళ్లి కొడుకు టర్కీలో ఉండి వీడియో కాల్లోనే పెళ్లి తంతు పూర్తి చేశారు. బిలాస్పూర్ చెందిన అద్నాన్ ముహమ్మద్ టర్కీలో పని చేస్తున్నాడు. స్వదేశానికి వచ్చి వివాహ చేసుకునేందుకు అతడు లీవ్ కోరగా.. కంపెనీ సెలవు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అతను వర్చువల్గా ముస్లిం మత సంప్రదాయ ప్రకారం వీడియోకాల్లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అంత హడావిడీగా పెళ్లి చేసుకోవడానికి కారణం.. వధువు తాత అనారోగ్యంతో ఉండటంతో ఆమెను త్వరగా వివాహం చేసుకోవాలని పట్టుబట్టినట్లు వరుడి కుటుంబ సభ్యులు తెలిపారు.ఆమె పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ నికాకు అంగీకరించారు. బిలాస్పూర్ నుంచి నవంబర్ 3న ఆదివారం మండికి చేరుకున్నారు. మండీలో నవంబర్ 4న (సోమవారం) వీడియో కాలంలో వారి వివాహం జరిగింది. ఖాజీ వారితో కలిసి ఖుబూల్ హై అని మూడుసార్లు అనిపించారు. ఇదిలా ఉండగా గతేడాది జూలైలో సిమ్లాలో మరో వ్యక్తి కూడా ఇలానే ఆన్ లైన్ పెళ్లి చేసుకున్నాడు. కోట్ఘర్కు చెందిన ఆశిష్ సింఘా, కులులోని భుంతర్కు చెందిన శివాని ఠాకూర్లు కొండచరియలు విరిగిపడటంతో టైంకు వారి పెళ్లింటికి చేరుకోలేక పోయారు. దీంతో వీడియో-కాన్ఫరెన్స్లో పెళ్లి చేశారు. -
బిర్యానీ-ఫ్లేవర్డ్ ఐస్క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా..?
ఐస్క్రీమ్ అంటే ఇష్టపడని వారెవరుంటారు. అయితే ఇప్పుడు వాటిలో రకరకాల ప్లేవర్లు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని టేస్ట్ బానే ఉన్నా చాలావరకు అంత బాగోవు. పండ్లు నుంచి స్వీట్స్తో తయారు చేసే ఎన్నో ఐస్క్రీంలు చూశాం కానీ ఇలాంటి ప్లేవర్డ్ ఐస్క్రీం మాత్రం చూసుండరు. అదికూడా అందరూ ఇష్టపడే బిర్యానీతో ఐస్క్రీం అంటే బాబోయ్ అనిపిస్తుంది కదూ..!. ఎలా ఉంటుందనే కదా డౌటు..?ఆకాశ్ మెహతా అనే సోషల్ మీడియా ఔత్సాహికుడు నెట్టింట ఒక రీల్ పోస్ట్ చేశాడు. అందుకోసం అని ఓ దుబాయ మాల్లోని ఐస్క్రీం స్టాల్లో వివిధ ఫ్లేవర్డ్ల ఐస్క్రీంలను ట్రై చేశాడు. ఆ దుకాణంలోని మెనూలో తనకు నచ్చిన కొన్ని ఐస్క్రీంలు సెలక్ట్ చేసుకున్నాడు. వాటి పేర్లు వరుసగా కెచప్, చిప్స్, బిర్యానీ, ఆలివ్ ఆయిల్, చాయ్ వంటి ఫ్లేవర్డ్ ఐస్క్రీంలు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ట్రై చేసి చూస్తున్నాడు. ముందుగా కెచప్ రుచి చూడగా..ఎలా ఉందనేది చెప్పలేను అని అన్నాడు. ఇక బిర్యానీ ప్లేవర్ చూడగానే ఈ ఐస్క్రీం కచ్చితంగా హిట్ అవుతుందని కితాబు ఇచ్చేశాడు. ఇక ఆలివ్ అద్భుతం అని, చిప్స్ ఆశ్చర్యపరిచేలా ఉందని, చాయ్ ఐస్క్రీం మాత్రం తనకిష్టమైన ఫ్లేవర్ అంటూ ఆ ఐస్క్రీంల రుచుల గురించి చెప్పుకొచ్చాడు. కానీ నెటిజన్లుమాత్రం ఇవేం ఐస్క్రీం ఫ్లేవర్డ్లు అని ఆకాశ్ పోస్ట్కి కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Akash Mehta (@mehta_a)(చదవండి: ‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!) -
డబ్బు చేసే మాయ.. 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..!
కుటుంబానికి దూరమై కష్టాల కడలిలో బతుకును సాగించాడు. తనవాళ్లెవరో తెలియక నానా బాధలు పడ్డాడు. అలా 34 ఏళ్లు గడిచిపోయాయి. తీరా తన కుటుంబాన్ని కలుసుకుంటే.. మళ్లీ డబ్బు రూపంలో వచ్చిన స్వార్థం ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఎంతలా అంటే.. కుటుంబాన్నే వద్దనుకునే దాకా!!. ఈ కథ వింటే.. డబ్బు బంధాలతో ఇంత ఘోరంగా ఆడుకుంటుందా..! అని ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన 37 ఏళ్ల యూ బావోబావో రెండేళ్ల ప్రాయంలో తన అమ్మమ్మ ఇంటి నుంచి అపహరణకు గురై మానవ అక్రమ రవాణదారుల ముఠా(హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్) చేతిలో చిక్కుకున్నాడు. అలా అక్కడ నుంచి ఓ ధనిక కుటుంబానికి విక్రయించబడ్డాడు. ఆ కుటుంబ సభ్యులు యు బాగోగులు చూడకపోగా.. హింసించింది. అయితే.. ఆ తర్వాత ఐదేళ్లకు మరో కుటుంబానికి దత్తతగా వెళ్లాడు. అలా 11వ ఏడు రాగానే మళ్లీ మరో కుటుంబం చెంతకు చేరాడు యూ. ఇక యు వాళ్లందరితో పడిపడి విసిగివేశారి బయటకొచ్చేశాడు. సరిగ్గా 19 ఏళ్లు రాగానే బీజింగ్కు చేరకుని అక్కడ డెలివరీ రైడర్గా స్థిరపడ్డాడు. అదే టైంలో.. తాను పుట్టిన కుటుంబం ఆచూకీ కోసం ఎంతగానో అన్వేషిస్తూ ఉన్నాడు. సరిగ్గా అతడి డీఎన్ఏ మ్యాచ్ అయిన కుటుంబ వివరాలు గురించి పోలీసులు తెలియజేయడంతో యూ ఆనందానికి అవధులు లేకుండాపోయింది. తన కుటుంబాన్ని కలుసుకుని తన తల్లి ఒడిలో సేదతీరాలనుకున్నాడు. కానీ, యుకి ఆ క్షణంలో తెలియలేదు ఈ భావోద్వేగభరిత ఆనందం ఎంతో కాలం నిలవదని. తీరా అక్కడకు వెళ్లాక యుకి..తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారని, తనకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని తెలుసుకున్నాడు. ఆ తర్వాత యూ చేసిన స్ట్రీమింగ్ వ్యాపారం లాభాల బాటపట్టింది. అయితే తన కుటుంబ ఒత్తిడి మేరకు 60% ఆదాయాన్ని తన ఇద్దరు తమ్ముళ్లుతో పంచుకునేందుకు అంగీకరించాడు. అంత చేసినా.. యూకి తన మొత్తం సంపాదనలో న్యాయబద్ధంగా తనకు రావాల్సిన వాట వచ్చేది కాదు. పైగా కొత్తగా చేరువయ్యిన తోబుట్టువులు మా కుటుబంలోని వ్యక్తిగా అంగీకరిస్తున్నాం కాబట్టి నీ స్వార్జితంలో వాటా ఇవ్వాల్సిందే అని శాసించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగక 'దత్తపుత్రుడు' అని పిలుస్తూ గేలి చేయడం వంటివి చేశారు. దీనికి తోడు తల్లి కూడా తన ఇద్దరు పిల్లలపై ప్రేమతో పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తూ.. యూని డబ్బులు కోసం వాడుకోవడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురై..చివరికి కుటుంబాన్ని వదిలేద్దామన్న విరక్తికి వచ్చేశాడు. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా వివరించాడా వ్యక్తి. అంతేగాదు తన సంపాదనంత తనలా హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డ బాధితుల కోసం ఖర్చు చేయాలనుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్టాపిక్గా మారింది. డబ్బు ఎంత గొప్పదో.. అంత చెడ్డది అని కొందరు ఆ యూ పోస్ట్కు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!) -
వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..
ఒరెగాన్లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ క్రిస్టెన్సెన్ అసాధారణమైన గిన్నిస్ రికార్డు సాధించాడు. ఓ బారీ గుమ్మడికాయను పడవగా మార్చి ఏకంగా కొలంబియా నదిలో 26 గంటలు ప్రయాణించి ఈ రికార్డు సృష్టించాడు. ఆయన వాషింగ్టన్లోని నార్త్ బోన్నెవిల్లే నుంచి ప్రారంభించి.. 73.50 కిమీ దూరంలో కెనడాలో ఉన్న వాంకోవర్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రికార్డుని నెలకొల్పాడు. ఆయన 2011 నుంచి అతి పెద్ద గుమ్మడి కాయలను పెంచడం ప్రారంభించాడు. అలా 2013లో అతిపెద్ద గుమ్మడికాయతో తొలిసారిగా పడవ తయారు చేసి ‘వెస్ట్కోస్ట్ జెయింట్ పంప్కిన్ రెగట్టా’ పోటీల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి ఇలా భారీ గుమ్మడికాయలను పండించడం వాటిని పడవగా మలచడం ఒక అలవాటుగా మారింది. ఆ క్రమంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుపై దృష్టసారించాడు. అందుకోసం గ్యారీ అక్టోబర్ 4న 556 కిలోల భారీ గుమ్మడికాయను పండించాడు. ఆ తర్వాత అక్టోబర్5న అధికారుల సమక్షంలోనే పడవగా తయారు చేసి తన సాహసకృత్యాన్ని ప్రారంభించారు. ఇక అధికారులు ఆ పడవకి ఒక కెమెరాను అమర్చి గ్యారీ ప్రయాణాన్ని రికార్డు చేశారు. అలా గ్యారీ గుమ్మడి కాయ పడవతో ఏకాధాటిగా ప్రయాణించి ఈ ప్రపంచ రికార్డుని సాధించాడు. (చదవండి: కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!) -
అందమైన ఇంపాక్ట్ ప్లేయర్: భార్యకు టీమిండియా క్రికెటర్ బర్త్డే విషెస్ (ఫొటోలు)
-
ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు..
SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. స్టార్ఫిష్ రాకెట్తో పాటు స్పేస్లోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్ రీసెర్చిలో అత్యద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్ టెక్సాస్లోని స్టార్బేస్ నుంచి స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్ ప్రొఫైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అంచెలంచెలుగా ఎదిగి..శ్రీసాయి దత్తా అనే యూజర్ సంజీవ్ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్లో షేర్ చేశారు. ఫ్రం ఇండియన్ రైల్వేస్ టు స్పేస్ఎక్స్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్ఎక్స్ సంస్థలో ప్రిన్సిపల్ ఇంజనీర్గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యరూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తైన తర్వాత సంజీవ్ శర్మ 1990లో ఇండియన్ రైల్వేలో డివిజినల్ మెకానికల్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్గా ఆయన ప్రమోషన్ లభించింది. 2001 వరకు ఈ జాబ్లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో మరో మాస్టర్ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్ఎక్స్ సంస్థలో స్ట్రక్చర్స్ గ్రూప్ డైనమిక్స్ ఇంజినీర్గా జాబ్ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్నెట్ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్ఎక్స్కు తిరిగొచ్చారు. ‘బూస్టర్’ ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో సంజీవ్ శర్మ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది."From Indian Railways to SpaceX, From Building Trains to building Starships & catching them"Podcast of Sanjeev Sharma- Principal Engineer for #Starship Dynamicshttps://t.co/mzD2QEQTWa pic.twitter.com/fbDXXJf8sx— SRI SAIDATTA (@nssdatta) October 15, 2024ఓపిక అంటే ఇది..ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు సాగిన సంజీవ్ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్ఎక్స్లో చేరడానికి ముందు సంజీవ్ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్ శర్మ ప్రమోషన్ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి -
తెగ నవ్విస్తున్న రావణ వీడియోలు
న్యూఢిల్లీ: దేశంలో దసరా సంబరాలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. నవరాత్రుల్లో వివిధ ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది. Ravan army dancing on havan karenge 😂😂 Punjabi Ramleela 🔥 pic.twitter.com/H4fEbj5gtu— Harpreet (@harpreet4567) October 11, 2024దసరా వేడుకల్లో నిర్వహించిన రావణ దహనానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి యూజర్లను తెగ నవ్విస్తున్నాయి. लड़किया एग्जाम के 2 दिन पहले - बहुत डर लग रहा है पता नहीं क्या होगा ।लड़के जब उनका अंत नजदीक हो - pic.twitter.com/cf1gwSQx8R— Desi Bhayo (@desi_bhayo88) October 12, 2024ఒక వీడియోలో రావణుని వేషంలో ఉన్న వ్యక్తి గుట్కా తింటున్నట్లు కనిపిస్తాడు. మరో వీడియోలో రావణుడు బుల్లెట్ బైక్ను నడుపుతూ కనిపిస్తున్నాడు.RAVAN SPOTTED DOING FOOD DELIVERY 😂This #Dussehra we’re making sure Ravan pays for his sins by delivering happiness for a change 🔥magicpin X Ravan fighting evil of high food delivery charges 👺 pic.twitter.com/zpzwsvMuXm— magicpin (@mymagicpin) October 11, 2024ఇంకొక వీడియోలో రావణ వేషధారి నటి సప్నా చౌదరి పాటకు నృత్యం చేస్తూ కనిపిస్తున్నాడు. ఈ వైరల్ వీడియోలను చూసినవారు మళ్లీమళ్లీ వీటిని చూస్తున్నారు.हजारों रावण आते हैं, एक पुतले को जलता हुआ देखने 😔 pic.twitter.com/g3DZQXGm5g— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునే దసరా గడిచిపోయినప్పటికీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ దసరా సంబరాలు సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను చూసినవారు తెగ నవ్వుకుంటున్నారు.This Ravan has my vote. He got a vibe on “Sharara” song. Ramleela pic.twitter.com/f6Lq0Fq8d6— Harpreet (@harpreet4567) October 12, 2024సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో సీత అపహరణ సమయంలో సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు ఒక సినిమాలోని పాటకు నృత్యం చేస్తూ అలరిస్తున్నాడు.जेल में चल रही थी रामलीला🏹माता सीता को खोजने निकले वानर बने दो कैदी..🐒अब तक नहीं लौटे...🤔#Haridwarjail #Ramleela #Uttarakhand #VijayaDashami #HappyDussehra #विजयादशमी #दशहरा जय श्री राम🚩 pic.twitter.com/P9P8dBAJTT— Sanjeev 🇮🇳 (@sun4shiva) October 12, 2024మరో వీడియోలో రావణుని దిష్టిబొమ్మ నోటి నుండి మంటలు వెలువటమే కాకుండా, తలపై నుండి నిప్పులు ఎగజిమ్మడం ఎంతో ఫన్నీగా కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ.. -
నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!
బాలీవుడ్ నటి, దర్శకురాలు అయిన నీనా గుప్తా సినీ కెరీర్లో ఎన్నో విజయాలను అందుకుంది. మంచి నటిగా పేరుతెచ్చుకోవడమే గాక ఎన్నో అవార్డులు, పురస్కారాలను దక్కించుకుంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటుంది. అలానే తాజాగా తనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ గురించి షేర్ చేసుకుంది. ఇన్స్టాలో తనికష్టమైన పరాటా ఫోటోని షేర్ చేసింది. 'ఆలూ పనీర్ ప్యాజ్ పరాఠా' బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని పేర్కొంది. అలాగే తనకిష్టమైన వివిధ అల్పాహారాల కూడా గురించి వెల్లడించింది. సౌత్ ఇండియన్ వంటకమైన ఊతప్పం అంటే మహా ఇష్టమని అన్నారు. కొబ్బరి చట్నీతో ఊతప్పం తింటుంటే ఆ రుచే వేరేలెవెల్ అని చెబుతున్నారు. అలాగే తనకు సుజీ (గోధుమ రవ్వ)తో చేసిన అట్లు అంటే మహా ఇష్టమని తెలిపింది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకొచ్చింది. దీన్ని రైతాతో తింటే టేస్ట్ మాములుగా ఉండదట.(చదవండి: అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!) -
అత్యంత స్పైసీ హాట్ సాస్..జస్ట్ మూడు నిమిషాల్లో..!
కొంచెం నోటికి ఘాటుగా తగిలితేనే హ్హ..హ్హ అంటూ హాహాకారాలే చేస్తాం. ఎప్పుడైనా సరదాగా స్పైసీ ఫుడ్ తిన్న కూడా అమ్మ బాబోయ్ ఏంటీ ఘాటూ అని గోల చేసేస్తాం. అలాంటిది ఇక్కడొక వ్యక్తి అత్యంత స్పైసీగా ఉండే రెండు సాస్ బాటిల్స్ని చక్కగా తినేసి గిన్నిస్ రిక్కార్డుల కెక్కాడు.కెనడాకు చెందిన యూట్యూబర్ మైక్ జాక్ రెండు బాటిళ్ల చిల్లీ సాస్ని జస్ట్ మూడు నిమిషాల్లో హాంఫట్ చేసేశాడు. ఏదో తియ్యటి సూప్ తాగుతున్నట్లుగా తాగేసి ఔరా అనిపించుకున్నాడు. అత్యంత ఘాటుగా ఉండే సాస్ ఇది. కొంచెం టేస్ట్ చేయగానే కళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి. అలాంటిది మన మైక్ దాన్ని అమృతం తాగినట్లు తాగిసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. పైగా ఈ స్టంట్ పూర్తి అయిన తర్వాత ఎలా తినేయగలిగావు ఈ సాస్ని అని ప్రశ్నిస్తే..తనకు ఫ్లేవర్ ఫెటీగ్ టెక్నీక్ని ఉపయోగించి తినేశానంటూ వివరణ ఇచ్చాడు. అంటే తనకిష్టమైన ఫ్రూట్ ఊహించుకుని ఆ రుచిని ఆశ్వాదిస్తూ తినడమే "ఫ్లేవర్ ఫెటీగ్" టెక్నిక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం అతడు తింటుంటే మా నోటిలోకి నీళ్లు వచ్చేసాయని కామెంట్ చేస్తూ..పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: వామ్మో..! రాను రాను హోటల్లో ఆతిథ్యం ఇలా ఉంటుందా..!) -
వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా?
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. కొన్నిసార్లు షాకింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఎవరికీ ఏమాత్రం నమ్మాలని అనిపించదు.తాజాగా ఒక ఫొటో వైరల్గా మారింది. దీనిని చూసినవారు తెగ ఆశ్యర్యపోవడానికి తోడు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఒక కుర్రాడికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫారం తెగ వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు బీఏ ఆనర్స్ విద్యార్థి అని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఫారంలో తండ్రి పేరు ‘ఇమ్రాన్ హష్మీ’ అని, తల్లి పేరు ‘సన్నీ లియోన్’ అని రాసి ఉంది. వీరు బాలీవుడ్ ప్రముఖులనే విషయం తెలిసిందే.ఈ ఫోటో వైరల్ అవడానికి ఆ కుర్రాడి తల్లిదండ్రుల పేర్లే ప్రధాన కారణం. అయితే ఇది నిజమా లేక ఎవరైనా ఫోటోను ఎడిట్ చేశారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇండియన్ రేర్ ఇమేజస్ అనే పేజీ నుండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయ్యింది. ఈ పోస్ట్ను ఇప్పటివరకూ 2 లక్షల 28 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్ ఆ కుర్రాడి తాత పేరు మహేష్ భట్ అని రాయగా, మరొక యూజర్ దీనిని ఫేక్ అని పేర్కొన్నాడు.ఇది కూడా చదవండి: సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు -
తెల్ల చీరలో కేతిక శర్మ సోయగాలు..!
-
లోటస్ కాన్సెప్ట్.. మెరుపు వేగంతో దూసుకెళ్లే సూపర్ కారు (ఫోటోలు)
-
అంత ఈజీగా స్మోకింగ్ అలవాటును వదిలేయొచ్చా..! ఏకంగా 24 ఏళ్లుగా..
కొన్ని చెడు అలవాట్లను విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. అలవాటు కాకుండానే ఉండాలి. మంచిది కాదు అని తెలిసి విడిచిపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. అందుకు ఎంతో బలమైన సంకల్పం ఉంటే గానీ సాధ్యంకాదు. ముఖ్యంగా సిగరెట్టు లాంటి అలవాట్లను దూరం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ వ్యక్తి ఏకంగా 24 ఏళ్లుగా ఉన్న అలవాటును సులభంగా స్వస్తి చెప్పి స్ఫూర్తిగా నిలిచాడు. అంతేగాదు సిగరెట్ట అలవాటు మానాలి అనుకునే వాళ్లు వెంటనే ఇది చదివేయండి.రిటైల్ అండ్ ఛానెల్ సేల్స్ ప్రొఫెషనల్ కులకర్ణి అనే వ్యక్తి 24 ఏళ్లుగా రోజుకు పది సిగరెట్లకు పైగా తాగేవాడు. అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి ఈ ఏడాది శ్రీ కృష్ణజన్మాష్టమి రోజు నుంచి సిగరెట్టు ముట్టకూడదని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే అలా దాదాపు 17 రోజుల వరకు ఆ వ్యక్తి సిగరెట్టు జోలికే వెళ్లలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకోవడంతో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు అతడి సంకల్ప బలాన్ని మెచ్చుకుంటూ తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. అంతేగాదు కొందరూ ఈ చిట్కాలు పాటిస్తే సులభంగా స్మోకింగ్ స్వస్తి చెప్పొచ్చు అంటూ సలహాలు ఇస్తు పోస్టులు పెట్టడం విశేషం. I have been smoking 10 cigarettes a day for the last 24 years daily.Don't want to do the math and arrive at a total, it's scary !On the day of Janmashtami this year, I decided to quit and it's been 17 days since I touched a cigarette.So happy for myself !!!— Rohit Kulkarni (@RohitKoolkarni) September 10, 2024 (చదవండి: "నెయ్యి టీ"నా..! ఎన్ని లాభాలో తెలుసా?) -
ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
-
మా తాత భారత స్వతంత్ర పోరాట యోధుడు: కమలా హ్యారిస్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన చిన్ననాటి భారత పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భాతరదేశ వారసత్వాన్ని ప్రతిబింబించే ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 10న) సందర్పంగా అమ్మమ్మ తాతయ్యలు పీవీ గోపాలన్-రాజమ్మలతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. భారత్ వెళ్లినప్పుడల్లా తాత తనను మార్నింగ్ వాక్కు తీసుకెళ్లేవారని తెలిపారు. అలాగే భారత స్వతంత్ర పోరాటంలో తాత పాత్రను వివరించారు. సమానత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గురించి తాత మాట్లాడేవారని అన్నారు. ఆయన భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అని సోషల్ మీడియా ఎక్స్ రాశారు. అలాగే తన అమ్మమ్మ సహకారాన్ని కూడా హైలెట్ చేస్తు రాశారు. ఆమె మహిళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించేలా భారతదేశం అంతటా ప్రయాణించేదని అన్నారు. అందువల్లే తనకు ప్రజాసేవ పట్ల నిబద్ధతగా ఉండటం, మంచి భవిష్యత్తు కోసం పోరాడటం వంటివి వారసత్వంగా వచ్చాయని అంటోంది. ఇలా హారిస్ తాను తన అమ్మమ్మ తాతయ్యల నుంచి సామాజికి విలువలు గురించి ఎలా నేర్చుకున్నానో చెప్పుకొచ్చారు. తరువాత తరాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా కీలకం అంటూ స్ఫూర్తిని కలిగించే తాతాయ్య అమ్మమ్మలందరికీ జాతీయ గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్గా మారింది. అయితే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది ఆమె కుటుంబ వారసత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం మీ తాత బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్లో ఉన్నప్పుడూ ఆ ప్రభుత్వాన్నే వ్యతిరేకించేలా తన సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడగలరని ప్రశ్నించారు. అంతేగాక ఆ సర్వీస్ స్వాత్రంత్య్రం అనంతరమే సెక్రటేరియట్ సర్వీస్గా మారిందని విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాదు క్షమించండి మిమ్మల్ని నమ్మలేం. ఇది కేవలం భారత సంతతి వ్యక్తులను బుట్టలో వేసుకునే రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శలు చేశారు.(చదవండి: శ్రావణ బెండకాయల గురించి విన్నారా..? గణేషోత్సవంలో..!) -
స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా పీహెచ్డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!
పెద్ద పెద్ద చదువులు చదవి కూడా తన అర్హతకు సరిపోని ఉద్యోగాల్లో పార్ట్టైం చేస్తూ తమ భవిష్యత్తు బాటలు వేసుకుంటారు. అలాగే నామోషీగా వంటి ఫీలింగ్స్ ఏం లేకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తారు. పొరపాటున కూడా తామెంటనేది పెదవివిప్పరు. అలాంటి వ్యక్తిని చూసి అమెరికా వ్లాగర్ ఆశ్చర్యపోయాడు. ఓ గొప్ప వ్యక్తిని కలిశానన్న భావంతో అతడితో సంభాషించిన వీడియోని షేర్ చేస్తూ అతడి గొప్పతనం గురించి వివరించాడు.ఏం చెప్పాడంటే..అమెరికన్ వ్లాగర్ క్రిస్టోఫర్ లూయిస్ ఇటీవల అనుకోని విధంగా బయోటెక్నాలజీలో పీహెచ్డి చేసిన విద్యార్థిని కలుసుకుంటాడు. అతడు గూగుల్ మ్యాప్స్ సాయంతో తమిళనాడులో చెన్నైలో ప్రయాణిస్తుండగా సమీపంలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ బండి అతడిని ఎందుకో ఆకర్షించింది. అక్కడకువెళ్లి ఒక ప్లేట్ చికెన్ 65 ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో తాను చెప్పే ఆర్డర్ సర్వ్ చేసేలోపల ఆ ఫుడ్ విక్రేతతో మాటలు కలిపాడు. అతడితో జరిపిన సంభాషలో ఫుడ్ విక్రేత పీహెచ్డీ చేసిన విద్యార్థి అని తెలిసి విస్తుపోతాడు. అంతేగాదు సదరు వ్యక్తి తన పేరు, తన పరిశోధన పత్రాన్ని ఆన్లైన్లో సర్చ్ చేయమని చెబుతాడు. ఇంత ఉన్నత చదువులు చదివి కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా ఖర్చులకోసం ఇలా కష్టపడుతున్న ఆ విద్యార్థిని చూసి అబ్బురపడ్డాడు. వెంటనే పట్టరాని ఆనందంతో అతడితో ముచ్చటించిన వీడియోని నెట్టింట షేర్ చేయడమే గాక 100 డాలర్లు(మన కరెన్సీలో రూ. 8000లు) గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేగాదు ఇలా ఓ విద్యార్థి ఇలా తన విద్యా లక్ష్యాల కోసం స్ట్రీట్ ఫుడ్ కార్ట్ని నడుపుతుండటం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అతడి హార్డ్వర్క్కి ఫిదా అవ్వుతూ ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నత చదువుతున్న విద్యార్థులు ఇలానే కష్టపడుతున్నారంటూ చర్చకలకు దారితీసింది. కాగా, క్రిస్ బుహారి హోటల్కి చేరుకోవాలి. ఇది చికెన్ 65కి పేరుగాంచింది. ఈ రుచకరమైన వంటకం తమిళనాడు ఏఎం బుహరీ హోటల్ రూపొందించింది. ఆ తర్వాత కాలక్రమేణ చికెన్ 78, చికెన్ 82, చికెన్ 90 వంటి వైవిధ్యకరమైన వంటకాలు వచ్చాయి.Respect 🔥🔥🔥 Such Stories Need to be Shared Widely. Have an Inspiring Day Ahead...#FI pic.twitter.com/i9vOBZqGJS— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) September 3, 2024 (చదవండి: హాట్టాపిక్గా సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ హెల్తీ డైట్..!) -
గం.. గం.. గణేషా!.. ఈ చిత్రాలు చూడండయ్యా
-
తిరుమల శ్రీవారి సేవలో నటి సోనియా సింగ్ (ఫొటోలు)
-
‘హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి’
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు కనిపిస్తాయో ఎవరూ చెప్పలేరు. కడుపుబ్బా నవ్వించే వీడియోలతో పాటు కంగుతినిపించే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. ఇదేకోవకు చెందిన ఒక వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.గుజరాత్కు చెందిన ఈ వీడియో ఒక పట్టాన నమ్మేలా లేదు. ఈ వీడియోను చూసినవారంతా తెగ ఆశ్చ్యపోతున్నారు. భారీ వర్షాలకు నదిలో నుంచి మొసళ్లు బయటకు రావడాన్ని చూసిన జనం.. అలాంటి మొసలి స్కూటర్పై వెళ్లడాన్ని చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్కూటర్పై వెళుతుండటాన్ని చూడవచ్చు. వారి మధ్య ఓ మొసలి కూడా ఉంది. ఒకరు స్కూటర్ నడుపుతుండగా, మరొకరు ఆ భారీ మొసలిని ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు. కుక్కలను, పిల్లులను ఇలా స్కూటర్పై ఎక్కించుకుని తీసుకుని వెళ్లడాన్ని ఎప్పుడో ఒకప్పుడు చూసేవుంటాం. కానీ ఇలా మొసలిని బండిపై తీసుకువెళ్లడాన్ని ఎప్పుడూ చూడలేదని ఈ వీడియో చూసినవారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వీడియోను @gharkekalesh అనే ఖాతా ద్వారా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఎక్స్లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్లో ‘వడోదరలోని విశ్వామిత్ర నది నుంచి బయటకు వచ్చిన ఒక మొసలిని ఇద్దరు యువకులు స్కూటర్పై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి తీసుకెళ్లారు’ అని రాసివుంది. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ మొసలిని నీటిలో నుంచి బయటకు తీసి, దాని నోటిని తాడుతో కట్టేస్తే అది బలహీనపడిపోతుంది’ అని రాశారు. మరొక యూజర్ ‘సోదరుని ధైర్యానికి వందనం’ అని రాయగా, ఇంకొకరు ‘హెల్మెట్ లేకుండా స్కూటర్పై మొసలి ఎలా వెళుతుంది? అని రాశారు. Two young men took a crocodile found in Vishwamitra river in Vadodara to the forest department office on a scooter🫡pic.twitter.com/IHp80V9ivP— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024 -
కంగు బీచ్ లో హీరోయిన్ మెహరీన్ అందాల హొయలు..
-
మన్మధుడు హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
లాస్ఎంజిల్స్ బీచ్లో బుట్టబొమ్మ హోయలు.. (ఫోటోలు)
-
హాయ్, నేను సీజేఐని... క్యాబ్కు రూ.500 పంపండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా వదలడం లేదు. సీజేఐ పేరిట ఒక వ్యక్తిని రూ.500 అడిగారు! సదరు స్కామర్ తనను తాను సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్గా చెప్పుకున్నాడు. ‘‘హలో! నేను సీజేఐని. కొలీజియం అత్యవసర భేటీకి వెళ్లాల్సి ఉంది. కన్నాట్ ప్లేస్లో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం రూ.500 పంపగలరా! కోర్టుకు చేరగానే తిరిగి పంపిస్తా’’ అంటూ మెసేజ్ చేశాడు. అది నిజమైందేనని నమ్మించడానికి ఐ పాడ్ నుంచి పంపుతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. అయితే దాన్నిండా స్పెల్లింగ్, వ్యాకరణ దోషాలే ఉండటం విశేషం! ఈ నకిలీ మెసేజ్ వైరల్గా మారింది. దాన్ని కైలాశ్ మేఘ్వాల్ అనే వ్యక్తి ఎక్స్లో పోస్టు చేశారు. ‘ఫ్రెండ్స్, ఏం చేద్దాం మరి!’ అంటూ కామెంట్ చేశారు. ఈ వైరల్ పోస్టును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీజేఐ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్స్కు ఫిర్యాదు చేసింది. -
టీమిండియా పాకిస్తాన్కు రాబోతోంది: పాక్ మాజీ కెప్టెన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్గా జై షా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ చీఫ్గా జై షా నియామకాన్ని పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యతిరేకించడం లేదని.. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తప్పక తమ దేశానికి వస్తుందని పేర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో పీసీబీకి ఈ మేరకు అవగాహన కుదిరిందని చెప్పుకొచ్చాడు.పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025కాగా 2017 తర్వాత తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ దక్కించుకుంది. అయితే, ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్కు వెళ్లబోదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీపైనే భారం వేసిన పాక్ బోర్డుఈ క్రమంలో హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్ను నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీకి ఇప్పటికే విజ్ఞప్తి చేసిందని.. అందుకు తగ్గట్లుగానే టీమిండియా మ్యాచ్లకు తటస్థ వేదికను ఎంపిక చేయబోతున్నారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, పాక్ బోర్డు మాత్రం టీమిండియా మ్యాచ్లన్నీ కూడా తమ దేశంలోనే నిర్వహిస్తామని.. ఆ జట్టును తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఐసీసీ బాస్గా నియమితుడు కావడంతో పాక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయంపై స్పందించిన రషీద్ లతీఫ్ మాత్రం భిన్నంగా స్పందించాడు.సగం ప్రక్రియ పూర్తైంది‘‘జై షా నియామకాన్ని పీసీబీ ఏమాత్రం వ్యతిరేకించడం లేదు. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరిందనే అనుకుంటున్నా. ఒకవేళ టీమిండియా పాకిస్తాన్ వస్తే.. అందుకు జై షానే కారణం అనుకోవచ్చు. భారత ప్రభుత్వ మద్దతుతో అతడు బోర్డును ఒప్పిస్తాడు. ఇందుకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తైంది. టీమిండియా పాకిస్తాన్కు రాబోతోంది’’ అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా సంచలనానికి తెరతీశాడు. కాగా 1996 వన్డే వరల్డ్కప్ తర్వాత పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టోర్నీ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టుకు అక్కడికి వెళ్లి పదహారేళ్లకు పైనే అయింది. 2008లో చివరగా టీమిండియా పాక్లో పర్యటించింది. 2013 తర్వాత ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లకు తెరపడింది.చదవండి: ‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఇంకెందుకు రెస్ట్?’ -
పర్వతాల్లో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. జలకాలాడుతూ!
-
అన్న క్యాంటీన్లో అపరిశుభ్రత.. వీడియో వైరల్!
పశ్చిమ గోదావరి, సాక్షి: తణుకులోని అన్న క్యాంటీన్లో అపరిశుభ్రమైన నీటితో తినేసిన ప్లేట్లు కడుగుతున్నట్లు ఓ వీడియో నిన్నటి నుంచి వైరల్ అవుతోంది. స్థానిక సొసైటీ రోడ్డులోని అన్న క్యాంటీన్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి తన సెల్ఫోన్ ద్వారా వీడియో తీసినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లో పేదలు ఉదయం టిఫిన్ తిన్న ప్లేట్లను వాష్ బేసిన్లో వేసి పూర్తి అపరిశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతున్న విషయం ఆ వీడియోలో ఉంది. తినేసిన ప్లేట్లను చేతులు కడుక్కునే వాష్ బేసిన్లో.. నిల్వ ఉన్న మురికి నీటిలో ఉంచి శుభ్రం చేస్తున్న విషయం ఆ వీడియోను చూస్తే అర్థమవుతోంది. #***Rs 5/- Anna Canteen in Tanuku***#This is how the KGF Taliban government treats poor People. Dirty water is used to clean the plates . YEllow goons can go now from HYD to check the quality of food ! @India_NHRC #AndhraPradesh #AnnaCanteen pic.twitter.com/gT9aF5b5uL— Howdy @ Murali Reddy ! ( Jagan కుటుంబం) (@Muralipmr) August 26, 2024 పేదలు తింటున్న అన్నం ప్లేట్లు ఎలా కడిగినా.. ఎవరు చూస్తారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మున్సిపల్ కమిషనర్ బీవీ రమణను వివరణ కోరగా తినేసిన ప్లేట్లు సాధారణంగా వాష్ బేసిన్లో వేస్తుంటారని, అయితే ఆ రోజు ఒకేసారి తాకిడి రావడంతో మిగిలిన వ్యర్థాలు వాష్ బేసిన్లో ఉండిపోవడం వల్ల నీరు నిలిచిపోయి ఉండొచ్చని అన్నారు. అక్కడి నుంచి ప్లేట్లు తీసి వేరే చోట కడుగుతారని చెప్పారాయన. లోకేష్ స్పందనఇక తణుకు అన్న క్యాంటీన్ వీడియో వైరల్ కావడంపై ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పుడు ప్రచారమని, ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని ట్వీట్ చేశారు.