taj mahal
-
మన ఢిల్లీ... మన హెరిటేజ్
ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఢిల్లీ గొప్పదనాలు. వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తించిన నిర్మాణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్... ఆగ్రా రెడ్ఫోర్ట్... ఈ రెండింటికీ గుర్తింపు 1983లో వచ్చింది. కుతుబ్ మినార్... హుమయూన్ సమాధి... వీటికి 1993లో ఆ హోదా వచ్చింది. దేశ రాజస దర్పణం రెడ్ఫోర్ట్ మాత్రం... ఈ గౌరవాన్ని 2007లో అందుకుంది.ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించి ‘అరే హుజూర్ వాహ్ తాజ్ బోలియే’ అన్న ప్రకటనను మనదేశంలో దాదాపుగా అందరూ చూసి ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో తాజ్మహల్ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకుందాం. రెడ్ఫోర్ట్కి తాజ్ మహల్కి ఓ దగ్గరి సంబంధం ఉంది. రెండింటి ఆర్కిటెక్ట్ ఒకరే... అతడే ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేటంతటి సౌందర్యం తాజ్మహల్ది. ఉత్తరప్రదేశ్లో కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగా పాతికేళ్ల కిందట తాజ్మహల్ గోడలు పసుపురంగులోకి మారాయి. ఆ సమయంలో తాజ్మహల్ని చూసిన వాళ్లు ఫొటోల్లోనే బాగుందనుకున్నారు. ఇప్పుడు అలాంటి అసంతృప్తి ఉండదు. మనదేశానికి అమెరికా అధ్యక్షుడు (తొలి దఫా అధ్యక్షుడుగా ఉన్న సమయం) డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సందర్భంగా తాజ్మహల్కి మెరుగులు దిద్దారు. ఇప్పుడు పాలరాయి తెల్లగా మెరుస్తోంది. 42 ఎకరాల్లో నిర్మించిన తాజ్మహల్ నిర్మాణం రెడ్ఫోర్ట్ నిర్మాణం కంటే ఎనిమిదేళ్లు ముందు మొదలైంది. రెడ్ఫోర్ట్ పూర్తయిన తర్వాత ఐదేళ్లకు పూర్తయింది. అంటే 1631– 1653 వరకు 22 ఏళ్లు కట్టారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ముందుకు నడిచే కొద్దీ తాజ్ మహల్ను తలెత్తి చూడాలి. తాజ్మహల్ నుంచి ఆగ్రాఫోర్ట్, షాజహాన్ ప్యాలెస్ చూడవచ్చు. తాజ్మహల్ వెనుక వైపు నుంచి బేస్మెంట్ కిందకు చూస్తే యమునా నది గంభీరంగా ప్రవహిస్తుంటుంది.హుమయూన్ సమాధి భార్య ప్రేమకు చిహ్నం హుమయూన్ కా మఖ్బారా... హుమయూన్సమాధి. మనదేశానికి పర్షియా ఉద్యానవనశైలిని మనకు పరిచయం చేసిన కట్టడం ఇది. మనదేశంలో మొఘల్ వాస్తుశైలిలో నిర్మితమైన తొలికట్టడం. తాజ్ మహల్, హుమయూన్స్ టూంబ్ రెండూ సమాధి నిర్మాణాలే. రెండూ ఆర్కిటెక్చర్ పరంగా గొప్ప కట్టడాలే. తాజ్ మహల్ని భార్య జ్ఞాపకార్థం భర్త కట్టించాడు. హుమయూన్ టూంబ్ను భర్త జ్ఞాపకార్థం భార్య కట్టించింది. ప్రేమ చిహ్నంగా గొప్ప ప్రమోషన్ రాలేదు, కానీ నిర్మాణపరంగా ఇది కూడా గొప్ప కట్టడమే. హుమయూన్ సమాధి ఢిల్లీ శివార్లలో నిజాముద్దీన్లో ఉంది. ఈ సమాధి పైన గుమ్మటం ఎత్తు 42.5 మీటర్లు. ఈ సమాధి మొత్తం నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న గట్టు మీద ఉంటుంది. దాని మీద ఆరు మీటర్లకు పైగా ఎత్తున్న భవనాన్ని నిర్మించారు. ప్రధాన కట్టడం నిర్మాణం మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కూడా ప్రత్యేకమైనదే. మొఘల్ ఉద్యానవన శైలి చార్బాగ్ శైలి ఇందులో కూడా కనిపిస్తుంది. ఈ గార్డెన్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నీటి పంపులు, వాటర్ఫౌంటెయిన్లతో ఆధునిక సాంకేతికత కనిపిస్తుంది.హుమయూన్ సమాధి నిర్మాణం క్రీ.శ 1562లో మొదలైంది. ఈ సంగతి తెలియగానే వచ్చే సందేహం ఒక్కటే...∙హుమయూన్ మరణించింది క్రీ.శ 1556 జనవరి 20వ తేదీ. మరి సమాధి అప్పుడు కట్టలేదా అనే ప్రశ్న నిజమే. మరణించిన వెంటనే పురానాఖిలాలో ఖననం చేశారు. కొంతకాలానికి శవపేటికను పెకలించి పంజాబ్ లోని సిర్హింద్కు తీసుకెళ్లారు. రాజ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత హుమయూన్ భార్య హమీదాబేగం (అక్బర్ తల్లి) భర్త జ్ఞాపకార్థం గొప్ప నిర్మాణం చేయాలనుకుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న హుమయూన్ సమాధి. ఈ నిర్మాణం పూర్తవడానికి పదేళ్లు పట్టింది. ఢిల్లీకి ట్రైన్లో వెళ్లేటప్పుడు నగరంలోకి ప్రవేశించడానికి ముందే నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది. సమాధి నిర్మాణం ఎత్తైన బేస్మెంట్ మీద ఉండడంతో ట్రైన్లోకి కనిపిస్తుంది.సలామ్ .. రెడ్ ఫోర్ట్మొఘలుల సామ్రాజ్య విస్తరణలో రెడ్ఫోర్ట్ది కీలకమైన స్థానం. షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇందులో షాజహాన్ నివసించిన ప్యాలెస్, ముంతాజ్ మహల్, రంగ్ మహల్, మోతీ మసీదు, ఇతర ప్యాలెస్లు ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణాలే. ఇక్కడున్న దివానీ ఖాస్, దివానీ ఆమ్లు ఆగ్రాఫోర్ట్లో ఉన్న వాటికంటే భారీ నిర్మాణాలు. ఈ కోట ్రపాంగణం అంతా కలియదిరిగినప్పుడు ఇంత గొప్పగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీనిని డిజైన్ చేశాడు. ఇందులో ఇండియన్ నిర్మాణశైలితోపాటు పర్షియన్ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని కట్టడానికి పదేళ్లు పట్టింది. రాజసాన్ని ప్రదర్శించే ఈ కోట 1648– 1857 వరకు మొఘలుల అధీనంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ స్వాధీనంలోకి వెళ్లింది. స్వాతంత్య్ర సాధనతో మన జాతీయపతాకం ఎగిరింది. అప్పటి నుంచి ఏటా పతాకావిష్కరణ సందర్భంగా టీవీలు, పత్రికల్లో దేశ ప్రజలకు దర్శనమిస్తోంది. నిర్వహణ భేష్!రెడ్ఫోర్ట్ నిర్వహణ బాధ్యత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన తర్వాత కోట ్రపాంగణం టూరిస్ట్ ఫ్రెండ్లీగా మారింది. నిర్మాణాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చటి లాన్లను మెయింటెయిన్ చేయడంతో ఇక్కడ ఎండాకాలంలో కూడా టూరిస్టులు సౌకర్యంగా తిరుగగలుగుతున్నారు. టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలు కూడా బాగున్నాయిప్పుడు. అనేక కాంప్లెక్స్లను మ్యూజియాలుగా మార్చడం మరొక మంచి పరిణామం. రెడ్ఫోర్ట్ టూర్ను ఆద్యంతం ఆస్వాదించే క్రమంలోనే ముంతాజ్ మ్యూజియం, ఇండియన్ ఆర్ట్ మ్యూజియం వంటి వాటిని కూడా కవర్ చేయవచ్చు. దిగుడుబావి ఉంది!రెడ్ఫోర్ట్ ఆవరణలో ఒక స్టెప్వెల్ ఉంది. రెడ్ఫోర్ట్ని ఓ పదేళ్ల కిందట చూసిన వాళ్లు దీనిని గమనించి ఉండకపోవచ్చు. ఈ సారి వెళ్లినప్పుడు మర్చిపోకుండా చూడాలి. అయితే ఈ బావిలోకి దిగడానికి ఏ మాత్రం వీల్లేదు. ఢిల్లీ నగరంలోని అగ్రసేన్కీ బావోలీ వంటి కొన్ని స్టెప్వెల్స్లోకి ఒకటి– రెండు అంతస్థుల వరకైనా అనుమతిస్తారు. కానీ ఈ రెడ్ఫోర్ట్ స్టెప్వెల్ని పూర్తిగా లాక్ చేసి పైన గ్రిల్ అమర్చారు. నేల మీద నుంచి వంగి చూడాల్సిందే.తొలి ఎర్రకోట ఆగ్రా ఫోర్ట్ఈ ఎర్రకోట ఆగ్రాలో ఉంది. ఢిల్లీ ఎర్రకోట కంటే ముందుది. ఈ కోట యమునాతీరాన తాజ్ మహల్కు పక్కన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే తాజ్మహల్ అందంగా కనిపిస్తుంది. తాజ్ మహల్ నుంచి ఈ కోట ఠీవిగా కనిపిస్తుంది. ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే ఢిల్లీ రెడ్ఫోర్ట్ అన్నవన్నీ ఉన్నాయి. వంద ఎకరాల్లో విస్తరించిన కోట ఇది. దివానీ ఆమ్, దివానీ ఖాస్ వంటి పాలన భవనాలతోపాటు ప్యాలెస్లున్నాయి. షాజహాన్ అంత్యకాలంలో నివసించిన ప్యాలెస్ షా బుర్జ్ ఇక్కడే ఉంది. ఈ ప్యాలెస్ నుంచి తాజ్మహల్ వ్యూ అందంగా ఉంటుంది. షాజహాన్ను కొడుకు ఔరంగజేబు ఖైదు చేశాడని తెలిసినప్పుడు సానుభూతి కలుగుతుంది. కానీ ఈ ప్యాలెస్ను చూస్తే రాజు జైల్లో ఉన్నా రాజరికపు సౌకర్యాలేమీ తగ్గవనే వాస్తవం తెలిసి వస్తుంది. అక్బర్ కట్టించిన ‘జహంగీర్ మహల్’ ఒక అద్భుతం. మధ్య ఆసియా నుంచి అక్కడ ప్రసిద్ధులైన వాస్తు శిల్పులను పిలిపించి, స్థానికంగా ఉన్న హిందూ వాస్తుశిల్పులలో నిపుణులను ఎంపిక చేసి అందరి సమష్టి కృషితో గొప్ప నిర్మాణం జరగాలని ఆదేశించాడట. ఆ మేరకే వాళ్లు దీనిని డిజైన్ చేశారట. మొఘలుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. కోట లోపల అక్బర్కు విజయం అందించిన ఆయుధాగారం ఉంది. రతన్సింగ్ హవేలీ, బెంగాల్మహల్, శీష్మహల్, షాజహాన్ మహల్, జహంగీర్ బాత్టబ్లను చూడడం మరువకూడదు. ఈ ఎర్రకోటలోకి పర్యాటకులను అమర్సింగ్ గేట్ నుంచి అనుమతిస్తారు. పాలరాతిలో ఇన్లే వర్క్ ఇక్కడి ప్యాలెస్లలోనూ కనిపిస్తుంది. టూర్ ఆపరేటర్లు తాజ్మహల్ కంటే ఈ కోటకు తీసుకువెళ్తారు. త్వరగా రాకపోతే తాజ్మహల్ చూడడానికి సమయం చాలదని తొందరపెడుతుంటారు. దాంతో పర్యాటకులు ప్రశాంతంగా ఆస్వాదించలేకపోతారు.కుతుబ్ మినార్కుతుబ్మినార్ ఐదు అంతస్థుల కట్టడం. ఢిల్లీ శివారులో మెహ్రౌలీలో ఉంది. దీని నిర్మాణం క్రీ.శ 1199 నుంచి 1220 వరకు అనేక దఫాలుగా జరిగింది. అనంగపాల్ తోమార్ నుంచి పృథ్వీరాజ్ చౌహాన్, కుతుబుద్దీన్ ఐబక్ షంషుద్దీన్ ఇల్టుట్ మిష్ వరకు అనేక రాజవంశాల చరిత్రలో ఈ మినార్ది కేంద్రస్థానం. హుమయూన్కి అక్బర్కి మధ్య కాలంలో షేర్షా సూరి కూడా తన వంతుగా కొన్ని మెరుగులు దిద్దాడు. ఈ 62 మీటర్ల ఎత్తున్న ఈ మినార్కు 14వ తతాబ్దంలో ఫిరోజ్షా తుగ్లక్ పై అంతస్థును నిర్మించాడు. ఈ నిర్మాణం ఇండో ఇస్లామిక్ సమ్మేళనం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులో అరబిక్ భాషలో రాసిన ఖురాన్ సూక్తులు కనిపిస్తాయి. నిర్మాణంలో వలలాంటి అల్లికల నిర్మాణం పర్షియన్ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. తామర రేకులను పోలిన అంచులు హిందూ నిర్మాణాల శైలికి నిదర్శనం. ఇందులో ఉపయోగించిన ఇటుకలను ఆఫ్గనిస్థాన్ నుంచి తెప్పించారు. ఈ ్రపాంతాన్ని ఏలిన పాలకులందరూ ఈ నిర్మాణానికి ఏదో ఒక సొబగులద్ది చరిత్రలో తమ పేరు కూడా ఉండేటట్లు జాగ్రత్తపడ్డారు.ఐరన్ పిల్లర్ ప్రత్యేక ఆకర్షణకుతుబ్మినార్తోపాటు అనేక కట్టడాలున్నాయి. విశాలమైన ్రపాంగణంలో ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పడానికి వీల్లేని నిర్మాణాల అవశేషాలుంటాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ శిథిలాలకు రూపమిచ్చే ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కుతుబ్మినార్ కట్టడం లాల్ కోట్ శిథిలాల మీద మొదలైందని చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడున్న ఐరన్ పిల్లర్ మరో చారిత్రక గొప్పదనం. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. కానీ తుప్పు పట్టదు. మనదేశంలో లోహశాస్త్రం ఎంత శాస్త్రబద్ధంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏయే లోహాలను ఎంతెంత నిష్పత్తిలో వాడారనే విషయంలో రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధనలు చేస్తుంటారు.టూర్ ప్యాకేజ్లిలా ఉంటాయి!∙ఢిల్లీకి విమానం లేదా రైల్లో వెళ్లిన తర్వాత లోకల్ టూర్ ప్యాకేజ్ తీసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఢిల్లీ డే టూర్ ప్యాకేజ్లుంటాయి.ఏసీ బస్సు లేదా విడిగా కారు మాట్లాడుకోవచ్చు. కారుకు రోజుకు ఏడు లేదా ఎనిమిది వేలుంటుంది. బస్సులో ఒకరికి వెయ్యి రూపాయలకు అటూఇటూగా ఉంటుంది. ∙ఢిల్లీకి వెళ్లడానికి ముందే నగరంలో చూడాల్సిన ప్రదేశాల జాబితాతోపాటు సిటీ టూర్ మ్యాప్ను పరిశీలించాలి. ఏయే ప్రదేశాలను ఒక క్లస్టర్గా ప్లాన్ చేసుకోవచ్చనే అవగాహన వస్తుంది. అలాగే ఆయా ప్రదేశాలకు సెలవు దినాల వివరాలను కూడా ఆయా వెబ్సైట్ల ద్వారా నిర్ధారించుకోవాలి.∙ఆహారం విషయానికి వస్తే చోలే–బటూరా, బటర్ చికెన్, జిలేబీ, రబ్రీ ఫాలూదాలను తప్పనిసరిగా రుచి చూడాలి. -
తాజ్మహల్లో తెలంగాణ రాళ్లు!
సాక్షి, హైదరాబాద్ : పాలరాతిని పేర్చి అద్భుత కట్టడంగా తాజ్మహల్ను మొఘల్ వంశీయులు ఎలా సృష్టించారో నిగ్గు తేల్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు అధ్యయనాలు చేస్తున్నారు. అలా కాలిఫోరి్నయాలోని విఖ్యాత జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్లు కూడా నాలుగైదేళ్లలో విడతలవారీగా వచ్చి అధ్యయనం చేపట్టారు. పైకి పాలరాతి నిర్మాణమే అయినప్పటికీ తాజ్ నిర్మాణంలో వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు.. ఇవి కూడా పొందికగా ఒదిగిపోయాయని తెలిసి వారు అధ్యయనానికి వచ్చారు. అలా జరిగిన వారి అధ్యయనం ద్వారానే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు పనిలోపనిగా మన దేవరకొండ, మహబూబ్నగర్ ప్రాంతం నుంచి వచ్చిన రాళ్లనూ మోశారని వెలుగు చూసింది. పర్చిన్కారీ పద్ధతిలో.. పాలరాతిపై వివిధ ఆకృతులతో కూడిన నగిషిలను విడిగా పేర్చినట్లుగా కాకుండా పాలరాతిలో అంతర్భాగంగా ఉండేలా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందుకు పర్చిన్కారి పద్ధతిని అనుసరించారు. ఇటలీ, గ్రీస్లలో పుటిన పియెట్రా డ్యురాకు కాస్త దగ్గరి పోలికుండే ఈ పర్చిన్కారి కళ 16వ శతాబ్దంలో భారత్లో అభివృద్ధి చెందింది. ముందుగా పాలరాతిపై ఆ ఆకృతిని గీసి దాని ప్రకారం రాయిని కట్ చేశారు. అదే ఆకృతిలో రంగురాళ్లును అరగదీసి సానబెట్టి మెరుపు తెప్పించాక, పాలరాయిని కట్ చేసిన భాగంలో పొదిగారు. దీంతో ఆ డిజైన్ రాయిలో భాగమనే భ్రమ కలిగిస్తోంది. అలా తాజ్మహల్ కట్టడంలో పాలరాతిలో ఇలాంటి ఎన్నో ఆకృతులు ఒదిగిపోయాయి. వాటిల్లో మన తెలంగాణ ప్రాంత రాళ్లు కూడా చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇంకొన్ని రాళ్లను పియెట్రా డ్యురా పద్ధతిలో పాలరాతిపై ప్రత్యేక జిగురుతో అతికించి కళాత్మకంగా ఆకృతులద్దారు. పలుగురాయిలో భాగమే.. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగురాళ్లు కనిపిస్తాయి. అలాంటి రాళ్లలో కొన్ని క్రిస్టల్ (పారదర్శకంగా) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటినే క్రిస్టల్ క్వార్ట్జ్గా పేర్కొంటారు. అవి విలువైన స్ఫటికంలో భాగమే. వాటిని నగల నగిషిల్లో వినియోగిస్తారు.మన రాళ్లే ఎందుకు?.. తాజ్ కట్టడం గోడలపై పాలరాయి పరుచుకుంది. కానీ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని కోరుకున్న మొఘల్ వంశీయులు ఆ పాలరాతి మీదుగా పూలతో కూడిన లతలు అల్లుకున్న అనుభూతిని కలిగించాలనుకున్నారు. నగల్లో వాడే వజ్రాలు, పచ్చలు, కెంపులు.. ఇలా అన్నింటినీ ఈ నగిషిలకు వాడాలని నిర్ణయించి వాటికి ప్రపంచంలో ఏయే ప్రాంతాలు ప్రసిద్ధో గుర్తించారు. ఆయా దేశాలను గాలించి వాటిల్లో మేలిమి వాటిని సేకరించి తెచ్చి తాజ్మహల్ నిర్మాణంలో వాడారు. అలా వాడే విలువైన రాళ్ల జాబితాలో క్రిస్టల్ క్వార్ట్జ్ (ఓ రకమైన స్పటికం) కూడా ఒకటి. వాటికి ఏ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయో గాలిస్తే.. గోల్కొండ మైన్ అనే సమాధానం వచ్చిoది. కృష్ణా నదీ తీరాన్ని ఆసరా చేసుకొని గోల్కొండ గనులు విస్తరించాయి. ఇది వజ్రాలతోపాటు క్రిస్టల్ క్వార్ట్ జ్ కూడా ప్రసిద్ధే. అయితే ఇది ఆ గనుల ఆమూలాగ్రంలో లభించదు. మేలిమి రాళ్లు ప్రస్తుత దేవరకొండ, మహబూబ్నగర్లలోనే దొరికేవి. దీంతో ఈ ప్రాంతం నుంచి క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను తెప్పించారన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న విషయం. నాణ్యత ఆధారంగా చూస్తే ఈ ప్రాంతానివే.. తాజ్మహల్లోని రాళ్లలో మేలిమి స్ఫటికంలా ఉన్నవి లభించే ప్రాంతాలు దేవరకొండ, మహబూబ్నగర్ పరిసరాలే. మేలిమి రాళ్లను సేకరించిన షాజహాన్.. ఈ రాళ్ల విషయంలోనూ నాణ్యమైనవే గుర్తించారు. అప్పటి వర్తకంలో కీలకంగా ఉన్న ప్రాంతాల నుంచే సేకరించినందున అవి ఈ ప్రాంతాలకు చెందినవిగానే పరిగణించాల్సి ఉంటుంది. – చకిలం వేణుగోపాలరావు, జీఎస్ఐ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ -
పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రాను అధిగమించిన అయోధ్య
ఇప్పటివరకు పర్యాటకుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలోని తాజ్మహల్ను ఆయోధ్య రామ మందిరం వెనక్కి నెట్టి, మొదటి స్థానంలోకి వచ్చిoది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పర్యాటకులు సందర్శించిన నగరంగా ఆయోధ్య రికార్డులకు ఎక్కింది. ఈ 9 నెలల్లో ఆగ్రాను 12.51 కోట్ల మంది సందర్శించగా.. అయోధ్యను 13.55 కోట్ల మంది సందర్శించినట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 22న ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అట్టహాసంగా ప్రారంభమై అయోధ్య రామ మందిరం దేశీయ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా చేరింది. విదేశీయులు 3,153 మంది మాత్రమే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో అయోధ్య దూసుకుపోతోందని ట్రావెల్ ప్లానర్స్ చెబుతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకుల్లో 70 శాతం మంది రామమందిరం, సరయు నది అందాలను తిలకిస్తూ పరవశించిపోతున్నారని చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
తాజ్మహల్కు బాంబు బెదిరింపు.. రంగంలోని బాంబ్ స్క్వాడ్
ఆగ్రా: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం, బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఆగ్రాలోని తాజ్మహల్ను పేల్చేస్తామని ఉత్తర్ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజ్మహల్ వద్ద సోదాల అనంతరం.. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Uttar Pradesh | Taj Mahal in Agra received a bomb threat via email todayACP Taj Security Syed Areeb Ahmed says, "Tourism department received the email. Based on that, a case is being registered at Tajganj police station. Further investigation is being done..."(Pics: ACP Taj… pic.twitter.com/1lw3E34dOM— ANI (@ANI) December 3, 2024 -
తాజ్మహల్, చార్మినార్నూ కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ముస్లింల సారథ్యంలో నిర్మాణం పూర్తిచేసుకున్న దేశంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ కూల్చేస్తారా అంటూ బీజేపీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూటి ప్రశ్న వేశారు. దేశంలోని ప్రతి మసీదు వద్దా సర్వేలు చేపడుతూ బీజేపీ నాయకత్వం భారతీయ సమాజాన్ని విభజిస్తోందని ఆరోపించారు. ‘‘అర్థంపర్థం లేని సర్వేలతో ప్రజలను మోదీ ఐక్యంగా, శాంతంగా జీవించకుండా చేస్తున్నారు. ముస్లింలు నిర్మించారు కాబట్టి ఎర్రకోట, తాజ్మహల్, కుతుబ్ మినార్, చార్మినార్ వంటివాటన్నింటినీ కూల్చేస్తారా?’’ అని సూటిగా ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్లోని సంభాల్లో మసీదు ఉన్న చోట గతంలో హిందూ ఆలయం ఆనవాళ్లున్నాయా అని తెల్సుకునేందుకు సర్వే చేపట్టడం, దానిపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆ ఉద్రిక్తత చివరికి పోలీసు ఘర్షణలకు, మరణాలకు దారి తీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే కూల్చివేతల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘‘ఒక తీర్పు తర్వాత దేశ చరిత్రలో ఎన్నడూలేని పోకడ మొదలైంది. మసీదుల కింద ఆలయాల ఆనవాళ్లున్నాయో కనుగొనేందుకు సర్వేల పేరిట బయల్దేరారు. వీటికి మద్దతు పలికే వారి సంఖ్యా పెరిగింది. దశాబ్దాలుగా ఉన్న ప్రార్థనాస్థలాల స్వభావాన్ని కొత్తగా మార్చకూడదని 1991నాటి చట్టం స్పష్టంచేస్తోంది. అయినాసరే ఆ చట్ట ఉల్లంఘనకు బీజేపీ బరితెగిస్తోంది’’ అంటూ మండిపడ్డారు. మోదీని ఉద్దేశిస్తూ.. ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామని మీరన్నారు. మేము ఇప్పటికే ఐక్యంగా ఉన్నాం. ఐక్యంగా ఉన్న మమ్మల్ని విభజించేది మీరే’’ అని ఖర్గే దుయ్యబట్టారు.భాగవత్ మాటా బీజేపీ వినదా?‘‘2023లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక మంచి విషయం చెప్పారు. ‘రామమందిర నిర్మాణమే మన లక్ష్యం. అంతేగానీ మనం ప్రతి మసీదు కింద శివాలయం వెతకకూడద’ని చెప్పారు. కానీ భాగవత్ మాటను కూడా మోదీ, అమిత్షా సహా బీజేపీ నేతలెవరూ అస్సలు పట్టించుకోవట్లేదు. బహుశా భాగవత్ తాను బహిరంగంగా చెప్పే కొన్ని విషయాలను బీజేపీ నేతలకు చెప్పరేమో. వీళ్లందరిదీ మొదటినుంచీ ద్వంద్వ వైఖరే’’ అంటూ ఖర్గే మండిపడ్డారు. ‘‘గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు తమ హక్కులను మాత్రమే గాక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అప్పుడే వారి లక్ష్యాలను నెరవేర్చుకోగలరు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనందరం ఐక్యంగా నిలబడదాం. ఐక్యంగా ఉంటే కులాల ప్రాతిపదికన ప్రయతి్నంచినా మన ఐక్యతను మోదీ విచి్ఛన్నం చేయలేరు. సాధారణ ప్రజానీకం అంటే మోదీకి గిట్టదు. మనల్ని ద్వేషించే వాళ్లతోనే మన పోరు. అందుకే రాజకీయ శక్తి అనేది చాలా ముఖ్యం’’ అని ఖర్గే అన్నారు. -
తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం
ఆగ్రా: ప్రపంచ అద్భుతాలతో ఒకటైన తాజ్ మహల్ మాయమవడం ఏంటి? ఇది పచ్చి అబద్ధం అని అనుకుంటున్నారా? కాదు.. కాదు.. ఇది నిజం.. ఇటీవలికాలంలో తాజ్ మహల్ మాయమైపోతోంది. ఇది ఉదయం వేళల్లో జరుగుతోంది. దీనివెనకగల కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.దేశరాజధాని ఢిల్లీలో మాదిరిగానే ఇప్పుడు యూపీలోని ఆగ్రా నగరంలోనూ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆగ్రావాసులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజ్ మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదయ్యింది. ఈ నేపధ్యంలో ఏర్పడిన పొగమంచు తాజ్ మహల్ను కప్పేస్తోంది. దీంతో ఉదయం వేళ తాజ్ అందాలు చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.ఢిల్లీ గ్యాస్ చాంబర్గా మారిపోయింది. ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీకి పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది. ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు, రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏక్యూఐ ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి, రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరితో ఆగ్రాలోని పలు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్ను వినియోగించాలని సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ -
తాజ్మహల్ ప్రధాన గోపురం నుంచి లీకేజీ : స్పందించిన అధికారులు
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనం తాజ్మహల్కి వర్షాల బెడద తప్ప లేదు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఢిల్లీలోని ఆగ్రాలో కొలువై వున్న ప్రేమసౌథం తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకైంది. దీంతో తాజ్ మహల్ ఆవరణలో ఉద్యానవనం నీట మునిగింది. ఈ లీకేజీకి సంబంధించి 20 సెకన్ల వీడియో ఇంటర్నెట్లో వీడియో గురువారం వైరల్గా మారింది.అయితే, సీపేజ్ కారణంగా లీకేజీ ఉందని, పాలరాతి భవనానికి ఎలాంటి నష్టం లేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI), ఆగ్రా సర్కిల్ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డ్రోన్ కెమెరా ద్వారా ప్రధాన డోమ్ను పరిశీలించామని ప్రమాదం ఏమీలేదని చెప్పారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.ఏఎస్ఐ సూపరింటెండింగ్ చీఫ్ రాజ్కుమార్ పటేల్ తెలిపారు. తోటలలో ఒకటి వర్షం నీటితో మునిగి పోయింది. దీన్ని తాజ్ మహల్ను సందర్శించిన పర్యాటకులు వీడియో తీశారని పేర్కొన్నారు.🇮🇳 Taj Mahal Gardens Submerged After Incessant Rain Hits India's AgraWork is ongoing to drain the water from one of the Seven Wonders of the World.pic.twitter.com/C5shcu4HZh— RT_India (@RT_India_news) September 12, 2024 తాజ్ మహల్ మొత్తం దేశానికి గర్వకారణమని వేలాది పర్యాటకులు ఆకర్షిస్తున్న ఈ ప్రదేశంలో పర్యాటక పరిశ్రమలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుందని దీనిపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇదే తమ ఏకైక ఆశాదీపమని టూర్ గైడ్ ఒకరు కోరారు. కాగా ఆగ్రాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రాజధాని నగరంలోని ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు జలమయ మైనాయి. వర్ష కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
ఆగ్రాలో మరో అద్భుతం: భర్త జ్ఞాపకార్థం ఎర్ర తాజ్మహల్
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన తాజ్ మహల్. ఈ ప్రేమ చిహ్నాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం ఆగ్రాకు తరలి వస్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ నిర్మించారు. అయితే ఆగ్రాలో మరో తాజ్ మహల్ కూడా ఉంది. దీని వెనుక కూడా ఒక ఓ ప్రేమకథ ఉంది. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం రెడ్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్ మహల్ ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది తెల్లని తాజ్ మహల్ను పోలివుంటుంది. అయితే పరిమాణంలో తాజ్మహల్ కన్నా చిన్నదిగా ఉంటుంది.ఈ ఎర్ర తాజ్ మహల్ ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో గల రోమన్ క్యాథలిక్ స్మశానవాటికలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రాజ్కిషోర్ శర్మ పుస్తకం ‘తవారిఖ్-ఎ-ఆగ్రా’లో రాసిన వివరాల ప్రకారం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, వారి సైన్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విడిది చేసింది. అదే సమయంలో ఆగ్రా కోట భద్రత కోసం జాన్ విలియం హాసింగ్ అనే డచ్ అధికారిని ఇక్కడ నియమించారు. నాడు అతనితో పాటు అతని భార్య ఆలిస్ హాసింగ్ కూడా ఆగ్రాకు వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది.వారు తాజ్మహల్ను చూసి తెగ సంబరపడిపోయారు. దీంతో ఆ దంపతులు తమలో ఎవరు ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళతారో వారి జ్ఞాపకార్థం మరొకరు తాజ్మహల్ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జాన్ హాసింగ్ 1803, జూలై 21న మృతి చెండారు. దీంతో అతని భార్య.. భర్త జ్ఞాపకార్థం ఆగ్రాలోని రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో రెడ్ తాజ్ మహల్ను నిర్మించారు. -
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్మహల్కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం. -
నల్లరాతి తాజ్మహల్ ఎక్కడుంది? దేనికి చిహ్నం?
ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా పేరుగాంచింది. యమునా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన పాలరాతి భవనం ప్రేమలో మునిగితేలిన చక్రవర్తి కథను చెబుతుంది. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం దీనిని నిర్మించాడు. అయితే మన దేశంలో నల్లరాతి తాజ్ మహల్ కూడా ఉందనే సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ ఇదెక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఇది ఏ భావోద్వేగానికి గుర్తు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నల్లరాతి తాజ్మహల్ మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరం బుర్హాన్పూర్లో ఉంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ నల్లరాతి తాజ్ మహల్ను చూశాకే.. ఆగ్రాలో పాలరాతి తాజ్ మహల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. బుర్హాన్పూర్ను చాలా కాలం పాటు మొఘలులు పాలించారు. అందుకే ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్తో పాటు అనేక చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. బుర్హాన్పూర్లోని ఉతావలి నది ఒడ్డున బ్లాక్ తాజ్ మహల్ నిర్మితమయ్యింది. ఇది ఆగ్రాలోని తాజ్ మహల్ కంటే కొంచెం చిన్నది. ఇది అబ్దుల్ రహీం ఖాన్ఖానా పెద్ద కుమారుడు షానవాజ్ ఖాన్ సమాధి. షానవాజ్ ఖాన్ కేవలం 44 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. అతనిని బుర్హాన్పూర్లోని ఉతావలి నది ఒడ్డున ఖననం చేశారు. అతను మరణించిన కొంతకాలానికి అతని భార్య కూడా మృతి చెందింది. షానవాజ్ ఖాన్ సమాధి పక్కనే ఆమెను కూడా ఖననం చేశారు. వీరిదిద్దరి మరణం తరువాత మొఘల్ చక్రవర్తి జహంగీర్ 1622- 1623 మధ్య కాలంలో ఇక్కడ బ్లాక్ తాజ్ మహల్ను నిర్మించాడు. ఈ నల్లరాతి తాజ్ మహల్ షానవాజ్ ఖాన్, అతని భార్య మధ్య ఉన్న ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. నల్లరాళ్లతో నిర్మించిన ఈ తాజ్మహల్ను చూసేందుకు మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి పర్యాటకులు తరలి వస్తుంటారు. ఈ బ్లాక్ తాజ్మహల్ను పురావస్తు శాఖ పర్యవేక్షిస్తోంది. దీని మినార్లు కూడా తాజ్ మహల్ మాదిరిగానే ఉంటాయి. -
ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం!
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ మహల్ని జీవితంలో ఒక్కసారైన చూడాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ఆగ్రాలో ఉండే ఈ కట్టడాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. దీన్ని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎవరైనా ఆగ్రా ప్రయాణానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రతి ఏడాది జరిగే తాజ్ మహోత్సవ్ (Taj Mahotsav 2024)న్ని అస్సలు మిస్సవ్వరు. తాజ్ మహోత్సవ్ ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో జరుగుతుంది.ఈ ఏడాది ఈ ఉత్సవం ఫిబ్రవరి 17న ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. పర్యాటకుల కోసం ఈసారి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణతోపాటు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వంటివి ఏర్పాటు చేయడం విశేషం. ఎన్ని రోజులు జరుగుతుందంటే.. ఈ ఏడాది తాజ్ మహోత్సవం ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి. తాజ్ మహోత్సవ్ అనేది 10 రోజుల పాటు జరిగే వార్షిక కార్యక్రమం.సరిగ్గా ఇది ఫిబ్రవరి 27న ముగుస్తుంది. ఈసారి ప్రత్యేకతలు... ఈ ఏడాది తాజ్ మహోత్సవ్లో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. ఈసారి యమునా మహా ఆరతి తాజ్ మహోత్సవ్లో కనిపించనుంది. యమునా నది ఘాట్లపై తాజ్ మహోత్సవం సందర్భంగా మహా ఆరతి కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యాటకుల కోసం గాలిపటాల పండుగ, గజల్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు.. తాజ్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను చూడటం ఒక విభిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం ప్రసిద్ధ కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. తాజ్ కమిటీ, ఉత్తర్ ప్రదేశ్ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాజ్ మహల్ తూర్పు ద్వారం సమీపంలోని శిల్పగ్రామ్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. తాజ్ మహోత్సవ్లో భారతీయ సంగీతం, నృత్యానికి సంబంధించిన వివిధ రకాలను చూసే అవకాశం లభిస్తుంది. ఇక్కడకు వచ్చి కథక్, భరతనాట్యం, క్లాసికల్, సబ్-క్లాసికల్ గానం, భోజ్పురి గానం, అవధి గానం, ఖవ్వాలి, భజన్ సంధ్య, బ్రజ్ జానపద పాటలు, జానపద నృత్యాలు, వేణువు, సరోద, సితార్, తబలా, పఖావాజ్, రుద్రవీణ మొదలైనవి వాయించడం ఆస్వాదించవచ్చు. తాజ్ మహోత్సవ్లో ప్రముఖ బాలీవుడ్ కళాకారులు కూడా ప్రదర్శన ఇస్తారు. ఇందులో గజల్ సింగర్, ఖవ్వాలి, సింగర్, స్టాండప్ కామెడీ, తదితర ఈవెంట్లను కూడా నిర్వహిస్తారు. ఇవీ కాకుండా ఇంకా దేశం నలుమూలల నుండి వచ్చే వందలాది మంది కళాకారులు తమ అద్భుతమైన శిల్ప కళా, హస్త కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచుతారు. ఇక్కడ చాలావరకు ప్రాంతీయ ప్రత్యేకతలు కలిగిన అన్నీ కళాఖండాలు ఒకేచోట కొలువుదీరుతుండటం విశేషం. ఇందులో ఈశాన్య రాష్ట్రాల నుంచే వచ్చే కళాకారులు వెదురు బొంగుతో తయారు చేసిన బొమ్మలు ప్రదర్శనలో ఉంచుతారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారు రాతి శిల్పాలు, అలాగే జమ్మూ కశ్మీర్ నుంచి వచ్చేవారు తివాచీలు, షాలువాలు, స్వెటర్ల వంటివి ప్రదర్శనకు ఉంచుతారు. ఇక్కడ హస్తకళా కళల ప్రదర్శన, దుకాణాలు, రుచికరమైన ఆహారం కోసం ఫుడ్ జోన్ తదితరాలు పర్యాటకులు ఎంతగానో ఆకర్షిస్తాయి.తాజ్ మహోత్సవ్ ప్రవేశ టికెట్ రూ. 50. విదేశీ పర్యాటకులు ఐదేళ్లలోపు పిల్లలకు ప్రవేశ రుసుము లేదు. Glimpses of Taj Mahotsav: A Cultural Extravaganza in the Heart of Agra. Celebrating 33 years in 2024 Experience India's rich arts, crafts, music, cuisine. With 400 artisans showcasing woodwork, stone carving, mesmerizing performances, delicious food. 17th to 27th Feb, 2024. pic.twitter.com/TU4yAvWB9C — Taj Mahal (@TajMahal) February 15, 2024 (చదవండి: తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే! భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
Priyanka Jain- Shivakumar: తాజ్మహల్ ముందు ప్రియాంకకు ప్రపోజ్ చేసిన నటుడు (ఫోటోలు)
-
తాజ్ సందర్శకునికి గుండెపోటు.. సీపీఆర్ ఇచ్చి కాపాడిన కుమారుడు!
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో గల తాజ్ మహల్ చూసేందుకు వచ్చిన ఒక వృద్ధుడు గుండెపోటుకు గురయ్యాడు. అయితే వెంటనే స్పందించిన అతని కుమారుడు సీపీఆర్ (కార్డియో-పల్మనరీ రిససిటేషన్) చేయడంతో బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే ఒక వృద్ధుడు కుటుంబ సమేతంగా తాజ్ మహల్ సందర్శనకు వచ్చాడు. అతను తాజ్మహల్ కాంప్లెక్స్ లో గుండెపోటుకు గురయ్యాడు. అతని కుమారుడు వెంటనే తండ్రికి సీపీఆర్ ఇచ్చి అతని ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటనను పలువురు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే సీపీఆర్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చని ఈ వీడియో తెలియజేస్తోంది. సీపీఆర్తో కోలుకున్న బాధితుడిని తక్షణం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గుండెపోటుకు గురైన బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య సహాయం అందేలోగా సీపీఆర్ చేయడం ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. బాధితుని శరీరంలో రక్తప్రవాహం కొనసాగేందుకు సీపీఆర్ సహాయ పడుతుంది. తద్వారా వారి ప్రాణాలు నిలిచే అవకాశం మూడు రెట్లు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. आगरा ➡ताजमहल के अंदर CPR देते का लाइव वीडियो वायरल ➡पर्यटक को सीपीआर देते का लाइव वीडियो हुआ वायरल ➡ताजमहल देखने आए पर्यटक को आया था हार्ट अटैक ➡काफी देर तक CPR देने के बाद पर्यटक की लौटी जान ➡ताजमहल परिसर के अंदर वीडियो प्लेटफार्म का मामला.#Agra pic.twitter.com/hRxTtDwXIu — भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 15, 2023 -
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ అరుదైన ఘనత
బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించింది. విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్టివ్ బిల్బోర్డ్ను ఆవిష్కరించడంతో ఈ ఘనతను సాధించింది. 'మేఘ్ సంతూర్' పేరుతో 2250 చదరపు అడుగుల బిల్బోర్డ్ను ప్రదర్శించింది. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి ఏర్పాటు చేసిన ఈ బిల్ బోర్డ్ విజయవాడ నగర వాసుల్ని సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టేలా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దీంతో బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సందర్భంగా న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు. -
డేంజర్ యమున.. తాజ్ మహల్ను తాకిన వరద
ఢిల్లీ: దేశ రాజధానిని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షంతో.. యమునా నది మళ్లీ ఉప్పొంగి డేంజర్ మార్క్ను చేరుకుంది. నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. దీంతో.. ప్రపంచ వింత ‘తాజ్మహల్’ ను యమునా వరద తాకగా.. ఓ గార్డెన్ నీట మునిగింది కూడా. సరిగ్గా 45 కిందట.. ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. 1978లో తాజ్మహల్ను యమునా వరద ముంచెత్తింది. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు సాహసం చేయొద్దని స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు. #WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023 వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. మరోవైపు యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి. -
Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర ఘటన వెలు గుచూసింది. ఆగ్రాలోని తాజ్మహల్ను చూసేందుకు వచ్చిన ఓ పర్యాటకుడిపై స్థానిక యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పర్యాటకుడిని వెంబడించి మరీ కర్రలు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఇదంతా మంగళవారం ఉదయం జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు ఓ షాప్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్మహల్ చూసేందుకు ఆదివారం ఆగ్రా వచ్చాడు. ఈ క్రమంలో తాజ్గంజ్ ప్రాంతంలోని బసాయ్ చౌకీ వద్ద కారులో వెళ్తుండగా పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భక్తులను తన వాహనం తాకింది. పర్యాటకుడు కారు ఆపి వాళ్లకు క్షమాపణలు చెప్పాడు. అయినా వారు వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకునేందుకు భయంతో అతడు దగ్గర్లోని ఓ స్వీట్ షాప్లోకి పరుగెత్తాడు. అతన్ని వెంబడించిన దుండగులు షాప్లోకి చొరబడి కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారు. తప్పు అయ్యింది, క్షమించాలని వేడుకున్నా వదల్లేదు. కొంత సమయం పాటు అతన్ని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయారు. Video from Agra . Tourist Beaten by Locals. #shameful #SeemaHaider #KiritSomaiya #Agra #DelhiFloods pic.twitter.com/zuXq7qdwLN — देश सर्वप्रथम (@deshsarvpratham) July 18, 2023 దీనిపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తమలో ఒకడిని కారుతో ఢీ కొట్టాడన్న కారణంతోనే దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజ్మహల్ గొప్ప పర్యటక ప్రాంతమని, దీనిని చూసేందుకు రోజు వేలల్లో టూరిస్టులు వస్తుంటారని, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. చదవండి: సరిహద్దులు దాటిన ‘కృష్ణ’ ప్రేమ.. బంగ్లాదేశ్ నుంచి రహస్యంగా వచ్చి.. पर्यटक के साथ मारपीट से संबंधित वायरल वीडियो का स्वत: संज्ञान लेकर, #थाना_ताजगंज पुलिस द्वारा तत्काल अभियोग पंजीकृत कर, 03 टीमों का गठन करते हुए, 05 आरोपियों को हिरासत में लिया गया है व अन्य आरोपियों की गिरफ्तारी हेतु लगातार प्रयास किया जा रहा है। pic.twitter.com/yoyjGb6J3d — POLICE COMMISSIONERATE AGRA (@agrapolice) July 17, 2023 -
కుక్కను కారులోనే వదిలి తాజ్మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే..
ఆగ్రా: తాజ్మహల్ సందర్శించడానికి వెళ్లిన ఒకతను తన వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి కారులోనే వదిలి వెళ్లడంతో ఆ వేడికి ఊపిరాడక చనిపోయిన సంఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. వేసవి సెలవుల్లో హర్యానా నుండి తాజ్మహల్ని సందర్శించడానికి వెళ్లిన ఒక పెద్దమనిషి కార్లో తనతో పాటు తన పెంపుడు కుక్కను కూడా తీసుకుని వెళ్ళాడు. తాజ్మహల్ అందాలను ఆస్వాదించే సమయంలో అడ్డుగా ఈ శునకం ఎందుకు అనుకున్నాడో ఏమో పాపం ఆ మూగ జీవిని కారులోనే బంధించి పార్కింగ్ చేసి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తాజ్మహల్ అందాలను తనివితీరా ఆస్వాదించి తిరిగొచ్చి చూసే సరికి కారులో తన పెంపుడు కుక్క విగతజీవిగా కనిపించింది. కారులో బంధించిన ఆ కుక్క గంటల తరబడి పార్కింగ్లో ఎండ వేడిమికి తట్టుకోలేక ఊపిరాడక చనిపోయింది. భగభగ మండే ఎండలను మనుషులే తట్టుకోలేకపోతుంటే పాపం ఆ మూగజీవం ఏం భరిస్తుంది? వేసవితాపానికి విలవిలలాడి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన తాలూకు హృదయవిదారకమైన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒకాయన.. పెంపుడు జంతువులను చేరదీయడం చేతకాకపొతే వాటిని పెంచుకునే ప్రయత్నం చేయకండి అని హితవు పలికాడు. A dog died due to heat and suffocation as his owners left him in their parked car to visit Taj Mahal. If you can’t treat your pets properly then don’t adopt them. https://t.co/4ZI7iMj6n1 — Rishi Bagree (@rishibagree) July 3, 2023 ఇది కూడా చదవండి: టైటాన్ విషాదం: నా భర్త, బిడ్డ చివరి రోజులు తలచుకుంటే.. -
తాజ్మహల్ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే
గువాహటి: చారిత్రక కట్టడం తాజ్మహల్పై అస్సాం బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నిజయోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ.. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. ‘తాజ్మహల్ ప్రేమకు చిహ్నం కాదు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్మహల్ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్ అంటే షాజహాన్కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు’ అని ప్రశ్నించారు. అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్ ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా భావిస్తే.. మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు. NCERT తాజాగా మొఘలులపై పాఠ్యాంశాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నాము. కాగా మొఘల్ కాలం నాటి కట్టడాలైన తాజ్ మహల్, కుతుబ్ మినార్లను కూల్చివేసి.. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయాలను నిర్మించాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు తెలిపారు. ఆలయాల నిర్మాణాలకు తన ఏడాది జీతాన్ని కూడా విరాళంగా ఇస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా దీనిని నిర్మించారు. నేటికి దీనిని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. Guwahati, Assam | Taj Mahal is not the symbol of Love. Shah Jahan built Tajmahal in memory of his 4th wife Mumtaz. If he loved Mumtaz, then why he married three times more after the death of Mumtaz: BJP leader Rupjyoti Kurmi (05.04) — ANI (@ANI) April 6, 2023 -
తాజ్మహల్ని చూసి.. ముషారఫ్ ఏం అన్నారంటే..
పాక్ మాజీ అధ్యక్షుడు దివంగత పర్వేజ్ ముషారఫ్ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఆగ్రా సమ్మిట్ కోసం భారత్ని సందర్శించారు. అప్పుడు ఆయన తన సతీమణితో కలిసి ఆగ్రాలోని ప్రేమకు స్మారక చిహ్నం అయిన తాజ్మహల్ని సందర్శించారు. ముషారఫ్ తాజ్ మహల్ నిర్మాణ అద్భుతానికి ఎంతగానో మంత్ర ముగ్దులయ్యారు. ఆ స్మారక చిహ్నాన్ని చూసినప్పుడూ ఆయన అడిగిన మొదటి ప్రశ్న గురించి చెబుతూ.. నాటి సంఘటనను పురావస్తు శాస్తవేత్త కెకె మహ్మద్ గుర్తు చేసుకున్నారు. ముషారఫ్ తాజ్మహల్ సందర్శించడానికి వచ్చినప్పుడు మహ్మద్ పురావస్తు శాఖలోని ఆగ్రా సర్కిల్కు సూపరింటెండ్ ఆర్కియాలజిస్ట్గా ఉన్నారు. ముషారఫ్ తాజ్మహల్ని చూసిన వెంటనే దీన్ని ఎవరూ రూపొందించారు అని మహ్మద్ని ప్రశ్నించారు. బహుశా ఆయన నేను షాజహాన్ అని చెబుతానని అనుకుని ఉండోచ్చు, కానీ నేను ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అని చెప్పానన్నారు మహ్మద్. ఎందుకంటే ఉస్తాద్ లాహోర్కి చెందినవాడు. ముషారఫ్కి ఆ ప్రేమ స్మారక చిహ్నం విశిష్టత గురించి చెప్పేందుకు మహ్మద్ని టూరిస్ట్ గైడ్గా నియమించారు. ఈ స్మారక చిహ్నం ఆప్టికల ఇల్యూషన్ గురించి కూడా చెప్పినట్లు మహ్మద్ గుర్తు చేసుకున్నారు. అంతేగాదు ముషారఫ్ తనని తాజ్మహల్ని చూడటానికి ఉత్తమమైన సమయం ఎప్పుడూ అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. సూర్యుని కిరణాలు ఆ స్మారక కట్టడంపై పడగానే పాలరాతి మహల్ కాస్తా ధగధగ మెరుస్తుందని, అలాగే వర్షం కురిసినప్పుడూ బాధగా విలపిస్తున్నట్లు కనిపిస్తుందని చెప్పినట్లు తెలిపారు. అంతేగాదు తాను ముంతాజ్, షాజహాన్ల వివాహం లాహోర్ కోటలో జరిగిందని, మొఘల్ చక్రవర్తి జన్మస్థలం కూడా అదేనని చెప్పడంతో ముషారఫ్ ఒక్కసారిగా తాను తనవారి ఇంట్లో ఉన్నట్లు భావించారని చెప్పారు మహ్మద్. వాస్తవానికి మహ్మద్ ఆ తాజ్మహల్ని చూడటానికి 45 నిమిషాల సమయం ఇచ్చాం గానీ కానీ ఆయన తన భార్యతో కలిసి కాసేపు వ్యక్తిగతంగా గడిపేలా మరో 15 నిమిషాలు పొడిగించినట్లు మహ్మద్ నాటి సంఘటనను వివరించారు. కాగా, ముషారఫ్ సెప్టెంబర్ 25, 2006న తాను రచించిన ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ ఏ మెమోరియల్ పుస్తకంలో ఈ తాజ్మహల్ గురించి ప్రస్తావించారు. అందులో ..ఆగ్రా అనేది తాజ్మహల్ స్మారక ప్రదేశం. ఇది ప్రేమకు సంబంధించిన మొఘల్ స్మారక చిహ్నం. ఈ కట్టడం అతీతమైన అందం కారణంగానే ప్రపంచంలోని అద్భుతాలలో ఒకటిగా నిలించింది అని ముషారఫ్ పుస్తకంలో పేర్కొన్నారు. (చదవండి: జెలెన్స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? పుతిన్ ఏమన్నారంటే..) -
Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్మహల్కు నోటీసులు..
లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్మహల్కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్మహల్కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్ను 15 రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజ్మహల్కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు. మరోవైపు తాజ్మహల్కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్మహల్కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్.. -
‘తాజ్మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
తాజ్ మహల్: గదులు తెరిపించాలన్న పిటిషన్ తిరస్కరణ
అలహాబాద్: తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. తాజ్మహల్ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. ‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్లో కాదు అంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది. సీల్ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్ మీడియా ఇన్ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ వాస్తవానికి తేజ్ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్ మహల్ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో వరల్డ్ హెరిటేర్ సైట్ గుర్తింపు దక్కించుకుంది కూడా. చదవండి: తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా -
తాజ్ మహల్ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా కుమారి
జైపూర్: ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజ్ మహల్లోని 22 గదుల్ని తెరవాలంటూ ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజ్ మహల్ ఉన్న ప్రాంతం.. తమ రాజకుటుంబానికి చెందినదే అంటూ రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి అంటున్నారు. ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని బుధవారం రాజస్థాన్ బీజేపీ ఎంపీ దియా కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు. ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్ మహల్లో 22 గదులు తెరవాలని పిటిషన్ వేశారు. దానికి నేను మద్ధతు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే తమ పూర్వీకులకు(జైపూర్ పాలకుల) సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు. -
Taj Mahal: వట్టి మాటకు గట్టి ప్రచారం!
తాజ్మహల్ నిర్మాణం వెనుక గొప్ప కళాచాతుర్యం ఉన్నట్లే కొన్ని పేలవమైన కల్పనలూ ఉన్నాయి. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అపురూపమైన నిర్మాణం జరగకుండా తాజ్మహల్ను నిర్మించిన వారి చేతులను షాజహాన్ నరికించాడన్నది మనం వింటూ వస్తున్న ఒక కల్పన. గత డిసెంబరులో ప్రధాని మోదీ వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్ను ప్రారంభించిన సందర్భంగా పారిశుధ్య కార్మికులపై పూలజల్లు కురిపించినప్పుడు... ‘నాటి రాజు షాజహాన్ కార్మికుల చేతులను నరికిస్తే.. నేటి రాజు నరేంద్ర మోదీ కార్మికులపై పూలవర్షం కురిపించారు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అలా ఒక అవాస్తవానికి మళ్లీ పిలకలు బయల్దేరాయి. తాజ్మహల్ నిర్మాణం ఎలా సాగిందనేది చేతిరాతతో అరబిక్ లిపిలో పొందుపరిచి ఉన్న సమాచారం ఆధారంగా అర్థమౌతుందని యునెస్కో పేర్కొంది. తాజ్ గోపుర సమాధి, లోపలి వెలుపలి భాగాలను నిర్మించడానికి తాపీ పనివాళ్లను, రాళ్లు చెక్కేవారిని, మణులను పొదిగేవారిని, చిత్రకారులను, శిల్పకళా నిపుణులను ఆ కాలంలోనే షాజహన్ తన మొత్తం సామ్రాజ్యం నుండి, ఇంకా.. మధ్య ఆసియా, ఇరాన్ నుండి రప్పించారు. తాజ్ మహల్ ఇండో–ఇస్లామిక్ నిర్మాణ శైలికి గొప్ప తార్కాణమని యునెస్కో కీర్తించింది. తాజ్ నిర్మాణ కార్మికులకు, కళాకారులకు ఇచ్చిన జీతభత్యాలు, నెలసరి వేతనాలలో షాజహాన్ గొప్ప ఉదారతను ప్రదర్శించినట్లు కూడా నాటి జమాఖర్చుల పుస్తకాలను బట్టి తెలుస్తోంది. ఉదా: రాళ్లను చెక్కే అటా ముహమ్మద్ అనే నిపుణుడికి నెలకు రూ.500 చెల్లించారు. ఉజ్బెకిస్థాన్లోని బుఖారా నుంచి వచ్చిన షాకీర్ ముహమ్మద్ అనే కట్టుబడి మేస్త్రి నెలకు రూ.400 అందుకున్నాడు. ముల్తాన్కు చెందిన తాపీ కార్మికుడు ముహమ్మద్ సజ్జాద్ నెలకు రూ. 590, లాహోర్ నుంచి వచ్చిన ముఖద్వార నిర్మాణ కార్మికుడు చిరంజీలాల్కు నెలకు రూ.800 ఇచ్చారు. వాళ్లకు ఇచ్చిన ఈ భారీ మొత్తాలను బట్టి వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో నిర్దిష్టమైన పనికి బాధ్యత వహించేవాళ్లనుకోవచ్చు. చెప్పి చేయించేవాళ్ల చేతులను కానీ, చెప్పింది చేసేవాళ్ల చేతులను కానీ షాజహాన్ నరికించారు అనడంలో ఆధారాల మాట అటుంచి, అసలు అర్థమే లేదు. (చదవండి: రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!) మేస్త్రీలు కాకుండా.. వాస్తుశిల్పులు, చేతిరాత నిపుణులు, నిర్వాహకులు కూడా నిర్మాణంలో పాల్పంచుకున్నారు. వాళ్ల గురించిన వివరాలూ రికార్డులలో ఉన్నాయి. ఇరాన్లోని షిరాజ్ ప్రాంతం నుంచి తన పెద్ద సోదరుడు అఫ్జల్ఖాన్తో కలిసి మొఘల్ ఆస్థానానికి వచ్చిన కాలిగ్రాఫర్ అమానత్ ఖాన్ ప్రత్యేక గౌరవ మర్యాదల్ని పొందారు. తాజ్ కుడ్యాలపై ఖురాన్ శాసనాలను అందంగా లిఖించే మహద్భాగ్యం అతడికి లభించింది. ముంతాజ్ సమాధిపై అతడు చెక్కిన అక్షర నగిషీలకు షాజహాన్ ముగ్ధుడై అతడికి ‘మాన్సాబ్’ అనే బిరుదును ప్రదానం చేశారు. భూమిపై హక్కులు సంక్రమింపజేసే అధికారిగా అది ప్రభువులిచ్చే బిరుదు. అమానత్ ఖాన్ తాజ్మహల్పై ఆరేళ్లు పనిచేశారు. సమాధి నగీషీ రాత 1638లో పూర్తయింది. ఆ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పనిలో ఉన్నప్పుడే అతడి వ్యక్తిగత జీవితాన్ని విషాదం స్పృశించింది. లాహోర్లో ఉంటున్న అతడి సోదరుడు అఫ్జల్ ఖాన్ మరణించాడు. అమానత్ ఖాన్ తను సంపాదించినదంతా వెచ్చించి అఫ్జల్కు స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. సోదరుడి మరణం తర్వాత కూడా అమానత్ తిరిగి ఇరాన్ వెళ్లలేదనీ, తాజ్మహల్ ప్రధాన వాస్తుశిల్పి, తన ఆప్తమిత్రుడు అయిన ఉస్తాద్ఖాన్ అభ్యర్థన మేరకు ఇక్కడే ఉండిపోయారనీ డబ్లు్య.ఇ. బెగ్లే అనే చరిత్రకారుడు రాశారు. (క్లిక్: పుష్కరం కిందే యుద్ధ బీజాలు) మొఘల్ చరిత్రలో అనేకమంది రూపకర్తలు, వాస్తుశిల్పులు ఎంతో ప్రాముఖ్యం పొందారు. వారిలో కొందరు తాజ్మహల్ నిర్మాణానికి పని చేశారు. ఇస్మాయిల్ అఫాండి టర్కీలోని ఒట్టోమన్ల కోసం గోపురాలను రూపొందించిన ఘనత కలవారు. ఖాజిమ్ఖాన్ లాహోర్కు చెందిన ఒక స్వర్ణకారుడు. తాజ్ సమాధి గోపురానికి కాంతులీనే తాపడం చేసినవారు. తాజ్మహల్ నిర్మాణంలో హస్తకళాకారులు, కార్మికులతో పాటు.. మేధాపరంగా వాస్తుశిల్పులు, సృజనశీలురు అందరూ కూడా షాజహాన్ అభిరుచికి, దార్శనికతకు తగ్గట్టుగా పని చేసి ఆయన నుంచి సత్కారాలు, బహుమానాలు పొందారే తప్ప చేతులు పోగొట్టుకోలేదు. ఎలాగో పుట్టి, ఎలాగో కొట్టుకు వస్తున్న వదంతి మాత్రమే అది. వదంతిని పునరావృతం చేయడం అంటే అజ్ఞానాన్నీ, చరిత్రపై అవగాహన లేమినీ ప్రదర్శించుకోవడమే. – ఎం.సలీమ్ బేగ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (జేకే) ముఖ్యాధికారి -
బాయ్ఫ్రెండ్తో కలిసి తాజ్మహల్ సందర్శించిన రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక గతేడాది ప్రియుడి గురించి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి తెగ చక్కర్లు కొడుతున్నారు. డిన్నర్ డేట్లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. తాజాగా ఈ లవ్బర్డ్స్ ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడం తాజ్మహల్ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “దే దే ప్యార్ దే” దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రాకు వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
ఓరి నీ ప్రేమ ‘తాజ్మహల్’ కాను!
తాజ్ మహల్.. దేశంలోనే ఓ అద్భుతమైన కట్టడం! మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా తాజ్మహల్ను నిర్మించాడు! ఒరిజనల్ తామ్మహల్ కట్టాడా? అని ఆశ్చర్యపోకండి. అచ్చం తాజ్మహల్ రేంజ్ ఆకృతిలో ఓ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే అనే ఓ విద్యావేత్త తన భార్య మంజుషా చౌక్సేకు గిఫ్ట్గా అచ్చం తాజ్మహల్ను పోలిన ఇంటిని నిర్మించాడు. ఇందులో నాలుగు బెడ్ రూంలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈ జంట ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించారు. అయితే తాజ్మహల్ అందానికి ముగ్దులైన ఈ జంట.. దాని ఆర్కిటెక్షర్ను, నిర్మాణ విషయాలను అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే ముందుగా ఆనంద్ ప్రకాష్ చౌక్సే.. తన ఇంటిని సుమారు 80 ఫీట్ల ఎత్తులో నిర్మించాలని భావించారు. కానీ, 80 ఫీట్ల ఎత్తులో ఇంటిని కట్టడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో తక్కువ ఎత్తులో ఉన్నా తాజ్మహల్లో ఆకృతిలో తన ఇంటిని కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అద్భుతమైన ఇంటిని నిర్మించడానికి ఇంజనీర్లకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని 3D ఇమేజ్ పద్దతిలో రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంటిని నిర్మించిన ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే స్పందిస్తూ.. ‘మొత్తం 90 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉండగా.. ప్రధానమైన తాజ్మహల్ ఆకృతి 60 స్క్వేర్ మీటర్ల పరిధిలో విస్తరించింది. డోమ్ 29 ఫీట్ల ఎత్తులో ఉండగా.. రెండు బెడ్ రూంలతో రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇంటిలో వంటగది, లైబ్రరీ, ధ్యానంరూంలు కూడా ఉన్నాయి. అయితే ఇంటిని నిర్మించే ముందు ఆగ్రా తాజ్మహల్ను సందర్శించాను’ అని తెలిపారు. -
Photo Feature: యాదాద్రి వైభవం.. తాజ్ పునఃప్రారంభం
తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలిపి వేయాలని తెలంగాణ సర్కారును డిమాండ్ చేస్తూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాజ్మహల్ను సందర్శించేందుకు పర్యాటకులను బుధవారం నుంచి అనుమతిస్తున్నారు. -
తల వెంట్రుకపై తాజ్మహల్
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక హస్తకళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మరో అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు. సూక్ష్మకళలో ప్రావీణ్యత సాధించిన ఈ కళాకారుడు తల వెంట్రుకపై తాజ్మహల్ బొమ్మను ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత చిన్నయాచారి 5 రోజులు కష్టపడి మైక్రో ఆర్ట్ ద్వారా తల వెంట్రుకపై బంగారంతో తాజ్మహల్ ఆకారాన్ని రూపొందించాడు. బొమ్మ ఎత్తు 0.10 ఎంఎం, వెడల్పు 0.15 ఎంఎం ఉంది. -
తాజ్మహల్ నిర్మాణానికి పుల్లలెత్తింది ఈయనే..
ఇంగ్లాండ్లోని షెఫ్ఫిల్డ్ నగరానికి చెందిన 87 సంవత్సరాల డెరిక్కు ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల నమూనాలను పుల్లలతో తయారు చేయడం అనేది హాబీ. ఒక మోడల్ను పూర్తి చేయడానికి పది నుంచి పన్నెండు నెలల సమయం పడుతుంది. వీటికోసం ఇంట్లో ప్రత్యేకంగా షెల్ఫ్లను కూడా నిర్మించాడు. ‘ఈ మోడల్స్ అందంగా రావాలంటే క్రియేటివిటీ కంటే ఓపిక ఉండడం చాలా ముఖ్యం’ అంటాడు డెరిక్. ‘మరి ఈ వయసులో మీరు ఇంత ఓపిక...’ అని ఎవరైనా అడగబోతే శేషజీవితంలో తన జీవనోత్సాహానికి ఈ హాబీనే కారణం అంటాడు. మన తాజ్మహల్ తయారు చేయడానికి చాలా టైమ్ పట్టిందట. ‘ఇదొక పెద్ద ఛాలెంజ్’ అంటాడు డెరిక్. తెలిసిన విద్య ఊరకేపోవడం ఎందుకని పిల్లలకు కూడా నేర్పిస్తున్నాడు. చదవండి: ఫేస్బుక్లో ఆ రికమెన్డేషన్లుండవు...! -
‘తాజ్మహల్.. రామ్మహల్గా మారనుంది’
లక్నో: ఆగ్రాలోని తాజ్మహల్ పేరు రామ్మహల్ లేదా కృష్ణమహల్గా మారనుందని, యోగి ఆదిత్యనాథ్ రాజ్యంలో ఇది జరిగితీరుతుందని ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సురేంద్ర సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం అని, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజ్మహల్ పేరును త్వరలో రామ్మహల్గా లేదా కృష్ణమహల్గా మార్చుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా ఆయన సీఎం యోగి ఆదిత్యనాథ్ను శివాజీ వారసుడితో పోల్చుతూ.. సమర్ గురువు రామ్దాస్ శివాజీని భారతదేశానికి ఇచ్చినట్లుగానే, గోరఖ్ నాథ్ బాబా యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్కు ఇచ్చారని వ్యాఖ్యానించారు. -
అప్పుడే పదేళ్లు.. తాజ్మహల్ వద్ద బన్నీ, స్నేహ హల్చల్
ఆగ్రా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు నేడు(శనివారం) 10వ వెడ్డింగ్ యానివర్సిరీని జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ రోజుతో వీరి వివాహ బంధానికి పది సంవత్సరాలు.టాలీవుడ్ స్టార్ హీరోగా అల్లుఅర్జున్ ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఏం మాత్రం టైం దొరికినా కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్పులకు వెళ్తుంటారు. శనివారం (నేడు) పదవ వార్షికోత్సవం సందర్భంగా అల్లుఅర్జున్ భార్య స్నేహతో కలిసి ప్రేమసౌధం తాజ్మహల్ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ..ఈ పదేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయని, ఇంకెన్నో యానివర్సిరీలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా స్టార్ కపుల్ అల్లుఅర్జున్- స్నేహ రెడ్డి దంపతులకు అటు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అల్లు అర్జున్, స్నేహాకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది. చదవండి : శర్వానంద్కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా Happy 10th Anniversary to us Cutie . What a wonderful journey of ten years ... and many more to come ❤️ pic.twitter.com/d4g6X5at6A — Allu Arjun (@alluarjun) March 6, 2021 -
తాజ్మహల్కు బాంబు బెదిరింపు
-
తాజ్మహల్కు బాంబు బెదిరింపు
ఆగ్రా : ప్రపంచంలోనే అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పర్యాటకులను అక్కడినుంచి ఖాళీ చేయించి తాజామహల్ను మూసివేశారు. తాజామహల్లో బాంబు పెట్టినట్లు గురువారం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్, స్థానిక బలగాలను మోహరించారు. బాంబు బెదింపు రావడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా యూపీ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కి ఫోన్ కాల్ చేసిన దుండగులు..తాజ్ మహల్లో పేలుడు పదార్దాలు పెట్టామని, ఏ క్షణమైనా అవి పేలొచ్చని తెలిపాడు. దీంతో వెంటనే దీంతో అలర్ట్ అయిన పోలీసులు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది తాజ్ మహల్ కట్టడం పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. అయితే తాజ్మహల్ లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని ఆగ్రా ఐజీ సతీష్ గణేష్ ధృవీకరించారు. ఇది ఫేక్ కాల్ అని పేర్కొన్నారు. చదవండి : (రాజకీయాలకు చిన్నమ్మ గుడ్బై..రాజీకి షా ప్రయత్నాలు) (గడ్డు పరిస్థితుల్లో యడ్డి సర్కార్: అసెంబ్లీలో అగ్నిపరీక్ష ) Bomb Disposal Squad & other teams carried out extensive search at Taj Mahal premises. No such object has been found yet. Man who called up to give info (of bomb) will soon be traced. I'd like to assure you that there's 99% chances of it being hoax call: A Satish Ganesh, IG Agra pic.twitter.com/MfkmwBrBoA — ANI UP (@ANINewsUP) March 4, 2021 -
తాజ్ సందర్శనకు అనుమతి
లక్నో, ఆగ్రా: కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా చారిత్రక కట్టడం తాజ్మహల్ సందర్శనను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే అన్లాక్ 4.0లో ఆరునెలల తరువాత సోమవారం నుంచి తాజ్మహల్ సందర్శనకు అనుమతించినట్టు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్తోపాటు థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్మహల్ సంరక్షణ అధికారి అమర్నాథ్ గుప్తా పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం తాజ్మహల్ను మూసివేస్తామని, కోవిడ్-19 నిబంధనలను పర్యాటకులు తప్పనిసరిగా అనుసరించాలని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు. అయితే, తాజ్మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులకు టికెట్ ధర రూ.1,100 కాగా, స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్లో 2,500 మంది చొప్పున రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతించనున్నారు. పర్యాటకుల మధ్య దూరం, తనిఖీలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది నిర్వహించనున్నారు. ఇక తాజ్మహల్లోనికి ఎలాంటి వస్తువులు అనుమతించరు.. అంబులెన్స్ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రసిద్ధ ఆగ్రా కోటను సందర్శనకు కూడా సోమవారం నుంచి అనుమతించనున్నారు. (చదవండి: పాక్షికంగా దెబ్బతిన్న తాజ్ మహల్) లాక్డౌన్ కారణంగా దేశంలో చారిత్రక కట్టడాల సందర్శనను నిలిపివేసిన విషయం తెలిసిందే. అన్లాక్ 2.0లో చారిత్రక కట్టడాల సందర్శనకు కేంద్రం అనుమతులు ఇవ్వడంతో.. జులై 6 నుంచి తాజ్ మహల్కు పర్యాటకులను అనుమతిస్తామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, చివరి నిమిషంలో దీనిని వాయిదా వేసింది. తాజ్మహల్ సందర్శన నిర్ణయాన్ని యోగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సందర్శకుల రాకతో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో తాజ్ సందర్శన వాయిదా పడింది. ఆరు నెలల తర్వాత తాజ్మహల్ తెరుచుకోనుండటంతో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని దుకాణాలు సైతం తెరుచుకోనున్నాయి. ఆరు నెలల తర్వాత దుకాణాలు తెరిచామని, వ్యాపారం స్తబ్దుగా ఉన్నా తాజ్మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులనైనా చూడగలుగుతామని సమీపంలో మార్బుల్ వస్తువులు దుకాణం యజమాని మునావ్వర్ అలీ (50) అన్నారు. -
తాజ్మహల్ పునఃప్రారంభం వాయిదా
న్యూఢిల్లీ: ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు పునఃప్రారంభం అవుతుందనుకున్న తాజ్మహల్ సందర్శన వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సందర్శకుల తాకిడితో కరోనా వ్యాప్తి చెంది ఆగ్రా పట్టణం ఇబ్బందుల్లో అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ మేరకు స్థానిక యంత్రాంగం ఆదివారం రాత్రి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆగ్రాలో తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లోని సందర్శనీయ స్థలాలు మూసివేశారు. (చదవండి: కరోనా అంతానికిది ఆరంభం) అనంతరం అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైనా సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మత సంబంధ ఉత్సవాలు, భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం చెప్పింది. అయితే, పరిస్థితులను బట్టి వీటిని తెరిచే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రకారం నేటి నుంచి తాజ్మహల్కు సందర్శనకు అనుమతి ఇద్దామని అనుకున్నప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేవని ఆగ్రా జిల్లా యంత్రాంగం చెప్పింది. కాగా, దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా 24,950 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 600 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. కేసుల సంఖ్యలో భారత్ రష్యాను సమీపించింది. (ఎన్క్లోజర్లోకి వెళ్లిన ఉద్యోగిపై పులి దాడి) -
పాక్షికంగా దెబ్బతిన్న తాజ్ మహల్
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో విజృంభించిన వర్షం ధాటికి ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ పాక్షికంగా దెబ్బతింది. సమాధి, రెడ్ సాండ్ స్టోన్ దగ్గరి పాలరాతి రెయిలింగ్ ధ్వంసం అయిందని శనివారం ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ బసంత్ కుమార్ స్వరంకర్ తెలిపారు. సమాధి పైకప్పు కూడా చెల్లాచెదురైందని ఆయన వెల్లడించారు. ద్వారం కూడా విరిగిపోయిందని, తాజ్ మహల్ ప్రాంగణంలోని కొన్ని చెట్లు కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయి నేలకొరిగాయన్నారు. (తాజ్ మహల్ మూసివేత) కాగా గతంలోనూ తాజ్ మహల్ దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. 2018 ఏప్రిల్లో కురిసిన వడగళ్ల వాన వల్ల తాజ్ మహల్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పిల్లర్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు మృతి చెందిన 13 మంది కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. యూపీలో రానున్న రోజుల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. (ప్రియురాలితో తాజ్మహల్ చూడాలనుకుని..) -
రంగోలి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని.. అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేశారు. ‘తాజ్ మహల్ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్ బేగం గురించి కూడా ట్వీట్లో ప్రస్తావించారు. ముంతాజ్పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయని, ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఫోర్బ్స్పై కంగన సోదరి ఫైర్) Mr @rajcheerfull ji not every Indian is proud of Taj Mahal, a grave can never be a symbol of love, we are forced to accept it as a wonder but it’s creepy as hell especially when we know how she suffered in her lifetime how the artists who made it were tortured it’s creepy ... https://t.co/1V2waXDkbL — Rangoli Chandel (@Rangoli_A) April 7, 2020 ఇక రంగోలీ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘తాజ్ మహల్ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదు’ ‘మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ‘ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజ్ మహల్ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్ మహాల్ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. అంతేగాక దేశ ప్రజలంతా దీనిని చూసి గర్వపడుతుంటారు కూడా. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం ఇది మొదటిసారి కాదు. తరచూ ఎన్నో విషయాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటారు. -
చుట్టాలు వస్తేకనీ..తాజ్ను పట్టించుకోని ప్రభుత్వం
-
‘తాజ్’అందాలు వీక్షించిన ట్రంప్ దంపతులు
-
తాజ్మహల్లో ఇవాంక సందడి
-
తాజ్మహల్కు చేరుకున్న ట్రంప్ దంపతులు
-
చేతిలో చెయ్యి వేసుకుని.. తాజ్ అందాలు వీక్షిస్తూ..
ఆగ్రా: తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా తాజ్మహల్ను సందర్శించారు. భార్య మెలానియా ట్రంప్తో కలిసి తాజ్మహల్ పరిసరాల్లో అడుగుపెట్టిన ట్రంప్.. తొలుత సందర్శకుల పుస్తకంలో(విజిటర్ బుక్)లో సంతకం చేశారు. ‘‘తాజ్మహల్ అద్భుతం. అందమైన భారత సంస్కృతికి నిదర్శనం! థ్యాంక్యూ ఇండియా’’అని ఆయన రాశారు.ప్రపంచ వింతగా ప్రఖ్యాతి గాంచిన తాజ్మహల్ విశేషాలను గైడ్ వివరిస్తుండగా.. ట్రంప్ దంపతులు ఆసక్తిగా ఆలకించారు. సంధ్యాసమయంలో చేతిలో చెయ్యి వేసుకుని పచ్చటి లాన్లో నడుచుకుంటూ మహత్తర కట్టడాన్ని చేరుకున్నారు. ఫొటోలకు పోజులిస్తూ.. ‘ప్రేమచిహ్నం’ అందాలను వీక్షిస్తూ.. ఆహ్లాదంగా గడిపారు. అనంతరం తాజ్మహల్ లోపలికి ప్రవేశించి.. షాజహాన్, ముంతాజ్ సమాధులను సందర్శించారు. ఇక ట్రంప్, మెలానియాది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. (చదవండి : ట్రంప్ దంపతుల లవ్ స్టోరీ) ఇక ట్రంప్ కుటుంబం తాజ్ మహల్ సందర్శన నేపథ్యంలో ఆగ్రా పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా అహ్మదాబాద్లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరైన అనంతరం ట్రంప్ ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్పటేల్ ట్రంప్ కుటుంబానికి ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికారు. -
‘తాజ్’అందాలు వీక్షిస్తున్న ట్రంప్ దంపతులు
-
తాజ్మహల్కు చేరుకున్న ట్రంప్ దంపతులు
లక్నో: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అగ్రరాజ్య అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్తో కలిసి ఆగ్రాకు విచ్చేసిన ట్రంప్నకు సాంప్రదాయ నృత్యాలతో వెల్కం చెప్పారు. అనంతరం భార్య మెలానియాతో కలిసి ట్రంప్... ‘ప్రేమచిహ్నం’ తాజ్మహల్ను సందర్శించారు. ఈ నేపథ్యంలో తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ట్రంప్ తాజ్మహల్ వద్ద సమయం గడపనున్నట్లు సమాచారం. కాగా అంతకు ముందు అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత పర్యటన తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయంటూ కీలక ప్రకటన చేశారు. -
ట్రంప్ పర్యటన : రంగంలోకి కొండముచ్చులు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రంప్ పర్యటనలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్రంప్ అహ్మదాబాద్లో ఉన్నంతవరకు ఏడు అంచెల భద్రత కల్పిస్తున్నారు. 12 వేల మంది పోలీసు సిబ్బంది ట్రంప్ ప్రయాణించే రహదారిలో కాపలాగా ఉంచనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. (చదవండి : ట్రంప్ పర్యటన పుణ్యమా అని..) ఇక ట్రంప్ ఆగ్రాలో కూడా పర్యటిస్తుండడంతో అక్కడ కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత ఏర్పాటు విషయంలో అధికారులు ఏమాత్రం రాజీ పడడంలేదు. ముఖ్యంగా కోతుల వల్ల అమెరికా అధ్యుక్షుడి పర్యటనలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండొచ్చని భావించిన అధికారులు.. కోతుల పని పట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు. (చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం) గత ఆరు నెలలుగా తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన వారి చేతుల్లోని వస్తువులను కోతులు లాక్కెళుతున్నాయని సందర్శకులు వాపోతున్నారు. దీంతో ట్రంప్ పర్యటనకు కోతుల వల్ల ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని భావించిన అధికారులు ఐదు కొండముచ్చులను తాజ్మహాల్ సమీపంలో ఉంచారు. కొండముచ్చులను చూసి కోతులు భయపడతాయి. అవి ఉన్న సమీపానికి కోతులు రాలేవు. అందుకే అధికారులు కొండముచ్చులను రంగంలోకి దించారు. మొత్తానికి కొండముచ్చులు కూడా అమెరికా అధ్యక్షుడికి రక్షణగా నిలిచాయన్నమాట. కాగా, రెండు రోజుల భారత్ పర్యటలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) ఇండియాకు రానున్నారు. హ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు స్వాగతం పలుకుతారు. అనంతరం మొటేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం భార్య మెలానియా ట్రంప్తో కలిసి ఆగ్రాలోని తాజ్మహాల్కు వెళ్తారు. రాత్రి ఢిల్లీలో బస చేస్తారు. ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతారు.అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
ట్రంప్ పర్యటన పుణ్యమా అని..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ పర్యటకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ ప్రయాణించే రహదారులన్నీ రూ. కోట్లు పెట్టి మరమ్మతులు చేయించారు. అహ్మదాబాద్లో మొటెరా స్టేడియంలో ట్రంప్ హాజరుకానున్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి రూ.85 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది .రోడ్లను ఆదునీకరించడానికే రూ.30 కోట్లను ఖర్చు చేశారట. సోమవారం సాయంత్రం ట్రంప్ ఆగ్రాలోని తాజ్మహాల్ వద్దకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యం అక్కడి రోడ్లన్ని క్లీన్ చేయించారు. ట్రంప్ ప్రయాణించే రహదారి ఆకర్షణీయంగా కనిపించేందుకు రంగురంగుల విద్యుద్దీపాల అలంకరించారు. ట్యాంకర్లలో నీళ్లను తెచ్చి రోడ్లన్నిశుభ్రం చేశారు. ట్రంప్ పర్యటన పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోకుండా అధ్వాన స్థితిలో ఉన్న ప్రధాన మార్గాల్లో రోడ్లన్ని అద్దంలా మెరిసిపోతున్నాయి. (చదవండి : అగ్రరాజ్యాధీశుల భారతీయం) ఇక ట్రంప్కు ఘన స్వాగతం గుజరాత్ ప్రభుత్వం కూడా భారీ ఏర్పాటు చేసింది. 24వ తేదీన అహ్మదాబాద్లో మోదీ–ట్రంప్ రోడ్ షో జరిగే మార్గంలో ఉన్న మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు గోడను నిర్మించారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా మొటెరా స్టేడియాన్ని అలంకరించారు. ఇక ట్రంప్ ప్రయాణించే రహదారి వెంబడి విద్యార్థులలో సంప్రదాయ క్రీడ మల్లకంబను ప్రదర్శించనున్నారు. ట్రంప్ అహ్మదాబాద్లో గడిపే సమయం కేవలం మూడు గంటలే అయినప్పటికీ గుజరాత్ సర్కార్ ఏర్పాట్ల కోసం దాదాపు రూ.85 కోట్లు చేస్తోంది. (చదవండి : ట్రంప్ విందు.. పసందు..!) ట్రంప్ షెడ్యూల్ ఫిబ్రవరి 24 ► అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వెళ్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. ► గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు. ► తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ► అనంతరం మధ్యాహ్న భోజనం అహ్మదాబాద్లో చేస్తారు. అందులో భారతీయ ఆహార పదార్థాలను ట్రంప్ రుచి చూస్తారు. ఈ విందుకు కొందరు రాజకీయ నాయకులు హాజరవుతారు. ► సాయంత్రానికి ట్రంప్, మెలానియా ట్రంప్ ఆగ్రాలోని తాజ్మహల్ వద్దకు వెళ్తారు. అధికారులు ఇప్పటికే 900 క్యూసెక్కుల నీరు యమునా నదిలోకి వదలి తగిన ఏర్పాట్లు చేశారు. ► ట్రంప్ దంపతులు రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మయూరా లగ్జరీ హోటల్లో బస చేస్తారు. ఫిబ్రవరి 25 ► రాజ్ఘాట్లోని గాంధీ సమాధిని ట్రంప్, మోదీలు కలసి సందర్శించి జాతిపిత గాంధీకి నివాళులు అర్పిస్తారు. ► ట్రంప్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అవుతారు. ► అనంతరం హైదరాబాద్ హౌస్లో మోదీ, ట్రంప్ భేటీ అవుతారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ► మోదీ, ట్రంప్ల భేటీ సమయంలో ట్రంప్ భార్య మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. ► అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపార వేత్తలను ట్రంప్ కలుస్తారు. ► రాత్రి పదింటికి అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. -
ప్రియురాలితో తాజ్మహల్ చూడాలనుకుని..
శంషాబాద్:భార్య టికెట్పై ప్రియురాలిని తీసుకుని జాలీగా వెళ్లి తాజ్మహల్ చూసొద్దామనుకున్న ఆ వ్యక్తికి ఎయిర్పోర్టులో చుక్కెదురైంది. లింగసూర్కు చెందిన దౌల్సాబ్ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్ ఎయి ర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్లు బుక్ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. పూర్తిగా ఆరాతీయడంతో టికెట్కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్ఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్లైన్స్తో పాటు ఎయిర్పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. -
తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం
న్యూఢిల్లీ: ప్రేమ చిహ్నం తాజ్మహల్ చరిత్రపై కేంద్ర మంత్రి అనంత్కుమార్ హెగ్దే కొత్త వాదనకు తెరతీశారు. ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించింది ముస్లిం పాలకులు కాదని, ఇదొక శివ మందిరమని ఆదివారం వ్యాఖ్యానించారు. తాజ్మహల్ను జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన జీవితచరిత్రలో పేర్కొన్నారని తెలిపారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన ఈ కట్టడం తేజో మహాలయ పేరుతో శివాలయంగా వెలుగొందిందని, తరువాత తాజ్మహల్గా మారిందని వివరించారు. ఇకనైనా మేల్కోకుంటే మన ఇళ్లు కూడా మసీదులుగా మారుతాయని, రాముడిని జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలవాల్సి ఉంటుందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళను తాకే వ్యక్తి చేతుల్ని నరికేసేలా చరిత్రను రాయాలని సూచించారు. -
‘తాజ్మహల్.. ఒకప్పటి శివాలయం’
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయం అని.. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘తాజ్మహల్ను ముస్లింలు నిర్మించలేదు. జయసింహా అనే రాజు వద్ద నుంచి తాజ్మహల్ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్ చెప్పారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తొలుత తేజోమహల్ అని పిలిచేవారు.. కాలక్రమంలో దాని పేరును తాజ్మహల్గా మార్చారు. మనం ఇలాగే నిద్ర పోతుంటే మన ఇళ్ల పేర్లను మసీదులుగా మారుస్తారు. రామున్ని జహాపన అని.. సీతా దేవిని బీబి అని పిలుస్తార’ని తెలిపారు. అంతేకాకుండా చరిత్రని.. వక్రీకరిస్తూ తిరగరాశారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై అనంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
తాజ్ మహల్ను చూడాలనుకుంటే..ఇకపై
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ దర్శించాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. ప్రపంచ వింతల్లో చోటు సంపాదించుకున్న తాజ్మహల్ టికెట్ రేటును అధికారులు భారీగా పెంచేశారు. ఏకంగా ఐదు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంతాజ్ ప్రేమకు గుర్తుగా షాజహాన్ ఆగ్రాలో నిర్మించిన పాలరాతి కట్టడం తాజ్మహల్కోసం టూరిస్టులు ఇకపై రూ. 250 (0.70డాలర్లు) చెల్లించాలి. అలాగే అంతర్జాతీయ పర్యాటకులు ఇప్పటివరకు చెల్లించే 16డాలర్లుకు బదులుగా ఇకపై 19డాలర్లు (సుమారు రూ.1,364) చెల్లించాలి. టూరిస్టులను పరిమితం చేసేందుకు ఈపెంపు నిర్ణయం తీసుకున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి వెల్లడించారు. తాజ్మహల్ సందర్శకుల సంఖ్యను 40వేలకు పరిమితం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ చర్య. గతంలో ఈ సంఖ్య 70వేలుగా ఉంది. కాగా రోజుకు సగటున 10నుంచి 15వేల మంది పర్యాటకులు తాజ్మహల్ను సందర్శిస్తారట. 2016లో సుమారు 6.5 మిలియన్ల మంది 17శతాబ్దానికి చెందిన ఈ ప్రేమమందిరాన్ని వీక్షించినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
‘నమాజ్ చేస్తే తప్పులేదు.. కానీ పూజలు చేయకూడదా’
ఆగ్రా : బజరంగ్ దళ్కు చెందిన మహిళా కార్యకర్తలు కొందరు తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. తాజ్ మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా ఇతర రోజుల్లో నమాజ్ చేయకూడదంటూ సుప్రీం కోర్టుతో పాటు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కూడా ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎస్ఐ ఉత్తర్వులను పట్టింకుకోండా కొందరు ముస్లింలు తాజ్ వద్ద ఉన్న మసీదులో గత బుధవారం నమాజ్ చేశారు. విషయం తెలుసుకున్న బజరంగ్ దళ్ మహిళా కార్యకర్తలు కొందరు ఏఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తాజ్ మహల్ వద్ద శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా తాజ్ వద్ద హరతి కార్యక్రమం నిర్వహించి.. గంగా జలాన్ని చల్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొందరు ఇక్కడ నమాజ్ చేసి తాజ్ పరిసరాలను అపవిత్రం చేశారు. అందుకనే మేం గంగా జలంతో దాన్ని శుద్ది చేశాం. ఇతరులు(ముస్లింలు) వచ్చి ఇక్కడ నమాజ్ చేస్తున్నప్పుడు.. మేం తాజ్ మహల్లోకి పూజాద్రవ్యాలు తీసుకెళ్లడం తప్పా అంటూ వారు ప్రశ్నించారు. వారికి(ముస్లింలకు) శుక్రవారం మాత్రమే తాజ్ వద్ద నమాజ్ చేసుకునేందుకు అనుమతించారు. కానీ మిగతా రోజుల్లో ఎందుకు ఇక్కడ నమాజ్ చేస్తున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మేం చేసింది తప్పని భావిస్తే ఎలాంటి చర్యలనై తీసుకోండి.. వాటిని ఎదుర్కొడానికి మేం సిద్దంగా ఉన్నామని తెలిపారు. నమాజ్ కోసం వెళ్లిన వారిన ఆపలేదు.. కానీ మమ్మల్ని మాత్రం ఎలా అడ్డగిస్తారంటూ ప్రశ్నించారు. -
తాజ్ ప్రాంగణంలో నమాజ్కు ఏఎస్ఐ నో
ఆగ్రా : తాజ్మహల్ ప్రాంగణంలోని మసీదులో శుక్రవారం మినహా మరే రోజూ నమాజ్ చేయరాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ముస్లింలను కోరింది. ఈ ఉత్తర్వులు పెనువివాదం రేపుతుండగా, సుప్రీం కోర్టు జులైలో ఇచ్చిన ఉత్తర్వులనే తాము అమలు చేస్తున్నామని ఏఎస్ఐ అధికారులు వివరణ ఇచ్చారు. శుక్రవారం తాజ్మహల్ను ప్రజా సందర్శనకు అనుమతించని క్రమంలో ఆ రోజు ప్రవేశ టికెట్ లేకుండానే స్ధానికులు ప్రార్ధన చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. తాజ్ మహల్ కాంప్లెక్స్లోని మసీదులో శుక్రవారం స్ధానికేతరులు నమాజ్ చేసుకోరాదని స్ధానిక అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్ధించింది. భద్రతా కారణాల రీత్యా స్ధానికేతరులెవరూ శుక్రవారం తాజ్ ప్రాంగణంలోని మసీదులో నమాజ్ చేయరాదని ఆగ్రా ఏడీఎం ఈ ఏడాది జనవరి 24న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. అయితే ఇతర రోజుల్లో నమాజ్లపై సుప్రీం కోర్టు ఎంతమాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవైపు నమాజ్కు ముందు ముస్లింలు తాజ్ ప్రాంగణంలోని స్నానం చేసే వుదు చెరువును ఏఎస్ఐ ఆదివారం మూసివేసింది. దశాబ్ధాలుగా తాజ్ మహల్ మసీదులో నమాజ్ చేస్తున్న ఇమాం సయ్యద్ సాధిక్ అలి ఏఎస్ఐ ఉత్తర్వుల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఏ కారణం లేకుండానే నమాజ్ను నిలిపివేశారని తాజ్మహల్ మసీదు నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహిం హుసేన్ జైదీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని యూపీ, కేంద్ర ప్రభుత్వాలు ముస్లిం వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. -
చేజారాక చేసేదేమీ ఉండదు
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్మహల్కు పెనుముప్పుగా మారిన వాయు కాలుష్యంపై దూరదృష్టితో వ్యవహరించాలని సుప్రీంకోర్టు సూచించింది. దాని పరిరక్షణ నిమిత్తం పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించాలని కోరింది. పరిస్థితి చేయి దాటాక తాజ్మహల్ను కాపాడుకునేందుకు మరో అవకాశం రాదని హెచ్చరించింది. తాజ్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ, చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, యమునా నదిలో నీటి మట్టం పెరుగుదల తదితరాలను దార్శనిక పత్రం రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ‘ఒకసారి తాజ్మహల్ చేజారితే, మరో అవకాశం లభించదు’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాజ్ చుట్టుపక్కల ఉన్న పచ్చదనం, నడుస్తున్న పరిశ్రమలు, హోటళ్ల సంఖ్య తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ దార్శనిక పత్రాన్ని రూపొందిస్తోందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, లాయర్ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నాదకర్ణి మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు తాజ్ పరిరక్షణకు అగాఖాన్ ఫౌండేషన్, ఇంటాచ్ సంస్థల నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. -
తాజ్మహల్ పరిరక్షణపై సుప్రీంకోర్టు సీరియస్
-
తాజ్ పరిరక్షణకు విజన్ డాక్యుమెంట్
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక ప్రాచీన కట్టడం తాజ్ మహల్ పరిరక్షణకు యూపీ ప్రభుత్వం పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీల మూసివేత. నో ప్లాస్టిక్ జోన్, యమున కరకట్టలపై నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం వంటి చర్యలతో చారిత్రక కట్టడాన్ని పరిరక్షించే ప్రణాళికతో రూపొందించిన విజన్ డాక్యుమెంట్ను మంగళవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. 17వ శతాబ్ధంలో నిర్మితమైన ఈ అద్భుత కట్టడాన్ని పరిరక్షించడంలో యూపీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై జులై 11న సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడిన క్రమంలో ప్రభుత్వం ఈ విజన్ డాక్యుమెంట్ను కోర్టుకు నివేదించింది. తాజ్ మహల్ పరిసరాల్లో ప్యాకేజ్డ్ వాటర్ను నిషేధించాలని, ఆ ప్రాంతమంతటినీ ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించాలని యోచిస్తున్నామని జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్కు యూపీ ప్రభుత్వం తెలిపింది. తాజ్ పరిసర ప్రాంతంలో కాలుష్య కారక పరిశ్రమలను మూసివేసి, టూరిజం హబ్స్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. తాజ్మహల్ను సందర్శించేందుకు పాదచారులను ప్రోత్సహించేలా సమగ్ర ట్రాఫిక్ నిర్వహణను చేపడతామని వెల్లడించింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకంగా నిర్మించిన తాజ్ మహల్ కాలక్రమేణా కాలుష్య కోరలతో తన ప్రాభవాన్ని కోల్పోతుండటంపై సర్వోన్నత న్యాయస్ధానం తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజ్ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు నిరంతరం పర్యవేక్షిస్తోంది. -
తాజ్మహల్ను రక్షించండి లేదా కూల్చండి
న్యూఢిల్లీ: ‘ప్రపంచ వారసత్వ చిహ్నమైన చారిత్రక తాజ్మహల్ను పరిరక్షించండి లేదా కూల్చేయండి’ అని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విపరీతమైన కాలుష్యం కారణంగా తాజ్మహల్ రంగు మారిపోతోందని, దాన్ని సంరక్షించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. తాజ్మహల్ నిర్వహణ పట్ల యూపీ సర్కారు బాధ్యతాయుతంగా లేదని, సంరక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. తాజ్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీని పరిరక్షణకు ఇప్పటివరకు కనీసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించలేదంది. తాజ్ పరిధిలోని పారిశ్రామిక వాడల విస్తరణను నిషేధించాలన్న సుప్రీం ఆదేశాన్ని ధిక్కరించిన తాజ్ ట్రెపీజియం జోన్ చైర్మన్ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈఫిల్ టవర్ కంటే అందమైంది తాజ్ టీవీ టవర్లా ఉండే ఈఫిల్ టవర్ కంటే తాజ్ అందమైందని, విదేశీ మారక ద్రవ్య సమస్యను తాజ్ తీర్చగలదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పారిస్లో ఈఫిల్ టవర్ ఉంది. ఏటా ఎనిమిది కోట్ల మంది ఆ టవర్ను చూడటానికి వస్తారు. దానితో పోలిస్తే తాజ్ చాలా అందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ కంటే ఎనిమిది రెట్ల ప్రాధాన్యం కలిగిన తాజ్మహల్ను ధ్వంసం చేస్తున్నారు. తాజ్ వద్ద భద్రత సమస్య అధికంగా ఉంది. ఇక్కడున్న పరిస్థితుల రీత్యా అనేకమంది టూరిస్టులను, విదేశీమారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్ మహల్పై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కేంద్రం కనీస చర్యలు తీసుకోలేదంది. ఈ నెల 31 నుంచి తాజ్ మహల్ అంశంపై రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. రక్షణ చర్యలపై నివేదిక సమర్పించాలి తాజ్ రంగు మారిపోతోందంటూ.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది మేలో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్పటివరకూ దీనిపై తీసుకున్న చర్యలేంటో 2 వారాల్లో నివేదికలను సమర్పించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. దీనిపై కేంద్రం తరఫు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు. తాజ్పై పరిశోధించడానికి, వాయు కాలుష్యంతో నష్ట శాతాన్ని అంచనా వేయడానికి కాన్పూర్ ఐఐటీ నేతృత్వంలో బృందాన్ని నియమించామన్నారు. తాజ్ మహల్ లోపల, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యానికి గల కారణాలను గుర్తించేందుకు ఈ బృందం కృషి చేస్తోందన్నారు. నాలుగు నెలల్లో నివేదిక సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపారు. -
తాజ్మహల్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్మహల్ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తాజ్ మహల్ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తాజ్ మహల్ వంటి ప్రపంచ అద్భుతాన్ని పట్టించుకోకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది. ‘మీరు ఇప్పటికైనా పద్దతి మార్చుకుని తాజ్మహల్ వద్ద నిర్వహణా లోపాలను సరిదిద్దండి. లేకపోతే దాన్ని కూల్చేయండి. పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా మన తాజ్మహల్ ఎంతో అందమైనది. సుందరమైనది. తాజ్ మహల్ను సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా భారతదేశానికి ఉన్న విదేశీ కరెన్సీ లోటును భర్తీ చేయొచ్చు. దేశ సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్. అలాంటి తాజ్ను మీరు పట్టించుకోవడం లేదు.’ అని తాజ్పై పిటిషన్ను విచారించిన జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేగాక తాజ్ ట్రాపెజియమ్ జోన్(టీటీజెడ్) పరిధిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన పారిశ్రామిక వాడల నిర్మాణంపై టీటీజెడ్ చైర్మన్ను ప్రశ్నించింది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో తాజ్ పరిరక్షణ చర్యలను సరిగా చేపట్టలేకపోతోందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
‘తాజ్’లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి
న్యూఢిల్లీ: తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల వారు ఆగ్రాలో ప్రార్థనలు చేసుకోవడానికి వేరే మసీదులు ఎన్నో ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది. -
తాజ్ వద్ద నమాజ్ వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ‘తాజ్మహల్ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఏడాది, జనవరి 24న ఆగ్రా జిల్లా అదనపు కోర్టు.. ‘ఇకమీదట స్థానికులు మాత్రమే తాజ్మహల్ వద్ద ప్రార్ధనలు చేయాలి.. స్థానికేతరులకు తాజ్ వద్ద నమాజ్ చేసేందుకు అనుమతి లేదం’టూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని బెంచ్ ఆగ్రా ఏడీఎమ్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ తాజ్మహల్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేయరాదని స్పష్టం చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ వద్దకు విదేశీ టూరిస్టులు కూడా వస్తుంటారని, భద్రత దృష్ట్యా నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని కోర్టు తెలిపింది. నేటికి ప్రతి శుక్రవారం తాజ్మహల్ సందర్శనకు యాత్రికులను అనుమతించరు. ఆ రోజున స్థానిక ముస్లింలు తాజ్ వద్ద నమాజ్ చేస్తారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్తో పాటు ఇతర దేశాల ముస్లిం అక్కడకు వచ్చి నమాజ్ చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్మహల్ను సందర్శించేందుకు విదేశీ టూరిస్టులు ఏడాది పాటు వస్తుంటారు. భద్రత దృష్ట్యా తాజ్ వద్ద స్థానికేతరులు నమాజ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
‘తాజ్మహల్ను కూల్చేద్దాం రండి’... వైరల్
లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ను కూల్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకప్పుడు అది శివాలయమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు తనకు చెప్పారన్న అజాం ఖాన్.. యోగి ఆ తాజ్మహల్ను కూల్చి మళ్లీ ఆలయం కట్టాలనుకుంటే తాను అందులో భాగస్వామిని అవుతానని వెల్లడించారు. యోగి తాజ్మహల్ను కూల్చుతానంటే.. తనతో పాటు మరో 10 నుంచి 20వేల మంది ముస్లింలను పలుగు, పారలతో తీసుకొస్తానని ఎస్పీ నేత తన ట్వీట్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి తాజ్ మహల్ కూల్చివేతలో పాలు పంచుకుంటాం. అయితే తాజ్మహల్పై తొలిదెబ్బ యోగి వేస్తే.. రెండోదెబ్బ కచ్చితంగా నాది అవుతుంది. ప్రపంచ వింత తాజ్మహల్ బానిసత్వానికి సంకేతమంటూ’యోగి ఆదిత్యనాథ్ను కవ్వించే యత్నం చేశారు అజాం ఖాన్. గతంలో పలువురు బీజేపీ నేతలు అయోద్యలో రామాలయం నిర్మిస్తామని, అదే విధంగా తాజ్మహల్ను కూల్చేసి గతంలో ఉన్న శివాలయాన్ని అదే స్థానంలో కట్టిస్తామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది మార్చిలో హిందూ మహాసభ విడుదల చేసిన క్యాలెండర్లో తాజ్మహల్ను ‘తేజో మహాలయం శివ మందిరం’అని, కుతుబ్ మినార్ను ‘విష్ణు స్తంభం’అని, కాశీలోని జ్ఞాన్వ్యాపి మసీదును ‘విశ్వనాథ ఆలయం’అని ప్రచురించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరిన్ని ముస్లింల కట్టడాలు, నిర్మాణాలను హిందువుల ఆలయాలుగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ అజాంఖాన్ తాజాగా తాజ్మహల్పై ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
-
ఇక దీన్ దయాల్ చికెన్....!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని ముఘల్సరాయ్ రైల్వే స్టేషన్ను మంగళవారం నాడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ రైల్వే స్టేషన్గా మార్చారు. ఈ పేరు మార్చే ప్రక్రియను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితమే చేపట్టింది. ఈ స్టేషన్కు ఆయన పేరు పెట్టడానికి కారణం ఈ రైల్వే స్టేషన్కు సమీపంలోని పట్టాలపైనే 1968, ఫిబ్రవరి 11వ తేదీన దీన్దయాల్ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. ఆయన ఆరెస్సెస్ సభ్యుడే కాకుండా భారతీయ జన్ సంఘ్ సహ వ్యవస్థాపకులు. ఇలా పేర్లు మార్చడం పట్ల పలువురు ట్వీట్లు పేలుస్తున్నారు. చికిన్ ముఘ్లాయిని ఇక చికెన్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అని, బెంగాల్ ముఘ్లాయి పరోటాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పరోటా అని పిలవాలని సూచిస్తున్నారు. దీన్ దయాల్ బిర్యానీ, దీన్ దయాల్ టిక్నా, దీన్ దయాల్ కుర్మా, దీన్ దయాల్ చికెన్ టిక్కా... అంటూ పేర్లు పెడుతున్నారు. మెఘల్ ఏ ఆజమ్ సినిమా పేరును కూడా మార్చాలని కోరుతున్నారు. ఇంతకు ఈ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఎవరని, ఆయన దేశానికి చేసిన సేవలేమిటో చెప్పండంటూ కొందరు నిలదీస్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రీ ముఘల్సరాయ్లో పుట్టారని, ఆయన స్వాతంత్య్ర యోధుడని, ఆయన దేశానికి రెండో ప్రధాన మంత్రి అని, రైలు ప్రమాదం జరిగినందుకు ఆయన తన రైల్వే శాఖకు రాజీనామా చేశారని, పెడితే అలాంటి గొప్పవ్యక్తి పేరు పెట్టాలని, ఆయన దీన్ దయాల్ లాగా రైలు పట్టాలపై చనిపోకపోవడమే ఆయన తప్పా? ట్విటర్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు పేరు మార్చడం వల్ల ఒరిగేది ఏముందని, మౌలిక సౌకర్యాలను మెరగుపర్చాలని కొందరు సూచిస్తున్నారు. రైళ్లు సక్రమంగా వచ్చేలా, సవ్యంగా నడిచేలా చూడాలని, స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు. యోగి ఆధిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్రంలో ఆయన పలు పేర్లను మారుస్తున్నారు. ఆయన గోరఖ్పూర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచే గోరఖ్పూర్లోని ఉర్దూ బజార్ను హిందీ బజార్గా, అలీ నగర్ను ఆర్య నగర్గా, మియా బజార్ను మాయా బజార్గా, ఇస్లామ్పూర్ను ఈశ్వర్పూర్గా, హుమాయున్ నగర్ను హనుమాన్ నగర్గా మార్చారు. తాజ్ మహల్ను తాను రామ్ మహల్ అని పేరు మార్చడానికి కూడా తాను వెనకాడనని యోగి ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇండియాను హిందుస్థాన్గా మారుస్తూ కూడా రాజ్యాంగాన్ని సవరించాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం ఔరంగాజేబ్ రోడ్డును అబ్దుల్ కలామ్ రోడ్డని, అక్బర్ ఫోర్ట్ను అజ్మీర్ ఫోర్ట్ని కూడా మార్చింది. పేర్లు మార్చినప్పటికీ ప్రజలు మాత్రం పాతపేర్లనే ఇప్పటికీ ఉచ్ఛరిస్తున్నారు. -
క్రికెటర్ బిడ్డకు తాజ్ మహల్ పేరు?
బెంగళూరు : దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్కి భారత్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ఏబీ తన బ్యాటింగ్తో భారత్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. క్రీజులో అటు ఇటు జరుగుతూ ఏబీ కొట్టె షాట్స్కు భారత అభిమానులు ముగ్ధులయ్యారు. మరోవైపు ఏబీకి కూడా భారత్ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఆర్సీబీ తరుపున ఐపీఎల్ 11వ సీజన్ ఆడుతున్న ఏబీడీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్తో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏబీ తన వైవాహిక జీవితాన్ని కూడా భారత్ నుంచే ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ప్రేమకి చిహ్నమైన తాజ్మహల్ ఎదుట తన భార్య డెనియల్ డివిలియర్స్కి ‘‘నీతో నా జీవితాంతం జీవించాలని ఉంది, డెనియల్ నన్ను పెళ్లి చేసుకుంటావా’ ’ అని ప్రపోజ్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు కలిగే మూడో సంతానానికి ‘‘తాజ్’’ అని పేరు పెడుతానని చెప్పాడు. ఇండియాపై ఉన్న ప్రేమతో జాంటీ రోడ్స్ తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తన ప్రేమకు పునాది పడిన తాజ్ మహల్కు గుర్తుగా తన బిడ్డకు ‘‘తాజ్ డివిలియర్స్’’ అని నామకరణం చేస్తానని డివిలియర్స్ చెప్పాడు. ఇక డివిలియర్స్కు ఇద్దరు కుమారులున్నారు. ఏబీ డివిలియర్స్ జూనియర్ 2015లో జన్మించగా.. జాన్ రిచర్డ్ డివిలియర్స్ 2017 లో పుట్టాడు. అయితే మూడో సంతానానికి తాజ్ అనే పేరు మనసుకు దగ్గరగా ఉంటుందని తెలిపాడు. చూడండి : ఏబీ సెన్సేషనల్ క్యాచ్ -
తాజ్మహల్కు నిర్లక్ష్యం కాటు
కాలం చెక్కిట ఘనీభవించిన కన్నీటిచుక్కగా, ధవళకాంతుల దివ్య మందిరంగా ఎందరెం దరినో పరవశింపజేసే తాజ్మహల్... దాన్ని కాపాడి రక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారుల మనసుల్ని కాస్తయినా కదిలించలేకపోతున్నది. తాజ్ కళాకాంతులు క్షీణిస్తున్నాయని, అది క్రమేపీ పసుపు రంగుకు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఆ శాఖకు చీవాట్లు పెట్టింది. ఆ అపురూప కట్టడాన్ని పరిరక్షించడం చేతగాకపోతే ఆ బాధ్యతనుంచి తప్పుకోండని అధికారు లను మందలించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహానికి కారణముంది. తాజ్మహల్కు ముప్పు ముంచుకొస్తున్నదని పర్యావరణవేత్తలు దాదాపు పాతికేళ్లనుంచి ఆందోళనపడుతు న్నారు. ఈ విషయంలో ఏదో ఒక చర్య తీసుకుని రక్షించమని ప్రభుత్వాలను వేడుకుంటు న్నారు. అయినా ఫలితం శూన్యం. చివరకు వారు 1996లో సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫౌండ్రీలను అక్కడినుంచి తరలించాలని, సమీపంలోని రిఫైన రీల నిర్వహణకు సహజవాయువును వినియోగించాలని అప్పట్లో కోర్టు సూచించింది. కానీ ఆ ఆదేశాలను గానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లో చేసిన సూచనలను గానీ ప్రభుత్వాలు సరిగా పట్టించుకున్న దాఖలా లేదు. నిరుడు ఒక హోటల్ నిర్మాణం కోసం తాజ్ పరిసరాల్లో దాదాపు 25 వృక్షాలను కూల్చారు. దానిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారిస్తుండగానే ఉత్తరప్రదేశ్ లోని మధురకూ, ఢిల్లీకి మధ్య రైల్వే ట్రాక్ నిర్మించడానికి 400 చెట్లు కొట్టేయవలసి ఉంటుందని, ఇందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరుతూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి బదులు ఆ చారిత్రక కట్టడాన్ని ధ్వంసం చేయదల్చుకున్నా మని చెబితే సరిపోతుంది కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించిందంటే ఈ అఫిడవిట్ దానికెంత ఆగ్రహం తెప్పించిందో అర్ధమవుతుంది. ప్రపంచంలో ఏమూలకెళ్లినా తాజ్మహల్ను భారత్కు పర్యాయపదంగా చెప్పుకుంటారు. ఏటా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించే చారిత్రక కట్టడాల్లో అగ్రస్థానం తాజ్మహల్దే. ఏడు ప్రపంచ వింతల్లో అదొకటి. అంతర్జాతీయ సంస్థ యునెస్కో దాన్ని ప్రపంచ వారసత్వ సంప దగా గుర్తించింది. ఆ అద్భుతానికి ఇన్ని రకాల గుర్తింపు ఉన్నా ‘ఇంట్లో ఈగల మోత...బయట పల్లకీ మోత’ అన్నట్టు ఇక్కడి పాలకులకు మాత్రం దానిపై ఆసక్తిగానీ, అనురక్తిగానీ ఉండటం లేదు. బుధవారం సుప్రీంకోర్టు మరో కీలక వ్యాఖ్య చేసింది. తాజ్మహల్ రక్షణకు ఏం చేయా లన్న విషయంలో పురావస్తు శాఖను పక్కనబెట్టి అంతర్జాతీయ నిపుణుల సహాయసహకా రాలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ శాఖ ఎంత ఘనంగా పనిచేస్తున్నదో చెప్పడానికి ఇది చాలు. కీటకాలు, శైవలాలు దాన్ని దెబ్బతీస్తున్నాయని పురావస్తు శాఖ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ధర్మాసనం విశ్వసించలేదు. సమీపాన ఉన్న యమునా నది నీరు నిలిచి పోయి నాచు పట్టడం వల్ల దాని ప్రభావం తాజ్పై పడుతున్నదని ఆ శాఖ చెప్పింది. నీరు నాచుపట్టడం నిజమే అయినా... అది ఎగిరొచ్చి తాజ్ను దెబ్బతీస్తుందా అని న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 17 వ శతాబ్దంలో నిర్మించిన ఈ పాలరాతి కట్టడం వాయు కాలు ష్యంతో వన్నె కోల్పోతున్నది. కాలుష్యం కాటుకు మనుషుల ప్రాణాలే రాలిపడుతున్నప్పుడు కట్టడాల గురించి చెప్పేదేముంది? గాలిలో గంధకం, నత్రజని తదితర ఉద్గారాల పరిమా ణాలు పరిమితికి మించి ఉన్నాయని, అప్పుడప్పుడు కురిసే ఆమ్ల వర్షాలు తాజ్ అందాన్ని పాడు చేస్తున్నాయని నిపుణులంటున్నారు. ఆ పాలరాతి కట్టడం చుట్టూ భారీ సంఖ్యలో మొక్కలు పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు నిరుడు వార్తలొచ్చాయి. అయితే ఇన్నేళ్లుగా జరి గిన విధ్వంసాన్ని అవి ఇప్పటికప్పుడు పూడ్చలేవు. అందుకు చాలా కాలం పడుతుంది. చారిత్రక కట్టడాలను శిథిల, నిర్జీవ రూపాలుగా చూడకూడదు. అవి కేవలం గత కాలపు కళా కౌశలానికి, ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి, అప్పటి వాస్తు శాస్త్ర వైభవానికి మాత్రమే ప్రతీకలు కావు. అందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవిగా మాత్రమే వాటిని చూస్తే సరిపోదు. అవి మన వారసత్వ సంపద. వందల ఏళ్లనాటి చరిత్రకూ, సంస్కృతికీ సజీవ సాక్ష్యాలు. ఆనాటి విలువలకు నకళ్లు. ఇప్పటి మన అవసరాలతో, మనకుండే అభిప్రాయాలతో కాక వాటిని చరి త్రకు దర్పణాలుగా గుర్తించగలిగితే ఆ కట్టడాల గొప్పతనం అర్ధమవుతుంది. వాటి సంరక్షణ ఎంత ముఖ్యమో కూడా తెలుస్తుంది. మిగిలినవారి మాటెలా ఉన్నా... పురావస్తు శాఖలో పనిచేసేవారికి, ఆ శాఖను పర్యవేక్షించే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చరిత్రపైనా, సంస్కృతిపైనా ఆపేక్ష ఉండాలి. చారిత్రక కట్టడాలను తగు జాగ్రత్తలతో కాపాడి భవిష్య త్తరాలకు భద్రంగా అప్పజెప్పాలన్న స్పృహ ఉండాలి. మన పురావస్తు శాఖకు 157 ఏళ్ల చరిత్ర ఉంది. అయినా ఏం ప్రయోజనం? ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన తాజ్ మహల్కే పురావస్తు శాఖ ఈ గతి పట్టించింది. ఇక ఇతర కట్టడాల పరిరక్షణ విషయం చెప్పేదే ముంది? యుమునా నది తీరం వ్యర్థాలకు నిలయంగా మారింది. అక్కడ కొన్ని దశాబ్దాలుగా కర్మాగారాలకు అనుమతులీయడం వల్ల ఆ వ్యర్థాలన్నీ వచ్చి దాన్లో కలుస్తున్నాయి. ఆ కర్మా గారాలు వదిలే పొగ తాజ్మహల్ను కమ్ముతోంది. దశాబ్దాలు గడుస్తున్నా వాటి దుష్ప్రభా వాన్ని కాస్తయినా నివారించడానికి ప్రయత్నించకపోవడం నేరం కాదా? కేంద్రంలో ఎవరున్నా తాజ్ పట్ల నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. రెండేళ్లక్రితం సిరియాలోని పురాతన నగరం పాల్మై రాను ఐఎస్ ఉగ్రవాదులు ముట్టడించి, అందులోని కొత్త రాతియుగంనాటి అపురూప కళాఖం డాలను, అనంతరకాలంలో నిర్మించిన భవంతులను ధ్వంసం చేశారని విన్నప్పుడు ఎందరెంద రికో మనస్సు చివుక్కుమంది. మన నిర్లక్ష్యం ఇక్కడి చారిత్రక కట్టడాలకు అచ్చం అదే గతి పట్టి స్తున్నదని అర్ధమైతే వాటిపట్ల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అందరికీ తెలుస్తుంది. -
తాజ్: ఏఎస్ఐ తీరుపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : చారిత్రక తాజ్ మహల్ కట్టడాన్ని సంరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) విఫలమైందని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్పై క్రిమి కీటకాలు ముసురుతున్నా దీన్ని నిరోధించేందుకు ఏఎస్ఐ సహా సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని మండిపడింది. ఏఎస్ఐ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదని వ్యాఖ్యానించింది. తాజ్ పరిరక్షణకు ఏఎస్ఐ అవసరమా, కాదా అనేది కేంద్రం నిర్ధారించాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ కేంద్రం తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ నాద్కర్ణితో పేర్కొంది. తాజ్మహల్ సంరక్షణ కోసం అంతర్జాతీయ నిపుణుల నియామకంపై సుప్రీం కోర్టు చేసిన సూచనలను పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని నాద్కర్ణి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. యమునా నదిలో నీటి కొరత కారణంగానే క్రిమికీటకాల సమస్య తలెత్తిందని ఏఎస్ఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు.కాగా తాజ్మహల్ పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ విజన్ డాక్యుమెంట్ ముసాయిదాను సమర్పించాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1631లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ స్మృతిచిహ్నంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడం పరిరక్షణకు చేపడుతున్న చర్యలను సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. -
రంగు మారుతున్న ఆధునిక వింత
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ఆధునిక వింత ప్రతిష్ట మసకబారుతోంది. ఆమ్ల వర్షాల కారణంగా ప్రఖ్యాత కట్టడం తాజ్ మహల్ పసుపు పచ్చగా మారుతోంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ముందుముందు గోధుమ, ఆకుపచ్చ వర్ణాల్లోకి తాజ్మహల్ మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దేశీయ, విదేశాల్లో నిపుణుల సాయం తీసుకుని తాజ్మహల్కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సూచించింది. తాజ్మహల్ కీర్తి దిగజారేలా దాని రంగు మారుతోందంటూ పర్యావరణ న్యాయవాదిగా పేరొందిన ఎంసీ మెహతా సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. -
తాజ్మహల్ రంగు మారుతోంది..
సాక్షి, న్యూఢిల్లీ : ఆగ్రాలోని చారిత్రక తాజ్మహల్ రంగు మారిపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆందోళనం వ్యక్తం చేసింది. గతంలో పసుపువర్ణంలో మెరిసే ఈ కట్టడం క్రమంగా గోధుమ, ఆకుపచ్చ వర్ణంలోకి మారుతోందని పేర్కొంది. తాజ్మహల్కు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం తక్షణమే భారత, విదేశీ నిపుణుల సాయం తీసుకోవాలని, ఆ తర్వాతే చారిత్రక కట్టడం పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించింది. ‘మన వద్ద చారిత్రక కట్టడాలను పరిరక్షించే నైపుణ్యం ఉందో లేదో మాకు తెలియదు..మీ వద్ద ఆ నైపుణ్యం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు..లేదా దానిపై మీకు (ప్రభుత్వం) శ్రద్ధ కొరవడింద’ని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. భారత్ వెలుపల విదేశీ నిపుణుల సలహాలు అవసరమైనా తక్షణమే తీసుకోవాలి..లేకుంటే తాజ్ మహల్కు మరింత నష్టం వాటిల్లుతుందని కోర్టు హెచ్చరించింది. తాజ్ మహల్ రంగు ఎందుకు మారుతోందని పిటిషనర్ ఎంసీ మెహతా సమర్పించిన ఫోటోలను చూపుతూ కోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణిని ప్రశ్నించింది. తాజ్ మహల్ పర్యవేక్షణను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టాలని అన్నారు. అనంతరం ఈ అంశంపై విచారణను మే 9కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. తాజ్మహల్ను కాలుష్య కోరల నుంచి కాపాడాలని పర్యావరణవేత్త మెహతా సుప్రీంలో పిటిసన్ దాఖలు చేశారు. -
కుప్పకూలిన తాజ్ ప్రవేశ ద్వారం పిల్లర్
సాక్షి, ఆగ్రా : ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్మహల్ ప్రవేశ ద్వారంలోని పిల్లర్ ధ్వంసమైంది. గురువారం ఉదయం కుండపోత వర్షంతో పాటు పెనుగాలుల ధాటికి కట్టడానికి దక్షిణ దిశగా ఉన్న ప్రవేశద్వారం పిల్లర్ కూలిందని అధికారులు తెలిపారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రేమకు సంకేతంగా 17వ శతాబ్ధంలో నిర్మించిన ఈ చారిత్రక కట్టడానికి పర్యాటకులు పోటెత్తుతుండటం, వాహన కాలుష్యం పెరుగుతున్న క్రమంలో తాజ్ మహల్లోకి వీక్షకులను కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. మరోవైపు యూపీలో భారీ వర్షాలకు మధురలో ఓ ఇల్లు కూలడంతో ముగ్గురు చిన్నారులు మరణించారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్న చిన్నారుల తల్లితండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. లక్నో, కాన్పూర్, మధుర, కన్నౌజ్, ఫరక్కాబాద్, ఇటావా, మెయిన్పురి సహా యూపీలోని పలు ప్రాంతాల్లను వర్షాలు ముంచెత్తాయి. అకాల వర్షాలతో నంద్గావ్, బృందావన్, కోసికలాన్ తదితర ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. -
షాజహాన్ సంతకం పెట్టి రాసిచ్చారా మీకేమైనా?
-
తాజ్మహల్ మాదే: షాజహాన్ విల్లు ఉందా ?
న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ తమకే చెందుతుందని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు షాజహాన్ అప్పట్లో వక్ఫ్నామాను తమకు అనుకూలంగా జారీచేశారని తెలిపింది. వాదనలు విన్న కోర్టు షాజహాన్ సంతకంతో జారీచేసిన పత్రాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. తాజ్ హక్కులపై యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, భారత పురావస్తు శాఖల మధ్య కేసు నడుస్తోంది. తాజ్ తమ పేరిట రిజిస్టర్ చేయాలని వక్ఫ్ బోర్డు ఉత్తర్వులు జారీచేయగా దాన్ని సవాలుచేస్తూ భారత పురావస్తు శాఖ 2010లో సుప్రీంలో కేసు వేసింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ మిశ్రా స్పందిస్తూ.. 1658లో గృహనిర్బంధంలో ఉన్న షాజహాన్ తాజ్ హక్కుల్ని ఎలా రాసిచ్చారని వక్ఫ్ లాయర్ను ప్రశ్నించారు. -
‘తాజ్మహల్ను షాజహాన్ మాకు రాసిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడో వింత, ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ను దాని నిర్మాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చారని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సుప్రీంకోర్టులో పోరాడుతోంది. మంగళవారం సున్నీ వక్ఫ్ బోర్డు వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తాజ్మహల్ను షాజహాన్ సున్నీ బోర్డుకు రాసిచ్చిన పత్రాలను చూపాలని కోరింది. పత్రాలను కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. భార్య ముంతాజ్పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్మహల్ను నిర్మించారు. 1658లో షాజహాన్ మరణించారు. తాజ్మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందని షాజహాన్ చేసిన డిక్లరేషన్ కాకుండా మరే ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సున్నీ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. తాజ్మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం తాజ్మహల్తో పాటు దేశ సాంస్కృతికను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. -
కోతులతో తాజ్మహల్కి ముప్పు!
ఆగ్రా: ప్రపంచ పాలరాతి అద్భుత కట్టడం పరిసరాల్లో పచ్చదనం క్షీనించిపోతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి కొంత కారణం కోతులని వారు పేర్కొవడం గమనార్హం. మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ వేత్తలు బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ‘తాజ్ పరిరక్షణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారంటూ 1996 నుంచి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలలో చలనం కనిపించడంలేదు. ప్రస్తుతం పచ్చని అడవులు పోయి.., కాంక్రీటు అరణ్యాలు ఏర్పడుతున్నాయి. బర్జా ప్రాంతంలో బృందావనం నుంచి ఆగ్రా వరకు 12 పెద్ద అడవులు ఉండేవి. ఇప్పుడు వాటిపేర్లే మిగిలాయి. ఆకుపచ్చని ప్రాంతాలన్నీ గోధుమ, పసుపు, బూడిద రంగులోకి మారిపోతున్నాయి. బిల్డర్లు, అవినీతి ప్రభుత్వాలు కలిసి అటవీ భూములను అనైతికంగా వాడుతున్నారు. యమునా నదివరకు చెట్లను నాశనం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ల నిర్మాణం వంటిపేర్లతో పచ్చని చెట్లను నరికేశారు. జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం అడవులు ఉండాలి, కానీ అది ఇక్కడ 7 శాతానికి పడిపోయింది. ఈ కారణాలన్నింటికి తోడు.. నాటిన మొక్కలను కోతులు వేళ్లతో సహా పీకేస్తున్నాయి. అటవీ సంరక్షణ చర్యలతోపాటు కోతుల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం కూడా ఉంద’ని పేర్కొన్నారు. -
వేదికపై సింగర్ల గొడవ
-
మా అమ్మను వేధిస్తారా: వేదికపై సింగర్ల గలాట
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తాజ్ మహోత్సవ్లో ఇద్దరు సింగర్లు వేదికపై రభస చేశారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్ మహోత్సవ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ్లాల్లో భాగంగా గాయకులు పలక్ ముచ్చల్, ఆమె సోదరుడు పలాష్ ముచ్చల్ సంగీత విభావరి ఇచ్చారు. అయితే, ఈ సమయంలో ఒక నిర్వాహకుడు తమ తల్లితో దురుసుగా ప్రవర్తించాడంటూ.. వారు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై రచ్చ చేస్తూ.. నిర్వాహకుడి తీరుపై పలక్ మండిపడింది. అతను తన తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేదిక మీద మైక్లో ఆమె పేర్కొనడం వీడియోలో వినిపిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమం మధ్యలోనే గాయకులు ఇలా గొడవకు దిగడంతో నిర్వాహకులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తాజ్మహల్ను, మొఘల్ సంస్కృతిని గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది యూపీ సర్కారు తాజ్ మహోత్సవ్ నిర్వహించే సంగతి తెలిసిందే. -
తాజ్ను దర్శించుకున్న ప్రధాని ట్రూడో!
-
తాజ్ను దర్శించుకున్న ట్రూడో!
సాక్షి, న్యూఢిల్లీ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తాజ్మహల్ను సందర్శించారు. భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ వద్ద సరదాగా ఫోటోలు దిగారు. భారత్లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం శనివారం ఢిల్లీకి ట్రూడో చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జామా మసీదును ట్రూడో కుటుంబం సందర్శించే అవకాశముంది. 2012 తర్వాత భారత్లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ప్రధాని మోదీ 2015 ఏప్రిల్లో కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు.. భారత్ రావాల్సిందిగా ట్రూడోను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్కు వచ్చిన ఆయన.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. సోమవారం గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్లోని అక్షర్ధామ్ ఆలయాన్ని ట్రుడో సందర్శిస్తారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు. -
తాజ్ సందర్శకులపై ఫీజు మోత
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ సందర్శకులపై భారీగా ఫీజు భారం పడనుంది. ఎంట్రీ ఫీజును ప్రస్తుతం ఉన్న రూ.40 నుంచి రూ.50కి పెంచటంతోపాటు తాజ్మహల్ లోపల చూడాలనుకున్న వారి నుంచి ప్రత్యేకంగా రూ.200 వసూలు చేయనున్నారు. పెంచిన చార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. రూ.50 ప్రవేశ టికెట్ మూడు గంటలపాటు మాత్రమే చెల్లుబాటవుతుందని ఆయన చెప్పారు. రూ.1,250 చెల్లించే విదేశీ పర్యాటకులు సులువుగా సందర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగానే టికెట్ ధరలు పెంచామని, ఆసక్తి ఉన్నవారే సందర్శనకు వచ్చే అవకాశముందన్నారు. దళారుల బెడద తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 1632లో నిర్మించిన తాజ్మహల్ లోపల మొఘల్ చక్రవర్తి షాజహాన్, ఆయన భార్య ముంతాజ్ సమాధులున్నాయి. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ను యునెస్కో 1983లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. -
తాజ్మహల్పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఆగ్రా: గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు లేకపోవడంతో ముగిసిందనుకున్న తాజ్మహల్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్గా ప్రసిద్ది చెందిన శివాలయాన్ని కూల్చేసి మొగల్ చక్రవర్తి షాజహాన్ తాజ్మహల్ను నిర్మించాడని గతేడాది వ్యాఖ్యలు చేసిన కతియార్ తాజాగా ఆ అంశంపై మళ్లీ స్పందించారు. తాజ్మహల్ను తాజ్ మందిర్గా మారుస్తామని చెప్పారు. కాగా, తాజ్మహల్ను హిందువులే నిర్మించారని అందుకే తాజ్మందిర్ అని పేరు మారుస్తామని ఎంపీ కతియార్ పేర్కొన్నారు. మరోవైపు తాజ్మహోత్సవ్-2018పై వివాదం మొదలైంది. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రామ్లీల నాటకం ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజ్మహల్ ప్రతిష్టను యోగి సర్కార్ దెబ్బతీస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. భారత పర్యాటకులపై పరిమితి ఈనెల 20 నుంచి తాజ్మహల్ను రోజుకు కేవలం 40 వేల మంది భారత పర్యాటకులే సందర్శించనున్నారు. విదేశీ పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు లేదు. రోజుకు నిర్ణీత టోకన్లు ఇవ్వనున్నట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. తాజ్మహల్ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘తేజో మహల్’ను ధ్వంసం చేసి తాజ్మహల్ కట్టారు! -
తాజ్ పర్యాటకులపై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తాజ్మహల్ను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్యపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోజుకు 40 వేల మంది భారతీయ పర్యాటకులు మాత్రమే ఇకపై తాజ్ను వీక్షించనున్నారు. అయితే విదేశీ పర్యాటకుల సంఖ్యపై పరిమితి విధించలేదు. కేంద్ర పర్యాటక శాఖ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఈనెల 20 నుంచి అమల్లోకి రానుంది. తాజ్మహల్ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపింది. చర్చల అనంతరం భారతీయ సందర్శకుల సంఖ్యపై పరిమితి విధించాలని పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. తాజ్ను వీక్షించే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో ఈ ప్రపంచ వారసత్వ కట్టడాన్ని సంరక్షించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, ఇతర రక్షణ చర్యలు తీసుకునేందుకు ఇబ్బందులు ఎదరవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా.. ఎంట్రెన్స్ టిక్కెట్ ధరపైనా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా నిర్ణయం ప్రకారం 15 ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. అయితే ప్రతి ఒక్కరికీ టిక్కెట్ మాత్రం జారీ చేస్తారు. ఇలా రోజు 40 వేల టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు. ముంతాజ్ సమాధిని దర్శించేందుకు మాత్రం ప్రత్యేకంగా రూ.100 టిక్కెట్ తీసుకోవాలి. -
జమునా దేవి ఆలయమే.. జామా మసీదు!?
సాక్షి, న్యూఢిల్లీ : మందిర్-మసీదు, తాజ్ మహల్ వివాదం మంటలు పుట్టిస్తున్న సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని జామా మసీదుపై అసలు జమునా దేవి ఆలయం అంటూ.. గురువారం అతిపెద్ద బాంబే పేల్చారు. ఒక్క జామ్ మసీదేకాకుండా.. దేశంలోని ఆరు వేల ప్రార్థనాలయాలను మొఘల్ రాజులు కూలగొట్టి.. మసీదులుగా మార్చారని మరో సంచలన ఆరోపణ చేశారు. దేశంలో మొఘలలు అడుగు పెట్టకముందు వరకూ జామా మసీదు, జమునా దేవి ఆలయంగా ఉండేదన్నారు. క్రీ.శ 17 శతాబ్దంలో షాజహాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఆయన పేర్కొన్నారు. మొఘలుల కాలంలో దేశంలో ప్రఖ్యాంతిగాంచిన ఆరు వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని ఆయన తెలిపారు. తేజే మహాలయాన్ని తాజ్మహల్గా మార్చినట్టే.. జమునా దేవి ఆలయాన్ని జామా మసీదుగా మార్చారని వినయ్ కతియార్ చెప్పారు. రెండు నెలల కిందట ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన టూరిజం కరపత్రంలో తాజ్మహల్ను పక్కన పెట్టడంతో వివాదం మొదలైంది. అదే సమయంలో తాజ్ మహల్, తేజో మహాలయమంటూ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా మండుతున్న బాబ్రీ-రామజన్మభూమి కేసు విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి విచారణ వాయిదా వేసింది. -
తాజ్మహల్ ముందు యోగి ఇలా...!
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం తాజ్మహల్ను సందర్శించారు. ప్రపంచంలోని అద్భుతమైన నిర్మాణాల్లో ఒక్కటైన తాజ్మహల్పై ఇటీవల బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం యోగి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేరుగా ఆగ్రాకు చేరుకున్న సీఎం యోగి.. తాజ్మహల్ పశ్చిమ గేటు ఎదుట 'స్వచ్ఛభారత్' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తొడిగి.. స్వయంగా చీపురుకట్ట పట్టుకొని రోడ్లను ఊడ్చారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్మహల్ను సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత యోగి సందర్శించడం ఇదే తొలిసారి. తాజ్మహల్ భారత సంస్కృతిపై మచ్చ అని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యానించడం, తాజ్మహల్ ఒకప్పుడు శివాలయం 'తెజోమహల్' అని బీజేపీ నేత వినయ్ కటియార్ పేర్కొనడం కమలం పార్టీని ఇరకాటంలో నెట్టేసింది. ఈ వ్యాఖ్యల వివాదాన్ని తోసిపుచ్చిన సీఎం యోగి.. ఈ కట్టడాన్ని ఎవరు, ఎందుకు కట్టారన్నది ముఖ్యం కాదని, భారతీయ కార్మికులు తమ స్వేదం, రక్తం చిందించి తాజ్మహల్ను నిర్మించారన్న విషయాన్ని మరువరాదని పేర్కొన్నారు. -
తాజ్మనదే
-
తాజ్మహల్ దగ్గర శివపూజ
-
తాజ్మహల్ దగ్గర శివపూజ
ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్మహల్ చుట్టూ వివాదాల పరంపరకు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేటట్లు కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్మహల్ను తొలగించడంతో మొదలైన వివాదం.. రోజుకో కొత్త మలుపు తిరిగుతోంది. తాజాగా.. సోమవారం అతివాద హిందూభావజాలంతో ఉన్న ఇద్దరు యువకులు తాజ్మహల్ దగ్గర శివచాలీసా పూజను మొదలు పెట్టారు. అంతేకాక తాజ్మహల్ అనేది మొదట శివాలయం అని వారు పేర్కొన్నారు. చారిత్రాత్మక ప్రదేశం వద్ద శివారాధన చేయడంతో అక్కడ కొద్దిసేపు.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శివారాధన చేస్తున్న వారిని అడ్డుకునేందుకు పోలీసలు ప్రయత్నించారు. ఈ సమయంలో వారు.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తాజ్ దగ్గర శివారాధన చేస్తున్న యువకులను రాష్ట్రీయ స్వాభిమాన్ దళ్ (ఆర్ఎస్డీ), హిందూ యువ వాహిని (హెచ్వైవీ)కి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చివరగా సీఐఎస్ఎఫ్ బలగాలు.. వారిని అదుపులోకి తీసుకుని.. స్థానికి పోలీసులకు అప్పంగించారు. రాతపూర్వకంగా క్షమాపణ కోరడంతో.. వారిని పోలీసులు తరువాత విడుదల చేయడం జరిగింది. -
మరక కాదు మట్టి మీద తారక
రెండో మాట బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వంటి వారు సెక్యులర్ రాజ్యాంగాన్ని భగ్నం చేసే దారులకు వెళ్లరాదు. కానీ ఈ పనికిమాలిన వివాదంతో వచ్చిన అపకీర్తి నుంచి బీజేపీ–ఆరెస్సెస్లను కాపాడుకునేందుకు మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, నష్ట నివారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రయత్నం చేశారు. ‘తాజ్ భారతీయ శ్రమజీవుల చెమట చుక్కల, రక్తతర్పణల ఫలితం’ అన్నారాయన. గుండెలలో నుంచి కాకున్నా, పెదవుల చప్పుడుతో అయినా ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. తాజ్మహల్ను నిర్మించినది హిందూ పాలకుడే గానీ, మొగల్ వంశీకుడు షాజహాన్ కాదు; అది శివాలయమే కానీ, ముంతాజ్ జ్ఞాపక చిహ్నం కాదు... హిందూత్వవాద రచయిత పీఎన్ ఓక్ 1980లో చేసిన సిద్ధాంతమిది. ‘భారత చరిత్ర’ను తిరగరాయవలసిన అవసరం ఉన్నదంటూ ఆయన 2000 సంవత్సరంలో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజ్మహల్ నిర్మాత హిందూ రాజేనని ప్రకటించాలని కోరారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఆ సందర్భంగా, ‘తాజ్ గురించి ఇతడు పాత పాటే పాడుతున్నాడు’ అంటూ కోర్టు చురక కూడా వేసింది. అలాగే తాజ్ మహల్ నిర్మించిన స్థలంలో అంతకు ముందు మరొక కట్టడం ఉన్నట్టు చెప్పే చారిత్రక ఆధారాలేవీ లేవని 2007 ఆగస్ట్లో భారత పురావస్తు పరిశోధన శాఖ చేసిన సర్వే కూడా ధ్రువపరిచింది. – (వికీ పీడియా విజ్ఞాన సర్వస్వం నుంచి) ‘తాజ్ భారతీయ సంస్కృతికే ఒక మచ్చ. చరిత్ర గ్రంథాల నుంచి దీని ప్రస్తావన తొలగించాలి. పాఠ్యపుస్తకాల నుంచి రూపుమాపాలి. కనుకనే బాబర్, అక్బర్, ఔరంగజేబు–ఎవరైతేనేమి, వీళ్లను చరిత్ర నుంచి తుడిచివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’ – సంగీత్ సోమ్ (యూపీ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే, 16–10–2017) ‘చూస్తూ ఉంటే మేస్తూ పోయింద’న్నట్టు బీజేపీ–ఆరెస్సెస్ పాలకవర్గం సెక్యులర్ రాజ్యాంగ ధర్మాలకూ, నియమాలకూ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పార్లమెంట్లో బ్రూట్ మెజారిటీతో పాలక వర్గం తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కనిపిస్తున్నది. తాజ్మహల్ గురించి మరోసారి రేపిన వివాదం ఈ రాజ్యాంగ విరుద్ధ పోకడలలో భాగమే. తన ప్రేయసి ముంతాజ్తో తనకు ఉన్న అనురాగానికి గుర్తుగా మొగల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో నిర్మించినదే ప్రపంచ ప్రఖ్యాత సుందర తాజ్. ఇప్పటి వివాదం దీని మీదే. పురుషోత్తం నగేశ్ ఓక్ (1917–2007) ఈ వివాదానికి మూలపురుషుడు. కొందరు కుహనా మేధావుల దృష్టిలో భూమి మీద తొలిగా ఆవిర్భవించినదే భారతదేశం. మిగిలిన దేశాలు తరువాత ఆవిర్భవించినవేనని వారి అభిప్రాయం. మానవ ప్రస్థానంలో కనిపించే అన్ని తాత్విక, గణిత, సాహిత్య, సాంస్కృతిక, ఖగోళ, జ్యోతిషాలకు పుట్టినిల్లు భారతదేశమేనని కూడా వారి నమ్మకం. అలాగే ఇతర మతాలనూ, సంస్కృతినీ తూలనాడడం కూడా వారికో దురలవాటు. ‘నా సంస్కృతి, తాత్వికతలు మహోన్నతమైన’ వంటూ చెప్పుకోవడం సబబైనదే. కానీ ఆ మైకంలో ఇతర దేశాల, జాతుల, ఖండాల వారి చారిత్రక వారసత్వాలను, కళా సంస్కృతులను కించపరచడం స్వదేశీ, విదేశీ భావజాలాలకు చెరుపేనన్న సంగతిని గ్రహించవలసిన రోజు వచ్చింది. నేటి తాజ్ రగడ పూర్వరంగాన్ని తెలుసుకున్నప్పుడు మన తాత్విక భావజాలంలో మార్పు అనివార్యమనిపిస్తుంది కూడా. ఈ రగడకు మూలమైన ఓక్ పుస్తకం (తాజ్, ది ట్రూ స్టోరీ) చదివితే ఆ తాత్వికతలోని వైరుధ్యాలు బయటపడతాయి. తాజ్ నిర్మాణం హిందూ దేవాలయాల శిల్ప రీతులలో జరిగిందని వాదించినప్పుడు, క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఇక్కడ జరిగిన నిర్మాణాలన్నీ ఇండో–ఇస్లామిక్ శిల్ప రీతులతో సాగాయన్న వాస్తవాన్నీ, ఆ కాలంలో వాస్తు, కళారీతుల మధ్య ఆదానప్రదానాలు జరిగాయన్న సత్యాన్నీ అంగీకరించవలసి ఉంటుంది. హిందూ వాస్తుశిల్పంతో తాజ్ రూపొందిందని చెప్పిన ఓక్ అక్కడితో ఆగలేదు. క్రైస్తవమతమనేది లేదు, క్రైస్తవం వైదిక క్రైస్త్తవం లేదా కృష్ణనీతి సిద్ధాంతమేనని ఓక్ సూత్రీకరించారు కూడా. ఇంకా, పోప్ మతాధికార వర్గమంటూ ఏదీ లేదనీ, వైదిక పురోహిత వర్గమే పోప్ మతస్తులనీ కూడా వాపోయారు. వాటికన్ను కూడా వైదిక పదం వాటిక నుంచి సాగలాగి వైదిక పురోహిత వర్గమే క్రైస్తవ మతాచార్యులని ఓక్ విశ్లేషించారు. అలా కశ్మీర్ నుంచి కేప్ కొమరిన్ దాకా ఉన్న చారిత్రక కట్టడాలు, నగర వాటికలు అన్నీ హిందూ మతస్తులవే తప్ప, వివిధ ముస్లిం పాలకులవి కావని ఓక్ సిద్ధాం తీకరించారు. తలాతోకా లేని ఇలాంటి మత ధోరణులు చరిత్ర అనిపించుకోలేవు. ఇవేం ధోరణులు? బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వంటి వారు సెక్యులర్ రాజ్యాంగాన్ని భగ్నం చేసే దారులకు వెళ్లరాదు. కానీ ఈ పనికిమాలిన వివాదంతో వచ్చిన అపకీర్తి నుంచి బీజేపీ–ఆరెస్సెస్లను కాపాడుకునేందుకు మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, నష్ట నివారణకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ప్రయత్నం చేశారు. ‘తాజ్ భారతీయ శ్రమజీవుల చెమట చుక్కల, రక్తతర్పణల ఫలితం’ అన్నారాయన. గుండెలలో నుంచి కాకున్నా, పెదవుల చప్పుడుతో అయినా ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే, ఇప్పుడు మన సంపదగా భావిస్తున్న ఎర్రకోట (మొగలుల కట్టడం), రాష్ట్రపతిభవన్, పార్లమెంట్ భవనం (ఆంగ్లేయులవి) గురించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కొనవలసి వచ్చింది. సింహాసనాల కోసం రక్తాన్ని చిందించిన చరిత్ర విషయంలో ఏ కాలపు పాలకులకూ మినహాయింపు లేదు. తండ్రిని, అన్నదమ్ములను చంపి అధికారానికి వచ్చినవారి గురించి తెలియంది కాదు. బాబర్, అక్బర్లకూ అదే జరిగింది, ఔరంగజేబుకూ అదే జరిగింది. తండ్రి షాజహాన్ను బంధించినవాడు ఔరంగజేబు. బాబర్, అక్బర్లు మత సామరస్య ప్రబోధకులు, ఆచరించిన వారైనా బిడ్డల నుంచే ప్రమాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. కృష్ణదేవరాయలు అధికారంలో ఉన్నప్పుడు రామరాయలు ఇతర శత్రువులతో చేతులు కలిపి రాజ్యాధికారానికి రావడానికి చూశాడు. రాయలు రాజ్య విస్తరణలో లేదా స్వరాజ్య సంరక్షణలో దక్కన్ ఆదిల్షా పైన మన ప్రాంతం కాని కటకం గజపతులపైనా కత్తులు దూయవలసి వచ్చింది– అందుకే రాజ్య విస్తరణ కాంక్షకు నిదర్శనగానే రాయల కాలంలోనే ఒక సామెత పుట్టింది: ‘కాదని వాదుకు వస్తే కటకం దాకా రాయలపాలనే’ కొనసాగుతుందన్న మాట. అలాగే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మొగలాయీలపై భీషణ సమరం సాగిస్తున్న తండ్రిని వదిలేసి వైరి శిబిరంతో ఎందుకు చేతులు కలపవలసి వచ్చిందో చెప్పే చరిత్రకారుడు లేడు. అందుకే ‘రాజన్నవాడు/ పాలకుడన్నవాడు ఏ వ్యక్తినీ తన బంధువనిగానీ, సంబంధి అని గానీ చూసుకోడు’ అన్న జహంగీర్ మాటల్ని ‘భారత చరిత్ర’ గ్రంథ రచయిత జాన్ కేయీ ప్రస్తావించారు. ‘రక్తపుకూడు’ దగ్గర ముస్లిం, హిందూ రాజులకు మధ్య తేడాపాడాలు చూపి మనం ఎవరికీ కొమ్ము కాయనక్కరలేదు. ఆదానప్రదానాలు సాధారణం అయితే వారి పాలనలో సాహిత్య, శిల్ప, కళాదిరంగాలలో జరిగిన కృషిని అంచనా వేసేటప్పుడు (అది అధికార విలాసాలలో అంతర్భాగమైనప్పటికీ) విమర్శకుల వైఖరి వేరుగా ఉంటుంది. ఎందుకంటే, తాజ్మహల్ నిర్మాణానికి అవసరమైన భూమిని షాజహాన్కు యమునా తీరంలో ఇచ్చినవాడు హిందూ రాజు అంబర్. ఇందుకు ముదరాగా షాజహాన్ ఆగ్రాలోని నాలుగు భవంతులను అంబర్కి అప్పగించాడని మరవరాదు. ఆ తర్వాతనే తాజ్ నిర్మాణం 1632లో మొదలై పదేళ్లలో పూర్తయిందని పదివేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను సాధికారికంగా లిఖించిన చరిత్రకారుడు మిఖాయిల్ ఉడ్ వెల్ల డించాడు (బీబీసీ గ్రంథావళి: ‘ది స్టోరీ ఆఫ్ ఇండియా’ 2007, పేజి–251). మనం విస్మరిస్తున్న మరొక అంశం ఉంది. నేటి బ్రాహ్మణ్యానికి పడని ముస్లిముల–మొగలాయీల పాలనలో, దర్బారుల్లో అనేకమంది బ్రాహ్మణులైన సంస్కృత పండితులు, పర్షియన్, హిందీ పండితులు సాహిత్య గోష్ఠులు, కవితా పఠనాలు హృద్యంగా జరిపిన వారే. మొగల్ పాలకుల నుంచి సనదులు పొందినవారే. అలాంటి వారిలో ‘పారసి (పర్షియా) ప్రకాశం’ రచించిన కృష్ణదాస, ఇంకా వేదాంగరాయలు, ‘పారసి ప్రకాశ వినోదిని’ గ్రంథకర్త వజ్రఘోషణుడు వంటి బ్రాహ్మణ పండితులు ఉన్నారు. అక్బర్ ఆస్థానంలోని ‘నీలకంధరుడు’ కూడా సనద్ అందుకున్నాడు. ప్రయాగ, బనారస్లను సందర్శించే యాత్రికులపై పన్ను రద్దు చేసేటట్టు షాజహాన్ను ఒప్పించిన సంస్కృత కవి కవీంద్రాచార్య సరస్వతికి నివాళిగా వెలసిందే– ‘కవీంద్ర చంద్రోదయ’ సంపుటం. షాజహాన్ కాలంలో తెలుగువారైన అప్పయ్య దీక్షితులు, ‘రసగంగాధరం’ కర్త జగన్నాథ పండిత రాయలు (ముంగండ) తమ పాండితీ కీర్తి పతాకాల్ని ఎగరవేసిన వాళ్లే. ముస్లిం యువతి ‘లవంగి’ని ప్రేమించి, మేలం ఆడుతున్నాడన్న నెపంపైన పండితరాయలను ఎవరో కాదు, కొందరు కుహనా బ్రాహ్మణ పండితులే వెలివేయడానికి ప్రయత్నించారన్న సంగతినీ మరవలేం. పాలనలో ‘పరమానంద’ అనే పండితుడు భారత ఖగోళ శాస్త్రం మీద గ్రంథం రాశాడు. ఇందుకు వెండి, బంగారు నాణాలను పురస్కారంగా పొందాడు. నాడు పర్షియన్, సంస్కృతం, హిందీ భాషా రచనల మధ్య ఆదాన ప్రదానాలు నడిచాయన్నది నిజం. పర్షియన్ ఖగోళ శాస్త్ర గ్రంథం ‘జి జియి–షా–జహానీ’ సంస్కృతంలోకి అనువదించడానికి నిత్యానంద పండితుడిని నియమించారు. ఇలా రుతు చక్ర భ్రమణంలో ఎన్ని మార్పులు జరిగినా కుల మతాలపై ఆధారపడి, ఆ రంగు కళ్లద్దాల్లోంచి మానవ సంబంధాల్ని కొలవడానికి ప్రయత్నించకూడదు. ఆ మాటకొస్తే– వాస్తు శిల్పకళలో అంతర్భాగమైన ఆలంకారిక ప్రవేశద్వారాలు, గుమ్మటాలు, వరండా ‘పయిజాలు’, పచ్చదనాన్ని నిత్యం తలపించే వృక్షపంక్తులు, సరంబీలు, కమాన్లు ఇత్యాది అమరికలలో ఇండో–ఇస్లామిక్ శిల్ప కళారీతులు పరస్పరం ప్రభావితమవుతూ వచ్చినవే. రసాత్మకత మిశ్రమ కళా సంప్రదాయాలకూ మౌలిక ధర్మమే. చివరికి కుంభస్వామి వైష్ణవ దేవాలయం సహితం ఈ మిశ్రమ వాస్తు శిల్ప రీతుల్ని తప్పిం చుకొనలేక పోయిందని చరిత్రకారుల భావన. గుజరాత్ సంప్రదాయం వేరని భావించే కొందరు వేర్పాటువాదులు గుజరాతీ కవి తన ‘అర్థ రత్నావళి’ గ్రంథాన్ని అక్బర్కి అంకితమిచ్చాడని మరవరాదు. ఇంతకూ ముక్తాయింపుగా ఒక ఆఖరిమాట– ఒక కథనం ప్రకారం ఔరంగజేబు గుజరాత్లోని జైన దేవాలయాన్ని కూల్చేశాడని కథ అల్లినా, గుజరాతీ దేశ భాషా పత్రికలన్నీ ఔరంగజేబు పాలనలో సర్వత్రా మత సామరస్యం వెల్లివెరిసిందని పేర్కొనడం మనకు తెలియని ఒక సత్యాన్ని తెలుసుకోవడమే. ఆమాటకొస్తే దక్కన్లోనూ ఔరంగజేబు హిందూ దేవాలయాలకు కానుకలిచ్చాడనీ వినలేదూ?! తెలి యని మరిన్ని వివరాలకు ఇటీవలి తాజా బృహత్ సాధికార రచన మేడం ఆంధ్రే ట్రస్కీ రాసిన ‘కల్చర్ ఆఫ్ ఎన్కౌంటర్స్’ గ్రంథరాజాన్ని (2016) పరి శీలించడం మన జ్ఞాన పరిధుల్ని విస్తరించుకోవడమే. abkprasad2006@yahoo.co.in సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ -
సీఎం యోగి ఆదిత్యనాథ్కి కేరళ ఝలక్!
తిరువనంతపురం: తాజ్మహల్పై ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్మహల్ భారతీయ సంస్కృతిపై మచ్చ అంటూ ఆయన అభివర్ణించడం పెద్ద దుమారమే రేపింది. దీంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కారు ఈ వివాదానికి దూరం జరిగింది. తాజ్మహల్ గొప్పదనాన్ని గుర్తిస్తున్నామని ప్రకటించింది. నష్టనివారణ చర్యల్లో భాగంగా త్వరలోనే తాజ్మహల్ను సందర్శించనున్నట్టు యోగి ఆదిత్యనాథ్ సంకేతాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం చారిత్రక వారసత్వాన్ని మరువరాదంటూ సదరు బీజేపీ ఎమ్మెల్యేకు చీవాట్లు పెట్టారు. ఈ వివాదం బీజేపీని కుదుపుతున్న నేపథ్యంలో తాజాగా వామపక్ష సర్కారు హయాంలో ఉన్న కేరళ టూరిజం శాఖ పెట్టిన ఓ ట్వీట్ అందరి దృష్టి ఆకట్టుకుంటోంది. 'దేవుడి సొంత నేల (కేరళ) తాజ్మహాల్కు సెల్యూట్ చేస్తోంది. లక్షలాదిమంది భారత్ను సందర్శించడానికి తాజ్మహల్ ఒక కారణం.. ఇంక్రెడిబుల్ ఇండియా' అంటూ కేరళ టూరిజం శాఖ తాజాగా ట్వీట్ చేసింది. తాజ్మహల్ వివాదంలో యోగి సర్కారును పరోక్షంగా దెప్పిపొడిచేందుకే కేరళ టూరిజం శాఖ ఈమేరకు ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. భారత్లో అత్యంత ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందిన తాజ్మహల్.. ఇటీవల యూపీ సర్కారు విడుదల చేసిన దర్శనీయ ప్రదేశాల బుక్లెట్లో లేకపోవడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. ఈ నేపథ్యంలో హిందూత్వ అతివాద బీజేపీ నేతలైన సంగీత్ సోమ్, వినయ్ కటియార్ తదితరులు తాజ్మహల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరకాటంలో పడిన బీజేపీ పరోక్షంగా ఆ ఇద్దరిని మందలిస్తూ దిద్దుబాటు చర్యలకు దిగింది. God's Own Country salutes the #TajMahal for inspiring millions to discover India. #incredibleindia pic.twitter.com/TXqSXQ9AYQ — Kerala Tourism (@KeralaTourism) 18 October 2017 -
‘తాజ్’ గుణపాఠం
నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉండాలని, అధినాయకుడి దృష్టిలో పడాలని కోరు కోవడం రాజకీయాల్లో ఉంటున్నవారికి సహజం. కానీ అందుకు వేళా పాళా చూసు కోవాలి. లేనట్టయితే ఆ మాటలు బెడిసికొడతాయి. ఒకపక్క పంజాబ్లోని గురు దాస్పూర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై బీజేపీ మథనపడుతున్న వేళ ఆ పార్టీకి చెందిన యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చరిత్రాత్మకమైన తాజ్మహల్ కట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాయకులందరినీ ఇరకాటంలోకి నెట్టారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ బీజేపీ అధికార ప్రతినిధి సర్ది చెప్పగా, ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ రాంనాయక్ కూడా ఇందులో జోక్యం చేసుకోవాల్సివచ్చింది. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇష్టానుసారం మాట్లాడే వ్యక్తిగా సంగీత్ సోమ్కు ఇప్పటికే పేరుంది. 2013లో యూపీలోని ముజఫర్నగర్ అల్లర్ల కారకుల్లో సంగీత్ సోమ్ కూడా ఒకరని జస్టిస్ విష్ణుసహాయ్ కమిషన్ నివేదిక ఆరో పించింది. అప్పట్లో ఆయన జాతీయ భద్రతా చట్టం కింద జైలుకెళ్లారు. రెండేళ్లక్రితం న్యూఢిల్లీకి సమీపంలోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై గుంపు దాడిచేసి కుటుంబపెద్ద అఖ్లాక్ను కొట్టి చంపిన కేసులో ‘అమాయకుల్ని’ ఇరికిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించి వార్తల కెక్కారు. తాజ్మహల్పై సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని బీజేపీ చెబుతుండవచ్చుగానీ చరిత్రకు సంబంధించి, ప్రత్యేకించి తాజ్మహల్ గురించి పార్టీలోని చాలామందికి ఈ మాదిరి అభిప్రాయాలే ఉన్నాయి. ఎవరిదాకానో ఎందుకు... యోగి ఆదిత్యనాథే మొన్న జూన్లో ‘ఈ సమాధి భారతీయ సంస్కృ తిలో భాగం కాబోద’ని అన్నారు. దానికి కొనసాగింపుగానే కావొచ్చు... యూపీ టూరిజం శాఖ ఈమధ్యే వెలువరించిన ముఖ్య దర్శనీయ స్థలాల బుక్లెట్లో తాజ్మహల్ ఫొటో లేదు. మధ్యలో ఎక్కడో దాని పేరు ప్రస్తావించాం కదా అని ఒకసారి... ఆ బుక్లెట్లో కేవలం స్థానిక దర్శనీయ స్థలాల గురించే ఇచ్చామని మరోసారి టూరిజం మంత్రి రీటా బహుగుణ వివరణనిచ్చుకున్నారు. నిజానికి ఇప్పుడు సంగీత్ సోమ్ ఆ వివాదాన్ని ప్రస్తావించే ఇష్టానుసారం మాట్లాడారు. దాన్ని ద్రోహులు నిర్మించారని, అలాంటి కట్టడాలకు చరిత్రలో స్థానం లేదని అన్నారు. ఇంతగా ఊగిపోయిన సంగీత్ సోమ్ 24 గంటలు గడవకముందే స్వరం మార్చారు. తాను మొగలులకే తప్ప ‘అందమైన కట్టడానికి’ వ్యతిరేకం కాదంటూ వివరణనిచ్చుకున్నారు. యోగి సైతం ‘భారతీయుల స్వేదం, నెత్తుటి బొట్లతోనే తాజ్మహల్ నిర్మితమైందని ఇప్పుడంటున్నారు. చరిత్రలో మనకు ఇష్టమైనవి ఉంటాయి... ఇష్టంలేనివీ ఉంటాయి. అంత మాత్రాన వాటిని మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మార్చలేం. మన అభిప్రా యాలకు తగ్గట్టు మలచలేం. చరిత్రలో జరిగిన తప్పులు, వాటి పర్యవసానాలూ గ్రహించుకుని అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం...మంచి కన బడితే దాన్ని ఆదర్శంగా తీసుకోవడం వివేకవంతులు చేసే పని. కనీసం వక్రీకరిం చాలన్నా చరిత్ర సంపూర్ణంగా తెలుసుకోవడం, దానిపై పట్టు సాధించడం అవసర మని సంగీత్ సోమ్కు ముందుగా తెలియాలి. షాజహాన్, ఔరంగజేబుల్లో ఎవరు తండ్రో, ఎవరు తనయుడో... ఎవరు ఎవరిని చెరసాలపాలుజేశారో, ఎందుకు చేశారో ఆయనకు అవగాహనలేదు. ఈ వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించిన ప్రధాని నరేంద్రమోదీ విలువైన మాటన్నారు. స్వీయ చరిత్రపైనా, వారసత్వంపైనా గౌరవం లేని దేశం అభివృద్ధి చెందదని, ఇలాంటి ధోరణి మార్చుకోనట్టయితే ఉనికిని కోల్పోతుందని చెప్పారు. చరిత్రలో మొగల్ చక్రవర్తులు కావొచ్చు... అంతక్రితం ఏలిన హిందూ రాజులు కావొచ్చు ఎవరైనా సామ్రాజ్య విస్తరణ కోసమే తమ శక్తియుక్తులు ధారపోశారు. చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆకాంక్షతోనో, తమకు ప్రియమైనవారి జ్ఞాపకంగానో కట్టడాలు నిర్మించారు. ప్రార్ధనామందిరాలు నిర్మించారు. ఇలాంటి కట్టడాలకు చెమటోడ్చిందీ... నెత్తురు ధారపోసిందీ ఇక్కడి శ్రామికులే. ఇందుకవ సరమైన వ్యయమంతా ఈ గడ్డపైనున్న జనం సృష్టించిన సంపదనుంచి, వారు కట్టిన పన్నులనుంచి లభించిందే. తాజ్మహల్ కట్టడంలో పర్షియన్, మధ్య ఆసియా, హిందూ శిల్పకళా రీతులున్నాయని చెబుతారు. వాటిని మేళవించి ఒక అద్భుతాన్ని సృష్టించడంలో ఆనాటి శిల్పుల పనితనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే... ఆ నిర్మాణానికి వారనుసరించిన పద్ధతులేమిటో ఆరా తీస్తే మన జ్ఞానం విస్తరిస్తుంది. నిజంగా చరిత్రపైనా, వారసత్వంపైనా గౌరవం ఉన్నవారు చేయాల్సిన పని ఇది. కట్టించింది ముస్లిం మతస్తుడు గనుక ఏదో ఒక వివాదం లేవనెత్తి ఉద్వేగాలు పెంచాలని ప్రయత్నించడం వెగటు పుట్టిస్తుంది. అన్ని అపురూప కట్టడాల చుట్టూ అల్లుకునే మార్మికతే దాదాపు నాలుగువందల ఏళ్లనాటి తాజ్మహల్కు సంబంధించి కూడా ఉంది. అందులో కొన్ని నిజా లుండొచ్చు. కొన్ని కల్పితాలు కావొచ్చు. తాజ్మహల్ నిర్మాణానికి అవసరమైన చలువరాళ్లు, ఇతర సామగ్రిని తరలించడానికి వెయ్యి ఏనుగుల్ని వినియోగించారం టారు. ఆ కట్టడం నిర్మాణంలో 22,000మంది పాలుపంచుకున్నారని అంటారు. ఇలాంటి కట్టడం మరోచోట అసాధ్యమయ్యేలా ఈ నిర్మాణంలో కీలకపాత్ర పోషిం చినవారి చేతులు షా జహాన్ నరికించాడని చెబుతారు. ‘కాలం చెక్కిట ఘనీభవిం చిన కన్నీటి చుక్క’గా రవీంద్ర కవీంద్రుడు అభివర్ణించిన తాజ్మహల్ ప్రపంచం నలుమూలల్లోని సౌందర్యారాధకులకూ సందర్శనీయ స్థలం. దేశాధినేతలు మొద లుకొని ఫేస్బుక్ జుకర్బర్గ్ వరకూ అందరినీ సమానంగా అలరించే తాజ్మహ ల్ను నిరుడు 62 లక్షలమందికిపైగా పర్యాటకులు వీక్షించారు. కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెట్టడంతోపాటు వేలాదిమందికి అది ఉపాధి కల్పి స్తోంది. అన్నిటికీ మించి ఈ దేశ సాంస్కృతిక వైవిధ్యతకు ప్రతీకగా నిలుస్తోంది. దాని జోలికెళ్లడం క్షేమం కాదని ఆలస్యంగానైనా మన నేతలు గ్రహించినందుకు సంతోషించాలి. -
‘తేజో మహల్’ను ధ్వంసం చేసి తాజ్మహల్ కట్టారు!
లక్నో : ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల ప్రకటనలతో ఇక తెరపడిందనుకున్న తాజ్మహల్ వివాదాన్ని బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ తిరగదోడే ప్రయత్నం చేశారు. తాజ్మహల్ను ఆ పేరుతో పిలవడానికే ఇష్టపడని ఆయన.. మొఘలులు హిందూ ఆలయాలను ధ్వసం చేశారని ఆరోపించారు. బుధవారం పలు జాతీయ మీడియా సంస్థలతో ఆయన మాట్లాడారు. ‘‘తేజో మహల్గా ప్రసిద్ధి చెందిన శివాలయాన్ని కూల్చేసి షాజహాన్ తాజ్మహల్ను కట్టాడు. ఇప్పటికీ అక్కడ ఆలయ అవశేషాలున్నాయి. తాజ్మహల్ పైకప్పు నుంచి జారిపడే నీటిధార అప్పట్లో శివలింగంపై పడేది’’ అని వినయ్ కతియార్ చెప్పుకొచ్చారు. అయితే, తేజో మహల్ను ధ్వసం చేసి కట్టినంత మాత్రాన తాజ్ మహల్ను కూల్చేయాలని తాను అనబోనని, సీఎం ఆదిత్యనాథ్ ఆగ్రా పర్యటనను స్వాగతిస్తున్నానని ఎంపీ వినయ్ అన్నారు. తాజ్ మహల్ భారతీయ సాంస్కృతిక చిహ్నం కాబోదంటూ సీఎం యోగి చేసిన వ్యాఖ్యలతో చారిత్రక కట్టడంపై మొదలైన వివాదం.. నానాటికీ పెద్దదవుతూ వచ్చింది. రెండు రోజుల కిందట బీజేపీ ఎంపీ సంగీత్ సోమ్.. తాజ్, ద్రోహులు నిర్మించిన కట్టడమని, బానిస నిర్మాణమని వ్యాఖ్యానించడం తెలిసిందే. -
చేతుల్ని నిజంగా నరికేశారా?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ చుట్టూ అల్లుకుపోయిన మంచి, చెడు కథలు మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. 17వ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ బేగమ్ పేరిట ఈ సుందర స్మారక భవనాన్ని నిర్మించిన షా జహాన్ (షాహబ్ ఉద్దీన్ ముహమ్మద్ కుర్రమ్) తన తండ్రిని చెరసాలలో బంధించిన దుర్మార్గుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. వాస్తవానికి షా జహాన్ తన తండ్రి జహంగీర్ను చెరసాలలో బంధించలేదు. షా జహాన్నే ఆయన కుమారుడు ఔరంగా జేబు బంధించారనే విషయం చరిత్ర పుస్తకాలు చదువుకోని భారతీయుల కూడా తెలుసు. మొఘల్ చక్రవర్తులది తనయులను చంపేసే తండ్రుల సంస్కృతంటూ ప్రముఖ హిందూత్వ వాది, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, సంగీత్ సోమ్ను సమర్థించారు. తండ్రులను చెరసాలల్లో బంధించారే తప్ప తండ్రులను చంపిన మొఘల్ రాజుల గురించి చరిత్రలో ఎక్కడా కనిపించదు. ఇంకా రాజ్యం కోసం తండ్రులను చంపిన తనయుల చరిత్ర రాజ్పుత్లకే ఉంది. మెవార్ రాజు రాణా కుంభాను క్రీస్తుశకం 1468లో ఆయన కుమారుడు ఉదయ్ సింగ్ చంపేశారని, క్రీస్తు శకం 1724లో మార్వార్ రాజు అజిత్ సింగ్ను ఆయన కుమారులు భక్త్ సింగ్, అభయ్ సింగ్లు కలిసి చంపేశారని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. ఆస్తుల కోసం తండ్రులను చంపేసే సంస్కతి ఇప్పటికీ భారతీయుల్లో కనిపిస్తోంది. దినేష్ శర్మ మరో అడుగు ముందుకేసి షా జహాన్ తాజ్ మహల్ను నిర్మించిన కూలీల రెండు చేతులను నరికేయించారని వ్యాఖ్యానించారు. అలాంటి అందమైన నిర్మాణాన్ని మరో చోట నిర్మించకూడదనే భావంతోనే కూలీల చేతులను నరికేయించారన్నది తెలిసీ తెలియని శర్మ లాంటి వ్యక్తుల అభిప్రాయం. తాజ్ మహల్ను నిర్మించడానికి ముందే షా జహాన్కు మంచి బిల్డర్గా పేరుంది. అప్పటికే ఆయన ఆగ్రా, ఢిల్లీ, లాహోర్, అజ్మీర్లో దాదాపు డజన్ కట్టడాలను పూర్తి చేశారు. ఒక కట్టడమయ్యాక అక్కడి నుంచి మరో చోటుకు కూలీలను తీసుకెళ్లడం ఆయనకు అలవాటు. కూలీలకు నిరంతరం పని కల్పించడ వల్ల వారిలో పని నైపుణ్యం పెరుగుతుందని, పైగా ఒకే వ్యక్తి వద్ద ఎక్కువ కాలం పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తారని కూడా ఆయన నమ్మేవారని చరిత్రకారులే చెప్పారు. ఈ రోజుల్లో లాగా నైపుణ్యం కలిగిన కూలీలు అప్పుడు పెద్దగా దొరికేవారు కాదు. అలాంటప్పుడు తాజ్ మహల్ లాంటి మహా సౌధాన్ని కట్టిన చేతులను బుద్ధి ఉన్నవారు ఎవరూ నరక్కోరు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అప్పటికే ప్రముఖుడైన జోహాన్నెస్ డీ లాయెత్ లాంటి యూరప్ చరిత్రకారులు ఆ సంఘటనను కచ్చితంగా నమోదు చేసేవారు. అప్పటి యూరప్ చరిత్రకారులు ఇలాంటి పుకార్లకు, రాజుల ప్రేమ పురాణాలకు అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేవారు. ముంతాజ్ బేగమ్ మరణించాక షా జహాన్ తన పెద్ద కూతురు జహనారా బేగమ్ల ప్రణయ గాధలు అంటూ ప్రచారం చేసిన చరిత్రకారులు వేల మంది కార్మికుల చేతులను నరికితే పట్టించుకోరా? అప్పుడు ప్రచారంలో ఏ మాత్రంలేని షా జహాన్ ఘోర కృత్యం గురించి కొన్ని దశాబ్దాల తర్వాత ఎందుకు ప్రచారంలోకి వచ్చింది? పైగా షా జహాన్, కూలీలకు ఇతరుల కన్నా ఎక్కువ వేతనాలిచ్చేవారన్న ప్రచారం కూడా ఉంది. అందుకేనేమో బ్రిటిష్ పాలకుల హయాంలోకన్నా షా జహాన్ కాలంలోనే భారతీయుల తలసరి ఆదాయం ఎక్కువని ఆర్థిక గణాంకాలే తెలియజేస్తున్నాయి (17వ శతాబ్దాన్ని 19వ శతాబ్దంలోని భారత ఆర్థిక వ్యవస్థ పోల్చి చూడండి!). షా జహాన్ విదేశీయుడని సోమ్, శర్మ కూటమి పేర్కొంది. తన జీవితాంతం భారత ఉపఖండంలోనే జీవించిన ఆయనకు మూగ్గురు రాజ్పుత్ తాతలు, ఒక పర్షియన్, ఆసియన్ తాత కూడా ఉన్నారు. లియో వర్ద్కర్ ఐరిస్ అని, బరాక్ ఒబామా అమెరికన్ అని ఒప్పుకుంటే షా జహాన్ను కూడా భారతీయుడని ఒప్పుకోవాల్సిందే. ఓ అద్భుతమైన కట్టడం వెనక ఓ చీకటి కోణం దాగుందని చెప్పడం మానవ సంస్కృతిలో భాగంగా కనిపిస్తోంది. మాస్కోలోని ప్రముఖ సెయింట్ బేసిల్స్ కెథడ్రల్కు ఆర్కిటెక్ట్గా వ్యవహరించిన తన కుమారుడైన పోస్తిక్ యకోవ్లెÐŒ ను రష్యా జారు చక్రవర్తి ఇవాన్ ది టెరిబుల్ చంపాలనుకోవడం కూడా అలాంటిదే. బాంబేలోని తాజ్ మహల్ హోటల్కు కూడా అలాంటి కథనే అల్లారు. తాను గీసిన ప్లాన్ను ముందు భాగాన్ని వెనక్కి, వెనక భాగాన్ని ముందుకు కట్టారని తెలిసి దాని ఆర్కిటెక్ట్ తాజ్మహల్ హోటల్ పైనుంచి దూకి చనిపోయారని చెబుతారు. తాజ్ మహల్ ఒకప్పటి ‘తేజో ఆలయం’గా పిలిచే శివాలయం అనే వాదనలో ఎంత నిజం ఉందో, కార్మికుల చేతులు నరకడంలోనూ అంతే నిజం ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగి రాష్ట్ర పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించడంతో మొదలైన ‘తాజ్ మహల్’ వివాదం ప్రధాని జోక్యంతో చివరకు తన మెడకే చుట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించారేమో భారతీయుల రక్తం, స్వేదంతో తడిసిన తాజ్ మహల్ను రక్షించాల్సిన బాధ్యత తన రాష్ట్రానిదేనని చెప్పారు. పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి దాన్ని తొలగించినప్పుడు అనవసరంగా ఓ సమాధిని రక్షించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అర్థరహితమన్న విషయాన్ని ఆయన మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా సమయానుకూలంగా వ్యవహరించడం తెలివైన రాజకీయ నేతల పని. అంత రక్తంతోకాకపోయిన కార్మికుల స్వేదంతో తడిసిన సౌధాన్ని ఏ దేశమైనా రక్షించుకోవాల్సిందే. -
ఆరో తరగతి బుక్ ఇవ్వండి!
సాక్షి, ముంబై: ప్రముఖ సినీ రచయిత జావేద్ అఖ్తర్ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ ఏడోవింతగా పరిగణించే తాజ్మహాల్.. భారత సంస్కృతికి మచ్చగా సోమ్ అభివర్ణించడాన్ని తప్పుబట్టారు. 'సంగీత్ సోమ్కు చరిత్ర తెలియకపోవడం చాలా గొప్ప విషయంగా భావించాలి. ఆయనకు ఎవరైనా ఆరో తరగతి చరిత్ర పుస్తకాన్ని ఇవ్వండి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ జమానాలో భారత్కు వచ్చిన డాక్టర్ థామస్ రోయి.. సగటు ఆంగ్లేయుల కంటే భారతీయుల జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని రాశాడు' అని జావేద్ అఖ్తర్ ట్వీట్ చేశారు. 'అక్బర్ను ద్వేషించేవాళ్లకు క్లీవ్ (బ్రిటిష్ ఇండియా కమాండర్ ఇన్ చీఫ్)తో ఎలాంటి సమస్యా లేదు. జహంగీర్ను ద్వేషించేవాళ్లు వారన్ హస్టింగ్స్ (బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్) గురించి మాట్లాడరు. నిజానికి వాళ్లే నిజమైన దోపిడీదారులు' అని అఖ్తర్ పేర్కొన్నారు. 'తాజ్మహాల్ భారత సంస్కృతిపై మచ్చ. హిందువులను నాశనం చేయాలనుకున్న చక్రవర్తి దీనిని నిర్మించారు' అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి దూరం జరిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. త్వరలోనే ఆగ్రాలోని తాజ్మహాల్తోపాటు ఇతర చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు సిద్ధమవుతున్నారు. -
తాజ్ మహల్పై ప్రధాని తొలిసారి ప్రకటన
-
తప్పు దిద్దుకుంటున్న సీఎం యోగి
సాక్షి : ప్రపంచ వితల్లో ఒకటిగా ఖ్యాతిగాంచిన తాజ్మహల్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, బీజేపీ చేసిన వరుస తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 17వ శతాబ్ధి కట్టడంపై ఆయన గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా నేడు సానుకూల ప్రకటన చేశారు. తాజ్మహల్ కట్టింది ద్రోహులని, అదొక బానిస కట్టడమని యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ బహిరంగ సభలో మాట్లాడిన దరిమిలా అన్నివైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వివాదాలను చల్లార్చే ప్రయత్నం చేశారు సీఎం యోగి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు? : మంగళవారం లక్నోలో విలేకరులతో మాట్లాడిన సీఎం ఆదిత్యనాథ్.. ‘‘తాజ్మహల్ను ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు అనేది అనవసరం. భారతీయ కూలీల నెత్తురు, చెమటలతో దాన్ని కట్టారు. ఇప్పటికే తాజ్ గొప్ప పర్యాటక కేంద్రం. కాబట్టి ఆ కట్టడాన్ని పరిరక్షిస్తూ, పర్యాటకుల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది’’ అని చెప్పారు. వివాదం ముదిరిందిలా.. : యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఇదే యోగి ఆదిత్యనాథ్ ‘తాజ్మహల్ భారత సాంస్కృతిక చిహ్నం కాబోదు’ అని ప్రకటించడం తెలిసిందే. ఆ తరువాత పర్యాటక శాఖ ప్రచురించిన టైరిస్ట్ గైడ్ బుక్లెట్లో తాజ్ను తొలగించడం, దాని స్థానంలో యోగి ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్నాథ్ మఠాన్ని చేర్చాలనుకోవడం తదితర పరిణామాలు వివాదాన్ని మరింతగా రాజేశాయి. ఆదివారం మీరట్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తాజ్మహల్ సహా ఇతర చారిత్రక కట్టడాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో అగ్గిరాజుకుంది. దీంతో నష్టనివారణకు సాక్షాత్తూ ప్రధాని మోదీనే తాజ్పై ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. ప్రధాని ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే యూపీ సీఎం యోగి మీడియాతో మాట్లాడారు. 26న తాజ్ సందర్శనకు యోగి : వివాదాలు చల్లార్చేక్రమంలో యూపీ సీఎం యోగి అక్టోబర్ 26న తాజ్మహల్ను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని సీఎంవో మంగళవారం ప్రకటించింది. సంగీత్ సోమ్ విద్వేష ప్రసంగం : మీరట్లో బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మాట్లాడుతూ.. ‘‘ తాజ్మహల్ను కట్టించింది ద్రోహులు. అదొక బానిస కట్టడం. మనం ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం? తండ్రిని జైలులో బంధించి, తాజ్మహల్ను కట్టినాయన గురించా! అతను(షాజహాన్) హిందువులను ఊచకోత కోయాలనుకున్నాడు. ఇదే వాస్తవచరిత్ర అయితే, దానిని మనం ఖచ్చితంగా తిరగరాయాల్సిన అవసరం ఉంది’’ అని విద్వేష వ్యాఖ్యలు చేశారు. -
తాజ్ మహల్పై ప్రధాని తొలిసారి ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్ మహల్పై పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని విమర్శలపాలు చేస్తుండటంతో వాటికి పుల్ స్టాప్ పెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ రంగంలోకి దిగారు. తొలిసారి ఆయన తాజ్మహల్పై స్పందించారు. వారసత్వ కట్టడాలను మరిచి ఏ దేశం కూడా ముందుకు వెళ్లలేదని చెప్పారు. 'చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవు. ఒక వేళ అలా చేయాలని అనుకుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక కచ్చితమైన సమయంలో తమ గుర్తింపును కోల్పోతారు' అని చెప్పారు. మంగళవారం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఆయన తాజ్ మహల్పై మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తాజ్మహల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారతీయ సంస్కృతిపై తాజ్మహల్ మాయని మచ్చ అని అనడంతో సోషల్ మీడియాతోపాటు పలు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రాంతాల్లో తాజ్ మహల్ను పేర్కొనకపోవడంతో ధుమారం రేగిన విషయం తెలిసిందే. -
‘దేశం పేరూ మార్చేస్తారు’
సాక్షి,కోల్కతా: తాజ్ మహల్ దేశ సంస్కృతికి మచ్చని బీజేపీ ఎంఎల్ఏ సంగీత్ సోమ్ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం పేరునూ మార్చేందుకు బీజేపీ ప్రయత్నించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయ అజెండానే సంగీత్ సోమ్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. బీజేపీ అనుసరిస్తున్నది ప్రజాస్వామ్యం కాదని అవి నియంతృత్వ పోకడలేనని ఆరోపించారు. దేశంలో భిన్న మతాలు, కులాలు, వర్గాలు, జాతులకు చెందిన ప్రజలున్నారని, దేశ ఐక్యత, సమగ్రతలకు విఘాతం కల్పించేలా ఏ ఒక్కరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని సూచించారు. మత ప్రాతిపదికన చేసే ఇలాంటి వ్యాఖ్యలు దేశ వారసత్వ, చారిత్రక విలువలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాజ్మహల్పై బీజేపీ ఎంఎల్ఏ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.బీజేపీ నేతలు అభివృద్ధిని పక్కనపెట్టి విద్వేష రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని అన్నారు. -
బానిస కట్టడాలు.. కూల్చేయండి
సాక్షి, లక్నో : ప్రముఖ కట్టడాల జాబితాల నుంచి తాజ్ మహల్ తొలగింపు మాటేమోగానీ తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే మరో నేత దానిని కొనసాగింపు వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక్క తాజ్ మహలే కాదు.. పార్లమెంట్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ వాటిని కూడా వారసత్వ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు.. వివాదాల పుట్ట అజాం ఖాన్. సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి అయిన అజాం ఖాన్ మంగళవారం ఓ మీడియాతో మాట్లాడుతూ... మొగలుల కాలంలో నిర్మితమైన కట్టడాలపై నిషేధం విధించాలని ఎప్పటి నుంచో తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. తాజ్ మహల్ ఒక్కటే కాదు.. జాతి సంపదలుగా చెప్పుకుంటున్న రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, ఎర్రకోట, కుతుబ్ మినార్ ఇవన్నీ బానిసత్వానికి ప్రతీకలే. అలాంటప్పుడు వాళ్లు(యూపీ ప్రభుత్వం) వాటిని కూడా ప్రముఖ కట్టడాల జాబితా నుంచి తొలగించి కూల్చేయాల్సిందే అని అజాం ఖాన్ అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆదిత్యానాథ్ ఆరు నెలల పాలన పూర్తి అయిన సందర్భంలో యూపీ ప్రభుత్వం ఓ బుక్లెట్ విడుదల చేయగా.. అందులో పర్యాటక ప్రాంత జాబితా నుంచి తాజ్ మహల్ను తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపించగా... ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు మంట పెట్టాయి. వారసలు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ తన తండ్రిని చెరసాలలో వేశారు. మొత్తం హిందువులే లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఇలాంటి వాళ్లు మన చరిత్ర భాగస్వాములవడం చాలా విచారకరం. చరిత్ర మార్చాల్సిన అవసరం ఉంది' అని సంగీత్ సోమ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మళ్లీ మంటపెట్టిన మరో బీజేపీ ఎమ్మెల్యే
-
తాజ్మహల్పై వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం
-
అసదుద్దీన్ ఫైర్.. పక్కకు జరిగిన యోగి సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : ఎర్రకోటను కూడా దేశ ద్రోహులే నిర్మించారని, మరి ఆ కోటపై జెండా ఎగురవేయకుండా ప్రధాని నరేంద్రమోదీ ఉంటారా అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తాజ్ మహల్పై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సూటి ప్రశ్నలు వేశారు. తాజ్ మహల్ను చూడొద్దని పర్యాటకులకు మోదీ, యోగి చెప్పగలరా అని ప్రశ్నించారు. వివాదం నుంచి పక్కకు జరిగిన యోగి ప్రభుత్వం తాజ్మహల్పై తమ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యల నుంచి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కకు జరిగింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం తరుపున రీతా బహుగుణ జోషి ప్రకటన చేశారు. తమ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తమ ప్రభుత్వం తాజ్ మహల్ వారసత్వ కట్టడాల్లో ఒకటని ఎప్పుడో ప్రకటించామని తెలిపారు. ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రముఖ చారిత్రక వారసత్వ కట్టడం తాజ్ మహల్ అని, ఆగ్రా, తాజ్ మహల్ అభివృద్ధికోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఒక పర్యాటకులపరంగా చెబితే తాజ్ మహల్ను చూసి గర్విస్తున్నామని తెలిపారు. తాజ్మహల్ భారతీయ సంస్కృతిపై ఓ మాయని మచ్చ అని సంగీత్ సోమ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
మళ్లీ మంటపెట్టిన మరో బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్మహల్ను విమర్శించే బీజేపీ నేతల వరుస పెరుగుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడంపై మరో బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్మహల్ భారతీయ సంస్కృతిపై ఓ మాయని మచ్చని అన్నారు. 'ఉత్తరప్రదేశ్ పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్మహల్ను తొలగించడంపై చాలామంది తమ అసంతృప్తిని వెల్లడించారు. వారసలు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ తన తండ్రిని చెరసాలలో వేశారు. మొత్తం హిందువులే లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఇలాంటి వాళ్లు మన చరిత్ర భాగస్వాములవడం చాలా విచారకరం. చరిత్ర మార్చాల్సిన అవసరం ఉంది' అని బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ పరిపాలనకు ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ బుక్లెట్ను విడుదల చేసింది. అందులో దేశంలోని ప్రముఖ కట్టడాలు, పర్యాటక నగరాలతో జాబితా ప్రకటించారు. అందులో తాజ్మహల్కు చోటు ఇవ్వలేదు. దీనిపై పెద్ద దుమారం రేగింది. తాజ్మహల్పై బీజేపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు వీడియో చూడండి -
తాజ్మహల్ స్థానంలో గోరఖ్నాథ్ మఠం!
ఆగ్రా : ప్రపంచ వింతల్లో ఒకటిగా, యునిసెఫ్ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తాజ్మహల్ స్థానంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రధాన పూజారిగా వ్యవహరిస్తోన్న గోరఖ్నాథ్ మఠాన్ని చేర్చనున్నారా! సాక్షాత్తూ ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరే ఈ డిమాండ్ను లేవనెత్తడంతో తాజ్ వివాదం మలుపు తిరిగినట్లైంది. యూపీ ప్రభుత్వం ఇటీవల ముద్రించిన టూరిజం బుక్లెట్లో తాజ్ మహల్ కట్టడానికి స్థానం కల్పించకపోవడంపై తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. బుక్లెట్ నుంచి తాజ్ తొలగింపును సమర్థించుకున్న యూపీ మంత్రి చౌదరి.. దాని స్థానంలో గోరఖ్నాథ్ మఠంతో భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం యూపీలో ఉన్నది జాతీయవాద ప్రభుత్వమని, అది మత ధర్మాన్ని కాపాడుతుందన్నారు. సోమవారం ఆగ్రాలో ఏబీవీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాక్షి వెబ్ ‘‘17వ శతాబద్ధం నాటి కట్టడానికి టూరిజం బుక్లెట్లో చోటుకల్పించినవాళ్లు.. ఇతరులు ఇష్టపడే ప్రదేశాలకు కూడా చోటు కల్పించి ఉండాల్సింది. గోరఖ్నాథ్ మథం ఇక్కడి ప్రజలకు ప్రతిబింబం లాంటిది. తాజ్ మహల్ స్థానంలో మఠానికి చోటుకల్పించడం అవసరం. తాజ్ ఏ ఒక్క మతానికో, వ్యక్తికో గుర్తుగా నిలిచిందికాదు’’ అని మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి అన్నారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై యూపీ టూరిజనం డైరెక్టర్ జనరల్ అవనీశ్ అవస్థీ భిన్నంగా స్పందించారు. అసలా బుక్లెట్ పర్యాటక ఆకర్షక స్థలాల సమాహారం కానేకాదని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేయడానికి మాత్రమే రూపొందించిందని వివరించారు. పుస్తకంలో చోటు కల్పించనప్పటికీ తాజ్ మహల్ నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందని సీఎం ఆదిత్యానాథ్ గతంలోనే చెప్పారు. అయితే, మంత్రి చౌదరి డిమాండ్పై సీఎం స్పందించాల్సిఉంది. సాక్షి వెబ్ -
‘తాజ్ను కూల్చేస్తే మద్దతు ఇస్తా’
లక్నో : వివాదాలతో సావాసం చేసే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజమ్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ను కూల్చివేయాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాలో తాజ్మహల్ పేరును పేర్కొనలేదు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ను యోగి ఆదిత్యనాథ్ సర్కారు విస్మరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆజమ్ ఖాన్ స్పందించారు. తాజ్మహల్ను కూల్చివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిస్తే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే తాజ్మహల్ కూల్చివేయాలని ఆయన చాలా ఏళ్లుగా అంటున్నారు. తాజ్మహల్ కూల్చి శివాలయం నిర్మించాలని గతంలో వ్యాఖ్యానించి దుమారం రేపారు. అక్కడితో ఆగకుండా రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ భవనాలను కూడా కూలగొట్టాలని డిమాండ్ చేశారు. ఈ భవనాలు బానిసత్వానికి ప్రతీకలని, వాటిని కూల్చివేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్నిభారీగా వృధా చేసిన స్మారక కట్టడాల్లో తాజ్మహల్ ఒకటనీ, అక్కడ నిలబడాలంటేనే తనకు నచ్చదని అప్పట్లో అన్నారు. -
తాజ్ మహల్కు అవమానం
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విమర్శల పాలయింది. తాజాగా విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల వివరాల విషయంలో వివాదం నెలకొంది. ఆ రాష్ట్రం విడుదల చేసిన టూరిస్టు ప్రాంతాల్లో తాజ్మహల్ను పేర్కొనలేదు. దేశంలోని పలు ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా పేర్కొని , తాజ్ మహల్ను మాత్రం టూరిజం ప్రాంతంగా పేర్కొనకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజ్మహల్ భారత్కు ఎంతటి ముఖ్య పర్యాటక ప్రాంతమో అందరికీ తెలిసిందే. పైగా ప్రపంచ వింతల్లో తాజ్మహల్ ఒకటి కూడా. అంతటి ప్రసిద్ధిగల తాజ్మహల్ను టూరిజం స్పాట్గా పేర్కొనకపోవడంపై సర్వత్వా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మహా మాయగాడు
ఎవరూ ఊహించలేని మోసాలను చేయడమే కాదు, అవసాన దశలో పోలీసు బందోబస్తు నుంచి తప్పించుకుని, తర్వాత ఎవరికీ చిక్కకుండా పోయిన మహా మాయగాడు నట్వర్లాల్. అతడి ఘనకార్యాలు అలాంటిలాంటివి కావు. ఇతగాడి అసలు పేరు మిథిలేశ్ కుమార్ శ్రీవాస్తవ. బిహార్లోని సివాన్ జిల్లా బాంగ్రా అనే కుగ్రామంలో పుట్టాడు. మోసాల బాటలోకి అడుగుపెట్టక ముందు న్యాయవాదిగా ఉండేవాడు. రకరకాల మారుపేర్లతో మాయ వేషాలతో వందలాది మందికి కోట్లాది రూపాయల మేరకు నిట్టనిలువునా ముంచేసిన బురిడీరాయుడు నట్వర్లాల్. అతడి బాధితుల్లో టాటా, బిర్లా, అంబానీలు కూడా ఉన్నారు. తాజ్ మహల్, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్లను ఒకటి కంటే ఎక్కువసార్లే అమ్మేశాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే పార్లమెంటు భవనాన్ని 545 మంది సిటింగ్ సభ్యులతో పాటు తెగనమ్మేశాడు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సహా పలువురు ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసి ఎడాపెడా మోసాలు సాగించాడు. తొమ్మిదిసార్లు అరెస్టయినా, జైళ్ల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతడిపై వందకు పైగా కేసులు ఉండేవి. వాటిలో 14 కేసులకు సంబంధించి మొత్తం 113 ఏళ్ల శిక్ష పడింది. అయితే, అతడు జైలులో గడిపింది ఇరవై ఏళ్ల లోపే. చివరిసారిగా కాన్పూర్ జైలులో ఉండగా జైలు సిబ్బంది 1996 జూన్ 24న అతడిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్కు తీసుకొచ్చారు. అప్పటికి అతడి వయసు 84 ఏళ్లు. అక్కడి నుంచి అతడు తప్పించుకుపోయాడు. ఆ తర్వాత అతడి ఆచూకీ ఎవరికీ దొరకలేదు. -
వాహ్.. తాజ్..
ప్రభాత వేళ.. ప్రేమ మందిరం చెంతన.. ఈ అద్భుత చిత్రం చూస్తుంటే.. వాహ్ తాజ్ అనాలనిపిస్తోంది కదూ.. మెయిల్ ఆన్లైన్ ట్రావెల్ సైట్ కూడా ఇదే అంది. అందుకే సూర్యోదయాన్ని వీక్షించడానికి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అందులో తాజ్మహల్తోపాటు తమిళనాడులోని వల్పరాయ్కు చోటు దక్కింది. -
తాజ్మహల్ పైనా గోప్యతేనా?
తాజ్మహల్ని రక్షించే బాధ్యత, చట్టాన్ని అమలుచేసే బాధ్యత ఉన్న ఏఎస్ఐ.. దాని చుట్టూ అక్రమ నిర్మాణాల వివరాలు చెప్పకపోవడం.. ఎంత సమయం ఇచ్చినా వివ రాలు సేకరించి, ప్రచురించకపోవటం, ఆదేశాలను పాటించకపోవటం అన్యాయం. ప్రపంచ వారసత్వ భవనం అని యునెస్కో గుర్తించిన అద్భుత కట్టడం తాజ్మహల్ను మనం రక్షించుకుంటు న్నామా? రోజూ 30 లక్షలమంది దర్శించి కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని తెచ్చే తాజ్ చుట్టూ అక్రమ నిర్మాణాలు కాలుష్యాల గురించి అడిగే వారే లేరా? తాజ్ అందాన్ని దెబ్బతీసే అంశాలను గురించి సుప్రీంకోర్టు, జాతీయ పర్యావరణ న్యాయస్థానం ఎన్నో కేసులు విచారించి కఠినమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ అద్భుత కట్టడానికి 2.4 కిలోమీటర్ల పరిధిలో చెట్లు కొట్టివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, తాజ్ ప్రహరీ నుంచి 100 మీటర్ల లోపున వాణిజ్య, నివాస నిర్మాణాలు చేపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలిని, భారత పురావస్తు శాఖను కట్టడిచేస్తూ తీర్పులు వెలువరించారు. ఇక్కడ నాసిరకం నిర్మాణాలను అనుమతిస్తే తాజ్ అందానికి హాని కలుగుతుందని సుప్రీం కోర్టు ఎంసీ మెహతా కేసులో హెచ్చరించింది. తాజ్ చుట్టూ నో ట్రాఫిక్ జోన్ ప్రతిపాదన అమలుపై ప్రశ్నిం చింది. ఇష్టంవచ్చినట్టు కట్టడాలను అనుమతిస్తే తాజ్ కళాత్మకతకు భంగం వాటిల్లుతుందని వివరించింది. ఆ కాలంలో ఉలి, సుత్తి తప్ప ఏ పరికరాలు లేకపోయినా అద్భుత సౌందర్య కళామందిరాన్ని నిర్మించారని, ఇప్పుడు అన్ని రకాల పరికరాలు యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఆ నాటి అందానికి సరితూగే నిర్మాణాలను దాని చుట్టూ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు విమర్శించింది. పురావస్తు చట్టం 2010 ప్రకారం రక్షిత కట్టడాలలో నిర్దేశిత ప్రాంతంలో నిర్మాణాలను నిషేధించారు. 200 మీటర్ల ప్రాంతంలో కట్టడాలపైన నిషేధం లేదు కానీ కొన్ని పరిమితులు విధించారు. రెగ్యులేటెడ్ ఏరియా అని కొంత ప్రాంతాన్ని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. పురావస్తు శాఖ అధికారి తప్ప మరొకరెవరూ ఇక్కడ నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా భూమి యజమాని అయినా సరే నిర్మాణాలు సాగిస్తే 3 నెలల వరకు జైలు శిక్ష 5 వేల రూపాయల వరకు జరి మానా విధించవచ్చని ఆర్కియాలాజికల్ సైట్స్ అండ్ రిమెయిన్స్ యాక్ట్ వివరిస్తున్నది. ఒక ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆగ్రాసర్కిల్ లో 533 అక్రమ నిర్మాణాలు జరిగాయని, వాటిలో 46 తాజ్ గంజ్ ప్రాంతాల్లో ఉన్నాయని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వివరించింది. ఏఎస్ఐ శాఖ వారు అక్రమ నిర్మాణాల సంఖ్య గురించి చెప్పారేగానీ వాటిపైన తీసుకున్న చర్యల గురించి వివరించనే లేదని, అసలు అక్రమ నిర్మాణాలు తొలగించారో లేదో కూడా చెప్పలేదని జమాతె ఇస్లామీ హింద్ సహాయ కార్యదర్శి ఇంతిజార్ నిజాం విమర్శించారు. అక్రమనిర్మాణాలను అనుమతించిన ఆఫీసర్లపైన, తెలిసి కూడా ఏమీ చేయని ఆఫీసర్ల మీద ఏ చర్యతీసుకున్నారని కూడా అడిగారు. తాజ్ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలు, నివాస సముదాయాలు (కాలనీలు), వాణిజ్య సముదాయాలు ఏమిటో తెలుసుకోవాలంటే 500 మీటర్ల పరిధి ఎక్కడెక్కడ ఉందో తెలియజెప్పాలని ఒక నాగరికుడు ఆర్టీఐ కింద దరఖాస్తులో కోరాడు. తాజ్ దక్షిణ దిశలో తూర్పువైపున 500 మీటర్ల లోపున ఏ నిర్మాణాలు, ఏ కాలనీలు, ఏ రోడ్లు, ఏ ప్రాంతాలు వస్తాయో తెలపాలని కోరారు. ఈ వివరాలు తెలిస్తేనే పౌరులు కూడా చట్టాన్ని అనుసరించి నిర్మాణాల విషయంలో జాగ్రత్త పడడానికి వీలుంటుంది. ఆర్కియాలజీ శాఖ వారు ఈ వివరాలు తమవద్దలేవని జవాబిచ్చారు. మరి అక్రమ నిర్మాణాలను ఏ విధంగా గుర్తిస్తారు? సీఐసీ ఆదేశాలను కూడా నిరాదరించి సమాచారం ఇవ్వనందుకు కమిషన్ అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానికి కూడా సమాధానం లేదు. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ వారిని అడగాలని ఏఎస్ఐ వారు సూచించారు. చట్టం అమలు చేయడానికి, సుప్రీం కోర్టు ఎన్జీటీ ఆదేశాలు పాటించడానికి, అక్రమ నిర్మాణాలు ఆపడానికి, నిర్మాణాలకు అనుమతి తీసుకోవడానికి కూడా ఈ వివరాలు అవసరం. అధికారులు కూడా ఈ వివరాలు ఇచ్చిన తరువాతనే అక్రమంగా నిర్మిస్తుంటే ప్రశ్నించడానికి వీలుంటుంది. ఈ వివరాలను అందరికీ అందుబాటులోకి తేలేకపోతే అవినీతికి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని దరఖాస్తుదారు వాదిం చారు. ఆగ్రా అథారిటీ దగ్గర ఉన్నాయంటే సరిపోదు, ఏఎస్ఐ దగ్గర కూడా ఈ సమాచారం ఉండాల్సిందే. తాజ్ని రక్షించే బాధ్యత, చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న ఏఎస్ఐ ఈ వివరాలు లేవనడం, ఎంత సమయం ఇచ్చినా వివరాలు సేకరించి ప్రచురించకపోవడం, ఆదేశాలను కూడా పాటించకపోవడం చాలా అన్యాయం. మొత్తం కాలనీలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, తదితర వివరాలను తమంత తామే సెక్షన్ 4(1)(బి) కింద వివరించవలసిన బాధ్యత ఉన్న ప్రభు త్వ శాఖ ఆ బాధ్యతను విస్మరించినందుకు 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఇద్దరు సమాచార అధికారులపైన కమిషన్ శిక్ష విధించింది. ఆగ్రా అభివృద్ధి అథారిటీతో సమన్వయం చేసి వివరాలు సేకరించి, తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడాలని కమిషన్ ఆదేశించింది. తాజ్మహల్ చుట్టూ కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యలను కూడా వివరించాలని ఉత్తరప్రదేశ్ కాలుష్యమండలికి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. (భీంసింగ్ సాగర్ వర్సెస్ సూపరింటెండెంట్ ఏఎస్ఐ కేసులో మే 30, 2017న సీఐసీ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). - వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
టాప్–10 అద్భుత కట్టడాల్లో తాజ్మహల్
ముంబై: ప్రపంచంలోని తొలి పది అద్భుత కట్టడాల్లో తాజ్మహల్ ఐదో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ప్రముఖ ‘ట్రిప్ అడ్వైజర్’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ‘ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ ఫర్ ల్యాండ్మార్క్స్’ పేరిట ట్రిప్ అడ్వైజర్ ఈ జాబితాను విడుదల చేసింది. కాంబోడియాలోని అంగ్ కోర్వాట్ దేవాలయం ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, స్పెయిన్లోని మెజ్క్విటా క్యాథడ్రెల్ డీ కోర్డొబా, వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నిలిచాయి. తర్వాత స్థానాల్లో రష్యాలోని ‘చర్చ్ ఆఫ్ ద సేవియర్ ఆన్ స్పిల్ల్డ్ బ్లడ్ (6), బీజింగ్లోని గ్రేట్వాల్ (7), పెరూలోని మచుపిచు (8) స్పెయిన్లోని ప్లాజా డీ ఎస్పనా (9), ఇటలీలోని డ్యుమో డీ మిలానో (10) నిలిచాయి. ఆసియా కట్టడాలతో విడుదల చేసిన మరో జాబితాలో తాజ్మహల్ రెండో స్థానంలో నిలిచింది. -
తాజ్మహల్ను సందర్శించిన రూవెన్
-
తాజ్ వద్ద డ్రోన్ కలకలం
ఆగ్రా: చారిత్రాత్మక కట్టడం తాజ్మహల్ వద్ద డ్రోన్ ఒకటి కలకలం రేపింది. హైసెక్యూరిటీ జోన్లో ఉన్న తాజ్మహల్ వద్ద శనివారం మధ్యాహ్న సమయంలో డ్రోన్ను ఎగురవేస్తున్న అమెరికా పర్యాటకుడిని పోలీసలు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఒహయో ప్రాంతానికి చెందిన నికోలస్గా గుర్తించారు. రెండు సార్లు తాజ్మహల్ వద్ద డ్రోన్ ఎగరడం గుర్తించామని హైసెక్యూరిటీ జోన్లో వీటిని ఎగరవేయడం నేరమని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆ పర్యాటకుడిని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని యుఎస్ ఎంబసీకి కూడా తెలిపామన్నారు. -
పాలరాతి మందిరంపై పచ్చని మచ్చలు
లక్నో: ప్రఖ్యాత ప్రపంచ వారసత్వ కట్టడం తాజ్మహల్పై ఏర్పడుతున్న పచ్చని మచ్చలకు కారణాలు అన్వేషించి దానికి పరిష్కార మార్గాలను తెలియజేస్తూ తనకు నివేదించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం ప్రభుత్వ అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. పాలరాతి మందిరమైన తాజ్మహల్పై ఏర్పడుతున్న మచ్చలకు యమునానదిలో పారవేస్తున్న కాలుష్య వ్యర్థాలు కారణం కావచ్చని, ఇది కాకుండా ఇతరత్రా కారణాలు ఉంటే వాటిని పరిశీలించి వాస్తవాలు కనుగొనాలని సీఎం ఆగ్రా డివిజినల్ కమిషనర్,జిల్లా మేజిస్ట్రేట్, పీడబ్లూడీ విభాగం, ఆర్కియాలజీ, కాలుష్యనియంత్రణ మండలి అధికారులను కోరారు. కాగా కాలుష్యంబారిన పడుతున్న తాజ్ పరిరక్షణా చర్యలపై గతవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు, యూపీ ప్రభుత్వానికి, నోటీసులు జారీచేసిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పై చర్యలకు ఉపక్రమించింది. -
ప్రపంచ టాప్-5 పర్యాటక ప్రాంతాల్లో తాజ్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-5 పర్యాటక ఆకర్షణ కేంద్రాల్లో తాజ్మహల్ స్థానం దక్కించుకుంది. ‘ట్రిప్ అడ్వైజర్’ వెబ్సైట్ సర్వేలో తాజ్ ఐదో స్థానంలో నిలిచింది. తొలిస్థానం పెరూలోని ‘మాచు పిచ్చు’కు దక్కింది. -
తాజ్ వద్ద ప్రిన్స్ జంట
న్యూఢిల్లీ: ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ను శనివారం సాయంత్రం బ్రిటన్ ప్రిన్స్ విలియం, ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ సందర్శించారు. తీవ్ర ఎండలను కూడా లెక్క చేయకుండా అక్కడే దాదాపు 45 నిమిషాల పాటు గడిపారు. ఈ సందర్భంగా సరిగ్గా 24 క్రితం ఏళ్ల క్రితం విలియమ్ తల్లి ప్రిన్సెస్ డయానా కూర్చున్న బెంచ్ మీద కూర్చుని ఫొటోలు దిగారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వారితో ఉండి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. తాజ్మహల్కు పక్కనే ఉన్న యమునా నదిని కూడా కాసేపు వీక్షించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి ఇంగ్లండ్ వెళ్లనున్నారు. ప్రిన్స్ జంట పర్యటన సందర్భంగా తాజ్ మహల్ వద్ద చాలామంది పర్యాటకులను నిలిపివేశారు. -
తాజ్ మహల్... తీసుకెళ్లవచ్చు
బెంగళూరు : ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ గొప్పతనమే వేరు. పాలరాతితో నిర్మించిన ఈ ప్రేమ ప్రతిరూపాన్ని చూడగానే మనతో పాటు తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అది సాధ్యమా? ..సాధ్యమే!! ఈ ఫొటోలోని తాజ్మహల్ను మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బెంగళూరులోని ఆర్బీఏఎన్ఎమ్ స్కూల్ గ్రౌండ్లో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. దీన్ని మనం ఎంచక్కా మడతపెట్టి.. తీసుకెళ్లొచ్చట. -
తాజ్ అందం చూడాలంటే వెయ్యి కొట్టాల్సిందే
ఆగ్రా: భారత దేశంలోని ప్రముఖ పర్యటన ప్రాంతం ఆగ్రా మరింత కాస్ట్లీ పర్యాటక కేంద్రంగా మారనుంది. అక్కడి ప్రాంతాలను సందర్శించాలనుకునేవారు ఇక మరింత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ రుసుములు పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తాజ్ మహల్ చూడాలనుకునేవారు విదేశీయులైతే రూ.750 చెల్లిస్తుండగా ముందు రోజుల్లో రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. దేశీయులు అయితే, రూ.40 చెల్లించాలి. అంతకుముందు ఇది రూ.20 ఉండేది. గురువారం కొత్తగా పెంచిన పర్యాటక ధరలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ప్రకటించింది. దీంతోపాటు సికంద్రా, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రాంతాలను చూడాలనుకునే వారు కూడా గతంలో చెల్లించినవాటికంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి వివాదానికి తెరలేపారు. తాజ్మహల్ కూల్చి శివాలయాన్ని నిర్మించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన 23వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన తాజ్మహల్ వివాదంలో శివసేనను వెనకేసుకొచ్చారు. తాజ్మహల్ను కూల్చివేసి, శివాలయం నిర్మించాలని శివసేన భావిస్తే, వారికి తన సహాయాన్ని అందిస్తానన్నారు. అందుకు పారపట్టి తన వంతు సహాయం చేస్తానన్నారు. అటు బీజీపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అదొక ఉగ్రవాద సంస్థ అంటూ ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. -
'తాజ్మహల్.. హిందూ దేవాలయం కాదు'
ప్రేమ ప్రతీకగా పేరొందిన ప్రసిద్ధ కట్టడం తాజ్మహల్ ఒకప్పుడు హిందూ దేవాలయం కాదని కేంద్రప్రభుత్వం లోక్సభలో తెలిపింది. తాజ్మహల్ హిందూ దేవాలయం అనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్శర్మ సోమవారం లోక్సభలో చెప్పారు. తాజ్మహల్ ఒకప్పుడు శివాలయమంటూ కోర్టులో ఓ పటిషన్ దాఖలైన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు వివరణ ఇచ్చింది. తాజ్మహల్ ఒకప్పుడు హిందూ దేవాలయమని, దాని యాజమాన్యాన్ని ముస్లింల నుంచి హిందువులకు బదలాయించాలని, అక్కడ ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా అడ్డుకోవాలని ఈ దావాలో పేర్కొన్నారు. ఈ పిటిషన్ గురించి ప్రభుత్వానికి తెలుసనని కేంద్రమంత్రి మహేశ్ శర్మ పేర్కొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ కట్టడమైన తాజ్మహల్ పూర్వకాలంలో శివాలయం అన్న వాదనను భారత పురావస్తు శాఖ కూడా గతంలో కొట్టివేసింది. -
వాళ్లు తాజ్మహల్ కట్టారు.. మీరు రోడ్లు కూడా వేయలేరా?
న్యూఢిల్లీ: 'ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేనికాలంలో మొఘల్ చక్రవర్తులు తాజ్మహల్ కట్టారు. కానీ ఇప్పుడు అన్ని ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నా.. ప్రపంచ ప్రఖ్యాత ఆ కట్టడం చుట్టూ మీరు సరైన రోడ్డు కూడా నిర్మించలేకపోయారు' అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మండిపడింది. తాజ్మహల్ చుట్టు తారు రోడ్డుకు బదులు రాతిఫలకాల రోడ్డు నిర్మించేందుకు అనుమతి కోరుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం వాదనలు విన్నది. 'మొఘళ్లు 17వ శతాబ్దంలో తాపీ, సుత్తె, చేతులతో తాజ్మహల్ను కట్టారు. కానీ ఆధునిక పరికరాలున్న ప్రభుత్వం సరైన రోడ్డు వేయలేకపోతున్నది' అని కోర్టు వ్యాఖ్యానించింది. తారు రోడ్డు వేయడం వల్ల వేసవిలో తాజ్మహల్ పరిసరాల్లో కాలుష్యం మరింతగా పెరిగిపోతుందని, అదేసమయంలో రాతిఫలకాల రోడ్డు వల్ల కాలుష్యం ప్రభావం ఉండకపోగా.. ఇది 50 ఏళ్లపాటు మన్నుతుందని ఖరగ్పూర్ ఐఐటీ పరిశోధనలో తేలిందని యూపీ ప్రభుత్వం కోర్టులో వాదించింది. -
ఇండియాలో టైటానిక్ హీరో సీక్రెట్ టూర్
ఎప్పుడు షూటింగ్లతో అభిమానులతో బిజీ బిజీగా ఉండే హాలీవుడ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ హీరో లియోనార్డో డికాప్రియో భారత్ లో సందడి చేశాడు. వాతావరణ మార్పులపై తెరకెక్కిస్తున్న ఓ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన డికాప్రియో షూటింగ్ గ్యాప్లో తాజ్ మహాల్ను సందర్శించాడు. అయితే డికాప్రియో ఇండియా పర్యటన వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం లియోనార్డో తాజ్ను సందర్శించినట్టుగా చెపుతున్నారు. తాజ్ పరిసరాల్లో ఈ హాలీవుడ్ స్టార్ తీసుకున్న సెల్పీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లియోనార్డో శనివారం ఉదయం 7గంటల 15 నిమిషాల సమయంలో క్యాప్, బ్లాక్ గాగుల్స్తో తాజ్ సందర్శనకు వచ్చాడు. అయితే ముందుగా సమాచారం లేకపోవటం, సెక్యురిటీ పరంగా కూడా ఎలాంటి హడావిడి లేకపోవటంతో చాలా సమయం వరకు అభిమానులను ఆయన్ను గుర్తించలేదు. చాలాసేపటికి లియోనార్డోను గుర్తించిన ఓ అభిమాని ఫోటో తీసే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాజ్ పరిసరాల్లో ఉల్లాసంగా గడిపిన లియోనార్డో డికాప్రియో తరువాత షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్లిపోయాడు. -
తాజ్ మహల్ నాకెంతో ఇష్టం: జుకర్ బర్గ్
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ ను సందర్శించడానికి తానెప్పుడూ ఇష్టపడుతుంటానని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు. భారత్ పర్యటన వచ్చిన ఆయన మంగళవారం తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటోను తన ఫేస్ బుక్ పేజీలో జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. 'బుధవారం జరగనున్న టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చాను. ఈరోజు తాజ్ మహల్ ను చూడాలని వచ్చా. ఈ అందమైన కట్టడాన్ని సందర్శించడం నాకెంతో ఇష్టం' అని ఫేస్ బుక్ లో పెట్టారు. తాను ఊహించిన దానికన్నా తాజ్ మహల్ ఎంతో అందంగా ఉందని, ఇది అపురూప కట్టడం అని ప్రశంసించారు. ప్రేమ కోసం ఏమైనా చేయగలమని తాజ్ మహల్ నిరూపిస్తోందని వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలో రేపు టౌన్ హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జుకర్ బర్గ్ పాల్గొంటారు. -
షీరోస్ కేఫ్ పక్కన తాజ్మహల్
తాజ్మహల్ యాసిడ్ రెయిన్ పొల్యూషన్కి గురవుతోందని దేశం ఆందోళన చెందుతోంది. మరి... మన చెల్లెళ్ల మీద పడ్డ యాసిడ్ని ఎలా కడిగేయాలి? కన్నీటితో చెంపలు కడుక్కోవచ్చునేమో... బాధనూ కొద్దిగా కడిగేయొచ్చేమో! కానీ యాసిడ్ను... ఎలా? బాధ వల్ల కన్నీళ్లు వస్తాయని మనం నమ్ముతాము. చాలా సందర్భాల్లో అది నిజం కాదు. కన్నీళ్లు సెల్ఫ్పిటీ నుంచే ఎక్కువగా వస్తాయి. మనపై మనకు జాలి పెరిగితే కన్నీళ్లు పెరుగుతాయి. ఈ బంగారు తల్లులకు జాలి నుంచి పుట్టే కన్నీరు అవసరం లేదు. ఈ సమాజం జాలి అంతకంటే అవసరం లేదు. మనోైధె ర్యం, ఆత్మవిశ్వాసం, సేవాతత్వాన్ని నూరి ఒక బ్యూటీ సోపును తయారు చేసుకున్నారు. ఈ సబ్బు చర్మసౌందర్యాన్ని దాటి ఆత్మసౌందర్యాన్ని ఉట్టిపడేలా చేస్తుంది. బికాజ్.. బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్. వీళ్లు నడిపే ‘షీరో కెఫే’ ప్రపంచానికి ఒక కొత్త వండర్. చూస్తూ ఉండండి... కొద్ది రోజుల్లో ఎక్కడున్నదని పర్యాటకులు అడిగితే... ‘షీరో కెఫే’ పక్కనుంది అని చెప్పుకునేంతగా ప్రసిద్ధి పొందుతుంది. దీనికి మీరే సాక్షి. మండిన హృదయాలను సేదతీర్చే వేదిక... స్టాప్ యాసిడ్ అటాక్ నెట్వర్క్తో కలిసి ఎన్జీవో చాన్వ్ ఈ కేఫ్ను నెలకొల్పారు. దాతల సహకారంతో దీనికి నిధులు సేకరించారు. యాసిడ్ దాడుల నుంచి కోలుకున్నవారి ధైర్యానికి సెల్యూట్ చేస్తూ రూపొందిన సూపర్హిట్ ప్లే పేరుతో ‘కేఫ్ షీరోస్ హ్యాంగౌట్’ గా ఏర్పాటైన ఈ ఔట్లెట్ విభిన్న కార్యక్రమాలకు కేంద్రం కూడా. ఈ కేఫ్కు దగ్గర్లోనే 21ఏళ్ల రూపా అనే యాసిడ్ దాడి బాధితురాలు రూపొందించిన డిజైనర్ వేర్ దుస్తుల ప్రదర్శన, విక్రయాలు ఉంటాయి. ఇక్కడ ఎన్జీవో కార్యకలపాల సమీక్ష కోసం వారం వారం, నెలవారీ సమావేశాలు నిర్వహించే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. చిన్న మచ్చ పడితేనే అద్దంలో చూసుకున్నప్పుడల్లా, ఎవరైనా ఏమిటని అడిగినప్పుడల్లా... చిన్న బుచ్చుకుంటాం. క్రీముల నుంచి సర్జరీల దాకా రకరకాల పరిష్కారాల గురించి ఆలోచన చేస్తుంటాం. అలాంటిది తమ తప్పేమీ లేకుండానే తనువంతా బొబ్బలతో, ముడుతలతో, మచ్చలతో నిండిపోతే... అద్దాన్ని చూసి కూడా భయపడేంతగా, తమని తాము గుర్తు పట్టలేనంతగా ... చూసినవాళ్లు చూపు తిప్పుకునేంతగా మారిపోతే ఆపై భవిష్యత్తు ఏమిటి? జీవితం ఏమిటి? ఈ యాసిడ్ దాడి బాధితులు తమలో నుంచి నిన్నను తీసేస్తూ రేపును నిర్మించుకునే క్రమంలోనే అవతరించిందీ రెస్టారెంట్. అక్కడ తింటే కడుపు నిండుతుంది. అక్కడ కలిసిన కథలు వింటే అద్భుతమైన స్ఫూర్తి అణువణువూ నిండుతుంది. కేఫ్ విత్ కేర్... ఆగ్రాలోని ఫతేబాద్ రోడ్లోని తాజ్మహల్ గేట్వే ఎదురుగా ఉన్న ఆ కేఫ్లోకి ఎంటరవ్వగానే... మహిళా సాధికారితకు సంబంధించిన గ్రాఫిటీ, పెయింటింగ్స్ గోడల మీద ఫెమినిజం గురించిన పుస్తకాలు అక్కడి రీడింగ్ రూమ్లో మనకు దర్శనమిస్తాయి.. అక్కడి టీవీలో మహిళా సాధికారితకు సంబంధించిన డాక్యుమెంట్రీలు, ఫిల్మ్లు ప్రసారం అవుతుంటాయి. చూడడానికి అది రెస్టారెంట్ అనేది నిజమే. అయితే దీన్ని ఏర్పాటు చేసింది ఏవో కొన్ని రూపాయలు కళ్ల చూడడం కోసం కాదు కొన్ని విధి వంచిత జీవితాలలో వెలుగులు చూడడం కోసం. రుచులెన్నో... వ్యథలన్ని... ఈ రెస్టారెంట్ రుచులను వడ్డించి ఊరుకోదు. యాసిడ్ దాడి వ్యథలను కళ్లకు కడుతుంది. ‘‘నా ముఖాన్ని తాకిన ద్రవం చర్మాన్ని మండిస్తుంటే ఏదో ఆయిల్ అనుకున్నాను. కాని అది జారినంత మేరా చర్మం కూడా కరిగిపోతుంటే అర్థమైంది అది యాసిడ్ అని’’ అని గుర్తు చేసుకుంటుంది రీతూ. హర్యానాలోని మారుమూల గ్రామంలో రీతూపై ఆమె కజిన్ యాసిడ్ పోశాడు. అతనితో అనైతిక సంబంధానికి తిరస్కరించడమే అతనికి తప్పుగా తోచింది. ఈ సంఘటన రీతూ శరీరాన్నే కాదు, మనసుని కూడా కాల్చేసి ఆమెకు ఒక కన్నును దూరం చేసింది. అయినా ఆమె నిబ్బరం కోల్పోలేదు. తనలోని నిరాశను కాల్చేయాలనుకుంది. ఇప్పుడామె ఆ రెస్టారెంట్లో ఫ్లోర్ మేనేజర్. ‘‘నా ముఖాన్ని కప్పుకుని తిరిగేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తలెత్తుకుని తిరగుతున్నాను. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు అంతేకాదు నేనెవరి మీదా ఆధారపడిలేను’’అంటూ సంతోషంగా చెబుతుంది రీతూ. రెస్టారెంట్కు వచ్చే కస్టమర్లను హాయ్ వెల్కమ్ అంటూ నవ్వుతూ విష్ చేసే నీతూ మాధుర్పై యాసిడ్ దాడి చేసింది కన్న తండ్రే. కారణం ఏదైనా ఆ దాడిలో ఆమె ముఖం కళ్లు కాలిపోయాయి. తల్లి సైతం గాయపడింది. ఇప్పుడు తల్లితో సహా నీతూ అదే రెస్టారెంట్లో విధులు నిర్వర్తిస్తోంది. కుప్పకూలిన కలలను తిరిగి నిర్మించుకునే దారిలో... అయినవాడో, కానివాడో ఎవడో మృగం... ఒక్క ‘చేత్తో’ జీవితాన్ని చిందరవందర చేశాడు. కలలను కుప్పకూల్చాడు. అయితేనేం వీరు ఆగిపోలేదు. తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ఏ అవకాశాన్నీ వదల్లేదు. ఈ కేఫ్ ఒక్కటే కాదు... గత కొంతకాలంగా ఈ యాసిడ్ బాధితులు ప్రపంచానికి తమ ధీరత్వాన్ని చవిచూపుతూనే ఉన్నారు. లక్ష్మి, రూప, చంచల్, రీతూ, సోనమ్లు డిజైనర్ దుస్తులు ధరించి ఫొటో షూట్ నిర్వహించారు. రూప డిజైన్ చేసిన దుస్తులతో ర్యాంప్ వాక్ కూడా చేశారు. తమ జీవితాలపై ఒక డాక్యుమెంటరీని రూపొందించడానికి ఫొటోగ్రాఫర్ రాహుల్తో కలిసి కృషి చేస్తున్నారు. ఢిల్లీ, కాన్పూర్, లూధియానాలలో సైతం కేఫ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని తర్వాత వీరి లక్ష్యం ఏమిటంటే... కమ్యూనిటీ రేడియో. దీనిలో వీరంతా ఆర్జేలు కానున్నారు. ‘‘ప్రస్తుతం ఆధారపడుతున్న డొనేషన్ పద్ధతిని ఎక్కువ కాలం కొనసాగించకూడదని మేం అనుకుంటున్నాం. వీరి రోజువారీ జీవనం కోసం కేఫ్స్, బొటిక్స్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. వీరు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకూ సహకరించాలనేదే మా లక్ష్యం’’ అంటున్నారు ఎన్జీవోకి చెందిన ఆశిష్ శుక్లా. నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి మించిన అందం ఏముంది? ఈ కేఫ్కి వెళితే మనకు కనిపించేది, ఎందరినో కదిలించేది అదే. ఒక సమాధిపై కట్టిన అపురూప కట్టడానికి చేరువలోనే... సమాధిలాంటి జీవితంలో నుంచి తిరిగి జన్మనెత్తిన వారు కట్టిన కేఫ్ చెరిగిపోని ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. జీవితంపై మనిషికి ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఆగ్రా వెళితే తాజ్మహల్ని చూస్తే ఒక భర్త తన భార్యను ఎంత గొప్పగా ప్రేమించగలడో తెలుస్తుంది. ఈ కేఫ్ని చూస్తే ఒక మనిషి తన జీవితంపై కోల్పోకూడని ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. - ఎస్.సత్యబాబు -
కిందపడి ధ్వంసమైన తాజ్మహల్ షాండ్లియర్
ఆగ్రా: తాజ్మహల్కు లార్డ్ కర్జన్ 110 ఏళ్ల క్రితం ఇచ్చిన షాండ్లియర్ ఒకటి కిందపడి ధ్వంసమైంది. దీనిపై భారత పురాతన పరిశోధన విభాగం(ఏఎస్ఐ) విచారణకు ఆదేశించింది. తాజ్మహల్ రాయల్ గేట్లోని ఆరడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు, 60కేజీల బరువైన రాగి షాండ్లియర్ను 1905లో బిగించగా బుధవారం అది కిందపడి ధ్వంసమైందని ఆగ్రా ఏఎస్ఐ చీఫ్ భువన్ విక్రమ్ శనివారం తెలిపారు. షాండ్లియర్ మళ్లీ పనికొస్తుందో లేదో తేలుస్తామన్నారు. శిథిలావస్థకు చేరడంతో కిందపడిందని భావిస్తున్నారు. అది కిందపడినపుడు అక్కడెవరూ లేరు. తాజ్ను రాత్రి వేళల్లో సందర్శించే పర్యాటకుల కోసం ఈ-టికెట్లను జారీచేయాలని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్కు బదులుగా మధ్యాహ్నం 3 గంటలలోపు ఈ-టికెట్లను కొనుగోలు చేయొచ్చని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ తెలిపారు. రాత్రి గం.8.30 నుంచి గం.12.30మధ్య సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. -
పోస్ట్మాస్టర్ అమర ప్రేమ
లక్నో: భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలో చారిత్రాత్మక తాజ్ మహల్ను నిర్మిస్తే యూపీలో ఓ ప్రేమ చక్రవర్తి తన హృదయరాణి కోసం మరో తాజ్మహల్ నిర్మాణానికి పూనుకున్నాడు. తల తాకట్టు పెట్టయినా సరే తన ప్రేమమందిరాన్ని పూర్తి చేస్తానంటున్నాడు. నిర్మాణ దశలో ఉన్న ఈ కట్టడం చుట్టుపక్కల గ్రామస్తులనే కాదు, సాక్షాత్తూ యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను కూడా ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే యూపీలో బులంద్శహర్లో నివసించే ఫైజల్ హసన్ ఖ్రాది (80) పోస్ట్ మాస్టర్ గా పనిచేసి రిటైరయ్యాడు. 58 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత అతని భార్య తాజాముల్లి బేగం క్యాన్సర్తో 2011లో కన్నుమూసింది. దీంతో పవిత్రమైన తమ ప్రేమకు గుర్తుగా ఓ మినీ తాజ్మహల్ రూపొందించాలని హసన్ ఖ్రాది నిర్ణయించాడు. అలాగే తన భార్య సమాధి పక్కనే తన శాశ్వత నిద్రకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. అయితే వృద్ధాప్యంలో అతని అంతులేని ప్రేమను, పడుతున్న కష్టాన్ని చూసిన కొంతమంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ హసన్ ఖ్రాది దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అంతేకాదు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, స్థానిక అధికారులు ఆర్థిక సహకారం అందిస్తామన్నా అంగీకరించలేదు. తన సొంత డబ్బుతోనే ఆ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. దీనికోసం తన వ్యవసాయ భూమిని, భార్య నగల్ని అమ్మేశాడు. ఇప్పటివరకు మొత్తం పదకొండు లక్షలు వెచ్చించాడు. మార్బుల్స్ తదితర పనుల కోసం మరో ఆరేడు లక్షలకు పైగా ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. 'గొంతు క్యాన్సర్తో నా భార్య చనిపోయిన తరువాత నాకంతా శూన్యంలా అనిపించింది. నేనూ పోతాను..ఈ భవనం కూడా కూలి పోతుంది. కానీ నేను చనిపోయే ముందు ఈ ప్రేమమందిరాన్ని పూర్తిచేయాలి, దాన్ని కళ్లారా చూడాలనేదే నా కోరిక. అలాగే నేను పోయిన తరువాత నా అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగాలి. ఈ విషయాన్ని తమ్ముడికి చెప్పాను. ఇందుకు అవసరమైన డబ్బులు కూడా డిపాజిట్ చేశా'నంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు. మరోవైపు తనకు చేస్తానన్న ధన సహాయంతో గ్రామంలో పాఠశాల భవనాన్ని నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరనున్నానని ఖాద్రి తెలిపాడు. -
తాజ్ మహల్ వద్ద ప్రేమజంట కలకలం
ఆగ్రా: ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్ మహల్ వద్ద ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఓ ప్రేమజంట బుధవారం సాయంత్రం తాజ్ మహల్ వద్ద ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించడంతో పర్యాటకులు షాక్ కు గురైయ్యారు. డెహ్రాడూన్ కు చెందిన రాజవీర్ సింగ్(25), ఆగ్రాలోని కర్బాలా నివాసి షబ్నం అలీ బ్లేడులతో పరస్పరం గొంతు కోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించారు. రక్తపు మడుగులో పడివున్న వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఎస్ ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషంగా ఉన్నట్టు సమాచారం. పెద్దలు తమ ప్రేమకు అంగీకరించలేదన్న కారణంతో వీరు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. తీవ్ర నిస్పృహతోనే ఆత్మహత్యకు యత్నించామని ఆస్పత్రిలో ఆగ్రా మేజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో రాజవీర్ సింగ్ తెలిపాడు. తమ పెళ్లికి పెద్దలను ఒప్పించడంలో తామిద్దరం విఫలమయ్యామని చెప్పాడు. ఇద్దరీ మతాలు వేర్వేరు కావడం తమ పెళ్లికి అడ్డుగోడగా మారిందని వాపోయాడు. తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందన్న వార్త వినగానే షబ్నం తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రేమించిన వాడితో ఆమెకు పెళ్లి జరిపించేందుకు ఒప్పుకుంటున్నట్టు వైద్యులకు తెలిపారు. కాగా, రాజవీర్-షబ్నంపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. -
ఎయిర్పోర్టు బాగుంది.. తాజ్మహల్కు వెళ్తున్నా
* కేన్సర్ బాధిత బాలుడు గిరిధర్ * ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో తీరుతున్న కోరిక శంషాబాద్: ‘మా ఫ్రెండ్స్ చెప్పే వాళ్లు.. విమానాశ్రయం, తాజ్మహల్ ఎంతో బాగుంటాయని. ఈ రోజు విమానాశ్రయం చూశా.. చాలా బాగుంది’ అని కేన్సర్ బాధిత బాలుడు గిరిధర్ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నెల్లిమలకు చెందిన ఎం.వెంకటేశ్వర్లు, కాంతమ్మ దంపతుల కుమారుడు గిరిధర్. 8వ తరగతి చదువుతున్నాడు. ఏడాదిగా జ్వరంతో బాధపడుతున్న అతడిని తల్లిదండ్రులు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చూపించారు. బాలుడికి కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో ఇటీవలే నగరంలోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ బాలుడి కోరికలను తెలుసుకుని వాటిని తీర్చడానికి ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తల్లిదండ్రులతో కలసి తాజ్మహల్ చూడడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన గిరిధర్ మీడియాతో మాట్లాడారు. -
తాజ్ మహల్ వద్ద ఉచిత వైఫై 16 నుంచి
న్యూఢిల్లీ: చారిత్రక కట్టడం తాజ్మహల్ పరిసరాల్లో త్వరలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సందర్శకులు జూన్ 16 నుంచి 30 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలు పొందవచ్చు. ఆపై ప్రతి గంటకు అదనంగా రూ. 30 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తాజ్మహల్ పరిసరాల్లో 21 వైఫై కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. ప్రతి ఏటా 80 - 90 లక్షల మంది పర్యాటకులు తాజ్మహల్ని సందర్శిస్తారని, వారిలో 10 లక్షల మంది దాకా విదేశీ పర్యాటకులు ఉంటారని అంచనా. -
ప్రేమ నగరి
నేడు ప్రేమికుల దినోత్సవం ‘కమల్ ఖిల్తే హై.. ఆంఖ్ భరాతీ హై జబ్ కభీ లబ్పే తేరా నామ్ వహ్వా ఆతా హై...’ (నీ వలపుల పేరు పెదవులపై నడయాడినంతనే కమలాలు వికసిస్తాయి. కళ్లు ఆనందంతో మెరుస్తాయి.) భాగమతిని గురించి కవి మఖ్దూమ్ మొహియుద్దీన్ స్పందన ఇది. షాజహాన్ తన ప్రియురాలి కోసం ఒక్క తాజ్మహల్నే కట్టించాడు. కానీ.. మానవ ఇతిహాసంలో ప్రేమ పునాదులపై నిర్మితమైన మహా నగరం బహుశా.. మన ఘన భాగ్యనగరి మాత్రమేనేమో... -
తాజ్ సందర్శనకు మళ్లీ వస్తా: మిషెల్
న్యూఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ మందిరం తాజ్మహల్ను ఈసారి పర్యటనలో వీక్షించలేకపోయినప్పటికీ తాజ్ సందర్శన కోసం మరోసారి భారత్ వస్తానని అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మంగళవారం తెలిపారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు మిషెల్ ఈ మేరకు బదులిచ్చారు. ఆగ్రా పర్యటన రద్దు కావడం తనకు నిరాశ కలిగించిందన్నారు. వాస్తవానికి ఒబామా దంపతుల భారత పర్యటన షెడ్యూల్లో మంగళవారం తాజ్ సందర్శన ఉన్నప్పటికీ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలిపేందుకు సౌదీ వెళ్లాలని ఒబామా నిర్ణయించుకోవడంతో షెడ్యూల్ను కుదించారు. తాజ్మహల్ను ఇప్పటివరకూ పలువురు దేశాధినేతలు కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. 2010లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తన భార్య కార్లా బ్రూనీ 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సీతో కలసి తాజ్ను వీక్షించారు. -
తాజ్ పరిసరాల్లో పిడకల వంట నిషేధం
లక్నో: తాజ్మహల్ సమీపంలో పిడకలతో వంట చేయడాన్ని ఆగ్రా డివిజినల్ కమిషనర్ ప్రదీప్ భట్నాగర్ మంగళవారం నిషేధించారు. చిన్న చిన్న పరిశ్రమల్లో బొగ్గు వాడకాన్ని నిషేధించడంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల ఓ అమెరికన్ జర్నల్ గాలిలోని కార్బన్ వల్లనే తాజ్మహల్ రంగు పసుపుగా మారుతోందని తన పరిశోధనలో పేర్కొనడంతోపిడకలపై నిషేధం విధిస్తున్నామని భట్నాగర్ చెప్పారు. దీనివల్ల పేద ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వారికి ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తామన్నారు. -
సందర్శకుల సౌకర్యార్థం ఈ-టికెట్
న్యూఢిల్లీ : తాజ్మహల్, హుమాయన్ సమాధిని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఈ టికెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. పెలైట్ ప్రాజెక్టుకింద శుక్రవారం ఈ టికెట్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకోసం హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. పరిశుభ్రత ఉద్యమం, మెరుగైన ఆస్పత్రుల నిర్వహణ, పర్యాటక రంగ అభివృద్ధిని ప్రజలు కోరుకొంటున్నారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. భారత్కు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే హెల్ప్లైన్ నంబర్ రెండు భాషల్లో(హిందీ-ఇంగ్లిష్) 6 లైన్లు అందుబాటులో ఉంచామని అన్నారు. అంతర్జాతీయ భాషలైన జర్మనీ, రష్యా,ఫ్రెంచ్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తాజ్మహల్, హుమాయన్ సమాధి సందర్శన టిక్కెట్లను 90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. డెబిట్కార్డు, క్రెడిట్కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. సందర్శకులను మూడు కేటగిరీలు విభజించారు. విదేశీ పర్యాటకులు, సార్క్ సందర్శకులు, దేశీయ సందర్శకులుగా విభజించారు.అదేవిధంగా ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాల గురించి బ్రెయిలీ లిపిలో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. -
అదృష్టం లిఫ్ట్ లాంటిది!
‘‘హార్డ్వర్క్ మెట్లదోవ లాంటిది. అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ ఫెయిల్ అవుతుంది. కానీ, మెట్లు మనల్ని పైపైకి తీసుకెళతాయి. నేనెప్పుడూ మెట్లనే నమ్ముకుంటా’’ అంటున్నారు మోనికా బేడీ. చేసిన సినిమాల కన్నా మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారామె. తెలుగులో తాజ్మహల్, సోగ్గాడి పెళ్లాం.. ఇలా రెండు, మూడు చిత్రాల్లో నటించిన మోనికా హిందీ చలనచిత్ర సీమలో కొన్ని చిత్రాలు చేశారు. పాస్పోర్ట్ కుంభకోణం, మాఫియాతో సంబంధాల వల్ల జైలు శిక్షనూ అనుభవించారు. గతం గతః అనుకుని, భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు మోనికా. ఇటీవల పంజాబీ చిత్రం ‘రోమియో రాంఝా’లో డీఎస్పీగా పవర్ఫుల్ రోల్ చేశారామె. అలాగే, బుల్లితెర కోసం ‘బంధన్’ అనే షో చేస్తున్నారు. ఇది కాకుండా ‘సరస్వతీచంద్ర’ అనే ధారావాహికలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేశారు. కథకు కీలకమైనవి అయితే, సినిమాల్లో కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మోనికా తెలిపారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు. -
మంచు కౌగిట్లో ప్రేమ చిహ్నం
మంచు ముసుగు తన్ని పడుకున్న తాజ్మహల్ను భానుడు తన నులి వెచ్చని కిరణాలతో నిద్రలేపుతున్న తరుణంలో క్లిక్మనిపించిన చిత్రమిది. ఈ సుందర సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు మంగళవారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో తాజ్మహల్ వద్దకు చేరుకున్నారు. తమ తమ కెమెరాల్లో మంచుకౌగిట్లోని ప్రేమచిహ్నాన్ని క్లిక్మనిపించారు. -
అతనితో కలిసి తాజ్మహల్కు!
‘‘నేను ఇష్టపడేవాళ్లతో కలిసి ఢిల్లీ వెళ్లా...’’ అంటూ ఇటీవల త్రిష ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక.. అప్పట్నుంచీ త్రిష ఇష్టపడేవాళ్లెవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె ఇష్టపడేవాళ్ల జాబితాలో అతను ఉండే ఉంటాడనే చర్చ కూడా జరిగింది. అతగాడెవరో కాదు.. ‘వరుణ్ మణియన్’. ఇటీవల వరుణ్తో త్రిష నిశ్చితార్థం జరిగిందనీ, వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలో నిజం లేదని త్రిష పేర్కొన్నారు. దాంతో అది సద్దుమణిగింది. కానీ, ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఎందుకంటే... త్రిషతో ఢిల్లీ వెళ్లినవాళ్లల్లో వరుణ్ కూడా ఉన్నారు. మొత్తం నలుగురైదుగురు స్నేహితులతో కలిసి త్రిష ఢిల్లీలోని తాజ్మహల్ని సందర్శించారు. ఆ నలుగురైదుగురులో వరుణ్ మినహా అందరూ అమ్మాయిలే. వాళ్లతో కలిసి త్రిష తాజ్ ముందు డాన్స్ చేశారు. వాటితో పాటు.. తాజ్ ప్రయాణంలో భాగంగా దిగిన ఫొటోలను కూడా బయటపెట్టారు. వాటిలో వరుణ్ మణియన్ని చూసినవాళ్లు.. త్రిషతో ఇతగాడు ఎందుకెళ్లాడబ్బా? అని మాట్లాడుకుంటున్నారు. -
తాజ్మహల్ పురావస్తు శాఖ ఆస్తి: బాజపేయి
బర్లాంపూర్(యూపీ): తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డుకు అప్పగించరాదని బీజేపీ యూపీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజపేయి డిమాండ్ చేశారు. ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ పురావస్తు శాఖకు చెందుతుందని చెప్పారు. 'తేజోమహాలయ ఆలయ భూమిలోని కొంతభాగాన్ని రాజా జాయ్ సింగ్ నుంచి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డుకు అప్పగించకూడదు. ఇది భారత పురావస్తు శాఖకు చెందిన ఆస్తి. బ్రిటీషు ప్రభుత్వం 1920లో దీన్ని పురావస్తు శాఖకు అప్పగించింది' అని లక్ష్మీకాంత్ బాజపేయి పేర్కొన్నారు. తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేసింది. -
తాజ్మహల్పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
-
తాజ్మహల్ పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆగ్రా: తాజ్మహల్ పై ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది. తాజ్మహల్ ను వక్ఫ్ బోర్డు ఆస్తిగా ప్రకటించి, అప్పగించాలని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. రోజుకు ఐదుసార్లు తాజ్మహల్ లో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని అధికార సమాజ్వాది పార్టీని మరో ముస్లిం నాయకుడు కోరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రా వాసులు, బుద్ధిజీవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆజంఖాన్ కు మతి తప్పిందని బ్రజ్ మండల్ హెరిటేజ్ కన్జర్వేషన్ సొసైటీ అధ్యక్షుడు సురేంద్ర శర్మ మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంత్రికి తగదని హితవు పలికారు. మంత్రి వ్యాఖ్యలు బాధాకరమని అజ్మీర్ కు చెందిన మొఘల్ చరిత్రకారుడు ఆర్. నాథ్ అన్నారు. బీజేపీ కూడా ఆజంఖాన్ వ్యాఖ్యలను ఖండించింది. ఏడాదికి 80 లక్షల మందిపైగా పర్యాటకులు తాజ్మహల్ ను సందర్శిస్తుంటారు. -
చాక్లెట్ హట్
స్వచ్ఛమైన కోకో బట్టర్తో తయారైన శాకాహార చాక్లెట్లు నగరవాసుల నోరూరిస్తున్నాయి. తాజ్మహల్, ఏంజిల్, శాంతాక్లాజ్, ఫ్లవర్ బాస్కెట్, హట్స్ తదితర థీమ్లతో తయారు చేసిన చాక్లెట్లు జూబ్లీహిల్స్లో బుధవారం ప్రారంభమైన చాక్లెట్ హట్లో నోరూరిస్తున్నాయి. మోకా క్రీమ్, రిచ్ మరిపాన్, ప్రాలినె, మింట్క్రీమ్, రకరకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బాదం వంటి వాటితో తయారు చేసిన ప్రీమియమ్ సాఫ్ట్ చాక్లెట్లు యమ టేస్టీగా ఉన్నాయి. సాక్షి, సిటీప్లస్ -
ఒకడు జాషువా
విశేష సంపుటి రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించింది కాదు. జాషువా సాహిత్యం ఒక్క పూటలో పుట్టింది కాదు. రోమ్ నగరమూ, జాషువా కవిత్వమూ రెండూ ఒక్కటే. శ్రీకృష్ణుడు చిటికెన వేలి మీద గోవర్థన పర్వతం ఎత్తి పట్టినట్లు ఒక్క జాషువా ఒంటి చేత్తో తెలుగు పద్యాన్ని ఎత్తి పట్టాడు. తాజ్మహల్ కట్టడం వెనుక ఎంత కథ ఉందో, ఎంత వెత ఉందో, ఎంత శ్రమ ఉందో, ఎంత సౌందర్యం ఉందో అంతే కృషి జాషువా పద్యనిర్మాణం వెనుక దాగి ఉంది. అనంత పద్మనాభుడి ఆలయంలో అపారమైన నిధులున్నట్లే ‘కవి కోకిల’ జాషువా కవిత్వంలో కూడా అమూల్యమైన కవితా నిధులున్నాయి. వాటిని ఒక చోట చేర్చి గ్రంథరూపం తీసుకువచ్చిన వైనం ‘జాషువా సర్వలభ్య రచనల సంకలనం’. దాదాపు వందేళ్ల నాటి జాషువా తొలికృతి- ‘హిమథామార్కధర పరిణయము’ (1917) నుంచి జీవిత చరమాంకంలోని ‘వీలునామా’ వరకు జాషువా సమగ్ర సాహిత్య సమ్మేళనమే ఈ సర్వలభ్య రచనల సంకలనం. 1654 పేజీల ఈ గ్రంథంలో ఆరువేలకు పైగా పద్యాలున్నాయి. ఇది కేవలం పుస్తకం కాదు. జాషువా ప్రత్యక్షర, ప్రత్యక్ష కవితా సాక్షాత్కార రూపం. ఈ గ్రంథం ప్రచురించడం వెనుక అనితరసాధ్యమైన అమోఘమైన కృషి ఉంది. సాహిత్యమంటే ప్రాణం పెట్టే ‘మనసు ఫౌండేషన్’ రాయుడుగారికే ఇది సాధ్యం అయ్యింది. ఎందుకంటే అవి కాలే చేతులు కావు కనుక. ‘పిరదౌసి’ కావ్యంలో జాషువా చెప్పినట్టు ‘సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము’. ఆ టక్కరి సిరి మెడలు వంచి ఒడలు పులకరించి పోయేలా ఉత్తమ రచయితల గ్రంథాలు సరసమైన ధరలకు ప్రచురించడం ‘మనసు ఫౌండేషన్’ వారి ప్రచురణ సంస్కారం. ఆ పరంపర నుంచి వచ్చిందే జాషువా సమగ్ర సాహిత్య సంకలనం. వెయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్య చరిత్రలో ఒక్కడే జాషువా. ఇతర కవుల పితరులకు తాగడానికి నేతులున్నాయ్. కమ్మని నూతులున్నాయ్. అక్షరాలు నేర్వడానికి అగ్రహారాలున్నాయ్. తాత ముత్తాతల, జేజి నాయనల జేజేలున్నాయ్. వారసత్వపు భేషజాలున్నాయ్. ఇవ్వేవి లేనివాడు, ఒంటరివాడు, అంటరానివాడు జాషువా ఒక్కడే. ఈ సమాజం వెలి వేసినా, తన భావాలను బలి చేసినా తానే ఒక ఆకాశమై- తానే ఒక సూర్యుడై- తానే ఒక కవి చంద్రుడై- తానే ఒక కవి కోకిలై తానొక్కడే ‘నవయుగ కవి చక్రవర్తి’యై- తెలుగు పద్యానికి అజరామరకీర్తియై- స్ఫూర్తియై నిలిచిన ఏకైక కవి ‘కళాప్రపూర్ణ’ గుఱ్ఱం జాషువా. తెలుగులో వేలాది మంది కవులున్నారు. వాళ్లు రాసిన కొన్ని రచనల్లో కొన్ని ఆశ్వాసాలు బాగుంటాయి. మరికొన్ని ఘట్టాలు కంఠతా పెట్టిస్తాయి. మరికొందరి పద్యాలు కంటతడి పెట్టిస్తాయి. కొన్ని కమ్మగా చదివిస్తాయి. కాని జాషువా ప్రతి పద్యం అమృతమయం. ఆద్యంతం రసమయం. పఠితను వెంటాడుతూ ఉంటుంది. ఏ పద్యాన్నీ పక్కన పెట్టలేము. అది నేరుగా హృదయంలోకి చొచ్చుకుని పోతుంది. వేయిరేకుల కలువగా విచ్చుకుపోతుంది. ఇది జాషువాకు మాత్రమే అబ్బిన పద్య విద్య. ఈ శిల్పం జాషువా సొంతం. జాషువా వస్తురూప పరిణామాలు తెలుసుకోవాలన్నా, ఆయన సాహిత్యంలోని దృక్పథాలను గుర్తించాలన్నా, అమేయమైన ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించాలన్నా రసజ్ఞులైన పాఠకులు ఈ గ్రంథాన్ని చవి చూడవలసిందే. జాషువా తెలుగునాట ఆరాధ్యనీయుడు. అభిమానులకు ప్రాతఃస్మరణీయుడు. ‘మనసు ఫౌండేషన్’ జాషువాకిచ్చిన గొప్ప నివాళి, నిత్య నీరాజనం ఈ సంకలనం. తరతరాలు దాచుకోవలసిన ప్రతినిత్యం చదువుకోవలసిన అపురూపగ్రంథం. వెల: రూ. 400; ప్రతులకు: ఎమెస్కో లేదా అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు; మనసు ఫౌండేషన్: 00089077699 - ఎండ్లూరి సుధాకర్ -
చేతులు కలిపిన యాసిడ్ దాడి బాధితులు
న్యూఢిల్లీ: తొలుత ఫొటో షూట్... తర్వాత డాక్యుమెంటరీ నిర్మాణం... ఇదంతా ఏమిటనుకుంటున్నారా? ఓ స్వచ్ఛంద సంస్థ అండదండగా నిలిచిన కారణంగా యాసిడ్ దాడి బాధితుల జీవితంలో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి. వారు తమ సొంతకాళ్లపై మనుగడ సాగించడం మొదలైంది. తాజాగా వీరంతా కలిసి తాజ్మహల్ వద్ద కేఫ్ షీరోస్ హ్యాంగౌట్ను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి చాన్వి అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. యాసిడ్ దాడి జరగకముందు వీరంతా తమ జీవితంపై ఎన్నో కలలుగన్నారు. అయితే దాడి త ర్వాత వారి జీవితంలో చీకట్లు అల్లుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చాన్వి వీరందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. ఈ విషయమై చాన్వి సంస్థ సభ్యుడు ఆశిష్ శుక్లా బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘వారు స్వతంత్రంగా జీవించేలా చేయాలనేదే మా లక్ష్యం. ఇందులోభాగంగా వారికి ఓ అవకాశం కల్పించాం’అని అన్నారు. ఈ సంస్థ ఆగ్రాలోని తాజ్మహల్ సమీపంలోని ఫతేబాద్రోడ్డులో ఉంది. ఈ కేఫ్ ఏర్పాటుకు దాదాపు నెలరోజుల సమయం పట్టింది. ఇందుకు రూ. మూడు లక్షల వ్యయమైంది. నీతూ అనే యాసిడ్ దాడి బాధితురాలి స్మారకార్థం ఏర్పాటుచేసిన వెబ్సైట్ ద్వారా ఈ మొత్తాన్ని వీరంతా సేకరించారు. నీతూపై యాసిడ్ దాడి జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆమె తండ్రి మరణించాడు. ఈ కారణంగా తల్లిపై కుటుంబభారం పడింది. దీంతో నీతూ తల్లి పెట్టెలను విక్రయించడంద్వారా వచ్చే ఆదాయంతో కాలం గడుపుతోంది. కేఫ్ ప్రారంభించిన నేపథ్యంలో నీతూ వంటి యాసిడ్ దాడి బాధితులకు తమ సొంత కాళ్లపై జీవితం సాగించేందుకు ఓ అవకాశం లభించినట్టయింది. ‘విరాళాల వ్యవస్థకు తెరదించాలనుకుంటున్నాం. స్వతంత్రంగా జీవించేందుకుగాను బొటిక్లు, కేఫ్లను ప్రారంభించాలని నిర్ణయించాం. ఇది బాధిత కుటుంబాలకు ఓ పునరావాసం వంటిది’ అని ఆశిష్ శుక్లా చెప్పారు. కాగా ఈ కేఫ్లోని గోడలపై వివిధ రకాల పెయింటింగ్లను ఉంచారు. ఇందులో మహిళా సాధికారతకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఇంకా రూప అనే 21 ఏళ్ల యాసిడ్ దాడి బాధితురాలు ఈ కేఫ్లో తాను రూపొందించి దుస్తులను అందుబాటులో ఉంచింది. ఇదిలాఉంచితే యాసిడ్ దాడి బాధితురాళ్లయిన చంచల్, రీతు, సోనమ్లు రూప రూపొందించిన దుస్తులు ధరించి ఈ ఏడాది ఆరంభంలో ఓ ఫొటోషూట్లో పాల్గొన్నారు. వీరి జీవితాలపై రాహుల్ శర్మ అనే వీడియోగ్రాఫర్ ప్రస్తుతం డాక్యుమెంటరీని నిర్మిస్తున్నాడు. ఈ కేఫ్లో ఏర్పాటుచేసిన టీవీలో మహిళా సాధికారతకు సంబంధించి డాక్యుమెంటరీలు, సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతోపాటు హస్తకళాకృతులను కూడా ఈ కేఫ్లో ఉంచారు. కాగా ఈ కేఫ్ పురోగతిపై చాన్వి సంస్థ నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహించనుంది. ఈ విషయమై ఆశిష్ మాట్లాడుతూ ‘నెలకోసారి సమీక్షిస్తాం. ఇది యాసిడ్ దాడి బాధితులకు ఎంతమేర ఉపయోగపడుతుందనే విషయాన్ని చర్చిస్తాం’అని అన్నారు. 17న ప్రారంభం యాసిడ్ దాడి బాధితుల జీవనోపాధి కోసం ఏర్పాటుచేసిన ఈ కేఫ్ ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానుంది. ఈ కేఫ్కు విస్త్రత ప్రచారం కల్పించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులోభాగంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇటువంటి కేఫ్లను త్వరలో ఢిల్లీ, కాన్పూర్, లూథియానా నగరాల్లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. -
తీవ్ర నిరాశకు గురైన సానియా మీర్జా
ఆగ్రా : ఆసియా కీడ్రల్లో పతకాలు సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర నిరాశకు గురైంది. ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ అందాలను ఆమె వీక్షించలేకపోయింది. తాజ్ మహల్ సందర్శనార్థం ఆమె మంగళవారం సాయంత్రం ఆగ్రా వచ్చినా ఫలితం లేకపోయింది. సానియా అక్కడకు చేరుకునే సరికే సందర్శన సమయం మించిపోవటంతో గేట్లు మూసివేసినట్లు టూరిస్ట్ గైడ్ వేద్ గౌతమ్ తెలిపాడు. కాగా తాజ్ మహల్ దర్శించుకోలేక పోయిన సానియా ....దూరం నుంచే ఓ ఫోటో తీసుకుని సంతృప్తి పడింది. మరోవైపు మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే కూడా నిన్న సాయంత్రం తాజ్ మహల్ను సందర్శించాడు. వీరిద్దరూ ఆగ్రాలోని జైపీ ప్యాలెస్ హోటల్లో జరగబోయే ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేశారు. -
రాణి గారి బావి
యునెస్కో హోదా! షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థం తాజ్మహల్ని కట్టించాడని, కులీకుతుబ్ షా భాగమతి జ్ఞాపకార్థం భాగ్యనగరం నిర్మించాడని మనకు తెలుసు. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం భూగర్భంలో కోటలా ఉండే మెట్ల బావిని నిర్మించిన విషయం తెలుసా! ఈ అద్భుత కట్టడం మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ పట్టణంలో ఉంది. ఈ కట్టడం ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు చేసుకుంది. భూగర్భజలాలను సమర్థంగా వినియోగించుకునే పరిజ్ఞానానికి గుజరాత్ మెట్లబావి (రాణి కి వావ్) నిలువెత్తు నిదర్శనం. సోలంకి సంస్థానానికి చెందిన రాణీ ఉదయమతి తన భర్త ఒకటవ భీమ్దేవ్ జ్ఞాపకార్థం 1063లో ఈ బావిని నిర్మించారు. ఆ తర్వాత సరస్వతి నదికి వచ్చిన వరదలకు ఈ బావి పూడికతో నిండిపోయింది. నాటి భూగర్భ మార్పుల వల్ల సరస్వతి నది కనుమరుగైంది. 1980లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ మెట్ల బావి వెలుగులోకి వచ్చింది. విస్మయపరిచే శిల్ప సంపద నలుచదరంగా ఉండే ఈ మెట్ల బావి నిర్మాణం నిపుణులను, పర్యాటకులను విస్మయపరుస్తోంది. మొత్తం ఏడు అంతస్తులు. ప్రస్తుతం ఐదు అంతస్తులను మనం చూడొచ్చు. ఈ అంతస్తులలో ఎటు చూసినా అబ్బుపరిచే శిల్పకళ నాటి కళావైభవానికి అద్దంపడుతోంది. 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతుతో చూడ్డానికి ఈ బావి ఓ భూగర్భ కోటలా, దేవాలయం లా ఆకట్టుకుంటుంది. దశావతారాలు ఈ నిర్మాణంలో 1,500ల ప్రధాన దేవతా శిల్పాలు ఉన్నట్టు కనిపెట్టారు నిపుణులు. వీటిలో విష్ణువు దశావతారాలైన వారాహి, వామన, నరసింహ, రామ, కల్కి శిల్పాలు... మహిషాసుర మర్ధినితో పాటు నాగకన్య, యోగిని, ఇతర 16 రకాల శైలులుగా ఆక ర్షణీయంగా కనిపించే అప్సరసల శిల్పాలు అబ్బురపరుస్తుంటాయి. ఈ బావి అడుగున 28 కిలోమీటర్ల పొడవున ఓ సొరంగం ఉండేదని, ఇప్పుడు అది అంతా మట్టితో నిండి ఉందని చెబుతారు. యునెస్కో హోదా! ఈ మెట్లబావి విశిష్టతను తెలియజేస్తూ ప్రభుత్వం యునెస్కో సంస్థకు కిందటేడాది దరఖాస్తు చేసింది. యునెస్కో ప్రతినిధులు ఈ మెట్ల బావి వైభవం చూసి, ప్రపంచ ప్రాచీన వారసత్వ జాబితాలో చోటు కల్పించింది. ఆ విధంగా మనదేశంలో గుర్తింపు పొందిన వారసత్వ సంపద జాబితాలో 31వ స్థానంలో నిలిచింది ఈ మెట్ల బావి. ప్రపంచ టూరిజం మ్యాప్లో మెట్ల బావికి స్థానం దక్కడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతంగా రాణి మెట్ల బావి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పటాన్ పట్టణం ఇలా చేరాలి: ‘రాణి కి వావ్’ను చూడటానికి రోడ్డు, రైలు, వాయు మార్గంలో అహ్మదాబాద్ చేరుకోవాలి. అక్కడి నుంచి మూడు-నాలుగు గంటల వ్యవధిలో మెహసానా చేరుకుని, అటు నుంచి ఒక గంటలో పటాన్ పట్టణం చేరవచ్చు. మెహసానా నుంచి ట్యాక్సీలు, జీపులు లభిస్తాయి. సమీప రైలు స్టేషన్ మెహసానాలో ఉంది. సమీప ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్. -
తాజ్మహల్ ఎదురుగా షాజహాన్ వేసవి బంగ్లా!
ఆగ్రా: మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్మహల్ ఎదురుగా మెహ్తాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదట. భారత పురావస్తు సంస్థ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగుచూశాయి. మెహ్తాబ్(అంటే ఉర్దూలో వెన్నెల) బాగ్లోని ఆ మండపంలో రాత్రిపూట సేదతీరుతూ షాజహాన్ తాజ్మహల్ను చూస్తూ గడుపుతుండేవారని పరిశోధకులు చెబుతున్నారు. భారీ వరదలు లేదా నిర్మాణంలో లోపం కారణంగానే ఈ వేసవి బంగ్లా భూగర్భంలోకి కూరుకుపోయి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మెహ్తాబ్ బాగ్లో తూర్పువైపున 1997-99 మధ్యలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో కూడా 25 ఫౌంటెయిన్లతో కూడిన ఓ ట్యాంకు, ఓ బారాదరి (అన్ని వైపుల నుంచీ గాలి వీచేలా కట్టిన మండపం) శిథిలాలు వెలుగుచూశాయి. తాజాగా తాజ్మహల్కు సూటిగా మెహ్తాబ్ బాగ్లో దక్షిణం వైపు జరుపుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఇప్పుడున్న పాలరాతి తాజ్మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్మహల్ను కూడా నిర్మించాలని, ఆ రెండింటినీ ఓ వారధితో అనుసంధానం చేయాలనీ అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారమూ ఉంది. షాజహాన్ నల్లరాతి తాజ్మహల్ను నిర్మించాలనుకున్నది మెహ్తాబ్ బాగ్లోనేని పలువురు గైడ్లు చెబుతుంటారు కూడా. కానీ బ్లాక్ తాజ్మహల్ నిర్మాణ ం గురించి షాజహాన్ ఆలోచించినట్లు ఇప్పటిదాకా ఎలాంటి చారిత్రక ఆధారాలు లభించలేదు. -
తాజ్ మహల్కు ప్రకృతి చికిత్స!
న్యూఢిల్లీ: మన ముఖ వర్చస్సు తగ్గితే ఏం చేస్తాం... కొంత మంది అయితే, ఏవేవో ఫేస్ప్యాక్లు వేసుకుంటారు. కొందరు సహజసిద్ధంగా ముల్తానా మట్టిని ముఖంపై ప్యాక్లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవడం చేస్తారు. దీనివల్ల వారి ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. అచ్చం అలాగే, ప్రముఖ కట్టడం తాజ్ మహల్కు బురదమన్నుతో త్వరలోనే చిక్సిత చేయనున్నారు. పెరిగి పోయిన కాలుష్యం కారణంగా తాజ్మహల్ పాలరాతి అందాలు పసుపురంగులోకి మారుతున్నాయి. దీంతో కాలుష్యాన్ని తొలగించేందుకు భారత పురావస్తు విభాగం రంగంలోకి దిగింది. తాజ్మహల్ సహజ అందాలను తిరిగి తీసుకొచ్చేందుకు మడ్పాక్(మట్టిపూత)తో చికిత్స చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నిమ్మగుణం అధికంగా ఉన్న మట్టిని తాజ్ మహల్పై, తెల్లదనం తగ్గిన చోట పూతలా వేసి ఆరిన తర్వాత మట్టిపూతను తీసే సి మెత్తటి నైలాన్ బ్రష్లతో డిస్టిల్డ్ వాటర్తో ఆయా ప్రాంతాల్లో కడుగుతారు. ఈ కట్టడానికి 1994, 2001, 2008లోనూ ఇలానే చికిత్స చేశారు. -
తాజ్ మహల్కు ప్రకృతి చికిత్స!
న్యూఢిల్లీ: మన ముఖ వర్చస్సు తగ్గితే ఏం చేస్తాం... కొంత మంది అయితే, ఏవేవో ఫేస్ప్యాక్లు వేసుకుంటారు. కొందరు సహజసిద్ధంగా ముల్తానా మట్టిని ముఖంపై ప్యాక్లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవడం చేస్తారు. దీనివల్ల వారి ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. అచ్చం అలాగే, ప్రముఖ కట్టడం తాజ్ మహల్కు బురదమన్నుతో త్వరలోనే చిక్సిత చేయనున్నారు. పెరిగిపోయిన కాలుష్యం కారణంగా తాజ్మహల్ పాలరాతి అందాలు పసుపురంగులోకి మారుతున్నాయి. దీంతో కాలుష్యాన్ని తొలగించేందుకు భారత పురావస్తు విభాగం రంగంలోకి దిగింది. తాజ్మహల్ సహజ అందాలను తిరిగి తీసుకొచ్చేందుకు మడ్పాక్(మట్టిపూత)తో చికిత్స చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు పురావస్తు విభాగం ఉన్నతాధికారి బీఎమ్ భట్నాగర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆయన మరిన్ని వివరాలు తెలిపారు. నిమ్మగుణం అధికంగా ఉన్న మట్టిని తాజ్ మహల్పై, తెల్లదనం తగ్గిన చోట పూతలా వేస్తారు. ఆరిన తర్వాత మట్టిపూతను తీసివేస్తారు. అనంతరం మెత్తటి నైలాన్ బ్రష్లతో డిస్టిల్డ్ వాటర్ సాయంతో ఆయా ప్రాంతాల్లో కడుగుతారు. 17వ శతాబ్దానికి చెందిన చెందిన ఈ కట్టడానికి గతంలో ఇలానే మూడు సార్లు చికిత్స చేశారు. 1994, 2001, 2008లో ఇది జరిగింది. 2008లో తాజ్ మహల్ అందాల పరిరక్షణకు 24 మంది నిపుణులు ఆరు నెలల పాటు పనిచేశారు. పర్యాటకుల సందర్శనకు ఇబ్బంది లేకుండా మట్టితో చికిత్స చేసేందుకు ఇంత సమయం తీసుకున్నారు. అప్పుడు రూ. 10.4 లక్షలు ఖర్చయినట్లు భట్నాగర్ వెల్లడించారు. -
పిల్లలే పెద్ద కొనుగోలుదారులు
సర్వే అవి టీవీలు వచ్చిన తొలిరోజులు... ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబలా వాయించడం ఆపి గాజు కప్పులో టీ సిప్ చేసి ‘వాహ్ తాజ్’ అంటారు. బ్యాక్డ్రాప్లో తాజ్మహల్ కనిపిస్తుంటుంది. ఈ ప్రకటన చూసిన పిల్లల మెదళ్లలో తాజ్మహల్ అంటే టీ అనే ముద్ర పడిపోయింది. తాజ్మహల్ అనే నిర్మాణం ఒకటుందని, ఆ పేరుతో ఒక కంపెనీ తేయాకు పొడిని తయారు చేసిందని తల్లిదండ్రులు పనిగట్టుకుని తెలియచేయాల్సి వచ్చింది. టీ తాగాలనే కోరిక లేకపోయినా ఉస్తాద్ జాకీర్ హుస్సేన్లా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికే టీ కావాలని మారాం చేసిన పిల్లలు ఎక్కువే అప్పట్లో. అంటే పిల్లల మీద ప్రకటనల ప్రభావం అంతగా ఉంటుందన్న మాట. ఇదే విషయాన్ని ఒక అధ్యయన బృందం కూడా నిర్ధారిస్తోంది. ఆర్కైవ్స్ ఆఫ్ పీడియాట్రిక్ అండ్ అడాలసెంట్ మెడిసిన్ అనే మ్యాగజైన్ ఒక అధ్యయన నివేదికను ప్రచురించింది పిల్లలు టీవీ చూసే సమయం పెరిగే కొద్దీ వాళ్లు తల్లిదండ్రులను ‘అది కొనివ్వు... ఇది కొనివ్వు’ అని అడగడం పెరుగుతుందట. స్టాన్ఫోర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, పకార్డ్ చిల్డ్రన్స్ హాస్పిటల్కు చెందిన బృందం నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మార్కెట్లోకి కొత్త మోడల్ వీడియో గేమ్స్ వస్తే ఇక అప్పటి వరకు తాను ఆడుకుంటున్న వీడియో గేమ్స్ నచ్చవు. వాటితో ఆడుకోవడం అంటే బోర్, చిరాకు, కొత్తది కొనివ్వలేదన్న అలక. పది నుంచి పధ్నాలుగు ఏళ్ల వయసు పిల్లలున్న ఇళ్లలో ఇదో ప్రహసనం. ఇక సాధారణంగా ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, బొమ్మలు అయితే ఎన్ని ఉన్నా, ఎన్ని కొన్నా ఆ తృప్తి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చే వరకే. ఒక బొమ్మ కొనిస్తే దాంతో ఆడుకునేది ఒక వారమో లేదా రెండు వారాలే, మూడో వారానికి కొత్త బొమ్మ గురించిన డిమాండ్ ఉండనే ఉంటుంది. తిండి విషయానికొస్తే వాణిజ్య ప్రకటనల్లో వచ్చే వాటిలో ఎక్కువ భాగం కేలరీలు ఎక్కువగా ఉండి పోషకవిలువలు తక్కువగా ఉండేవే ఉంటున్నాయి. అమెరికాలో సగటున పిల్లలు ఏడాదికి నలభై వేల వాణిజ్య ప్రకటనలను చూస్తున్నారని ఒక అధ్యయనం. ఒక వస్తువును అమ్మాలంటే దాని గుణగణాలను తెలియచేయడానికి సులువైన మార్గం అడ్వర్టైజ్మెంట్. అది తినే వస్తువు అయినా, రాసే పెన్నయినా సరే ఆ వస్తువు ఒకటి మార్కెట్లో ఉంది అని తెలియచెప్పే సాధనమే యాడ్. యాడ్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే ఆ వస్తువు అంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుందనేది కాదనలేని సత్యం. కొత్త ప్రొడక్ట్ ప్రజల్లోకి వెళ్లడానికి ఒకప్పుడు చాలా పెద్ద నెట్వర్క్ అవసరమయ్యేది. ఇప్పుడు టీవీలు చాలా ఈజీగా మారుమూల పల్లెలకు చేరవేస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీ తయారు చేసిన ఆలూ చిప్స్ గురించి బస్సు వెళ్లడానికి రోడ్డు లేని ఊళ్లో ఉన్న పిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు 5-15 ఏళ్ల పిల్లలు ఆయా కంపెనీలకు ప్రధానమైన మార్కెట్. -
సమంతకు ఐ లవ్ యు చెప్పారు..
తాజ్మహల్ చాలా అందంగా ఉంటుంది. ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ కట్టిన ఆ ప్రేమ మందిరాన్ని చూడాలని అందరూ ఆశపడతారు. కానీ, కొందరి కోరికే నెరవేరుతుంది. ఆ జాబితాలో అనిల్, కృష్ణవేణి చేరారు. తాజ్మహల్ని సందర్శించేంత స్తోమత లేదు వాళ్లకు. కానీ, వాళ్లిద్దరూ హైదరాబాద్ నుంచి చక్కగా ఫ్లయిట్లో వెళ్లి మరీ తాజ్మహల్ని చూసొచ్చారు. అనిల్ వయసు పన్నెండేళ్లు. కృష్ణవేణికి పధ్నాలుగేళ్లు. ఈ ఇద్దరూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఇలాంటివారికి తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత సహాయం చేస్తున్నారు. మహిళలు, పిల్లలకు వైద్య సహాయం అందించడంతో పాటు, జీవితంతో పోరాడుతున్నవారి చివరి కోరికను తీర్చడమే ఈ సంస్థ లక్ష్యం. ఈ కోరిక తీర్చే ప్రోగ్రామ్కి ‘విష్ కమ్ ట్రూ’ అనే పేరు పెట్టారు సమంత. తాజ్మహల్ చూడాలని ఉందని అనిల్, కృష్ణవేణి కోరితే కాదనుకుండా పంపించారు సమంత. తొలిసారి విమానయానం చేయడంతో పాటు కళ్లు చెదిరే అందంతో మెరిసిన తాజ్మహల్ని చూసిన ఈ చిన్నారులు చాలా ఆనందపడిపోతున్నారు. ‘థ్యాంక్యూ సమంతక్కా.. వి లవ్ యు’ అంటున్నారు ఈ చిన్నారులు. నిజంగా సమంత గ్రేట్. తన జీవితం, తన ఆనందం అని కాకుండా ఇతరులను ఆనందపరిచి ఆనందం పొందాలనుకునే అరుదైన వ్యక్తిత్వం తన సొంతం. పైకి అందంగా కనిపించే సమంత ఇన్నర్ బ్యూటీ కూడా అని నిస్సందేహంగా చెప్పొచ్చు. -
ఆగ్రాను తాకకుండా తాజ్మహల్కు..
సుసాధ్యం చేయనున్న ఇన్నర్ సిటీ రింగ్రోడ్డు యమునా ఎక్స్ప్రెస్ హైవే-ఫతేహాబాద్ టూరిజం కాంప్లెక్స్ను కలుపుతూ నిర్మాణం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అఖిలేశ్ యాదవ్ తాజ్గంజ్ సుందరీకరణ ప్రాజెక్టు పనులకు కూడా... న్యూఢిల్లీ: కాన్పూర్, ఢిల్లీ నుంచి వచ్చే పర్యాటకులు ఇకపై తాజ్మహల్ చూడడానికి వెళ్లాలంటే నిత్యం రద్దీగా ఉండే ఆగ్రా పట్టణంలో నుంచి వెళ్లనక్కరలేదు. ఎందుకంటే త్వరలో అందుబాటులోకి రానున్న ఇన్నర్ సిటీ రింగ్రోడ్డు ఆగ్రా పట్టణంతో సంబంధం లేకుండానే పర్యాటకులను తాజ్మహల్ ముంగిట్లోకి తీసుకెళ్లనుంది. యమునా ఎక్స్ప్రెస్ హైవే- ఫతేహాబాద్ టూరిజం కాంప్లెక్స్ను కలిపే ఈ రింగ్రోడ్డు తాజ్మహల్కు అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. రూ. 306 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం శంకుస్థాపన చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ రూ. 108 కోట్లతో తాజ్గంజ్ సుందరీకరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రింగ్రోడ్డు నిర్మాణ పనుల కాంట్రాక్టును జైపూర్ కంపెనీకి అప్పగించినట్లు ఆగ్రా అభివృద్ధి సంస్థ(ఏడీఏ) కార్యదర్శి రవీంద్రకుమార్ తెలిపారు. త్వరలో భూమిపూజ చేసి ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ మార్గానికి సమాంతరంగా మరో రెండు లేన్లను కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మొదటి ఫేజ్లో భాగంగా ఆరులేన్లతో 10.9 కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ రహదారిని ఆనుకొని అనేక పారిశ్రామిక సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశముందన్నారు. ఇప్పటికే ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని, యమునా ఎక్స్ప్రెస్వే-ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వే కుబేర్పూర్ దగ్గర కలుస్తాయన్నారు. మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వం యమునా ఎక్స్ప్రెస్వేను నిర్మించిన తర్వాత ఈ మారాన్ని ఫతేహబాద్కు కలపాలని స్థానికుల నుంచి డిమాండ్లు పెరగడంతోనే రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇది తాజ్మహల్కు అత్యంత సమీపం నుంచే వెళ్లనుండడంతో పర్యాటకులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎక్స్ప్రెస్వే మీదుగా వెళ్లవచ్చని చెప్పారు. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశముందన్నారు. -
తాజ్ మహల్...
తాజ్ మహల్... ఇస్లాం, పర్షియా, ఓట్టోమన్ టర్క్, భారతీయ వాస్తుశైలుల సమ్మేళనం. బర్మింగ్హామ్ నగరం యునెటైడ్ కింగ్డమ్లో రెండవ పెద్ద నగరం. అయితే ప్రపంచంలో ఆ పేరుతో ఉన్న పట్టణాలు, నగరాల సంఖ్య దాదాపు -
మది నిండుగ.. కనులపండుగ..
వెన్నెల వెలుగుల్లో ఓ సుందర కట్టడం తోడున్నవారి కనుల నిండుగా చూడటం ఓ అద్భుతమైతే... ఆ ఆనందాన్ని తాజ్మహల్ పంచుతుంది! నీలిమబ్బుల దోబూచులాటలో ఓ సాయంత్రం ఆకాశమంత ప్రేమను కొలిచే సాధనాల కోసం వెతికితే... ఆ శ్రమను ఈఫిల్ టవర్ మరిపిస్తుంది! నీటి తుంపరలో ఓ హాస్యపు జల్లును ఎదనిండా నింపుకోవడమే భాగ్యమైతే... ఆ భావం ట్రెవి ఫౌంటెన్ తీరుస్తుంది! ఈ ప్రసిద్ధ ప్రేమ కట్టడాలన్నీ ఏ దారిలో వెళ్లినా హృదయాలను చేరువచేస్తాయి. బాంధవ్యపు లోగిలికి సంబరాలను మోసుకొస్తాయి. ఒళ్ళంతా తుళ్లింత ప్రపంచ ఫౌంటెన్ కట్టడాల్లో అద్భుతమైనదిగా పేరుగాంచినది ట్రెవి ఫౌంటెన్. ఇటలీలోని ట్రెవి జిల్లాలో ఉంటుంది ఈ కట్టడం. 1629లో ఇటాలీ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వీ ఈ కట్టడాన్ని డిజైన్చేస్తే, పీయెట్రో బ్రాకీ నిర్మించారు. ఈ నిర్మాణం ఎత్తు 86 అడుగులు, వెడల్పు 49.15 మీటర్లు. ఇక్కడి ఫౌంటెన్లలో బరోక్యూ ఫౌంటెన్ నగరంలోనే అతిపెద్దది. ఇక్కడి ఫౌంటెన్ కొలనులో నాణెం వేస్తే రోమ్లో తేలుతుందని ప్రసిద్ధి. ఇక్కడి ఫౌంటెన్ల అందాలు ఎన్నో ఆంగ్ల సినిమాల్లో ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇది పర్యాటక సందర్శన కట్టడంగానూ పేరుగాంచింది. సందర్శన సమయం: చీకటిగా ఉండే ఉదయపు వేళలో ఫౌంటెన్ల అందం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. చూడటానికి పట్టే వ్యవధి: 1-2 గంటలు అత్యత్భుతమైన ఫొటోలను తీసుకునేవీలుంటుంది. ఫౌంటెన్ దగ్గర నడుస్తూ చుట్టూ వాటి అందాలను వీక్షించవచ్చు. ఎలా వెళ్లాలి?: అంతర్జాతీయ విమానాల ద్వారా ఇటలీ చేరుకోవాలి. అక్కడ నుంచి టూరిస్టు బస్సుల ద్వారా ట్రెవి చేరుకోవచ్చు. విదేశీ ప్రేమ: అమెరికన్ డెరైక్టర్ జీన్ నెగులెస్కో ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ సినిమా తీశారు. ప్రేమకు చిహ్నం తాజ్మహల్ అనేమాట వింటేనేచాలు. మన మనస్సులలో ఏదో తెలియని ఆనందం. ఒక ప్రేమ కథ. ఒక మధుర చిహ్నం... అనేటటువంటి సంకేతాలు అందుతాయి. ఎన్నో శతాబ్దాలుగా మన మనస్సులలో నాటుకుపోయిన తీపి భావన తాజ్మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఈ మహల్ను షాజహాన్ చక్రవర్తి తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన మన తాజ్ ప్రతి యేటా 7-8 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులు అక్టోబర్, నవంబర్, ప్రిబవరి చల్లని నెలలో సందర్శిస్తారు. సందర్శన సమయం: వారంలో శుక్రవారం మినహా అన్నిరోజులూ ఉదయం 6 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు సందర్శించవచ్చు. పౌర్ణమికి రెండు రోజుల ముందు, తర్వాత రెండు రోజులు కట్టడాన్ని రాత్రి వీక్షణం కోసం అనుమతిస్తారు. ఎలా చేరాలి? ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఆగ్రా చేరుకోవచ్చు. ఆగ్రాకు విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. ఆగ్రా రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ 3.6 కి.మీ, తాజ్మహల్ 5.7 కి.మీ. విదేశీ ప్రేమ: 18వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఇండియాకు వచ్చిన ఆంగ్లేయులెవ్వరూ తాజ్మహల్ సౌందర్యాన్ని ఆస్వాదించకుండా తిరిగి వెళ్లలేదు. ఆకాశమే హద్దు నిటారుగా నిల్చున్న సైనికునిలా, ఆకాశాన్ని తాకుతోందా అనిపించే అబ్బురపరిచే కట్టడం ఈఫిల్ టవర్. ప్యారిస్లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ ప్రదేశంలో నిర్మించిన ఎత్తై ఇనుప గోపురం. దీని ఎత్తు 1050 అడుగులు. 1889 లో గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ దీన్ని డిజైన్ చేసి, మరో 72 మంది ఇంజనీర్ల సాయంతో ఈఫిల్ టవర్ను నిర్మించాడు. ఫ్రాన్స్కు మాత్రమే గర్వకారణమైన కట్టడం కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం ఇది. దేశ, విదేశాల్లో ఈఫిల్ టవర్ను పోలిన నమూనాలు 20కి పైగానే ఉన్నాయి. ఎలా వెళ్లాలి? అన్ని అంతర్జాతీయ విమానాశ్రాయాల ద్వారా ప్యారిస్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి, అక్కడ నుంచి విమానంలో ప్యారిస్ చేరుకోవచ్చు. ప్రయాణ సమయం దాదాపు 12 గం.ల 45ని.లు. రెన్నో అద్భుతాలు... ప్యారిట్ టూర్ ఓపెన్ బస్లో నుంచి నగరాన్ని చుట్టేయవచ్చు. ఈఫిల్ టవర్ దగ్గర లువ్రే మ్యూజియం, అద్భుతమైన పార్కులు, గార్డెన్లు, ఆర్క్ డె ట్రయంఫీ, ఒపెరా హౌజ్లను సందర్శించవచ్చు. విదేశీప్రేమ: ఈ అపురూప కట్టడాన్ని నిర్మించినప్పటి నుంచి 20 కోట్ల మందికి పైగా ప్రజలు సందర్శించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది సందర్శించిన స్థలంగా ఈఫిల్ టవర్ ప్రఖ్యాతిగాంచింది. ప్రేమికులు ఇష్టపడే ప్రదేశాలలో అగ్రస్థానం లో ఉంది ఈఫిల్టవర్! -
వాక్ తాజ్! వాహ్ జాకీర్ హుస్సేన్!!
-
అపురూపం: చెక్కు చెదరని జ్ఞాపకాల మందిరం
తాజ్మహల్! ప్రపంచ వింతల్లో ఒకటి! ఒక భర్త తన భార్య గుర్తుగా ఇంత భారీగా కట్టించిన మహల్ భువిపై ఇంకొకటి లేదు! మొఘల్ చక్రవర్తి షాజహాన్కు భార్య ముంతాజ్ అంటే ఎంతో ప్రేమ! ఆమె 1631లో పరమపదించారు. ఆమె గుర్తుగా తాజ్మహల్ని కట్టారు షాజహాన్! ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో... యమునా నదీ తీరాన... పూర్తిగా పాలరాయితో... వెయ్యి ఏనుగుల సాయంతో... ఇరవై వేల మంది కార్మికులు ఇరవై రెండేళ్ల పాటు శ్రమించి నిర్మించిన అతిగొప్ప కట్టడమిది! కట్టి శతాబ్దాలు అవుతోంది. అయినా దాని వన్నె తగ్గలేదు. కనీసం ఒక్కసారైనా ఆ మహాకట్టడాన్ని చూడాలని ఉబలాటపడేవారే అందరూ! సినీ తారలూ దీనికి మినహాయింపు కాదు! నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు తాజ్మహల్ను సందర్శించుకున్నప్పటి ఫొటోని పైన చూడవచ్చు! అలాగే ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహానటి సావిత్రి, ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్, వారి అర్థాంగి కమలా గణేశన్ ప్రత్యేకంగా ఆగ్రా వెళ్లి తాజ్మహల్ని దర్శించుకున్నప్పటి స్టిల్ కూడా. అలాగే నేటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన శ్రీమతి లక్ష్మితో కలిసి తాజ్మహల్ ముందు తీపిగుర్తుగా తీయించుకున్న స్టిల్. అమెరికా అధ్యక్షుడైనా అతి సామాన్యుడైనా తాజ్మహల్ అందాలకు ముగ్ధుడవ్వాల్సిందే. ఆ నిర్మాణానికి ఆశ్చర్యపోవాల్సిందే. దాని ముందు ఫొటో దిగాల్సిందే! ఎందుకంటే... తాజ్మహల్ వంటి దృశ్యకావ్యం మరొకటి లేదు గనుక! వేరొకటి సాటి రాదు గనుక!! ఇంకొకటి కట్టలేరు గనుక!!! - సంజయ్ కిషోర్ -
మిస్ యూనివర్స్పై కేసు
తాజ్ వద్ద ఉన్న డయానా సీట్పై చెప్పులు పెట్టినట్లు ఫిర్యాదు ఆగ్రా: మిస్ యూనివర్స్ ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో.. తాజ్ మహల్ వద్ద ఓ ఘనకార్యం వెలగబెట్టి చిక్కుల్లో పడ్డారు. ఆదివారం ఆమె బ్యాగులోని చెప్పులను ‘డయానా సీట్’గా పేర్కొనే పాలరాతి బెంచీపై ఉంచి చెప్పుల కంపెనీ వ్యాపార ప్రకటన కోసం పోజిచ్చినట్లు భారత పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) ఫొటో ఆధారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కల్పో, ఫొటోషూట్ నిర్వహించిన ఆమె బృందంలోని వారిపై కేసు పెట్టారు. దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1992 నాటి తాజ్ పర్యటన కు గుర్తుగా తాజ్లోని ఓ పాలరాతి బెంచీకి ‘డయానా సీట్’ అని పేరు పెట్టామని, కల్పో ఫొటో షూట్ తతంగం ఆ బెంచీని అగౌరవించడమేనని పోలీసులకు ఫిర్యాదు చేసిన తాజ్ సంరక్షణ అధికారి మునాజర్ అలీ చెప్పారు. అమెరికాకు చెందిన కల్పో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి.