
గాంధీ నగర్: భారత విమానయాన రంగంలో అత్యంత ఘోర విషాదం నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India plane crash) విమాన ప్రమాద మృతులు వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆదివారం ఒంటిగంట సమయంలో గుజరాత్ బీజేపీ సీనియర్ నేత మాజీ సీఎం విజయ్ రుపానీ (Vijay Rupani) భౌతికకాయాన్ని వైద్యులు గుర్తించారు.
కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా రూపానీ భౌతికకాయాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాజ్ కోట్లో రూపానీ అంత్యక్రియలు జరగనున్నాయి.
జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన AI171 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. అందులో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. మృతుల్లో 68 ఏళ్ల రూపానీ ఉన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోని కూలిపోయింది. విమానాశ్రయ రన్వే నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న మేఘానీ నగరం ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్ భవనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణికులు సహా, మెడికల్ కాలేజీలో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు,డాక్టర్లు,క్యాంటిన్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
Confirmed: Former Gujarat CM Vijay Rupani lost his life in the tragic Air India crash in Ahmedabad on June 12.
At around 11:10 AM today, his DNA matched with the recovered remains.
A huge loss for Gujarat and the nation.#VijayRupani #AirIndiaCrash #Ahmedabad pic.twitter.com/KlKsoZAgIp— AISHVARYA JAIN (@aishvaryjain) June 15, 2025