Amaravati
-
కాసింత నీడ.. కాస్తంత నీరు..!
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేలో 47 వరకూ వెళ్లే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనేందుకు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కనపడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వేడిగాలులు పెరిగాయి. డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాష్టన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయి. ప్రభుత్వ తక్షణ దృష్టి అవశ్యం తీవ్ర ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచే దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలి. భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో జిల్లాల వారీగా హీట్ అలర్ట్స్ మరింత కచ్చితత్వంతో జారీ చేయాలి. అన్ని వర్గాలకు ఈ హెచ్చరికలు చేరేలా చూడాలి. బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూల్ రూఫ్ బస్టాండ్లు, షెడ్లను శాశ్వతంగా నిర్మించడం మంచిది. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ యూనిట్లు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ బెడ్లు సిద్ధం చేయాలి. ఇక బడుల సమయాల్లో మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉండకుండా చూడాలి. బయట తరగతులు నిర్వహించకూడదు. హీట్ అలర్ట్ వచి్చనపుడు సెలవులు ప్రకటించాలి. ప్రజా రవాణా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు» బయటకి వెళ్లే సమయాన్ని తగ్గించుకోవాలి. » మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. » తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సివస్తే తలపై టోపీ, తెల్లని దుస్తులు ధరించాలి. » రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు నీటిని తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. » ఆహార నియమాలు పాటించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, మసాలా పదార్థాలు, డ్రై ఫుడ్స్ తగ్గించి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. » వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిని వేడి సమయాల్లో ఇంట్లోనే ఉంచాలి. తగినంత నీటిని తాగేలా చూడాలి. » వ్యాయామాలు ఉదయం, సాయంత్రం మాత్రమే చేయాలి » కూలీలు, రైతులు ఉదయం 6–10 లేదా సాయంత్రం 5–7 సమయంలో పని చేయాలి. » రోడ్లపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, కూలీలకు జాకెట్లు, నీటి పంపిణీ జరగాలి. వడదెబ్బ తగలకుండా ఢిల్లీ తరహాలో కూల్ రూమ్ కాన్సెప్్టను ప్రవేశపెడితే మంచిది. » అడవుల్లో జంతువుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి. హీట్ వేవ్ హాట్ స్పాట్లుకర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుఅన్ని చర్యలు తీసుకుంటున్నాంరోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఈ సంవత్సరం వేసవి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, తగిన చర్యలను సూచిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు. -
ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!
సాక్షి, అమరావతి: బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. ఆరి్థక ఆస్తుల నిర్వహణలో పారదర్శత తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఖాతా దారులకు రెండు ఆప్షన్లునలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.గతంలో ఒక్క నామినీకే అవకాశం గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతోపాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్కి అవి జమ అయిపోతున్నాయి. -
మే 19 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 19 నుంచి 24 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల ప్రకారం పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు సప్లిమెంటరీలో భాగంగా అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీ(నేటి) నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కోరింది. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26 నుంచి 30వరకు నిర్వహించనుంది.పరీక్ష ఫీజు ఇలా..పదో తరగతిలో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షకు రూ.150, ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 చొప్పున నిర్ణీత వ్యవధిలో పరీక్ష ఫీజుగా చెల్లించాలని సూచించింది. ఓపెన్ ఇంటర్మీడియెట్లో ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు పాసైన సబ్జెక్టులో మాత్రమే బెటర్మెంట్ కోసం థియరీకి రూ.250, ప్రాక్టికల్కు రూ.100, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఇంప్రూవ్మెంట్ కోరుకునే అభ్యర్థులు పదో తరగతిలో రూ.200, ఇంటర్మీడియెట్ థియరీకి రూ.300, ప్రాక్టికల్స్కు రూ.100 చెల్లించాలని కోరింది. ఈనెల 30 నుంచి మే 2 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.25, మే4 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో, మే 5న తత్కాల్ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు విధించింది. తత్కాల్ రుసుము పదో తరగతికి అయితే రూ.500, ఇంటర్మీడియెట్కు రూ.1000గా పేర్కొంది. www.apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను చెల్లించాలని సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.మే 18 వరకు ఫీజు చెల్లింపునకు గడువుపదో తరగతి రెగ్యులర్ ఫలితాల్లో విఫలమైన విద్యార్థులకు మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటికే పాఠశాలల హెచ్ఎంలు ఆన్లైన్లో ఈనెల 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. మే 1నుంచి 18 వరకు రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. స్కూల్ లాగిన్ల నుంచి మాత్రమే చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. -
అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది. -
ఏపీ గవర్నర్ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కలిశారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే సంగతిని పంకజశ్రీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. తన భర్త వంశీపై అక్రమ కేసులను బనాయించి వేధిస్తున్నారని గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. పంకజశ్రీ వెంట వైఎస్సార్ సీపీ నేతలు పేర్ని నాని, తలశిల రఘురామ్ లు ఉన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ హైకోర్టులో విడదల రజినికి ఊరట
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణలో భాగంగా.. 41 ఏ నోటీస్ ఫాలో కావాలని స్పష్టం చేసింది.అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంవ్యాఖ్యలు చేయొద్దని రజినికి కోర్టు స్పష్టం చేసింది. శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారంటూ విడదల రజినిపై కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా ఏసీబీ చేత నమోదు చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా రజిని ఉన్నారు. అయితే తమపై కక్ష పూరితంగా కేసులుట్టారని, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి విడుదల రజిని తో పాటు ఆమె పీఏ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ3గా ఉన్న ఆమె మరిది గోపీనాథ్ను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. -
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
తాడేపల్లి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. ఈరోజు’(శుక్రవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు పేర్ని నాని. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని, గతంలో తమ ప్రభుత్వ హయాంలో అప్పులపై విషం ప్రచారం చేశారని, ఎల్లో మీడియా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నానాయాగి చేశారన్నారు. పెద్దపెద్ద మేధావులకే చంద్రబాబు ఆర్థిక పాఠాలు నేర్పురారన్నట్లుగా జాకీలతో లేపారని, ఇప్పుడు చంద్రబాబు రూ. లక్షా 3 వేల కోట్లు అప్పు నేరుగా తెచ్చారన్నారు.‘రూ.44 వేల కోట్లను కార్పొరేషన్ ల ద్వారా తెచ్చారు. ఒక లక్షా 47 వేల కోట్లకు పైనే అప్పు చేశారు. జగన్ చేసిన అప్పులతో పోర్టులు, సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్ల అభివృద్ధి ఇలా అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి. జగన్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. కానీ చంద్రబాబు చేస్తున్న అప్పులు ఏం చేస్తున్నారో చెప్పటం లేదు. ఎన్నికలకు ముందు ఉత్తరకుమారుడిలా చంద్రబాబు మాటలు చెప్పారు. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలో అర్థం కావటం లేదంటున్నారు. చంద్రబాబు మాటలకు పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతున్నారు. తాజాగా లక్షా 91 వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టేశారు.రూ.9 వేల కోట్ల అప్పుల కోసం తాకట్టు పెట్టారు. దీనిమీద ఎల్లోమీడియా ఎందుకు మాట్లాడటం లేదు?, ఆరు మాసాలకు చెందిన కిస్తీలను ముందుగానే బ్యాంకులో వేయాలనే నిబంధన పెట్టటం దుర్మార్గం.అప్పు ఇచ్చిన వారు రిజర్వ్ బ్యాంకులో ఉండే ప్రభుత్వ నిధులను నేరుగా తీసుకోవచ్చని కూడా నిబంధన పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? , ఇలాంటి వ్యవహారాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. అసలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా నిధులు డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు? , ఇంతకంటే బరితెగింపు ఉంటుందా?, జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తామనీ, అప్పు చేయకుండా సంపద సృష్టిస్తామని అప్పట్లో తెగ బిల్డప్పులు ఇచ్చారు.ఇప్పుడు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రాష్ట్రం అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు అమరావతి ఒక్కటేనా?, ఎన్నికలకు ముందు అద్దె ఆఫీసుల్లో ఉన్నవారు ఇప్పుడు ప్యాలెస్లు కడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కారుపైకి ఎక్కి ప్రయాణించారు. ఇప్పుడు జనానికి కనపడకుండా ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లలో తిరుగుతున్నారు. సొంత కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాలన్నా ప్రత్యేక విమానాలే. రాష్ట్ర ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తారా? , ఈ విమానాలు, హెలికాఫ్టర్లకు ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలి. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రత్యేక విమానాలకు ఖర్చు పెడతారా?’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. -
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్కి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్యూ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కు డైరెక్టర్గా పనిచేశారు.మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.Deeply saddened to learn of the passing of Dr. K. Kasturirangan, former Chairman of #ISRO — an eminent scientist, visionary educator, and passionate environmentalist. He leaves an indelible mark on the annals of India’s space history. My tributes to this legend. May his soul rest… pic.twitter.com/cDEHln1tet— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2025 -
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్
సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్ సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్ ఇచ్చారు. ఎందుకంటే.. డిబెంచర్ కొనుగోలుదార్లకు డీఎస్ఆర్ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమయ్యేందుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్(డీఎస్ఆర్ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్ కార్పొరేషన్పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్ జనరల్ హెడ్కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్లో మిసిలేనియస్ జనరల్ హెడ్–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్మెంట్కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్ఫెడ్, సివిల్ సప్లయిస్ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది. -
మూడు పూట్లా తిండి పెట్టలేకపోతున్నాం
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): ‘మా కుటుంబాలకు మూడు పూట్లా తిండిపెట్టలేకపోతున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఆరోగ్య కేంద్రాల అద్దెలు సైతం మేమే చెల్లిస్తున్నాం. జీతాలు పెంచమని అడిగితే రూ.40 వేలు జీతం ఇస్తున్నామంటూ ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోంది. పని ఆధారంగా చెల్లించే ప్రోత్సాహకాల్లోనూ కోత పెడుతున్నారు. ఇచ్చే అరకొర ప్రోత్సాహకం కూడా ఆలస్యమవుతోంది’ అంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్వో) వాపోయారు. గురువారం విజయవాడలోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్/కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎంసీఏ) ఆధ్వర్యంలో సీహెచ్వోల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి సీహెచ్వోలు తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు, గర్భిణులు ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం సీహెచ్వోలను క్రమబద్దికరించాలని, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని, క్లినిక్ అద్దె బకాయిలు చెల్లించాలని, ఈపీఎఫ్వో పునరుద్ధరించాలని, జాబ్ చార్ట్ అందించాలని, హెచ్ఆర్ పాలసీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిళ్ల కారణంగా పలువురు సీహెచ్వోలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శాఖను పటిష్టం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. జీతాలు పెంచమని అడిగితే ఇప్పటికే రూ.40వేలు ఇస్తున్నామని ప్రభుత్వం దు్రష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదే ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న 119 కేటగిరీల వారికి 23 శాతం వేతన సవరణ చేశారన్నారు. ప్రోత్సాహకాల నెపంతో తమకు వేతన సవరణ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తీవ్రమైన ఆరి్థక ఇబ్బందులతో కడుపు రగిలి రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. అసోసియేషన్ కార్యదర్శి సందీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4వేల సెంటర్లు అద్దెప్రాతిపదికన నడుస్తున్నాయన్నారు. హెల్త్ సెంటర్ల అద్దెలు, కరెంట్ బిల్లులు తామే చెల్లిస్తున్నామన్నారు. సొంత డబ్బుపెట్టుకొని సేవ చేస్తుంటే ప్రభుత్వం రూ.40 వేలు ఇస్తున్నట్టు దు్రష్పచారం చేస్తోందన్నారు. కేవలం రూ. 25వేలు ఇస్తున్నారని, ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీహెచ్వోలు ప్రమాదవశాత్తు చనిపోతే మట్టి ఖర్చులు, ఎక్స్గ్రే షియా కూడా ఇవ్వడం లేదన్నారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో సీహెచ్వోలు పాల్గొన్నారు. -
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు ఎందుకు లేవు? గతంలో జగన్ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్ నేరుగా బటన్ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్ కొట్టేలా పెంచిన కరెంట్ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్ అని గేమ్స్ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్ని సైతం పీరియడ్గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు కోవిడ్ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న మెయిన్ పరీక్ష
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన 38,910 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఒకే పేపర్ ఉంటుంది. జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంటవరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇతర వివరాలకు తమ వెబ్సైట్ http://slprb.ap.gov. in సందర్శించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
మెగా అగచాట్ల డీఎస్సీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ను ఓపెన్ చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కొన్ని నిబంధనలు అడ్డంకి కాగా, ఆన్లైన్లోనూ సాంకేతిక కారణాలతో దరఖాస్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. కఠిన నియమాలతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల కు పదవ తరగతి, ఇంటర్మీడియట్లో కూడా కనీస మార్కులు 45–50 శాతం లేకుంటే ఇన్ వ్యాలిడ్గా చూపిస్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యార్హత అయిన డిగ్రీలో సగటు మార్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దరఖాస్తు సబ్మిట్ అవ్వడం లేదు. ఓపెన్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఉదాహరణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడియట్లో అరబిక్ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్లో రెండవ భాష సెలెక్ట్ చెస్తే డ్రాప్–డౌన్ మెనూలో అరబిక్ ఆప్షన్ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్ ఇవ్వలేదు.డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్ ఆప్షన్ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలిమెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యోగులు డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్ చేశారు. దీంతో హాల్ టికెట్ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో టెట్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. » ఎస్జీటీకి ఇంటర్మీడియట్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్ అభ్యర్థులకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. » పీజీ ఇంగ్లిష్లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మార్కులున్న ఓ జనరల్ అభ్యర్థి దరఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూస్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.» టెట్లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కులతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
చంద్రబాబు సర్కార్ మరో భూ పందేరం
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం మరో భూ పందేరానికి తెరలేపింది. చింతాస్ గ్రీన్ ఎనర్జీ సంస్థకు భూములు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందటే పుట్టిన చింతాస్కు భారీగా భూ కేటాయింపులు చేసింది. 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎకరం 31 వేలకే లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో చింతాస్ ఏర్పాటు చేయగా, చింతాస్కు ఆగమేఘాల మీద భూముల కేటాయింపులు జరిగిపోయాయి. చింతాస్ డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉన్నట్లు సమాచారం. 2 నెలలకే భారీగా భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో భూములను కేటాయించింది. హరే సముద్రం, బుల్లసముద్రం, ఉప్పెర్లపల్లి, ఎర్రబొమ్మన హల్లి, కల్లుమరి, మానూరె పరిసర గ్రామాల్లో భూముల కేటాయింపు జరిగింది.కాగా, ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని చంద్రబాబు సర్కారు అప్పనంగా కట్టబెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. -
అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం!
సాక్షి, విజయవాడ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు.. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్నారు. అప్పులు చేయడంతో సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో అప్పుల కోసం చంద్రబాబు సర్కార్ కొత్త మార్గం ఎంచుకుంది. ఏపీ ఎండీసీ ద్వారా 9 వేల కోట్లు బాండ్లు జారీ చేయాలని నిర్ణయించింది. రాజ్యాంగ విరుద్ధమని విమర్శలొస్తున్నా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. 436 మైనర్ మినరల్ ప్రాజెక్టులపై ఏపీఎండీసీకి హక్కులు ఇచ్చేసింది. క్వారీ లీజు హోల్డ్ హక్కులు ఏపీ ఎండీసీకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మైనింగ్ హక్కులు కూడా ఏపీఎండీసీకి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని చూపించి ఏపీఎండీసీ బాండ్లు జారీ చేయనుంది. రాష్ట్ర ఖజానాను తాకట్టుపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ఖజానా నుండి వెసులుబాటు కల్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారాయన.సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్ తేల్చేసిన సంగతి తెలిసిందే. ఒక వైపు రెవెన్యూ రాబడి తగ్గిపోతుండగా.. మరోవైపు అప్పులు భారీగా పెరిగిపోతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు సంబంధించిన గణాంకాలను కాగ్ వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వం.. పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేసిందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) గురువారం సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
నేటి నుంచి వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, పాఠశాలలకు గురువారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ముగియడంతో వేసవి సెలవులు ప్రకటించారు. జూనియర్ కాలేజీలు జూన్ 2న, పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం అవుతాయి. అయితే, అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయులు జూన్ 6న విధుల్లో చేరాలని విద్యా శాఖ ఆదేశించింది. -
‘పది’పోయిన ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా సంవత్సరం మధ్యలో ప్రారంభించిన ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబరు వరకు సాగదీత.. అప్పర్ ప్రైమరీ (యూపీ) పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల తొలగింపు.. ఇలా పాఠశాల విద్యలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫలితాలు దిగజారాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది. పదో తరగతి ఫలితాలను బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకే‹శ్ ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు.⇒ ఈ ఏడాది పరీక్షలకు 6,19,286 మంది రిజిస్టర్ చేసుకోగా, 6,14,459 మంది హాజరయ్యారు. వీరిలో 4,98,585 మంది (81.14 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పాసైన వారిలో బాలికలు 2,53,278 మంది (84.09 శాతం), బాలురు 2,45,307 మంది (78.31 శాతం) ఉన్నారు. ⇒ ఈ ఏడాది పరీక్షలు ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు.⇒ ఇంగ్లిష్ మీడియంలో రాసిన 5,60,864 మందిలో 4,66,586 మంది (83.19 శాతం), తెలుగు మీడియంలో 49,519 మందికి గాను 29,012 మంది (58.59 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ⇒ మొత్తం విద్యార్థుల్లో 65.36 శాతం ప్రథమ, 10.69 శాతం ద్వితీయ, 5.09 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణి సాధించారు. టాప్లో మన్యం.. చివరిలో అల్లూరి జిల్లాలుపదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతంతో టాప్లో నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఈ ఘనతను అందుకుంది. ⇒ 47.64 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ మొత్తం 11,819 ఉన్నత పాఠశాలల (4,879 ప్రైవేటు, మిగిలినవి ప్రభుత్వ యాజమాన్యంలోనివి) నుంచి విద్యార్థులు పరీక్షలు రాశారు. 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలను సాధించాయి. 19 ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. నేటి నుంచి రీ కౌంటింగ్కు అవకాశంపరీక్షలు తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు విద్యాశాఖ అవకాశం కల్పించింది. పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో వారివారి స్కూల్ లాగిన్లో గురువారం నుంచి మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీపదో తరగతి పరీక్షల్లో విఫలమైన విద్యార్థుల కోసం పాఠశాల విద్యా శాఖ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ప్రకటించింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. త్వరలోనే టైమ్ టేబుల్ విడుదల చేయనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు గురువారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, ఆలస్య రుసుముతో జూన్ 18 వరకు గడువు ఇచ్చింది.కనిపించని మెరుపులు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన విద్యా సంస్కరణలతో మెరుగైన ఫలితాలను సాధించింది. రెండేళ్ల పాటు కోవిడ్–19తో సరిగా తరగతులు జరగక, పరీక్షలు నిర్వహించకపోయినా, 2022–23 విద్యా సంవత్సరంలో 933 స్కూళ్లు పదో తరగతి ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.⇒ 2023–24 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన వాటి సంఖ్య 2,803కు పెరగడంతో పాటు జీరో ఫలితాలు సాధించినవి 17కి తగ్గాయి.⇒ తాజాగా 2024–25 విద్యా సంవత్సరంలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 1,680కి తగ్గిపోగా, జీరో ఫలితాల స్కూళ్ల సంఖ్య 19కి పెరిగింది.సివిల్స్ సాధిస్తా పది ఫలితాల్లో 600 మార్కులు సాధించిన నేహాంజనిబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపింది. ప్రాథమిక విద్య నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తోంది. ప్రణాళికాబద్ధంగా చదివి కాకినాడ చరిత్రలో పదిలో నూటికి నూరుశాతం మార్కులతో ఘనత చాటింది. సివిల్స్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నేహాంజని తెలిపింది. తండ్రి శ్రీనివాసరావు ప్రైవేట్ ఉద్యోగి కాగా తల్లి గంగాభవానీ గృహిణిగా ఉన్నారు. తమ విద్యార్థిని వై.నేహాంజని స్టేట్ టాపర్గా నిలిచిందని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు.ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు విడుదలఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా మంత్రి లోకేశ్ బుధవారం విడుదల చేశారు. 26,679 మంది పదో తరగతి పరీక్షలు రాయగా, 10,119 మంది (37.93 శాతం) ఉత్తీర్ణులవగా, ఇంటర్మీడియట్లో 63,668 మందికి గాను 33,819 మంది (53.12 శాతం) విజయం సాధించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 26 నుంచి మే 5 వరకు ఏపీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. ప్రతి సబ్జెక్టు రీకౌంటింగ్కు రూ.200, రీ వెరిఫికేషన్ కు రూ.రూ.1000 ఫీజుగా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పది, ఇంటర్ మే–2025 పరీక్షలు రెగ్యులర్ పదో తరగతి పరీక్షలతో కలిపి నిర్వహించనున్నట్టు తెలిపారు. -
భారత్కు పోటెత్తిన పర్యాటకులు
సాక్షి, అమరావతి: భారతదేశానికి విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు. 2023–24లో 95,20,928 మంది విదేశీ పర్యాటకులు భారత్ వచ్చినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో కేవలం 10 దేశాల నుంచే 67.25 లక్షల మంది మన దేశంలో పర్యటించినట్టు పేర్కొంది. వీరిలో అత్యధికంగా బంగ్లాదేశ్ నుంచి, ఆ తరువాత స్థానంలో అమెరికా నుంచి పర్యాటకులు వచ్చినట్లు తెలిపింది. 2022–23 సంవత్సరంతో పోలిస్తే.. 2023–24లో 30.83 లక్షల మంది విదేశీయులు అధికంగా వచ్చినట్లు వివరించింది.వహ్.. తాజ్! 2023–24లో స్వదేశీ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకుల్లో అత్యధికులు తాజ్మహల్ను సందర్శించినట్టు పర్యాటక శాఖ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కుతుబ్ మినార్ రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది ఆగ్రా పోర్ట్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. స్వదేశీ పర్యాటకుల రాకలో కోణార్క్లోని సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది. -
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్కుమార్తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
విద్యార్థి వీసాల ముసుగులో అక్రమ వలసల నిరోధానికి ఆస్ట్రేలియా చేపట్టిన చర్యలు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆస్ట్రేలియాలోని అనేక యూనివర్సిటీలు భారత విద్యార్థుల నమోదును నిషేధించాయి. ముఖ్యంగా హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై కఠిన నిబంధనలు, పరిమితులు విధించాయి. ఈ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో వీసాలు పొందుతూ వలస విధానాలకు తూట్లు పొడుస్తున్నారని వర్సిటీలు గుర్తించాయి. నియంత్రణ లేని ఏజెంట్లు, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు, కొందరు ఆపరేటర్లు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని సమాచారం. ఫలితంగా విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభావం మొత్తం భారతదేశ విద్యార్థులపై పడే ప్రమాదం నెలకొంది. – సాక్షి, అమరావతిప్రతి నాలుగు దరఖాస్తుల్లో ఒకటి నకిలీ..భారత్ నుంచి వచ్చే ప్రతి నాలుగు విద్యార్థి వీసా దరఖాస్తుల్లో ఒకటి నకిలీదిగా ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ధ్రువీకరించింది. భారత్ నుంచి వచ్చే మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 24.3 శాతం మోసపూరితమైనవని చెబుతోంది. అంతర్జాతీయ వర్సిటీలకు అతిపెద్ద విద్యార్థి వనరుగా భారత్ ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా వర్సిటీల తాజా నిషేధంతో చట్టబద్ధమైన దరఖాస్తుదారుల భవితవ్యం గందరగోళంలో పడుతోంది. ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించకుంటే ద్వైపాక్షిక విద్యా సంబంధాలు ప్రభావితమవుతాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ విద్యార్థుల వీసాలకు సంబంధించి కఠినమైన నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్న భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీల నిర్ణయం శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.వలసలను తగ్గించేందుకు..గత ఏడాది రికార్డు స్థాయిలో వలసలను నియంత్రించే యత్నంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం వర్సిటీలను హెచ్చరించింది. విద్యార్థి వీసా మంజూరుకు పొదుపు డిపాజిట్ మొత్తాన్నీ పెంచింది. గత ఏడాది మే 10 నుంచి విద్యార్థి వీసా మంజూరుకు కనీసం రూ.16.30 లక్షలు (29,710 ఆస్ట్రేలియన్ డాలర్ల) బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టు ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. అంతకుముందు 2023 అక్టోబర్లో పొదుపు మొత్తాన్ని రూ.11.46 లక్షల నుంచి రూ.13.35 లక్షలు (21,041 ఆస్ట్రేలియన్ డాలర్ల నుంచి 24,505 ఆస్ట్రేలియన్ డాలర్లకు)కు పెంచింది. -
ఇదేం ధ‘రొయ్యో’..!
రొయ్య రైతులు విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర రాక సతమతమవుతున్నారు. ట్రంప్ సుంకాల పేరు చెప్పి ఎగుమతిదారులు అడ్డగోలుగా ధరలు తగ్గించేయడంతో ఈ దుస్థితి తలెత్తింది. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.సాగు సమ్మె బాట పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పట్టుబడి పూర్తయిన 25 శాతం విస్తీర్ణంలో మెజార్టీ రైతులు పంట విరామం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన, కంపెనీలు చెల్లిస్తున్న ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి, అమరావతిపశ్చిమగోదావరిలో నిరసన గళం వారం రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందుపర్రు గ్రామాల రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. తాజాగా ఇదే జిల్లాలో నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంతోపాటు పోడూరు మండల రైతులు కూడా సాగు సమ్మెకు సిద్ధపడుతున్నారు. ఆక్వా సాగు ఇక చేయలేమని, క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామని చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులూ సాగు సమ్మెకు సిద్ధమవుతున్నారు. 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు రాష్ట్రంలో ఈ–ఫిష్ డేటా ప్రకారం 1.62 లక్షల మంది ఆక్వా రైతులు 5.72 లక్షల ఎకరాల్లో సాగు చేçస్తున్నారు. అత్యధికంగా ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనే 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.కౌంట్ల పేరిట.. అడ్డగోలు దోపిడీప్రస్తుతం పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీల వల్ల రొయ్యలు 100 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంది. అదే 50 కౌంట్కు చేరాలంటే కిలోకు రూ.330–350 వరకు, గరిష్టంగా 30 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.450 చొప్పున ఖర్చవుతుంది. కానీ ప్రస్తుతం 100 కౌంట్ రూ.230, 50 కౌంట్ రూ.325, 30 కౌంట్ రూ.425 చొప్పున కంపెనీలు ధరలు ప్రకటించాయి. ఈ ధరల్లోనూ ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులతోపాటు గ్రామ స్థాయిలో రొయ్యలు కొనుగోలు చేసే షెడ్ల నిర్వాహకులు సిండికేట్గా మారి అడ్డగోలుగా కోత విధిస్తున్నారు. కిలోకు రూ.పది నుంచి రూ.30 వరకు కోత పెడుతున్నారు. 1–3 టన్నుల్లోపైతే 100 కౌంట్కు రూ.220, 50 కౌంట్కు రూ.310, 30 కౌంట్కు రూ.400 చెల్లిస్తున్నారు. అదే నాణ్యత కొంచెం తక్కువగా ఉంటే ధరలో ఇంకా భారీగా కోత పెడుతున్నారు. ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు ప్రస్తుతం ఉన్న ధరలు రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదు. 100 కౌంట్కు కిలోకు రూ.220–250 వరకు ఖర్చవుతుంటే, కంపెనీలు రూ.230 ధరగా ప్రకటించాయి. అది కూడా 3 టన్నుల పైబడి అమ్మితేనే ఈ ధర. 3 టన్నులలోపు అయితే వ్యాపారులు అడ్డగోలుగా కోత కోస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందువల్లే సాగు సమ్మెకు దిగాల్సి వచి్చంది. – మామిడిశెట్టి గిరిధర్ తూర్పుతాళ్లు, పశ్చిమగోదావరి జిల్లారూ.13 లక్షలు నష్టపోయాను ఎగుమతి దారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తున్నారు. ఈ సీజన్లో ఎకరాకు 1.50 లక్షల రొయ్య పిల్లలు వేశాను. ఆరెకరాలకు రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టా. 70 కౌంట్ వచి్చంది. వ్యాపారులు ధర బాగా తగ్గించారు. కిలో రూ.280 చొప్పున ఇచ్చారు. రూ.17లక్షల రాగా, రూ.13 లక్షలు నష్టపోయా. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. – ఈమన రామాంజనేయులు పోడూరు, పశ్చిమగోదావరి జిల్లా -
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను మరింత పెంచింది. రాష్రాల్లో పథకం అమలులో దుర్వినియోగానికి తావులేకుండా పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పథకం పనుల ప్లానింగ్, మంజూరులో సైతం మార్పులు తెచ్చింది. ఇందుకోసం ‘యుక్తధార’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ను ఇస్రో – నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో అనుసంధానం చేసింది. తద్వారా ఈ పనులను తన నియంత్రణలోకి తీసుకుంటోంది. ఈ విధానం వల్ల ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చాలా వరకు తగ్గిపోతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. చాలా కాలం నుంచి ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను కేంద్రమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల మెటీరియల్ కేటగిరీ (సిమెంట్ రోడ్లు లేదా ఇతర కూలీలను ఉపయోగించని) పనుల బిల్లులనూ నేరుగా కేంద్రమే ఆ వ్యక్తులకు, సంస్థలకు చెల్లిస్తోంది. ఇందులో రాష్ట్రాలు వాటి వాటా 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాకు జమ చేస్తేనే కేంద్రం 75 శాతం వాటా కలిపి బిల్లులు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకం పనుల ప్రణాళిక, అమలును కూడా కేంద్రమే ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది.వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమలు..ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ఏటా పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం పనుల కల్పన, ప్రణాళికల రూపకల్పన ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే అక్టోబరు–ఫిబ్రవరి నెలల మధ్య రాష్ట్ర స్థాయిలో జరుగుతుండేది. ఈ ప్రణాళికలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చి నెలలో రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి వాటికి లేబర్ బడ్జెట్ పేరుతో ఆమోదం తెలిపేది. కొత్తగా గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్లో తీర్మానం అనంతరం మంజూరు చేసేవారు. కేంద్రం తెచ్చిన కొత్త విధానం ప్రకారం ఇకపై ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం ఒకేసారి ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వారీగా లేబర్ బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ఏడాది మధ్యలో పనులు మంజూరు కావు. ఇలా ఏడాది ప్రణాళిక రూపకల్పనకు ‘యుక్తధార’ మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. ఈ ఏప్రిల్ 1 నుంచి మండలానికి ఒక గ్రామ పంచాయతీ చొప్పున ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.పనుల గుర్తింపు కూడా సాంకేతికతోనే.. ఈ పథకంలో అవకతవకలకు సైతం వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో చేపట్టడానికి అవకాశం లేని పనులను ప్రణాళికలో చేర్చే అవకాశం ‘యుక్తధార’ యాప్లో ఉండదని చెబుతున్నారు. యాప్ పూర్తిగా ఇస్రో ఆధ్వర్యంలో సమగ్ర గూగుల్ మ్యాప్నకు అనుసంధానమై ఉండటం వల్ల చెరువులు ఉన్న ప్రాంతంలోనే వాటి పూడిక తీత పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు. కొన్ని రకాల పనులకు ఆ ప్రాంత భూగర్భ పరిస్థితులు అనుకూలమా లేదా అన్నది కూడా పని నిర్ధారణ సమయంలోనే తెలిసిపోతుందని వివరించారు. తద్వారా పనుల గుర్తింపులో అక్రమాలకు తెరపడుతుందని చెబుతున్నారు.దొంగ మస్టర్లకూ చెక్! ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకూ కేంద్రం చెక్ పెట్టబోతోంది. దీని ప్రకారం ఒక ప్రదేశంలో కూలీలు పనిచేసే సమయంలో రోజూ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఫొటో తీయాలి. ఆ ఫోటోలో ఉన్న కూలీల సంఖ్య, అక్కడ పనికి హాజరైనట్టు సిబ్బంది మస్టర్ షీట్లో నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ రోజు వేతనాల చెల్లింపు జరుగుతుంది. ఫోటోలో, మస్టర్ షీట్లో సంఖ్యలో తేడా ఉంటే ఆ మస్టర్ షీటును పరిగణనలోకి కూడా తీసుకోరు.ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో యాప్ అనుసంధానంప్రస్తుతం ఈ పథకం పనుల ప్రణాళిక ఆఫ్ లైన్ విధానంలో రూపొందించి, ఎంత మంది పేదలకు పనులు కల్పిస్తారో సంఖ్య మాత్రమే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆ పనుల నంబర్లను పోర్టల్లో ఎంటర్ చేసి, వాటికి బిల్లులు పెడుతున్నారు. కొత్త విధానంలో మొబైల్ యాప్ ద్వారా ప్రణాళిక పూర్తిగా ఆన్లైన్లో రూపొందుతుంది. ఏ పంచాయతీలో ఏ రకమైన పనిని ఏ ప్రదేశంలో చేపడతారో గూగుల్ మ్యాప్లో గుర్తించి, యాప్లో నమోదు చేస్తారు.ఈ యాప్ పూర్తిగా ఇస్రో - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో అనుసంధానమై ఉంటుంది. ఇలా అన్ని పనులు జియో ట్యాగింగ్ చేసి, మ్యాప్లోనే ఒక్కో పనికి ఒక్కో నంబరును కేటాయిస్తారు. ప్రతి పనికి అంచనా విలువ సైతం యాప్లోనే నమోదు చేస్తారు. ఏ పనికి బిల్లులు పెట్టాలన్నా యాప్లో నమోదు చేసిన ప్రకారం వర్క్ ఐడీలను ఎంపిక చేసుకొని బిల్లులు పెట్టాలి. -
ఒక్క మరుగుదొడ్డీ లేదా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది తమను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది. మరుగుదొడ్డి కూడా లేకపోతే సమాచార కమిషన్ కార్యాలయానికి వచ్చే సామాన్యులు, ముఖ్యంగా మహిళల పరిస్థితి ఏమిటని నిలదీసింది. మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం విస్మరించిందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. మరుగుదొడ్డి లేకుంటే సమాచార కమిషన్ను మరో చోటుకి తరలించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించింది. లేకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తామని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.కాంత్రికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఉప్పలూరి అభినవ్ కృష్ణ వాదనలు వినిపిస్తూ, సమాచార కమిషన్ సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేదన్నారు. ప్రభుత్వ్ర ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, భవన యజమానితో వివాదం కొనసాగుతోందన్నారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని ఆమె తెలిపారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ నేతలతో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. -
‘మంత్రి నారా లోకేష్ బినామీలదే ఉర్సా కంపెనీ’
సాక్షి, తాడేపల్లి: విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్, ఆయన బినామీలే సూత్రదారులని వైఎస్సార్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ తన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను సృష్టించి, వాటికి ప్రభుత్వం ద్వారా కారుచౌకగా విలువైన భూములను కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని చెబుతున్న చంద్రబాబు ప్రజల సంపదను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.ఇంకా ఆయనేమన్నారంటే..కూటమి ప్రభుత్వం విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు దోచిపెడుతోంది. ఊరు, పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. గత వారం రోజులుగా దీనిపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ డొల్ల కంపెనీ హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో రెండు నెలల కిందటే రిజిస్టర్ అయ్యింది. అటువంటి కంపెనీకి 56 ఎకరాల భూమిని కట్టబెడతారనే దానిపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ అవినీతిపై ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా, దీనిపై రాష్ట్రంలోని ఒక్క మంత్రి కూడా ధైర్యంగా ప్రజల ముందకు వచ్చి వివరణ ఇవ్వలేదు.ఎందుకంటే ఇది డొల్ల కంపెనీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు డైరెక్టర్లు తప్ప ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీకి ఎకరం రూ.50 కోట్ల విలవైన భూములు, అంటే దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటువంటి సూట్కేస్ కంపెనీలను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించడం, వాటికి కారుచౌకగా ఖరీదైన భూములను కట్టబెట్టించడం చేయిస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ప్రభుత్వమే తమ బినామీలను ముందు పెట్టి, ఆస్తులను దోచేస్తోంది.వైఎస్ జగన్ హయాంలోనే టీసీఎస్తో సంప్రదింపులువైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే టీసీఎస్ ప్రతినిధులతో చర్చలు జరిగాయి. తరువాత కోవిడ్ కారణంగా టీసీఎస్ ఏపీకి రావడం ఆలస్యం అయ్యింది. 2022లో టీసీఎస్కు చెందిన చంద్రశేఖరన్ ఏపీకి వచ్చి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. తరువాత ఎన్నికలు రావడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీసీఎస్తో ప్రభుత్వ సంప్రదింపులు కొనసాగాయి. టీసీఎస్కు విశాఖలో 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే విక్రయిస్తూ కూటమి ప్రభుత్వం ఈనెల 21వ తేదీన జీవో జారీ చేసింది. ఈ భూముల విలువ వేలకోట్ల రూపాయలు ఉంటుంది. కనీసం వాటి మార్కెట్ విలువపై కొంతశాతం తగ్గించి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది.అలా కాకుండా 99 పైసలకు విక్రయించడం చూస్తే, దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాసంపదను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో ప్రోత్సహాకరంగా విధానాలు ఉండాలే తప్ప, పూర్తిగా ఉచితంగా దారాదత్తం చేసేలా ఏ ప్రభుత్వమైనా వ్యవహరిస్తుందా? ఇలా 99 పైసలకే భూములను విక్రయించినందుకు ఏపీకి టీసీఎస్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన మేలు జరుగుతుందా అని చూస్తే, ఆ సంస్ధ కల్పించే 12వేల ఉద్యోగాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. వైయస్ జగన్ సీఎంగా ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే సంస్థలు ఖచ్చితంగా డెబ్బై శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని నిబంధనలు తీసుకువస్తే, ఆనాడు కూటమి పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు టీసీఎస్ కల్పించే ఉద్యోగాల్లో ఓ రెండు వేల మంది ఏపీకి చెందిన వారు ఉంటే, మిగిలిన పదివేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. అలాంటప్పుడు ఈ కేటాయింపులను ప్రశ్నిస్తే, పరిశ్రమలను, ఐటీ సంస్థలను అడ్డుకుంటున్నారని మాపైన దుష్ర్పచారం చేస్తున్నారు.డొల్ల కంపెనీలకు భూకేటాయింపులుటీసీఎస్ను చూపిస్తూ, ఉర్సా లాంటి డొల్ల కంపెనీలను కూడా ఇదే విధంగా గొప్ప ఐటీ సంస్థలుగా చిత్రీకరిస్తూ భూకేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం తెగబడింది. ఇరవై వేల రూపాయల అద్దె ప్లాట్లో నడిచే ఉర్సా సంస్థ ఏకంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడుతుందంటే, ప్రభుత్వం ఎలా నమ్మింది? పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ, ఆమోదం తెలిపిన బోర్డ్లు ఏ అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశాయి? ఈ కంపెనీ ప్రమోటర్లు ఎవరు, వారి ఆర్థిక సామర్థ్యం ఎంత, గత అనుభవం ఏమిటీ, ఎంత మంది ఉద్యోగులు దీనిలో పనిచేస్తున్నారనే కనీస వివరాలను కూడా పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ సంస్థకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?ఎందుకంటే ఇది నారా లోకేష్కు చెందిన బినామీలకు చెందిన సంస్థ. ఉర్సా ప్రతినిధిలు పెందుర్తి విజయ్కుమార్, ఆయన కుమారుడు పెందుర్తి కౌశిక్, మరో వ్యక్తి అబ్బూరి సతీష్. వీరు అమెరికాలోని తన సొంత ఇంట్లో ఒక కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీని చూపించి ఇటీవల దావోస్లో తెలంగాణలో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామంటూ ఎంఓయు చేసుకున్నారు. తరువాత ఎపీలో కూడా ఇదే తరహాలో మరో అయిదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ స్కామ్ను నడిపించారు. గతంలో ఐఎంజీ భారత్ పేరుతో వేల కోట్ల రూపాయల విలువైన భూములను బిల్లీరావుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ఏరకంగా ప్రయత్నించాడో అందరికీ తెలుసు. ఇప్పుడు లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఉర్సా సంస్థను తెరమీదికి తీసుకువచ్చారు. ఉర్సాకు చేసిన భూకేటాయింపులకు సంబంధించిన జీఓను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. టీసీఎస్కు జీఓ ఇచ్చారు, ఉర్సాకు మాత్రం జీఓను జారీ చేయలేదు. అంటే ఉర్సాకు సంబంధించిన జీఓను రహస్యంగా ఉంచుతున్నారా?ఉర్సా సంస్థ ఫైలు ఉరుకులు పెట్టించారుఉర్సా సంస్థ ప్రతినిధులు పెందుర్తి విజయ్కుమార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగి. మరో డైరెక్టర్ అబ్బూరి సతీష్ అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. వీరిద్దరూ కలిసి ఏపీలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చెబుతున్నారు. దీనిని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఆమోదించడం, వెంటనే కేబినెట్కు వెళ్ళడం, కేబినెట్ కూడా కాపులుప్పాడులో 56 ఎకరాలను 99 పైసలకే అమ్మేయాలని నిర్ణయించడం. ఇదంతా ఎంత ప్రణాళికాబద్దంగా స్కామ్ను నడిపించారో అర్థం అవుతోంది. గత వారం రోజులుగా దీనిపై వైఎస్సార్సీపీ మాట్లాడుతూ ఉంటే ఎల్లోమీడియాలో పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం అంటూ సిగ్గులేకుండా తప్పుడు రాతలు రాశాయి.డొల్ల కంపెనీలకు విలువైన భూములను దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? వైఎస్సార్సీపీ హయాంలో అనేక కంపెనీలను ప్రోత్సహించాం, మీలా ఉచితంగా భూములను దారాదత్తం చేయలేదు. పలు ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి విశాఖలో 161 స్టార్ట్ అప్ ఐటీ కంపెనీలు ఉంటే, వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా 425 కంపెనీలు ఏర్పాటయ్యాయి. తెలుగుదేశం దిగిపోయే నాటికి ఐటీ ఉద్యోగులు ఏపీలో 27643 మంది ఉంటే వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో 75,551 మందికి పెరిగారు. మేం అడ్డుకునే వారిమే అయితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఎలా పెరిగాయి, ఉద్యోగులు ఎలా పెరిగారు? ఉర్సా, లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములను కట్టబెట్టడం ద్వారా, పెద్ద ఎత్తున లబ్ధి పొందాలని చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విధానాలను ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం. -
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్ఆర్ వాదనలు వినిపించారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాపోయారు. అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్ఆర్కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్ విధించారు. దీంతో విజయవాడ సబ్ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.ఇదీ చదవండి: పీఎస్ఆర్ అరెస్ట్పై వైఎస్ జగన్ ఏమన్నారంటే.. -
ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాలను www.sakshieducation.comతో విద్యార్థులు తెలుసుకోవచ్చు.AP 10th Class Results 2025 Direct Links..Server-1https://results2.sakshieducation.com/Results2025/Andhra-Pradesh/SSC/ap-ssc-10th-class-results-2025.html Server-2https://education.sakshi.com/sites/default/files/exam-result/AP-SSC-10th-Class-Results-2025-Direct-Link.html Server-3http://results1.sakshieducation.com/results/SSC/ap-ssc-10th-class-results-2025.htmlఅలాగే, https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. -
నేడు ఏపీ టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు www.sakshieducation.comతో పాటు https:// bse.ap.gov.in, https:// apopenschool.ap.gov.in/లో చూడవచ్చు. అలాగే, వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను పొందవచ్చు. -
వేట నిషేధ భృతి నిబంధనలు మార్పు
సాక్షి, అమరావతి: ‘గంగపుత్రులకు తీరని అన్యాయం.. వేటకు వెళ్లే మత్స్యకారులకు సంక్షేమ పథకాలు కట్’ పేరుతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. ‘వేట నిషేధ భృతి’కి అర్హుల గుర్తింపు కోసం జారీ చేసిన నిబంధనలను మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భృతికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్(మత్స్యకార పెన్షన్) పొందే వారు మాత్రమే అనర్హులని.. మిగిలిన సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. ఇతర నిబంధనలను కొంతమేర సడలించింది. కలకలం రేపిన ఉత్తర్వులు.. సముద్రంలో మత్స్యసంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమలవుతుంటుంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం ప్రభుత్వం పరిహారం ఇచ్చేది. గతంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. అలాగే వేట నిషేధ భృతి పొందిన వారికి సైతం అన్ని సంక్షేమ పథకాలనూ వర్తింపజేశారు. అధికారంలోకి వస్తే భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం.. తొలి ఏడాది ఎగ్గొట్టింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి వారం రోజుల క్రితం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని.. ఈ భృతి పొందే వారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని ప్రకటించింది. ఈ నిబంధనలను ప్రశ్నిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. నిబంధనలు మార్చాలంటూ మత్స్యకారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం నిబంధనలను మారుస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మారిన నిబంధనలు.. వేటకు వెళ్లే బోట్లన్నీ ఏప్రిల్ 14కు ముందు ఎంఎస్ యాక్టు 1958 కింద రిజిస్టరై ఉండాలని.. ఎఫ్ఎంఎఫ్ఆర్ యాక్టు 1995 కింద లైసెన్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. సబ్సిడీ ఆయిల్ ఎంత వినియోగించుకున్నా అర్హులేనని స్పష్టం చేసింది. కాగా, వేట నిషేధ భృతి పొందేవారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతి, ఎనీ్టఆర్ భరోసా పెన్షన్ పొందేందుకు అనర్హులని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఒక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్(మత్స్యకార పింఛన్) పొందే వారు మాత్రమే అనర్హులంటూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, అర్బన్ ప్రాంతంలో 1.44 లక్షల ఆదాయానికి మించి ఉండకూడదని.. 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా 10 ఎకరాల్లోపు మెట్ట, మాగాణి కలిసిన భూములు, 4 చక్రాల వాహనాలు, ఏడాదిలో గరిష్టంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగం, కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత ఇల్లు కలిగిన వారు అనర్హులని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం ఆ నిబంధనల స్థానంలో గతంలో మాదిరిగా 6 దశల వెరిఫికేషన్ ద్వారా అర్హులను గుర్తిస్తామని స్పష్టం చేసింది.రూ.40 వేలు జమ చేయాలి.. తాజా నిబంధనల ప్రకారం బుధవారం(23వ తేదీ) సాయంత్రంలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని మత్స్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగే కార్యక్రమంలో ఈ ఏడాది వేట నిషేధ భృతి జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది ఎగ్గొట్టిన రూ.20 వేలు కూడా కలిపి రూ.40 వేలు జమ చేయాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మునగాల హరీశ్వర్రెడ్డి మంగళవారం హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు ఫిర్యాదు చేశారు. వీరిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేర చర్యలు తీసుకోవాలని కోరారు. హరీశ్వర్రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు కాసా జగన్మోహన్రెడ్డి, కె.జానకిరామిరెడ్డి, యర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి, పొన్నపురెడ్డి శశివర్థన్రెడ్డి, పాపుడిప్పు శశిధర్రెడ్డి తదితరులు ఫిర్యాదు కాపీని రిజిష్ట్రార్ జనరల్, రిజిష్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేశారు.పోలీస్ అధికారులు, అలాగే మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ధిక్కరించి, ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలలోనూ నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు పంపుతున్నారని హరీశ్వర్రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై కూడా తిరుపతి తూర్పు పోలీసులు పలు సెక్షన్ల కింద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, ఈ సెక్షన్లన్నీ ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడేవేనన్నారు. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, మేజిస్ట్రేట్ తగిన కారణాలను వెల్లడించకుండా యాంత్రికంగా తనను రిమాండ్కు పంపారని హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.తమ ఆదేశాల అమలును హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు చెప్పిందితాను కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో జరిగినట్లు తెలిసిందని హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. తమ మార్గదర్శకాల అమలును దేశంలోని అన్నీ హైకోర్టులు పర్యవేక్షించాలని, వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సంతేందర్ కుమార్ అన్టిల్ వర్సెస్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు సైతం చెప్పింది..ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం బొల్లినేని రాజగోపాల్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొందన్నారు. ‘సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసే ముందు మేజిస్ట్రేట్లు తమ సంతృప్తిని రికార్డ్ చేయాలి. వాస్తవాల విషయంలో నిష్పాక్షికంగా ఆలోచించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలి. దీనికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా తీవ్రంగా పరిగణిస్తాం. మేజిస్ట్రేట్లు లోపభూయిష్టమైన రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని నిందితులు కానీ, వారి తరఫున ఇతరులు గానీ హైకోర్టు దృష్టికి తీసుకొస్తే ఆ మేజిస్ట్రేట్లపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆదేశాలను ఉల్లంఘించిన విచారణాధికారులు, మేజిస్ట్రేట్ల వివరాలను కేసుల వివరాలతో సహా ఈ ఫిర్యాదుకు జత చేస్తున్నానని, వాటిని పరిశీలించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన రిజిస్ట్రీ దీనిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచుతామని హరీశ్వర్రెడ్డి న్యాయవాదులకు చెప్పినట్లు తెలిసింది. మొత్తం 149 కేసులకు సంబంధించిన వివరాలను, ఆయా మేజిస్ట్రేట్ కోర్టుల వివరాలను హరీశ్వర్రెడ్డి తన ఫిర్యాదుతో జత చేశారు. -
సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా..బాబు భేతాళ కుట్ర బట్టబయలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు భేతాళ కుట్ర బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో కూడిన సిట్ నివేదిక సాక్షిగా రెడ్బుక్ కుతంత్రం బెడిసికొట్టింది. తద్వారా చంద్రబాబు తాను తీసిన గోతిలో తానే పడ్డారు! వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదిక ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. కానీ ఆయన ఇచ్చినట్లుగా చెబుతున్న వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ వెల్లడించడం అసలు కుట్రను వెల్లడించింది. అంటే రాజ్ కసిరెడ్డి చెప్పకుండానే.. తాను అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సిట్ అంగీకరించింది. ఇక మద్యం డిస్టిలరీలకు ఆర్డర్లలో వివక్షకు పాల్పడి అవినీతి చేశారని సిట్ పేర్కొంది. కానీ అదే నివేదికలో నాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం నాలుగు కంపెనీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. ఇక టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సి–టెల్ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం ఆర్డర్లు జారీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించింది. మరి సి–టెల్ సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు ఎందుకు చేశారనే దానిపై సిట్ మౌనం వహించింది. తద్వారా టీడీపీ హయాంలోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని అసలు గుట్టు విప్పింది. ఇక నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు చొప్పున రాజ్ కేసిరెడ్డి వసూలు చేసి వైఎస్సార్ సీపీలోని ముఖ్యులకు ఇచ్చారని ఒకచోట... రాజ్ కేసిరెడ్డే ఆ నిధులను దేశంలో వివిధ చోట్ల పెట్టుబడి పెట్టారని మరోచోట పరస్పర విరుద్ధంగా పేర్కొనడం ద్వారా తన దర్యాప్తులో డొల్లతనాన్ని బయటపెట్టింది. తాము బెదిరించి వేధించిన వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్ తదితరులతో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు పేరిట కనికట్టు చేసినట్టు అంగీకరించింది. అంతిమంగా టీడీపీ గత ఐదేళ్లలో చేసిన అవాస్తవ ఆరోపణలు, అభూత కల్పనలనే గుదిగుచ్చి దర్యాప్తు నివేదికగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించిందన్నది స్పష్టమైంది. దర్యాప్తు పేరిట తాము సాధించింది శూన్యమని గ్రహించిన సిట్ ఏమీ చేయలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. సిట్ నివేదిక సాక్షిగా వెల్లడైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది...డిస్టిలరీలూ బాబు దందానే బట్టబయలు చేసిన సిట్ నివేదికవైఎస్సార్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధిక మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమీషన్లు తీసుకున్నారని ఆవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేయడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018–19లో కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలోమద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21 శాతం కేవలం నాలుగు డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు పాల్పడినట్టే కదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని రూఢీ అయింది. సి–టెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం నాలుగు కంపెనీల నుంచి ఏకంగా 53.21 శాతం మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్వేర్ను తొలగించడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా!రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం పేరిట కుట్ర..సిట్ కుట్రను బయటపెట్టిన రిమాండ్ నివేదిక వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగినట్టుగా దుష్ప్రచారాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కుట్రకు తెగించింది. అందుకోసమే రాజ్ కేసిరెడ్డి విచారణ ప్రక్రియను అడ్డంపెట్టుకుని పన్నాగం రచించింది. ఆయన్ను సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేసిన సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు విచారణ పేరుతో తతంగం నడిపించారు. అనంతరం ఆయన వాంగ్మూలంగా పేర్కొన్నారంటూ ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అందులో మద్యం కుంభకోణం కుట్ర అంటూ కట్టుకథ అల్లారు. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును ప్రస్తావించడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. సంక్షేమ పథకాలను అమలు చేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేలా... మరోవైపు వైఎస్సార్సీపీకి ఫండింగ్ వచ్చేలా మద్యం విధానాన్ని రూపొందించమని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో చెప్పినట్టుగా రాజ్ కేసిరెడ్డి తెలిపారని ఆ నివేదికలో పేర్కొంది. కానీ వాస్తవం ఏమిటంటే... రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం అంటూ సమర్పించిన నివేదికపై ఆయన సంతకం చేయడానికి పూర్తిగా నిరాకరించారని సిట్ నివేదిక వెల్లడించింది. మరి అలాంటప్పుడు ఇక కుంభకోణం ఎక్కడ...? రిమాండ్ నివేదికలో పేర్కొన్న అభియోగాలన్నీ కట్టుకథలేనని సిట్ స్వయంగా అంగీకరించినట్లైంది. సంతకం చేసేందుకు రాజ్ కేసిరెడ్డి నిరాకరించిన విషయాన్ని కూడా ఎందుకు పేర్కొన్నారంటే..న్యాయస్థానంలో హాజరు పరిచేటప్పుడు ‘మీరే చెప్పారా...? సంతకం చేశారా’ అని ఆయన్ను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పుడు తమ బండారం బయటపడుతుందని ముందు జాగ్రత్తగా ఆయన సంతకం చేయలేదని వెల్లడించక సిట్ అధికారులకు తప్ప లేదు. కుట్రకు అనుకూలంగా సిట్ అధికారులు ఓ రిమాండ్ నివేదికను సృష్టించి కనికట్టు చేసేందుకు యత్నించారన్నది దీంతో బట్టబయలైంది. ఆ విషయాలను రాజ్ కేసిరెడ్డే వెల్లడించి ఉంటే...ఆయన ఆ వాంగ్మూలం కాపీపై సంతకం చేసేందుకు ఎందుకు నిరాకరిస్తారు?.. అంటే రిమాండ్ నివేదిక పేరిట సిట్ కుట్రకు పాల్పడిందన్నది స్పష్టమైంది. సిట్ అధికారులే న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక దీనికి సాక్ష్యం. నాడు టీడీపీ దుష్ప్రచారమే...నేడు సిట్ రిమాండ్ నివేదికచంద్రబాబు, లోకేశ్, టీడీపీ అధికార ప్రతినిధులు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన మాటల్నే సిట్ తన రిమాండ్ నివేదికగా న్యాయస్థానానికి సమర్పించడం విడ్డూరంగా ఉంది. అందులో పేర్కొన్నవన్నీ అసత్య ఆరోపణలేననడానికి ఇవిగో తార్కాణాలు..అబద్ధపు వాంగ్మూలాలే కుట్రకు ప్రాతిపదికసిట్ అధికారులు బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలే ప్రాతిపదికగా రిమాండ్ నివేదిక రూపొందించినట్టు వెల్లడైంది. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డితోపాటు అప్పటి ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగానికి తెగబడింది. తాము భయభ్రాంతులకు గురిచేసి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్తో ఇప్పించిన అబద్ధపు వాంగ్మూలాలనే ప్రస్తావించింది. డిస్టిలరీల ఏర్పాటు కోసం విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీ మిథున్ రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి తదితరులు సమావేశమై చర్చించినట్టు సిట్ పేర్కొంది. కారు కూతలు... కాకి లెక్కలులేని కుంభకోణం ఉన్నట్టు చూపించే కుట్రటీడీపీ కార్యాలయం చెప్పిన కాకి లెక్కలతో సిట్ అధికారులు తమ రిమాండ్ నివేదికను రూపొందించడం పోలీసు వ్యవస్థ సర్వభ్రష్టత్వాన్ని వెల్లడిస్తోంది. ఏకంగా నెలకు రూ.50కోట్ల నుంచి రూ.60 కోట్ల చొప్పున వసూలు చేసి ఇచ్చారని దుష్ప్రచారానికి తెగబడింది. మళ్లీ అదే నివేదికలో ఆ నిధులను రాజ్ కేసిరెడ్డి దేశంలోనే బంగారం, భూములు, ముడి సరుకు తదితర కొనుగోళ్ల రూపంలో పెట్టుబడి పెట్టారని చెప్పారు. నిధులు వేరే వారికి ఇచ్చారని ఓ చోట... కాదు వివిధ వివిధ స్థిర, చరాస్తులుగా పెట్టుబడి పెట్టారని పరస్పర విరుద్ధంగా పేర్కొనడం సిట్ కుట్రకు నిదర్శనం.మద్యం మాఫియా దోపిడీదారు బాబే సీఐడీ నమోదు చేసిన కేసు సంగతేమిటో...!అసలు విషయం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి... పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకోసం మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5వేలకోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20శాతం వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20వేలకోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్య్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. ప్రస్తుతం సిట్ రిమాండ్ నివేదిక సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వ మద్యం విధానంలో అక్రమాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇప్పటికైనా సీఐడీ ఆ కేసు దర్యాప్తు చేపట్టాలని... లేదా సీబీఐకి అప్పగించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబూ...మీరు అందుకు సిద్ధమేనా అని వైఎస్సార్సీపీ సవాల్ విసురుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. -
గన్నవరం విమానాశ్రయం రికార్డు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) ప్రయాణికుల రద్దీ పరంగా 2024–25 ఆ ర్థిక సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టించింది. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇక్కడి నుంచి 13,83,855 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వారిలో దేశీయంగా 13,54,925 మంది, అంతర్జాతీయంగా 28,930 మంది ప్రయాణం చేశారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రయాణికుల వృద్ధి రేటు 30.24 శాతంగా నమోదైంది. ఈ విమానాశ్రయం ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించడం ఇది నాలుగోసారి. పెరిగిన విమాన సర్వీస్లు, ఎయిర్లైన్స్ సంస్థల మధ్య పోటీ కారణంగా టిక్కెట్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రయాణికుల వృద్ధికి కారణమని ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. -విమానాశ్రయం (గన్నవరం)విస్తరిస్తున్న విమాన సర్వీసులుకోవిడ్ సమయంలో రద్దయిన అనేక విమాన సర్వీసులను ఎయిరిండియా, ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థలు పునఃప్రారంభించాయి. కొత్తగా 2024–25లో ముంబైకి రెండు సర్వీస్లు, న్యూఢిల్లీకి అదనంగా మూడో సర్వీస్, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీస్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడికి రోజుకు 25 వరకు విమాన సర్వీస్లు వస్తుండగా, మరో 25 సర్వీస్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. రోజుకు సగటున 3,850 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దేశీయంగా న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, కడప నుంచి ఇక్కడికి విమాన సర్వీస్లు నడుస్తున్నాయి. అంతర్జాతీయంగా షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు సర్వీస్లు నడుస్తున్నాయి. భవిష్యత్లో వారణాసి, కొచ్చి, మలేషియా, శ్రీలంక, సింగపూర్, కువైట్కు సర్వీస్లు నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.గణనీయంగా పెరిగిన ప్రయాణికులు రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం బ్రిటీష్ పాలకులు నిర్మింంచిన ఈ విమానాశ్రయం అంచలంచెలుగా ఎదిగి 2017లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు సాధించింది. అందుకు తగ్గట్లుగా దేశంలోని ప్రధాన పట్టణాలకు విమాన సర్వీస్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా 2017–18లో 7,46,392 మంది ఉన్న ప్రయాణికుల సంఖ్య 2018–19కు 11,92,000 మందికి చేరుకుంది.2019–20 ఆర్థిక సంవత్సరం చివరిలో కోవిడ్ ప్రభావం కారణంగా ప్రయాణికుల సంఖ్య 11,30,583కు తగ్గింది. అనంతరం రెండేళ్ల పాటు విమానయాన రంగం కుదేలైంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రావడంతో 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఎయిర్పోర్ట్ పూర్వ వైభవం సంతరించుకుంది. -
పరాకాష్టకు రెడ్బుక్ కుట్ర .. పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్ట్
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాగం పూర్వ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమ అరెస్టుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ కేసులో ఆయన్ను సస్పెండ్ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు బరితెగించింది. వలపు వల వేసి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన మోడల్ కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి మరీ కుతంత్రాన్ని రచించింది. మేనిఫెస్టో అమలు చేయలేని దుస్థితిలో ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పీఎస్ఆర్ ఆంజనేయులును అక్రమంగా అరెస్టు చేసింది.మంగళవారం తెల్లవారుజామునే సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులను హైదరాబాద్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి వరకు విచారించారు. బుధవారం ఉదయం ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం న్యాయస్థానంలో హాజరు పరిచే అవకాశం ఉంది. జత్వానీని అడ్డుపెట్టుకుని కుట్ర కాదంబరి జత్వానీ విషయంలో చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఆమెతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యా సాగర్ను అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించింది.అయితే ఈ కేసులో టి.కాంతిరాణా, విశాల్ గున్నీలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వారిపై కేసు నమోదు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. కాగా, ఎలాంటి తప్పు చేయనందునే ముందస్తు బెయిల్కు వెళ్లాలన్న పలువురి సూచనను పీఎస్ఆర్ సున్నితంగా తిరస్కరించారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ను అరెస్టు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ఈ అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులను సీఐడీ అధికారులు ఇప్పటి వరకు విచారించనే లేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు. విచారణకు పిలవనూ లేదు. తాను ఎక్కడ ఉన్నదీ ఆయన ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఏనాడూ తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోలేదు. అయినాసరే సీఐడీ అందుకు విరుద్ధంగా వ్యవహరించి, ఆయన్ను అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది.ఈ కేసుతో కానీ, సీఐడీతో కానీ సంబంధంలేని కోయ ప్రవీణ్.. మరికొందరు పోలీసులతో కలిసి పీఎఎస్ఆర్ ఆంజనేయులు నివాసం సమీపంలో హడావుడి చేశారు. పీఎస్ఆర్ ఇంట్లో ఉన్నారా.. లేదా.. ఎక్కడికైనా వెళ్తున్నారా.. అంటూ ఆరా తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనను అరెస్టు చేసేందుకు మంగళవారం తన నివాసానికి వచ్చిన సీఐడీ అధికారులకు పీఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా సహకరించారు. పోలీసు వాహనంలో విజయవాడకు బయలుదేరారు. కానీ కోయ ప్రవీణ్ మాత్రం పీఎస్ఆర్ నివాసంలోకి వెళ్లి ల్యాప్టాప్ కావాలి.. ఏవేవో పత్రాలు కావాలి.. డివైజుసులు కావాలంటూ హడావుడి చేశారు. ఇరికించే కుట్రతోనే విచారణ పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ పేరిట సీఐడీ అధికారులు పచ్చ కుట్రను అమలు చేసేందుకే పెద్దపీట వేశారు. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని దాదాపు 6 గంటలపాటు విచారించారు. హనీట్రాప్ నిందితురాలు కాదంబరి జత్వానీని అరెస్టు చేయాలని అప్పటి విజయవాడ సీపీ కాంతికాణా, డీసీపీ విశాల్ గున్నీని ఆదేశించారా.. అందుకోసం వారిని పిలిపించి మాట్లాడారా.. అని ప్రశి్నంచారు. తనకు ఆ ఉదంతంలో ఎలాంటి సంబంధం లేదని.. ఇంటలిజెన్స్ అధికారులు కేసుల దర్యాప్తు వ్యవహరాలను పర్యవేక్షించారని పీఎస్ఆర్ జవాబు ఇచ్చినట్టు తెలిసింది.తనకు తెలిసినంత వరకు న్యాయస్థానం అనుమతితోనే అప్పటి విజయవాడ పోలీసులు వ్యవహరించారని, కాదంబరి జత్వానీని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారని.. న్యాయస్థానం ఆదేశాలతో ఆమెను రిమాండ్కు తరలించారని చెప్పినట్టు తెలుస్తోంది. తనపై కదాంబరి జత్వానీ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని తేల్చి చెప్పారు. మరిన్ని అక్రమ కేసులకు కుట్ర కాగా పీఎస్ఆర్ ఆంజనేయులపై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నట్టు సమాచారం. కదాంబరి జత్వానీ తప్పుడు ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు న్యాయస్థానంలో నిలవదని ప్రభుత్వానికి తెలుసు. అందుకే అవాస్తవ ఆరోపణలతో మరికొన్ని కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అందుకోసం ఏపీపీఎస్సీ కార్యదర్శితో ముందస్తు కుట్రతోనే తప్పుడు ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కాగా రఘురామకృష్ణంరాజు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు, ఇతరత్రా అక్రమ కేసులతో ఆయన్ను వేధించేందుకు ప్రభుత్వం తన కుట్రకు పదును పెడుతున్నట్టు సమాచారం. -
వ్యవస్థల విధ్వంసం: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దేన్నీ వదిలి పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ మీద బురదజల్లి, డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతోంది. రోమన్ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి జగన్ మీద మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించి.. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో కూటమి ప్రభుత్వం నిత్యం మునిగి తేలుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయేలా చేస్తూ.. వాటి విధ్వంసానికి పాల్పడుతోందని, రాష్ట్రంలో మొదటిసారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నామని నిప్పులు చెరిగారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదన్నారు. చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడం దారుణమని, ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టినా పద్ధతి మార్చుకోలేదన్నారు. మంగళవారం ఆయన తాడుపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే..అసలు లిక్కర్ స్కాం ఎవరిది? » లోక్సభ సభ్యుడు మిథున్రెడ్డిని టార్గెట్ చేసి, ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును.. పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. ఆయన పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది. » లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?» 2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అన్ని పథకాలకు మంగళం ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.3,900 కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7,800 కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు కష్టాల్లో, బాధల్లో మునిగి ప్రభుత్వ నిర్వాకాలపై దృష్టి పెట్టరని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు.భూ పందేరాలు.. పనుల్లో యథేచ్ఛగా దోపిడీలులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెద్దగా పెరగక పోయినా.. పెరిగాయని చెబుతూ రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని..గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు వెళ్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. గతంలోనూ మనపై తప్పుడు ప్రచారాలు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మనల్ని నమ్మారు. ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడిపై వ్యతిరేకతను కప్పి పుచ్చడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబునాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు.వక్ఫ్ చట్టం విషయంలో టీడీపీ వ్యవహార శైలిపై చర్చ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి టీడీపీ పార్లమెంట్ ఉభయ సభల్లో మద్దతు పలికి, కింది స్థాయిలో కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తోందని పలువురు పీఏసీ సభ్యులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని మైనార్టీలు ఎండగడుతున్నారని.. ఊరూరా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. వక్ఫ్ చట్టం అన్నది కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టే దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. ధాన్యం, పెసలు, మినుములు, కందులు, శనగలు, పొగాకు, మిర్చి, అరటి, టమాటా, కోకో సహా అన్ని పంటల ధరలు తగ్గిపోయాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, టారిఫ్ల బూచి చూపి రైతులను నిలువునా దోచుకున్నారని చెప్పారు. ఆక్వా రైతులకు మేలు చేయడానికి, వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు మన ప్రభుత్వం హయాంలో చట్టాలు తీసుకు వచ్చి, విద్యుత్ రాయితీలు కూడా కల్పించామని, కానీ ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు జరుగుతున్న నష్టంపై పార్టీ పలు దఫాలుగా స్పందించిందని, దీనిపై పార్టీ పరంగా మరింతగా పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని.. కమిటీలుగా ఏర్పడి ముందుకెళ్లాలని వైఎస్ జగన్ చెప్పారు.చంద్రబాబు పెడుతున్న కేసులతో ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడితే, ప్రజలు అంతగా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. ఇందుకు భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. - వైఎస్ జగన్యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ» పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్ర స్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టింది. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నియామకాల తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది.» జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది. కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయి. ఇక గ్రామ స్థాయికి కూడా పార్టీ వెళ్లాలి. బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. » ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ పోరాటాలు మరింత ముమ్మరం అవుతాయి. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రజల తరఫున ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తాం. చివరి ఏడాదిలో ఎన్నికలపై దృష్టి పెడతాం. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలి. దీనివల్ల అన్ని అంశాలూ ప్రజల్లోకి వెళ్తాయి.» మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామ స్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సా«ధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.» కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పని తీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది.. ప్రజల్లోకీ వెళ్తుంది. ఈ మూడేళ్లూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు. -
‘ఉర్సా’.. ఎంపీ కేశినేని చిన్ని బినామీదే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విశాఖపట్నంలో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని విజయవాడ మాజీ ఎంపీ, శివనాథ్ సోదరుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. ఇందుకోసం కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారని చెప్పారు.ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరేనని గుర్తు చేశారు. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను ఫేస్బుక్, ‘ఎక్స్’లో పోస్టు చేశారు.లేఖలో ఏం రాశారంటే.. » విశాఖలో రూ.5,278 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట ఇటీవల ఏర్పాటు చేసిన కంపెనీకి విశాఖ ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడం ఆందోళనకరం. » ఆ కంపెనీకి భూ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర, భూదోపిడి దాగి ఉంది. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం బినామీని ముందుపెట్టి అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ చిన్ని ప్రయత్నిస్తున్నారనడానికి బలమైన ఆధారాలున్నాయి. » ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కేవలం కొన్ని వారాల ముందు మాత్రమే స్థాపించారు. ఆ కంపెనీకి ఎలాంటి అనుభవం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టును అమలు చేసే సామర్థ్యం లేదు. » ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని శివనాథ్కు ఇంజనీరింగ్ కాలేజీ సహచరుడు. దీర్ఘకాల మిత్రుడు. గతంలో ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యాపార భాగస్వామి కూడా. ఉర్సా బినామీ అబ్బూరి సతీష్ వెనుక ఉన్నది కేశినేని శివనాథే అన్నది ప్రజల్లో బలంగా ఉంది. » మీడియా నివేదికల ప్రకారం.. ఎంపీ కేశినేని శివనాథ్ ఫ్లైయాష్, ఇసుక, గ్రావెల్ను కొల్లగొడుతూ.. గాంబ్లింగ్ డెన్స్ (పేకాట శిబిరాలు) నిర్వహిస్తూ.. రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్నారనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. » పారిశ్రామిక అభివృద్ధి కోసం కాకుండా.. ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉర్సా పేరుతో భూములను కాజేయడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కుట్ర చేసినట్లు కనిపిస్తోంది. దీన్ని అనుమతించటం ప్రజా ప్రయోజనాలకు హానికరం. కాబట్టి తక్షణమే ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూకేటాయింపును రద్దు చేయండి. » ఆ కంపెనీ యాజమాన్యం, పెట్టుబడుల మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణకు ఆదేశించండి. -
రాజ్ కేసిరెడ్డికి రిమాండ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కేసిరెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. అంతకు ముందు రిమాండ్ రిపోర్ట్పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం రాత్రి వాడివేడిగా వాదనలు జరిగాయి. అరెస్ట్లో సాంకేతిక తప్పిదాల గురించి నిందితుడి తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వ సలహాదారు పబ్లిక్ సర్వెంట్ ఎలా అవుతారని ప్రశ్నించారు. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ అమలు విషయంలో నిందితుడు రాజ్ కేసిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ అని నిరూపించేందుకు పీపీ కల్యాణి ప్రయత్నించారు. ఐటీ సలహాదారుగా పని చేసి ప్రభుత్వం నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో కేరళ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉటంకించారు. అయితే రాజ్ పబ్లిక్ సర్వెంట్ కాదని, అతనికి 17(ఎ) వర్తించదన్న డిఫెన్స్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ విషయంలో న్యాయస్థానానికి మరింత స్పష్టత ఇవ్వాలని ప్రాసిక్యూషన్ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అవినీతి జరిగింది.. ఇప్పటి వరకు ఎంత నగదు, ఆస్తులు, ఇతర సామగ్రి సీజ్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. నగదు, ఆస్తులు వంటివి ఏమీ సీజ్ చేయలేదని చెప్పారు. ఈ సమాధానం విన్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. గత ఏడాది సెపె్టంబర్లో నమోదు చేసిన కేసుకు సంబంధించి.. సిట్ ఏర్పాటై, ఇన్ని నెలల దర్యాప్తు చేశాక.. ఎలాంటి నగదు, ఆస్తులు, వస్తువులు సీజ్ చేయనపుడు.. అవినీతి చేశాడంటూ అభియోగం ఎలా మోపుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం కోర్టుకు తీసుకొచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హవాలా రూపంలో సెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడు దర్యాప్తునకు సహకరించడం లేదని, అందుకే రిమాండ్ అడుగుతున్నామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. గంట ముందు న్యాయస్థానానికి మెమో కేసు కోర్టుకు అటాచ్ చేసే అంశంలో ప్రాసిక్యూషన్ ఇచ్చిన మెమోను న్యాయస్థానం తప్పు పట్టింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్యాణి ఇచ్చిన పొంతనలేని సమాధానాలపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అవినీతి నిరూపణ కానప్పుడు కేసును సీఐడీ దర్యాప్తు చేయాలని, సీఐడీ కోర్టులోనే విచారణ జరగాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఏసీబీ కోర్టుకు అటాచ్ చేయాల్సి వచ్చినపుడు మెమో ఎప్పుడిచ్చారంటూ ప్రశ్నించారు. సాయత్రం నాలుగు గంటలకు మెమో ఇస్తే.. విచారణ ఎప్పుడు చేయాలని నిలదీశారు. అయితే ఉదయమే మెమో ఇచ్చామని పీపీ చెప్పడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. మెమో షీట్పై సమయం వేసి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా ఎలా మాట్లాడతారంటూ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ అయితే అతని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ అధికారినైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా? అన్న న్యాయమూర్తి ప్రశ్నలకు ప్రాసిక్యూషన్ సరైన సమాధానం కరువైంది. కనీసం కోర్టుకు మెమో ఇచ్చే అంశంలోనే స్పష్టత లేనపుడు ఈ కేసు వాదనలకు ఆధారం ఎక్కడుంటుందని, వెంటనే మెమోను వెనక్కి తీసుకుంటే కేసును సీఐడీ కోర్టుకు రిటర్న్ చేస్తామని, పై అధికారులతో మాట్లాడుకుని ఏ విషయం చెప్పాలని న్యాయమూర్తి అసహనంగా బెంచ్ దిగి వెళ్లిపోయారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ ఎలా?న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించిన ఎఫ్ఐఆర్లో నిందితుడు రాజ్ కేసిరెడ్డి పేరు లేకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లో పేరు లేని వ్యక్తిని నిందితుడు అంటూ ఎలా అరెస్ట్ చేశారని, రిమాండ్ ఎలా అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. కోర్టు నియమాలను అనుసరించాలని సుప్రీంకోర్టు, తాము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావడం లేదని విచారణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని, ఏ3గా ఉన్న నిందితుడు విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని, పూర్తి స్థాయిలో కస్టడికి తీసుకుని విచారణ చేయాల్సి ఉందని పీపీ న్యాయస్థానాన్ని కోరారు.తప్పుల తడకగా రిమాండ్ రిపోర్ట్విచారణ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్పై ప్రాసిక్యూషన్ సైతం అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన మెమో విషయంలో సిట్ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి బెంచ్ దిగి వెళ్లిపోవడంతో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హుటాహుటిన కోర్టు హాల్కు చేరుకున్నారు. కోర్టుకు ఇచ్చిన మెమో, 17(ఎ), ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు నమోదు చేయక పోవడం వంటి అంశాలను తిరిగి లేవనెత్తారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ను సక్రమంగా చదవాలని న్యాయమూర్తి సూచించడంతో కొన్ని పేరాలను ఏజీ దమ్మాలపాటి చదివేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పులను గమనించి విచారణ అధికారులైన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిమాండ్ రిపోర్ట్ను పక్కన విసిరారు. కేసులో సరైన ఆధారం లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తామంటూ పోలీసులపై మండిపడ్డారు. కనీసం పేరాలు, పేజీ నంబర్లు లేకుండా రిపోర్ట్ ఎలా తయారు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.విచారణకు వస్తానని చెప్పినా.. ఈ కేసులో విచారణకు స్వచ్ఛందంగానే హాజరవుతానని, సిట్ అధికారులు నోటీసులో ఇచ్చిన తేదీనే విచారణకు వస్తానని చెప్పినా పోలీసులు తనను అరెస్ట్ చేశారంటూ నిందితుడు రాజ్ కేసిరెడ్డి కోర్టుకు వివరించారు. మంగళవారం కేసు విచారణకు హాజరయ్యే నిమిత్తం సోమవారం మధ్యాహ్నం గోవా నుంచి బయలుదేరి సాయంత్రానికి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నానని, అక్కడి నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారని చెప్పారు. తన కారును సీజ్ చేశారని, బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని, విచారణ పేరుతో తన తల్లి, తండ్రిని ఇబ్బందులు పెడుతున్నారని న్యాయమూర్తికి తెలిపారు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, అందులో తాను సంతకాలు చేయలేదని వివరించారు. కాగా, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి భాస్కర్రావు తీర్పు వెలువరించారు. -
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
తాడేపల్లి : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్సార్ సీపీ నుండి సస్పెండ్ చేస్తూ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే సస్పెండ్ చేసినట్టు సమాచారం. -
UPSC CSE 2024:: తెలుగు అభ్యర్థులకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 పరీక్షా ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. వారు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. మన రాష్ట్రానికి, దేశానికి గర్వంగా నిలవాలని ఆశిస్తున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Congratulations to all The Telugu Aspirants who have excelled in UPSC Civil Services 2024. Wishing you even greater success in the future and hoping you continue to bring pride to our state and nation.#UPSC— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025 -
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు , మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియా యాక్టివిస్టు మునగాల హరీశ్వర్ రెడ్డి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులోని ముఖ్యమైన అంశాలుపోలీసులు, మేజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారువీరిపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేర తగిన చర్యలు తీసుకోండిఏడేళ్లు లోపు శిక్ష పడే కేసుల్లో కూడా యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్నారుమేజిస్ట్రేట్లు తగిన కారణాలు కూడా వెల్లడించటం లేదుఇది అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను దిక్కరించడమేఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందితమ ఆదేశాల అమలను పర్యవేక్షించాలని కూడా హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పిందిలోపు భూయిష్ట ఉత్తర్వులను తమ దృష్టికి తీసుకువస్తే హైకోర్టు చర్యలు తీసుకుంటామందిఅందుకే ఏ ఏ కేసుల్లో నిబంధనలు పాటించలేదు మీ దృష్టికి తీసుకు వస్తున్నదీని ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవాలిహరీశ్వర్ రెడ్డి ఫిర్యాదును సీజేకు ఇస్తామన్న రిజస్ట్రీ -
విచారణకు వస్తానని చెప్పినా అరెస్ట్ చేశారు: కోర్టులో రాజ్ కేసిరెడ్డి
విజయవాడ తాను సిట్ విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని ఏసీబీ కోర్డులో రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు(మంగళవారం) రాజ్ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీనిలో భాగంగా రాజ్ కేసిరెడ్డిని న్యాయమూర్తి పలు ప్రశ్నలు అడిగారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేశారా? అని న్యాయమూర్తి అడగ్గా, కారు తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసీరెడ్డి తెలిపారు. తన ఇంటితో పాటు బంధువులు ఇళ్లల్లో,స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేశారని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతలో తల్లి దండ్రలను ఇబ్బందులు పెట్టారని తెలిపిన కేసిరెడ్డి.. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని కోర్టుకు తెలిపారు. -
‘ఆ విషయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?’
తాడేపల్లి : లిక్కర్ స్కామ్ ను వైఎస్సార్ సీపీ పై మీద వేసి తాము రాష్ట్రాన్ని దోచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎత్తుగడ వేశారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందే చంద్రబాబు హయాంలోనని, 2014 19లో లిక్కర్ స్కామ్ జరిగిందని సీఐడీ చంద్రబాబు మీద కేసు పెట్టిన విషయాన్ని టీజేఆర్ ప్రస్తావించారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ ఆ లిక్కర్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ 3గా ఉన్నారు. దాని గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?, టీడీపీ నేతలకు చెందిన డిస్టిలరీలకు అడ్డదిడ్డంగా కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందుకోసం ఎక్సైజ్ పాలసీనే చంద్రబాబు మార్చారు. ప్రభుత్వానికి రావాల్సిన రూ.2,984 కోట్లు తమవారి జేబుల్లోకి వేసుకున్నారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి నష్టం, టీటీడీ నేతలకు లాభం జరిగింది. ఆ స్కామ్ గురించి మాట్లాడటం లేదు. 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పట్నుంచి పోలింగ్ మధ్యలో అనేక డిస్టలరీలకు ఎందుకు అనుమతులు ఇచ్చారు?, క్యాబినెట్ కు తెలియకుండానే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. బార్లకు మేలు చేస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణం ఏమిటి?, వీటిన్నంటిపై విచారణ చేస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ కేసులో కీలకంగా ఉన్నాడంటూ వాసుదేవరెడ్డి మీద నాలుగు కేసులు పెట్టారు. కాగితాలపై సంతకాలు పెట్టించుకుని రిలీవ్ చేయటం వెనుక కారణం ఏంటి?, ఈ అక్రమ కేసులు పెట్టడం ద్వారా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లిక్కర్ పాలసీతో ఏం సంబంధం ఉంది?, చిత్తూరులో చంద్రబాబుకు ప్రత్యర్థిగా ఉన్నందున అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా?, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజంగా కేసిరెడ్డికి లిక్కర్ పాలసీ గురించి తెలిసి ఉంటే బేవరేజ్ కార్పోరేషన్ లో పదవి ఇచ్చేవాళ్లం కదా? , ఆయన ఐటీకి సంబంధించి సలహాదారుడు మాత్రమే. చంద్రబాబు, జగన్ హయాంలో లిక్కర్ పాలసీలపై చర్చకు మేము సిద్ధం. ప్రజలు పడుతున్న కష్టాలపై ఎల్లోమీడియా ఎందుకు చర్చలు పెట్టటం లేదు?పులివెందుల ఎమ్మెల్యే పదవిని రద్దు చేసి తిరిగి గెలిచే దమ్ముందా?, ఎన్నికలలో పోటీ చేసే సత్తా టీడీపీ కి ఉందా?, చంద్రబాబు సాధించిన ఘనత వైన్ షాపులు, పర్మిట్ రూములు పెట్టడమే. అధిక ధరలకు మదగయం అమ్ముతుంటే ఒక్క కేసు కూడా ఎక్సైజ్ శాఖ ఎందుకు నమోదు చేయలేదు? , విజయసాయిరెడ్డి ఎవరితోనో కమిట్ అయ్యారు. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు టీజేఆర్. -
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
విజయసాయిరెడ్డి చంద్రబాబు చేతిలోకి వెళ్లారు: అంబటి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ అవినీతి పాలన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.సూట్కేస్ కంపెనీ ఉర్సుకు విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో కోట్ల రూపాయల కమిషన్లు విలువైన పనులను కావాల్సిన వారికి కట్టబెట్టి కోట్లాధి రూపాయలు కమీషన్లుగా దండుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రజల్లో జరుగుతున్న చర్చ నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకే ఈ తాజా అరెస్ట్ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారని మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గాలకు చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే..తన అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తున్నారు. అరెస్ట్లకు ఎవరూ అతీతం కాదని చంద్రబాబు అంటున్నారు. తనకు నచ్చని వారిని ఎవరినైనా సరే అరెస్ట్ చేసేస్తాననే పద్దతిలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. తాజాగా ఐపీఎస్ ఆఫీసర్ పీఎస్ఆర్ ఆంజనేయులును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయన ఏపీలో అనేక చోట్ల పనిచేశారు. నీతీ, నిజాయితీ కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు.పదోన్నతులతో డీజీపీ స్థాయికి వచ్చారు. డీజీపీ కావాల్సిన అధికారిని ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక కేసులో ఆనాటి ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్లుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కూడా ఎదురు కేసులు నమోదు చేశారు. వారిద్దరూ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పీఎస్ఆర్ ఆంజనేయులు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకు వెళ్లలేదు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదు. ఈ రోజు హఠాత్తుగా ఆయనను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు సిద్దహస్తుడుఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేకపోతున్నాను, బడ్జెట్ చూస్తుంటే భయం వేస్తోందంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తూ చంద్రబాబు అబద్దాల కోరు అని జనం చర్చించుకుంటున్నారు. ఒక్క హమీని కూడా నెరవేచ్చని దుర్మార్గమైన పాలన సాగుతోంది. దీనిపై ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తాజాగా ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు. ఉర్సు అనే కంపెనీకి విశాఖలో మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని కేవలం 99 పైసలకు ఎకరం చొప్పున ఇచ్చేశారు. ఇది దోపిడీ కార్యక్రమం కాదా?ఇది ప్రజలు చర్చించుకోకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు, లిక్కర్ స్కాం అంటూ రాజ్ కసిరెడ్డిలను అరెస్ట్ చేసి, దానిపై పెద్ద హంగామా సృష్టిస్తున్నారు. మరోవైపు రాజధాని పేరుతో విపరీతంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువస్తున్నారు. ఆ సొమ్ముతో కాంట్రాక్ట్లకు ఇస్తూ, వారి నుంచి కమిషన్లు దండుకుంటున్నారు. ఈ పనులకు రెండో తేదీన అమరావతిలో రెండోసారి శంకుస్థాపనకు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. విపరీతమైన దోపిడీతో రాష్ట్రం సతమతమవుతోంది.లిక్కర్, ఇసుక, మట్టి పేరుతో ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, చంద్రబాబు, నారా లోకేష్లు విపరీతంగా దోచుకుంటూ, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేవలం పదకొండు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం దేశంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒక్కటే. ఏపీలో లిక్కర్ స్కాం అంటూ హడావుడి చేస్తున్నారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే, దానిలో కుంభకోణం ఎలా జరుగుతుంది. ఒక్క కొత్త డిస్టలరీకి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. గత ప్రభుత్వం కన్నా తక్కువ రేట్లకే మద్యం విక్రయించాం, బెల్ట్ షాప్లను తొలగించాం దీనికి ఎవరైనా లంచాలు ఇస్తారా? పర్మిట్ రూంలు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టలరీలకు అర్డర్లు ఇచ్చాం. దీనిలో ఏదో స్కాం జరిగిపోయిందంటూ చంద్రబాబు హంగామా చేస్తున్నారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారుకూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని తప్పుడు కేసులతో ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయా? చంద్రబాబే శాశ్వతంగా సీఎంగా ఉంటారా? సీఎంలు మారితే ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయవచ్చా? డీజీపీలుగా పనిచేసిన వారిని కూడా అరెస్ట్లు చేయవచ్చా? ఏమిటీ ఈ అన్యాయం? కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గాలపై న్యాయస్థానాలు వాతలు పెడుతున్నా వారికి బుద్ది రావడం లేదు. పోసాని కృష్ణమురళిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ పెట్టినందుకు సదరు విచారణాధికారిని కోర్ట్ ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.ప్రేమ్కుమార్ అనే వ్యక్తి మీద ఎక్స్ట్రార్షన్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే, కోర్టు దానిని తీవ్రంగా ఆక్షేపించింది. అవసరమైతే డీజీపీని కోర్ట్కు పిలుస్తామని కూడా హెచ్చరించాయి. కలకాలం చంద్రబాబే సీఎంగా ఉండరని గుర్తుంచుకోవాలి. పరిపాలన చేయలేక, కక్షసాధింపులతో పనిచేస్తున్నారు. కూటమి పార్టీలకు ఓటు వేసిన వారు సిగ్గుపడేలా పరిపాలన చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పాలన చేయాలనుకున్న వారు ఎవరూ మనజాలలేదు.గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పదకొండు మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇది కక్షసాధింపు చర్యలు కావా? నిజంగా పోలీసులు తప్పు చేశారని నిర్ధారిస్తే దీనికి బాధ్యత వహించి హోమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పోలీసులు ఆలోచించాలి. మీ తోటి అధికారులను కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులతో మీతోనే అరెస్ట్ చేయించింది. ఇదే పద్దతి కొనసాగితే రేపు ప్రభుత్వాలు మారితే మీమ్మల్ని కూడా అరెస్ట్ చేసేయవచ్చు కదా? ఈ సంప్రదాయం వల్ల ఎవరికి నష్టం జరుగుతోంది? ప్రతి ఐపీఎస్ అధికారి దీనిపై ఆలోచించుకోవాలి.అణిచివేస్తే భయపడతామా?గతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధి, జయలలిత, వైయస్ జగన్ వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులపై వారి ప్రభుత్వాలు వచ్చిన తరువాత ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? చంద్రబాబును అరెస్ట్ చేశారనే కక్షతోనే ఇలా అరెస్ట్లు చేసుకుంటూ పోతున్నారు. రేపు చంద్రబాబు, లోకేష్లు మాజీలు కాకుండా పోతారా? ప్రభుత్వాలు మారి, మీరు ప్రతిపక్షంలోకి రాకుండా పోతారా? ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేస్తారా?కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరింత బలంగా ఈ అక్రమాలపై పోరాడేందుకు ముందుకు వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారు. మూడున్నరేళ్ళ పదవీకాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారు. కూటమి కోసం తన పదవిని వదిలేశారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందీ? వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందీ? -
చంద్రబాబు.. మరీ ఇంతగానా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !జగన్ టైమ్లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.జగన్పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.జగన్ టైమ్లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ పీఏసీ మీటింగ్లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ చేస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులును అరెస్ట్ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్ అధికారుల పట ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. .. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. .. ఎంపీ మిథున్ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్ చేశారు. ఎలాగైనా మిథున్రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది. లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ తీసేశారు. మొబలైజేషన్ అడ్వాన్స్లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడంలేదు...రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?..ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్బుక్ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. ..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి...కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు...కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు...పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి. వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై కూటమి కక్ష సాధింపు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ముంబై నటి జత్వానిని ఆయన వేధించారనే అభియోగాల కింద సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నటి కాదంబరి జత్వానీ(Kadambari Jatwani) కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే బెయిల్ మీద ఉన్నాడు. మరోవైపు.. పలువురు పోలీసు ఉన్నతాధికారుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని విపరీతంగా ప్రయత్నించింది. కక్ష పూరితంగా కేసులు నమోదు చేయించగా.. హైకోర్టు ఆ ఇద్దరు అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పీఎస్ఆర్ను కక్ష పూరితంగా అరెస్ట్ చేయించింది. -
తిరగబడ్డ విద్యార్థి లోకం
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కూటమి ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు సోమవారం కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు రోడ్లపై ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం చేయగా.. విద్యార్థులు వాటిని దాటుకొని ముందుకు కదిలారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పినప్పటికీ.. విద్యార్థులు, నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వారిని పోలీసులు ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయానికి చేరుకున్న విద్యార్థులు అక్కడ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వినతిపత్రం ఇచ్చేందుకు సైతం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఓ విద్యార్థి చేతిని గేటు మధ్యలో పెట్టి లోపల ఉన్న పోలీసులు నొక్కడంతో.. ఆ విద్యార్థి బాధతో విలవిలలాడాడు. చివరకు తాడేపల్లి సీఐ కల్యాణ్రాజు ఐదుగురు నాయకులను లోపలకు అనుమతించారు.వారు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్కు వినతిపత్రం సమర్పించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధర్నాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పులగం సందీప్ రెడ్డి, కె.శివారెడ్డి, గోలి నరసింహ, గోపి కృష్ణ, వినోద్, కోమల్ సాయి, ఐ.శ్రీనివాస్, కొండల్ రావు, సందీప్, గోపీచంద్, నారాయణ, పూజిత్ తదితరులు పాల్గొన్నారు. -
ఆది ఆగడం!
సాక్షి ప్రతినిధి, కడప: అల్ట్రా టెక్ సిమెంట్ పరిశ్రమకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వేధింపులు తప్పడం లేదు. ఎమ్మెల్యే తన చర్యలను సమర్థించుకుంటూనే అనుచరగణాన్ని రెచ్చగొట్టి సిమెంట్ పరిశ్రమపై ఫిర్యాదు చేయించడమే కాకుండా అధికారులను ఉసిగొల్పి ముడిఖనిజం సరఫరా టిప్పర్లను సీజ్ చేయించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎర్రగుంట్ల సీఐ నరేశ్బాబు అల్ట్రా టెక్ పరిశ్రమకు ముడిఖనిజం సరఫరా చేసే ఐదు టిప్పర్లను అధిక లోడు పేరిట సోమవారం సీజ్ చేశారు.దీంతో ట్రాన్స్పోర్టర్ సిమెంట్ పరిశ్రమకు ముడి ఖనిజం సరఫరా నిలిపేశారు. ఆపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రధాన అనుచరుడు, మండల బీజేపీ ఇన్చార్జి మధుసూదనరెడ్డి సతీమణి పేరిట నిర్వహిస్తున్న ప్యాకింగ్ ప్లాంట్ పనులు నిలిపేశారు. యాజమాన్యంతో నిమిత్తం లేకుండా 40 మంది కార్మికులను పనుల నుంచి వెనక్కి పిలిపించారు. దీంతో సిమెంట్ సరఫరా చేసే ట్రాన్స్పోర్టు లారీలు ఆగిపోగా.. సిమెంట్ ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. 40 ఏళ్లలో తొలిసారి టిప్పర్లు సీజ్ 40 ఏళ్లలో సిమెంట్ పరిశ్రమలకు ముడి ఖనిజం సరఫరా చేసే టిప్పర్లు అధిక లోడుతో వెళ్తున్నాయన్న ఆరోపణలు కూడా లేవు. గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన సీఐ సోమవారం హఠాత్తుగా ఐదు టిప్పర్లను సీజ్ చేశారు. దీనివెనుక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఉన్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్యాకింగ్ ప్లాంట్ నిలిపేయడం పరిశ్రమ యాజమాన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టడమేనని పలువురు విమర్శిస్తున్నారు.చేతులెత్తేసిన కలెక్టర్ అల్ట్రా టెక్ పరిశ్రమలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కాలుష్య నియంత్రణ సక్రమంగా లేదని, చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేదనే వంకతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరుల ద్వారా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో 89 శాతం మంది ఉద్యోగులు స్థానికులే ఉన్నారని సమాచారం. మరోవైపు నష్టాల్లో ఉండటంతో ఈ పరిశ్రమను ఐసీఎల్ యాజమాన్యం అల్ట్రా టెక్ సంస్థకు అప్పజెప్పింది. కాలుష్య నియంత్రణ సక్రమంగా పాటిస్తున్నామని పరిశ్రమ ప్రతినిధులు వివరిస్తున్నా కలెక్టర్ శ్రీధర్ నుంచి స్పందన లేదు. తానేమీ చేయలేనంటూ చేతులెత్తిసినట్లు సమాచారం. క్షమాపణ చెప్పకుంటే నీ దందాలు బయటపెడతా టీడీపీ అధ్యక్షుడు పల్లాకు తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్ హెచ్చరిక ఎంవీపీకాలనీ(విశాఖపట్నం): తనను బహిరంగంగా దూషించడంతోపాటు అవమానానికి గురిచేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఆయన దందాలను, సెటిల్మెంట్లను బయటపెతానని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ సమస్య విషయమై ఇటీవల పల్లా శ్రీనివాస్ను కలవడానికి వెళ్లగా వ్యక్తిగతంగా తనను అవమానపరిచినట్లు బీవీ రామ్ పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ కోసం విశేషకృషి చేసిన తననే అవమానిస్తే మిగతా నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై పలువురు టీడీపీ ముఖ్యనాయకులతోపాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనెల 29లోపు పల్లా శ్రీనివాస్ క్షమాపణలు చెప్పకపోతే అధికార మదంతో విర్రవీగుతున్న అతడి భూదందాలు, సెటిల్మెంట్లు ఇతర అక్రమాలను బయట పెడతానని స్పష్టం చేశారు. -
మద్యం మసి పూసి.. సిట్ పోలీసుల ‘కసి’
సాక్షి, అమరావతి: అక్రమ కేసులు నమోదు చేయడం..లేని ఆధారాలు సృష్టించేందుకు బెదిరింపులు, వేధింపులకు పాల్పడడమే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు. ఇందులోభాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ పన్నాగం పరాకాష్టకు చేరింది. ఈ అక్రమ కేసులో సాక్షిగా విచారణకు పిలిచిన రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు సోమవారం హైదరాబాద్లో అరెస్టు చేయడమే దీనికి తాజా నిదర్శనం. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పిన ఆయనను హడావుడిగా అరెస్టు చేయడం వెనుక పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాజ్ కసిరెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణకు హాజరవుతానని చెప్పినా వినిపించుకోకుండా తమ వాహనంలోకి ఎక్కించి విజయవాడకు తరలించారు. ఓ వైపు న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం అయినప్పటికీ సిట్ అధికారుల రాజ్ కసిరెడ్డిని హడావుడిగా అరెస్టు చేయడం వెనుక అసలు పన్నాగం ఇలా ఉంది. విచారణకు వస్తానంటే అరెస్టు ఏమిటో...? రెడ్బుక్ కక్ష సాధింపే తప్ప మరొకటి తమ ఉద్దేశం కాదని చంద్రబాబు ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డిని సోమవారం హడావుడిగా అరెస్టు చేసిన తీరే అందుకు నిదర్శనం. మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానని ఆయన సోమవారం మధ్యాహ్నం ఆడియో సందేశం విడుదల చేశారు. అయినా సోమవారం సాయంత్రం హడావుడిగా హైదరాబాద్లో అరెస్టు చేయల్సిన అవసరం ఏమిటి? అంటే ఆయనను విచారించడం.. వాస్తవాలు తెలుసుకోవడం తమ లక్ష్యం కాదని సిట్ తన చేతల ద్వారా వెల్లడించింది. అరెస్టు చేసి వేధించి.. ప్రభుత్వ రెడ్బుక్ కుట్రకు అనుకూలంగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే తమ అసలు కుట్ర అని తేల్చిచెప్పింది. రాజ్ కసిరెడ్డి విషయంలో సిట్ మొదటి నుంచీ అదే కుతంత్రంతో వ్యవహరిస్తోంది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కుటంబ సభ్యులకు నోటీసులు అందించారు. తనను ఏ విషయంలో విచారించాలని భావిస్తున్నారో తెలియజేస్తే తగిన సమాచారంతో వస్తానని ఆయన సిట్ అధికారులకు ఈ–మెయిల్ ద్వారా తెలిపారు. కానీ, ఆయన అడిగిన సమాచారం ఇవ్వకుండా వెంటనే మరోసారి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపడం గమనార్హం. దాంతో రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు నిర్ణయం అనంతరం విచారణకు స్వయంగా వస్తానని.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రెండు రోజుల క్రితం ఓ ఆడియో సందేశం పంపించారు. ఇంతలో న్యాయ ప్రక్రియకు కాస్త సమయం పడుతుండటంతో ఇక తానే మంగళవారం విచారణకు వచ్చి పూర్తిగా సహకరిస్తానని సోమవారం తెలిపారు. అంటే మంగళవారం ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వస్తారని తెలుసు. మరి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్లో సోమవారమే అరెస్టు చేయల్సిన అవసరం ఏమొచ్చింది? న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశం ఈ అంశం ప్రసుతం న్యాయస్థానం పరిధిలో ఉంది కూడా. తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు ప్రస్తుతం ఆయా న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. మరోవైపు విచారణకు హాజరవుతాను.. దర్యాప్తునకు సహకరిస్తానని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అయినా సరే అరెస్టు చేయడం గమనార్హం. దీని వెనుక పోలీసుల పక్కా కుట్ర ఉందన్నది సుస్పష్టం బెదిరించి లొంగదీసుకునేందకునా..! ఇప్పటికే కుటంబు సభ్యులను తీవ్రంగా వేధించిన సిట్ రెడ్బుక్ కుట్రకు అనుకూలంగా రాజ్ కసిరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించడమే సిట్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆయనను హడావుడిగా అరెస్టు చేసింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో సోమవారం అర్ధరాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చారు. సిట్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజాము వరకు ఆయనను బెదిరించి పూర్తిగా తమకు అనుకూలంగా లొంగదీసుకోవడమే సిట్ ప్రస్తుత లక్ష్యం. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్రంగా వేధించి బెంబేలెత్తించారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు సమీప బంధువులను కూడా బెదిరించి వేధించారు. ఆయన సన్నిహితుడు, ఎరేట్ హాస్పిటల్స్ అధినేత విజేయంద్రరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు. ఈ విధంగా రాజ్ కసిరెడ్డి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు అందరినీ లక్ష్యంగా చేసుకుని పోలీసులు తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి పైనే పూర్తి స్థాయిలో పోలీసు మార్క్ ప్రతాపం చూపించనున్నారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయనను బెదిరిస్తున్నట్టు సమచారం. మొదటినుంచీ సిట్ తీరు అంతే.. అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ మొదటి నుంచి కూడా దండనీతినే నమ్ముకుంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను తీవ్రస్థాయిలో వేధించి సాధించింది. సిట్ అధికారుల బెదిరింపులపై ఆయన మూడు సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే సిట్ తీరు మాత్రం మారలేదు. వాసుదేవరెడ్డిని మూడు రోజుల పాటు గుర్తు తెలియని ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించి మరీ వేధించింది. తద్వారా తాము చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేలా ఒప్పించింది. వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, చిరుద్యోగి అనూషను కూడా సిట్ అధికారులు వేధించి బెదిరించి వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. ఇక విజయ సాయిరెడ్డి ఎంపీగా మరో మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా సరే కేవలం టీడీపీకి కూటమికి రాజ్యసభలో ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారు. ఉప ఎన్నిక నిర్వహిస్తే ఆ సీటు గెలుచుకునేందుకు వైఎస్సార్సీపీకి తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదని తెలిసినా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం కేవలం చంద్రబాబు కుట్రలో భాగమే. అసలు ఎలాంటి కుంభకోణం జరగనే లేదని విజయసాయిరెడ్డే సిట్ విచారణ అనంతరం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా సరే అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి సిట్ అధికారులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతూ అధికారికంగా గూండాగిరీకి తెగిస్తున్నారు. కుట్రతోనే వక్రీకరణ ప్రైవేట్ కంపెనీల వ్యవహారంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎలాంటి అవినీతి లేని ఈ వ్యవహారంలో నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ కొత్త కొత్త కట్టుకథలను తెరపైకి తెస్తోంది. అదాన్ డిస్టిలరీల ఏర్పాటుకు రూ.100 కోట్ల అప్పు ఇప్పించడం అంటూ వినిపించిన కథ తాజా వక్రీకరణ. తన అల్లుడు కుటుంబానికి చెందిన అరబిందో కంపెనీ అదాన్ డిస్టిలరీ ఏర్పాటునకు రూ.100 కోట్లు అప్పు ఇచ్చిందని విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే అరబిందో కంపెనీ అప్పు ఇచ్చింది. అదాన్ డిస్టిలరీస్ తీసుకుంది. అది రెండు కంపెనీల మధ్య వ్యవహారం. దేశంలో ఎన్నో ప్రైవేటు కంపెనీల మధ్య అప్పులు ఇచ్చి పుచ్చుకోవడం సర్వసాధారణం. దానిపై ఆ రెండు కంపెనీల్లో ఎవరూ కూడా ఫిర్యాదు చేయనే లేదు. మరి ఆ వ్యవహారానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ? ఆ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ ఈ కేసుకు ముడిపెట్టాలని యత్నించడం హాస్యాస్పదంగా ఉంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే.. దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మరి మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి..? ఇవ్వవనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. అసలు లేని కుంభకోణంపై అక్రమ కేసు నమోదు చేసి రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతుండడం గమనార్హం. ఆయన కేవలం కొంత కాలం అదీ కోవిడ్ వ్యాప్తి ఉన్న రోజుల్లో పరిశ్రమల శాఖ సలహాదారుగా మాత్రమే వ్యవహరించారు. ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. రాజ్ కసిరెడ్డికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానానికి ఎలాంటి సంబంధమే లేదు. -
చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? – హైకోర్టుసాక్షి, అమరావతి: రెడ్బుక్ అరాచకాలకు కొమ్ము కాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏదీ ముఖ్యం కాదని, ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదని మండిపడింది. ‘‘పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారినే మా ముందుకు రమ్మనండి.. చట్టం ఏం చెబుతుందో ఆయన్ను అడిగి తెలుసుకుంటాం. సిట్లోని అధికారులు వారికి వారు చాలా పెద్దవాళ్లం.. శక్తిమంతులం అని అనుకుంటున్నారు. శక్తిమంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. చట్టం అవసరం లేదు.. అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫాం ఉంది కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. సిట్ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వారిని తీసుకొచ్చేస్తారా? పోలీసుల వ్యవహారశైలి అత్యంత దురదృష్టకరం’’ అని సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా ఓ వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెబుతుందో మీకు తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆయన్ను సిట్ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకు ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబుని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావుల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ దర్యాప్తు అధికారిపై నిప్పులు.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరు, పోలీసుల దుర్మార్గ పోకడను తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్యంరెడ్డి హైకోర్టుకు పూసగుచి్చనట్లు నివేదించారు. కేసు ఏమిటి? నేరం ఏమిటి? అనే విషయాలను చెప్పకుండా తనను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడకు ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వ్యవహరించారని హైకోర్టుకు మొర పెట్టుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్యకు కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాథేయపడినా వినకుండా బలవంతంగా తరలించారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్లు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ముఖ్యంగా దర్యాప్తు అధికారి (ఐవో) విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తనను తీవ్ర భయభాంత్రులకు గురి చేశారన్నారు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వచ్చి తన వెంటపడతారోనని భయంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సిట్ దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు చెరిగింది. ‘అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్యంరెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. ఆయన ఏ కేసులోనూ నిందితుడు కారు. అలాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్లు? అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి.. ఏం చేయాలో మాకు బాగా తెలుసు...’ అని న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్సార్సీపీ నేత మేకా వెంకటరామిరెడ్డి గత వారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలను నివేదించారు. ‘పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్ వద్దకు తరలించి నా మొబైల్ లాక్కున్నారు. సిట్ అదనపు ఎస్పీ నన్ను దూషించారు. బంధించి హింసలు పెట్టారు. ముందు రోజే నోటీసులు ఇచి్చనట్లు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు..’ అని కోర్టుకు విన్నవించారు.ఆటిట్యూడ్ చూపితే ఏం చేయాలో తెలుసు...బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) పేర్కొనటంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాది నుంచి తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, ఆ అఫిడవిట్కు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి ఆటిట్యూడ్ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలుసునంది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులెవరని ప్రశ్నించగా ఎస్జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండి ఎవరు చెబుతున్నారో వారిని ముందుకు రమ్మనండని, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్యంరెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామంది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ స్పందిస్తూ, బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారిని వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని, చట్ట నిబంధనలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. 18-12-2024..మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు..‘సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద దర్యాప్తు అధికారి కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు చూపలేదు. అయినా కింది కోర్టు మెజిస్ట్రేట్ ఆధారాలున్నాయనడం తప్పు. మెజిస్ట్రేట్ మెదడు ఉపయోగించకుండా, యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులిచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల్లో అరెస్ట్కు గల కారణాలను చెప్పలేదు..’ – సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తన కుమారుడు వెంకట రమణారెడ్డికి వినుకొండ కోర్టు విధించిన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ పప్పుల చెలమారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.06-01-2025కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా..?‘సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రరెడ్డి నిర్బంధానికి సంబంధించి మేం అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వాలి. రవీంద్రరెడ్డిని ఎప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నారు? ఎప్పుడు అరెస్ట్ చూపారు? ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారా..? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కావాలి. ఈ కేసులో పోలీసులు మొదటి నుంచి మా ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. కోర్టులకన్నా ఎక్కువ అనుకుంటున్నారా? కడప ఎస్పీ తీరు చూస్తుంటే అలాగే ఉంది. ఆరోపణలు నిజమని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..!’ – వర్రా రవీంద్రరెడ్డి అక్రమ నిర్బంధంపై ఆయన భార్య కళ్యాణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు18-02-2025..లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు?‘వ్యక్తులపై కేసులు పెట్టడం.. వారిని కొట్టడం.. లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టి లోపల వేయడం మినహా ఏ కేసులోనూ దర్యాప్తు చేయడం లేదు. కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇలాంటి తీరును సహించేది లేదు. బొసా రమణ అనే వ్యక్తి అరెస్ట్ విషయంలో దర్యాప్తు చేసి ఉంటే ఆ వివరాలను మా ముందు ఉంచేవారు. దర్యాప్తు చేయలేదు కాబట్టే ఏ వివరాలను సమర్పించలేదు. అతడిపై 27 కేసులున్నాయని చెబుతున్నారు. కానీ ఆ కేసుల దర్యాప్తు వివరాలను మా ముందు ఉంచడంలేదు. మా ఆదేశాలపై డీజీపీ ఏ చర్యలు తీసుకున్నారు..?’ – విశాఖకు చెందిన బొసా రమణ అరెస్టుపై ఆయన భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు25-02-2025పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు..‘పోలీసులు వాస్తవాలను దాచి పెడుతూ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. బొసా రమణ అరెస్టు విషయంలో డీజీపీ నివేదిక ఇస్తారని ఆశించాం. కానీ ఎలాంటి నివేదిక రాలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని డీజీపీని నివేదిక కోరాం. డీజీపీ పోస్టుపై ఉన్న గౌరవంతో వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వలేదు. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామని డీజీపీ భావిస్తే అలాగే ఆదేశాలు ఇస్తాం. రమణ అరెస్టు విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి...’ – బొసా రమణ భార్య దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యలు.11-03-2025‘పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం..‘పౌరుల స్వేచ్ఛను హరిస్తామంటే ఊరుకోం. ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? తాము చట్టం కంటే ఎక్కువని పోలీసులు భావిస్తున్నారు. చిన్న తప్పులేనని వదిలేస్తే.. రేపు కోర్టులకు వచ్చి మరీ అరెస్టు చేస్తారు. ప్రతి దశలోనూ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారు..’– సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్రెడ్డికి కింది కోర్టు విధించిన రిమాండ్ చట్ట విరుద్ధమని కొట్టివేసిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు25-03-2025హద్దు మీరొద్దు ‘తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతోంది. – మాదిగ మహాసేన అధ్యక్షుడు ప్రేమ్కుమార్ అరెస్ట్పై హైకోర్టు వ్యాఖ్యలు10-04-2025ఇది ధిక్కారమే... హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్కే లేకుండా పోయింది. సెక్షన్ 111ను ఎప్పుడు, ఎలాంటి సందర్భాల్లో వాడాలో స్పష్టంగా చెప్పాం. అయినా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు చేయడమంటే మా ఆదేశాలను ధిక్కరిస్తున్నట్లే. ఎప్పుడో నమోదు చేసిన కేసులో మీ ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు అదనపు సెక్షన్లు ఎలా చేరుస్తారు? అంటే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నట్లు కాదా?’ – పోసాని కృష్ణ మురళిపై కేసు విచారణలో హైకోర్టు న్యాయమూర్తి -
కూటమి పాలనలో దళితులపై పెచ్చరిల్లుతున్న దాడులు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో దళితులపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లుతున్నాయని దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ఆత్మగౌరవం నిలబడాలంటే వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు.కూటమి పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను అంటరాని వారిగా చూస్తున్నారని చెప్పారు. అణగారిన వర్గాలకు పూర్తిగా న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్దేనన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదుగురు దళితులకు క్యాబినెట్లో చోటు కలి్పంచిన ఘనత జగన్ది అన్నారు. మాల, మాదిగలు కలిసే ఉన్నారు రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ మాల, మాదిగలు విడిపోయారని కూటమి నేతలు పగటి కలలు కంటున్నారని, కాని కలిసే ఉన్నారని చెప్పారు. ఇకపై మాల, మాదిగలు కలిసి వైఎస్ జగన్ నేతృత్వంలో పేదల ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణంలో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన పద్ధతులపై ప్రసంగించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. జగనన్న అణగారిన వర్గాలకు అండగా ఉంటే.. చంద్రబాబు మాత్రం అణగదొక్కుతున్నారన్నారు.మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళితులకు దక్కిన గౌరవాన్ని జీరి్ణంచుకోలేక కూటమి పార్టీలు అసత్య ప్రచారం చేశాయని, దళితులకు అత్యున్నత గౌరవం ఇచ్చిన వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందామన్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరూ మరిచిపోరన్నారు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై దళిత నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, తలారి వెంకట్రావు, కిలివేటి సంజీవయ్య, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, కైలే అనిల్కుమార్, అలజంగి జోగారావు, పార్టీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్రావు మాట్లాడారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. జనం మధ్య ఉందాం: సజ్జల సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సమాజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే విధంగా వైఎస్ జగన్ పాలన చేశారని గుర్తు చేశారు. కలలు కనడం కాదని, వాటిని ఆచరణలోకి తీసుకురావాలని ఒక్క జగన్ మాత్రమే భావించారని, అసమానతలు ఉన్న సమాజాన్ని ఐదేళ్లలో సమాన స్థాయికి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్సీపీ పేదల పక్షమని గుండెమీద చెయి వేసుకుని చెప్పగలిగిన ధైర్యాన్ని అందరికీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకోవడం, సంస్థాగతంగా బలోపేతం అవడంపై దృష్టి పెడదామని పిలుపునిచ్చారు. -
ఉర్సాకు భూకేటాయింపులపై నిరసన
సాక్షి, అమరావతి/మధురవాడ(విశాఖ): ఊరూపేరూ లేని, కనీసం అడ్రస్ కూడా లేని ఉర్సా(Ursa) క్లస్టర్స్ అనే ఉత్తుత్తి కంపెనీకి విశాఖ ఐటీ సెజ్ మధురవాడ హిల్–3లో రూ.3 వేల కోట్ల విలువైన భూములు కేటాయించడంపై వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. ఈ భూకేటాయింపులను రద్దు చేయకపోతే తీవ్ర నిరసన తప్పదని హెచ్చరించాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.లేకపోతే విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల అధ్వర్యంలో ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించాయి. ఉర్సాకు కేటాయించిన భూముల్లో బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఖబడ్దార్ లోకేశ్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ప్రభుత్వ భూములను రక్షించాలంటూ నేతలు నినదించారు. భూముల ధారాదత్తం ఆపాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఊరూపేరూ లేని ఉర్సా క్లస్టర్స్కు కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలి. ఐటీలో ఎలాంటి అనుభవం, చరిత్ర లేని, నిన్నమొన్న ప్రారంభించిన కంపెనీకి ఉచితంగా 60 ఎకరాలు ఎలా కట్టబెడతారు? డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు భూ కేటాయింపు తగదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కేటాయించడం తగదు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడం సరికాదు. రెండు నెలల క్రితం హైదరాబాద్లో ఉత్పత్తి కంపెనీగా రిజిస్టరైన ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఒక ఐటీ కంపెనీకి ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు రూ.3వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని కేవలం 99పైసలకే కట్టబెట్టడం తీవ్ర ఆక్షేపణీయం. రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమమే.. జన జాగరణ సమితి రాష్ట్ర కన్వినర్ ఎస్ఎల్ఎన్ వాసు ఉర్సాకు కేటాయించిన విలువైన భూములు వెంటనే రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. రూ.3 వేల కోట్లు విలువ చేసే 60 ఎకరాల భూమిని మంత్రి లోకేశ్ ఉత్తుత్తి కంపెనీకి ఎలా కట్టబెట్టే యత్నం చేస్తారు? ఇప్పటికే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కబ్జాకోరు అనే పేరుంది. ఆయన రికార్డును మంత్రి లోకేశ్ తిరగరాయాలని చూస్తున్నట్లుంది.ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఎంత వరకైనా వెళ్లడానికి మాతోపాటు ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఉర్సా కంపెనీని రెండు నెలల క్రితమే ఏర్పాటు చేశారు. దీనికి కనీసం అడ్రస్, ఫోన్ నంబర్ కూడా లేవు. ఎక్కడా ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటి కంపెనీకి ఇంత విలువైన భూములు ఎలా ఇచ్చేస్తారు? విశాఖ వాసులు హర్షించరు టీసీఎస్కి 21 ఎకరాలు ఇచ్చినట్టు చూపించి దాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఉత్తుత్తి కంపెనీకి రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కారు చౌకగా ఇచ్చేస్తోంది. ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకునే ఎత్తుగడగా దీనిని మేం చూస్తున్నాం. ఇలా పంచుకుంటూ పోతే విశాఖలో భూములు మిగలవు. దీన్ని విశాఖ వాసులు హర్షించరు. ప్రభుత్వ పాలన ముగిసేలోపు మొత్తం ఖాళీ చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. – చింతపల్లి సునీల్కుమార్, విశాఖ నగర కన్వినర్99 పైసలకే మొత్తం 21.16 ఎకరాలు విశాఖ ఐటీ హిల్ నంబర్–3లో టీసీఎస్కు భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ సాక్షి, అమరావతి: టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్)కు విశాఖపట్నంలోని ఐటీ హిల్ నంబర్–3లో 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని భూమి కేటాయించాలని సూచిస్తూ ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐదారేళ్లలో క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి 20 నుంచి 25 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని టీసీఎస్ కోరింది.కారు చౌకగా భూములు కేటాయించమని అడగకపోయినా ఐటీ కంపెనీల ఆకర్షణ పేరుతో మొత్తం 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకే ప్రభుత్వం అప్పగించేసింది. ఏకంగా మొత్తం అన్ని ఎకరాలు 99 పైసలకే అంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో సామాజిక మాధ్యమాల్లో మరోమారు టీసీఎస్కు భూ కేటాయింపులు పెద్ద చర్చకు దారితీశాయి.టీసీఎస్ ముసుగులో వేరే ఇతర అనామక కంపెనీలకు కారుచౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడా టీసీఎస్ భూములను ఉచితంగా ఇవ్వమని అడిగిన దాఖలాలు లేవని, ప్రభుత్వం నిర్ణయంతో ఇప్పుడు టీసీఎస్ బ్రాండ్పై కూడా నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని అంటున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. -
Andhra Pradesh: రేపు పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటరీ్మడియెట్ ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్సైట్లతోపాటు ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్ఈఏపీ) మొబైల్ యాప్లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ద్యార్థులు వాట్సాప్లో 9552300009 నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, విద్యార్థి హాల్టికెట్ నంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. అలాగే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. లీప్ మొబైల్ యాప్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్టు తెలిపారు. -
55 మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు షోకాజ్ నోటీసులు
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ ఫలితాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు వేధింపులు మొదలయ్యాయి. మొత్తం 55 ఏపీ మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లతోపాటు వాటిలో పనిచేస్తున్న టీచర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలో 164 ఏపీ మోడల్ స్కూళ్లు ఉండగా, 163 స్కూళ్లల్లో ఇంటర్మిడియెట్ ఉంది.ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 75 శాతం కాగా, 55 మోడల్ సూళ్లలో దానికన్నా తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ‘ప్రిన్సిపాళ్లు, సబ్జెక్ట్ టీచర్లకు విద్యా సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినా 55 పాఠశాలలు 75 శాతం కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం సాధించడం ఏమిటి? దీనిపై మూడు రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. అలాగే, తదుపరి తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలి..’ అని సోమవారం ఉన్నతాధికారులు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, టీచర్లకు నోటీసులు పంపించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఫలితాలు మెరుగుపరిచేందుకు ఏపీ మోడల్ సూళ్లలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలోనే వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయడంపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. భయాందోళనలకు గురిచేయొద్దు: ఏపీటీఎఫ్ అమరావతి సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను భయాందోళనలకు గురి చేయవద్దని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ విద్యాశాఖను కోరారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటానికి గల కారణాలను విశ్లేషి చాలని ఆయన సూచించారు. -
3 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలుంటాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు ప్రకటించారు. హాల్టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.సొంతంగా సహాయకులను ఎంపిక చేసుకున్న దివ్యాంగులు స్క్రైబ్ వివరాలు, సర్టీఫికెట్లను పరీక్షలు ప్రారంభానికి 5 రోజుల ముందే ఈమెయిల్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. -
మహిళామణులు
తరాలు మారాయి. అంతరాలు పోతున్నాయి. ఒకప్పుడు మహిళలంటే.. వంటింటికే పరిమితమని.. నాయకత్వ బాధ్యతలకు పనికిరారని ఉండేవన్నీ అపోహలే అని తేలిపోతోంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే.. ముద్దార నేర్పించినన్..’ అన్నది రుజువవుతోంది. పదుగురికీ ఉపాధి కల్పించే సంస్థల్లో నాయకత్వ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఒకరు ఇద్దరుగా.. ఇద్దరు నలుగురిగా.. మొదలైన మహిళల ప్రస్థానం నేడు అక్షరాలా లక్షల్లోకి చేరింది. సాక్షి,అమరావతి: దేశంలో అన్ని రంగాల్లోని కంపెనీల్లో మహిళల విశిష్ట పాత్ర పెరుగుతోంది. కంపెనీల్లో మేనేజర్ నుంచి కంపెనీ డైరెక్టర్లు, అత్యున్నత స్థాయిలోనూ రాణిస్తున్నారు. 2017 నుంచి 2025 వరకు దేశంలోని కంపెనీల కీలక స్థానాల్లో మహిళల పాత్ర పెరుగుదలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విశ్లేíÙంచింది. ‘మహిళలు–పురుషులు–2024’ నివేదికలో ఆ వివరాలు వెల్లడించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల పదవుల్లో 2017లో 4.47 లక్షల మంది మహిళలుండగా, 2025 నాటికి ఈ సంఖ్య 9.08 లక్షలకు పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది.సీనియర్ మేనేజ్మెంట్ పదవుల్లో 2017లో 23 వేల మంది మహిళలుండగా 2025 నాటికి 38 వేలకు పెరిగారు. ఇతర నిర్వహణ పదవుల్లో 2017లో 4.32 లక్షల మంది మహిళలుండగా 2025 నాటికి 8.83 లక్షలకు పెరిగారు. ఇతర సీనియర్ నిర్వహణ పదవుల్లో పురుషులు, మహిళల నిష్పత్తి 2017లో 1:0.36 ఉండగా 2025 నాటికి 0.41కి పెరిగింది. బోర్డు డైరెక్టర్ల పదవుల్లో మహిళల నిష్పత్తి 0.35 నుంచి 0.40కి పెరిగింది. ఈ పదవుల్లో మహిళల నిష్పత్తి 0.16 నుంచి 0.20 మాత్రమే పెరిగింది. ఇక్కడ లింగ అంతరాలను మరింత తగ్గించాల్సి ఉందని నివేదిక పేర్కొంది.ఈ ఎంఎస్ఎంఈలకు మహిళలే మహారాణులుదేశంలోని ఎంఎస్ఎంఈల్లో ‘ఉద్యమ్’ పోర్టల్లో నమోదైన వాటిలో 2020 జులై 1 నుంచి 2024 సెప్టెంబరు 31 నాటికి.. మహిళలు యజమానులుగా ఉన్నవి 66,61,675. వీటిలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 4.05 కోట్లకుపైనే. మహిళా శక్తికి ఇదొక నిదర్శనం. ఈ ఎంఎస్ఎంఈల్లో 25 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న రాష్ట్రాలు 7 మాత్రమే. అందులో దక్షిణాది రాష్ట్రాలే 4 ఉండటం విశేషం. -
ఏపీలో టెన్త్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్
అమరావతి: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి(బుధవారం) పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది ఏపీ ఎస్ఎస్సీ బోర్డు. బుధవారం ఉదయం గం. 10ల.కు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీనే పలితాలను విడుదల చేసే అవకాశం ఉందని భావించారు. కానీ దాన్ని ఒకరోజు వెనక్కి పొడిగించారు. రంజాన్ సందర్భంగా టెన్త్ క్లాస్ చివరి పరీక్షను ఒక రోజు వెనక్కి జరపిన కారణంగా ఫలితాల విడుదలను కూడా రోజు వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పరీక్షలు జరిగాయి. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. -
‘కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణ కరువైంది’
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ అనేది కరువైందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు చనిపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు.. ‘హిందూధర్మంపై నిత్యం దాడి జరుగుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే తిరుమల లడ్డూ గురించి విషప్రచారం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజు సరైన ఏర్పాట్లు చేయకుండా ఆరుగురు భక్తుల మరణానికి కారకులయ్యారు. కాశీనాయన దివ్యక్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రాలను నిలువునా కూల్చేశారు. ఇప్పుడు శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయితాబేళ్ల సంరక్షనే కాదు, పార్కు నిర్వహణను కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మా హయాంలో ఏ పొరపాట్లు జరగకపోయినా ఏదో జరిగినట్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు హైందవ ధర్మం మీద దాడి జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు?, కాశీనాయన క్షేత్రంలో అధికారులే వెళ్లి నిర్మాణాలను కూల్చేస్తే ఎందుకు మాట్లాడలేదు?, శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోంది?రెండు వందల తాబేళ్ల పరిరక్షణ కూడా ప్రభుత్వానికి పట్టదా? , మా హయాంలో ప్రతి తాబేలుకూ నెంబర్ ఇచ్చి వాటి పరిరక్షణ చూశాం. కానీ ఈ ప్రభుత్వం తాబేళ్లకు ఎలాంటి పోస్టుమార్టం చేయకుండా ఎలా దహనం చేస్తారు?, అసలు రాష్ట్రంలో హిందూ ధర్మం ఏమవుతోంది? , వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. శ్రీకూర్మం ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు -
పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి
తాడేపల్లి : క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూయడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ‘పోప్ మృతి చాలా బాధాకరం. కాథలిక్ చర్చి సమాజానికి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన లాటిన్ అమెరికా నుండి వచ్చిన మొదటి పోప్. శాంతి, కరుణ కోసం ప్రపంచ వ్యాప్త గొంతుకగా నిలిచిన నిజమైన మానవతావాది. పోప్ ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. Saddened by the passing of Pope Francis. A transformative and influential head of the Catholic Church — the first Pope from the Latin Americas. A true humanitarian and global voice for peace and compassion. His humility and humanity touched the world.May his soul rest in eternal…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2025 కాగా క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు.ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. -
రేపు సిట్ విచారణకు హాజరవుతా: రాజ్ కేసిరెడ్డి
అమరావతి: తాను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నట్లు రాజ్ కేసిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం గం. 12:00ల,కు సిట్ ఆఫీసుకు వస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. ఈ విషయాన్ని ఆడియో ద్వారా తెలిపారు. ఇక తన ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుజేత సిట్ విచారణకు హజరవుతున్నట్లు పేర్కొన్నారు.రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి. -
2024లో భారీగా పెరిగిన వడగాడ్పులు
సాక్షి, అమరావతి: దేశంలో గతేడాది వడగాడ్పుల రోజుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 2024లో 554 వేడి రోజులు నమోదైనట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ గర్భ శాస్త్రాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో దేశంలో 467 వేడి గాలుల రోజులు నమోదుకాగా 2023లో 230 నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2023లో రాయలసీమలో ఒక్కరోజు మాత్రమే వేడి గాలులు నమోదుకాగా, 2024లో 16 రోజులు నమోదైనట్లు పేర్కొంది. తెలంగాణలో 2023లో 14 రోజులు, 2024లో 12 రోజులు వేడి గాలులు నమోదైనట్లు పేర్కొంది. గతేడాది అత్యధికంగా ఒడిశాలో 37 రోజులు, తూర్పు ఉత్తరప్రదేశ్లో 33 రోజులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో 32 రోజులు, బిహార్లో 30 రోజులు, పశ్చిమ రాజస్థాన్లో 29 రోజులు వేడి గాలులు నమోదైనట్లు తెలిపింది. వేడి గాలుల ప్రభావాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వేసవి కాలం ప్రారంభానికి ముందుగానే జాతీయ, రాష్ట్ర స్థాయి హీట్ వేవ్ సంసిద్ధత సమావేశాలను నిర్వహిస్తుందని పేర్కొంది. ఎండాకాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైతే ఆ పరిస్థితులను హీట్వేవ్గా పేర్కొంటారు. కొన్నిసార్లు అది 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటే దానిని తీవ్రమైన హీట్వేవ్ అంటారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వడగాడ్పుల రోజుకు ఐఎండీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం.. ఒక రాష్ట్రంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటిన రోజును ‘ఒక వడగాడ్పు రోజు’గా పరిగణిస్తున్నారు. ఒకే తేదీలో 10 రాష్ట్రాల్లో వడగాడ్పులు ఉంటే ‘10 వడగాడ్పు రోజులు’గా పరిగణిస్తారు. -
ఇన్చార్జిల పాలన ఇంకెన్నాళ్లు!
రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యామండలిపై ఉన్నత విద్యాశాఖ ఆధిపత్య పోరు కారణంగా కీలక ఫైళ్ల కదలిక ఆగిపోయింది. ఫలితంగా నెలలు గడుస్తున్నా విశ్వవిద్యాలయాలకు వైస్ చానల్సర్ల నియామకం ఎటూ తేలడంలేదు. ఫలితంగా విజ్ఞానాన్ని పంచే యూనివర్సిటీల్లో పాలన గాడి తప్పుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైస్ చాన్సలర్లపై కత్తికట్టింది. దాదాపు 17 వర్సిటీ వీసీలను ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది. ఆనక నెలలు తరబడి ఇన్చార్జిల పాలనలోనే వర్సిటీలను గాలికి వదిలేసింది. ఫలితంగా వర్సిటీల్లో బోధనాంశాలు మరుగునపడి వర్గ విభేదాలు రాజ్యమేలుతున్నాయి. – సాక్షి, అమరావతి9 వర్సిటీలపై స్పష్టత ఏదీ!?యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్లో అనుమతి ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత స్రూ్కటినీలో చాలా జాప్యం చేసింది. ఈ ఏడాది జవనరిలో సెర్చ్ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. ఆ కమిటీల నివేదిక ఆధారంగా ఫిబ్రవరిలో గవర్నర్ ఆమోదంతో 9 వర్సిటీలకు వీసీలను నియమించింది. ఇక్కడ 13 వర్సిటీలకు సెర్చ్ కమిటీల సమావేశాలు పూర్తయి నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. అందులో 9 వర్సిటీలకే మోక్షం లభించింది. మిగిలిన నాలుగు వర్సిటీలకు వీసీల నియామకంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని సమాచారం. తాము ఎన్నిసార్లు సంప్రదించినా స్పష్టత రావడంలేదని ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యోగి వేమన యూనివర్సిటీ వీసీగా నియమితులైన పి.ప్రకాశ్బాబు పాండిచ్చేరి సెంట్రల్ వర్సిటీకి వీసీగా అవకాశం రావడంతో ఇక్కడ రాజీనామా చేశారు. ఈ వర్సిటీతో కలుపుకుని ఇంకా ఐదు వర్సిటీలకు సెర్చ్ కమిటీ సమావేశాలు జరగాల్సి ఉంది. దాదాపు 11 నెలలు గడుస్తున్నా వర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండటం గమనార్హం. తాజాగా కర్నూలులోని క్లస్టర్ వర్సిటీ వీసీ పదవీ కాలం ముగియడంతో అక్కడ కూడా ఇన్చార్జి పాలనే నడుస్తోంది. పేరు నచ్చకపోతే ఆపేస్తారా? వీసీల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిబంధనలకు పాతరవేసింది. సెర్చ్ కమిటీల్లో అనర్హులకు స్థానం కల్పించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 13 వర్సిటీలకు గాను 9 వర్సిటీలకు వీసీలను నియమించింది. మిగిలిన వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా సెర్చ్ కమిటీలు సూచించిన పేర్లపై ప్రభుత్వం అయిష్టత చూపిస్తుండటంతోనే జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తిని నియమించుకోవాలనుకుంటే సెర్చ్ కమిటీల సమావేశాలు, సిఫారసులతో అవసరం లేకుండా చేసుకోవాలని మండిపడుతున్నారు. నిపుణులతో సెర్చ్ కమిటీ వేసి అందులో తమకు నచ్చిన వారి పేర్లు సిఫారసు చేయమనడం దుర్మార్గమని విమర్శిస్తున్నారు. మరోవైపు రిజర్వేషన్ ప్రకారం వీసీలను ఎంపిక చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎంపిక సమయంలో కాకుండా నోటిఫికేషన్ సమయంలో వర్సిటీల వారీగా వీసీల పోస్టులను రోస్టర్ ప్రకారం రిజర్వ్ చేస్తే అందుకు తగ్గట్టుగానే దరఖాస్తులు చేసుకునే వారమని ఆశావహులు పేర్కొంటున్నారు.సమీక్షలే.. పురోగతి శూన్యం!ఉన్నత విద్యపై మంత్రి లోకేశ్ సమీక్షలతో సరిపెట్టడం తప్ప అందులో పురోగతి ఎక్కడా కనిపించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 11 నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో వీసీలను నియమించలేక తన అసమర్థతను బయట పెట్టుకుంటున్నారని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా శాఖకు, ఉన్నత విద్యా మండలికి మధ్య కోల్డ్వార్ నడుస్తుంటే తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించడం గమనార్హం. వీటిన్నింటి పర్యవసానాలు ఉన్నత విద్యా వ్యవస్థను భ్రషు్టపట్టిస్తోందని విద్యావేత్తలు వాపోతున్నారు. గతంలో కంప్యూటర్ల పేరు స్మరించిన నేతలే ఇప్పుడు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేరుతో ప్రచారం చేసుకుంటూ సాంకేతిక విద్యా సంస్థల్లోని వ్యక్తులను వీసీలుగా నియమించి గొప్పగా చేస్తున్నట్టు మభ్యపెట్టే ప్రయత్నం తప్ప వర్సిటీల్లో క్రమం తప్పకుండా జీతాలిచ్చే పరిస్థితి లేదని మేధావి వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వానికి సాంకేతిక సహాయం కావాలంటే జేఎన్టీయూలు, తిరుపతి ఐఐటీ నుంచి తీసుకోవచ్చని, ఎక్కడో సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేస్తున్నవారే కావాలని ఏరుకోరి తెచ్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
మెగా డీఎస్సీలో మెలిక!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో కూటమి సర్కారు మెలిక పెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. విద్యా రంగాన్ని ఉద్ధరిస్తామన్న కూటమి సర్కారు.. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్లో అర్హత మార్కుల నిబంధనను విధించలేదని, ఆ నోటిఫికేషన్ను పూర్తి చేసి ఉంటే తమకు మేలు జరిగేదని అభ్యర్థులు వాపోతున్నారు. తాజా నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. దాదాపు 11 నెలల పాటు ఇదిగో అదిగో నోటిఫికేషన్ అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం.. నోటిఫికేషన్ ఇచ్చి తమ ఆశలను చిదిమేసిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. హడావుడి చేసినంత కూడా లేదు.. ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేసి వెంటనే పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు టీడీపీ అగ్ర నాయకులు హామీలు గుప్పించారు. గతేడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేసి 16,347 పోస్టులను ప్రకటించారు. ఆగస్టులో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి, గత ప్రభుత్వంలో 6,100 పోస్టులకు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేశారు. తర్వాత టెట్ రాసేందుకు అవకాశం ఇస్తున్నామంటూ ఒకసారి, టెట్కు, డీఎస్సీకి 3 నెలల కాలం ఉండాలని మరోసారి కాలయాపన చేశారు. వాస్తవానికి పాఠశాల విద్యా శాఖలో 27,333 పోస్టులు ఖాళీ ఉన్నా, కేవలం 16,347 పోస్టులకే ఏడాది తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. తుదకు అర్హత మార్కుల నిబంధన పెట్టి అన్యాయం చేశారు. గ్రామీణ పేద విద్యార్థులపై వేటు రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదువుకునే వారిలో పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులే అధికం. కోర్సులు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిర పడేందుకు వీరి ముందున్న ఏకైక అవకాశం డైట్ లేదా బీఈడీ మాత్రమే. దాంతో కోర్సులు ఏదోలా పాసై ఇంటర్ అర్హతతో డైట్, డిగ్రీ అర్హతతో బీఈడీ చేసిన వారు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో 8 లక్షల మందికి పైగా ఇంటర్, గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కుల శాతం 40–45 ఉంటుంది. ప్రస్తుత డీఎస్సీ–2025లో జనరల్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50 శాతం, స్కూల్ అసిస్టెంట్కు డిగ్రీలో 50 శాతం, పీజీటీకి పోస్టు గ్రాడ్యుయేషన్లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. అలాగే, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎస్జీటీ/ఎస్ఏ పోస్టులకు 45, పీజీటీకి 50 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. దీంతో దాదాపు 8 లక్షల మంది అర్హత గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన అందిస్తున్న టీచర్లు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ్ పాఠశాలల్లో గత 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ టీచర్లుగా సుమారు 1,200 మంది పని చేస్తున్నారు. బీసీ, సాంఘిక సంక్షేమం, ఏపీ మోడల్ స్కూళ్లలో మరో 2 వేల మంది పని చేస్తున్నారు. ప్రస్తుత డీఎస్సీలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వకుండానే దాదాపు 3,109 పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సర్వీసు అందిస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. -
అవుకులో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా అవుకులో ఆదివారం అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్ జిల్లా ఉప్పలూరులో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 100కిపైగా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలోని 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 20 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అకస్మాత్తుగా పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రూ.41.42 కోట్లతో..‘తుంగభద్ర’ గేట్ల మార్పు
సాక్షి, అమరావతి: కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు తుంగభద్ర డ్యాంలో కాలం చెల్లిన 32 గేట్లను తొలగించి, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు తుంగభద్ర బోర్డు సిద్ధమైంది. ఈ పనులకు రూ.41.42 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఆదివారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 32 గేట్లు అమర్చే పనులు 15 నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించింది. టెండర్లో బిడ్ల దాఖలుకు ఈనెల 28 వరకూ అవకాశం ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తుంది. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మే 2న తెరవనుంది. తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు గేట్ల మార్పిడి పనులు అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాం నిర్వహణకు కేంద్రం తుంగభద్ర బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం డ్యాం, ఎగువ, దిగువ ప్రధాన కాలువల మరమ్మతులు, లైనింగ్ తదితర పనులకు తొలుత ఏపీ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలి. ఆ తర్వాత కర్ణాటక వాటా నిధులను ఏపీకి కేంద్రం సర్దుబాటు చేస్తుంది. ఈ నిబంధన ప్రకారం తొలుత ఏపీ ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉన్నా రూ.10వేలు మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గేట్ల మార్పిడికి నిధుల కొరత అడ్డంకి మారిందని, అందుకే 15 నెలలు గడువు పెట్టినట్లు బోర్డు అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది తరహాలో భారీ వరదలు వస్తే తుంగభద్ర డ్యాం భద్రతకు ముప్పువాటిల్లే ప్రమాదముందని, ఈ ఏడాది 80 టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిల్వ చేయకూడదని నిపుణులు సూచించారని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇది మూడు రాష్ట్రాల్లోని ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.గేట్ల మార్పులో తీవ్ర జాప్యంగతేడాది ఆగస్టు 10న తుంగభద్ర డ్యాంకు వచ్చిన భారీ వరదకు 19వ గేటు కొట్టుకుపోయింది. దాంతో కర్ణాటక వినతి మేరకు కేంద్రం సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలో హర్కేష్కుమార్, తారాపురం సుధాకర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా.. గేట్ల కాలపరిమితి ముగియడం, బలహీనంగా మారడం వల్లే 19వ గేటు కొట్టుకుపోయిందని తేల్చింది. డ్యాం భద్రత దృష్ట్యా 33 గేట్లు మార్చాల్సిందేనని సీడబ్ల్యూసీకి సెప్టెంబరు 11న నివేదిక ఇచ్చింది. గేట్ల మార్పిడికి మూడు రాష్ట్రాలు అంగీకరించాయి. దాంతో ఒక్కో గేటు 48 టన్నుల బరువుకు మించకుండా 14 ఎంఎం ఇనుప రేకుతో 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో రూపొందించేలా సీడబ్ల్యూసీ డిజైన్ను కూడా ఖరారు చేసింది. కానీ.. నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో గేట్ల మార్పుపై సత్వరమే నిర్ణయం తీసుకోలేకపోయామని బోర్డు అధికారులు చెబుతున్నారు. కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో కొత్త గేటు నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి.. రూ.1.66 కోట్లకు అహ్మదాబాద్కు చెందిన సంస్థకు పనులు అప్పగించామని తెలిపారు. గేట్ల మార్పులో జాప్యం వల్ల.. డ్యాంలో పూర్తి నీటి మట్టం 105.79 టీఎంసీలకుగానూ.. 80 టీఎంసీలకు మించి నిల్వ చేయలేమని.. ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో తుంగభద్ర డ్యాంపై ఆధారపడిన 13.28 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.70 ఏళ్లుగా అవే గేట్లుతుంగభద్ర డ్యాం నిర్మించి 71 ఏళ్లు పూర్తయింది. గరిష్ఠ నీటి మట్టం 1,633 అడుగులు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలు. కనీస నీటి మట్టం 1,613 అడుగులు. అదే స్థాయి నుంచి 1,633 అడుగుల వరకూ 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్పిల్వేకు 33 గేట్లు బిగించారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం గేట్ల కాలపరిమితి 45 ఏళ్లే. అనంతరం మార్చాల్సి ఉంటుంది. కానీ.. డ్యాం నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఇప్పటిదాకా గేట్లను మార్చలేదు. -
పల్లె నిధులకు ప్రభుత్వ గ్రహణం
పంచాయతీలలో అభివృద్ధి పడకేసింది.. మండల పరిషత్లలో ప్రగతి మందగించింది.. జిల్లా పరిషత్లలో సమస్యలు ముసురుకుంటున్నాయి.. ఏదైనా పని చేద్దామంటే పైసల్లేకుండా పోయాయి..! రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు ఇస్తుందా అనే ఎదురుచూపులతో నాలుగు నెలలు గడిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినా రాష్ట్ర ఖజానా నుంచి బయటకు రావడం లేదు. మరోవైపు స్థానిక సంస్థలకు ఇవ్వకపోయినా పర్లేదు.. అసలు ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని అంటే మాత్రం అనుమానమే అని తెలుస్తోంది.సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలు మండల, జిల్లా పరిషత్ల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121.20 కోట్లను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నాలుగు నెలలుగా తొక్కిపెట్టింది. ఖజానాలో ఉంచుకుని అవసరాలకు వాడేసుకుంటోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం గ్రామీణ స్థానిక సంస్థల కోసం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకుండా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల పాలక వర్గాలు అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకునే వీలుంటుంది. స్థానిక గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించుకునేలా, రాష్ట్ర ఖజానా ఆంక్షలు లేకుండా స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానం అమలులో ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కొత్తగా ఈ విధానం అమలులోకి వచ్చింది.» 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలకు విడుదల చేసే నిధులు రాష్ట్ర ఖజానాలో జమయిన పది పని దినాల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. » గత ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.2,152 కోట్లను కేంద్రం విడుదల చేయాల్సి ఉంది. తొలి విడత సెప్టెంబర్లో, రెండో విడతగా డిసెంబర్లో రూ.1,121.20 కోట్లు ఇచ్చింది. (డిసెంబరు 16న రూ.446.48 కోట్లు, డిసెంబరు మూడో వారంలో రూ.674.72 కోట్లను విడుదల చేసింది)» ఈ నిధులను 70–20–10 నిష్పత్తిన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు వాటి బ్యాంకు ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. దీనికి పది పని దినాలు నిర్దేశించింది. అయితే, శనివారం వరకు (ఏప్రిల్ 19) కూటమి ప్రభుత్వం ఆయా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయలేదు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోంది అనే చర్చ అధికార వర్గాలో సాగుతోంది.» నిబంధనల ప్రకారం వెళ్తే ఆ నిధులను వినియోగించుకునే అవకాశం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ కారణంగానే నిధుల జమ విషయంలో కాలయాపన చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.» నిధుల కొరత కారణంగా స్థానిక సంస్థలు తాగునీరు, పారిశుధ్యం సంబంధిత పనులను చేపట్టడం లేదు. పలు గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.11 నెలల్లోనే మూడోసారి..కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 11 నెలల కాలంలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నెలల తరబడి రాష్ట్ర ఖజానాలో ఉంచుకోవడం ఇది మూడోసారి. గతంలో విమర్శలు వచ్చిన తరువాత తప్పనిసరై స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను గత సెప్టెంబర్ లో విడుదల చేయగా, దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో జమ చేసింది. » 2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన రూ.998 కోట్లనూ ఆలస్యంగా విడుదల చేసింది. రెండో విడతగా గత ఏడాది మార్చి నెలాఖరున కేంద్రం ఇచ్చింది. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు ఆ నిధులను స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం జూన్ 12న బాధ్యతలు చేపట్టినా ఆగస్టు దాకా స్థానిక సంస్థలకు ఇవ్వలేదు. » ఈ అంశంపై ఆగస్టు 13న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించిన తర్వాత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. -
ఏటా కోటి పెళ్లిళ్లుమన వివాహ మార్కెట్ రూ.11 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో వివాహ ఖర్చు భారీగా పెరుగుతోంది. సగటు కుటుంబ వార్షిక ఆదాయం కంటే మూడు రెట్ల అధిక వ్యయం జరుగుతోంది. ఆభరణాల కొనుగోలు నుంచి దుస్తులు, పెళ్లి మండపాలు, అతిథి సత్కారాలకు వెనుకడుగు వేయకుండా భారీ వ్యయాలు చేస్తున్నారు. దీనికి తోడు వధూవరుల ప్రత్యేక కోర్కెలు సైతం వివాహ ఖర్చులను అమాంతం పెంచేస్తున్నాయి. ఔట్ఫిట్స్, ఫస్ట్లుక్, మెహందీ, హల్దీ, ఫొటోషూట్, వినోద కార్యక్రమాలను యువత అమితంగా ఇష్టపడుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ వివాహాలు ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందడం ఆసక్తి కలిగిస్తున్న అంశం. దేశ వివాహ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లుగా మార్కెట్ వర్గాల అంచనా. ఏటా దేశంలో దాదాపు కోటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ‘వెడ్డింగ్వైర్ ఇండియా’ సర్వే వివాహాల ఖర్చుపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఆకాశమంత పందిరి... భూదేవంత పీటభారతీయ కుటుంబ వివాహాల్లో విలాసానికి ప్రాధాన్యం పెరుగుతోంది. సగటున పెళ్లిళ్ల కోసం రూ.29.60 లక్షలకుపైగా ఖర్చవుతోంది. ఇందులో వివాహ వేదికకే 20 శాతానికిపైగా వెచ్చిస్తుండటం విశేషం. 2023లో ఒక వేదికకు సగటున రూ.4.70 లక్షలు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.6 లక్షలకుపైగా కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక్కోసారి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెరుగుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఆ సందర్భాల్లో మొత్తం వివాహ వ్యయం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉండడం విశేషం. తగ్గేదేలే..భారతీయ వివాహ వేడుకలు కనీసం మూడు, నాలుగు రోజులు కొనసాగుతున్నాయి. భారీగా వివాహ వ్యయం ధోరణి గ్రామాల్లోకీ విస్తరిస్తోంది. అవసరమైతే అప్పుచేసి మరీ భారీగా శుభ కార్యాన్ని నిర్వహిస్తున్నారు తప్ప, ఖర్చుకు వెనుకాడని పరిస్థితి కనబడుతోంది. అతిథులకు చిరస్మరణీయ ఆతిథ్యం ఇవ్వాలని యువత భావిస్తోంది.ఇందులో భాగంగా ఆహారం, పానీయాలపై దృష్టి పెడుతున్నారు. క్యాటరింగ్, వినోద కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతున్నాయి. శుభ లేఖలూ ‘వైభవంగా’ ఉండాల్సిందే. అయితే వివాహ ఆహ్వానాలు డిజిటల్ రూపంలోకి మారుతుండడం కొత్త ట్రెండ్.రెండో అతిపెద్ద మార్కెట్2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రిటైల్ మార్కెట్లో వివాహ పరిశ్రమ రూ.11 లక్షల కోట్లతో ఆహారం, నిత్యావసరాల తరువాత రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. కొన్ని కీలక విభాగాల మార్కెట్ విలువలు ఇలా... -
ఊరూపేరు లేని 'ఉర్సా'
సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్, వెబ్సైట్ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్లో కార్యాలయమే లేదు..! కేరాఫ్ అడ్రస్ ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్ హైదరాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్కు చెందిన పెందుర్తి విజయ్కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్ నెంబర్ 705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్కుమార్కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్ రూమ్ నివాస ఫ్లాట్ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్ వాణిజ్య విద్యుత్ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్ నెంబర్ 705 విద్యుత్ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్ కంపెనీకి కనీసం ఓ ఫోన్ నెంబరు గానీ వెబ్సైట్గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్ తన వ్యక్తిగత ఈ మెయిల్ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్ 27న ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్లో 611, సౌత్ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్కుమార్ తనయుడు కౌశిక్ దీనికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్ నెంబర్లు లేవు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాలస్ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి. మరో డైరెక్టర్ సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్’ను మించిన స్కామ్..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్డీడ్ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్ గుర్తుకొస్తోందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. -
‘పీడీఎస్’లో.. కందిపప్పు కనుమరుగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) నుంచి ‘కందిపప్పు’ నెమ్మదిగా కనుమరుగు కానుంది. పేదలకు సబ్సిడీపై ఇచ్చే నిత్యావసరాలను ప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తోంది. అందుకే 10 నెలలుగా క్రమంగా కందిపప్పును తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకాలకు మాత్రమే కందిపప్పును సేకరిస్తోంది. టెండర్లకు మంగళం.. కొద్దికాలంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు రేటు కిలో రూ.180కిపైగా పలికింది. ఈ ధర చాలా కాలం పాటు కొనసాగడంతో సామాన్యులు కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో సబ్సిడీపై కందిపప్పును సరఫరా చేసి ఆదుకోవాల్సిన సమయంలోనూ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక రేట్లకు కోట్ చేస్తున్నారని మొత్తం పంపిణీకే మంగళం పాడేసింది. ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకు కందులు సరఫరా చేయాలంటూ కేంద్రానికి లేఖలు పేరిట డ్రామాకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) దగ్గరే కందులు నిల్వలు లేనప్పుడు ఏకంగా ఏడాదికి సరిపడా నిల్వలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలంటూ లేఖల్లో కోరడంతోనే ప్రభుత్వ కుటిల నాటకం బయటపడింది. పేదలకు పంచేది కూడా ఆర్థిక భారమేనా? ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర తగ్గి కిలో రూ.120–130 పలుకుతోంది. ఇది హోల్ సేల్లో అయితే రూ.100–110లోపు ఉంటోంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై కందిపప్పు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం రేటు దిగివచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి కిలో కందిపప్పు సబ్సిడీపై రూ.67కు వినియోగదారులకు అందించాలి. అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో హోల్ సేల్లో కొనుగోలు చేసి ఇచ్చినా ప్రభుత్వంపై కిలోకు రూ.40–50 మించి భారం పడదు. ఇది సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ, పేదల జీవితాలను కూడా బడ్జెట్ కోణంలో చూస్తోన్న ప్రభుత్వం ఆ కాస్త మొత్తాన్ని కూడా ఆదా చేసుకునేందుకు పీడీఎస్లో కందిపప్పు ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కొత్తేమీ కాదు.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 93,000 టన్నుల కందిపప్పును మాత్రమే పంపిణీ చేసింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెప్టెంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు పంపిణీ గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే దీన్ని పంపిణీ చేసింది. 2017–18లో రాష్ట్రంలో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా మార్చి 2018 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు 2 కిలోల కందిపప్పు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టింది. అంతే తప్ప ఆ ఒక్క ఏడాది కూడా సక్రమంగా కందిపప్పును అందించలేదు.సబ్సిడీ రేట్లు పెంచిన ఘనుడు బాబుగారే! ఆగస్ట్ 2015 నుంచి ఫిబ్రవరి 2017 వరకు కార్డుకు కిలో చొప్పున రూ.50–120 మధ్యన రేట్లు పెంచి విక్రయించింది. 2015 డిసెంబర్లో ఏకంగా రూ.90కి, 2016 జూలై నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.120కి పెంచేసింది. 2018లో కందిపప్పుకు రూ.23 మాత్రమే రాయితీ ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కందిపప్పు రేటు ఎంత పెరిగినా కిలో రూ.67కే స్థిరంగా అందించింది. దీంతో వినియోగదారులకు భారీగా మేలు జరిగింది. మళ్లీ కూటమి ప్రభుత్వం రాకతో కందిపప్పు పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. -
22న వైఎస్సార్సీపీ పీఏసీ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22వ తేదీ (మంగళవారం) ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారని, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కో–ఆర్డినేటర్గా వ్యవహరిస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. పీఏసీ సభ్యులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), మాజీ మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)..వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, విడదల రజిని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ ఆళ్ల అయోధ్యరావిురెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్బాబు, మాజీ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, డాక్టర్ పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి..మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మంత్రులు షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజ్ఖాన్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, మాజీ మంత్రి సాకే శైలజానాథ్లను నియమించారు. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
‘ప్రవీణ్ పగడాల పోస్ట్మార్టం రిపోర్టుపై ఎన్నో అనుమానాలు?’
సాక్షి, తాడేపల్లి: ప్రవీణ్ పగడాల మృతిపై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కోర్టులో పిల్ వేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ కలిపి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని.. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టులో స్పష్టత లేదన్నారు. ట్రావెల్ చేసింది.. ఆగింది.. మద్యం కొనుగోలు చేసింది ప్రవీణ్ కుమార్ అని ఎక్కడా నిరూపణ కాలేదు. చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ అనేది తప్ప పోలీసులు చూపిన వీడియోల్లో అతను ప్రవీణ్ కుమార్ అని నిర్ధారణ కాలేదు’’ అని విజయ్ కుమార్ వివరించారు.‘‘నాకు ఎన్నో పోస్టుమార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉంది. మద్యం సేవించడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుంది. మద్యం తాగడం వల్లే చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో ఇంతమంది ఎలా బతికున్నారు?. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రవీణ్ కడుపులో 120 ఎంఎల్ ఫ్లూయిడ్ ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ ఫ్లూయిడ్లో అనుమానాస్పదమైన ఎలాంటి ఆల్కహాల్ లేదని ఇచ్చారు. ప్రిలిమినరీ రిపోర్టులో ఆల్కహాల్ లేదని చెప్పిన వైద్యులు.. ఫైనల్ రిపోర్టులో ఆల్కహాల్ ఉందని ఇవ్వడం చిత్రంగా ఉంది. ఎందుకు ఆల్కహాల్ గురించి ఇంతగా ప్రస్తావిస్తున్నారు. పోలీసులు మొదట చెప్పిన ప్రెస్ మీట్లో ఎక్కడా ఆల్కహాల్ గురించి ప్రస్తావన లేదు. తర్వాత ఒక స్టోరీని అల్లడం కోసం ఆల్కహాల్ను వాడుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి’’ అని విజయ్కుమార్ పేర్కొన్నారు. ‘‘పనిగట్టుకుని ఆల్కహాల్ ఉందని రిపోర్టులో రాశారని అనిపిస్తోంది. మొహం రాళ్లకు గుద్దుకున్నందుకు గాయాలయ్యాయన్నారు. మరి తలవెనుక గాయం ఎలా అయ్యింది?. వెల్లకిలా పడిన వ్యక్తి పై మోటార్ సైకిల్ ఎలా పడింది?. అనేక సందేహాలున్నాయి వాటికి ఎక్కడా సమాధానం లేదు. హర్షకుమార్ అరెస్టును మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఏపీలో అసలు మానవహక్కులు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నాం. స్వేచ్ఛగా నిరసన తెలిపే హక్కు కూడా పౌరులకు లేదా?. రెండు సార్లు ఎంపీగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి వేధించడం పద్ధతేనా?. ముందస్తు అరెస్ట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది.మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న కొద్ది ప్రవీణ్ కుమార్ది హత్యేనేమోనని అనుమానాలు బలపడుతున్నాయ్. ప్రవీణ్ మృతిపై మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ద్రోహులెవరో తెలిసిపోతారని ప్రభుత్వం ఉలిక్కిపడుతుందనే అనుమానం కలుగుతోంది. ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. పేదల ఓట్లు మీకు కావాలి?. పేదల భావాలతో మీకు పనిలేదా?’’ అంటూ విజయ్కుమార్ ప్రశ్నించారు. -
‘మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డీఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని నిలదీశారు.టీచర్ పోస్ట్ల నియామక ప్రక్రియపై నిర్ధిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్ధుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. మెగా డీఎస్సీని చిత్తశుద్దితో నిర్వహించకపోతే అభ్యర్ధుల తరుఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.ఇంకా ఆయనేమన్నారంటే..డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియలో లోపాలను సవరించకపోతే అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీనిపై నిరుద్యోగుల తరుఫున ప్రభుత్వాన్ని మేలుకొలుపేందుకు కొన్ని అంశాలను మీడియా ద్వారా ఈ ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్లో మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. పదకొండు నెలల తరువాత చంద్రబాబు పుట్టినరోజు నాడు తాజా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చేందుకేనా ఈ పదకొండు నెలలుగా మెగా డీఎస్సీని ఆలస్యం చేశారు?.గత ఏడాది జూన్ 14న కూటమి ప్రభుత్వం తొలి కేబినెట్ సమవేశంలో మెగా డీఎస్సీ కింద 16,357 పోస్ట్ల భర్తీపై సంతకం చేశారు. వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తాం, పరీక్ష ప్రక్రియ, నియామకాలను వెంటవెంటనే చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలిఫైల్ పై సంతకం చేసిన రెండు రోజుల్లోనే టెట్ నిర్వహించిన తరువాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు కూడా అదే జూన్ నెలలో వెలువడ్డాయి. మళ్లీ టెట్ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సాకు చెప్పడం పెద్ద మోసం కాదా?తరువాత గత ఏడాది కూటమి ప్రభుత్వం టెట్ నిర్వహించి, నవంబర్ 4వ తేదీన ఫలితాలను విడుదల చేసింది. అదే సందర్భంగా నవంబర్ 6వ తేదీన మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. అయితే నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఒక వ్యక్తితో కోర్ట్లో పిటీషన్ వేయించారు. కోర్ట్లో కేసు పెండింగ్లో ఉన్నందున వర్గీకరణ బిల్లు ఆమోదం తరువాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తూ వచ్చిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. శాసనమండలిలో ప్రతిసారీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, నిరుద్యోగుల తరుఫున గళాన్ని వినిపించడం ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది.వైఎస్సార్సీపీ ఒత్తిడితో ఎట్టకేలకు నోటిఫికేషన్మెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేసిన ఒత్తిడి కారణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ను తీసుకువచ్చి, చంద్రబాబు పుట్టినరోజున మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మంది అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గత పదకొండు నెలలుగా వాయిదాల మీద వాయిదాల వేయడం, కోర్టుల్లో పిటీషన్లు వేయడం చూస్తుంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ను అయినా కార్యరూపంలోకి తీసుకువస్తారా అని పలువురు ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిస్తున్నారు.స్కూల్స్ తెరిచే నాటికి అంటే జూన్ 1వ తేదీ నాటికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి, మొత్తం పోస్ట్లను భర్తీ చేస్తామని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్లో ఎస్సీల్లో ఆర్ఓఆర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండానే ఆర్డినెన్స్ను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ప్రభావం డీఎస్సీపై పడుతోంది. ప్రభుత్వం ఇప్పుడు కేవలం సుమారు పదహారు వేల టీచర్ పోస్ట్లను భర్తీ చేస్తూ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును సాకుగా చూపడం ఎంత వరకు సమంజసమని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.టీచర్ పోస్ట్ల నియామక ప్రక్రియలో స్పష్టత ఏదీ?ఏప్రిల్ 20న నోటిఫికేషన్, జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షల ప్రక్రియను నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. డీఎస్సీ పరీక్షా ఫలితాలు ఆగస్టులో ఇస్తామని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో ఫలితాలను ప్రకటిస్తే, ఉద్యోగాల భర్తీ ఎప్పుడూ? మరోవైపు మే నెలలో టీచర్ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. సుమారు 16 వేల పోస్ట్లను బ్లాక్ చేయకుండానే బదిలీలను ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉండే టీచర్ పోస్ట్లు ఖాళీగానే ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. కొత్త డీఎస్సీ ఫలితాలే ఆగస్టు మొదటి వారంలో వస్తే, ఉద్యోగాల నియామకాలు సెప్టెంబర్ దాటి పోయే అవకాశం ఉంది.అంటే అప్పటి వరకు మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో ఉపాధ్యాయుల ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు టీచర్ లేక, విద్యాసంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలల పాటు పాఠాలు చెప్పేవారు లేక నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ మొత్తం ప్రక్రియపైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? జూన్లోగానే నియామక ప్రక్రియను పూర్తి చేస్తే, విద్యార్ధులకు ఈ నష్టం జరగదు. కానీ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ వరకు టీచర్ పోస్ట్ల భర్తీని సాగదీయడం వల్ల విద్యార్ధులే అంతిమంగా నష్టపోతున్నారు. పదకొండు నెలల కిందట 16347 పోస్ట్లకు కేబినెట్లో సంతకం చేశారు. నేటికీ అదే పోస్ట్లకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడం ఎంత వరకు సమంజసం? ఈ మధ్య కాలంలో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి? వాటి పరిస్థితి ఏమిటీ?అసమర్థతతో విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారుకూటమి ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో విద్యారంగం నాశనమవుతోంది. ఆనాడు సీఎంగా వైయస్ జగన్ గారు జీఓ 117 ద్వారా ప్రభుత్వ విద్యావ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పించాలని సంకల్పించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేసింది. జీఓ 117లో ఏమున్నాయో తెలియకుండానే ఆ జీఓను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. తరువాత ఆ జీవో మీద ఒక కొత్త మెమోను తీసుకువచ్చారు. ఈ మెమో కారణంగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించారు. సుమారు 19271 ప్రైమరీ స్కూళ్ళు వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్గా మారిపోతున్నాయి.ఒక పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ను పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో దాదాపు 31 వేల ప్రైమరీ స్కూల్స్ ఉంటే, పంచాయతీకి ఒక్క స్కూలే పెడితే 19,271 స్కూల్స్ మాత్రమే మిగులుతాయి. రాష్ట్రంలో మొత్తం 3156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ స్కూల్స్నే తీసివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉన్న ఈ స్కూళ్ళలో 83 శాతం ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్ల కింద పడిపోయే ప్రమాదం ఉంది.కేవలం 17 శాతం స్కూళ్లను మాత్రమే హైస్కూళ్ళుగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే 510 హైస్కూల్ ప్లస్ విద్యా సంస్థలను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 1800 మందికి పీజీటీలుగా పదోన్నతులు కల్పించి, ఇంటర్మీడియేట్ వరకు ఈ స్కూళ్లలో విద్యాబోధన కల్పించాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అవసరమైతే విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పడంతో వాటిల్లో ఈ ఒక్క ఏడాది మాత్రమే 290 హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థలను కొనసాగిస్తామని చెప్పి, వాటిపైనా కూడా ఒక అయోమయాన్ని కల్పించారు. అలాగే 117 జీఓ రద్దు వల్ల స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారి 8000 మంది పరిస్థితి ప్రశ్నార్థకం అయ్యింది.ఉద్యోగాల కల్పనపైనా అబద్దాలేనా?చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగాల వెల్లువ అంటూ తప్పుడు ప్రచారంతో అబద్దాలను గొప్పగా చెప్పుకుంటున్నారు. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో ఏకంగా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని పచ్చి అబద్దాలు చెప్పారు. మేం దానిని ప్రశ్నించగానే పొరపాటుగా చెప్పామంటూ మాట మార్చారు. మరోవైపు ఉన్న ఉద్యోగాలను కూడా క్రమంగా తొలగిస్తూ యువత జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పదకొండు నెలల్లోనే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ వారిని ఏకంగా మూడు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు.ఇప్పుడు ఏడాది సమయం తరువాత 16 వేల టీచర్ పోస్ట్లను భర్తీ చేస్తామంటుంటేనే అనేక సందేహాలు కలుగుతున్నాయి. 2014-19లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018లో ఏడు వేలకు పైగా పోస్ట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. తీరా ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారా అని చూస్తే కేవలం 300 పోస్ట్లు భర్తీ చేసి, 6900 మందిని గాలిలో పెట్టారు. తరువాత వైయస్ జగన్ గారి ప్రభుత్వం వాటిని భర్తీ చేసింది. అలాగే 1998 డీఎస్సీని కూడా సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఇరవై అయిదేళ్ళ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది.తాజా నోటిఫికేషన్లో వైఎస్ జగన్ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని చెప్పారు. చంద్రబాబు గత అయిదేళకల పాలనలో ఎన్ని టీచర్ పోస్ట్లను భర్తీ చేశారని చూస్తే, 2014-19లో 10,313 పోస్ట్లు మాత్రమే భర్తీ చేశారు. వైఎస్ జగన్ అయిదేళ్ల కాలంలో రెండేళ్ళు కోవిడ్ సంక్షోభం ఉన్నా కూడా మూడేళ్ళలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. 1998 డీఎస్సీలో నాలుగు వేల మందికి పాతికేళ్ళ తరువాత ఉద్యోగాలు ఇచ్చారు.2018 డీఎస్సీ కింద వైఎస్ జగన్ హయాంలో 6954 మందికి టీచర్ పోస్ట్లు ఇచ్చారు. 2008 డీఎస్సీలో ఉతర్ణులైన వారికి 2193 మందికి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే టీచర్ పోస్ట్లు ఇచ్చింది. 602 పోస్ట్లను స్పెషల్ డీఎస్సీ ద్వారా, కేబీబీవీల్లో 1200 పోస్ట్ లను ఇలా మొత్తం 15008 టీచర్ పోస్ట్లను ఆయన హయాంలో భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024 లో 6100 పోస్ట్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే 21000 టీచర్ పోస్ట్ల భర్తీకి వైయస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.కేవలం పదివేల పోస్ట్లను భర్తీ చేసిన చంద్రబాబ ప్రభుత్వం తమదే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? ఎక్కడా బర్త్డే గిఫ్ట్లుగా ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇవ్వలేదు. భారతదేశంలోనే 1.36 లక్షల ఉద్యోగాలను ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి, రెండు నెలల్లో భర్తీ చేయడం ఒక రికార్డ్. ఇన్ని చేసిన వైఎస్ జగన్పై కూటమి పార్టీలు విమర్శలు చేయడం హాస్యాస్పదం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు వారికి నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారు. ఒక్కరికైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఉద్యగాలు లేవు, భృతి అంతకన్నా లేదు. కనీసం ఈ మెగా డీఎస్సీన అయినా చిత్తశుద్దితో నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి చెబుతున్నాం. -
8 కేటగిరీల్లో 11,489 పోస్టులు హుష్!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టే ప్రక్రియను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరీల్లో ఉద్యోగులు పనిచేస్తుండగా.. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ (మల్టీ పర్పస్) ఉద్యోగులుగా పేర్కొన్న 8 కేటగిరీల్లో ఏకంగా 11,489 పోస్టులకు కోత పెట్టేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, మహిళా పోలీసుల కేటగిరీ ఉద్యోగుల విషయంలో ఏ సచివాలయంలో ఎవరుండాలి.. ఎవరు కొనసాగకూడదు అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. గ్రామ సచివాలయాల్లో సంబంధిత నాలుగు కేటగిరి ఉద్యోగులలో 9,201 పోస్టులు తగ్గిపోయాయి. వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా పోలీసు కేటగిరీ ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ప్రక్రియ పూర్తి చేయగా.. అందులో 2,288 పోస్టులకు కోత పెట్టేశారు. టెక్నికల్ కేటగిరీ ఉద్యోగుల కోసం ‘క్లస్టర్లు’ రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం నిర్ధారించిన నిబంధన ప్రకారం.. మిగిలిన 11 కేటగిరీల (టెక్నికల్) ఉద్యోగులను రెండు మూడు సచివాలయాలకు ఒకరు చొప్పున నియమించాల్సి ఉండడంతో, రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను క్లస్టరు వారీగా వర్గీకరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. 15,004 గ్రామ వార్డు సచివాలయాలను 7,600 దాకా క్లస్టర్లు వారీగా వర్గీకరించాలని జిల్లాల నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిపాదనలు పంపారు. వర్గీకరణకు జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, కలెక్టర్ల ఆమోదం అనంతరం, సచివాలయాల ఉద్యోగులలో కోతల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేనట్లే..! క్రమబద్దికరణ పేరుతో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులలోనే వేల మంది ఉద్యోగులను మిగులుగా తేల్చి, వారిని ఇతర శాఖల్లో అవసరాలకు ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు. ఫలితంగా ప్రస్తుతం సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవకాశాలే లేకపోవడంతో పాటు ఇప్పుడు సచివాలయాల్లో పనిచేసే మిగులు ఉద్యోగులనే ఇతర శాఖల్లో ఖాళీలకు ఉపయోగించుకోవడం కారణంగా ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తలుపులు క్లోజ్ అయినట్లేనని స్పష్టమవుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంటున్న లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీరు జల్లే పరిస్థితి. 1.34 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిన జగన్ సర్కార్.. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం, సంక్షేమ పథకం ఎటువంటి అవినీతి, పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా చిట్టచివరి స్థాయి వరకు సమర్థవంతంగా చేరవేసే ఉద్ధేశంతో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో మరో 3,842 వార్డు సచివాలయాలను మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు అప్పట్లో ఏర్పాటయ్యాయి. ఒక్కో సచివాలయంలో 10– 11 మంది ఉద్యోగులు చొప్పున పనిచేసేలా మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,49,235 మంది దాక పనిచేసేలా రూపకల్పన చేశారు. 15,004 సచివాలయాల్లో పనిచేసేందుకు.. అప్పట్లో గ్రామాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలుగా పనిచేసే వారికి అదనంగా మరో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 జూలైలోనే మంజూరు చేసి, కేవలం నాలుగు నెలల్లో భారీగా భర్తీ ప్రక్రియను సైతం పూర్తి చేసింది. -
సర్కారు క‘బడి’
సాక్షి, అమరావతి: ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4 కి.మీ. దూరంలోని హైస్కూళ్లకు వెళ్లాల్సిందే. ఇప్పటివరకు గ్రామాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పాఠాలు చెప్పరు. అలాగే.. హైస్కూల్లోకి మారిన 3నుంచి 5 తరగతులు అక్కడే ఉన్నా వారికి చదువు చెప్పేది ఎస్జీటీలే. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా మారుస్తామని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. సర్కారీ స్కూళ్ల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయే పరిస్థితులను తీసుకొస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో 117 జీవో రద్దు కోసం కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యా సంస్కరణల పేరుతో తాజాగా చేపట్టిన పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బోధన సిబ్బంది కూర్పుపై విద్యావేత్తలు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరిలో ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా ఇచ్చిన తాజా ఆదేశాలు విద్యార్థులకు నష్టం చేసేలా ఉన్నాయి. 5 రకాల పాఠశాలలను పునర్ వ్యవస్థీకరిస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా ఆరో రకం (1–10 తరగతులు) పాఠశాలలను సృష్టించింది. కొత్త నిబంధనలతో ఏ పాఠశాలలో ఏ టీచర్ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక్కో స్కూల్కు ఒక్కో విధానంజీవో నం.117కు ప్రత్యామ్నాయంగా తాజాగా విడుదల చేసిన బోధన సిబ్బంది కేటాయింపు నిబంధనల్ని చూసి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాథమిక (1–5) తరగతుల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్, విద్యార్థుల సంఖ్య 1:30 నిష్పత్తిలో ఉండాలి. అయితే, విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లో ఈ చట్టాన్ని కేవలం ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే అమలు చేస్తోంది. ఇక మోడల్ ప్రాథమిక పాఠశాలల(1 నుంచి 5)ల్లో 59 మంది విద్యార్థుల వరకు నలుగురు ఎస్జీటీలను కేటాయించింది. ఒకవేళ మిగులు ఎస్జీటీలు అందుబాటులో ఉండి.. 50 మంది విద్యార్థులుంటే ఒక పీఎస్ హెచ్ఎంతో పాటు నలుగురు ఎస్జీటీలను కేటాయించింది. అంటే మోడల్ స్కూళ్లకు 1:10 ప్రకారం ఉపాధ్యాయులను ఇచ్చింది. గతంలో 120 మంది దాటితేనే హెడ్ మాస్టర్ అన్న నిబంధనను సడలించింది. గతంలో ప్రాథమికోన్నత పాఠశాలలను రద్దు చేస్తామని పేర్కొన్నారు. కానీ.. తాజాగా యూపీ స్కూళ్లను కొనసాగిసూ్తనే 6–8 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లను తొలగించి, వారి స్థానంలో ఎస్జీటీలను కేటాయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా హైస్కూళ్లల్లో 1 నుంచి 10 తరగతుల వరకు బోధన అందించనున్నారు. ఈ హైస్కూళ్లలో 1 నుంచి 5 తరగతుల వరకు బేసిక్ ప్రైమరీ పాఠశాల ఏ ర్పాటు కానుంది. ఇందులో మొదటి 10 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు (1:5 ప్రకారం), తర్వాత 1:10 నిష్పత్తిలో సిబ్బందిని కేటాయిస్తున్నారు. తాజా నిబంధనలపై తీవ్ర విమర్శలుప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల కేటాయింపులో ఏకీకృత విధానం లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైస్కూళ్లల్లో 3–4 తరగతులు ఉన్నా ఇప్పటివరకు వారికి బోధిస్తున్న సబ్జెక్టు టీచర్ విధానం రద్దు చేయడం, యూపీ స్కూళ్లలోనూ ఉన్నత తరగతులకు ఎస్జీటీలనే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. కొన్ని ప్రైమరీ స్కూళ్లలో టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉంటే.. మరికొన్నింటిలో 1:5గా ఉంది. ఈ ఎంపిక ఉపాధ్యాయులను అభద్రతకు గురి చేస్తోంది. ఏలూరు జిల్లాలోని ఓ హైస్కూల్లో ఉన్న బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ముగ్గురు ఎస్జీటీలు పనిచేసేలా, సమీప గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, మరో గ్రామంలో బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 29 విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలను కేటాయించడం గమనార్హం. ఈ ఆశాస్త్రీయ విధానాలు విద్యావేత్తల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొత్తగా వస్తున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లకు ఎస్జీటీలుగా పదోన్నతులు ఇచ్చి, పీఎస్ హెచ్ఎంలుగా నియమించాలి. స్కూల్ అసిస్టెంట్లు ఉన్నత తరగతులకు బోధించాలి. కానీ ప్రైమరీ స్కూళ్లల్లో హెచ్ఎం పోస్టులను స్కూల్ అసిస్టెంట్లతో సర్దుబాటు చేస్తున్నట్లు విద్యాశాఖ చెప్పడం విస్మయం కలిగిస్తోంది.అంతుబట్టని సర్కారు విధానాలువైఎస్సార్ జిల్లాలోని ఒక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రస్తుతం అంగన్వాడీ, 1, 2 తరగతులకు ఫౌండేషన్ స్కూల్, 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూల్ కొనసాగుతున్నాయి. 1, 2 తరగతులకు ఎస్జీటీలు బోధిస్తుండగా, మూడో తరగతి నుంచి స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తున్నారు. తాజా నిబంధనలతో ఒకటి, రెండు తరగతులను హైస్కూల్లో విలీనం చేసి, ఇప్పటివరకు అదే హైస్కూల్లో ఉన్న 3–5 తరగతులు అదే ప్రాంగణంలోని ఫౌండేషన్ స్కూల్లోకి తీసుకొచ్చి, ఎస్జీటీతో బోధించనున్నారు. అంటే ఒకటి నుంచి 5 తరగతుల పిల్లలు వేళ్లేది హైస్కూల్కే అయినా చదివేది మాత్రం ప్రాథమిక పాఠశాలలోనే. దీంతో హైస్కూల్లోని సబ్జెక్ట్ టీచర్లను సర్ప్లస్గా చూపిస్తున్నారు. ఉన్నత తరగతులు కొనసాగుతున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్జీటీలకు బదులు స్కూల్ అసిస్టెంట్లను ఇవ్వాలని, ఒకటి నుంచి 10 తరగతులు కొనసాగుతున్న హైస్కూళ్లలో 3వ తరగతి నుంచి గత ప్రభుత్వం జీవో 117 ద్వారా అమలు చేసిన స్కూల్ అసిస్టెంట్లతో బోధన చేయిస్తేనే విద్యార్థులు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ప్రాథమిక, యూపీ స్కూళ్లలోని విద్యార్థులు ప్రైవేటు బాటపట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రికార్డుల గల్లంతు.. అప్డేట్ కాని మ్యుటేషన్
సాక్షి, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ (ఏపీఎఫ్ఆర్) ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లోపం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో ప్రతిబంధకంగా మారింది. ఫార్మర్ రిజిస్ట్రీలో అవకతవకలను మార్చి నెలాఖరు నాటికి చక్కదిద్దాలని తొలుత భావించినప్పటికీ.. సాంకేతిక సమస్యల కారణంగా ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయినా ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.రికార్డుల గల్లంతే ప్రధాన సమస్యరాష్ట్రంలో 612 గ్రామాల్లో ల్యాండ్ రికార్డ్స్ గల్లంతైనట్టు గుర్తించారు. మరోవైపు స్టేట్ ఫ్యామిలీ డేటా బేస్ (ఎస్ఎఫ్డీబీ)లో 6 వేలకు పైగా గ్రామాల్లో 2.27 లక్షల రైతుల ఖాతాల వివరాలు దొరకడం లేదు. ఎస్ఎఫ్డీబీ డేటా ప్రకారం డీ పట్టా, జిరాయితీ, అసైన్డ్, ఇనామ్, ఇతర భూ వివరాలు కూడా కనిపించడం లేదు. యాజమాన్య హక్కు బదలాయింపు (ల్యాండ్ మ్యుటేషన్) 2024 నవంబర్ నుంచి అప్డేట్ కాలేదు. సర్వే పూర్తయిన గ్రామాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (ఎల్పీఎం) రికార్డ్స్ డేటాతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ వెబ్సైట్లోని అటవీ భూ సాగుదారుల వివరాలు కూడా ఫార్మర్ రిజిస్ట్రీతో అనుసంధానం కాకపోవడం ఫార్మర్ రిజిస్ట్రీ ముందుకు సాగకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ కారణంగానే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసిన రైతులకు విశిష్ట సంఖ్య జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. వీటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించి పూర్తిస్థాయిలో డేటాను అందజేయాలని వ్యవసాయ శాఖ పలుమార్లు అభ్యర్థించినా రెవెన్యూ శాఖ నుంచి కనీస స్పందన కరువైంది. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వెబ్ అప్లికేషన్ స్థానంలో మొబైల్ అప్లికేషన్ తీసుకు రావాలని, తద్వారా వెరిఫికేషన్, అప్రూవల్ మరింత వేగవంతం చేయాలని భావించారు. కానీ సాంకేతిక సమస్యలు వెబ్ అప్లికేషన్కు ఇబ్బందికరంగా మారాయి. ఐదో స్థానానికి దిగజారిన ఏపీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి గతేడాది అక్టోబర్లో శ్రీకారం చుట్టగా, మన రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రారంభించారు. తొలి దశలో పీఎం కిసాన్ లబ్ధిదారులు, మలి దశలో భూమిలేని కౌలుదారులను గుర్తించి విశిష్ట సంఖ్యను జారీ చేయాల్సి ఉంది. వెబ్ల్యాండ్ డేటా ప్రకారం రాష్ట్రంలో పీఎం కిసాన్ లబ్ధిదారులు 60 లక్షల మంది ఉండగా.. మార్చి 22 నాటికే 40 లక్షల మంది రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదుతో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత ఒక్కో స్థానం దిగజారిపోతూ వస్తోంది. గడచిన నెల రోజుల్లో కేవలం 4 లక్షల మందిని మాత్రమే నమోదు చేయడంతో రాష్ట్రం ఐదో స్థానానికి పడిపోయింది. ఫార్మర్ రిజిస్ట్రీ డాష్బోర్డు ప్రకారం ఇప్పటివరకు 44.03 లక్షల మంది రైతుల వివరాలు నమోదు చేయగా.. 35 లక్షల మందికి ఫార్మర్ ఐడీ అప్రూవ్ అయినట్టుగా చెబుతున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడంతో ఫార్మర్ రిజిస్ట్రీలో వెనుకబడిపోయామని.. లేదంటే ఇప్పటికే లక్ష్యాన్ని అధిగవిుంచే వారమని వ్యవసాయ శాఖ చెబుతోంది. -
ఎట్టకేలకు డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: దాదాపు 11 నెలలుగా మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డీఎస్సీ–2025 షెడ్యూల్ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం షెడ్యూల్ వెలువరించింది. ఇందులో ఎస్జీటీ 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, పీఈటీ 2 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి మరో 2,259 స్టేట్/జోనల్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలకు https:// cse. ap. gov.in / https// apdsc. apcfss. in వెబ్సైట్లను చూడవచ్చు. షెడ్యూల్ ఇదీదరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు: నేటినుంచి మే 15వ తేదీ వరకూమాక్ టెస్ట్: మే 20 నుంచిహాల్టికెట్ల డౌన్లోడ్: మే 30 నుంచిపరీక్షలు: జూన్ 6 నుంచి జూలై 6 వరకుప్రాథమిక కీ విడుదల: ప్రతి పరీక్ష పూర్తయిన రెండవ రోజునఅభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన 7 రోజుల వరకు ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారుమెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు -
అస్మదీయులపై అవ్యాజమైన ప్రేమ
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు కారుచౌకగా భూములు, భారీ ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.4,200.07 కోట్లతో నాయుడుపేట సెజ్లో 8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్న ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్పై రాష్ట్ర ప్రభుత్వం అవ్యాజమైన ప్రేమను చూపింది. కేవలం 1,500 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఈ యూనిట్కు ఏకంగా రూ.1,573 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఎకరం రూ.60 లక్షలు చొప్పున 106.6 ఎకరాలను కేటాయించింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద మీడియా మాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ రూ.1,197 కోట్లతో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. దీనికి తొలి దశ యూనిట్ ఏర్పాటుకు ఎకరా రూ.7లక్షలు చొప్పున 329 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఈ భూములను ఎకరా రూ.21.95 లక్షలు చొప్పున సేకరించినప్పటికీ రూ.49.18 కోట్ల నష్టానికి మాట్రిక్స్ వరల్డ్ వైడ్కు భూములను కేటాయించింది. రెండో దశకు అవసరమైన 671 ఎకరాలను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మరికొన్ని సంస్థలకు ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు.. » విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఉన్న మా మహామాయ సంస్థ రూ.2,063 కోట్లతో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్ట్కు ప్రభుత్వం రూ.797.96 కోట్ల రాయితీలు ప్రకటించింది. ప్రస్తుతం యూనిట్ ఉన్న ప్రాంతంలోనే మరో 82.80 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించి ఇవ్వడానికి అనుమతించింది. ఈ భూమిలో 25.88 ఎకరాల్లో ఉన్న నీటి వనరులను ముందస్తు అనుమతులతో వినియోగించుకోవడానికి కూడా ఆమోదం తెలిపింది. » శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.585.64 కోట్లతో ఇంటిగ్రేటెడ్ క్వార్ట్జ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న పెట్రా సిలికాన్కు 224.35 ఎకరాలను కేటాయించింది. » నంద్యాల మండలం కోటపాడులో సుమారు రూ.478 కోట్లతో రామ్కో ఏర్పాటు చేస్తున్న సిమెంట్ పరిశ్రమకు 79.91 ఎకరాలను కేటాయించింది. » తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సుమారు రూ.1,055.55 కోట్లతో ప్రోటేరియల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఆమ్రోఫస్ మెటల్ తయారీ యూనిట్కు రూ.237.71 కోట్ల రాయితీలతోపాటు ఇతర ప్రోత్సాహకాలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. » స్నేహ ఫామ్స్ రూ.459.97 కోట్లతో నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కోళ్ల దాణా, మొక్కజొన్న నిల్వ గోడౌన్లు, బాయిలర్ ఫామ్స్కు రూ.67.44 కోట్ల ప్రోత్సాహకాలకు అనుమతించింది. » శ్రీ సిటీలో ఎల్జీ ఎల్రక్టానిక్స్ వెండర్స్ ఏర్పాటు చేస్తున్న వివిధ యూనిట్లకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. » డిక్సన్ టెక్నాలజీస్ తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)లకు సంబంధించి రూ.3.08 కోట్ల లీజ్ రెంటల్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ (ఈవోటీ) ఫీజును, టాప్స్టోన్ మెటల్స్కు సంబంధించి రూ.28.82 లక్షల ఈవోటీని రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే సామాజిక న్యాయం
సాక్షి, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని ఆ పార్టీ బీసీ విభాగం నేతలు కొనియాడారు. పార్టీ నేతలెవరైనా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా వైఎస్ జగన్ పాలించారని చెప్పారు. సామాజిక న్యాయం విషయంలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని చెప్పారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. బీసీలు ఎవరికీ భయపడనవసరం లేదన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ క్లాసెస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారన్నారు. కూటమి పాలనలో అరాచకాలు అణగారిన వర్గాలపైనే ఎక్కువగా జరిగాయని చెప్పారు. అనంతపురం జిల్లాలో బీసీ నేత కురుబ లింగమయ్యను దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పాలనలో బీసీ కులాలు ఆత్మగౌరవంతో జీవించాయన్నారు. అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందుకుని, రాజ్యాధికారాన్ని అనుభవించాయని గుర్తు చేశారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పాలన బీసీలకు స్వర్ణయుగం అని కొనియాడారు. బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ మాట్లాడుతూ.. కూటమి పార్టీలకు బీసీల సత్తా చూపిద్దాం అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారని చెప్పారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి సూపర్ సిక్స్ మోసాలను బయటపెడతామని చెప్పారు. కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం సమాజంలో అన్ని వర్గాలకు సమన్యాయం అందించి ప్రగతికి బాటలు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతాయని, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించింది ఒక్క వైఎస్సార్సీపీనే అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సంక్షేమం విషయంలో వైఎస్ జగన్ చెప్పనివి కూడా చేసి ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్లారని గుర్తు చేశారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయమని, అధికారంలోకి రాగానే దోచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. కూటమి దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళదామని చెప్పారు. వ్యవస్థాగతంగా మరింత బలోపేతం అవుదామని, గతంలో కంటే మెరుగ్గా పూర్తి స్థాయి కమిటీలు నియమించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
కప్పం కట్టలేం
సాక్షి, అమరావతి: యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా.. చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ జిల్లాలో రూ.9 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ను కూటమి సర్కారు సినీ నటి కాదంబరి జత్వానినీ అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్పై కూటమి పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం చేపడితే తమకు కమీషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్ది అనుచరులు గూండాగిరీ చేశారు. ఆ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగి యంత్ర సామగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపర్చారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కొత్త పెట్టుబడులు తేవడం కంటే.. ఉన్న కంపెనీల్లో వాటాలు మామూళ్ల పైనే శ్రద్ధ..! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో అందినంత వసూళ్లు..! వసూళ్ల వేధింపులు భరించలేక యూనిట్లకు తాళాలు వేసుకుని పోతున్నవారు కొందరు.. ఏకంగా పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న మరికొందరు..! వెరసి కూటమి సర్కారు కప్పం దెబ్బకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో ఏపీకో దండం అంటూ పారిపోతున్నారు.కేంద్రానికే మొరశ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.కోటిన్నర కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేం అని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. » మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. » చెప్పుకొంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూళ్ల కోసం బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.కొత్తవి రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకికొత్తగా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్ నుంచి ఉత్తి చేతులతో తిరిగొచి్చన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. గత ప్రభుత్వంలో వచి్చన ప్రాజెక్టులను వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేసేలా 2023 విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దాన్ని కూడా తామే తీసుకొచ్చినట్లు బాబు, లోకేశ్ డప్పు కొంటుకుంటున్నారు. » గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.పది లక్షల కోట్లకుపైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కారు తమ ఖాతాలోకి వేసుకుంటోంది. కాకినాడ గ్రీన్కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటినీ తమ ఘనతగానే చెప్పుకొంటున్నారు. » వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టబడులకు ఒప్పించారు. అయితే, ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ను తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు.మరికొన్ని చిలక్కొట్టుళ్లు» రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు » తమ నియోజయోకవర్గం గుండా వెళ్లే గ్రానైట్ లారీలపై కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం » నంద్యాలలో పొగాకు గోదాంల దగ్గరనుంచి చికెన్ షాపుల వరకు కమీషన్లు » కప్పం కడితేనే గనులకు లీజ్ ఇస్తుండటంతో 50 శాతం పడిపోయిన ఆ శాఖ ఆదాయం » నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్ తయారు చేసే వాటర్బేస్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి » కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్ ట్యాక్స్ చెల్లింపుసిమెంట్ పరిశ్రమల్లో మరీ దారుణ పరిస్థితితాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూళ్లు, వాటాలు అంటూ దందాకు దిగారు. ముడి సరుకు, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.» తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు చానల్ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకు ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన సున్నపురాయి సరఫరాను కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. » రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. » నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకే చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అ్రల్టాటెక్ సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంది. » సిమెంటు సరఫరా దందాలో ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.» శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్ టెక్ రెడీమిక్స్ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. -
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం
చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షతో పెడుతున్న తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచి్చన తరువాత పెట్టిన ఎన్నో కేసుల్లో ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. అదే రీతిలో ప్రస్తుతం మద్యం విధానంపై పెట్టిన అక్రమ కేసులో ఆరోపణలు కూడా అవాస్తవమేనని త్వరలో నిర్ధారణ అవుతుంది’ అని ఆయన చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం పూర్తి విషయాలు మాట్లాడలేను. చంద్రబాబు ప్రభుత్వం మొదట మదనపల్లిలో ఏదో జరిగిందని రెండు నెలలు రాద్ధాంతం చేసింది. ఆ కేసులో అనుమానితుడిని తీసుకెళ్లి పాలిగ్రాఫ్ టెస్ట్ చేసి విచారించారు. ఆరోపణలన్నీ కట్టు కథ అని తేలింది. తర్వాత గనుల శాఖలో అవకతవకలు, ఇసుకలో రూ.వేల కోట్లు అవినీతి అని అన్నారు. అది కూడా అవాస్తవ ఆరోపణలు, తప్పుడు కథనమేనని తేలింది. వందల గనులు అన్యాక్రాంతం అని మరో తప్పుడు ఆరోపణలు చేశారు. అవీ నిరూపించలేదు. మా సొంత భూములను అటవీ భూముల ఆక్రమణ అని కొన్నాళ్లు రాద్ధాంతం చేశారు. దీనిపై మేం కోర్టుకు వెళ్లాం. అవన్నీ అటవీ భూములు కాదని అంతా సక్రమంగానే ఉందని మళ్లీ వాళ్లే కోర్టుకు నివేదిక ఇచ్చారు. తర్వాత భూముల ఆక్రమణ అని మరో తప్పుడు కేసు పెట్టారు. ఏదీ నిరూపించలేకపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆరోపణ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసిరాం. ఒక్కరూ రాలేదు. ప్రతి రెండు నెలలకు కూటమి ప్రభుత్వం ఏదో ఒక స్కాం అంటూ మాపై నిందలు వేస్తోంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. ఇప్పుడు లిక్కర్ స్కాం అని మరో ఆరోపణ చేస్తున్నారు. అన్నింటి మాదిరిగానే ఇదీ తప్పుడు కేసని నిర్ధారణ అవుతుంది. ఇదంతా రాజకీయ కక్షలో భాగమే. డ్రగ్స్, మానవ అక్రమ రవాణా మినహా అన్ని కేసులను మా పార్టీ నాయకులపై పెట్టి వేధించాలని ప్రయత్నించారు. లిక్కర్ స్కాం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున అన్ని వివరాలు చెప్పలేకపోతున్నాను. కోర్టు నిర్ణయం వచ్చిన తరువాత మీడియా ముఖంగా అన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు. -
అక్రమ కేసే.. బాబు కుట్రే!
సాక్షి, అమరావతి: కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి.. వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తోందన్నది నిగ్గు తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్రెడ్డి శనివారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6.30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయనను రెండు దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగేదీ ఏమీ ఉండదని తేలిపోయింది. అబద్ధపు వాంగ్మూలాలే సిట్కు ఆధారం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్రెడ్డిని ప్రశి్నంచారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్లను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవరెడ్డి మూడు సార్లు కోర్టుకెళ్లినా.. ఆయనను బెంబేలెత్తేలా చేసి, సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలంపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్రెడ్డిని విచారణలో ప్రశి్నంచారని తెలిసింది. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తోంది.సిట్ ప్రశ్నలకు మిథున్ సమాధానాలివీ...అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి దీటుగా తిప్పికొట్టారని, అధికారుల ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారసహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఇలా సాగింది.. సిట్: అడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా? మిథున్రెడ్డి: విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్ అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది. (దాంటో సిట్ అధికారులు మౌనం వహించారు) సిట్: ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పీఎల్ఆర్ గ్రూప్నకు రూ.5 కోట్లు బదిలీ అయ్యాయి కదా.. ఎందుకు? మిథున్రెడ్డి: ఔను. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనుల ఈఎండీ, బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబరులో రూ.5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో రూ.5 కోట్లను తిరిగిచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు.. (అగ్రిమెంట్ కాపీ, బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు). ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుందని మేం ఆరేళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా..? ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. (దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు) సిట్: రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి రూ.100 కోట్లు అప్పు ఇప్పించారా? మిథున్రెడ్డి: ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెబుతాను? విజయ సాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే.. అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను, తీసుకున్నవాళ్లను, ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. (దాంతో సిట్ అధికారులు ఆ అంశాన్ని కొనసాగించలేకపోయారు) సిట్: రాజ్ కసిరెడ్డి తెలుసా.. ఆయనతో మీకు వ్యాపార సంబంధాలున్నాయా? మిథున్రెడ్డి: రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. సిట్: మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొనుగోలు చేశారు కదా? (అని కొన్ని పత్రాలు చూపించారు) మిథున్రెడ్డి: అవును. అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే. ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా వెల్లడించాను. రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు.. వాంగ్మూలంలో నమోదు టీడీపీ కూటమి ప్రభుత్వంరాజకీయ కుట్రతోనే తమపై ఈ అక్రమ కేసు నమోదు చేసిందని మిథున్రెడ్డి సిట్ అధికారులకు విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు ఆ విషయాన్ని తాను వెల్లడించినట్టుగా వాంగ్మూలంలో సిట్ అధికారులతో రికార్డు చేయించారు. తన అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేయాలని ఆయన పట్టుబట్టారు. దాంతో సిట్ అధికారులు ఆ విషయాన్ని నమోదు చేశారు. -
కట్టు కథలు.. తప్పుడు ప్రచారాలు.. కూటమి సర్కార్పై మిథున్రెడ్డి ఫైర్
సాక్షి, విజయవాడ: కూటమి సర్కార్ వచ్చాక తమపై కక్ష సాధింపులకు దిగుతున్నారని.. కట్టు కథలు అల్లి తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని.. తమ సొంత భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ మిథున్రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని.. అందుకే మద్యం కేసు గురించి తాను పూర్తిగా మాట్లాడలేనని తెలిపారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగంగా పెట్టిన కేసు మాత్రమే. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్రెడ్డి చెప్పారు. -
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్ చెప్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025 -
‘సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు జగన్’
తాడేపల్లి : సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సెల్ సమావేశంలో సజ్జల పాల్గొన్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రులు జోగి రమేష్, ధర్మాన కృష్ణదాస్, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, అన్ని జిల్లాల బీసీ నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ నిరూపించారు. చంద్రబాబుది అవకాశవాద రాజకీయం. అధికారంలోకి రాగానే దోచుకోవడం, దాచుకోవడమే. ఈసారి మరింత బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఈ పది నెల చంద్రబాబు పాలన చూస్తేనే జనానికి అర్ధమవుతుంది. ఈ దుర్మార్గపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాలి. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి. గతంలో కంటే మెరుగ్గా పూర్తిస్థాయి కమిటీలు నియమించుకుందాం’ అని సజ్జల పేర్కొన్నారు.రాష్ట్రంలో నియంతృత్వ పాలనను చూస్తున్నాంఅధికార యంత్రాంగమే మాఫియా ముఠాలా వ్యవహరిస్తోంది.అందరూ కలిసి ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తున్నారు, విశాఖలో నానారకాలుగా అక్రమాలు చేసి బీసీ మహిళను పదవి నుంచి తప్పించారు. కూటమి నేతల ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను గట్టిగా తిప్పికొడదాం’ అని సజ్జల సూచించారు. -
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే -
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం... దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల(ఉప వర్గీకరణ) నిబంధనలు–2025 పేరిట మార్గదర్శకాల(రూల్స్)ను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్లోని సెక్షన్–3 ప్రకారం రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉప కులాలను మూడు గ్రూపులుగా చేసి 15శాతం రిజర్వేషన్ను వర్గీకరించినట్లు తెలిపారు. » గ్రూప్–1లో ఉన్న 12 రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇందులో బావురి(సీరియల్ నంబర్ 8), చచటి(12), చండాల(16), దండసి(18), డోమ్, దొంబర, పైడి, పనో(20), ఘాసి, హడ్డి, రెల్లి చచండి(22), గొడగలి, గొడగుల(23), మెహతార్(48), పాకీ, మోతి, తోటి(51), పమిడి(53), రెల్లి(55), సప్రు(58) కులాలు ఉన్నాయి. » గ్రూప్–2లో 18 మాదిగ ఉపకులాలకు 6.50శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూపులో అరుంధతీయ(సీరియల్ నంబర్ 5), బైండ్ల(10), చమర్, మోచి, ముచి, చమర్–రవిదాస్, చమర్–రోహిదాస్(14), చంభర్(15), డక్కల్, డొక్కల్వార్(17), ధోర్(19), గోదారి(24), గోసంగి(25), జగ్గలి(28), జంబువులు(29), కొలుపులవాండ్లు, పంబాడ, పంబండ, పంబాల(30), మాదిగ(32), మాదిగ దాసు, మష్తీన్(33), మాంగ్(43), మాంగ్ గరోడి(44), మాతంగి(47), సమగర(56), సింధోల్లు, చిందోల్లు(59) కులాలు ఉన్నాయి. » గ్రూప్–3లో 29 మాల ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ గ్రూపులో ఆది ద్రవిడ(సీరియల్ నంబర్ 2), అనాముక్(3), అరే మాల(4), అర్వమాల(6), బరికి(7), బయగార, బయగారి(11), చలవాడి(13), ఎల్లమలవార్, ఎల్లమ్మలవాండ్లు(21), హోలెయా(26), హోలెయ దాసరి(27), మాదాసి కురువ, మదారి కురువ(31), మహర్(34), మాల, మాల అయ్యవారు(35), మాలదాసరి(36), మాలదాసు(37), మాలహన్నాయి(38), మాలజంగం(39), మాలమస్తీ(40), మాలాసేల్, నెట్కాని(41), మాలసన్యాసి(42), మన్నె(45), ముండాల(50), సంబన్(57), యాతల(60), వల్లువన్(61), ఆది ఆంధ్ర(1), మస్తీ(46), మిత అయ్యాళ్వార్(49), పంచమ, పరియా(54) కులాలు ఉన్నాయి. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో మూడు గ్రూపుల్లోను మహిళలకు 33(1/3)శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ నియామకాలు, బ్యాక్లాగ్ పోస్టులు తదితర వాటిలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ వర్తింపజేస్తారు. 200 రోస్టర్ పాయింట్లు... రెండు సర్కిల్స్గా అమలు ఆర్డినెన్స్లో పేర్కొన్న ఎస్సీ ఉప కులాలకు మొత్తం 200 రోస్టర్ పాయింట్లను రెండు సర్కిల్స్గా అమలుచేయాలని సీఎస్ నిర్దేశించారు. మొదటి వంద (1 నుంచి 100 వరకు)లో రెల్లి ఉపకులాలకు ఒకటి, మాదిగ ఉపకులాలకు ఆరు, మాల ఉపకులాలకు ఎనిమిది రోస్టర్ పాయింట్లు కేటాయించారు. రెండవ వంద(101 నుంచి 200 వరకు)కు రెల్లి ఉపకులాలకు ఒకటి, మాదిగ ఉపకులాలకు ఏడు, మాల ఉపకులాలకు ఏడు చొప్పున రోస్టర్పాయింట్లు కేటాయించారు. రోస్టర్ ప్రకారం మొదటి వంద పోస్టుల్లో గ్రూప్–1కు 2, గ్రూప్–2కు 7, 22, 41, 52, 66, 77, గ్రూప్–3కు 16, 27, 47, 62, 72, 87, 91, 97 రోస్టర్ విధానం నిర్ణయించారు. రెండవ వంద పోస్టుల్లో గ్రూప్–1కు 2, గ్రూప్–2కు 7, 22, 41, 52, 66, 77, 97, గ్రూప్–3కి 16, 27, 47, 62, 72, 87, 91 రోస్టర్ విధానాన్ని సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చే నోటిఫికేషన్లలో పోస్టులకు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఆయా గ్రూపుల్లో అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే వేరేవారితో భర్తీ చేకూడదు. నిర్దేశించిన వారి కోసమే రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి. అప్పటికీ ఆ గ్రూపులో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మూడవసారి నోటిఫికేషన్ ద్వారా ఆ తర్వాత గ్రూపులో అర్హులతో భర్తీ చేయవచ్చు. -
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: ఇప్పటికే టోఫెల్ ఎత్తేశారు.. అమ్మ ఒడి ఆపేశారు.. విద్యార్థుల ట్యాబ్లకు ఎగనామం పెట్టారు. నాడు–నేడు నిలిపివేశారు. గోరుముద్ద నాణ్యత తగ్గించేశారు. ఇప్పుడు సబ్జెక్ట్ టీచర్లను ఎత్తివేస్తూ ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను పునర్ వ్యవస్థీకరించనున్నారు. ఐదు రకాల పాఠశాలలకు తగినట్లుగా టీచర్లను కేటాయించనున్నట్టు (టీచర్స్ రీపోర్షనేట్) పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఎంఈవోలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి నూతన విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు రకాల ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ఇందులో ఫౌండేషన్ స్కూల్ (1, 2 తరగతులు), బేసిక్ ప్రైమరీ స్కూల్ (1–5), మోడల్ ప్రైమరీ స్కూల్ (1–5), అప్పర్ ప్రైమరీ స్కూల్ (1–8), ఉన్నత పాఠశాలలు (1–10) ఉండనున్నాయి. టీచర్ల కేటాయింపు ఇలా.. » ఫౌండేషన్ (1, 2): ఒకటి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 31–60 మంది వరకు ఇద్దరు ఎస్జీటీలు ఉంటారు. » బేసిక్ ప్రైమరీ (1–5): ఒకటి నుంచి 20 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 21 నుంచి 60 వరకు విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలు బోధిస్తారు. » మోడల్ ప్రైమరీ (1–5): 59 మంది విద్యార్థుల వరకు నలుగురు టీచర్లను కేటాయించారు. ఎస్జీటీల్లో మిగులు ఉంటే ఐదుగురిని కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 60 మంది, ఆపై 150 వరకు ఉంటే ఒక హెచ్ఎం, నలుగురు ఎస్జీటీలను ఇస్తారు. అలాగే, 120 దాటిన తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీని కేటాయిస్తారు. » ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలు (1–8): ఈ పాఠశాలల్లోని 1–5 తరగతుల వరకు బోధనా సిబ్బంది నియామకానికి బేసిక్ ప్రైమరీ/ మోడల్ ప్రైమరీ స్కూళ్ల నిబంధనలే వర్తిస్తాయి. ఆరు నుంచి 8వ తరగతి వరకు 10 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 11 నుంచి 30 వరకు ఇద్దరు ఎస్జీటీలు 31– 140 వరకు నలుగురు ఎస్జీటీలు, 141–175 మంది విద్యార్థుల వరకు ఐదుగురు ఎస్జీటీలను మంజూరు చేస్తారు. » ఉన్నత పాఠశాలలు (1–10): బేసిక్ ప్రైమరీ స్కూల్లో కేవలం ఎస్జీటీలే ఉంటారు. ఇందులో 10 మంది విద్యార్థుల వరకు ఇద్దరు టీచర్లు, 11 నుంచి 30 మంది విద్యార్థులకు ముగ్గురు, 31–40 మందికి నలుగురు, 40 మందికి పైన విద్యార్థులకు ఐదుగురు ఎస్జీటీలు ఉంటారు. 6–10 తరగతులకే సబ్జెక్టు టీచర్లు గత ప్రభుత్వంలో హైసూ్కళ్లలో విలీనమైన 3–5 తరగతులకు సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేశారు. కేవలం 6 నుంచి 10 తరగతులకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు. ఇందులో సెక్షన్ బట్టి టీచర్ల కేటాయింపు జరిగింది. సెక్షన్ల ఆధారంగా స్టాఫ్ ప్యాట్రన్ నిర్ణయించారు. 54 మంది విద్యార్థుల వరకు మొదటి సెక్షన్గా పరిగణిస్తారు. అనంతరం ప్రతి 40 మందికి ఒక అదనపు సెక్షన్గా లెక్కిస్తారు. ఇలా 5 నుంచి 25 సెక్షన్ల వరకు విభజించి, 8 నుంచి 31 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఉన్నత పాఠశాలల్లో 76 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీని కేటాయిస్తారు. అంతకంటే తక్కువుంటే ఈ పోస్టులు ఉండవు. జనవరిలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో 3–5 తరగతులతో ఏర్పాటు చేస్తామన్న మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రస్తావన తాజా ఆదేశాల్లో లేకపోవడంపై టీచర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: రెడ్బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకంవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్కు చైర్మన్గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. -
టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా
సాక్షి, అమరావతి: టీటీడీ గోశాలలో ఒకేసారి వందల గోవులు చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని, దీనివెనుక కుట్ర ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి, విరాట్ హిందూస్థాన్ సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్స్వామి అభిప్రాయపడ్డారు. కొన్ని గోవులే చనిపోయాయని తేలిగ్గా వదిలేసే విషయం కాదని, ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. తిరుపతి నుంచి అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరుమల వెళ్లి పూజల్లో పాల్గొన్న అనంతరం గోవుల మరణంపై అదనపు సమాచారం సేకరించి, జూలై మొదటి వారంలోగా కోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు. సమర్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని, ఇదొక సర్వ సాధారణంగా మారిందని సుబ్రమణియన్స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లమంది ఆరాధ్య దైవంగా భావించే గోవుల రక్షణకు రాజ్యాంగ పరంగా ప్రాధాన్యం ఉందని.. కానీ, టీటీడీ పెద్దలు, ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని సుబ్రమణియన్స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం చంద్రబాబే తప్పించాలని డిమాండ్ చేశారు. సుబ్రమణియన్స్వామి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ గోవుల మృతి నాకు చాలా బాధ కలిగించింది. ఎన్ని చనిపోయాయన్నది కాదు. రాజ్యాంగంలో గో సంరక్షణ గురించి స్పష్టంగా ఉంది. ప్రతి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉండాలి. వయసు మళ్లిన మనుషుల్లాగే గోవులు కూడా చనిపోతున్నాయంటూ టీడీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్లిందని వదిలేస్తారా? ఎవరినైనా వృద్ధులని చంపేస్తుంటే అది సాధారణమే అనుకోవచ్చా? ఇవి పరిణతి లేని వ్యాఖ్యలు.చంద్రబాబు ప్రభుత్వానిది వ్యాపార ధోరణిగోవుల జీవనశైలి భిన్నమైనది. చాలా ఊళ్లలో ఎవరి అజమాయిషీ లేకుండా ఆరోగ్యంగా జీవిస్తుంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోయే పరిస్థితి సాధారణంగా ఉండదు. టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వ వ్యాపార ధోరణి కారణంగా ఇలా జరుగుతుండొచ్చు. గోవులకు సరైన వైద్యం అందించకుండా వదిలేస్తున్నందుకే ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేం. గోవుల కళేబరాలను ఏం చేశారన్నది తేలాల్సి ఉంది. మాంసాన్ని రెస్టారెంట్లకు పంపుతున్నారా? గోవు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. టీటీడీ చైర్మన్ దానిగురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు ఎవరూ అలా మాట్లాడరు. ఒకేసారి పెద్ద సంఖ్యలో గోవుల మృతి వెనుక టీటీడీ నిర్లక్ష్యం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి.టీటీడీలో పాలనా వైఫల్యంవరుస ఘటనలు టీటీడీ పాలనా వైఫల్యాలే. టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది. సీఎం వెంటనే చైర్మన్ను బర్తరఫ్ చేయాలి. గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ చేపట్టినవారు ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారు. చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు. ఎవరు ఏమడిగినా సమాధానం ఇచ్చేవారు. -
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి..? ముందుగా పేరెన్నికగన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి.. అదే మా పాలసీ అంటూ మనవాళ్లకు కట్టబెట్టేయడమే. ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేస్తున్నది ఇదే.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేశ్.. సీఎం చంద్రబాబుకు చెప్పడం.. వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం.. అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చౌకగా భూములు కేటాయించండి అని అడగనేలేదు. అయినా, విశాఖ ఐటీ హిల్ నంబర్ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకే టీసీఎస్కు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న టీసీఎస్కి చౌకగా భూములు కేటాయించినా ఎవరూ ఏమీ అనరు అన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మిక్కు. ‘‘ఇదిగో ఇదీ మా ఐటీ పాలసీ’’ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టేస్తోంది. అలా టీసీఎస్కు భూమి కేటాయించగానే.. ఇలా డేటా సెంటర్ పేరుతో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు ఏకంగా 60 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడో విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీ ఏర్పాటైంది రెండు నెలలు క్రితమే. అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్ నెంబర్3 లో 3.5 ఎకరాలు , కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. టీసీఎస్ పాలసీ ముసుగుఉర్సా క్లస్టర్కు భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మంత్రి మండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూకేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఉర్సా క్లస్టర్కు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మధురవాడ, కాపులుప్పాడలో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. ఇంతటి ఖరీదైన భూములను తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి సర్కారు ప్రణాళికలు వేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు టీసీఎస్కు ఇచ్చిన ప్రకారం ఎకరా 99 పైసలకే ఇస్తే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూములను కేవలం రూ.59కే ఇచ్చే విధంగాప్రభుత్వ ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారంటున్నారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి వరకు శంషాబాద్ జీఎంఆర్ ఎయిర్పోర్టులో మేనేజర్గా పనిచేస్తున్న పెందుర్తి విజయకుమార్, అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూరి కలిసి రూ.9.10 లక్షల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం రెండు నెలల క్రితం అదీ కూడా డేటా సెంటర్, ఐటీ కార్యాలయాలు నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేటాయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్ మిలియన్ టవర్లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా 99 పైసలకే భూములు కేటాయిస్తూ... దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడమేనని పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ ఒకరు వ్యాఖ్యానించారు.ఇలా పెట్టు.. అలా భూమి పట్టు‘ముందుగా వచ్చి మాట్లాడు.. ఆ తర్వాత వెళ్లి కంపెనీ పెట్టు.. వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో.. ఆ తర్వాత వందల ఎకరాల భూమి తీసుకో..’ ఇప్పుడిది మన రాష్ట్రంలో జరుగుతున్న తీరు. గతేడాది డిసెంబర్ ఆఖరు వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్లారు. వెంటనే జనవరి 3న రూ.కోటి మూలధనంతో కాన్పూర్ ఆర్వోసీలో ఇండిచిప్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే జనవరి 11న ఏకంగా రూ.14,000 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్ సెమీ కండక్టర్ కంపెనీలో పీయూష్ బిచోరియా, వెబ్ చాంగ్, సందీప్ గార్గ్లు డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంత వరకు సెమీకండక్టర్ తయారీ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు.. అంత ఆర్థిక శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్లో అత్యంత విలువైన వందల ఎకరాలను ఇండిచిప్కు అత్యంత చౌకగా కేటాయించనున్నారు. అలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో సుమారు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఐదో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ కంపెనీలో నవయుగ గ్రూపునకు చెందిన చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారులోని పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే నవయుగ గ్రూపునకు గ్రీన్ ఎనర్జీ పేరిట వేల ఎకరాలను కట్టబెట్టనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకనేతగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితునిగా ఉన్న పేరున్న కిలారు సునీల్కి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్ రూ.50 కోట్లతో పెట్టుబడి పెడుతుందంటూ తొలి ఎస్ఐపీబీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్ను టీసీఎస్కు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు టీసీఎస్ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన మిలీనియం టవర్స్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత విలువైన భూములను సొంత వారికి వేగంగా కేటాయిస్తూ పోతుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
అప్పు చేసి పప్పు కూడు తినకూదదంటారు పెద్దలు..! ఎందుకంటే చేసిన అప్పును వడ్డీతో కలిపి చెల్లించాలి కాబట్టి..! అప్పుగా తెచ్చిన డబ్బులను ఆస్తుల కల్పన కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి! రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజధానికి రుణ పాశం బిగిస్తున్నారు! అప్పు చేసి మరీ జేబులు నింపుకొంటున్నారు! రాజధాని అమరావతి నిర్మాణ పనులే అందుకు నిదర్శనం. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి సర్కారు మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది. అలా అప్పు తెచ్చిన నిధులతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి సిండికేట్ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెడుతోంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం మొబిలై జేషన్ అడ్వాన్సు ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని ముఖ్యనేత నాకింత..! అంటూ వసూలు చేసుకుంటున్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ విధానానికి పాత రేసి.. అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి దోచేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పనుల టెండర్లలో ఈ సిండి ‘కేటు’ దందా తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!! సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో 2014లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.40,497.55 కోట్ల విలువైన 63 ప్యాకేజీల పనులను సిండికేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఆ మేరకు పనులు అప్పగిస్తూ సిండికేట్ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) అగ్రిమెంట్ (ఒప్పందం) చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.4,049.75 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పాయి. అందులో ఎనిమిది శాతం అంటే రూ.3,239.80 కోట్లను ముఖ్యనేత వసూలు చేసుకున్నారు! అధిక ధరలకు కట్టబెట్టి.. రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు.. వెరసి రూ.31 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెచ్చింది. రాజధాని నిర్మాణ పనులకు రూ.77,249 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని.. మరో 46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పు తెచ్చిన నిధులతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. పనుల అంచనాలను భారీగా పెంచేశారు. అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాపై తీవ్ర భారం మోపారు. » ప్రస్తుత ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్లకు మించదు. ప్రస్తుత ధరల ప్రకారం మట్టి తవ్వకానికి క్యూబిక్ మీటర్కు రూ.వంద చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 10 నుంచి 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వకానికి కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వ్యయం కాదని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజధాని వరద ముంపు నివారణ పనుల్లో 0.4 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రూ.470.74 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఆ పనిని రూ.487.41 కోట్లకు(3.54 శాతం అధిక ధరకు) ఎన్సీసీ సంస్థకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేయనున్నారు. అంటే 0.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నీరుకొండ రిజర్వాయర్ పనులను రూ.555.41 కోట్లకు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది. అంచనా వ్యయాన్ని రూ.305.41 కోట్లు పెంచేసినట్లు వెల్లడవుతోంది. » దేశంలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) కి.మీ.కి సగటున రూ.20 కోట్ల చొప్పున ఆరు వరుసలతో కూడిన జాతీయ రహదారులను నిర్మిస్తోంది. కానీ అమరావతిలో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఈ–13 రహదారిని ఎన్హెచ్–16 వరకూ పొడిగిస్తూ 7.29 కి.మీ.ల పొడవున ఆరు వరుసలతో నిర్మించడానికి రూ.384.78 కోట్ల అంచనాతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీఎస్టీ, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో 81.92 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. అంచనా వ్యయం రూ.466.7 కోట్లు అన్నమాట. ఈ లెక్కన కి.మీకి 64.01 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు టెండర్ పిలిచినట్లు స్పష్టమవుతోంది. జాతీయ రహదారికి కి.మీ.కి అయ్యే వ్యయం కంటే ఈ–13 రహదారి వ్యయం రూ.44.01 కోట్లు అధికంగా పెంచేశారు. » భూసమీకరణ కింద రాజధానికి 29,357 మంది రైతులు 34,773.76 ఎకరాల భూమిని ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ఆ రైతులకు 17 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద రూ.14,887.64 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాంట్రాక్టు విలువలో 18 శాతం జీఎస్టీ, 0.45 శాతం సీనరేజీ, 0.1 శాతం న్యాక్ పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. అప్పుడు వాటి వ్యయం రూ.2,761.66 కోట్లు ఇస్తారన్నమాట. ఈలెక్కన ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి పనుల కాంట్రాక్టు విలువ రూ.17,649.3 కోట్లుకు చేరుతుంది. ఈ లెక్కన ఎకరంలో లే అవుట్ అభివృద్ధికి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్ను అభివృద్ధి చేసినా ఎకరానికి రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలకు మించదని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. » అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం తగ్గాలి. కానీ వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.10,042.86 చొప్పున అప్పగించడం గమనార్హం. మిగతా భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే తీరు.జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ రద్దు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ విధానం వల్ల 2019–24 మధ్య ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసి రాజధాని పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు అధిక ధరలకు రూ.40,497.55 కోట్ల విలువైన పనులు అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.1231.42 కోట్ల మేర భారం పడింది. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టర్లు పోటీ పడి ఖజానాకు రూ.3,500 నుంచి రూ.4 వేల కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉండేదని ఇంజినీరింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీఎస్సార్కు రూ.7,298.97 కోట్లు.. ఆర్వీఆర్కు రూ.6,031.79 కోట్ల పనులురాజధాని పనుల టెండర్లలో సిండికేట్ కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు బిడ్లు దాఖలు చేస్తే టెక్నికల్ బిడ్లోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేస్తున్నారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్కు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,298.97 కోట్ల విలువైన పనులు ఇప్పటికే అప్పగించారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,022.38 కోట్ల విలువైన పనులను అప్పగించేశారు. » టీడీపీకి బాకా ఊదే ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు రూ.6,031.79 కోట్లు విలువైన పనులు కట్టబెట్టారు. » ఎన్సీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏవీ రంగరాజు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ సంస్థకు శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం సహా రూ.6,910.93 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » ఎల్ అండ్ టీ సంస్థకు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంతోపాటు రూ.1,427.21 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » నారా లోకేశ్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్కు అత్యంత సన్నిహితుడు ఎం.వెంకట్రావు. ఆయనకు చెందిన ఎంవీఆర్ ఇన్ఫ్రా సంస్థకు రూ.796.04 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్సీపీఎల్ సంస్థకు రూ.779.82 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్కు ఆప్తుడైన కనకమేడల వరప్రసాద్కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » జాయింట్ వెంచర్గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు రూ.309.6 కోట్ల విలువైన పనులు అప్పగించారు. మరో రూ.7,202.3 కోట్ల పనులూ సిండికేట్కే.. గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్కు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద రూ.1,960.36 కోట్ల అంచనాతో నాలుగు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్లు ఆర్థిక బిడ్ దశలో ఉన్నాయి. ఈనెల 16న శాశ్వత సచివాలయం నిర్మాణంలో భాగంగా ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ టెండర్లు పిలిచింది. ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.553.12 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ల దశలో ఉన్న ఈ రూ.7,202.3 కోట్ల విలువైన పనులను సిండికేట్ కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. రాజధానికి వరద ముప్పును నివారించేందుకు కొండవీటివాగుపై మరో ఎత్తిపోతల, గ్రావిటీ కెనాల్పై మరో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి.. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఏడీసీఎల్, సీఆర్డీఏ కసరత్తు చేస్తున్నాయి. ఈ పనులు కూడా సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టనున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు.. రాజధాని పనులకు ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు అని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు రుణం తెచ్చారు. మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చదరపు అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించారు. అంటే అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.15,833 పెరిగింది.తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయమే ఈ స్థాయిలో పెరిగితే శాశ్వత నిర్మాణాల వ్యయం ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. కనీసం రూ.లక్ష కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ డబ్బంతా అప్పులు తేవాల్సిందే. అదంతా వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఇలా అప్పు తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలసి దోచుకుంటూ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారనే ఆందోళన అటు మేధావులు.. ఇటు అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇదీ స్థూలంగా నష్టం..!రాజధాని పనులను అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల జానాపై అదనపు భారం: రూ.1,231.42 కోట్లకుపైగాజ్యుడీషియల్ ప్రివ్యూ– రివర్స్ టెండరింగ్ అమలు చేయకపోవడంతో నష్టం: రూ.4,000 కోట్లుకాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి 8 శాతం కమీషన్లు వసూళ్లతో అక్రమాలు: రూ.3,200 కోట్లకుపైగా -
ఈవీ @20 లక్షలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తోడు కలవరపెడుతున్న కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విద్యుత్ వాహనాల(ఈవీ)లను వాడాలని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఓ నినాదం ఉద్యమంలా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే మన దేశంలోనూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాల విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. 2023–24లో ఈ సంఖ్య 16 లక్షలు ఉండేది. జేఎంకే రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ విడుదల చేసిన ‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఈవీ విక్రయాలు ఇలా..2024–25 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 20 లక్షల విద్యుత్ వాహనాల్లో సగం (60 శాతం)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24 శాతం. ప్రయాణికులు, సరుకు రవాణాకు వినియోగించే త్రిచక్ర వాహనాల వాటా దాదాపు 36 శాతం. వీటి విక్రయాలు సుమారు 7 లక్షల వరకు జరిగాయి. మొత్తంగా 2020 నుంచి చూస్తే నాలుగేళ్లలో 61.66 లక్షల వాహనాల కొనుగోలు జరిగింది. ఈ ఫలితం.. గత ప్రభుత్వ పుణ్యమే ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వీటికి సంబంధించి సర్వీస్ చార్జీలను నిర్ణయించాల్సిందిగా రాష్ట్రాలకు గతంలో కేంద్రం సూచించింది. ఈమేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోని గత ప్రభుత్వం చొరవ చూపింది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో 266 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలన్నీ నిలిచిపోయాయి.‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ప్రకారం.. » ఈవీ విక్రయాలు, వినియోగంలో మొదటి ఐదు రాష్ట్రాలుః ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ » ద్విచక్ర ఈవీ విక్రయాల్లో 50 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. » తొలి మూడుస్థానాల్లో ..ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ సంస్థలు » 70 శాతం విక్రయాలు ఈ మూడు సంస్థలవే. » మూడు చక్రాల వాహనాల్లో 11% పెరుగుదల » విద్యుత్ కార్ల విక్రయాల్లో 11 శాతం వృద్ధి » గతేడాదిలో లక్ష విద్యుత్ కార్ల విక్రయాలు » ఈవీ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్56 శాతంతో ముందంజ » ఎంజీ మోటార్స్ 28 శాతంతో రెండో స్థానం » ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు 3,834 » గతేడాది కంటే 3 శాతం క్షీణించిన ఈవీ బస్సుల విక్రయాలు -
టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం
తిరుపతి,సాక్షి: తిరుపతి టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము కలకలం రేపింది. గురువారం రాత్రి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో అప్రమత్తమైన టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులు సమాచారం ఇచ్చారు. ఈవో శ్యామలరావు సమాచారంతో పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు బంగ్లాకు చేరుకున్నారు. బంగ్లాలో బుసలు కొడుతున్న పామును చాకిచక్యంగా పట్టుకున్నారు. అనంతరం, పామును గోనె సంచిలో వేస్తుండగా ఒక్కసారిగా ఆయన చేతిపై కాటు వేసింది.దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం రవీందర్ నాయుడును స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులోనే చికిత్స కొనసాగుతోంది. -
‘సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను టార్చర్ చేశారు సర్’..కోర్టులో కృష్ణవేణి ఆవేదన
పల్నాడు జిల్లా,సాక్షి: దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ తనను బాగా ఇబ్బంది పెట్టారంటూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి గురజాల కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.రెడ్బుక్ రాజ్యాంగం మేరకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని పోలీసులు గురువారం గురజాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టులో పాలేటి కృష్ణవేణి అరెస్టుపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. ‘దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. నిన్న సాయంత్రం హైదరాబాదులో ఐదు గంటల పది నిమిషాలకు నన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి దాచేపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. రాత్రి తినడానికి నాకు ఆహారం కూడా ఏమి పెట్టలేదు. మూడున్నరకి కొంత ఆహారం పెట్టారు. మేం చెప్పినట్టు వినకపోతే సీఐ భాస్కర్ కేసులు పెడతామని బెదిరించారు.నా భర్త రాజ్ కుమార్పైన గంజాయి కేసు పెడతామని సీఐ భాస్కర్ బెదిరించారు. నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అని సీఐ భాస్కర్ నన్ను వేధించాడు. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అని టార్చర్ చేశారు. ఈ పోస్టులు వెనక పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో చెప్పమని ఇబ్బంది పెట్టారు. పార్టీ నాయకుల పేర్లు చెప్పమని బలవంతం చేశారు’ అని అన్నారు. అయితే తాను పెట్టిన పోస్టులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కృష్ణవేణి న్యాయమూర్తికి చెప్పారు. అనంతరం మిమ్మల్ని పోలీసులు ఎలా చూసుకున్నారని కృష్ణవేణిని న్యాయమూర్తి ప్రశ్నించారు. నన్ను బాగా ఇబ్బంది పెట్టారని కృష్ణమూర్తి చెప్పగా.. పోలీసులు పైన కంప్లైంట్ ఇస్తారా? అని న్యాయమూర్తి కృష్ణవేణిని అడిగారు. అందుకు తాను పోలీసులపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా.. కృష్ణవేణి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఆమె తరుఫు న్యాయవాది.. న్యాయమూర్తిని కోరారు. వాదన సందర్భంగా దాచేపల్లి పోలీస్ స్టేషన్ గేట్లకు బేడీలతో తాళాలు వేసిన విజువల్స్ న్యాయమూర్తిగా చూపించారు. అనంతరం, కృష్ణవేణికి 14 రోజులు పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను గుంటూరు కోర్టుకు తరలించారు. కృష్ణవేణి కస్టోడియల్ టార్చర్పై దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్కు కోర్టు మెమో జారీ చేసింది. -
ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ పుస్తకాలు
దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ ఇంజినీరింగ్ విద్యను అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. తద్వారా ప్రాథమిక, హైసూ్కల్ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్లో ఆంగ్లమాధ్యమంతో ఇబ్బందులు పడుతున్న వారు స్థానిక భాషలోనే చదువుకుని అర్థం చేసుకునేందుకు వీలుకల్పిపస్తోంది. 2026 డిసెంబర్ నాటికి 12 భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనుంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల రూపకల్పనలో నిమగ్నమయింది. – సాక్షి, అమరావతిస్థానిక భాషలో పెరుగుతోన్న ఆదరణ సాంకేతిక విద్యా వ్యవస్థలో భాషా అవరోధాన్ని నివారించడానికి ఏఐసీటీఈ గతంలోనే ప్రాంతీయ భాషలో ఇంజినీరింగ్ విద్యను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా 18 ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ ప్రోగ్రామ్ కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసీటీఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021–22లో కేవలం 233 సీట్లు మాత్రమే భర్తీ అవ్వగా 80 శాతం మేర ఖాళీగా ఉండిపోయాయి. ఆ తర్వాత ఏడాది 2022–23లో 683 సీట్లు, 2023–24లో 928 సీట్లలో విద్యార్థులు చేరారు. కృత్రిమ మేధ సాయంతో 10 నిమిషాల్లో తర్జుమా ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలను ఏఐసీటీఈ రూపొందిస్తోంది.ఈ పుస్తకాలను స్థానిక భాషల్లో వేగంగా తర్జుమా చేసేందుకు కృత్రిమమేధ సాయాన్ని తీసుకుంటోంది. దాదాపు 80 శాతం కచ్చితత్వంతో 10 నిమిషాల్లో పుస్తకాన్ని తర్జుమా చేస్తోంది. మిగిలిన 20 శాతం తప్పొప్పులను నిపుణులు సరిదిద్దుతున్నారు. వాస్తవానికి రాజ్యాంగం 22 ప్రాంతీయ భాషలను గుర్తించినప్పటికీ నిధుల కొరతతో తొలుత 12 స్థానిక భాషల్లో అనువదిస్తోంది. కెనడా, స్విట్జర్లాండ్ దేశాలు స్థానిక భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుమతిస్తున్నాయి. ఇదే బాటలో రష్యా, చైనా, జపాన్ ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోనూ మాతృభాషలో ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను ఏఐసీటీఈ ప్రోత్సహిస్తోంది. -
బంధువే.. రాబందై
తాడేపల్లి రూరల్: మైనర్ బాలికపై వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలి సోదరిపైన కూడా అత్యాచారం చేయబోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అంజిరెడ్డి కాలనీలో ఇటీవల జరగ్గా..ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు..కాలనీలోని ఓ మహిళ తన భర్తను వదిలేసి..తండ్రి రెండో భార్య కుమారుడు కొండపాటి లంకబాబుతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆ మహిళకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పదేళ్లు. రెండవ కుమార్తెకు తొమ్మిదేళ్లు. వీరి తల్లి మద్యానికి బానిస అయ్యింది. చిన్నారులకు మేనమామ వరుస అయ్యే లంకబాబు పదేళ్ల చిన్నారిపై తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బుధవారం తల్లి మద్యం తాగి ఉన్నప్పుడు ఆమె రెండో కుమార్తెతో లంకబాబు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ చిన్నారి ఇంట్లో నుంచి పరుగులు తీసి బయటకు వచ్చి పక్క ఇంట్లో మహిళలకు చెప్పింది. దీంతో వారు లంకబాబును చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఈలోగా లంకబాబు పరారయ్యాడు. లంకబాబు ఆ మహిళ పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆ చిన్నారి భయంతో బయటకు చెప్పలేక తీవ్ర ఇబ్బందులు పడిందని, పోలీసులు జోక్యం చేసుకుని వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదుతో బాధిత చిన్నారులను పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి ఏం జరిగిందో తెలుసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లంకబాబు కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుని ఆయనపై పోక్సో కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలపై గందరగోళం
సాక్షి, అమరావతి: జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(మెయిన్) సెషన్–2 ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విద్యార్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులకు ఎటువంటి అప్డేట్ ఇవ్వని ఎన్టీఏ.. ఫలితాల విడుదలలో దోబూచులాడింది. సాయంత్రం తుది ఆన్సర్ కీ విడుదల చేసినట్టే చేసి, కొద్దిసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. ఫలితాల విడుదల, ఆన్సర్ కీలపై అప్డేట్ లేకుండా విద్యార్థులను గందరగోళానికి గురిచేయడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
అసెంబ్లీ ఎల్అండ్టీకి.. హైకోర్టు ఎన్సీసీకి..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ టెండర్లను అధిక ధరలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైకోర్టు భవన నిర్మాణానికి రూ.752,06,25,211ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786,05,57,470.54 కోట్ చేసిన ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ ఎల్–1గా నిలిచింది. అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ.590,86,61,979ను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617,33,70,035.66 కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ ఎల్–1గా నిలిచింది. ఈ టెండర్లను ఈనెల 5న జరిగిన సమావేశంలో సీఆర్డీఏ అథారిటీ ఆమోదిస్తూ తీర్మానం చేసింది. అసెంబ్లీ భవన నిర్మాణ పనులను ఎల్ అండ్ టీకి, హైకోర్టు భవన నిర్మాణ పనులను ఎన్సీసీ సంస్థకు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈనెల 7న సీఆర్డీఏ కమిషనర్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు పంపారు. వాటిని పరిశీలించిన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్డీఏ అథారిటీ చేసిన తీర్మానం మేరకు అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులను ఆ సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. కాగా, ఈ రెండు టెండర్లలో అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.60.46 కోట్ల భారం పడింది. గత ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం ప్రకారం టెండర్లు నిర్వహించి ఉంటే కనీసం 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లకు ముందుకొచ్చేవారు. దీని వల్ల ఖజానాకు రూ.67.74 కోట్ల మేర ఆదా అయ్యేదని ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. -
ఆగిన ‘అల్ట్రాటెక్’!
సాక్షి టాస్క్ఫోర్స్: సీఎం చంద్రబాబు సర్కారు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు బదులుగా ‘స్పీడ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తోందని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు హోరెత్తుతున్నాయి. వైఎస్సార్ జిల్లా చిలంకూరులోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో కార్యకలాపాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం నాలుగైదు రోజులుగా అడ్డుకోవడంతో ఉత్పత్తి ఆగిపోయి కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న బెదిరింపులు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.మొన్న అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను అడ్డుకుని విధ్వంసం..! నిన్న ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా లారీలను అడ్డుకుని దౌర్జన్యం..! తాజాగా అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యానికి బెదిరింపులు..! వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి ఆది నుంచి అరాచకాలనే ప్రోత్సహిస్తూ దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు.మూడున్నర దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధి..చిలంకూరు సిమెంట్ పరిశ్రమలో సుమారు 35 ఏళ్ల నుంచి స్థానికులు ఉపాధి పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకే అన్ని పనులు కావాలంటూ పరిశ్రమకు రవాణా అవుతున్న సున్నపురాయి, ఫ్లైయాష్ను బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులు శనివారం నుంచి అడ్డుకుంటున్నారు. దీంతో సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అగిపోయి మూతపడే దశకు వచ్చింది.అల్ట్రాటెక్ పరిశ్రమలో ఉత్తరం వైపు సున్నపురాయి మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చినా మొత్తం పనులు తమకే కావాలని ఆదినారాయణరెడ్డి వర్గం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. చిలంకూరులోని ఐసీఎల్ (అల్ట్రాటెక్) సిమెంట్ పరిశ్రమకు సరఫరా అయ్యే సున్నపురాయిని ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకోవటంపై యజమాన్యం ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కలెక్టర్ ఆదేశించారు. చిలంకూరు సిమెంట్ పరిశ్రమకు సున్నపురాయి సరఫరా అడ్డుకోవడంపై ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరులైన ఎస్.జగదీశ్వర్రెడ్డితో పాటు పది మందిపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల సీఐ నరేష్బాబు తెలిపారు. గురువారం చిలంకూరు ఐసీఎల్ (అల్ట్రాటెక్) మైనింగ్ క్వారీ వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.ఇవి అరాచకాలు» గండికోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టిన అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులను తమ వర్గీయులకే అప్పగించాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరులు మందీ మార్బలంతో విధ్వంసం సృష్టించారు.» ఆర్టీపీపీ నుంచి సిమెంట్ కంపెనీలకు ఫ్లైయాష్ రవాణా చేస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డికి చెందిన లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దీన్ని తమకే అప్పగించాలంటూ వీరంగం సృష్టించింది.» ఎర్రగుంట్ల మండలం చిలంకూరు పరిధిలో అల్ట్రాటెక్ (ఐసీఎల్) సిమెంటు పరిశ్రమకు ఫ్లైయాష్, సున్నపురాయి, ఇతర ముడి ఖనిజం సరఫరా, ప్యాకింగ్ ప్లాంట్ కాంట్రాక్టు పనులను 40 ఏళ్లుగా మాజీ మంత్రి మైసూరారెడ్డి సోదరుడు ఎంవీ రమణారెడ్డి చేస్తున్నారు. ఆ పనులన్నీ తమ వర్గీయులకే ఇవ్వాలంటూ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తోంది. -
డీఎస్సీకి వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ రాసే అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం పెంచింది. అభ్యర్థుల గరిష్ట వయసును 42 సంవత్సరాల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులిచ్చారు. 2024 జూలై 1 నాటికి ఈ వయసును పరిగణిస్తామని, ఈ ఒక్కసారికే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పలు పరీక్షల షెడ్యూల్ను వెల్లడించిన ఏపీపీఎస్సీ సాక్షి, అమరావతి: పలు పోస్టుల భర్తీకి ఉద్దేశించిన పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను https://psc.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కార్యదర్శి రాజాబాబు చెప్పారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు– సీనియర్ పౌరుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల రాత పరీక్షను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. 27న మధ్యాహ్నం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 ఉంటుంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో లైబ్రేరియన్ పోస్టులకు ఈనెల 27న ఉదయం పేపర్–2, 28న ఉదయం పేపర్–1 పరీక్ష ఉంటుంది. ఏపీ ఫిషరీస్ సర్వీస్లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల మెయిన్స్ పరీక్షలో భాగంగా ఈనెల 28న ఉదయం పేపర్–1, 30న ఉదయం పేపర్–2, మధ్యాహ్నం పేపర్–3 పరీక్ష జరగనుంది. ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోసు్టల రాత పరీక్ష ఈనెల 28న ఉదయం, మ«ద్యాహ్న సమయాల్లో నిర్వహించనుంది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల పరీక్ష ఈనెల 28, 29 తేదీల్లో జరగనుంది. -
జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ సమర్థ పనితీరుకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి. మూడు ప్రధాన విభాగాలు– పోలీసుల పనితీరు, న్యాయ సహాయం, జైళ్ల పరిస్థితికి సంబంధించి మొత్తం 102 అంశాల ప్రాతిపదికన విడుదలైన ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్– 2025’నివేదిక రాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థను రెండవ స్థానంలో (10 పాయింట్లకు 6.32 స్కోర్) నిలిపింది. 2024 క్యాలñæండర్ ఇయర్ ప్రాతిపదికన ఈ నివేదిక విడుదలైంది. 2024 సంవత్సరం జూన్లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటికీ, అప్పటికి గడచిన ఐదేళ్లలో పోలీసింగ్ వ్యవస్థలో జగన్ ప్రభుత్వం అత్యుత్తమ సంస్కరణలను తెచ్చింది.ఈ సంస్కరణల ప్రభావం తాజా ర్యాంకింగ్లో ప్రతిబింబించింది. అలాగే 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిగజారిన పోలీసు వ్యవస్థలో అన్ని విభాగాలూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గణనీయంగా మెరుగుపడుతూ వచ్చినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కామన్కాజ్ సంస్థతో కలిసి లోక్నీతి ‘సెంటర్ ఫర్ ద స్డడీ డెవలపింగ్ సొసైటీ’(సీఎస్డీఎస్) గతంలో ‘ద స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2025’పేరుతో నిర్వహించిన మరో సర్వేలో కూడా జగన్ పాలనా కాలం 2023–24లో శాంతి భద్రతల పరిరక్షణ, కేసుల పరిష్కారంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే రెండోస్థానంలో నిలవడం గమనార్హం. చంద్రబాబు హయాంలో దేశంలో 13వ స్థానంలో..దేశంలో పోలీసు, న్యాయ సహాయం, జైళ్ల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో 2018 నుంచి ‘ఇండియా జస్టిస్ రిపోర్టు’ ఇస్తున్నారు. కేంద్ర నేర గణాంక విభాగం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు శాఖల గణాంకాలు న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందుతోంది. 18 పెద్ద రాష్ట్రాలు, 11 చిన్న రాష్ట్రాలను వేర్వేరు విభాగాలుగా అధ్యయనం చేస్తూ ఈ నివేదిక విడుదలవుతోంది.2018లో దేశంలోని పోలీసింగ్ వ్యవస్థను (మూడు విభాగాలూ కలిసి) విశ్లేషిoచి 2019లో విడుదలైన నివేదిక ప్రకారం 18 పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. అంటే కింద నుంచి ఆరో స్థానంలో నిలవడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పోలీసు శాఖ అధ్వాన్న పనితీరుకు దర్పణం పడుతోంది. సంస్కరణల బాటన నడిపిన జగన్ ప్రభుత్వం 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచి్చన తరువాత రాష్ట్ర పోలీసు వ్యవస్థను అత్యుత్తమ సంస్కరణల బాటలో నడిపింది. దీనితో 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వాన్న స్థితిలో ఉన్న పోలీసు శాఖ వైఎస్ జగన్ పాలనా కాలంలో క్రమంగా మెరుగుపడుతూ వచి్చంది. ఈ ఫలితాలు తాజా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ప్రతిబింబిస్తున్నాయి. 2022 నివేదిక ప్రకారం (2021లో పనితీరు ఆధారంగా) ఆంధ్ర ప్రదేశ్ పోలీసింగ్ వ్యవస్థ (మూడు విభాగాలూ కలిసి) దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 5వ స్థానానికి ఎగబాకింది. 2025 నివేదిక ప్రకారం (2024లో పనితీరు ఆధారంగా) దేశంలో రెండోస్థానం సాధించింది. 2020, 2021, 2023, 2024లో నివేదికలు విడుదల కాలేదు.బాబు ఘనతగా నమ్మించేందుకు కుయుక్తి తనది కాని ఘనతను తనదిగా చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిస్సిగ్గుగా యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. తమ సోషల్ మీడియా విభాగం ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచారని ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’నివేదిక స్పష్టం చేసింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోయేనాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉందని ఆ నివేదిక వెల్లడించింది. అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖ పనితీరు క్రమంగా మెరుగుపడిందని సవివరంగా పేర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2024 నాటికి ఏపీ పోలీసు శాఖ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం ఆ ఘనతను చంద్రబాబు ప్రభుత్వానికి ఆపాదించేందుకు తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు పడరానిపాట్లు పడుతోంది. -
మద్యం మాఫియా మూలవిరాట్టు బాబే
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై కూటమి సర్కారు సారథి, సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. ఎందుకంటే.. రాష్ట్రంలో మద్యం మాఫియా సృష్టికర్త చంద్రబాబే. మద్యం మాటున మహా దోపిడికీ బ్రాండ్ అంబాసిడర్ ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీనే అన్నది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. రెడ్బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్య విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. ఐదేళ్ల పాటు పాదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోంది. ఈ హడావుడి అంతా.. అసలు మద్యం దందా ఘనాపాఠి చంద్రబాబే అన్నది మరుగునపరచాలన్నది పన్నాగం. కానీ, టీడీపీ మద్యం సిండికేట్ మహా దోపిడీ దాచేస్తే దాగేది కాదు. తన బినామీలు, సన్నిహితులకు డిస్టిలరీల లైసెన్సులు ఇచ్చి.. టీడీపీ ప్రజాప్రతినిధులతో మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి.. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి.. ఊరూపేరు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టి.. మూడు బార్లు ఆరు దుకాణాలుగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారించిన ఘనత చంద్రబాబుదే. ఈ క్రమంలో చీకటి జీవోలతో కనికట్టు చేశారు.. 2014–19 మధ్య ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్ల పన్ను రాబడికి గండికొట్టారు. సిండికేట్ ద్వారా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. చంద్రబాబు పాలనకు పూర్తి విరుద్ధంగా మద్యం విధానంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వినూత్న సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రైవేటు దుకాణాలను రద్దు చేసి సిండికేట్ను రూపుమాపింది. దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేసింది. కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతినివ్వ లేదు. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలు కమీషన్లు ఇస్తాయి. కానీ, తగ్గితే కమీషన్లు ఇవ్వవన్నది ఎవరైనా ఠక్కున చెప్పే వాస్తవం. కానీ, కుట్రపూరితంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కమీషన్లు తీసుకున్నారని కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాతిపెట్టిన ప్రైవేట్ మద్యం సిండికేట్ భూతాన్ని చంద్రబాబు ప్రభుత్వం తవ్వి తీసి ప్రజలపైకి వదిలింది. యథేచ్ఛగా దోపిడీకి బరితెగిస్తోంది. అందుకే.. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు.. చంద్రబాబు మద్యం దోపిడీ సమగ్ర కుట్రను చాటేందుకు.. మద్యం మాఫియాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసిన విధానాన్ని చెప్పేందుకు.. ప్రస్తుతం మళ్లీ పేట్రేగుతున్న మద్యం దందాను తెలియజేస్తోంది ‘సాక్షి’. » 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా.. వారి కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఈ విషయమై.. రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. » చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు, ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 5 డిస్టిలరీల నుంచే.. ముసుగులో చంద్రబాబు దందా డిస్టిలరీలతో కుమ్మక్కయి కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ను సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015–19 మధ్య ఇలా కేవలం ఐదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో... » 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో రూ.4,122.28 కోట్లు ఐదు డిస్టిలరీలలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీకే రూ.1,374.79 కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్కు రూ.457.86కోట్లు, ఎస్వీవై ఆగ్రో ఇండస్ట్రీస్కు రూ.319.57కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. » 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.4,765.75 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. » పెర్ల్ డిస్టిలరీస్కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా.. సెంటిని బయో ప్రొడక్ట్స్కు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం ఈ మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09 శాతం మద్యం కొనుగోలు చేశారు. బార్లలోనూ అదే బరితెగింపు.. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులర్ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుపై 2015 సెప్టెంబరు 9న బార్ల యజమానులు వినతిపత్రం సమర్పించినట్లు రికార్డుల్లో చూపారు. సెపె్టంబరు 9న వినతిపత్రం సమర్పిస్తే దానికి 9 రోజులు ముందుగానే సెపె్టంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది చంద్రబాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ పొందలేదు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబరు 11న జీవో 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబరు 3న సంతకం చేయగా సీఎం హోదాలో చంద్రబాబు 2015 డిసెంబరు 4న డిజిటల్ సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. డిస్టిలరీలన్నిటికీ అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందటి ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి.వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనేలేదు. 2014 నవంబరులో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎౖక్సైజ్2) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. కేబినెట్కు చెప్పకుండానే.. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాక 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్ను పంపారు. ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు పేర్కొనలేదు. కానీ, అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ, ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే.. 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ‘పవర్ స్టార్’, ‘లెజెండ్’లను తెచ్చింది ఎవరు?పవర్ స్టార్, లెజెండ్.. ఇవేవో టీడీపీ కూటమిలోని నాయకుల పేర్ల ముందు ఉండే బిరుదులు కావు. మద్యం బ్రాండ్లు. ఈ రెండే కాదు.. ఊరూ పేరు తెలియని అనేక బ్రాండ్ల మద్యంకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్లో ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడింది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని .. ప్రెసిడెంట్ మెడల్: ఈ బ్రాండ్కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హై వోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబరు 26న అంగీకారం తెలిపారు. రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే పచ్చజెండా ఊపింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చింది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే.. » మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? » మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? » విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? » మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? »దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్టు షాప్లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? » 2014 - 19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? » మద్యంపై తక్కువ ట్యాక్స్ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? » ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? » ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్సీపీ హయాంలో.. » 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. » లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. » 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. » మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. » మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. » మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది. -
కిడ్నాప్లు.. బెదిరింపులు
సాక్షి, అమరావతి: కిడ్నాపర్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే కిడ్నాపులకు పాల్పడితే.. వేధించేందుకు సాక్షి తండ్రిని అపహరిస్తే.. కుమారుడిని బెదిరించేందుకు తండ్రికి నోటీసులు ఇస్తే.. అది కచ్చితంగా చంద్రబాబు మార్కు పోలీసు జులుం అని చెప్పొచ్చు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ బృందం ఇంతగా బరితెగిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చేతిలో కిరాయి మూకగా మారి.. చట్ట నిబంధనలతో పని లేదని, రెడ్బుక్కే తమ రాజ్యాంగమని తేల్చి చెబుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్ అరాచకం సృష్టిస్తోంది. లేని అక్రమాలను నిరూపించేందుకు అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడమే ఏకైక మార్గమని భావిస్తోంది. అందుకోసం కొందర్ని సాక్షులుగా పేర్కొంటూ అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలని వేధిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన కిరణ్ రెడ్డి అనే యువకుడిని సిట్ బృందం కొన్ని రోజులుగా బెంబేలెత్తిస్తోంది. తాను అబద్ధపు సాక్ష్యం చెప్పనని ఆ యువకుడు స్పష్టం చేయడంతో సిట్ పోలీసులు సందిగ్దంలో పడ్డారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు. సివిల్ దుస్తుల్లో వెళ్లి కిరణ్ నివాసంపై అర్ధరాత్రి దండెత్తారు. ఆయన ఇంట్లో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో కిరణ్ ఇంట్లో లేడు. దాంతో ఆయన తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ సుబ్రమణ్యం రెడ్డిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. తాను పోలీసు కానిస్టేబుల్గా పని చేశానని, నిబంధనలకు విరుద్ధంగా తనను ఎలా తీసుకువెళ్తారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినా సిట్ అధికారులు ఏమాత్రం పట్టించుకో లేదు. ఈ కేసులో తన కుమారుడిని సాక్షిగా పేర్కొంటూ.. తనను బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని ఆయన ఎంతగా వాదించినా ఫలితం లేకపోయింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రాథేయపడినా వినిపించుకో లేదు. అర్ధరాత్రి వేళ ఆయన్ని సిట్ బృందం కిడ్నాప్ చేసింది. ఈ వ్యవహారంపై సుబ్రమణ్యంరెడ్డి బంధువు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. తన మామను పోలీసులు కిడ్నాప్ చేశారని, ఆయన్ను వెంటనే ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సుబ్రమణ్యం రెడ్డి ఎక్కడ ఉన్నా న్యాయస్థానంలో హాజరయ్యేందుకు అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. మరోవైపు కిరణ్ కూడా కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన్ను కూడా పోలీసులే అపహరించుకుపోయి ఉంటారని చెబుతున్నారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కొడుకు మీద కేసు.. తండ్రికి నోటీసులా? అక్రమ కేసు అయినా సరే.. ఎవరి మీద కేసు పెడితే వారిని విచారణకు పిలవడం అన్నది దర్యాప్తు ప్రాథమిక సూత్రం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ అరాచకానికి తెగబడుతోంది. వైఎస్సార్సీసీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో అప్పటి ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన్ని నిందితుడిగా చేర్చారో.. సాక్షిగా చేర్చారో అన్నది స్పష్టత ఇవ్వకుండా వేధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని విచారించాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం విచారణకు రాలేనని, సమయం కావాలని కోరారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఆయనతో సిట్ అధికారులు సంప్రదించాలి. తగిన రీతిలో చట్టబద్ధంగా విచారించాలి. కానీ చంద్రబాబు జమానాలో పోలీసులు తమకు రెడ్బుక్కే రూల్ బుక్ అని పేట్రేగిపోతూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆయనకు సైతం నోటీసులు ఇచ్చారు. ఏ ప్రాతిపదికన ఆయనకు నోటీసులు ఇస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిందితులో, సాక్షులో అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తాం.. విచారణకు పిలుస్తాం.. అని ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేసుతో సంబంధం లేని వారిని వేధించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్రరెడ్డి తన న్యాయవాదితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చారు. కానీ కార్యాలయం ప్రధాన గేటు వద్దే ఆ న్యాయవాదిని పోలీసులు అడ్డుకున్నారు. ఉపేంద్ర రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు. పలు దఫాలుగా రాత్రి 7.30 గంటల వరకు విచారించారు. ఉద్దేశ పూర్వకంగా ఏకంగా 8 గంటలపాటు సిట్ అధికారులు ఆయన్ను ఒత్తిడికి గురిచేశారు. ఈ కేసుతోగానీ, అందుకు సంబంధించిన కంపెనీలతోగానీ ఆయనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అంత సుదీర్ఘ సమయం కార్యాలయంలోనే ఉంచడం సిట్ అధికారుల వేధింపులకు తార్కాణం. మేం చెప్పినట్లు వినాల్సిందే విచారణలో ఉపేంద్ర రెడ్డిని విజయవాడ సీపీ, సిట్ చీఫ్ రాజశేఖర్బాబు తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము చెప్పినట్లు అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వకపోతే కుమారుడు రాజ్ కసిరెడ్డినే కాకుండా యావత్ కుటుంబ సభ్యులందరిపై కేసులు పెడతామని హెచ్చరించారు. తమ మాట వినకపోతే మును ముందు మరింతగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని చెప్పారు.21న హాజరుకండి తీవ్రంగా స్పందించిన హైకోర్టు ధర్మాసనంఏం నేరం చేశారో చెప్పకుండా.. ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో తెలియచేయకుండా 60 ఏళ్ల వృద్ధుడిని తిరుపతి నుంచి విజయవాడకు తీసుకొచ్చి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్బంధించిన ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ నెల 21న స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆ వృద్ధుడిని ఆదేశించింది. కోర్టు ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21వ తేదీల్లో ఏ అధికారి ముందు గానీ, దర్యాప్తు అధికారి ముందు గానీ హాజరు కానవసరం లేదని స్పష్టం చేసింది. వృద్ధుడిని ఇంటి నుంచి తీసుకెళ్తుండటానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన ఫొటోల్లోని పోలీసులు ఎవరో గుర్తించి, ఆ వివరాలను తమ ముందుంచాలని సిట్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధుడు, మాజీ పోలీసు అయిన టి.బాల సుబ్రహ్మణ్యంరెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరిచేలా ఆదేశాలివ్వాలని బంధువు మేకా వెంకటరామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) విష్ణు తేజ వాదనలు వినిపించారు. -
కాపీయింగ్లో చర్యలు నీటిమీద బుడగలు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ మాస్ కాపీయింగ్ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు నీటిమీద బుడగల వంటివేనని వైద్యశాఖలో చర్చ నడుస్తోంది. వ్యవస్థీకృత కాపీయింగ్లో కీలకమైన వ్యక్తులను రక్షించేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధార్థ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడిన క్రమంలో ప్రిన్సిపల్, ఇన్విజిలేటర్లకు డీఎంఈ చార్జి మెమోలు ఇచ్చారు. వాస్తవానికి కాపీయింగ్ ఘటన వెలుగు చూసిన వెంటనే ప్రిన్సిపాల్తోపాటు విధుల్లో ఉన్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు వైద్యశాఖ ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఎవరికి నోటీసులు జారీ చేయలేదని తెలిసింది. నిబంధనల ప్రకారం ఏదైనా ఆరోపణల్లో చార్జి మెమోల జారీ, సస్పెన్షన్, ఇతర చర్యలు తీసుకునే ముందు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి. అలాకాకుండా నేరుగా చర్యలు తీసుకుంటే, ఉద్యోగులు కోర్టును సంప్రదిస్తే, ఆ చర్యలు వీగిపోతాయని పరిపాలన విభాగాల్లోని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ కాపీయింగ్ ఘటనలో ప్రభుత్వ చర్యలు తూతూ మంత్రంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇక విశ్వవిద్యాలయంపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు కాపీయింగ్ జరిగినప్పుడు విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విధుల్లో పాల్గొనకుండా చేసింది. ఈ కాపీయింగ్ వ్యవహారంలో కళాశాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కీలకపాత్ర పోషించాడని వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఏవో స్థాయి అధికారి వైద్య విద్యార్థుల అడ్మిషన్లు, పరీక్షలు, ఇతర వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది. సిద్ధార్థ కళాశాలకు ఏవో పోస్టు మంజూరు కాలేదు. దీంతో సదరు సీనియర్ అసిస్టెంట్ అకడమిక్ వ్యవహారాలన్నీ చక్కబెడుతూ కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడటంలో ఆరితేరాడు. కొద్దినెలల కిందట సదరు ఉద్యోగిని యూజీ అకడమిక్ వ్యవహారాల నుంచి తప్పించి, పారామెడికల్ వ్యవహారాలు అప్పగించారు. అయినప్పటికీ యూజీ అకడమిక్ విభాగం మొత్తం అతడి కనుసన్నల్లోనే నడుస్తోంది.సుదీర్ఘకాలంగా అకడమిక్ వ్యవహారాలు చూడటంతో విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం అధికారులతోను సన్నిహిత సంబంధాలున్నాయి. వీరికి అనుకూలంగా ఉన్న వారికి ఇన్విజిలేటర్ విధులు వేసి పక్కాగా కాపీయింగ్కు తెరలేపినట్టు సమాచారం. ఇప్పటివరకు కళాశాలలోని మినిస్టీరియల్ స్టాఫ్కు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు, చార్జ్మెమోలు జారీచేయలేదు. మొత్తం వ్యవహారంలో కీలకమైన ఉద్యోగి అధికారికంగా ఎంబీబీఎస్ అకడమిక్ ఇన్చార్జిగా లేరు. ఈ క్రమంలో అతనిపై చర్యలుంటాయా లేదా అనేది కళాశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక నుంచి ఇటు కళాశాల, అటు వర్సిటీలో కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడినవారిని గుర్తించడం పోలీస్, ఇతర దర్యాప్తు సంస్థల విచారణతోనే సాధ్యం అవుతుంది. కాపీయింగ్కు పాల్పడిన విద్యార్థులను విచారిస్తే సూత్రధారులు పట్టుబడతారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మానవాళి కోసం జీసస్ చేసిన మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలని వివరించారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలోనూ ఆయన తాజాగా ఓ సందేశం ఉంచారు. On this Good Friday, we remember the ultimate sacrifice of Jesus Christ for humanity and reflect on the power of love, forgiveness, patience, and hope.— YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2025 -
చంద్రబాబు అంటేనే దోచుకోవడం: ఎమ్మెల్సీ అరుణ్కుమార్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని.. ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించటం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తొస్తాయంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పది నెలల్లోనే ట్రూఅప్ ఛార్జీల పేరుతో జనాన్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దోచుకుంటుందని ధ్వజమెత్తారు.‘‘సర్దుబాటు ఛార్జీలు, టైం ఆఫ్ ది డే పేరుతో కొత్తరకం దోపిడీ మొదలు పెట్టారు. ప్రతి యూనిట్కి రూ.40 పైసలు చొప్పున పెంచి దోచుకుంటున్నారు. రూ. 4 వేల కోట్లు ఈ కొత్త రూపంలో వసూలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల మీద భారం లేకుండా చేశారు. చంద్రబాబు వచ్చాక వీర బాదుడు బాదుతున్నారు. కరెంటు వాడుకునేది తక్కువ, బిల్లుల మోత ఎక్కువగా ఉంది. అదనపు ఛార్జీలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని అరుణ్కుమార్ పేర్కొన్నారు. -
సిద్ధార్థలో శంకర్దాదాలు.. అనుమానాస్పదంగా ప్రభుత్వ తీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎంబీబీఎస్ కాపీయింగ్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారంలో ఆరోగ్య విశ్వవిద్యాలయంపైనా తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లోతైన దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచించడంలేదు. బుధవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్తో పాటు 11 మందికి డీఎంఈ చార్జి మెమోలు జారీ చేసినట్టు తెలిసింది. ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈనెల 9న సిద్ధార్థ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడ్డారు. అనంతరం మరో ఇద్దరు కాపీ కొడుతూ దొరికారు. దీన్ని పరిశీలిస్తే ఎంతో పకడ్బందీగా కాపీయింగ్ రాకెట్ సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు, అధికారులపై వేధింపులు, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు వస్తేనే ప్రాథమిక విచారణ జరిపి బాధ్యులను సస్పెండ్ చేస్తుంటారు. మరోవైపు గతంలో కాపీయింగ్ ఆరోపణలతో రద్దయిన సిద్ధార్థ సెంటర్కు వర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచి్చంది.ఈ పరిణామాలు పక్కా ప్రణాళికతో కాపీయింగ్ నడిచిందనే ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అక్రమాలపై ఇంత స్పష్టంగా ప్రాథమిక ఆధారాలున్నా కేవలం చార్జి మెమోలతో ప్రభుత్వం సరిపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటనేది అర్ధం కావడంలేదు. కాపీయింగ్లో బాధ్యులైన పరీక్ష కేంద్రం అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటే, వారు తెరవెనుక కథ నడిపే వ్యక్తుల పేర్లు బయటపడతాయి. -
గుండె గు‘బిల్లు’
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్లిస్తున్నారు. ఎండలకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కింద సేదతీరుదామనుకుంటున్నారా..?కూలర్ దగ్గర కాసేపు చల్లగా గడుపుదామనుకుంటున్నారా..? కరెంట్ కోతలు.. ఉక్కపోత భరించలేక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారా? కానీ మీరు ఏం చేసినా కరెంట్ షాక్లు మాత్రం ఖాయం..!!ఎందుకంటే.. అసలు కరెంట్ వాడకున్నా.. ఇళ్లకు తాళాలు వేసినా సరే.. కరెంట్ చార్జీలు మాత్రం చుర్రుమంటున్నాయి! మండుతున్న ఎండలతోపాటే బిల్లులూ భగ్గుమంటున్నాయి! టీడీపీ కూటమి సర్కారు కరెంట్ చార్జీల బాదుడే బాదుడు కొనసాగుతోంది!!సాక్షి, అమరావతి: ‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..! నేను గ్యారెంటీ..!’ అంటూ ఎన్నికల ముందు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసి ‘చార్జీలు పెంచనని నేనెప్పుడు చెప్పా?’ అంటూ మాట మార్చేశారు. ఎడాపెడా విద్యుత్ షాక్లిస్తున్నారు. ఏడాది వ్యవధిలో పెరిగిపోయి భగ్గుమంటున్న బిల్లులే ఇందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.15,485.36 కోట్ల విద్యుత్తు భారాన్ని ప్రజలపై మోపారు. గతేడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్ల చార్జీల భారాన్ని వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లుల నుంచి మరో రూ.9,412.50 కోట్ల బాదుడు మొదలైంది. గతేడాదితో పోలిస్తే రెట్టింపు చార్జీలతో బిల్లులు జారీ అవుతున్నాయి. అసలే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండగా దానికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాడుకున్న విద్యుత్తుకు, వస్తున్న బిల్లులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఇదెక్కడి దారుణమని మండిపడుతున్నారు. చార్జీల భారం మోపని గత ప్రభుత్వం..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలకు ఊరట కల్పించింది. వ్యవసాయ అవసరాలకు పెద్ద పీట వేస్తూ 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన ఉచిత విద్యుత్ను సరఫరా చేసింది. 6,663 వ్యవసాయ విద్యుత్తు ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వ్యయం చేసింది. గతంలో టీడీపీ సర్కారు రైతులకు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వివిధ వర్గాల పేదలకు ఉచితంగా, రాయితీతో విద్యుత్ను అందచేసింది. రాష్ట్రంలోని 2 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాడు వైఎస్ జగన్ టారిఫ్ భారాలను సైతం భరించారు.పొంతన లేని బిల్లులుకర్నూలు జిల్లా కల్లూరు సెక్షన్ పరిధిలో నివసించే ఎస్.శిరీష ఈ ఏడాది ఫిబ్రవరిలో 125 యూనిట్ల విద్యుత్ను వినియోగించారు. ఈ లెక్కన ఆమెకు రావాల్సిన బిల్లు రూ.489.50 మాత్రమే. కానీ వచ్చిన బిల్లు మాత్రం ఏకంగా రూ.850. అంటే రూ.361 మేర కరెంట్ చార్జీ పెరిగింది.చిత్తూరుకి చెందిన జేజులరెడ్డి (సర్వీసు నంబర్ 3457) ఇంట్లో రెండు ఫ్యాన్లు, మూడు ట్యూబ్లైట్లు, టీవీ, కూలర్ ఉన్నాయి. కరెంట్ బిల్లులను పరిశీలిస్తే గతేడాదికి, ఇప్పటికి భారీ వ్యత్యాసం ఉంది. గతేడాది మార్చిలో 177 యూనిట్లకుగానూ ఆయనకు రూ.1,015 బిల్లు వచ్చింది. యూనిట్కు రూ.5.74 చార్జీ పడింది. ఈ ఏడాది మార్చిలో 563 యూనిట్లకు రూ.4,584 బిల్లు వేశారు. యూనిట్కు ఏకంగా రూ.8.14 వసూలు చేశారు. రూ.1,335.49 అదనంగా బిల్లు రావడంతో వినియోగదారుడు 39 శాతం అధిక భారం భరించాల్సి వచ్చింది.‘ఈ ఏడాది కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో 124 యూనిట్లు వాడినందుకు రూ.657 బిల్లు వచ్చింది. అంటే యూనిట్ రూ.5.29 పడింది. అదే ఈ ఏడాది జనవరిలో 165 యూనిట్లు వాడినందుకు ఏకంగా రూ.1,271 బిల్లు కట్టమంటున్నారు. యూనిట్కు రూ.7.70 వసూలు చేస్తున్నారు. కరెంట్ చార్జీ ఏకంగా రూ.614 పెరిగింది.’ – ఎం.సిలార్, మచిలీపట్నం‘‘పదేళ్లుగా పిండి మిల్లు నిర్వహిస్తూ బతుకుతున్నాం. గత ఏడాది నవంబర్లో నెలకు రూ.4,881 మాత్రమే ఉన్న కరెంటు బిల్లు ఈ ఏడాది మార్చిలో ఒక్కసారిగా రూ.13,440 కు పెరిగింది. మేం అప్పుడు ఇప్పుడూ ఒకేలా వాడుతున్నాం. అయినా ఎందుకు అంతంత బిల్లు వస్తోందో అంతుబట్టడం లేదు. ఇలాగైతే పిండి మిల్లు మూతపడి మా కుటుంబం రోడ్డు పాలవుతుంది’’ –రేలంగి వెంకటలక్ష్మి, వికేరాయపురం, కాకినాడ జిల్లా.వాడకం తగ్గినా.. బిల్లు పెరిగిందిశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉంటున్న సువ్వారి జగదీష్ ఇంటికి 2024 మార్చిలో 216 యూనిట్లకు గానూ రూ.1,108 బిల్లు వచ్చింది. అంటే యూనిట్కు రూ.5.12 పడింది. ఇదే వినియోగదారుడు ఈ ఏడాది మార్చిలో 171 యూనిట్లు వినియోగించారు. దాని ప్రకారం రూ.875.52 మాత్రమే బిల్లు రావాలి. వినియోగం తగ్గినప్పుడు సాధారణంగా బిల్లు కూడా తగ్గాలి. కానీ అందుకు భిన్నంగా బిల్లు పెరిగి రూ.1,286 వచ్చింది. గతేడాది ధర (టారిఫ్)ల్లో ఏ మార్పూ జరగలేదని, చార్జీలు పెంచలేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నా కరెంటు బిల్లు మాత్రం భారీగా పెరిగింది.వాడకున్నా వాతలే..!‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్న మసీదు జిలానీ గుంటూరు జిల్లా మేడికొండూరులోని ఇంటిలో కొద్ది నెలలుగా నివసించడం లేదు. కానీ 2 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.182 చార్జీ పడింది. తాను అసలు విద్యుత్ వాడనే లేదని జిలానీ మొత్తుకుంటున్నారు.కొందరు సొంత ఇంటిని వదిలి కుటుంబంతో దూర ప్రాంతాల్లో గడుపుతుంటారు. ఖాళీగా ఉన్న ఇళ్లలో విద్యుత్ వినియోగం ఉండదు. అయినా సరే అలాంటి నివాసాలకు జీరో యూనిట్ కింద రూ.91 బిల్లు పంపుతున్నారు. విద్యుత్కు సైతం వడ్డన తప్పడం లేదు.మాట మార్చారు.. మాట తప్పారువిద్యుత్ చార్జీలపై ఎన్నికల ముందు ప్రతి చోటా మైకు పట్టుకుని చంద్రబాబు మాట్లాడిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన చేస్తున్న పనులకు పొంతన లేదు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని,అవసరమైతే వినియోగదారులే విద్యుత్ను అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలకు అర్ధమే లేదు. అధికారం చేపట్టి ఐదు నెలలు కాకుండానే విద్యుత్ చార్జీలపై ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేసిన రోజే ‘చార్జీలు పెంచమని నేనెప్పుడు చెప్పాను’ అంటూ మాట మార్చేశారు. తాజాగా దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలపై రూ.6072.86 కోట్ల భారం వేశారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు గతంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడిన మాటల్లో మచ్చుక్కి కొన్ని..16 ఫిబ్రవరి 2023, పెద్దాపురం తమ్ముళ్లూ..ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారా లేదా. ఏవమ్మా ఆడబిడ్డలూ మీరు చెప్పండి. నేనున్నప్పుడు కరెంటు చార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్నా కరెంటు చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 27 మే 2020,టీడీపీ మహానాడుకరెంటు చార్జీలు ఎవరూ కట్టే పరిస్థితిలేకపోతే కరెంటు చార్జీలు పెంచమని చెప్పాం. ఐదు సంవత్సరాలు కరెంటు చార్జీలు పెంచలేదు.టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.దానివల్ల రాబోయే రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనం ముందకు వెళితే మీరు(జగన్) పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంటు చార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం.19 మార్చి 2019, కడపకరెంటు కొరత 2004లో లేదు. 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. రెండు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు చార్జీలు పెంచమన్నాం. వ్యవసాయానికి 9 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంటు ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నా. 2 ఆగష్ట్ 2023, పులివెందులకరెంటు పెంచను, తగ్గిస్తా. ఇప్పటికి ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను జగన్ పెంచారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచను. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీరే వినియోగించుకునే పరిస్థితి తీసుకువస్తా. గ్రిడ్కు కనెక్ట్ చేసి మిగులు విద్యుత్ను వినియోగదారులే అమ్ముకునేలా చేస్తా. -
అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే రూ.31,000 కోట్లు సమకూరాయన్నారు. ఇంకా సుమారు రూ.47,000 కోట్ల అవసరం ఉందని చెప్పారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఆధ్వర్యంలోని బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులన్నీ తెలంగాణకు వెళ్లాయని, ఏపీకి ప్రధాన ఆదాయ వనరే లేదన్నారు. జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువగా ఉందని, రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఆస్తుల పంపకం ఇంకా పూర్తవ్వలేదని చెప్పుకొచ్చారు. ‘ఏటా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్కు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాం. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫారసులు చేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని, స్వర్ణాంధ్ర–2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు, పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రత్యేక ప్రజెంటేషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనపై వీడియో ప్రదర్శించారు. విరివిగా గ్రాంట్లు ఇప్పించండి స్వర్ణాంధ్ర–2047 విజన్ కింద ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించి.. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరించేలా కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో భాగంగా ఆర్థిక సంఘం వర్టికల్ డివల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలన్నారు. రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు, 20 శాతం వెయిటేజీ వ్యవసాయం, అనుబంధ రంగాలకు, 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. స్థానిక సంస్థల కోసం రూ.62,516 కోట్ల నిధులు, పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల కోసం రూ.19,871 కోట్ల గ్రాంట్లు, 2026–2031 మధ్య ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.16,181 కోట్లు కావాల్సి ఉందన్నారు. ‘పోలవరం–బనకచర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులు, ఐదు పర్యాటక హబ్లు (అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం), ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవలప్మెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 100 శాతం అక్షరాస్యత, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, ఇన్ల్యాండ్ వాటర్ వే లు, రహదారులు, రీజనల్ గ్రోత్ సెంటర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి విరివిగా గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసు చేయాలి’ అని సీఎం కోరారు. కాగా, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్కళ్యాణ్ తెలిపారు. -
రొయ్య సాగుపై ‘సమ్మె’ట
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు ‘సాగు సమ్మె’ వైపు తొలి అడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందపర్రు గ్రామాల రైతులు బుధవారం సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రకటించిన రొయ్యల కొనుగోలు ధరలు తమకు గిట్టుబాటు కావని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఆక్వా సాగు చేయలేమని.. అందుకే తామంతా క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించామంటూ చెరువుల వద్ద బోర్డులు పెట్టి మరీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో మిగిలిన గ్రామాల రైతులు అడుగులు వేస్తున్నారు. చెరువుల్లో ఉన్న రొయ్యల పట్టుబడి పూర్తి కాగానే తాము కూడా సాగు సమ్మె చేపడతామని మిగిలిన గ్రామాల రైతులు కూడా చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం విధించిన ప్రతీకార సుంకాల సాకుతో రొయ్యల ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను తగ్గించేయడంతో రొయ్యల రైతుల ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రానికి లేఖ పేరిట హడావుడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత అధ్యయన కమిటీ ఏర్పాటు చేసింది. 100 కౌంట్ రొయ్యలను రూ.220కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ధరలు మరింత పతనమయ్యాయి. ఈ ధరలు తమకు గిట్టుబాటు కాదంటూ రైతులు ఒక్కొక్కరిగా సాగు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. ఏప్రిల్ నుంచే సమ్మెలోకి.. తొలుత జూలై నుంచి సాగు సమ్మె చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏప్రిల్ నుంచే అమలుకు శ్రీకారం చుడుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం శిరగాలపల్లిలో తాము క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ఇద్దరు రైతులు తమ చెరువుల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే గ్రామంలో 110 ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా.. దాదాపు 100 ఎకరాల్లో క్రాప్ హాలిడే పాటిస్తున్నట్టు రైతులు ప్రకటించారు. సమీపంలోనే ఉన్న పాలకొల్లు మండలం చందపర్రు గ్రామంలోనూ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. క్రాప్ హాలిడే ఉద్యమానికి పొరుగు జిల్లాల ఆక్వా రైతుల నుంచి మద్దతు పెరుగుతోంది. అందుకే సమ్మె చేస్తున్నాం నేను 50 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. ఈ రోజు పట్టుబడి పట్టిన 10 ఎకరాల్లో క్రాప్ హాలిడే బోర్డు పెట్టాను. రేపు మరో 10 ఎకరాలు పట్టుబడి పడుతున్నాను. దాంట్లో కూడా బోర్డు పెడతాను. ఎకరాకు లీజు రూ.80 వేలు అవుతోంది. అదనపు లోడ్, అదనపు వినియోగ సుంకం పేరిట ఏకంగా రూ.లక్ష అదనంగా విద్యుత్ బిల్లులు కట్టాను. ప్రస్తుత రేట్లు మాకు గిట్టుబాటు కావు. అందుకే క్రాప్ హాలిడేకు పాటిస్తున్నాం. – చిలుకూరి బాలాజీ, శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి 15 లక్షలు నష్టపోయాను 10 ఎకరాల్లో నాసిరకం సీడ్ వల్ల పంట నష్టపోయాను. మరో 15 ఎకరాల్లో వైరస్ వల్ల పంట దెబ్బతింది. మిగిలిన 10 ఎకరాల్లో 20 టన్నులు పట్టుబడి పడితే 30 కౌంట్కు రూ.400–420 మధ్య, 40 కౌంట్కు రూ.320–340 మధ్య ఇస్తున్నారు. ఈ సీజన్లో దాదాపు 15 లక్షలు నష్టపోయాను. ఈ రేట్లతో ఇక సాగు చేయలేం. అందుకే క్రాప్ హాలిడేకు వెళ్లాలని నిర్ణయించాం. – టీఎన్వీవీఎస్ ప్రసాద్, శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా -
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడి వద్ద 42.5 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో ఐదు బ్లాక్లలో ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పడు శాశ్వత సచివాలయాన్ని రాయపూడి వద్ద 32 ఎకరాల్లో బీ+జీ+39 పద్ధతిలో నాలుగు టవర్లు, బీ+జీ+49 పద్ధతిలో ఒక టవర్.. మొత్తం ఐదు టవర్లను 4,85,000 చదరపు మీటర్ల (52,20,496 చదరపు అడుగులు)లో చేపట్టనుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ తాత్కాలిక సచివాలయం.. శాశ్వత సచివాలయం పేరుతో రెండుసార్లు భవనాలు నిర్మించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాల మేరకు శాశ్వత సచివాలయంలో ఐదు టవర్లను మూడు ప్యాకేజీలుగా విభజించి.. వాటి నిర్మాణానికి బుధవారం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) లంప్సమ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్లలో పూర్తి చేయాలని గడువు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి 2018లో పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు డిజైన్లు (ఆకృతులు) రూపొందించాయి. ఆ డిజైన్ల మేరకు ఇటీవల శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇప్పుడు శాశ్వత సచివాలయంలో 1, 2 టవర్లను ఒక ప్యాకేజీ కింద.. 3, 4 టవర్లను రెండో ప్యాకేజీ కింద.. జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) టవర్ను మూడో ప్యాకేజీ కింద విభజించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను 24 నెలల్లో పూర్తి చేసేలా.. నిర్మాణం పూర్తయ్యాక 36 నెలలపాటు నిర్వహించాలని షరతు పెట్టింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలుకు వచ్చే నెల ఒకటో తేదీని తుది గడువుగా నిర్దేశించింది. అదే రోజున టెక్నికల్ బిడ్ను తెరుస్తారు. టెక్నికల్ బిడ్లో అర్హత సాధించిన సంస్థల ఆర్థిక బిడ్లను మే 3న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు కాంట్రాక్టు పనులు అప్పగించాలని సీఆర్డీఏ అథారిటీకి అధికారులు ప్రతిపాదించనున్నారు. సచివాలయం నిర్మాణం ఇలా.. » రాయపూడి వద్ద పాలవాగుకు ఇరు వైపులా శాశ్వత సచివాలయాన్ని నిర్మించనున్నారు. పాలవాగుకు ఉత్తరాన జీఏడీ టవర్తోపాటు 1, 2 టవర్లు.. దక్షిణాన 3, 4 టవర్లను నిర్మించేలా డిజైన్ను రూపొందించారు. మొత్తంగా 1, 2 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లు. 3, 4 టవర్ల పనుల కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లు. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లు. ఐదు టవర్లలో ఒక్కో అంతస్తు 47 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. » శాశ్వత సచివాలయం నిర్మాణ పనులను ఇప్పటి తరహాలోనే మూడు ప్యాకేజీల కింద 2018 ఏప్రిల్ 26న అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. జీఏడీ టవర్ నిర్మాణ పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు.. 1, 2 టవర్ల నిర్మాణ పనులను రూ.932.46 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ సంస్థకు.. 3, 4 టవర్ల నిర్మాణ పనులను 784.62 కోట్లకు ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించింది. అంటే.. ఐదు టవర్ల నిర్మాణ పనుల విలువ రూ.2,271.14 కోట్లు. » ఈ ఐదు టవర్ల పునాదుల పనులను 2019 నాటికే కాంట్రాక్టు సంస్థలు పూర్తి చేశాయి. మిగిలిన పనులకు ఇప్పుడు టెండర్లు పిలిచింది. 2018 ఏప్రిల్ నాటితో పోల్చి చూస్తే.. స్టీలు, సిమెంటు, భవనాల నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఈ టవర్ల నిర్మాణానికి సమీపంలోనే కృష్ణా నదిలో పుష్కలంగా.. అదీ ఉచితంగా ఇసుక లభ్యమవుతోంది. కానీ.. ఈ ఐదు టవర్లలో మిగిలిన పనుల నిర్మాణానికి రూ.4,195.51 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్లు పిలవడం గమనార్హం. » ఈ లెక్కన అంచనా వ్యయాన్ని రూ.1,924.37 కోట్లు పెంచేసిందన్నది స్పష్టమవుతోంది. యధావిధిగా సిండికేట్ కాంట్రాక్టర్లకు ఈ ఐదు టవర్ల పనులను కట్టబెట్టి.. కమీషన్లు వసూలు చేసుకోవడానికే ప్రభుత్వ ముఖ్యనేత చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది. » ఇక తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను అప్పట్లో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన రూ.1,151 కోట్లు వ్యయం చేసి కమీషన్లు దండుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పుడు, ఇప్పుడు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పుగా తెచ్చిన సొమ్మును ఇలా దుబారా చేయడం తగదని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
మార్కెట్ లీడర్ ‘ఇ-లైఫ్ స్టైల్‘
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ వినియోగంతో వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వినూత్న ఆలోచనలు, వ్యాపార ఆవిష్కరణలకు అంతర్జాలం వేదికైంది. ఇప్పుడు వస్తువుల కొనుగోలు, అమ్మకాల ఆన్లైన్ వ్యాపారం మరో రూపాంతరం చెంది సామాజిక మాధ్యమాలకు చేరింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఇ–కామర్స్ మార్కెట్ భారీగా విస్తరించింది. అందులోనూ జీవనశైలి(లైఫ్ స్టైల్) ఉత్పత్తుల వ్యాపారం అగ్రభాగాన నిలుస్తోంది. ‘డీ కోడింగ్ ఇండియాస్ ఆన్లైన్ ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ షాపింగ్ ట్రెండ్స్’ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.» ప్రస్తుత జీవనశైలి మార్కెట్ విలువ రూ.11,174 కోట్లు కాగా, మూడేళ్లలో అంటే.. 2028 నాటికి రూ.18,049 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. » 17.5 కోట్లకు పైగా భారతీయులు జీవనశైలి ఉత్పత్తుల కోసం ఆన్లైన్ షాపింగ్ను వినియోగిస్తున్నారు. ఒక్కొక్కరూ ఏటా సగటున 6 నుంచి 7 లావాదేవీలు చేస్తున్నారు. ఈ–లైఫ్ స్టైల్ మార్కెట్లో 75 నుంచి 80 శాతం వాటాతో అగ్రస్థానంలో ఫ్యాషన్ ఉత్పత్తుల వ్యాపారం ఉంది. తర్వాత స్థానంలో సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి.» 2028 నాటికి ఆన్లైన్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ మార్కెట్ ఇప్పుడున్న రూ.1,477 కోట్ల నుంచి రూ.3,876 కోట్లకు చేరుకుంటుందని అంచనా. » ప్రపంచంలోని టాప్ 50 లైఫ్స్టైల్ బ్రాండ్లలో 90 శాతం మన దేశంలోనే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వాటిలో సగం బ్రాండ్లు రూ.2,585 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించనున్నాయి. ఈ క్రమంలో 2029 నాటికి, ఇ–కామర్స్ వినియోగదారులు 50.1 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.సెల్ఫోన్లోనే సగానికిపైగా వ్యాపారం» టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 88 కోట్లకుపైగా ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. 117.2 కోట్ల ఫోన్ కనెక్షన్లు (ల్యాండ్లైన్, సిమ్) ఉన్నాయి. ఆన్లైన్ లావాదేవీల్లో 60 శాతం స్మార్ట్ ఫోన్ల ద్వారానే జరుగుతోంది. దీనికి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్–ఏఐ) సాయం, వర్చువల్ ట్రయల్స్, వాయిస్ అసిస్టెడ్ షాపింగ్ వంటి సాంకేతిక సౌకర్యాలు తోడై ఆన్లైన్ షాపింగ్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి.» ఇన్స్ట్రాగామ్, వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా హోల్ సేల్ వ్యాపారుల నుంచి తాము విక్రయించాలనుకున్న సరుకుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెప్పించుకుని వాటిని తిరిగి అవే వేదికల్లో పోస్ట్ చేసి వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. » 82% మంది దేశంలో కనీసం ఒక సోషల్ మీడియా ఖాతాను నిర్వహిస్తున్నారు.» 78 % మంది ఫేస్బుక్, 34 % మంది ఇన్స్ట్రాగామ్ వినియోగదారులు ఆన్లైన్ ద్వారా తమకు కావాల్సినవి కొంటున్నారు. ప్రస్తుతం సుమారు 6 కోట్ల్ల మంది ఆన్లైన్ వ్యాపారులు ఏటా 9 రెట్లు అధిక అమ్మకాలు సాధిస్తుంటే, ఆఫ్లైన్ దుకాణదారులు 6 రెట్ల వృధ్ధినే పొందగలుగుతున్నారు. -
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగోలేదు..!
సాక్షి, అమరావతి: ఉద్యోగం, విద్యా, వినోదం ఇలా వివిధ అవసరాల కోసం ఇళ్లకు బ్రాడ్ బ్యాండ్, ఫైబర్, డిజిట్–సబ్స్క్రైబర్ లైన్ (డీఎస్ఎల్) ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. కాగా, ఆయా సంస్థలు అందిస్తున్న సేవలపై సగానికి పైగా వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా ఏకంగా 62% మంది తమ ఇంటర్నెట్ కనెక్షన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్వే స్పష్టం చేసింది. సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..» ఇంటర్నెట్ కనెక్షన్లో అంతరాయం ఎదుర్కొంటున్నారా! అని 29,701 మందిని ప్రశ్నించగా 62 % మంది అవునని సమాధానం ఇచ్చారు. » నెలలో ఎన్నిసార్లు ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని 29,529 మందిని ఆరా తీయగా 37 శాతం మంది ప్రతి నెలా మూడు కంటే ఎక్కువ సార్లు అంతరాయం ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. 36% మంది ఒకటి, రెండు సార్లు అంతరాయం ఉందని, మిగిలిన వారు సమస్యలు తలెత్తడం లేదని పేర్కొన్నారు. » ఇంటర్నెట్ సరఫరాలో సమస్యలు వచ్చిన సందర్భాల్లో పరిష్కారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తీసుకుంటున్నారని సర్వేలో తేలింది. » వినియోగదారుల ఫిర్యాదులపై సర్వీస్ ప్రొవైడర్స్ స్పందనపై 29 వేల మందిని ఆరా తీశారు. కేవలం 43 శాతం మంది 24 గంటల్లో ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారని అన్నారు. 35 శాతం మంది ఒకటి నుంచి మూడు రోజులు, మిగిలినవారు 4 నుంచి ఏడు, అంతకంటే ఎక్కువ రోజులు పడుతోందన్నారు. » దాదాపు 66 శాతం మంది వినియోగదారులు మెరుగైన నాణ్యత, సేవ లేదా ధర కోసం ప్రత్యామ్నాయ ప్రొవైడర్కు మారడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. » గతేడాది కూడా బ్రాడ్బ్యాండ్, ఫైబర్ నెట్, డీఎస్ఎల్ సేవలపై ఈ సంస్థ సర్వే చేసింది. అప్పట్లో సర్వీస్ ప్రొవైడర్ వాగ్థానం చేసిన వేగం కంటే తక్కువకు ఇంటర్నెట్ సరఫరా ఉంటోందని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండటం లేదని 38 శాతం మంది అసహనం వ్యక్తం చేశారు.మొత్తం 333 జిల్లాల్లో సర్వేదేశవ్యాప్తంగా మొత్తం 333 జిల్లాల్లో ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ వినియోగదారుల నుంచి వచ్చిన 1.40 లక్షల సమాధానాల మదింపు ద్వారా సంస్థ సర్వే ఫలితాలను వెలువరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులుకాగా, 38 శాతం మహిళా వినియోగదారులు ఉన్నారు. వివిధ ప్రశ్నల రూపంలో వినియోగదారుల నుంచి సమాధానాలను స్వీకరించారు. -
గంగపుత్రులకు తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది. పథకం అమలు కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ మేరకు స్పష్టం చేయడంతో ఇదెక్కడి న్యాయమంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి తమ హక్కు అని, దీన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలకు కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లూ.. ఆంక్షలు లేకుండా అమలు మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తోంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం పరిహారం ఇవ్వడం పరిపాటి. గతంలో రూ.4 వేలు ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐదేళ్ల పాటు 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల లబ్ధి చేకూర్చింది. వేట నిషేధ భృతి పొందిన వారికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేశారు. భృతి పొందితే సంక్షేమ పథకాలకు అనర్హులే తాము అధికారంలోకి వస్తే ఈ భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం తొలి ఏడాది అటకెక్కించేసింది. ఇటీవలే వేట నిషేధం అమలులోకి రాగా.. ఈ ఏడాదైనా ఇస్తారో లేదో అనే సందేహం మత్స్యకారుల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నెల 26న వేట నిషేధ భృతి జమ చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. రెండ్రోజులు తిరక్కుండానే దాన్ని వాయిదా వేసి మే నెలలోనే అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ పథకం అమలు కోసం విధించిన నిబంధనలు మత్స్యకార కుటుంబాల పాలిట ఆశనిపాతంగా మారాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని, అంతేకాకుండా వేట నిషేధ భృతి పొందేవారు ఇతర డీబీటీ స్కీమ్స్ పొందేందుకు అనర్హులని మెమోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. సూపర్ సిక్స్తో సహా ఎన్నికల్లో ఇచ్చిన డీబీటీ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ భృతి పొందే వారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్విద్యోన్నతితో పాటు ఎన్టీఆర్భరోసా పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులుగా తేల్చింది. 300 యూనిట్ల విద్యుత్ వాడినా అనర్హులే మరోవైపు వేట నిషేధ భృతి పొందేందుకు 60 ఏళ్ల పైబడిన వారు అనర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు. 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. వేట నిషేధ భృతి పొందే మత్స్యకార కుటుంబంలో ఏ ఒక్కరూ ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో వంటివి కూడా కలిగి ఉండకూడదు. ఏడాదిలో సగటున నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల్లో సొంత ఇంటిని కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగి అయి ఉండకూడదు. పూర్తిస్థాయి వేతనంతో సొసైటీలు, ఫెడరేషన్స్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయి ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ పెన్షన్దారుడు కుటుంబంలో ఉండకూడదు. ఇన్కం టాక్స్ పన్ను చెల్లింపుదారులు కూడా ఉండకూడదు.సంక్షేమ పథకాలకు అనర్హులనడం దారుణం వేట నిషేధ భృతిని తొలి ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందనుకుంటే మత్స్యకారుల నోట్లో మట్టికొట్టేలా నిబంధనలు విధించింది. గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతికి కోత పెట్టేలా ఆంక్షలు విధించింది. ఈ భృతి పొందేవారు ఇంకా అమలుకు నోచుకోని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చడం విడ్డూరంగా ఉంది. ఆంక్షలు సడలించకపోతే ఉద్యమం చేస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకారుల సంఘాల సమాఖ్య -
రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి: బుగ్గన
సాక్షి, విజయవాడ: రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణన 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు.పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి:16వ ఆర్థిక సంఘానికి పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా గురించి ప్రస్తావించాం. 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్ వైవీ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను తొలిసారిగా 32 శాతం నుంచి 42 శాతం వరకు పెంచుతూ సిఫార్సు చేశారు. ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం డాక్టర్ ఎన్కె సింగ్ ఉన్నప్పుడు 41 శాతం ఇచ్చారు.అయితే 42 శాతం సిఫార్సు చేసినా, వాస్తవంగా నిధులు వచ్చే సరికి అందులో 10 శాతం తగ్గుతుంది. అంటే మనకు నికరంగా వచ్చేది 32 శాతమే. ఎందుకంటే కేంద్రం సెస్సులు, సర్ఛార్జ్ల పేరుతో ఆ వాటాలో కోత పెడుతుంది. అందుకే మా పార్టీ నుంచి ఏం కోరామంటే, పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వమని కోరాము. ఎందుకంటే, రాష్ట్రాలకు అవసరాలు, ఖర్చులు ఉంటాయి అని చెప్పాం. అందుకే కనీసం 50 శాతం ఇస్తే, 40 శాతం నిధులు వస్తాయి కాబట్టి.ఆ రాష్ట్రాలకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలి:రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ధారణకు గతంలో 1971 జనాభా లెక్కలు తీసుకునే వారు. కానీ, ఇప్పుడు 2011 జనాభా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే పలు రాష్ట్రాలు అనేక విధానాల ద్వారా జనాభా తగ్గించాయి. దీంతో ఆయా రాష్ట్రాలకు ఇప్పుడు నష్టం జరుగుతోంది. కాబట్టి, కుటుంబ నియంత్రణ బాగా అమలు చేసి, జనాభా తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా బోనస్ ఇవ్వాలని కోరాం.2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు ఎక్కువ:రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత 14,15 ఆర్థిక సంఘాలు వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం సమయంలో టీడీపీ, 15వ ఆర్థిక సంఘం ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది. ఒక కఠోర వాస్తవం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే రాష్ట్ర అప్పులు దారుణంగా పెరిగాయి. కానీ, గత కొన్నేళ్లుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, వైయస్సార్సీపీ ప్రభుత్వంపై దారుణంగా దుష్ప్రచారం చేసింది. ఇంకా చేస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత, టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2014–19 మధ్యలోనే ఎక్కువ అప్పు చేశారు. అప్పుడే అప్పు శాతం ఎక్కువ. 2019–24 మధ్య కోవిడ్ ఉన్నా, వైఎస్పార్సీపీ ప్రభుత్వంలో చేసిన అప్పు శాతం తక్కువ. ఆ లెక్కలు కేంద్ర ప్రభుత్వ విభాగాలే తేల్చి చెబుతున్నాయి. అన్నింటికీ పక్కాగా గణాంకాలు ఉన్నాయి. అయినా ఇష్టానుసారం అప్పుల లెక్కలు చెప్పారు. రూ.14 లక్షల కోట్లు అని, రూ.12 లక్షల కోట్లు అని నోటికొచ్చిన అంకెలు చెప్పారు.ఇప్పుడు వారంతా ఏమయ్యారు?:వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారని, రాష్ట్రం మరో శ్రీలంక అవుతోందని విషం చిమ్మారు. అదే పనిగా దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వారంతా ఏమయ్యారు?. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత కంటే దారుణంగా ఎక్కువ అప్పు చేస్తోంది. పైగా, ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నా, ఒక్క పథకం కూడా ఆపలేదు.5 ఏళ్లలో ఏం కడతారు?:మనకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లకా? అంత కంటే ఎక్కువా?. ఆ సమయంలో ఒక రాజధాని కడతారా? లేక ఒక నగరం కడతారా?. అసలు మనకున్న శక్తి ఎంత?. మన దగ్గర ఒక బైక్, ఒక కారు కొనే డబ్బులు ఉన్నప్పుడు విమానం కొంటానంటే ఎలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తోంది అదే. మరి ఆ అప్పు తిరిగి ఎవరు చెల్లించాలి. మా పార్టీ విధానం అప్పుడైనా, ఇప్పుడైనా ఒక్కటే. సామాన్యులు బాగుండాలి. వారు అభివృద్ధి చెందాలి. వారికి ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు కావాలి అని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్ను ఎదుర్కోలేకే మత ముద్ర: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటంలేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ జగన్పై మతం ముద్ర వేస్తున్నారు’’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.‘‘పాదయాత్రకు ముందు, తర్వాత జగన్ తిరుమల వెళ్లారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జగన్ని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి నేతలు మత ముద్ర వేస్తున్నారు. వైఎస్ జగన్పై నిలువెల్లా విషం చిమ్ముతున్నారు. గత టీడీపీ పాలనలో కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు చేయించారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను కూల్చారు. వాటిని జగన్ సీఎం అయ్యాక తిరిగి నిర్మించారు. మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక కాశీనాయన క్షేత్రంలో కొన్ని సత్రాలు, గోశాలను కూల్చారు’’ అని మల్లాది విష్ణు గుర్తు చేశారు.‘‘తిరుమలలో ఎగ్ బిర్యానీ, మద్యం దొరికింది. తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇలా వరుస సంఘటనలు జరిగాయి. హోంమంత్రి అనిత ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. హోంమంత్రిలాగా తప్పుడు మాటలు మాట్లాడేవారినే క్రిమినల్స్ అంటారు, విజయకీలాద్రి మీద ఆలయాలు కట్టేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. కానీ జగన్ పర్మిషన్ ఇచ్చి ఆలయాల నిర్మాణాలకు సహకరించారు. పీఠాల నిర్మాణాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు వాటిని లాగేసుకున్నారు. కేవలం జగన్ మాత్రమే హిందూ ధర్మాన్ని కాపాడారు. చంద్రబాబు హయాంలోనే హిందూ ధర్మంపైన దాడులు జరుగుతున్నాయి. వక్ఫ్ చట్టాన్ని ఆమోదించి చంద్రబాబు ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారు’’ అని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఆమోదం
సాక్షి, అమరావతి: ఎస్సీ కులాల రిజర్వేషన్ల ఉప వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ను రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. గ్రూప్–1లో రెల్లితో సహా 12 ఉప కులాలకు ఒక శాతం రిజర్వేషన్లు, గ్రూప్–2లో మాదిగలతో సహా 18 ఉప కులాలకు 6.5 శాతం, గ్రూప్–3లో మాలలతో సహా 29 ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్లను 200 రోస్టర్ పాయింట్లతో సహా రాష్ట్రం యూనిట్గా 26 జిల్లాల్లో అమలు చేయనున్నారు. జనాభా గణన అనంతరం జిల్లాల యూనిట్గా అమలు చేస్తారు. శాసనసభ భవనం రూ.617.33 కోట్లతో, హైకోర్టు భవనం రూ.766.05 కోట్లతో ఎల్–1 బిడ్డర్లకు అప్పగించేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం నిర్ణయాలను మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, బాల వీరాంజనేయులు, అనితలు సంయుక్తంగా మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – ఆర్డినెన్స్ జారీ కాగానే ఎస్సీ వర్గీకరణతో డీఎస్సీ నోటిఫికేషన్.. స్కూళ్లు తెరిచే నాటికి ఉపాధ్యాయులకు పోస్టింగ్లు.– తాత్కాలిక ఖరారు తేదీ మేరకు మే 2వ తేదీన ప్రధాన మంత్రి చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం.– చేపల వేట నిషేధ సమయంలో భాగంగా మత్స్యకారులకు ఈ నెల 26వ తేదీన రూ.20 వేలు చొప్పున సాయం.– ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా రూ.9,000 కోట్ల రుణ సమీకరణకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు ఆమోదం. ఏపీఎండీసీ పబ్లిక్ కంపెనీగా మార్పు. – ఐటీ, డేటా సెంటర్లకు ఎకరం 99 పైసలకే భూమి కేటాయించాలని నిర్ణయం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్తో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపు. ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ విస్తరణకు ఆమోదం. – గుంటూరులో ఈఎస్ఐ ఆస్పత్రి, కుప్పంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, నెల్లూరులో పారిశ్రామిక పార్కు, కొత్తవలసలో గ్రేహౌండ్స్ విభాగం, ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి ఉచితంగా భూమి ఇవ్వాలని నిర్ణయం.– కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వివిధ సంస్థలకు గ్రీన్ సిగ్నల్. కొత్త మైనర్ మినరల్ విధానానికి గ్రీన్ సిగ్నల్రాష్ట్రంలో కొత్త మైనింగ్ విధానానికి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నూతన విధానంలో 2022 మార్చి నాటికి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ‘ఫస్ట్ కమ్ – ఫస్ట్ సర్వ్’ ఆధారంగా పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ లీజులు ఏడాది మాత్రమే ఉంటాయి. గ్రానైట్, రోడ్ మెటల్ వంటి బిల్డింగ్ మెటీరియల్స్కు పాత దరఖాస్తు విధానం కొనసాగనుంది. సిలికా శాండ్, డోలమైట్ వంటి ఇండస్ట్రియల్ ఖనిజాలకు ఉత్పత్తితో అనుసంధానించిన ప్రీమియంతో వేలం విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. పట్టా, డీకేటీ, అటవీ భూములపై దరఖాస్తుల ద్వారా లీజుల మంజూరు కొనసాగుతుంది. డెడ్ రెంట్లు ఇక నుంచి త్రైమాసికంగా కాకుండా వార్షికంగా సీనరేజి ఫీజుపై సర్దుబాటు చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసే గ్రానైట్, ఇండస్ట్రియల్ మినరల్ లీజులు 20 నుంచి 30 ఏళ్లకు పెంచారు. రోడ్ మెటల్ (క్యాప్టివ్ క్రషింగ్ యూనిట్ల కోసం) లీజులు 15 నుంచి 30 ఏళ్లకు, మిగిలిన ఖనిజాల కోసం 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచారు. కొత్త విధానంలో టన్నేజి ఆధారంగా సీనరేజి ఫీజు వసూలు చేస్తారు. లీజు దరఖాస్తు నుంచి సర్దుబాటు, బదిలీ, పునరుద్ధరణ, ఫిర్యాదుల వరకు అన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్లో చేయనున్నారు. గతంలో పెండింగ్లో ఉన్న లీజు వివాదాలను పరిష్కరించేందుకు ఓటీఎస్ (వన్టైమ్ సెటిల్మెంట్) పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్వీ గోశాలపై తప్పుడు ప్రచారంఎస్వీ గోశాలపై వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మంత్రులు అనిత, రామానాయుడు అన్నారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షకు విద్యార్థులు వెళ్లేందుకు ఆలస్యం అయిందనడంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. -
ఫీజుల షెడ్యూల్కు బూజు!
ఫీజు కోసం కూలీ పనికి నా ఏడేళ్ల వయసులో నాన్న చనిపోయారు. బతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరు కోసిగికి వచ్చాం. మా అమ్మ భాగమ్మ కూలీ పనులకు వెళుతూ నన్ను చదివిస్తోంది. సొంతిల్లు లేదు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. ఫీజు చెల్లిస్తేనే ప్రాజెక్టు వర్క్కు అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళుతూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైన చిరుద్యోగంతో బతుకుతా. – ఎం.రాకేష్, బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్, హెచ్.మురవణి, కర్నూలు జిల్లా.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు పాలనలో గతి తప్పిన ఫీజు రీయింబర్స్మెంట్, ఊసేలేని వసతి దీవెనతో పేద కుటుంబాల్లోని పిల్లల చదువులు అగమ్యగోచరంగా మారాయి. ఒకపక్క విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా.. ఫీజులు చెల్లించకుండా పరీక్షల ముంగిట పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని కుటుంబాల్లో డబ్బులు కట్టలేక, అప్పులు పుట్టక కాలేజీ విద్యార్థులు కూలీలుగా మారుతున్న దుస్థితి దాపురించింది. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు జరిపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దాదాపు రూ.18,663.44 కోట్లతో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి విద్యా సంస్థలకు వారే స్వయంగా చెల్లించడం ద్వారా జవాబుదారీతనానికి బాటలు వేసింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ సజావుగా, చింత లేకుండా సాగిన పిల్లల చదువులు ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యాయి. విద్యార్థుల చదువుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ధోరణి అవలంబిస్తుండటం విద్యావేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్కాలర్షిప్ల పేరుతో ఫీజుల్లో కొంత మొత్తమే ఇచ్చి మిగిలిన భారాన్ని పేదింటి బిడ్డలపైనే వదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థి కష్టపడి చదువుకుంటే ఎంత ఫీజు అయినా సరే చెల్లించేందుకు వెనుకాడలేదు. తద్వారా ఐదేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేలా చదువులకు పూర్తి అండగా నిలిచారు.మళ్లీ చేటు కాలం దాపురించింది..!గత ఐదేళ్లూ ఉజ్వల ప్రగతితో పురోగమించిన ఉన్నత విద్య ప్రతిష్ట కూటమి సర్కారు నిర్వాకాలతో మసకబారుతోంది. వెంటాడుతున్న ఫీజుల భయంతో విద్యార్థులు దినదిన గండంలా కళాశాలలకు వెళ్తున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న వారు మెయింటెనెన్స్ ఖర్చులు అందక అలమటిస్తున్నారు. కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కూలినాలి చేసైనా, మెడలో పుస్తెలు తాకట్టు పెట్టైనా అప్పులు తెచ్చి కళాశాలలకు రూ.వేలకు వేలు ఫీజులు కడుతున్నారు. కూటమి ప్రభుత్వ కుటిల పన్నాగంతో పేద పిల్లలకు ఈ దుర్గతి దాపురించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజుల చెల్లింపులపై షెడ్యూల్ విధానాన్ని గాలికొదిలేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకు జమ చేస్తామని ప్రకటించింది. త్రైమాసికం విధానాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది.ముగుస్తున్న విద్యా సంవత్సరం..షెడ్యూల్ ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికింది. 2024 – 25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు చెల్లించాలి. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో రూ.3,900 కోట్లు కూడా కలిపితే మొత్తం రూ.7,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. ఫీజుల కింద ఇప్పటివరకు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన రూ.300 కోట్లు పాక్షికంగా మాత్రమే జమ అయినట్లు కాలేజీలు చెబుతున్నాయి. ఇక 2025–26 విద్యా సంవత్సరానికి రూ.3,900 కోట్లు అవసరం అయితే బడ్జెట్లో కూటమి సర్కారు కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపింది. బడ్జెట్లో తగిన మేరకు కేటాయింపులు చేయకపోవడం విద్యా వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులేవి?కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకపక్క ఫీజుల గండంతోపాటు మరోపక్క వసతి దీవెన (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఎంటీఎఫ్) ఊసే లేకపోవడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో వసతి దీవెనలో విద్యార్థులకు ఖర్చుల కింద రూ.4 వేల నుంచి రూ.10 వేల మధ్య స్లాబ్ పెట్టి మాత్రమే ఇవ్వగా వైఎస్ జగన్ పాలనలో ఆ విధానాన్ని తొలగించి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4,275.76 కోట్లు అందచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) రూ.1,100 కోట్లు చెల్లించకపోవడంతో ఖర్చుల కోసం పిల్లలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు.నాడు నిశ్చింతగా చదువులు..వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, పేదింటి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థలు జవాబుదారీతనంతో నడుచుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు త్రైమాసికాల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేలా షెడ్యూల్ను ప్రకటించింది. ఏటా షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిధులను విడుదల చేస్తూ చింతలేని చదువులు అందించింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులను ఏప్రిల్లో ప్రాసెస్ చేసి షెడ్యూల్ ప్రకారం మే నెలలో చెల్లింపులు చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకుండా, పిల్లల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ను తుంగలో తొక్కింది. 2024 ఏడాదికి సంబంధించి మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, ఏప్రిల్–మేలో ఇవ్వాల్సిన వసతి దీవెన (హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు) నిధులను తొక్కిపెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థులను నిలువునా ముంచేసింది.ఫీజుల అప్పు ప్రభుత్వమే తీర్చాలి ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. గత ప్రభుత్వలో టంచన్గా ఫీజు రీయింబర్స్మెంట్ అందేది. రెండేళ్ల పాటు చదువుకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు. ఈ ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంట్లో వాళ్లు అప్పు చేసి డబ్బు కట్టారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తేగానీ ఆ అప్పు తీరదు. మా అప్పును వడ్డీతో సహా తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – నిద్దాన తిరుమల ప్రసాద్, విద్యార్ధి, విజయనగరం జిల్లా మా పాలిట శాపం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇంజనీరింగ్ కళాశాలలకు ఇవ్వడం లేదు. కౌన్సిలింగ్లో ఉచిత సీటు వచ్చినా ఫీజు కింద రూ.22 వేలు చెల్లించాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం మాలాంటి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. – రెడ్డి మహమ్మద్, ఈఈఈ, సెకండ్ ఇయర్ విద్యార్ధి, అన్నమయ్య జిల్లా అప్పులు చేయాల్సి వస్తోంది నూజివీడులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతున్నా. నాన్న ట్రాక్టర్ డ్రైవర్. అమ్మ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీ. జగనన్న విద్యాదీవెన పథకంతో రెండేళ్లు ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజులు చెల్లించలేదు. ఇప్పటికే రూ.47 వేలు అప్పుచేసి కాలేజీకి కట్టాం. ఈ ఏడాది మళ్లీ అప్పు చేయాల్సి వస్తోంది. – జలసూత్రం మాధవి, విద్యార్థిని, వడ్లమాను, ఏలూరు జిల్లాపరీక్షలు వస్తున్నాయి.. భయంగా ఉంది శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాన్న లేడు. అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ నన్ను చదివిస్తోంది. ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. ఈనెల 22 నుంచి పరీక్షలున్నాయి. హాల్టికెట్ జారీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. కళాశాలకు రూ.35 వేల వరకు కట్టాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో అప్పులు పుట్టే పరిస్థితి లేదు. – కె.మోహన్ కందా, డిగ్రీ విద్యార్ధి, శ్రీకాళహస్తి రెడ్బుక్లో విద్యార్థులూ ఉన్నారేమో! రామచంద్రపురంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నా. నాకు మూడు టర్మ్లకు రూ.38 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి. విద్యా సంవత్సరం అయిపోతున్నా ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. బహుశా విద్యా శాఖ మంత్రి రెడ్బుక్లో విద్యార్థులు కూడా ఉన్నారేమో! కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలి. – కె.భాస్కర్, బీటెక్ విద్యార్ధి, రాజమహేంద్రవరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు డిగ్రీ పూర్తి చేశా. ఇంకా రూ.9 వేలు కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఫీజు మొత్తం చెల్లించాకే సర్టిఫికెట్లు తీసుకెళ్లమని చెబుతోంది. నాన్న అహమ్మద్ హుస్సేన్ దినసరి కూలి. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పీజీ చదవాలన్న కోరిక కలగానే మిగిలిపోయేలా ఉంది. ప్రస్తుతం ఓ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నా. – షేక్ రిజ్వాన్ బాషా, డిగ్రీ విద్యార్ధి, ప్రకాశం జిల్లా -
శాఖాపరమైన విచారణతోనే సరిపెట్టేస్తారా?
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో కాపీయింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కనుసన్నల్లోనే వ్యవస్థీకృతంగా కాపీయింగ్ ప్రక్రియ కొనసాగుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ప్రైవేట్ కళాశాలలు, విద్యార్థుల నుంచి ‘గ్యారెంటీ పాస్’ హామీతో రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడి పరీక్షల అనంతరం జవాబు పత్రాలను అధికారులు తారుమారు చేస్తున్నారనే తీవ్రమైన నేరారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టి కాపీయింగ్ రాకెట్ వెనుక ఉన్న అధికారులను గుర్తించే ప్రయత్నం చేయకుండా శాఖాపరమైన విచారణతో ప్రభుత్వం మ..మ.. అనిపిస్తోంది. కాపీయింగ్ ఫిర్యాదులతో గతంలో రద్దయిన సిద్ధార్థ వైద్య కళాశాల సెంటర్కు హెల్త్ యూనివర్సిటీ పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చిoది. అదే సెంటర్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ దొరకడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణలు బలపడుతున్నాయి. యూనివర్సిటీపై ఆరోపణలు పట్టవా? ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా సిద్ధార్థ కాలేజీ సెంటర్లో ఈ నెల 9వ తేదీన హెల్త్ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు చేయగా, ముగ్గురు విద్యార్థులు కాపీ కొడుతూ పట్టుబడ్డారు. అనంతరం దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ చర్యల అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు కాపీ కొడుతూ దొరికారు. దీంతో విచారణ చేపట్టాలని డీఎంఈని ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డీఎంఈ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగా, సిద్ధార్థ వ్యవహారంపై డీఎంఈని విచారణకు ఆదేశించానని మంగళవారం వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారే తప్ప యూనివర్సిటీపై వస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించలేదు. ఇలా ప్రభుత్వం ఎంతసేపు సిద్ధార్థ ఘటన చుట్టూనే విచారణ పేరిట హడావుడి చేస్తోంది. దీన్నిబట్టి ఆ కళాశాలలోని ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని అక్కడితో అక్రమాలను కప్పిపుచ్చే యోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. హెల్త్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా, డీఎంఈగా డాక్టర్ నరసింహం ఒక్కరే ఉన్నారు. ప్రస్తుత వివాదం డీఎంఈ, విశ్వవిద్యాలయం చుట్టూనే తిరుగుతోంది. ఈ పరిస్థితుల్లో డీఎంఈ ద్వారానే విచారణ చేపడితే వాస్తవాలు ఎలా వెలుగు చూస్తాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో వాస్తవాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వం థర్డ్ పార్టీ విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు బయటపడటానికి కొంతైనా ఆస్కారం ఉంటుంది. కర్నూల్, కాకినాడలో కాపీయింగ్పై ఫిర్యాదులు అందలేదు.. కాబట్టి తనిఖీలు చేయం! కర్నూల్, కాకినాడతోపాటు ఇతర ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో నిర్వహించిన ఎంబీబీఎస్ పరీక్షల్లో కాపీయింగ్ జరిగినట్టు తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటించింది. ‘హెల్త్ వర్సిటీలో కాపీయింగ్ కథలెన్నో!’ పేరుతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి వర్సిటీ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ నెల 8వ తేదీ వరకు సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్ ఫిర్యాదులు రాలేదని పేర్కొన్నారు. అయితే, ఈ వివరణ ద్వారా ఫిర్యాదులు వస్తే తప్ప తాము స్పందించబోమని యూనివర్సిటీ అధికారులు చెప్పకనే చెప్పారు. వాస్తవాన్ని వెలుగులోకి తెచి్చన ‘సాక్షి’ కథనాన్ని ఫిర్యాదుగా తీసుకుని కాపీయింగ్ జరగకుండా చూడాల్సిన బాధ్యతను వదిలేసి... ఫిర్యాదు వస్తే మాత్రమే తనిఖీ చేస్తామని పేర్కొనడం గమనార్హం. కాపీయింగ్ను వ్యవస్థీకృతం చేసి, ముడుపులతో మురిసిపోతున్న యంత్రాంగాన్ని సరిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. -
కుర్ర‘కారు’ జోరు!
సాక్షి, అమరావతి: ఉద్యోగంలో చేరిన వెంటనే సొంతకారు ఉండాలన్న కోరిక యువతరంలో బలంగా పెరుగుతోంది. ఇందుకోసం చాలామంది అప్పు చేసి మరీ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్లలోపు యువత రుణం(ఫైనాన్స్) తీసుకుని మరీ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. మొత్తం కార్లు కొనేవారిలో 57 శాతం మంది ఫైనాన్స్ ద్వారానే నిధులు సమకూర్చుకుంటున్నారని, ఈ సంఖ్య ఏటా వేగంగా పెరుగుతోందని యూజ్డ్ కార్ ప్లాట్ఫాం స్పిన్నీ 2025 క్యూ1 నివేదికలో వెల్లడించింది. దేశంలో అత్యధికంగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో జరుగుతున్నాయని తెలిపింది. మొత్తం అమ్మకాల్లో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారానే జరుగుతున్నట్లు పేర్కొంది. దేశంలో సొంతకారు కొనుగోలు చేస్తున్నవారి సగటు వయసు 2023లో 34 ఏళ్లు ఉండగా, అది ఇప్పుడు 32 ఏళ్లకు తగ్గినట్లు వివరించింది. పెరుగుతున్న మహిళా కారు ఓనర్లు » సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. కార్ల కొనుగోలుకు సంబంధించి 2024లో మహిళల వాటా 26% ఉండగా, అది 2025లో 28 శాతానికి పెరిగిందని స్పిన్నీ 2025 క్యూ1 నివేదిక వెల్లడించింది. మార్చి నెల కొనుగోళ్లలో అయితే 30 శాతం దాటినట్లు తెలిపింది. » మహిళలు కార్లు ఎక్కువగా కొంటున్న నగరాల్లో కొచ్చి మొదటి స్థానంలో ఉంది. » రుణాలు తీసుకుని కార్లు కొంటున్న మహిళలు అత్యధికంగా ఉన్న నగరాల్లో కోయంబత్తూరు అగ్రస్థానంలో నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పుణే మొదటి స్థానంలో ఉంది. » లగ్జరీ కార్ల అమ్మకాల్లో 30 శాతం ఢిల్లీలోనే ఉంటున్నాయి. జీప్ కాంపాస్, బీఎండబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెజ్ జీఎల్ఏ లగ్జరీ మోడల్స్కు అత్యధిక డిమాండ్ ఉంది. » మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో 74 శాతం మంది తొలిసారి కారు కొనుగోలు చేస్తున్నవారే ఉంటున్నారు. » 84% మంది పెట్రోలు కారు కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. » రానున్న కాలంలో పట్టణాల్లో ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల అమ్మకాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని ‘స్పిన్నీ’ అంచనా వేసింది. కార్లు కొనుగోలు చేస్తున్న యువత సగటు వయసు 32 ఏళ్లు 57% ఫైనాన్స్లో కార్లు కొనుగోలు చేస్తున్న యువత74% తొలిసారి కారు కొనేవారిలో సెకండ్ హ్యాండ్ వాహనాలను తీసుకునేవారు30% ఈ ఏడాది మార్చిలో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసినవారిలో మహిళలు -
అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 వేల ఎకరాలు
తాడికొండ: అమరావతిలో మరోసారి భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూనే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 30 వేల ఎకరాలు సమీకరిస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అనంతవరంలోని గ్రావెల్ క్వారీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, అమరావతిని కలిపి త్వరలో మెగాసిటీగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని చెప్పారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని, ఇందుకోసం 30 వేల ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంటుందన్నారు. ఇందులో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందని తెలిపారు. ఇవన్నీ పోగా ఐదు వేల ఎకరాలు మాత్రమే మిగులుతుందని, అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంకా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని.. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ను కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయినా.. భూ సమీకరణా లేదా భూసేకరణా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. -
2,260 రెగ్యులర్ టీచర్ పోస్టుల కన్వర్షన్
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న 2,260 టీచర్ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేసింది. ఈమేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. ఇలా మార్చిన పోస్టుల్లో 1,136 ఎస్జీటీలు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ రెగ్యులర్ టీచర్లలో మిగులు (సర్ప్లస్) పోస్టులను స్పెషల్ టీచర్లుగా మార్చి, ఆయా ఖాళీలను జిల్లాల వారీగా సృష్టించి ఆ స్థానాల్లో మార్పుచేసిన ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 1,984 పోస్టులు అవసరం ఉండగా,860 పోస్టులకు అనుమతి ఉంది. మిగిలిన 1,124 పోస్టులను కొత్తగా మంజూరు చేసి, రెగ్యులర్ టీచర్లను స్పెషల్ టీచర్లుగా మార్పు చేశారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను గరిష్టంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు 151, కనిష్టంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 44 మంజూరు చేశారు. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు లేరు. తాజాగా 1,136 ఎస్జీటీ పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగానికి మంజూరు చేయడంతో ప్రత్యేక అవసరాల గల పిల్లల బోధనకు అవకాశం కల్పించినట్టయింది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ముస్లిం జేఏసీ
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ చట్టం అమలుకాకుండా చూడాలంటూ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాని కోరుతూ ఇప్పటికే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు ఇప్పటి వరకు సుప్రీం కోర్టులో 13 వ్యాజ్యాలు వేయడం గమనార్హం. వక్ఫ్ సవరణ చట్టం అమలుతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ముస్లింలు ఓవైపు మసీదుల్లో సమావేశాలను నిర్వహిస్తునే మరోవైపు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కేంద్రం వక్ఫ్ చట్టాన్ని సవరించి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం–2025ను అమలులోకి తేవడంపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, వారికి మద్దతుగా లౌకిక వాదులు, రాజకీయ పార్టీలు సైతం న్యాయపోరాటానికి దిగాయి. తమకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీకి ముస్లింలు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ, వక్ఫ్ సవరణ చట్టం అమలును అడ్డుకోవాలంటూ సుప్రీంను ఆశ్రయించడాన్ని అభినందిస్తున్నారు. ఈ విషయంలో తొలి నుంచి టీడీపీ రెండు నాల్కల ధోరణి తేటతెల్లమైందని, ఇంకా ఆ పార్టీ సమర్థించుకోవడం సరికాదని మండిపడుతున్నారు.మత స్వేచ్ఛ,మానవ హక్కులపై దాడి ఏకపక్షంగా వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి తేవడం మత స్వేచ్ఛ, మానవ హక్కులు, రాజ్యాంగంపై మూకుమ్మడి దాడి. సవరణల సాకుతో స్వయం ప్రతిపత్తి కలిగిన వక్్పబోర్డ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. 44 సవరణలు అంటూ ఏకంగా 119 సవరణలు చేసి వక్ఫ్ పూర్తి స్వభావాన్ని దెబ్బతీశారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రా«థమిక హక్కులకు భంగం కలుగుతున్నందునే న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రమే పెట్టి మత స్వేచ్ఛను దెబ్బతీయడం దారుణం. కొత్త చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులు, ఖబర్స్థాన్లు, మసీదులు, దర్గాలు, అషూర్ఖానాలు, మదరసాలు సైతం ప్రమాదంలో పడతాయి. సవరణ బిల్లును ఆపే అవకాశం ఉన్నా, అడ్డగోలుగా మద్దతిచ్చిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లిం ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. – షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జేఏసీ కన్వినర్వక్ఫ్ సవరణచట్టం రాజ్యాంగ విరుద్ధం వక్ఫ్ సవరణ చట్టం–2025 రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేలా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తుంటే.. సీఎం చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి మాదిరి రంగులు మార్చే రాజకీయ నాయకుడని మరోసారి తేటతెల్లమైంది. ఆయన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మతపరమైన హక్కులకు సంబంధించి గతంలో సుప్రీం కోర్టు జారీ చేసిన పలు ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా కొత్త వక్ఫ్ సవరణ చట్టం రూపొందింది. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ స్టేట్ హజ్ కమిటీ మాజీ చైర్మన్చంద్రబాబువి కల్లబొల్లి మాటలు ముస్లింలపై ఈగవాలనివ్వబోమని ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న మోసపూరిత రాజకీయాలను ముస్లింజాతి ఎప్పటికీ క్షమించదు. ఇప్పటికైనా టీడీపీ వైఖరిని ముస్లిం సమాజం గుర్తించాలి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు వైఎస్సార్సీపీ పాటుపడింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం గొప్ప విషయం. ఇందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. – షేక్ నాగుల్ మీరా, ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీడీపీలోని ముస్లింలు ఆలోచించుకోవాలి వక్ఫ్ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడిన చంద్రబాబు ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకుని టీడీపీలోని మైనార్టీ నేతలతో వైఎస్సార్సీపీపై బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. బాబు అవకాశవాద రాజకీయంపై టీడీపీలోని ముస్లింలు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ మాజీ సీఎం జగన్కు కృతజ్ఞతలు. – కాగజ్ ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ -
‘కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధం’
తాడేపల్లి : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరద్ధమన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్లో మాట్లాడిన పేర్నినాని.. ‘ టీడీపీ, జనసేన ఓట్లు లేకపోతే వక్ఫ్ చట్టం పార్లమెంటులో పాస్ అయ్యేదా?, మరి వారిద్దరూ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తే మోదీ ఆ చట్టాన్ని తెచ్చేవాడు కాదు. చంద్రబాబు బొమ్మను దేశ వ్యాప్తంగా ముస్లింలు చెప్పుతో కొడుతున్నారు. ముస్లింల ఆందోళనల్లో సిగ్గు లేకుండా టీడీపీ పాల్గొంటోంది.లింకు డాక్యుమెంట్లు బయటపెడితే నోరుమూశారు..వక్ఫ్ స్థలాల్లో సాక్షి ఆఫీసులు ఉన్నాయంటూ మొదట ఆరోపణలు చేశారు. సాక్షి స్థలాల లింకు డాక్యుమెంట్లు బయట పెట్టడంతో నోరు మూసుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ విప్ జారీ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. విప్ కాగితాలు బయట పెట్టగానే మళ్ళీ నోరు మూసుకున్నారు. హిందూ మత సంస్థలు, ఆలయాల్లో అన్యమతస్తులను తొలగిస్తున్నాం. చివరికి షాపులు ఉన్నా ఖాలీ చేయిస్తున్నాం. దేవాదాయ శాఖలో హిందూయేతరులను అధికారులను పెట్టటం లేదు. మరి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను ఎలా పెడతారు?, అలా చేయటం కరెక్టేనా?, ముస్లింలు నమాజు చేసుకునే మసీదుల ఆలన పాలనాకు ముస్లిమేతరులను పెట్టటం సబబేనా? , ముస్లింల హక్కులను కాలరాయటం కరెక్టుకాదు.మా పార్టీలాగే మీరు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగలరా?చంద్రబాబు, లోకేష్ లకు ఖలేజా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేయగలరా?, మా పార్టీలాగే మీరు కూడా వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయలగరా?, దిక్కుమాలిన, దౌర్భాగ్య రాజకీయాలు మానుకోవాలి. పన్నుల వసూళ్లలో రెండు శాతం మాత్రమే వృద్ది ఉన్నప్పుడు జీఎస్డీపీలో దేశంలోనే నెంబర్ టూ ప్లేస్కి ఎలా వచ్చింది?, అంటే ఇంకా లక్షల కోట్ల అప్పులు చేయటానికి రెడీ అయ్యారని అర్థం అవుతోంది. చంద్రబాబు దళిత వ్యతిరేకి. అంబేద్కర్ జయంతి రోజునే దళితులకు సంకెళ్లు వేసి రోడ్డు మీద నడిపించటం దుర్మార్గం. 2018 కు ముందు మా పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరుగుతోందని మేము గతంలోనే చెప్పాం. అధికారం ఉంటే చంద్రబాబు ఎన్ని పాపాలు చేస్తారో లెక్కలేదు. రాజధానిలో ఇంకా 44 వేల ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తేలుతుంది. తన స్వార్ధం కోసం తప్ప చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏమీ చేయడు’ అని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారు: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దళిత సమాజాన్ని అణగదొక్కారని.. వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధపాతాళానికి దళితులను తొక్కేశారని.. వారికి సంబంధించిన ఏ పథకమూ అమలు కావటం లేదంటూ నిలదీశారు.‘‘అంబేద్కర్ అందరివాడే, కానీ చంద్రబాబు కొందరివాడు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదు?. సామాజిక న్యాయ మహాశిల్పం దగ్గర ఉన్న వైఎస్ జగన్ పేరును ఎందుకు తొలగించారు?. దళితులకు ఏ పథకం అందించకుండా వారి ఇళ్లకు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నారు?...బ్లాక్ క్యాట్ కమాండోల సెక్యూరిటీ లేకుండా దళితుల ఇళ్లకు వెళ్లగలరా?. దళితుల ఇళ్లలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న చంద్రబాబు వైఖరిని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దళితులను కించపరిచేలా ఒక మంత్రి మాట్లాడితే చంద్రబాబు అతన్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు?’ అంటూ టీజేఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత లోపిస్తుందంటూ కోర్టులో కేసు వేశారు. దళితులను తొలగించి అక్కడ చంద్రబాబు ఎలా ప్యాలెస్ కట్టుకుంటున్నారు?. దళితుల మీద నిజమైన ప్రేమ ఉంటే వారిని చట్టసభలకు పంపించటానికి ఎందుకంత వివక్ష చూపుతున్నారు?. అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు. చంద్రబాబుని దళితవాడల్లోకి రాకుండా అడ్డుకుంటాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
రెవెన్యూపై కూటమి నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. భూముల వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్యమైన ఈ శాఖకు పూర్తి స్థాయి అధికారులను నియమించకపోవడంతో ఏ పనులూ సజావుగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూ పరిపాలన శాఖలో (సీసీఎల్ఏ) చీఫ్ కమిషనర్తోపాటు అదనపు చీఫ్ కమిషనర్, సహాయ కార్యదర్శి (ల్యాండ్స్), సహాయ కార్యదర్శి (విజిలెన్స్), అప్పీల్స్ కమిషనర్ వంటివి ముఖ్యమైన పోస్టులు. ఇవికాకుండా ఇండిపెండెంట్గా సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ కమిషనర్ పోస్టులు ముఖ్యమైనవి.ఇవన్నీ ఐఏఎస్ అధికారులు నిర్వహించే పోస్టులే. అయితే, కూటమి ప్రభుత్వం ఈ పోస్టులను కేవలం ఇద్దరితోనే నడిపిస్తోంది. సీసీఎల్ఏగా జయలక్ష్మి ఉండగా.. మిగిలిన అన్ని పోస్టులకు మరో ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోడియాను బదిలీ చేసి ఆ బాధ్యతలను జయలక్ష్మికి అదనంగా ఇచ్చారు. రెవెన్యూ శాఖకు కమిషనర్, ముఖ్య కార్యదర్శి ఆమే. అలాగే రెవెన్యూ శాఖలోని మిగిలిన అన్ని ముఖ్యమైన విభాగాలకు ప్రభాకర్రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు.ఆరుగురు ఐఏఎస్ అధికారులు పని చేయాల్సిన చోట కేవలం ఇద్దరితో నడిపించడం ద్వారా రెవెన్యూ శాఖపై చంద్రబాబు నిర్లక్ష్యం చూపుతున్నారనే వాదన వినిపిస్తోంది. జిల్లా కలెక్టర్లు, డీఆర్ఓలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వేలాది మంది రెవెన్యూ సిబ్బందిపై పర్యవేక్షణ, భూముల వ్యవహారాలకు సంబంధించిన ఈ శాఖపై శీతకన్ను వేయడం ద్వారా అందులో పనులు ఏవీ సజావుగా జరగడం లేదని తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఏవో తప్పులు, అక్రమాలు జరిగిపోయాయని చూపించేందుకు మాత్రమే రెవెన్యూ శాఖను వాడుకుంటూ మిగిలిన వ్యవహారాలను పక్కన పెట్టేశారు. దీంతో రెవెన్యూ శాఖ వ్యవహారాలు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంనీ నత్తనడకన సాగుతున్నాయి. -
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
సాక్షి, అమరావతి: దిగుమతి సుంకాల అమలు మూడు నెలల పాటు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రొయ్యల ఎగుమతిదారులకు ఊరటనిచ్చింది. దీంతో రొయ్యలను అమెరికాకు తరలించేందుకు భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగుమతికి సిద్ధంగా 40వేల టన్నులు చైనా మినహా భారత్తో సహా మిగిలిన దేశాలపై టారిఫ్ అమలును 3 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం ఎగుమతిదారులకు కలిసొచ్చింది. దీంతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 2వేల కంటైనర్ల (40వేల టన్నులు) సరుకును పాత టారిఫ్ ప్రకారం అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని పరిశ్రమ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇదిలా ఉండగా సుంకాల భయాలున్నప్పటికీ ఆర్డర్లు తగ్గలేదని భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారుల సమాఖ్య కార్యదర్శి కేఎన్ రాఘవన్ ప్రకటించారు.భారత్కు అతిపెద్ద మార్కెట్ అమెరికారొయ్యల ఎగుమతుల్లో భారత్కు అతిపెద్ద మార్కెట్ అమెరికా. అగ్రరాజ్యానికి ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3%తో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 26.9 % తో ఈక్విడార్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్(2.4%), అర్జెంటీనా (2.1%) ఉన్నాయి. 2023–24 సీజన్లో అమెరికాకు 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను భారత్ ఎగుమతి చేసింది.ట్రంప్ ప్రతీకార నిర్ణయంతో ప్రతికూలతలు ఈ నెల 4న ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార టారిఫ్ (26 శాతం) దేశీయంగా ఆక్వా రంగాన్ని కుదిపేసింది. ఈ పెంపు ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చి ఉంటే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.77 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 3.88 శాతంతో పాటు తాజాగా విధించిన 26 శాతం కలిపి 34 శాతం సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. ఆ మేరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న 2 వేల కంటైనర్లపై సుంకాల భారం రూ.600 కోట్లపైగా పడేది.ఇక కోల్డ్ స్టోరేజ్ల్లో ఉన్న మరో 2,500 కంటైనర్ల సరుకుపై పడే భారం కలిపితే రూ.1300 కోట్లకుపైగా ఉండేది. ఈ పరిణామం ఎగుమతిదారులను కలవరానికి గురిచేసింది. ఇదే సమయంలో ట్రంప్ ట్యాక్స్ సాకుతో అమెరికాకు ఎగుమతి కాని కౌంట్ ధరలను కూడా కంపెనీలు తగ్గించడంతో ఆక్వా రైతులు నష్టాల బారిన పడ్డారు. అయితే మరో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఉన్న తక్కువ సమయాన్ని అందిపుచ్చుకునేందుకు ఎగుమతిదారులు ప్రయత్నిస్తున్నారు. -
హెల్త్ వర్సిటీలో కాపీయింగ్ కథలెన్నో!
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ అకడమిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు చంద్రబాబు ప్రభుత్వమే రాచబాట వేసింది. విద్యార్థుల నుంచి భారీగా ముడుపులు దండుకుని మాస్కాపీయింగ్కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ విభాగం, ఉన్నతాధికారులు సహకారం అందించడం గమనార్హం. గతంలో రద్దయిన సిద్ధార్థ సెంటర్ను విద్యార్థుల కన్వీనియెంట్(అనుకూలత)ను సాకుగా చూపి విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం తిరిగి అనుమతులు ఇచ్చింది.రద్దయిన సెంటర్కు తిరిగి అనుమతులు ఇవ్వడానికి ముడుపులు పుచ్చుకున్న వర్సిటీ పరీక్షల విభాగం తమకు కావాల్సిన విద్యార్థుల కాపీయింగ్కు అడ్డంకులు సృష్టించకుండా, కాపీయింగ్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పెద్దఎత్తున హడావుడి చేసింది. ఈ హడావుడి చూసి నిజంగానే కాపీయింగ్ను అడ్డుకోవడానికి చిత్తశుద్ధితో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, రిజిస్ట్రార్, ఇతర అధికారులు ప్రయత్నిస్తున్నారనే భావన కల్పించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి కాపీయింగ్కు అవకాశం కల్పించినవారే.. ఇలా ఎందుకు హడావుడి చేశారని ఆరా తీస్తే అవాక్కయ్యే నిజాలు వెల్లడయ్యాయి.సిద్ధార్థలో మాస్కాపీయింగ్ జరుగుతున్న అంశంపై గతంలో ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం విదితమే. ‘కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్’ (సీవోసీ)పై నిమ్రా కాలేజీతో పాటు పలువురు ఫిర్యాదు చేశారు. మళ్లీ అలాంటి ఫిర్యాదు రాకుండా ఉండటానికి తనిఖీల హడావుడి చేశారు. నిజానికి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. అవన్నీ వర్సిటీ సీవోఈ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. వారు గదిలో కూర్చుని వాటిని పరిశీలించి కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవచ్చు.కానీ.. అలా చేయకుండా తనిఖీలంటూ హడావుడి చేసి కొద్దిమంది విద్యార్థులను మాత్రమే పట్టుకున్నారు. మిగతా కాపీయింగ్ యథావిధిగా జరగడానికి సహకారం అందించడం ఎవరూ ఊహించని విషయం. ఇన్విజిలేటర్ల నియామకం నుంచే వర్సిటీ అధికారుల ‘కుమ్మక్కు’ మొదలవుతుంది. ‘కాపీయింగ్ గురు’ చెప్పిన వారినే అక్కడ నియమిస్తారు.డీఎంఈతో విచారణ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, కాపీయింగ్ వ్యవహారంపై వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా పరీక్షల విభాగం తొక్కిపెడుతోందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణ చేయాలని డీఎంఈనీ ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులకు డీఎంఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారినుంచి వివరణ వచ్చాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని డీఎంఈ డాక్టర్ నరసింహం వెల్లడించారు. వర్సిటీ అధికారుల కుమ్మక్కు గురించి మాత్రం విచారణ జరగడం లేదని సమాచారం.కోడ్–డీకోడ్ మాయాజాలమూ ఉందికేవలం కాపీయింగ్కు మాత్రమే వర్సిటీ పరీక్షల విభాగం సహకరిస్తోందన్న ఆరోపణలపై విచారణ పరిమితమైతే పూర్తిస్థాయిలో నిజాలు వెలుగుచూసే అవకాశం లేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల జవాబు పత్రాలను ‘రహస్య కోడ్’తో వ్యాల్యుయేషన్కు పంపిస్తారు. ఈ కోడ్–డీకోడ్ బాధ్యులు ప్రైవేటు ఏజెన్సీకి వర్సిటీ పరీక్షల విభాగం అప్పగిస్తుంది. ఈ బాధ్యతల్లో ఉన్న ఏజెన్సీకి, పరీక్షల విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న చీఫ్కి సన్నిహిత సంబంధాలున్నాయని వర్సిటీ ఉద్యోగులు చెబుతున్నారు.తమకు కావాల్సిన విద్యార్థి జవాబుపత్రంలో కొన్ని షీట్లు మార్చడం చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమేనని సమాచారం. ఈ అక్రమాలన్నీ వ్యవస్థీకృతంగా జరగడానికి ఆ చీఫ్ సహకారం అందిస్తున్నారని, ఈ దిశగా పోలీసు విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయనే అభిప్రాయం వర్సిటీ వర్గాల్లో ఉంది. కర్నూలు, కాకినాడలోనూ..రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ–ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి సమీపంలో ప్రభుత్వ కళాశాలలో అవకాశం కల్పిస్తారు. కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, కర్నూలు కాలేజీ, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలలో సప్లిమెంటరీ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. సిద్ధార్థలో కాపీయింగ్కు సహకరించినట్లుగానే కర్నూలు ప్రభుత్వ కళాశాల, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సప్లిమెంటరీ పరీక్షల్లో విచ్చలవిడిగా కాపీయింగ్ జరిగింది. అక్కడ ఆకస్మిక తనిఖీలు కాదు కదా.. సాధారణ తనిఖీలు కూడా వర్సిటీ అధికారులు చేయలేదు. ఆ రెండు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వారితో వర్సిటీ అధికారులు కుమ్మక్కు కావడమే దీనికి కారణం. ముడుపులు భారీగా వసూలు చేసిన తర్వాతే వర్సిటీ అధికారులు కాపీయింగ్కు అనుకూలంగా వ్యవహారం నడుపుతారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కాపీయింగ్కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పడంతో వర్సిటీ అధికారుల కుమ్మక్కు ఆట సాగలేదు. -
అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కూటమి కుట్ర
సాక్షి, అమరావతి/గాందీనగర్(విజయవాడ సెంట్రల్)/డాబాగార్డెన్స్(విశాఖపట్నం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే గొప్ప సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తులో సామాజిక, న్యాయ మహా శిల్పాన్ని నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ స్మృతులను చెరిపేసేందుకు కుట్ర పన్నిందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.అంబేడ్కర్ చిత్రపటం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలోని డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఆ మహానుభావుడి విగ్రహంతో చంద్రబాబు వ్యాపారం చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దళితులపై బాబు సర్కార్ అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అని పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందేందుకు వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహం జోలికి వెళ్లావో తగిన గుణపాఠం తప్పదని చంద్రబాబును హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు అడుగులు వేద్దామన్నారు.మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దశ, దిశ చూపించిన అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి బాటలు వేసిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, షేక్ ఆసిఫ్, వేల్పుల రవికుమార్, చంద్రశేఖర్రెడ్డి, నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద ఘనంగా జయంతి విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ సామాజిక, న్యాయ మహా శిల్పం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుక ఘనంగా జరిగింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, నాయకులు గౌతంరెడ్డి, శైలజారెడ్డి, బెల్లం దుర్గ, షేక్ ఆసిఫ్, ఎ.రవిచంద్ర, దొడ్డా అంజిరెడ్డి, పోతిన మహేశ్, ఎస్సీ సెల్ నాయకులు కాలే పుల్లారావు, శరత్ తదితరులు అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావ్?విజయవాడలోని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని చంద్రబాబు.. రాష్ట్రాన్ని ఇంకేం పరిపాలిస్తారని రాజ్యాసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు రవీంద్రబాబు, వరుదు కల్యాణి ప్రశ్నించారు. మీకు చేతకాకపోతే మాకివ్వండి.. మేమే అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.సోమవారం విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులరి్పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో లేకుండా చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివరామకృష్ణ, నాయకులు బొల్లవరపు జాన్వెస్లీ, ద్రోణంరాజు శ్రీవత్సవ్ పాల్గొన్నారు. -
డీలర్షిప్ రద్దుకు ముందు విచారణ జరపాల్సిందే
సాక్షి, అమరావతి: చౌక ధరల దుకాణ డీలర్షిప్లను అధికారులు ఏకపక్షంగా రద్దు చేస్తున్న నేపథ్యంలో.. ఇందుకు అడ్డుకట్ట వేసే దిశగా హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. డీలర్షిప్ రద్దు వల్ల డీలర్ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారని, అందువల్ల తగిన విచారణ జరిపిన తరువాతే డీలర్షిప్ రద్దు విషయంలో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. వ్యక్తిగతంగా వాదన వినిపించే అవకాశం డీలర్కు ఇవ్వాలంది. అలాగే డీలర్తో పాటు ఒకవేళ సాక్షులు ఉంటే వారి ప్రమాణపూర్వక వాంగ్మూలాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది. కార్డుదారులు గానీ, ఇతరులెవరైనా గానీ ఫిర్యాదు చేస్తే డీలర్ సమక్షంలో వారిని కూడా విచారించాలంది. ఆ వ్యక్తులకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కూడా ఇవ్వాలని అధికారులకు తేల్చి చెప్పింది. ఏ ఆధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారో ఆ నివేదికలన్నింటినీ డీలర్కు అందచేయాలంది. ఎలాంటి విచారణ జరపకుండా తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా డీలర్షిప్ రద్దు చేస్తూ ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. కనీసం డీలర్ ఇచ్చిన వివరణను కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని ఆక్షేపించింది. తహసీల్దార్ తయారు చేసిన నివేదికను డీలర్కు అందచేయలేదని తెలిపింది. అలాగే డీలర్, సాక్షుల ప్రమాణపూర్వక వాంగ్మూలాలను కూడా నమోదు చేయలేదంది. ఆర్డీవో ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంది. వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే వాటిని సమర్థిస్తూ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తిరిగి ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. డీలర్షిప్ రద్దుపై న్యాయ పోరాటం చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎం.అరుణకు చెందిన రేషన్ డీలర్షిప్ను రద్దు చేస్తూ మదనపల్లి ఆర్డీవో 2009 ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సమర్థిస్తూ జాయింట్ కలెక్టర్ 2009 ఫిబ్రవరి 20న ఉత్తర్వులిచ్చారు. వీటిని సమర్థిస్తూ 2013 ఫిబ్రవరి 10న కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అరుణ 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు సింగిల్ జడ్జి తుది విచారణ జరిపి పిటిషన్ను కొట్టేస్తూ 2024 జూలై 16న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అరుణ ధర్మాసనం ఎదుట అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. -
పెగాసస్ నిఘా నిజమే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చెప్పిందే నిజమైంది. 2018–19లో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు తమ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయింది. భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు, సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా వెల్లడించింది. ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వ బాగోతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది. స్పైవేర్ నిఘాలో రెండో స్థానంలో భారత్ నిఘా సాఫ్ట్వేర్ స్పైవేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాల ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ జాబితాలో, పెగాసస్ను ఉపయోగించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం.–2018–19లో భారత్లో వందమంది రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు తదితరుల వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్వో గ్రూప్ పెగాసస్ స్పైవేర్తో నిఘా పెట్టింది. ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా రూ.58 కోట్లు ఎన్ఎస్వో గ్రూప్నకు చెల్లించాయి. –ఎన్ఎస్వో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల్లో 1,223 మందిపై నిఘా పెట్టింది. వారిలో వందమంది భారత్కు చెందినవారే కావడం గమనార్హం. అత్యధికంగా మెక్సికోలో 456 మంది ప్రముఖుల నంబర్లపై నిఘా ఉంచింది.పెగాసస్ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖుల సంఖ్యభారత్: 100, బ్రిటన్: 82, మొరాకో: 69, పాకిస్థాన్: 58, ఇండోనేసియా: 54, ఇజ్రాయెల్: 51, స్పెయిన్: 12, నెదర్లాండ్స్: 11, హంగేరీ: 8, ఫ్రాన్స్: 7, యూకే: 2.అప్పట్లోనే వెల్లడించిన వైఎస్సార్సీపీ 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపింది. పెగాసస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి కూడా పాల్పడింది. దీనిపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. ఆరోపణలను చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చింది. అయితే, నాడు వైఎస్సార్సీపీ చెప్పింది నిజమేనని.. మెటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది.అసెంబ్లీలోనే బయటపెట్టిన మమత2018–19లో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ను ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కొంతకాలం క్రితం వెల్లడించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆమె మాట్లాడుతూ.. 2019 ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతినిధులు చెప్పినట్టు కూడా మమతా తెలిపారు. బెంగాల్లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్ఎస్వో గ్రూప్ ప్రతినిధులు కోరారని చెప్పారు. కానీ, తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. కాగా, మమతా బెనర్జీ వ్యాఖ్యలతో.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగాసస్ ను ఉపయోగించినట్లు స్పష్టమైంది. -
కొత్త వక్ఫ్ చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్టం–1995కు సవరణలతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సవరణల రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ.. మతం ఆధారంగా వివక్ష చూపేలా కొత్త చట్టం ఉందని పేర్కొంది. ఆర్టికల్ 14, 15లను ఉల్లంఘిస్తున్న సవరణలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.వక్ఫ్ నిర్వహణ సక్రమంగా లేకుంటే జోక్యం చేసుకోవచ్చే తప్ప, మత విశ్వాసాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు సీఈవోగా ముస్లిం వ్యక్తే ఉండాలన్న నిబంధనను కొత్త చట్టంలో తొలగించారని తెలిపింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం మౌలిక సూత్రాలకు విరుద్ధమని.. ఇది తరాలుగా వస్తున్న హక్కులకు విఘాతం కలిగించడమేనని పేర్కొంది. కీలక వ్యక్తులను తొలగించేందుకు కూడా కొత్త సవరణలు అవకాశం కల్పిస్తున్నాయంది.⇒ ముస్లిం ధార్మిక సంస్థల వ్యవహారాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున జోక్యం చేసుకునే అవకాశం ఇస్తూ, పాత వక్ఫ్ చట్ట ఉద్దేశాలను కాలరాసేలా ఉన్న సవరణలతో వక్ఫ్ల పాలన బలహీనం అవుతుందని పేర్కొంది.⇒ వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పునర్విభజన విషయంలో జోక్యం చేసుకునేందుకు అధికారులకు అపరిమిత అధికారాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ పిటిషన్లో తెలిపింది. కానీ, ఒకసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫ్ అవుతుందన్న సూత్రాన్ని న్యాయస్థానాలు కూడా గుర్తించాయని తెలిపింది. మైనారిటీ ఆస్తులకు రాజ్యాంగ రక్షణ ఉందని, కొత్త చట్టంతో అన్ని రక్షణలు పోతున్నాయని పేర్కొంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. రక్షిత స్మారక చిహ్నాలు, రక్షణ ప్రాంతాల ప్రకటనను చెల్లనివిగా తేల్చే ప్రమాదం ఉందని తెలిపింది.⇒ ఏ చట్టమైనా దాని మాతృ చట్టం స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నో తీర్పుల్లో చెప్పిందని తెలిపింది. కానీ, కొత్త చట్టంతో పురాతన వక్ఫ్ల స్వరూపాన్ని సవాలు చేసే పరిస్థితి వచ్చిందని వైఎస్సార్సీపీ తన పిటిషన్లో వివరించింది. ⇒ ఏ వక్ఫ్ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని అధికారులకు కొత్త చట్టం కట్టబెట్టిందని తెలిపింది. గతంలో ఉన్న రక్షణలేవీ లేకుండా చేస్తోందని, అందువల్ల ఈ సవరణ చట్టం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. ⇒ ఇస్లామిక్ చట్టాలు, కట్టుబాట్లకు అనుగుణంగా వక్ఫ్ల నిర్వహణ ఉంటుందని, కానీ, సవరణలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంది. ముస్లిం సంస్థల్లో ముస్లింల ప్రాబల్యాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఈ సవరణలను కొట్టేయాలని వైఎస్సార్సీపీ అభ్యర్థించింది.⇒ వక్ఫ్ ఆస్తుల రక్షణ కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూ వస్తున్నాయంది. అందులో భాగంగానే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జరిగిందని తెలిపింది. తద్వారా వక్ఫ్ ఆస్తుల రక్షణకు ఆస్కారం లభించిందని తెలిపింది.⇒ కొత్త సవరణ చట్టం ముస్లిం ధార్మిక సంస్థలు, వక్ఫ్ల స్వతంత్రతలను సవాలు చేసేలా సవరణ చట్టం ఉందని స్పష్టం చేసింది. వక్ఫ్లతో ముడిపడి ఉన్న విద్యా, సాంస్కృతిక సంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని పిటిషన్లో తేల్చి చెప్పింది.⇒ వక్ఫ్ బోర్డు సభ్యుల కోసం ఎన్నికల స్థానంలో నామినేషన్ విధానాన్ని తేవడం ద్వారా ప్రజాస్వామ్య ఎన్నిక విధానాన్ని కాలరాసినట్లైందని తెలిపింది. ⇒ ఆస్తి యజమానికి తెలిసి.. ఆ ఆస్తిని సుదీర్ఘ కాలంగా ధార్మిక కార్యకలాపాలకు వాడుతుంటే ఆ ఆస్తి వక్ఫ్ది అవుతుందని–1995 చట్టంలో స్పష్టంగా ఉందని, దానికి తూట్లు పొడిచేలా సవరణలు ఉన్నాయంది. ఈ పరిస్థితుల్లో కొత్త సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు చెల్లనిదిగా కూడా ప్రకటించాలని సుప్రీంకోర్టును వైఎస్సార్సీపీ అభ్యర్థించింది. -
వేటకు విరామం
సాక్షి, అమరావతి: సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. రెండు నెలలపాటు ఒడ్డునే ఉండనున్నాయి. సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, తల్లి రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం, సముద్ర జలచరాలు, మత్స్య సంపద సుస్థిరతను సాధించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు 61రోజులపాటు వేట నిషేధం అమలు చేస్తున్నారు.ఈ సమయంలో మత్స్యకార కుటుంబాల జీవనానికి ప్రభుత్వాలు వేట నిషేధిత భృతిని అందిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లు సమయానికి భృతిని అందించడంతోపాటు పలు విధాలుగా ఆదుకుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గతేడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఐదేళ్లలో రూ.538 కోట్ల లబ్ధి రాష్ట్రంలో తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 1,027.58 కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 65 మండలాల పరిధిలోని 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో సముద్ర వేటపై ఆధారపడి 1.63 లక్షల మంది జీవిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీజిల్æ సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.రాష్ట్రవ్యాప్తంగా 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 29,156కు చేరింది. వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు విరామ సమయంలో రూ.4వేలు చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఐదేళ్లలో 5.38 లక్షల మందికి రూ.538.01కోట్ల భృతిని అందించింది. గత ఏడాది బకాయి కలిపి రూ.40వేలు ఇవ్వాలి తాము అధికారంలోకి రాగానే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు చొప్పున వేట నిషేధ భృతిని ఇస్తామంటూ ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఆ హామీని అటకెక్కించారు. 2024–25 సీజన్కు సంబంధించి గతేడాది మే నెలలోనే ఆర్బీకేల ద్వారా సర్వే నిర్వహించి వేటకు వెళ్లే 1.30 లక్షల మందిని అర్హులను గుర్తించారు. అయినా కూటమి ప్రభుత్వం భృతి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఏప్రిల్లోనే వేట నిషేధ భృతిని అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఎప్పుడిస్తారో తెలియదు. గతేడాది బకాయిలతో కలిపి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.40వేలు చొప్పున ఇవ్వాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గతేడాది వేట నిషేధభృతి ఇవ్వకపోవడం వల్ల మత్స్యకారులు వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వచ్చింది. గతేడాది చెల్లించాల్సిన బకాయిలతోపాటు ఈసారి వేట నిషేధ భృతిని కలిపి ప్రతి కుటుంబానికి రూ.40వేలు చొప్పున చెల్లించాల్సిందే. లేకుంటే ఉద్యమిస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకార సంఘాల సమాఖ్య -
నేల రాలిన రైతుల ఆశలు
మామిడి రైతుల ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. మొదట్లో నల్లతామర, మాంగో లూఫర్ వంటి పురుగుల దాడితో పూత మాడిపోయింది. ఆ తర్వాత తెగుళ్లు, చీడపీడలకు తోడు అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో పిందెలు పురుగుపట్టి రాలిపోయాయి. వాతావరణాన్ని తట్టుకుని నిలిచిన కొద్దిపాటి పిందెలు కాయ కడుతున్న వేళ విరుచుకుపడిన వర్షాలు, ఈదురు గాలులకు పూర్తిగా నేలరాలిపోయాయి. ఈదురు గాలులకు వడగండ్ల వానలు తోడవడంతో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మరోవైపు నాణ్యత లేదనే సాకుతో మార్కెట్లో ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. – సాక్షి, అమరావతి/నెట్వర్క్3 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటరాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది నల్లతామర, చీడపీడల ప్రభావానికి తొలుత 50 శాతానికి మించి దిగుబడులొచ్చే అవకాశాలు లేవని సీజన్ ప్రారంభంలోనే అంచనా వేశారు. ప్రస్తుతం 50 శాతం వచ్చే పరిస్థితి కూడా కని్పంచడం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఎకరాకు 2–3 టన్నుల మధ్య దిగుబడులొస్తాయని అంచనా వేయగా.. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశి్చమ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో టన్నున్నర రావడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు.ఈ నెల 7, 8 తేదీల్లోనూ, తిరిగి 13, 14 తేదీల్లోనూ వరుసగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో దాదాపు 3 లక్షల ఎకరాల్లో కాయలు నేల రాలినట్టు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఈ నష్టం ఎక్కువగా వాటిల్లినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనే 50వేల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేలరాలినట్టుగా అంచనా వేశారు.రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో మామిడి తోటలున్న ఈ జిల్లాలో దాదాపు 1.76 లక్షల టన్నుల కాయల దిగుబడులొస్తాయని అంచనా వేయగా.. చివరకు 50వేల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. కృష్ణా జిల్లాలో మరో 30–40 వేల ఎకరాల్లో మామిడి నేలరాలగా.. అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో మామిడి పంట ఈదురుగాలులకు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం 25–35 శాతం కూడా దిగుబడులొచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులే చెబుతున్నారు. ధరలూ అంతంతే మామిడి కాయల్లో నాణ్యత లేదనే కారణంతో ఈసారి ఆశించిన ధరలు కూడా లభించని పరిస్థితి నెలకొంది. నూజివీడు రసాలు టన్ను రూ.10 వేల నుంచి రూ.15వేల మధ్య పలుకుతుండగా.. బంగినపల్లి రూ.15 వేల నుంచి రూ.45 వేల మధ్య పలుకుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో పండే అల్పాన్స్ రకాలకు మాత్రమే నాణ్యతను బట్టి అత్యధికంగా రూ.95 వేల వరకు ధర లభిస్తోందని చెబుతున్నారు. రాయలసీమలో ఈ స్థాయి ధరలు పొందే రైతులు నూటికి 10 శాతం మంది కూడా ఉండరని చెబుతున్నారు.పంటల బీమాకు దూరంఈదురు గాలుల వల్ల లక్షలాది ఎకరాల్లో కాయలు నేలరాలినప్పటికీ నిబంధనల సాకుతో అధికారులు పంట నష్టాన్ని ప్రాథమికంగా కూడా గుర్తించడం లేదు. మరోవైపు రబీలో చివరి నిముషంలో పంటల బీమా వర్తింప చేసినా గడువు తక్కువగా ఉండటం, ప్రీమియం భారం అధికంగా ఉండటంతో రైతులెవరూ బీమా చేయించుకోలేకపోయారు. ఫలితంగా ఏ ఒక్కరికీ బీమా పరిహారం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.ఈదురు గాలులు దెబ్బతీశాయి ఈ ఏడాది పూత చాలా ఆలస్యంగా వచి్చంది. పూతను కాపాడుకోవడానికి నానాతంటాలు పడ్డాం. అప్పులు తెచ్చి 13 ఎకరాలకు మందులు పిచికారీ చేశాం. దిగుబడి పర్వాలేదనుకుంటున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. గడచిన రెండ్రోజుల్లో కురిసిన వర్షానికి 13 ఎకరాల్లో పిందె దశలో ఉన్న మామిడి చాలావరకు నేలరాలింది. మిగిలిన కొద్దిపాటి కాయలైనా చేతికొస్తాయో లేదో తెలియడం లేదు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలి. – నాయనిరెడ్డి, వెజ్జుపల్లి, చిత్తూరు జిల్లా చేతికందే దశలో పంట పోయింది నేను మూడెకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. సొంతంగా ఎకరం తోట ఉంది. సీజన్ ప్రారంభంలో తేనె మంచు, వాతావరణం అనుకూలించక కాపు తగ్గింది. పురుగు మందులకు ఎకరానికి రూ.45 వేలు ఖర్చు చేశాను. ఎండ తీవ్రతకు 20 శాతం పిందెలు, కాయలు రాలిపోయాయి. మామిడి కాయలు చేతికి వస్తాయనుకుంటున్న తరుణంలో అకాల వర్షం, ఈదురు గాలులకు పంట నష్టం వాటిల్లింది. సగం పంట రాలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. – గండి రమణ, రైతు, తుని, కాకినాడ జిల్లా -
‘సిట్’ లక్ష్యం... తప్పుడు సాక్ష్యం!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం... ప్రస్తుతం దొంగ సాక్ష్యాలను సృష్టించే పనిలో పడింది. అందుకోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను రంగంలోకి దించింది.సిట్ సోమవారం కార్యాచరణకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి నివాసం (హైదరాబాద్), ఇతర ప్రాంతాల్లో తనిఖీల పేరిట హడావుడి చేసింది. అసహనంతో రగిలిపోతున్న ప్రభుత్వ పెద్దలు రెడ్బుక్ కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులు పెట్టి నేతలను వేధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం పన్నిన విషయం తెలిసిందే. సీఐడీ కొన్ని నెలలపాటు దర్యాప్తు చేసినా ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. అసలు లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. దాంతో చంద్రబాబు ప్రభుత్వం సీఐడీని పక్కనపెట్టి... తమ వీరవిధేయ అధికారులను సిట్ పేరుతో రంగంలోకి దించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని సిట్ అధికారులు గతంలో పని చేసిన ప్రభుత్వ అధికారులు, బేవరేజస్ కంపెనీల ప్రతినిధులను వేధించారు. సిట్ వేధింపులను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇంత రాద్ధాంతం చేసినా ఈ కేసులో సిట్కు సైతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించకపోవడంతో ప్రభుత్వ పెద్దలు అసహనంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతను సంతృప్తి పరిచేందుకు సిట్ అధికారులు కొత్త కుట్రకు తెగించారు. తనిఖీల పేరిట అబద్ధపు సాక్ష్యాలు సృష్టించే కుతంత్రం...సిట్ అధికారులు తీవ్రస్థాయిలో వేధించి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థ ఉద్యోగి సత్యప్రసాద్ నుంచి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. కానీ, వాటిని బలపరిచే సాక్ష్యాలు ఏమీ లేకపోవడంతో కేసు దర్యాప్తు ముందుకు సాగదని గుర్తించారు. ఈ క్రమంలో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు సిట్ మరో ఎత్తుగడ వేసింది. ఇందులో భాగంగా పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించేందుకు పన్నాగం పన్నింది.దానిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి నివాసంతోపాటు పలు కార్యాలయాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. సిట్ అధికారులు తాము కోరుకుంటున్న సమాచారాన్ని ముందుగానే పెన్డ్రైవ్లు, సీడీలు, హార్డ్ డిస్్కలలో స్టోర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ పెన్డ్రైవ్లు, సీడీలు, హార్డ్ డిస్క్లను తమవెంట తీసుకువెళ్లి... తనిఖీలు నిర్వహించిన నివాసాలు, కార్యాలయాల్లో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించాలన్నది సిట్ పన్నాగం.తద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అక్రమ కేసులతో వేధించాలన్నది సీఐడీ కుతంత్రం. అందుకు తొలి అడుగుగానే సిట్ అధికారులు హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి నివాసంతోపాటు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇలాంటి కుట్రలు ఇంకా పెరుగుతాయని చెబుతున్నాయి. -
నేడు కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్లో కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులతో పాటు ప్రధానమంత్రి పర్యటన తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
డబ్బులెక్కడ సార్?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
ఎన్టీఆర్జిల్లా,సాక్షి: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)కు ఎన్టీఆర్ జిల్లా రైతులు షాకిచ్చారు.జిల్లాలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోళ్లని పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చారు. మంత్రి రాకపై సమాచారం అందుకున్న రైతులు మార్కెట్ యార్డ్కు చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి మనోహర్ని నిలదీశారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులైనా డబ్బులు పడలేదని ప్రశ్నించారు. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. రూ.25 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా
ఒంగోలు,సాక్షి: ఒంగోలులో కూటమి నేతల బరితెగించారు. కేశవరాజు కుంటలో రూ.25 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.కేశవరాజు కుంటలో సుమారు 5 ఎకరాల 60 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంపై కూటమి నేతల కన్నుపడింది. అంతే రూ.25కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేశారు. ప్లాట్లుగా వేసి అమ్మేందుకు సిద్ధమయ్యారు. స్థలం చుట్టూ ఫెన్సింగ్ పోల్స్ కూడా ఏర్పాటు చేశారు.కూటమి నేతల భూకబ్జాపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్ ఆందోళన చేశారు. టీడీపీ కబ్జాకి గురైన స్థలంలో నిరసన తెలిపారు. తక్షణమే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని కంచె తీసేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలులో కూటమి నేతల భూకబ్జాలపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. -
‘వక్ఫ్’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్
తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఓటు వేసిన విషయం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్లో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. గతంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టడంతో లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్సార్సీపీ పేర్కొంది.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. YSRCP has filed a petition in the Supreme Court challenging the Waqf Bill, citing serious constitutional violations and failure to address the concerns of the Muslim community.The Bill violates Articles 13, 14, 25, and 26 of the Constitution—provisions that guarantee…— YSR Congress Party (@YSRCParty) April 14, 2025 -
‘నిందితుడితో మాజీ ఐపీఎస్ భేటీపై అనుమానాలు’
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ చేస్తున్న కుట్రలు మరోసారి బయటపడ్డాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఒక పథకం ప్రకారం వైఎస్ జగన్కు హాని తలపెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో వైఎస్ జగన్పై హత్యాయత్నంకు పాల్పడిన నిందితుడితో గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా భేటీ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి ఉనికిని లేకుండా చేయడానికే ఏబీవీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే... ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం విద్వేషపూరిత రాజకీయాలకు తెరలేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ని అంతం చేయాలన్న కుట్రకు టీడీపీ పథక రచన చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్టులో 2018 అక్టోబర్ 25న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యాయత్నంకు పాల్పడిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈ ఘటనను అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అవహేళన చేస్తూ మాట్లాడటమే కాకుండా కేసును నీరుగార్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ను హత్యాయత్నం జరిగిన సమయంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు తాజాగా వెళ్లి పరామర్శించడం చూస్తుంటే గతంలో మిస్ చేసుకున్న అవకాశాన్ని ఈసారి పక్కాగా అమలు చేయాలన్న కుట్ర కనిపిస్తోంది. ఏబీవీ ఆలోచనపై అనుమానాలు ఉన్నాయి. మా అనుమానాలకు బలం చేకూర్చేలా జగన్ పర్యటనల్లో కూటమి సర్కార్ భద్రతను తగ్గించేసింది. గుంటూరు, అనంతపురం పర్యటనల్లో మాజీ ముఖ్యమంత్రికి కనీస భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిచింది.జగన్పై హత్యాయత్నం కేసు నిర్వీర్యంకు ఏబీ యత్నంజగన్ను అంతం చేయాలనే కుట్రతోనే ఎయిర్పోర్ట్లో మెడ మీద పదునైన కత్తితో శ్రీనివాస్ దాడి చేశాడని, దీనికోసం పక్కాగా ముందస్తు వ్యూహం ఉందని జగన్ పై హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రణాళిక రూపొందించుకుని తాజాగా ఏబీవీ నిందితుడిని వెళ్లి కలిశాడు. జగన్పై తనకున్న వ్యక్తిగత ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాడు. గతంలో ఏబీవీ ఇంటిలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసి వైఎస్సార్సీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి మా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమానికి పాల్పడిన కారణంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వని అంశాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు పథకం ప్రకారం విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. కులాల సమావేశాలు ఏర్పాటు చేసుకుని జగన్పై తనకున్న కోపాన్ని ప్రదర్శించడంతోపాటు ప్రతిపక్ష నేత గురించి తప్పుడు ప్రచారం చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. యువతలో చెడు ఆలోచనలకు బీజం వేస్తున్నాడు. హింసను ప్రోత్సహించడమే వారి విధానంజగన్పై ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కేసుపై మాకు మొదటి నుంచీ అనేక అనుమానాలున్నాయి. నిందితుడు శ్రీనివాస్ పై గతంలోనే అనేక కేసులున్నాయి. అలాంటి వ్యక్తి ఎయిర్పోర్ట్ క్యాంటీన్లో ఎలా చేరాడు? ఈ క్యాంటీన్ ను టీడీపీ నాయకుడు హర్షవర్ధన్ చౌదరికి ఎవరు ఇప్పించారు? వైఎస్ జగన్ ఉన్న వీఐపీ లాంజ్లోకి ఈ శ్రీనివాస్ ప్రవేశించి అతి దగ్గర నుంచి దాడి చేయడం వెనుక ఎవరు ప్రోత్సాహం ఉంది? వంటి అనేక అనుమానాలను మేం వ్యక్తం చేసినా నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా చంపేశారు. ఆయన్ను ఏ విధంగా దారుణంగా చంపామన్నది నిందితులే పోలీసుల ముందు అంగీకరించారు. చంపిన తర్వాత కూడా ఆయుధాలను ఏం చేశామన్నది కూడా వివరంగా పోలీసులకు చెప్పారు. నిందితులను అప్రూవర్గా మార్పించి బెయిల్ ఇప్పించి స్వేచ్ఛగా బయట తిప్పుతున్నారు. వివేకా హత్యలో ఏదో జరిగిందని ప్రజలను డైవర్ట్ చేసేందుకు రోజుకో తప్పుడు కథనం ప్రచారంలోకి తెస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకుని తమకు గిట్టని వారి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు.అసమర్థ పాలన ఎవరిది బాబూ?చంద్రబాబుకి పాలన చేతకావడం లేదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక చేతులెత్తేశాడు. ఓటేయించుకుని తమను వంచించాడని ఏడాది కూడా కాకుండానే ప్రజలకు కూడా అర్థమైపోయింది. దీన్ని భరించలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. పదే పదే విధ్వంస పాలన అంటూ గత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, ఫీజురీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేదలకు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్ పాలన కన్నా గొప్పగా చంద్రబాబు ఏం చేశారు. ఆఖరుకి గడిచిన ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ విద్యావ్యవస్థలో వినూత్న ఆలోచనలతో సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు పది నెలల్లోనే నిర్వీర్యం చేశాడు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను తీర్చిదిద్దితే నేడు కనీనం చిన్నారులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కూడా అందని దుస్థితికి విద్యావ్యవస్థను దిగజార్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. సంపద సృష్టించేలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారు. నాడు-నేడు ద్వారా రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే చంద్రబాబు వాటిని ప్రైవేటుకు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా లేదు. మద్దతు ధర లేదు. చంద్రబాబు ఇస్తానని చెప్పన అన్నదాత సుఖీభవ హామీని ఇప్పటికీ అమలు చేయలేదు. అప్పులపై అబద్ధాలు చెప్పి తప్పుడు ప్రచారం చేసి జగన్ పై బుదరజల్లారు. రాష్ట్రంలో నింయంత పాలన నడుస్తోందిరాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులను చూస్తే నియంత పాలన నడుస్తోందని అర్థమవుతోంది. తమకు నచ్చని వారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఎలా చంపాలన్న ఆలోచన చేయడానికి మాజీ పోలీస్ అధికారి అయిన ఏబీవీని నియమించుకున్నారు. సుదీర్ఘ కాలంపాటు సివిల్స్ సర్వీస్లో పనిచేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం సమంజసమేనా అని ఆలోచించుకోవాలి. ప్రజలకు మంచి చేసి పేరు సంపాదించుకోవాలనే ఆలోచన చేయకుండా తప్పుడు ఆలోచనలతో ప్రశ్నించే గొంతులను నొక్కాలనుకోవడం అవివేకం. ఏబీ వెంకటేశ్వరరావుకి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానుకోవాలి. తనకు ఏదైనా అన్యాయం జరిగిందని భావించి ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. వైఎస్ జగన్ పైన వ్యక్తిగత ద్వేషాన్ని పెంచుకోవడం సరికాదు. తనకు ఏదైనా అనుమానాలుంటే వాటిని నివృత్తి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నా. బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా’ అని శ్రీకాంత్రెడ్డి సవాల్ విసిరారు. -
‘జ్వలియన్’ వాలాబాగ్
జలియన్వాలా బాగ్ పేరు చెబితే.. రౌలట్ చట్టం.. నిరసన తెలుపుతూ ప్రజా సమూహం సమావేశం.. బ్రిటిష్ సైన్యాధికారి హ్యారీ డయ్యర్ కాల్పులు.. వందల మంది దుర్మణం.. చరిత్రలో కనిపించేది ఇదే. ఏళ్ల తరబడి చదువుకున్నదీ ఇదే! కానీ, చరిత్ర వెనుక చెరగని గుర్తులు అమృత్సర్లోని ఆ తోటను ఆనుకుని ఉన్న గోడలపై నాటి ఘటనను గుర్తు చేస్తూనే ఉన్నాయి. స్వేచ్ఛా, స్వాతం్రత్యాల కోసం పంజాబ్ ప్రజలు 106 ఏళ్ల క్రితం చేసిన ప్రాణ త్యాగాలను నేటి తరానికి వివరిస్తున్నాయి. ఇటుక గోడల్లో దిగిన తూటాల గుర్తులు, 120 మంది ప్రాణాలు బలితీసుకున్న బావి.. సందర్శకుల హృదయాలను బరువెక్కిస్తుంటాయి. – సాక్షి అమరావతిఘటనకు ముందు చరిత్ర ఇదీ.. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులుగా పనిచేసేవారికి అనేక అవకాశాలు కల్పిస్తామని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఆశ చూపడంతో పంజాబ్ నుంచి 3.55 లక్షల మంది బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరారు. యుద్ధం ముగిశాక ప్రభుత్వం సైనికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వారిని సైన్యం నుంచి వెనక్కి పంపేసింది. దీంతో వారంతా పంజాబ్ చేరుకున్నాక నిరుద్యోగం వెంటాడింది. మరోవైపు కొన్నేళ్లుగా పంజాబ్ ప్రాంతం కరువుతో కొట్టుమిట్టాడుతోంది. మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా 1915లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకొచ్చింది.దీని ప్రకారం ప్రజలపై నిరవధిక నిర్బంధం, విచారణ లేకుండా జైలుకు పంపడం వంటి కఠిన చర్యలను అనుసరించింది. యుద్ధం ముగిసినా ఈ చట్టాన్ని రద్దు చేయకుండా ఉద్యమకారులపై ప్రయోగించేందుకు అనువుగా మార్చుకుంది. ఇందుకోసం సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షతన 1917లో కమిటీ నియమించింది. దాని సిఫార్స్ల ఆధారంగా 1919 మార్చి 18న రౌలట్ చట్టాన్ని ఆమోదించింది.రౌలట్ చట్టం ప్రకారం ఏప్రిల్ 10న పంజాబ్కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ను అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర భారతదేశాన్ని కుదిపేసింది. ఇదే తేదీన ఇంగ్లండ్ చర్చి మిషనరీకి చెందిన మిస్ మార్షెల్లా షేర్వుడ్పై అమృత్సర్లో దాడి జరిగింది. అనంతరం బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ నివాసంపై దాడి చేసేందుకు నిరసనకారులు యత్నిస్తూన్నారని చెప్పి అమృత్సర్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై 25 మంది నిరాయుధులైన భారతీయులను సైన్యం కాల్చి చంపేసింది. దీంతో అవిభక్త పంజాబ్ మొత్తం ప్రజలు రగిలిపోయారు. 1919 ఏప్రిల్13న ఏం జరిగింది? బైశాఖి వేడుకలను పంజాబ్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అమృత్సర్లో ఏప్రిల్ 13న జరిగే వేడుక చూసేందుకు చుట్టపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మరోవైపు డాక్టర్ సైపుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ అరెస్టులకు నిరసనగా అమృత్సర్లోని జలియన్వాలాబాగ్లో జాతీయవాదులు సాయంత్రం 5 గంటలకు శాంతియుత సమావేశం ఏర్పాటు చేశారు. పంజాబ్కు చెందిన ప్రముఖ న్యాయవాది లాలా కన్హియాలాల్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు కీలక ప్రసంగం ఉందని చెప్పడంతో చిన్నా, పెద్దా అంతా వేలాదిగా తరలివచ్చారు. అదే క్రమంలో రాత్రి 8 గంటల నుంచి మార్షల్ లా అమలులో ఉంటుందని చెప్పుకున్నారు కానీ దీనిపై బ్రిటిష్ ప్రభుత్వం ప్రచారం చేయలేదు. కాల్పుల్లో 2 వేల మంది దుర్మరణం! అమృత్సర్లోని స్వర్ణదేవాలయానికి అత్యంత సమీపంలో 6.50 ఎకరాల్లో జలియన్వాలా బాగ్ ఉంది. మహరాజా రంజిత్సింగ్ కోటలో న్యాయవాదిగా పనిచేసి మరణించిన ‘హిమ్మత్సింగ్ జలియన్వాలా’ పార్థివదేహాన్ని ఇక్కడ సమాధి చేశారు. ఆయన పేరుతోనే ఈ ప్రాంతానికి జలియన్వాలా బాగ్గా పేరొచ్చింది. చుట్టూ ఎత్తయిన భవనాల మధ్య ఉత్తరం వైపున 3 నుంచి 4 అడుగుల వెడల్పు మార్గం మాత్రమే ఉంది. బాగ్లో తూర్పు వైపున నుయ్యి, ఆపై కొద్దిగా చెట్లు ఉన్నాయి.సమావేశంపై ప్రచారంతో బైశాఖి వేడుకకు వచ్చిన వారు సైతం ఇందులో పాల్గొనడంతో జనం దాదాపు 20 వేల వరకు హాజరైనట్టు అంచనా. సరిగ్గా సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్ మెషిన్ గన్ అమర్చిన వాహనాలతో 50 మంది సైనిక బగంతో అక్కడకు చేరుకున్నాడు. వస్తూనే బాగ్లోకి వెళ్లే మార్గాన్ని మూసివేసి కాల్పులకు ఆదేశాలిచ్చాడు. కేవలం 10 నుంచి 12 నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతం తుపాకుల మోతతో నిండిపోయింది.ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు పిట్టల్లా రాలిపోయారు. తప్పించుకునే మార్గం లేదు.. పదుల సంఖ్యలో తూటాలు శరీరాలను చీల్చుకుంటూ భవనాల గోడల్లో దిగబడ్డాయి. ఆందోళనతో ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు ప్రాంగణంలోని బావిలోకి దూకేశారు. ఆ రాత్రంతా జలియన్వాలాబాగ్ పరిసరాలు ఆర్తనాదాలతో నిండిపోయాయి. ఈ కాల్పుల్లో దాదాపు 2 వేల మంది మరణించినట్లు స్థానికులు చెబుతారు. డయ్యర్ ముందుగానే కర్ఫ్యూ విధించడంతో గాయపడ్డవారిని తరలించే ఆస్కారం లేకపోయింది. లెక్కలోకి రాని మరణాలెన్నో..తమవారిఆచూకీ కోసం వెదికిన కుటుంబ సభ్యులకు మృతదేహాలను వెదికేందుకు రెండు మూడురోజులు పట్టిందని ఇక్కడి వారు చెబుతుంటారు. బ్రిటిష్ ప్రభుత్వం దుర్ఘటనపై హంటర్ కమిషన్ వేయగా 200 మంది చనిపోయినట్టు నివేదికిచ్చింది. సేవా సమితి సొసైటీ 379 మంది మరణించారని, 192 మంది తీవ్రంగా గాయపడ్డారని నివేదించింది. కానీ స్థానికులు మాత్రం 2 వేల మంది చనిపోయారని చెబుతుంటారు.చనిపోయిన 41 మంది బాలల్లో 7 నెలల వయసు వారు, ఆరువారాల శిశువు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మారణకాండ జరిగిన మూడు నెలలకు అంటే జూలైలో ఎవరు చనిపోయారో గుర్తించేందుకు అధికారులు నగర ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, నాటి ఘనటలో పాల్గొన్న వారిని గుర్తిస్తే చనిపోయినవారి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తారన్న భయంతో ఎవరూ వాస్తవాలు చెప్పలేదు. దాంతో ఎంత మంది చనిపోయారో అధికారికంగా లెక్కలు లేవు. దుర్మాగానికి నిలువుటద్దం డయ్యర్ సైనికాధికారి రెజినాల్డ్ ఎడ్వర్డ్ హారీ డయ్యర్.. దుర్ఘటన అనంతరం ప్రభుత్వం చేసిన విచారణలో అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా, ఎలాంటి అపరాదభావం లేకుండా ఇచ్చిన సమాధానాలు అతడిలోని రాక్షసత్వానికి అద్దం పడతాయి. ప్రశ్న: ‘‘నువ్వు బాగ్ లోకి వెళ్ళగానే, ఏం చేశావు?’’ డయ్యర్:– నేను కాల్పులు జరిపాను. ప్రశ్న:– ‘‘వెంటనే?’’ డయ్యర్:– వెంటనే. నేను ఆ విషయం గురించి ఆలోచించాను, నా విధి ఏంటో నిర్ణయించుకోవడానికి నాకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి కాల్పులు జరపలేదు. బదులుగా, పార్కులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపైకి విచక్షణా రహితంగా కాల్చి చంపారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని సైనికులను డయ్యర్ ఆదేశించాడు. తెచ్చిన మందుగుండు సామగ్రి అయిపోయే వరకు సైనికులు కాల్పులు ఆపలేదు. రెజినాల్డ్ డయ్యర్ కూడా తాను మిషన్ గన్లు అమర్చిన కార్లను బాగ్ లోకి తీసుకురాగలిగితే, వాటితో కూడా కాల్పులు జరిపేవాడినని ఒప్పుకున్నాడు. కాగా ఈ మారణకాండలో మరణించినవారి ప్రాణాలకు 5 వేల పౌండ్ల చొప్పున వెలకట్టింది. అయితే చాలామంది ఈ మొత్తాన్ని తీసుకోలేదు. ‘‘మా తాతగారు గోబింద్ రామ్ సేథ్ సమావేశానికి హాజరై ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిలో స్థానికులతో పాటు బైశాఖి వేడుకకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నట్టు మా నాన్న, పూర్వీకులు చెప్పారు. చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చిన 5 వేల పౌండ్లకు పంజాబీలు ఆశపడలేదు’’ అని చెప్పారు జలియన్వాలా బాగ్ ప్రభుత్వ గైడ్గా ఉన్న దీపక్ సేథ్. ఇక్కడికి నిత్యం వచ్చే వారికి నాటి ఘటనను వివరిస్తూ చైతన్యులను చేస్తారీయన. తర్వాత పార్కులో ప్రభుత్వం ప్రజల ఆత్మార్పణకు చిహ్నంగా స్మారకాన్ని నిర్మించింది. 120 మంది మరణించిన బావిని అద్దాలతో మూసివేసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనగా నమోదైన జలియన్వాలా బాగ్లో తూటాలు దిగిన గోడలను 106 ఏళ్లుగా అలాగే కాపాడుతున్నారు. -
అప్రాధాన్య పోస్టులకు వెయిటింగ్ ఐఏఎస్లు
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచిన పలువురు ఐఏఎస్ అధికారులపై రెడ్బుక్ చాప్టర్లో మరో కుట్ర అమలైంది! పోస్టింగ్లు ఇవ్వకుండా దాదాపు 11 నెలల పాటు వెయిటింగ్లో ఉంచిన ఆ ఉన్నతాధికారులను తాజాగా అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వు జారీ చేశారు.మరోవైపు ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్ధ పూర్తి అదనపు బాధ్యతలను కె.భాస్కర్కు, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ పూర్తి అదనపు బాధ్యతలను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి అప్పగించారు. కాగా అవసరం తీరిపోవడంతో సీనియర్ ఐఏఎస్ సిసోడియాపై బదిలీ వేటు పడింది. ప్రాధాన్యత లేని చేనేత, జౌళి శాఖ ప్రత్యేక సీఎస్గా ఆయన్ను బదిలీ చేయడంతోపాటు ఇతర బాధ్యతల నుంచి కూడా తప్పించారు. -
నిద్ర లేమి ఫోన్ చలవే
సాక్షి, అమరావతి: వ్యసనంగా మారిన సెల్ఫోన్ స్క్రీనింగ్ నిద్రలేమికి కారణమవుతోంది. రాత్రివేళ సెల్ఫోన్లో ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్లు, సినిమాలు చూడటం నిద్రా సమయాన్ని మింగేస్తున్నాయి. ఓ ఐదు నిమిషాలు సెల్ఫోన్తో కాలక్షేపం చేద్దామని మొదలుపెట్టి అరగంట.. గంట.. రెండు గంటలవుతున్నా నిద్రపట్టదు. ఈ సమస్య ప్రస్తుతం ఎందరినో వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నిద్ర సమయంలో సెల్ఫోన్ వినియోగమేనని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఇటీవల నార్వే శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు. నిద్ర సమయంలో గంటసేపు స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి ప్రమాదం 59 శాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గంటసేపు స్క్రీన్ చూస్తూ గడపటం వల్ల నిద్ర సమయం సైతం 24 నిమిషాలు తగ్గుతోందని గమనించారు.బ్లూ రేస్తో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావంమొబైల్, ల్యాప్ట్యాప్స్, ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూ రేస్ నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు. అలా స్క్రీన్ చూస్తూ ఉండటంతో హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమై మేల్కోనే సమయం పెరిగి నిద్రలేమి సమస్యలకు దారితీస్తున్నట్టు వివరించారు. నిద్రకు ఉపక్రమించడానికి ముందు 30 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాలను చూసే వయోజనులు నిద్రలో కలత, అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటారని, గతంలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది ఆరోగ్యంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందన్నారు. బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు దీర్ఘకాలంలో తలెత్తుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.45 వేల మందిపై అధ్యయనంనిద్రలేమి సమస్యపై అధ్యయనంలో భాగంగా నార్వే శాస్త్రవేత్తలు 45వేల మంది విద్యార్థులపై పరిశోధన చేపట్టారు. వీరి వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంది. వీరిని మూడు విభాగాలుగా విభజించి అధ్యయనం చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూస్తుండటంతో నిద్రపోయే సమయం తగ్గడం, పేలవమైన నిద్ర వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా స్క్రీన్ వాడకం నిద్ర అంతరాయంలో కీలక కారకమని సూచించారు. -
ఫీజు చెల్లిస్తేనే.. పై తరగతికి
సాక్షి, అమరావతి: ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం–2009 కింద ప్రైవేటు స్కూళ్లలో చేరిన పేద విద్యార్థులను పై తరగతులకు పంపేందుకు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. తాము నిర్ణయించిన ఫీజు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్లు కొనసాగిస్తామని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక జిల్లా విద్యా శాఖ అధికారులను ఆశ్రయిస్తే ‘సెటిల్ చేసుకోవాలి’ అంటూ సలహా ఇస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను ఆర్టీఈ చట్టం కింద పేద పిల్లలకు కేటాయించారు. విద్యాశాఖ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా గత మూడు విద్యా సంవత్సరాల్లో 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. వీరిలో చాలా మంది నిరుపేదలు కావడంతో ఫీజులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. ఫీజులపై ఏడాది క్రితమే హైకోర్టు ఇచ్చిన తీర్పును యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు తల్లిదండ్రులపై భారం పెరిగిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుపేదల చదువు కోసం అమలు చేసిన ఆర్టీఈ చట్టం ప్రవేశాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మొత్తం ఫీజు కోసం యాజమాన్యాల ఒత్తిడి ఆర్టీఈ చట్టం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం జీవో నంబర్ 24 ప్రకారం ఫీజులను ఖరారు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, పట్టణ ప్రాంతాల్లో రూ.8,500 స్కూలు ఫీజుగా నిర్ణయించి 2022లో ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకం తీసుకున్న తల్లిదండ్రులు ఈ ఫీజు మొత్తాన్ని చెల్లించాలని, మిగిలిన వారికి ప్రభుత్వమే ఆయా స్కూళ్లకు చెల్లించేలా నిబంధన విధించింది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తక్కువగా ఉందని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై వాదనలు ముగిసే నాటికి రెండు విద్యా సంవత్సరాలు పూర్తయి మూడో ఏడాది ప్రారంభమైంది. అనంతరం జీవో నంబర్ 24లో ఉన్న ఫీజులు సరిగా లేవని, కొత్తగా ఫీజులు ఖరారు చేయాలని హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. దీంతో స్కూళ్ల యాజమాన్యాలు కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని పిల్లల తల్లిదండ్రులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచాయి. ఆయా స్కూళ్లు నిర్ణయించిన వార్షిక ఫీజు మొత్తం (స్కూలును బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేలు) చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అమ్మఒడి తీసుకున్న వారు స్కూళ్లకు నిర్ణీత మొత్తం ఫీజుగా చెల్లించారు. ఈ విద్యా సంవత్సరం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇవ్వక పోవడంతో తల్లిదండ్రులకు ఫీజుల భారం మరింత పెరిగిపోయింది.ఫీజు అంచనాపై తీరిగ్గా ఇప్పుడు కమిటీ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం–2009 (ఆర్టీఈ) కింద ఏటా పేద పిల్లలకు అందిస్తున్న ఉచిత విద్యలో భాగంగా ఇటీవల ఫీజులు నిర్ణయించేందుకు పాఠశాల విద్య కార్యదర్శి చైర్మన్గా సమగ్ర శిక్ష ఎస్పీడీ కనీ్వనర్గా మరో తొమ్మిది మంది అధికారులతో ప్రభుత్వం కమిటీ నియమించింది. జీవో నంబర్ 24పై హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కమిటీ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ కమిటీని ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికంటే ముందే ప్రభుత్వం నియమిస్తుంది. మూడు నెలల్లో నివేదికను ఇస్తుంది. డిసెంబర్లో సమావేశమై విద్యార్థుల ఫీజులను నిర్ణయిస్తుంది. అయితే 2025–26 విద్యా సంవత్సరానికి రెండు వారాల క్రితం కమిటీ వేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కమిటీని త్వరగా వేసి ఉంటే ఇంత ఒత్తిడి ఉండేది కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రాజ్యాంగ నిర్మాతపై క్షుద్ర రాజకీయం!
సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్పైనా చందబ్రాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సామాజిక, న్యాయ మహాశిల్పంపై స్వార్థ రాజకీయం విషం చిమ్ముతోంది. ఆ మహనీయుడి స్ఫూర్తిని భావితరాలకు అందకుండా.. బడుగు, బలహీనవర్గాలు సమున్నతంగా తలెత్తకుండా చేసే కుట్ర చేస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహోన్నత లక్ష్యంతో 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో నెలకొల్పిన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణాన్ని పబ్లిక్ –ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లను కూడా పిలవనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తాజాగా ప్రకటించారు. ప్రపంచంలోనే మహోన్నత నేత విగ్రహ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టాల్సి ఉండగా ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించుకోవడం ద్వారా తన ఉద్దేశమేంటో చంద్రబాబు ప్రభుత్వం తేటతెల్లం చేసింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో వైభవంగా వెలుగొందిన అంబేడ్కర్ సామాజిక, న్యాయశిల్పంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అధికారంలోకొచ్చింది మొదలు అడుగడుగునా నిర్లక్ష్యం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు సామాజిక, న్యాయ మహాశిల్పంపై అడుగడుగునా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి ముఖ్య సందర్భాల్లో అంబేడ్కర్ విగ్రహానికి కనీసం విద్యుత్ లైట్లు కూడా లేకుండా చేసింది. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని డ్వాక్రా స్టాల్స్, ఇతర కార్యకలాపాలకు కేటాయించే ప్రయత్నం చేస్తోంది. తొలుత సందర్శకులను నిరుత్సాహపరిచి అటువైపు వెళ్లే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేలా కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. పారిశుధ్య నిర్వహణను సైతం గాలికొదిలేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా సామాజిక, న్యాయ మహాశిల్పం ప్రాంతం భాసిల్లింది. అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య చర్యలతో పదుల సంఖ్యలో కూడా సందర్శకులు రాని దుస్థితి నెలకొంది. ఇప్పుడు అంబేడ్కర్ విగ్రహానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేసే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే విగ్రహానికి సమీపంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ రెస్టారెంట్ ఇతర నిర్మాణ పనులను నిలిపేసింది. అలాగే అంబేడ్కర్ విగ్రహానికి వెనుక వైపున గత ప్రభుత్వం చేపట్టిన భారీ కన్వెన్షన్ హాల్ (ఒకేసారి 2,000 మంది కూర్చునేలా) నిర్మాణాన్ని ఆపేసింది. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో స్థలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు నిర్వహణకే కట్టబెడుతుండటంపై ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.