అధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్‌లు | - | Sakshi
Sakshi News home page

అధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్‌లు

Apr 4 2025 12:18 AM | Updated on Apr 4 2025 12:18 AM

అధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్‌లు

అధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్‌లు

భద్రాచలంటౌన్‌: నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్స్‌ను నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ వెల్లడించారు. భద్రాచలం తాత గుడి సెంటర్‌లోని గ్రంథాలయాన్ని గురువారం సాయంత్రం సందర్శించిన ఆయన రీడింగ్‌ రూమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. గ్రంథాలయంలో నిరుద్యోగులకు కావాల్సిన పుస్తకాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు తమకు తెలిసిందన్నారు. దీంతో వంద మంది ఒకేసారి చదువుకునేలా హాల్‌ నిర్మిస్తున్నామని, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పించడమే కాక టేబుళ్లు, కుర్చీలు సమకూరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్‌, డి.హరీష్‌, టీఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

‘యువ వికాసం’ను సద్వినియోగం

చేసుకోవాలి

గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకో వాలని పీఓ రాహుల్‌ సూచించారు. గిరిజన నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయాల్లో ఈనెల 14వ తేదీ లోపు సమర్పించాలని తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement