
బాలికలకు స్వీయ రక్షణ అవసరం
ఏటూరునాగారం: బాలికలకు స్వీయ రక్షణ ఎంతో అవసరమని కరాటే మాస్టర్ అబ్బు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల జూనియర్ కళాశాల రెసిడెన్షియల్లో అడ్వాన్స్ కరాటే సమ్మర్ క్యాంపు ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, జిల్లా కరాటే అధ్యక్షుడు సూర్య సహకారంతో ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకతాయిలు బాలికల వెంటపడితే ఎలా రక్షించుకోవాలని ముఖ్యంగా నేర్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ 30వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్యాంపునకు హాజరైన 75మంది బాలబాలికలకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, కరాటే మాస్టర్లు హుస్సేన్, అమీర్, బాలకృష్ణ, ఇరుప రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కరాటే మాస్టర్ అబ్బు
నాలుగు రోజుల పాటు సమ్మర్ క్యాంపు

బాలికలకు స్వీయ రక్షణ అవసరం