breaking news
Mulugu District Latest News
-
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కాటారం: మండలకేంద్రంలోని కేజీబీవీకి చెందిన నాగేశ్వరి సబ్ జూనియర్ కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 18న జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో నాగేశ్వరి ప్రతిభ కనబర్చడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కేజీబీవీ ప్రత్యేకాధికారి చల్ల సునీత తెలిపారు. ఈ నెల 25నుంచి 28వరకు నిజామాబాద్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఎస్ఓ పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. లాన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏరియా స్థాయి లాల్ టెన్నస్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా సర్వే అధికారి శైలేంద్రకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు కేవలం ఆనందానికి మాత్రమే కాదని ఆరోగ్యానికి, శారీరక ధృడత్వానికి ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మారుతి, శ్రావణ్కుమార్, శ్రీనివాస్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య, కెప్టెన్లు మల్లేష్, శ్రీరాములు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): హైదరాబాద్లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 30 మంది విదేశీయులు శిక్షణలో భాగంగా శనివారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఇరాక్, పాలస్తీనా, అర్మేనియా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, ఈజిప్ట్, దక్షిణ సూడాన్, జిబౌటి, ఉగాండా, టాంజానియా, కెన్యా, కోట్ డివోయిర్, గాంబియా, లైబీరియా, ఘనా, మొజాంబిక్, జాంబియా, నమీబియా, మారిషస్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, సురినామ్ దేశాలకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు, అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్ అంటూ కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి బోటింగ్ చేశారు. -
ప్రజాస్వామ్య విలువలు తెలిపేందుకు ఎన్నికలు
వెంకటాపురం(ఎం): పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య విలువలు విద్యార్థులకు తెలుస్తాయని వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం రాధిక తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం రాధిక మాట్లాడుతూ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యేందుకు పోటీలో ఉన్న విద్యార్థులతో నామినేషన్ల నుంచి ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల నియమావళిని పాటించినట్లు వివరించారు. ఎన్నికల్లో స్టూడెంట్ కౌన్సిల్ లీడర్లుగా బాలుర నుంచి సృజన్ 42 ఓట్లతో, బాలికల నుంచి వర్షిణి 26 ఓట్లతో విజయం సాధించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. పదవి అనేది హక్కుగా కాకుండా బాధ్యత, సేవతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్లో భావిభారత పౌరులుగా, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎండీ. ఫరీనా బేగం, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, కిరణ్ కుమార్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో రద్దీ
జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్ల్లో శనివారం రద్దీ కనిపించింది. పండుగ కావడంతో బస్సులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు బస్టాండ్లో పడిగాపులు పడ్డారు. హాస్టళ్లు, వసతి గృహాల నుంచి విద్యార్థులు ఇంటిదారి పట్టారు. పూల దుకాణాల వద్ద పూలు కొనుగోలు చేసేందుకు ఆడపడుచులు ఆసక్తి చూపారు. అంతేకాకుండా తంగేడు, టేకు, గునుగు పూల కోసం ఆడపడుచులు ఆడవి బాట పట్టి సేకరించడంలో నిమగ్నం అయ్యారు. ఏటూరునాగారం బస్టాండ్లో ప్రయాణికులుబస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు -
రహదారులు ఇలా.. వెళ్లేదెలా?
● ఎన్హెచ్ 163పై అడుగడుగునా గుంతలు ● ఇసుక లారీల టైర్ల అచ్చులు ● ప్రమాదాల బారిన పడుతున్నా.. పట్టించుకోని అధికారులుగోవిందరావుపేట/ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలోని జాతీయ రహదారి అధ్వానంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుక లారీల రాకపోకలతో టైర్ల అచ్చులు పడడంతో పాటు 163 జాతీయ రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు ఇలా ఉంటే వెళ్లేదెలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రయాణికులు పలువురు ప్రమాదాల బారిన పడినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 20 కిలో మీటర్లు గుంతలు గోవిందరావుపేట మండల పరిధిలోని పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, ఎస్ఎస్ తాడ్వాయి రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. గోవిందరావుపేట మండలంలోని మచ్చాపూర్ గ్రామం నుంచి పస్రా చివరి వరకు సుమారు 20 కిలోమీటర్ల మార్గం పూర్తిగా గుంతలు, లారీ టైర్ల అచ్చులతో ప్రమాదభరితంగా మారింది. వర్షాలు పడితే ఈ గుంతలు చిన్నచిన్న చెరువుల్లా మారిపోతున్న పరిస్థితి. నీళ్లు ఉన్న సమయంలో గుంతలను గుర్తు పట్టలేక వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా.. రోడ్ల ధ్వంసంతో మేడారం దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. నార్లాపూర్ నుంచి బయ్యక్కపేట దారిలో రోడ్లు ఽధ్వంసమై గుంతలను తలపిస్తున్నాయి. భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా ప్రైవేటు వాహనాల్లో ఆది, బుధ, గురు, శుక్రవారాల్లో మేడారానికి భక్తులు ఈ రోడ్డు మార్గన వస్తుంటారు. బీటీ రోడ్లు భారీగా దెబతిన్నడంతో రాత్రి వేళలో మేడారానికి వచ్చే వాహనాదారులు అదమరిచి గుంతల్లో పడితే ప్రమాదాల భారీన పడే అవకాశం ఉంది. బయ్యక్కపేట నుంచి గోవిందరావుపేట మండలంలోని పస్రా, నార్లాపూర్కు పనుల నిమిత్తం ద్విచక్ర వాహనాలపై వస్తుంటారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తాడ్వాయి– పస్రా మార్గంలో రోడ్లు దెబ్బతిన్నడంతో ఇసుక లారీలను తాడ్వాయి నుంచి మేడారం, నార్లాపూర్ మీదుగా ఇసుక లారీలు బయ్యక్కపేట నుంచి భూపాలపల్లి వైపు వెళ్లడంతోనే రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. -
భూ సేకరణకు రైతులు సహకరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్ ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర మాస్టర్ప్లాన్ అభివృద్ధి పనులు, భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో గల ఐటీడీఏ గెస్ట్హౌస్లోని సమావేశ మందిరంలో భూ సేకరణపై బాధిత రైతులతో ఆయన శనివారం సమావేశం అయ్యారు. భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు 20 ఎకరాల స్థలం అవసరమని గుర్తించి రైతులతో ఆర్డీఓ వెంకటేశ్ మాట్లాడారు. రైతులు ముందుగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ డిజైన్ను రూపొందించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ వెనకాల అభివృద్ధి పనులకు భూమి అసరవమని రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తే భూ ధరలను వారి డిమాండ్ మేరకు ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. భూమికి బదులు భూమి కూడా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల స్థలాల్లో అభివృద్ధి నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడితే భూములు ఇచ్చిన భాదిత రైతుల ఉపాధి కోసం కేటాయించేందుకు సిద్దమన్నారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుకల క్యూలైన్ల నిర్మాణానికి భూమి తీసుకుని దానికి బదులు మేడారంలోని స్థలం కేటాయించిన ఇప్పటి వరకు ఎలాంటి భూమిపై హక్కు పత్రాలను ఇవ్వలేదని బాధిత రైతులు ఆర్డీఓకు వివరించగా సర్వే నిర్వహించి వెంటనే పంచానామ చేసి భూమి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చివరికి బాధిత రైతులు మాత్రం భూములు ఇస్తే ఉపాధి కోల్పోతామని భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. రైతులందరితో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సురేష్బాబు ఉన్నారు. -
ఎయిడ్స్పై అవగాహన తప్పనిసరి
● వైఆర్జీ కేర్ లింక్ సంస్థ వర్కర్ కిషన్గోవిందరావుపేట: ఎయిడ్స్పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్జీ కేర్ సంస్థ లింక్ వర్కర్ టి.కిషన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు శనివారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారుగా 90 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ హెచ్ఐవీ నాలుగు విధాలుగా మానవులకు సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి, హెచ్ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి ఈ నాలుగు మార్గాల ద్వారానే వస్తుందని తెలిపారు. గర్భిణులు తప్పకుండా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలన్నారు. ఒకవేళ హెచ్ఐవీ అని తేలితే పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ సోకకుండా మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గర్భిణులు తప్పకుండా ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: డైలీవేజ్ వర్కర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండి.దావూద్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, జీతాలు తగ్గించే జీవో నంబర్ 64 ను వెంటనే రద్దు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి.దావూద్ మాట్లాడుతూ వర్కర్లు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇప్పటికే కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని వివరించారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. దసరా పండుగ సమీపిస్తుంటే హాస్టల్ వర్కర్లు మాత్రం ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, కమల పాల్గొన్నారు. -
యూరియా కష్టాలు
ములుగు రూరల్: మండల పరిధిలోని బండారుపల్లిలో రైతులు యూరియా బస్తాల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సమయంలో బండారుపల్లి గ్రామానికి 330 బస్తాలను పంపించారు. లారీ సాయంత్రం 5 గంటలకు చేరితే పీఏసీఎస్ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు సాయంత్రం 6.30 గంటలకు పంపిణీ చేసేందుకు వెళ్లారు. సాయంత్రం సమయంలో వర్షం సైతం పడడంతో కొంత ఆలస్యమైంది. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.45గంటల వరకు విద్యుత్ అంతరాయంతో అధికారులు రైతులకు యూరియా బిల్లులు పెట్టడానికి సెల్ఫోన్ లైట్ వెలుగులో బిల్లులు రాశారు. రైతులు చీకట్లో యూరియా బస్తాల కోసం పడిగాపులు కాశారు. -
జీఓ 64ను రద్దు చేయాలి
ఏటూరునాగారం: హాస్టల్ వర్కర్ల 6 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, జీఓనంబర్ 64 రద్దు చేయాలని, టైమ్ స్కేల్ అమలు చేయాలని 8వ రోజు శుక్రవారం జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండీ దావూద్, రత్నం రాజేందర్లు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో డైలీ వేజ్ ఔట్ సోర్సింగ్ కాంటినిజెంట్ పేర్లతో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయన్నారు. ఆరు నెలలుగా వేతనాలను చెల్లించకపోతే కార్మికులు కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలన్నారు. పెండింగ్ వేతనాలను కార్మికుల ఖాతాలో జమ చేయాలన్నారు. అంతకుముందు పోలీసులు నిరసనకారులను దోసివేశారు. దీంతో ఐటీడీఏ లోపలి గేటు ఎదుట బైఠాంయించిన నినాదాలు చేశారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గెజిట్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాగలక్ష్మీ, భాగ్యలక్ష్మీ, జయలక్ష్మీ, సుజాత, సారిబాబు, రాజు, విజయలక్ష్మీ, కమల, సమ్మక్క, సత్యవతి, ఇందిర, రాజమ్మ, నాగమణి, సుమలత, రాఘువులు, నందం, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావూద్ -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో కార్మికుల సమస్యలు పోరాటాల ద్వారానే పరిష్కారం అవుతా యని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఏరియాలోని కేటీకే ఒకటో గనిలో శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపొందిన ఏఐటీయూసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశాలలో జరిగిన ఒప్పందాలను అమలు చేయించడంలో గుర్తింపు సంఘం దృష్టి సారించడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే నిరసన కార్యక్రమాలు చేపట్టడం కాదని.. పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వివిధ యూనియన్ల నుంచి సీఐటీయూలో చేరిన కార్మికులకు రాజిరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, సాయిలు, రమేష్ పాల్గొన్నారు. -
అమ్మకానికి దొడ్డు బియ్యం
వెంకటాపురం(ఎం): జిల్లాలో మిగిలిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ–వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలోని గోదాములు, మండల లెవల్ స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్), రేషన్ దుకాణాల్లో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 18,087 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని వేలం వేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఆరు నెలల తర్వాత.. ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పథకాన్ని ఈ ఏడాది మార్చి 30న ప్రారంభించింది. జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 222 రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అప్పటి వరకే జిల్లాలోని పలు రేషన్ షాపులతోపాటు గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం వర్షాకాలం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రేషన్ కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ను జూన్ నెలలోనే పంపిణీ చేసింది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాములన్నీ మూసే ఉన్నాయి. అప్పటికే రేషన్ షాపులు, గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దొడ్డు బియ్యానికి పురుగులు గత ఆరునెలలుగా రేషన్ షాపుల్లో ఉన్న బియ్యంతో పాటు ఎంఎల్ఎస్, గోదాముల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు పట్టి పాడైపోతున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో రేషన్ షాపులు మళ్లీ తెరిచి సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ పంపిణీ చేస్తోంది. అయితే సన్న బియ్యం, దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో ఒకేచోట నిల్వ చేస్తుండడంతో దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వ ఉండటంతో ప్రస్తుతం వచ్చే సన్నబియ్యం నిల్వచేసే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, రేషన్ షాపుల నుంచి దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని రేషన్ డీలర్లు అధికారులను కోరుతున్నారు.ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కిలోకు రూ.24ల చొప్పున విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని 222 రేషన్ షాపుల్లో 2525.29 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. ములుగు, ఏటూరునాగారం, వెంకటాపురం(కె) ఎంఎల్ఎస్ పాయింట్లలో 2114.05 క్వింటాళ్ల దొడ్డు బియ్యం, గోవిందరావుపేట, తాడ్వాయి, అర్షనపల్లి, బనిజిపేట గోదాముల్లో 13,448.22 క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 18087.56 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించడం ద్వారా భారం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యానికి పురుగులు విక్రయించి భారం తగ్గించుకునేలా ప్రభుత్వం చర్యలుజిల్లాలో మిగిలిన దొడ్డు బియ్యానికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లోగా టెండర్ పిలిచి ఎక్కువ ధర కోట్ చేసిన వారికి బియ్యాన్ని కేటాయించనున్నాం. జిల్లాలో నిల్వ ఉన్న 18,087.56 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని ఈ–వేలం ద్వారా విక్రయించనున్నాం. – మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) -
వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(ఎం): స్వస్థ్నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకో వాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోని నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలు వైద్య పరీక్షలు చేయించుకొని సంబంధించిన మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ విద్యారాణి మాట్లాడుతూ మహిళల్లో అత్యధికంగా రక్తహీనతతో బాధడుతున్నారన్నారు. శిబిరంలో 359 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, రిషిత, ఆర్బీస్కే మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, డెమో సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు వంట తిప్పలు
ఏటూరునాగారం: విద్యార్థులు వంట కోసం తిప్పలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ పోస్ట్మెట్రిక్ హాస్టల్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎనిమిది రోజులుగా హాస్టల్ విద్యార్థులకు వంట చేయడానికి వర్కర్స్ లేరని, దీంతో విద్యార్థులే వంట చేసుకోవడం, గదులు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు వార్డెన్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓకు అందించారు. కార్యక్రమంలో నాయకులు వంశీ, అరవింద్, శ్రావణ్, సంతోష్, నర్సింగరావు, డీవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్, విద్యార్థులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ములుగు రూరల్: గిరిజన సంక్షేమశాఖలో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కోగిల బాలు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఎదుట నిరసన తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న కార్మికులకు వేతనాలు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. కార్మి కుల న్యాయమైన డిమాండ్లను పరిష్కారించా లన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సా యి, రోహిత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బూత్స్థాయి అధికారులకు అవగాహన కల్పించాలి
ములుగు రూరల్: బూత్ స్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించిగా కలెక్టర్ టీఎస్ దివాకర, ఆర్డీఓ వెంకటేశ్లు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం స్పెష ల్ ఇన్సెంటివ్ రివిజన్ చేట్టాలన్నారు. ఎస్ఐఆర్ నిర్వాహణకు ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002, ఎస్ఐఆర్ 2025తో పోల్చి చూడాలన్నా రు. 2002 తర్వాత నమోదైన ఓటరు నమోదును క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రిట్నరింగ్ అధికారి, ఏఈఆర్ఓ, డిప్యూటీ తహసీల్ధార్లు, బీఎల్ఓ, సూపర్వైజర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. లక్ష్యాలను నిర్ధేశించుకొని ఎస్ఐఆర్ చేపట్టేలా కార్యచరణ తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ విజయభాస్కర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సలీం, అధికారులు పాల్గొన్నారు. -
యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు
కాటారం: యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. ఎస్పీ కిరణ్ఖరే ఆదేశాల మేరకు కాటారం మండలం కొత్తపల్లిలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు, నంబర్ప్లేట్ లేని 12 బైక్లు స్వాధీన పర్చుకున్నారు. ఇద్దరు వ్యక్తుల వద్ద 40 లీటర్ల గుడుంబబా, 600 లీటర్ల బెల్లంపానకం గుర్తించి ధ్వంసం చేసి కేసులు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి రవాణా చేసినా విక్రయించినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గంజాయి, గుడుంబా నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని.. వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని కోరారు. భూ సంబంధిత గొడవలను ఆసరా చేసుకొని అమాయకులను మోసంచేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐతో పాటు ఎస్సైలు శ్రీనివాస్, మహేందర్, ఓంపాల్, మహేశ్, మానస, సివిల్, టీజీఎస్పీ పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.కాటారం డీఎస్పీ సూర్యనారాయణ -
ఆ 5 శాఖలు...!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు ముమ్మరమైనా.. కొందరు అధికా రులు, ఉద్యోగుల్లో మార్పు లేదు. లంచం.. లంచం.. లంచం.. ఈ పదం కొన్ని శాఖల్లో సర్వసాధారణంగా మారింది. అవసరం కొద్ది లంచం ఇవ్వడం.. అధికారులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. హద్దులు దాటి అధికంగా డిమాండ్ చేసినప్పు డు... బాధితులు ఏసీబీని ఆశ్రయించడం పరిపాటిగా మారుతోంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో పలువురు అధికారులు ఏసీబీకి చిక్కుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రధానంగా రెవెన్యూ, రవాణా, పోలీసు, రిజిస్ట్రేషన్, విద్యుత్శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి కొందరికీ శాపంగా మారుతోంది. కాళేశ్వరం వివాదం తర్వాత నీటిపారుదలశాఖలో పనిచేసే అధికారులు కొందరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కటకటాల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఉమ్మడి వరంగల్లో అవినీతి, అక్రమాలు యధాతధంగా కొనసాగుతూనే ఉన్నాయి. పెరుగుతున్న ఫిర్యాదులు.. అవినీతి పరులపై ఆరా.. అవినీతి, అక్రమార్కులపై ఏసీబీ దూకుడు పెంచడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, విద్యుత్శాఖలతో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ‘కుడా’లలోని పలు విభాగాల్లో కొందరు అధికారులపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ పనికి ఓ రేటును ఫిక్స్ చేసి మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని కొందరు పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్లపైన భూదందాలు, సెటిల్మెంట్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల కోసం భూసేకరణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పేరిట రెవెన్యూ అధికారుల వసూళ్లు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, ఎఫ్టీఎల్ స్థలాలు, ఎల్ఆర్ఎస్ లేని నాన్ లేఅవుటు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల కొందరు సబ్ రిజిస్ట్రార్లపైన ఉన్నాయి. అదే విధంగా విద్యుత్శాఖలో కొందరు అధికారులు బినామీలను పెట్టుకుని కాంట్రాక్టులు చేస్తుండడంతో పాటు విద్యుత్ కనెక్షన్లు, సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. డీటీఓ కార్యాలయాల్లో హద్దులు దాటిన అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా ఏసీబీ అధికారులు మౌనం వహించడంపై చర్చ జరుగుతోంది. జీడబ్ల్యూఎంసీ, కుడాలలో కొందరు అవినీతి అధికారులపైన బాధితులు ఏసీబీని సంప్రదించినట్లు చెప్తున్నారు. ఏదేమైనా ఏసీబీ దూకుడుతో రోజురోజుకూ అవినీతికి పాల్పడే వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది. వరుస సంఘటనలు.. తీరుమారని అధికారులు.. ఉమ్మడి వరంగల్లో వరుసగా కొందరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదులతో దాడులకు గురవుతున్నారు. ఆగస్టులో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి, అక్రమాస్తులను గుర్తించారు. ఫిబ్రవరిలో వరంగల్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, సోదాలు నిర్వహించారు. అంతకుముందు ఇరిగేషన్ డిపార్టుమెంట్లో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్పైన ఏసీబీ దాడులు నిర్వహించి రూ.200 కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ జగదీష్ ఓ బెల్లం వ్యాపారానికి సంబంధించి రూ.4లక్షలు డిమాండ్ చేసి లంచం తీసుకున్న కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈ రమేశ్, ఆయన అసిస్టెంట్ రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కేసు నుంచి నిందితులను తప్పించేందుకు లంచం తీసుకున్న పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రూ.19,200 తీసుకుంటుండగా మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ను అప్పట్లో ఏసీ బీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించారు. విద్యుత్శాఖ హైదరాబాద్లో పనిచేసే ఏడీఈ అంబేడ్కర్పై ఏసీబీ దాడులు, వెల్లడైన అక్రమాస్తుల నేపథ్యంలో ఆశాఖ అధికారులపైన ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఉమ్మడి వరంగల్లో వరుసగా ఏసీబీ దాడులు, కేసులు అవుతున్నా ఆ ఐదు శాఖల్లోని కొందరు అధికారుల్లో మార్పు రాకపోవడంపై చర్చ జరుగుతోంది. సంవత్సరం కేసుల సంఖ్య 2021 07 2022 09 2023 11 2024 17 2025 (ఆగస్టు 31 వరకు) 12అవినీతి ఆరోపణల్లో ముందు వరుస తీరు మారని పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, విద్యుత్ శాఖలు ఏసీబీకి చిక్కుతున్నా వీడని ఆయా శాఖల అధికారుల కక్కుర్తి కాసుల కోసం అడ్డదారులు.. అక్రమార్జనే ధ్యేయంగా పనులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వీరిపైనే అధిక ఫిర్యాదులు నీటిపారుదలశాఖ అధికారులపైన పెరిగిన దాడులు -
రామప్పలో సింగపూర్ దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సింగపూర్కు చెందిన దెవ్ గురువారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుడిని సైతం దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని దెవ్ కొనియాడారు. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని గిరిజన భవన్లో అంగన్ వాడీ టీచర్లకు పోషణ్ అభియాన్పై శిక్షణ తరగతులు మూడు రోజుల పాటు నిర్వహించారు. గురువారంతో ఈ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ మేరకు అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించాలని సీడీపీఓ ప్రేమలత తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగర్వాడీ సూపర్ వైజర్లు శ్రీవిద్య, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: సీనియర్ సిటీజన్లు తమ ఆస్తులను వారసులకు బదలాయించే సమయంలో నిబంధనలు పాటించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వయోవృద్ధులు తమ ఆస్తులను పిల్లలకు, వారసులకు ఇచ్చే క్రమంలో తమ అవసరాలను తీర్చలేని క్రమంలో ఆస్తి బదలాయింపునకు అవకాశం ఉండే విధంగా మార్పిడి చేయాలని సూచించారు. సీనియర్ సిటీజన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 23(ఏ) రద్దు చేయడానికి వీలు ఉంటుందని వివరించారు. ములుగు రూరల్: జిల్లా లీగల్సెల్ కన్వీనర్గా రాజేందర్ను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ ఉమెన్ రైట్స్ అండ్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడికి, జిల్లా లీగల్ సెల్ సభ్యులకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ములుగు రూరల్: జేడీ మల్లంపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో బతుకమ్మ వేడుకలకు సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు మొర్రి రాజుయాదవ్ అన్నారు. ఈ మేరకు గురువారం ఎంపీడీఓ అనితకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల్లో వీధిలైట్లు, దోమల నివారణకు స్ప్రేయింగ్ చేయించాలని కోరారు. మల్లంపల్లి మండలకేంద్రంలో విద్యుత్ దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. బతుకమ్మ వేడుకల్లో మహిళలు, యువతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కల సంపత్, గణపతి, బొమ్మకంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు. టేకుమట్ల: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ విద్యార్థిని శ్వేత జిల్లాస్థాయి కబడ్డీ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కేజీబీవీ ఎస్ఓ నాగపూరి స్వప్న తెలిపారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం కబడ్డీ అసోసియేషన్–భూపాలపల్లి ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగపూరి స్వప్న మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి ఉన్న ప్రతీ విద్యార్థిని ప్రోత్సహిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినిని అభినందించారు. ఆమె వెంట పీఈటీ అనిత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
పేపర్లు లేని వాహనాలు సీజ్
ములుగు: పేపర్లు లేని వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ వాహనదారులను హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆయన గురువారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ లేని వాహనాలకు, ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనదారులకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఫర్హాన్ ఆనీఫ్, సవారి గౌతమ్, ప్రభాకర్ పాల్గొన్నారు.జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ -
‘హేమాచలక్షేత్రంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలి’
మంగపేట/ఏటూరునాగారం: మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్ధం లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు కలెక్టర్ దివాకరకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వివిధ సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని, సుమారు 60 అడుగుల ఎత్తులో గుట్టపై ఉన్న ఆలయం వద్దకు మెట్లపై నడిచి వెళ్లేందుకు దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. ఆలయానికి వచ్చే భక్తులు గుట్టపైకి చేరుకునేందుకు లిఫ్ట్ ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణరావు, గోపాల్రావు, మోహన్, శ్రీనివాస్రెడ్డి, రమణారెడ్డి, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి
ఎస్ఎస్తాడ్వాయి: పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని సెర్ప్ టీజీ ఐఎల్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ జయరాం అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కన్నెపల్లిలో గురువారం టీజీఐఎల్పీ తెలంంగాణ ఇన్ క్యూసివ్ లవ్లీహుడ్ కార్యక్రమంలో భాగంగా పెరటి కోళ్ల పెంపకంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలన్నారు. ఆసక్తి గల లబ్ధిదారులకు పెంపకంలో మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ టీజీ ఐఎల్పీ జీవనోపాదుల విభాగం అధికారులు భవ్య లోకేష్, వాసన్, ఎన్జీవో సభ్యులు లక్ష్మణ్, నరసింహులు, డీఆర్డీఏ డీపీఎం రాజు, టీజీఐఎల్పీ జిల్లా కోఆర్డినేటర్ వెంకన్న, తాడ్వాయి ఏపీఎం కిషన్, సీసీ భద్రయ్య, తాడ్వాయి కోఆర్డినేటర్ యాదగిరి, కన్నాయిగూడెం మండలం పీజీ ఐఎల్పీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.సెర్ప్ టీజీఐఎల్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ జయరాం -
పౌష్టికాహారంతో ఆరోగ్యం
ములుగు రూరల్: మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ప్రతిఏటా పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా మాసోత్సవాలను నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 16వ తేదీ వరకు 30 రోజుల పాటు సీ్త్ర–శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై సూచనలు ఇవ్వడంతో పాటు కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అధికారులు పరిశీలించనున్నారు. పోషణమాసం కార్యక్రమాలు.. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా మొదటి వారం పౌష్టికాహారం పంటలపై పోటీలు నిర్వహిస్తారు. బీఎంఐ పరీక్షలు, పిల్లల ఎత్తు, బరువు చూడడం, ఆహారంలో చెక్కర, నూనె తగ్గించడం, తల్లితండ్రులతో పౌష్టికాహారం ప్రతిజ్ఞ, స్థానిక వంటకాలను ప్రోత్సహించడం చేస్తారు. రెండోవారం ముర్రుపాలు, పిల్లల అనుబంధ ఆహారలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యకరమైన పిల్లల తల్లులతో అనుభవాలు పంచుకోవటం, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలపై సమావేశాలు నిర్వహిస్తారు. మూడోవారం అతితీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించడం, రక్తహీనత, అధిక బరువుపై కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తారు. హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించడం, అంగన్వాడీ కేంద్రాలలో యోగా సాధన, పోషణ్ మిషన్ వంద రోజు కార్యక్రమం నిర్వహిస్తారు. పోషణ ఛాంపియన్లను సత్కరిస్తారు. నాల్గో వారం తాగునీరు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, ఆరు నెలల లోపు పిల్లలు ఉన్న బాలింతల ఇళ్లను సందర్శిస్తారు. తక్కువ నూనె, చెక్కర పదార్ధాల ప్రదర్శన, సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.చిన్నారులు ఆరోగ్యంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పోషణ మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తాం. వయస్సుకు తగ్గట్టుగా బరువు లేని చిన్నారులను గుర్తించి ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందేలా చూస్తాం. నిత్యం పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆహారంలో చేర్చడం ద్వారా ఉండే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తాం. నేటి నుంచి పోషణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తాం. – తుల రవి, జిల్లా సంక్షేమాధికారి●జిల్లాలో 640 అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని పది మండలాల్లో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 640 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు 1900 మంది ఉండగా బాలింతలు 1476, చిన్నారులు 17,259 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార లోపంతో పుట్టబోయే బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో లేకపోవడం, గర్భిణుల్లో రక్తహీనత లోపాలను ఎక్కువగా గుర్తించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థిఽతిపై ఆరాతీస్తూ సలహలు, సూచనలు అందిస్తున్నారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీ సిబ్బంది గ్రా మాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 30 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు గర్భిణులు, బాలింతలకు అవగాహన మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి -
పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
వెంకటాపురం(ఎం): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. విద్యార్థులు సురక్షితమైన మంచినీటిని సేవించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. క్రమశిక్షణతో చదువుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఆర్డీటీ సంస్థ నిర్వహకులను డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ సరస్వతి, ప్లానింగ్ కోఆర్డినేటర్ హర్షం రాజు, ప్రధానోపాధ్యాయులు రాధిక, ఏరియా టీమ్ లీడర్ సంజీవ్ కుమార్, డాక్టర్ రమేష్ బాబు, షఫీ, ప్రతాప్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
యంత్రాలు, పరికరాల కొనుగోలుకు నివేదికలు
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని వివిధ గనులల్లో కావాల్సిన యంత్రాలు, పరికరాల కొనుగోలుకు నివేదికలు అందించాలని జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(యూజీ–మైన్స్) రఘురామారెడ్డి తెలిపారు. ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి గురువారం ఏరియాలోని వివిధ విభాగాల అధికారులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక, వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను గనులకు, ఓపెన్కాస్ట్లకు కావలసిన యంత్రాలు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్ మెషినరీ, సర్వీస్ కెపాసిటర్స్ ప్లాంట్, మిషినరీ పనిముట్లు కావలసిన సదుపాయాలపై పలు సూచనలు, సలహాలు చేశారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీఎంలు సూచించారు. ఉపరితల, భూగర్భ గనుల్లో యంత్ర పరికరాల అవసరాలు ఉన్నట్లయితే వివరాలను అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేట్ అఽధికారులు వెంకయ్య, దిలీప్కుమార్, చంద్రశేఖర్, నటరాజన్, ఏరియా అధికారులు కవీంద్ర, రవీందర్, శ్యామ్సుందర్, బుచ్చయ్య, జోతి, రవికుమార్ పాల్గొన్నారు. -
లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర
భూపాలపల్లి అర్బన్: సింగరేణి యాజమాన్యంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం లాభాల వాటా తగ్గించేందుకు కుట్ర చేస్తోందని బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పాని శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గత సంవత్సరం రూ.4,701 కోట్ల లాభం వచ్చినా యాజమాన్యం కేవలం రూ.2,412 కోట్లను మాత్రమే చూపించి కార్మికులకు 33శాతం వాటా ఇచ్చి అన్యాయం చేసినట్లు ఆరోపించారు. సింగరేణి ఆడిట్ వివరాలు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నారని.. దీనిపై కార్మిక వర్గంలో అనేక అనుమానాలు దాగి ఉన్నాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీలోపు సింగరేణి లాభాలు 35శాతం వాటా ఇవ్వాలని లేనిపక్షంలో సింగరేణిని స్తంభింపజేస్తామని హెచ్చరచించారు. ఈ సమావేశంలో నాయకుల వెలబోయిన సుజేందర్, మల్లేష్, నర్సింగరావు, సదానందం, శ్రీనివాస్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. -
రైతులు సూచనలు పాటించాలి
కాటారం: రైతులు పంటల సాగులో వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడి సాధించాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వీరన్న, విత్తనోత్పత్తి శాస్త్రవేత్త వెంకన్న సూచించారు. కాటారంలో రైతులు సాగుచేస్తున్న పత్తి, వరి పంటలను గురువారం శాస్త్రవేత్తల బృందం సభ్యులు సందర్శించారు. పంట సాగు విధానం, ఎరువులు, పురుగు మందుల వాడకం, సాగు యజమాన్య పద్ధతులు తదితర అంశాలపై ఆరా తీశారు. పంటలపై వచ్చే పురుగులు, తెగుళ్లకు సంబంధించిన నివారణ, ముందు జాగ్రత్త చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఓంప్రకాశ్, రమ్య, ఏఈఓలు రాజన్న, అస్మ, మౌనిక పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ధ్యేయం
పోరాట యోధుల త్యాగాలు మరువలేనివిజాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి సీతక్క పక్కన కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్ ములుగు రూరల్: రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం రూ.10లక్షలకు పెంపు 1948 సెప్టెంబర్ 17వ తేదీకి ఎంతో విశిష్టత ఉందన్నారు. 77 సంవత్సరాల క్రితం రాచరిక పాలనకు విముక్తి పలికారని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడంలో మహనీయులు, పోరాటయోధుల త్యాగాలు మరువలేనివని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను స్వీకరించి 48 గంటల్లో అమలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.40 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించడంతో రూ. 89.34 లక్షలు మహిళలకు ఆదాయం చేకూరుతుందన్నారు. నిరుపేదలు కార్పొరేట్ వైద్యం పొందడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో గుండె, న్యూరాలజీ, ఆర్థోపెటిక్, పీడీయాట్రిషన్, జనరల్ సర్జరీలో 3,501 మందికి గాను రూ. 9కోట్ల 25లక్షల 67 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇంటింటి జ్వర సర్వే.. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500లకు వంట గ్యాస్ జిల్లాలో 50 వేల 98 మంది లబ్ధిదారులకు రూ. 4కోట్ల 38లక్షల 53 వేల సబ్సిడీ చెల్లించామని వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల కోసం నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళలు వ్యాపార రంగాలలో అభివృద్ధి చెందేవిధంగా ప్రభుత్వం ఇందిర మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. మహిళలకు ఆసక్తి కలిగిన రంగాలలో నైపుణ్య శిక్షణ అందించి సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రామప్ప రీజియన్ టూరిజం సర్క్యూట్లో భాగంగా రూ. 37.10 కోట్లతో ఇంచర్ల గ్రామంలో టూరిస్టు ఎత్నిక్ విలేజ్ పనులు, రామప్ప ఐలాండ్ వద్ద రూ. 13 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. ఆయిల్పామ్ సాగుతో లాభాలు జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంచర్ల శివారులో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు ఉంటాయని వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారని, వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న 39 ఇళ్లకు ఆర్ధిక సాయంగా రూ.1.45లక్షలు బాధితుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి, పార్లమెంట్ సభ్యులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఆర్డీఓ వెంకటేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.పదేళ్ల నుంచి రేషన్కార్డులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి జిల్లాలో 8,968 మందికి రేషన్ కార్డులు అందించామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నామని వివరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంగన్ వాడీలలో ప్రీప్రైమరీ తరగతులు, ప్రాథమిక విద్య నుంచి విశ్వ విద్యాలయాల వరకు మెరుగైన విద్యను అందిస్తున్నామని వ్యాఖ్యానించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి సీతక్క -
తక్కువ తూకంతో విక్రయిస్తే కేసులు
● లీగల్ మెట్రాలజీ శ్రీలత ములుగు: వ్యాపారులు తక్కువ తూకంతో వినియోగదారులకు మాంసాహారాన్ని విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఉమ్మడి భూపాలపల్లి జిల్లా లీగల్ మెట్రాలజీ తనిఖీ అధికారి శ్రీలత వ్యాపారులను హెచ్చరించారు. ములుగు మార్కెట్ ప్రాంగణంలోని చేపలు, చికెన్, మటన్ షాపులను ఆమె బుధవారం తనిఖీ చేశారు. అమ్మకందారులు తక్కువ బరువున్న రాళ్లను వాడుతుండటంతో కిలోకు 200 గ్రాములు తక్కువ తూకం వస్తున్నట్లు తనిఖీలో తేలిందన్నారు. వినియోగదారులకు సరైన తూకం వేసి ఇవ్వాలన్నారు. -
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
ములుగు రూరల్: సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల పక్కన నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. కలెక్టరేట్ భవనంలో స్టేట్ బోర్డు చాంబర్, కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్హాల్, ఇతర శాఖలకు కేటాయించిన గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గ్రానైట్, ఎలక్రిషన్, ప్లంబింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రవేశ ద్వారం వద్ద రెడ్సెల్తో రోలింగ్ చేయించి సుందరీకరణ పనులు చేయాలని ఇంజనీరింగ్శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
పెరుగుతున్న గోదావరి
వాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. మండల పరిధిలోని పేరూరు వద్ద బుధవారం సాయంత్రానికి 14.84 మీటర్లకు చేరుకుంది. గోదావరి వరద క్రమంగా పెరుగుతుండడంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చితోటలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. పూసూరు, ఏడ్జెర్లపల్లి గ్రామాల మధ్యన బ్రిడ్జిపైకి వరద నీరు చేరింది. సమ్మక్క సాగర్కు 5,93,830 క్యూసెక్కుల నీరు కన్నాయిగూడెం: గోదావరికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలో సమ్మక్క సాగర్ బ్యారేజీకి వరద భారీగా వచ్చి చేరుతోంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,93,830 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అధికారులు 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.నీటిలోనే మిర్చి చేలు -
సాయుధ పోరాట చరిత్ర ఎర్రజెండాదే..
ములుగు: తెలంగాణలో భూస్వాముల దౌర్జన్యాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను చైతన్య పరిచి సాయుధ పోరాటం నిర్వహించిన చరిత్ర ఎర్రజెండాదేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సీపీఎం ములుగు మండల బాధ్యుడు రత్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బుధవారం సభ నిర్వహించారు. 4 వేల మంది ప్రాణత్యాగాలతో లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించిందన్నారు. భూ స్వాములను గ్రామాల నుంచి తరిమి కొట్టి, గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసి ప్రజాపాలనను ప్రజలకు చూపించింది కమ్యూనిస్టులని వెల్లడించారు. ఈ సభలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు రత్నం రాజేందర్, వెంకటాపురం మండల కార్యదర్శి అలువాల ఐలయ్య, నాయకులు రెడ్డి రామస్వామి, రవిగౌడ్, చందర్, దేవేందర్, రవీందర్, చంటి, వెంకటేశ్, కుమారస్వామి పాల్గొన్నారు.సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటరెడ్డి -
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలి
ములుగు/ములుగు రూరల్: గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ దివాకరతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతాహీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతో దోమలు వృద్ధి చెందవని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, మహిళా సంఘాల ద్వారా రంగోలి వ్యాసరచన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్అండ్బీ, పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నూతన పనులు, మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. గిరిజన భవన్లో కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాసోత్సవం కార్యక్రమాన్ని, ఫొటో ఎగ్జిబిషన్ను కలెక్టర్ దివాకరతో కలిసి సందర్శించి మాట్లాడారు. వచ్చేనెల 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్వస్తినారి స్వసక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామం, రాష్ట్రం, దేశ బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, డీపీఓ దేవరాజ్, డీఆర్డీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి’
ఏటూరునాగారం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ, గిరిజన సంఘం జిల్లా నాయకులు కోరం చిరంజీవి అన్నారు. జీఓ నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బుధవారం వారు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీవేజ్ కార్మికులు ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే ఒకవైపు హాస్టళ్లలో విద్యార్థులు వంటలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు సమస్యను పరిష్కరించడం లేదన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను కలెక్టర్ గెజిట్ ఆధారంగా చెల్లించే విధంగా ట్రెజరీలకు మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. అర్హులైన డైలీవేజ్ వర్కర్లను వెంటనే పర్మనెంట్ చేయాలని, అందరికీ టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. అలాగే రూ.10 లక్షల ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మరణిస్తే రూ.50వేలు దహన సంస్కారాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు లాజర్, గిరిజన సంఘం నాయకులు మధు, హాస్టల్ వర్కర్లు నాగలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, కమల, రాజు, యాకలక్ష్మి, స్రవంతి, రాజమ్మ, సమ్మక్క, వసంత, మాణిక్యం, శారద, భారతి, పద్మ, లచ్చిరాం, సత్యం పాల్గొన్నారు. -
సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలి
ములుగు రూరల్: రైతులు పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ అన్నారు. మండల పరిధిలోని బండారుపల్లి, చిన్నగుంటూర్పల్లి ప్రాంతాలలో వరి, పత్తి పంటలను శాస్త్రవేత్తలు శ్రవణ్కుమార్, మానస, మాధవి, సౌందర్యలతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో బ్యాక్టీరియా, ఎండాకుల తెగులు, ఉల్లికోడు, కాండం తొలుచు పురుగు ఆశించడాన్ని గమనించాలన్నారు. ఉల్లికోడు నివారణకు వరి నాటిన 15 రోజుల లోపు ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు చల్లుకోవాలని సూచించారు. లేదా లీటర్ నీటికి 2.5 ఎంఎల్ పెట్రోల్ను పిచికారీ చేయాలన్నారు. కాండంతొలుచు పురుగు నివారణకు పంట పిలక దశలో నాటిన 20 నుంచి 25 రోజుల్లో ఎకరానికి 10 కేజీల కార్బోప్యూరాన్ 3జీ గుళికలు లేదా నాలుగు కిలోల క్లోరంట్రినిలిప్రోల్ గుళికలు చల్లుకోవాలని సూచించారు. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని వివరించారు. ఎండాకుల తెగులు నివారణకు అగ్రిమైన్సీన్ 0.4 గ్రాములు లేదా ప్లాంటామౌసిన్ 0.2 గ్రాములు లేదా కపర్ ఆక్లిక్లోరైడ్ 3 గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని వెల్లడించారు. పత్తిలో రసం పీల్చు పురుగు, పచ్చదోమ నివారణకు పిప్రోనిల్ 2 ఎంఎల్, మోనోక్రోటోపాస్ 1.6 ఎంఎల్, ఎసిపేట్ 1.5 గ్రాములు లేదా థయోమితగ్జామ్ 0.2 గ్రాములు లేదా ప్లానికామిడ్ 0.7 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, ఏఈఓలు హరీశ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కృష్ణ -
కేసీఆర్ పాలనను కోరుకుంటున్న ప్రజలు
మంగపేట: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు అన్నారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం బ్రాహ్మణపల్లి కిందిగుంపునకు వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్, జిల్లా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు డోలివాయిద్యాలతో మహిళలు బతుకమ్మలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం దోమెడ, రామచంద్రునిపేట, మల్లూరు, శనిగకుంటలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. బ్రాహ్మణపల్లి కింది గుంపులోని నాగులమ్మ ఆలయం, దోమెడలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రునిపేటలో ఇటీవల మృతి చెందిన పోటూరు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేల నగదును అందజేశారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు -
ములుగులో జాతీయ జెండావిష్కరణ
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఎగురవేసి మాట్లాడారు. ప్రజలు నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజునే తెలంగాణ విమోచన దినోత్సవం అన్నారు. ప్రతీ తెలంగాణవాది విమోచన దినోత్సవాన్ని గర్వంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, సురేందర్, స్వరూ ప, రవీంద్రచారి, జాడి వెంకట్, కృష్ణారావు, శోభన్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కన్నాయిగూడెం: ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ ఇంటలెక్చువల్స్ కో ఆర్డినేటర్గా మండల పరిధిలోని చింతగూడెంకు చెందిన గొస్కుల సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంటలెక్చువల్స్ సమావేశంలో రాష్ట్ర కమిటీ సుధాకర్ను ఎన్నిక చేసి నియామక పత్రాన్ని అందించింది. వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్గా ఉందని జర్మనీ దేశానికి చెందిన క్రిష్టియన్ స్లావిక్ కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. హసన్పర్తి: బైక్ అదుపు తప్పి ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈసంఘటన కేయూ–వడ్డేపల్లి రోడ్డులో జరిగింంది. ములుగు జిల్లా అన్నంపల్లికి చెందిన పోరిక రమేశ్నాయక్ (42) జవహర్కాలనీలో నివాసం ఉంటున్నాడు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి మోడల్ స్కూల్లో ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి బైక్పై ఇంటి నుంచి కేయూ జంక్షన్ వైపు పని నిమిత్తం ఆయన బయల్దేరాడు. మార్గమధ్యలో తులసి బార్ సమీపంలో చీకటిగా ఉండడంతో ఎదురుగా వెళ్తున్న ఆవు కనిపించలేదు. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి ఆవును ఢీకొని కిందపడిపోయాడు. ఈసంఘటనలో తలకు బలమైన గాయమై రమేశ్నాయక్ మృతి చెందాడు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాటారం: దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలను తొలగిస్తానని పుట్ట మధు బెదిరింపులకు గురి చేస్తున్నారని, దీనిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సహిస్తున్నారని మండల కేంద్రానికి చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాడి మహేశ్వరీ బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కమాన్పూర్ మండలంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పుట్ట మధు తన అనుచరులతో సమావేశం పెట్టి త్వరలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరుగుతుందని శ్రీపాదరావు విగ్రహాలను తొలిగిస్తామని భయబ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారన్నారు. విగ్రహాల రక్షణపై అనుమానం ఉందని, శ్రీపాదరావు విగ్రహాలకు ఏదైన జరిగితే పుట్ట మధు ప్రమేయంతోనే అన్నారు. -
వేతనం ఇవ్వకపోవడంతోనే మహేశ్ ఆత్మహత్య
ములుగు: మున్సిపల్ కార్మికుడు మైదం మహేశ్కు సకాలంలో వేతనం ఇవ్వకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మృతికి బాధ్యత వహిస్తూ రూ.50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5.50లక్షల ఆర్థిక సాయాన్ని అందించగా బీఆర్ఎస్ నేతలు బాధితుడి పిల్లల పేర్లపై పోస్టాఫీస్లో డిపాజిట్ చేశారు. అనంతరం మాధవరావుపల్లిలో గల మహేశ్ కుటుంబ సభ్యులకు పోస్టల్ బాండ్ను మంగళవారం అందించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి, లక్ష్మణ్బాబు విలేకర్లతో మాట్లాడారు. మహేశ్ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఐదు నెలల నుంచి వేతనం అందకపోవడం, మున్సిపాలిటీలో అధికారులను అడిగినా జీతం ఇవ్వకపోవడంతోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు మహేశ్ ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవిందనాయక్, మాజీ జెడ్పీటీసీలు సకినాల భవాని, బేతెల్లి గోపాల్రెడ్డి, రుద్రమదేవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి, లింగాల రమణారెడ్డి, నాయకులు పోరిక విజయ్రాంనాయక్, లకావత్ నరసింహనాయక్, తదితరులు పాల్గొన్నారు. బాధితుడి కుటుంబానికి కేటీఆర్ రూ.5.50 లక్షల సాయం పోస్టల్ బాండ్ను అందించిన బీఆర్ఎస్ నేతలు -
రూ.50 కోట్లతో పట్టణాభివృద్ధి
ములుగు: ములుగు పట్టణాభివృద్ధికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను విడుదల చేసిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసినట్లు వెల్లడించారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క నిత్యం కృషి చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతో ములుగు పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.150 కోట్లతో మేడారం పనులు, ములుగు ఆధునిక బస్టాండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతనిప్పుల భిక్షపతి, వంగ రవియాదవ్తో పలువురు నాయకులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
విద్యార్థులు సైన్స్పై మక్కువ పెంచుకోవాలి
గోవిందరావుపేట: విద్యార్థులు సైన్స్పై మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ను మంగళవారం జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, సైన్స్పై మక్కువతో విద్యార్థుల్లో ప్రశ్నించే స్వభావం పెరుగుతుందన్నారు. క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్ ఛాలెంజెస్ అనే అంశంపై నిర్వహించిన సైన్స్ సెమినార్ విజేతలను డీఈఓ ప్రకటించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సెమినార్లో ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎం.యశ్వంత్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. రేపు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సెమినార్లో పాల్గొంటాడని వివరించారు. అనంతరం చల్వాయిలో తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి అధ్యక్షతన టీఎల్ఎం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. సృజనాత్మక బోధనకు టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) ఎంతో ముఖ్యమని డీఈఓ సిద్ధార్థరెడ్డి అన్నారు. విద్యార్థులకు కృత్యాధార పద్ధతిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగిస్తూ విద్యార్థులకు బోధన చేయాలన్నారు. అత్యుత్తమమైన 8 మంది ఉపాధ్యాయులు మెటీరియల్తో బోధిస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని వివరించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వారిలో సీహెచ్.మహేందర్, యశస్వీని, టి.సంధ్యారాణి, పూర్ణిమ, రాజశేఖర్, టి.రాజేశ్ కుమార్, ఏ.వెంకటేశ్, మహేందర్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, ఏటూరునాగారం మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్య, ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ గండు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలి వెంకటాపురం(ఎం): విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు, మధ్యాహ్న భోజన నిర్వహకులకు డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ అమలుతీరు, మధ్యాహ్న భోజన వివరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, టీచర్ డైరీ, బేస్ లైన్, ఫార్మాటివ్ అసెస్మెంట్ ఫలితాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ సాంబయ్య, హెచ్ఎం రాధిక, ఉపాధ్యాయులు బాబురావు, సంధ్యారాణి, కిశోర్బాబు, అంబేద్కర్, మహేష్లు పాల్గొన్నారు.జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి -
ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జరగనున్న వేడుకలకు మంత్రి సీతక్క హాజరు కానున్నట్లు తెలిపారు. నేటి ఉద యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. జీపీల్లో ప్రత్యేక అధికా రులు జాతీయ పతా కాన్నిఆవిష్కరించాలని సూచిం చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్కు ఉదయం 9.55 గంటలకు మంత్రి సీతక్క చేరుకుంటారని పేర్కొన్నారు. 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చే స్తారు. ఉదయం 10.05 గంటలకు గౌరవ వందనం స్వీకరించి 10.10 గంటలకు సీతక్క ప్రసంగిస్తారని వెల్లడించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ కార్యాలయం విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది. -
సొసైటీ పాలకవర్గాలపై వేటు
వెంకటాపురం(ఎం): సింగిల్ విండో సొసైటీల పాలకవర్గాలపై సహకార శాఖ చర్యలకు పాల్పడుతుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణాలు తీసుకొని సభ్యులు చెల్లించకపోవడంతో పాలకవర్గాన్ని బాధ్యులను చేస్తూ తొలగిస్తున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా ఇప్పటికే మూడు సొసైటీల పాలకవర్గాలను రద్దు చేసి పర్సన్ ఇన్చార్జ్లను సహకార అధికారులు నియమించారు. జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలంలోని లక్ష్మీదేవిపేట, పాలంపేట పీఏసీఎస్ పాలకవర్గాలతో పాటు ఏటూరునాగారం పీఏసీఎస్ పాలకవర్గం రుణాలను రికవరీ చేయడంలో నిర్లక్ష్యం చేశారని బాధ్యులను చేస్తూ పాలకవర్గాలను రద్దు చేశారు. దీంతో జిల్లాలోని మూడు పీఏసీఎస్లకు చెందిన ముగ్గురు చైర్మన్లు, ముగ్గురు వైస్ చైర్మన్లు, 33 మంది డైరెక్టర్లు పదవులు కోల్పోవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. రెండోసారి పొడిగింపులో ప్రభుత్వం మెలిక ములుగు జిల్లాలో 12 పీఏసీఎస్లు ఉన్నాయి. పీఏసీఎస్లకు 15 ఫిబ్రవరి 2020లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 16న చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16తో ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరునెలల పాటు పదవీకాలాన్ని పొడగించింది. పొడగించిన పదవీకాలం ఆగస్టు 15వ తేదీతో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి మరో ఆరునెలల పాటు పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో పాలకవర్గాల పనితీరు బాగున్న సంఘాలను మాత్రమే పొడగించాలని, సొసైటీల అభివృద్ధికి పాటుపడని పాలకవర్గాలను రద్దు చేయాలని పేర్కొంది. ప్రధానంగా సొసైటీ పరిధిలో సభ్యులు తీసుకున్న రుణాల రికవరీపై దృష్టి సారించని పాలకవర్గాలపై చర్యలు చేపట్టాలని జిల్లా సహకార అధికారులను ఆదేశించింది. దీంతో సొసైటీల పనితీరు బాగాలేదని మూడు పాలకవర్గాలను రద్దు చేసి లక్ష్మీదేవిపేటకు ఎం.దేవేందర్రావు, పాలంపేటకు చంద్రశేఖర్రావు, ఏటూరునాగారానికి రాజేష్లను పర్సన్ ఇన్చార్జ్ లుగా అధికార యంత్రాంగం నియమించింది. పీఏసీఎస్లలో సభ్యులు తీసుకున్న రుణాలను రికవరీ చేయకపోవడంతో పాలకవర్గాలు నిర్లక్ష్యం చేయడంతోనే సొసైటీలు నష్టాల్లో ఉన్నాయి. దీంతో జిల్లాలోని ఏటూరునాగారం, లక్ష్మీదేవిపేట, పాలంపేట పాలకవర్గాలను రద్దు చేసి పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లను నియమించాం. 12 సొసైటీల పనితీరును పరిశీలిస్తున్నాం. వీటిలో మరో రెండు సొసైటీల రికార్డులు పూర్తిగా తనిఖీ చేస్తున్నాం. సొసైటీల నిర్వహణ సరిగా లేని పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగించవద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. – సర్దార్సింగ్, జిల్లా సహకార అధికారి సొసైటీల పనితీరు బాగుంటేనే పొడిగించాలని ఉత్తర్వులు జిల్లాలో 12 సొసైటీల్లో 3 పాలకవర్గాలు రద్దు పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్లను నియమించిన అధికారులు -
పోషణ్ అభియాన్ విజయవంతం చేయాలి
ములుగు రూరల్: పోషణ్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సీడీపీవోలు, పోషన్ అభియాన్ సిబ్బంది, మెడికల్ హెల్త్, పంచాయతీ రాజ్, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ పోషణ్ అభియాన్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల కోఆర్డినేషన్తో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతీ గ్రామంలో పోషణ్ అవగాహన ర్యాలీలు, వాణిజ్య ప్రదర్శనలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ ర్యాలీలు, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భిణులు, చిన్నారులకు పోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు ఇవ్వాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పోషకాహారానికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య సమస్యలను నివారించి ఆరోగ్య మహిళలుగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి స్వశక్తిపరివార్ అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ గోపాల్రావు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ దివాకర -
ఓరుగల్లులో రణనినాదం
భూస్వామ్య వ్యవస్థ రద్దు కోసం ఆనాడు ప్రజలు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటం. దొరలు, దేశ్ముఖ్లను గడగడలాడించి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో నిజాం పాపపు పాలనకు చరమగీతం పాడారు. రాక్షస రజాకార్ల అరాచకాలను ఎండగట్టారు. పంటను పాలకులు లాక్కుంటే మహిళలు వేటకొడవళ్లతో తరిమికొట్టారు. ఈ నేల నుంచి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యతోపాటు అనేక మంది అమరులయ్యారు. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉద్యమాలు, వీరోచిత పోరాటంపై (సెప్టెంబర్ 17 సందర్భంగా) ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.పరకాల: పరకాల పోరాట పటిమ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సాయుధ పోరాటంలో భాగంగా అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల పిలుపు మేరకు 1947 సెప్టెంబర్ 2న అనేక గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు పరకాలకు తరలివచ్చారు. అప్పటికే ఇక్కడ నిజాం పోలీసులు మకాం వేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది అమరులయ్యారు. రజాకారులు వెంటాడి 180 మందికిపైగా ఉద్యమకారులను తీవ్రంగా గాయపర్చారు. మొగుళ్లపల్లి మండలం రంగాపురంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చిచంపారు. చంద్రగిరి గు ట్టలను కేంద్రంగా చేసుకుని సా యుధ పోరాటం జరిపారు. మరో జలియన్వాలాబాగ్ ఘటనను కళ్లకు కట్టినట్లు అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, చెన్నమనేని విద్యాసాగర్రావు తన తల్లి చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ తరఫున వందలాది విగ్రహాలను తయారు చేయించారు. పరకాల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో రెండేళ్లుగా శ్రమించి 2003 సెప్టెంబర్ 17 ఆ విగ్రహాలతో ఏర్పాటు చేసిన అమరధామాన్ని ఆయన ప్రారంభించారు.చరిత్రకు సాక్ష్యం ‘జనగామ రైల్వేస్టేషన్జనగామ: దొరల ఆగడాలకు చరమగీతం పాడింది జనగామ రైల్వేస్టేషన్. విస్నూరు దొర లష్కర్ (సికింద్రాబాద్)కు పారిపోయే ప్రయత్నంలో సాయుధ పోరాట యోధులు మట్టుబెట్టి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. విస్నూరు దొర రాపాక రాంచంద్రారెడ్డి కొడుకు బాబు దొర అరాచకాలు మితిమీరిపోయాయి. 1947లో సవారు కచ్చురంలో నలుగురు విప్లవకారుల కాళ్లు, చేతులను కట్టేసి తన గూండాలతో గడ్డివాములో తలదాచుకుని తెల్లవారు జామున 4 గంటల వరకు లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చేరుకున్నాడు. ఊరి శివారున ఉన్న ఈత చెట్ల సమీపంలో ముగ్గురిని చంపేశాడు. ఇందులో ఓ ఉద్యమకారుడు చాకచక్యంగా తప్పించుకుని, కుందారం గ్రామానికి చేరుకుని జరిగిన ఘటనను స్థానికులకు వివరించాడు. దీంతో పదివేల మందికిపైగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దొర పోలీస్ స్టేషన్లో తలదాచుకుని రైల్వేస్టేషన్ సమీపంలోని పాత ఎస్బీహెచ్ ఆవరణలో ఉన్న తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. విప్లవ యోధుడు గబ్బెట తిరుమల్రెడ్డి నాయకత్వంలో జాటోత్ దరాగ్యనాయక్, మరికొందరు విప్లవకారులు నాటి రైల్వే వ్యాగన్ ఏరియాలో దొర రాకకోసం ఎదురు చూశారు. పట్టాలపై ఆగిఉన్న గూడ్స్ రైలు కింది నుంచి దాటుకుంటూ వ్యాగన్ పాయింట్ మర్రిచెట్టు కిందకు రాగానే దరాగ్యనాయక్.. దొర మెడపై మొదటి వేటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. విప్లవకారులు దొరను చిత్రహింసలు పెట్టి చంపేశారు. అనంతరం ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దొరకు చరమగీతం పలికిన రైల్వేస్టేషన్ నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.పోలీసు ఉద్యోగం వదిలి..మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన రేగూరి చంద్రారెడ్డి నాడు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేశారు. పోలీసు ఉద్యోగం మానేసి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పరకాల కేంద్రంగా సాయుధ పోరాటం చేసిన యోధుల్లో చివరగా మిగిలిన.. ఆయన ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. -
మొదటి నిమిషమే డైమండ్ అవర్
ములుగు: మోసపోయిన మొదటి నిమిషమే డైమండ్ అవర్ అని బాధితులు హెల్ప్లైన్ నంబర్ 1930కి కాల్ చేస్తే వెంటనే సంబంధిత సొమ్మును రికవరీ చేసేందుకు, నేరస్తుల అకౌంట్ను హోల్డ్లో పెడుతామని ములుగు సైబర్ క్రైమ్ డీఎస్పీ నందిరాం నాయక్ తెలిపారు. సైబర్ క్రైం జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సైబర్ వలలో చిక్కుకుని మోసపోయిన బాధితులు వెంటనే హెల్ప్లైన్ నంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. మొదటి గంటలోపు గోల్డెన్ అవర్లో ఫిర్యాదు చేస్తే సొమ్మును రికవరీ చేసేందుకు 100శాతం అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగుల, వ్యాపారస్తుల డేటాను సేకరించి వారికి అనుసంధానంగా ఉన్న ఏపీకే ఫైళ్లను పంపుతున్నారని తెలిపారు. దీంతో ఫైల్స్ ఓపెన్ చేసి నష్టపోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 5 నుంచి 10 కోట్ల రూపాయలను సైబర్ నేరస్థుల చేతిలో బాధితులు పోగొట్టుకుంటున్నారని వివరించారు. అనవసరమైన ఏపీకే ఫైల్స్ను ఓపెన్ చేసి నష్టం జరిగితే బాధితులు 1930 కాల్ చేస్తే తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి వెళ్తుందన్నారు. వెంటనే సిబ్బంది స్పందించి పోలీసుల అంతర్గత సైట్ ద్వారా డబ్బులు వెళ్లిన అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారని వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయేది ఎక్కువ మంది విద్యావంతులేనని తెలిపారు. ప్రజలు అనవసరమైన లింకుల జోలికి వెళ్లవద్దని డీఎస్పీ వివరించారు. -
ఐసీడీఎస్ను భూస్థాపితం చేసేందుకు కుట్ర
ములుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ను భూస్థాపితం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియాన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క ఆరోపించారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను బండారుపల్లి మూలమలుపు వద్ద పోలీసులు భారీకేడ్లు పెట్టి సోమవారం అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమ్మక్క మాట్లాడారు. 50 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ఉద్యోగం చేస్తున్న అంగన్వాడీలను ప్రీప్రైమరీ పేరుతో అంగన్వాడీలను దూరం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రీ ప్రైమరీ విధులను అంగన్వాడీ కార్యకర్తలకే కేటాయించాలన్నారు. సంఘటన స్థలానికి సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్రావు చేరుకొని అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడి సంబంధిత అధికారిని పిలిపించగా అధికారికి అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు.యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఎస్ఎస్తాడ్వాయి/గోవిందరావుపేట: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని వెంగ్లాపూర్, గోనెపల్లిలోని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సోమవారం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇళ్లు రాని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు. విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. నార్లాపూర్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్స్డేను పురస్కరించుకుని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, డీఈ నాగేశ్వర్రావు, మేడారం జాతర చైర్మన్ లచ్చుపటేల్ పాల్గొన్నారు. అనంతరం గోవిందరావుపేట మండల పరిధిలోని మోట్లగూడెం, తపమంచ, ప్రాజెక్ట్ నగర్ గ్రామాలకు చెందిన అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ పట్టాలను కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సురక్షిత ప్రాంతాల్లోనే ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మొదటి దపాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారులు నిర్ణీత సమయంలో ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు రాని అర్హులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవరాజ్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కములుగు రూరల్: ములుగు మండల పరిధిలోని ఇంచర్ల శివారులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసితులకు భూ పట్టాలను మంత్రి సీతక్క, ఎంపీ బలరా నాయక్లు కలెక్టర్ దివాకరతో కలిసి పంపిణీ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా భూములను పరిశ్రమ నిర్మాణానికి ఇచ్చి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు ఏకో పార్కు సమీపంలో ప్రతీ రైతుకు 20 గుంటల భూమి పట్టాలను అందించినట్లు వివరించారు. రైతులు ముందుకొచ్చి ఆయిల్ పామ్ సాగుకు ముందుకొస్తే సబ్సిడీపై మొక్కలు అందించడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం మేడారం మహాజాతర ఏర్పాట్లపై మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జాతర పనులు చేపడుతామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. -
దోబూచులాడుతున్న గోదావరి
వరద నీటిలో మునిగిన మిర్చి చేనును చూపిస్తున్న రైతు నారాయణ బాబువాజేడు: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు మండలంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. గోదావరి వరద సోమవారం ఉదయం పెరిగి సాయంత్రానికి తగ్గింది. దీంతో మండల కేంద్రం సమీపంలో కొంగాల వాగు పరిసరాలు, బాడువా ప్రాంతంలో వేసిన మిర్చి తోటలు ముంపునకు గురయ్యాయి. రుద్ర సత్యనారాయణ, రుద్ర నారాయణ బాబు, బోదెబోయిన నానబాబు, చిట్టి తిరుపతి రాజు, కొమరం రాములు, మరో రైతుకు చెందిన 14 ఎకరాల్లోని మిర్చి పంట నీట మునిగింది. అలాగే కొంగాల వాగు వరద నీరు రహదారిపైకి వచ్చి చేరింది. అయినప్పటికీ కొందరు వాహనదారులు నీటిలో నుంచే వచ్చి వెళ్లారు. మండల పరిధిలోని టేకులగూడెం సమీపంలో రేగుమాకు వాగు వద్ద గోదావరి వరద పరిస్థితిని వాజేడు ఎంపీడీఓ శ్రీకాంత నాయుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విక్రాంత్ పరిశీలించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ 59గేట్లు ఎత్తివేత కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం వరకు 6,65,870 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరగా సాయంత్రం కాస్త తగ్గి 6,20,290 క్యూసెక్కులకు వచ్చింది. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు బ్యారేజీ 59 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు వదులుతున్నారు. పెరుగుతూ.. తగ్గుతున్న వరద నీట మునిగిన మిర్చి చేలు -
జీఓ నంబర్ 64ను రద్దు చేయాలి
ములుగు: జీఓ నంబర్ 64ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు కలెక్టర్ సర్క్యూలర్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియాన్ ఆధ్వర్యంలో వర్కర్లు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడారు. వర్కర్లకు జీతాలు తగ్గించాలని ఇచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అనంతరం ఆదనపు కలెక్టర్ సంపత్రావుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వర్కర్లు రాజు, యాకలక్ష్మి, స్రవంతి, రాజమ్మ, సమ్మక్క, వసంత, శారద, భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ కలెక్టరేట్ ఎదుట డైలీ వేజ్ వర్కర్ల ధర్నా -
ఒప్పందాలను అమలు చేయాలి
భూపాలపల్లి అర్బన్: గత స్ట్రక్చర్ సమావేశాల్లో జరిగిన ఒప్పందాలకు సర్కులర్ జారీ చేసి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాజ్కుమార్ హాజరై మాట్లాడారు. గతంలో సింగరేణి యాజమాన్యంతో మూడుసార్లు స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అందులో ఒప్పుకున్న సమస్యలను యాజమాన్యం పరిష్కరించలేదన్నారు. అప్పటివరకు సీఎండీతో జరిగే స్ట్రక్చర్ సమావేశాలను బహిష్కరించినట్లు చెప్పారు. కార్మిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. కార్మికులకు రావలసిన వాస్తవ లాభాలు ప్రకటించి వెంటనే మెరుగైన లాభాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని మానుకొని తక్షణమే సమస్యలను పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సన్నధాన్యం బోనస్ చెల్లించాలి
ములుగు: యాసంగి సన్న ధాన్యానికి చెందిన బోనస్ డబ్బులు చెల్లించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ములుగు జాతీయ రహదారిపై నాయకులు ఽరాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్ పాషా మాట్లాడారు. యాసంగి సీజన్లో అమ్మిన సన్నధాన్యం బోనస్ నాలుగు నెలలు అయినా రైతులకు అందలేదన్నారు. 33.786 క్వింటాళ్లకు చెందిన బోనస్ రైతులకు అందాల్సి ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, పంటలకు కనీసం యూరియా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతులకు బోనస్ వెంటనే చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు బానోతు నారాయణ సింగ్, జీవన్ రెడ్డి, మంకిడి కృష్ణయ్య, తిరుపతి రెడ్డి, మహేందర్, యాకయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.రైతుసంఘం ఆధ్వర్యంలో ఎన్హెచ్పై రాస్తారోకో -
పెరుగుతున్న గోదావరి
కన్నాయిగూడెం: జిల్లాలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉరకలేస్తోంది. దీంతో మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి గంటగంటకు పెరుగుతోంది. ఎగువ నుంచి బ్యారేజీలోకి 6,15,780 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగితే పంట నీటమునిగే ప్రమాదం ఉంది. సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు 59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్న నీరు -
మేడారంలో భక్తుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. వనదేవతల దర్శనం అనంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్నవాగు ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. డీజే సౌండ్లతో డ్యాన్స్లు చేసి సందడి చేశారు. హనుమకొండ డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, రమాదేవి భక్తులకు సేవలందించారు. -
గుంతలమయంగా రహదారులు
ఏటూరునాగారం: జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. 163వ జాతీయ రహదారి ఛత్తీస్గఢ్ వైపు, భద్రాచలం–మంగపేట రోడ్డు, వరంగల్– ఏటూరునాగారం రోడ్లు సైతం అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపై నిలిచి కంకర, బీటీ కొట్టుకుపోయి ఫీటు లోతు గుంతలు పడడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ఆదమరిస్తే అంతే సంగతులు అన్నట్లుగా మారాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని తాళ్లగడ్డ ఆశ్రమ పాఠశాల ఎదురుగా రోడ్డుపై గుంతలు పడడంతో వాహనాలు పాఠశాల వైపు నుంచి రాకపోకలు సాగిస్తుండడం ప్రమాదకరంగా మారింది, రామన్నగూడెం గ్రామం, రాంనగర్ –కమలాపురం గ్రామాల మధ్యలోని రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదకరంగా బ్రిడ్జి 163 జాతీయ రహదారిలో జంపన్నవాగు మూడు బ్రిడ్జిలకు ఇరువైపులా నీరు, గడ్డి, ఇసుక నిలిచి ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ అధికారులు బ్రిడ్జిపై నిలిచిన నాచు, నీటిని తొలగించకపోవడం అధికారుల పనితనానికి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. వాహనదారులు, ప్రయాణికులకు తప్పని తిప్పలు ప్రమాదకరంగా జంపన్నవాగు బ్రిడ్జిపైన రోడ్డు కొట్టుకుపోయిన కన్నాయిగూడెం రోడ్డుఆదమరిస్తే అంతే.. కన్నాయిగూడెం నుంచి భూపతిపూర్ వెళ్లే ప్రధాన రోడ్డు, ఛత్తీస్గఢ్– తెలంగాణ సరిహద్దు ప్రధాన రోడ్లు కోతలకు గురయ్యాయి. ఎస్ఎస్ తాడ్వాయి సమీపంలోని కొండపర్తి, జనగలంచ సమీపంలో కాజ్వే వద్ద కోతకు గురై మట్టి ఒర్లిపోయింది. వాహనదారులు దారి వెంట వెళ్లే సమయంలో భయంభయంగా ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్ను రోల్మెడల్గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
నేడు మేడారంలో పర్యటించనున్న మంత్రి సీతక్క
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో నేడు(సోమవారం) రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మేడారాన్ని సందర్శించి మహాజాతర ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. పూజారులతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు తెలిసింది. జీఓ నంబర్ 64ను రద్దుచేయాలి ఏటూరునాగారం: జీఓ నంబర్ 64ను రద్దు చేసి గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. సీపీఎం, డైలీవేజ్ వర్కర్ల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట చేపట్టిన సమ్మెకు వెంకట్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. కలెక్టర్ సర్కులర్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, జీతాలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో నంబర్ 64ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, హాస్టల్ వర్కర్లు రెండు రోజులుగా ఐటీడీఏ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెల జయలక్ష్మి, కొప్పుల కమల, సంతోష్, సత్యం, సాంబయ్య, మాణిక్యం, రమణయ్య పాల్గొన్నారు. దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్ ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో అక్టోబర్ 2న నిర్వహించనున్న దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలకు అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శివాజీ, ఓడ రాజు, దేవేందర్, రమేష్, నరేందర్రెడ్డి, సంపత్, సురేశ్, శ్రీహరి, కార్యదర్శులుగా లకావత్ రాజు, గందె రాజు, పవన్, శ్రీనాధ్, కోశాధికారిగా జనార్ధన్, నాగరాజు, కన్వీనర్గా పాడ్య కుమార్లను ఎన్నుకున్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.20.40 లక్షలు మంజూరు మంగపేట: మండల పరిధిలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుతో పాటు మంగపేట నుంచి కాటాపురం వెళ్లే రోడ్డు, కాజ్వేల మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.20.40 లక్షల ప్లడ్ డ్యామేజ్ నిధులను కేటాయించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు రోడ్లు, కల్వర్టులు కోతకు గురికావడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ. 5కోట్లు మంజూరు చేసింది. ఇదే క్రమంలో ఈ నెల 6వ తేదీన ప్రయాణం సాహసమే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క మండలానికి రూ.20.40లక్షల నిధులు కేటాయించగా మండల ప్రజలు సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాంనాయక్ తెలిపారు. ఏరియాలోని మిలీనియం క్వార్టర్స్ సమీప నర్సరీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి సీఎండీ ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వలనే వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. మొక్కలు నాటడం వలన భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతాయన్నారు. తాను స్వయంగా 20,377 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఆదివారం 377 మొక్కలను సీఎండీ నాటారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ సూర్యనారాయణ, జీఎం రాజేశ్వర్రెడ్డి, ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం/ములుగు రూరల్: గిరిజన ఆ శ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల న్యా యమైన కోర్కెలు పరిష్కరించాలని సీఐటీయూ జి ల్లా అధ్యక్ష,కార్యదర్శులు రత్నం రాజేందర్, ఎండీ. దావూద్ అన్నారు. జీఓ నంబర్ 64ను రద్దు చేయాలంటూ జేఏసీ పిలుపు మేరకు నిరవధిక సమ్మెను శుక్రవారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట చేపట్టారు. సమ్మెకు దావూద్ హా జరై మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను, కాంటింజెంట్, పార్ట్టైం వర్కర్లకు 2021 జూన్ 15న బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో విడుదల చేసిన జీఓ నంబర్ 64 ప్రకారం వేతనాలు చెల్లిస్తే వేతనాలు పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉందన్నారు. వర్కర్ల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఏసీ గదులకే పరిమితం అయితే కార్మికుల కష్టాలు ఎలా తెలుస్తాయన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, 2014లో నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 212ను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కమల, సమ్మ క్క, సంతోషా, లక్ష్మీ, సత్యం,రాజు,రత్నం ప్రవీణ్ బాలేశ్వర్, కోట య్య, తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ కానుక..
వెంకటాపురం(ఎం): బతుకమ్మ పండుగకు మహిళలకు ఇందిరమ్మ చీరలు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఒక్కొక్కరికి రెండు చీరలు ఈనెల 22 నుంచి ఉచితంగా రెండు విడతల్లో అందించనున్నారు. ఒక్కో చీర ధర రూ.800 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 76,469 మందికి.. 1,52,938 చీరలు జిల్లాకు 10 మండలాల పరిధిలో 171 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 9 మండల సమైఖ్యలు ఉండగా 355 గ్రామ సమైఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 7,019 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. 76,469 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున 1,52,938 చీరలు జిల్లాకు రావాల్సి ఉంది. జిల్లాకు వచ్చే ఇందిరమ్మ చీరలను నిల్వ చేసేందుకు డీఆర్డీఏ అధికారులు ములుగు, గోవిందరావుపేట, ఏటూరునాగారం మండలాల్లో గోదాంలను కేటాయించారు. ఆరున్నర మీటర్లు గల ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు 1,44,478, తొమ్మిది మీటర్లు గల పాలికాట్ చీరలు 8,460 జిల్లాకు రానున్నాయి. ఈనెల 22 నుంచి 30 వరకు మహిళలకు చీరలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు విడతల్లో పంపీణీ ఈనెల 22వ తేదీ నుంచి చీరలు అందించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు రేషన్ దుకాణాలకు చెందిన డీలర్ల ద్వారా ఒకరికి ఒక చీర చొప్పున అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఈసారి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు మాత్రమే రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల పరిధిలోని గ్రూపుల వారీగా సభ్యుల వివరాలు సేకరించి మండలాల వారీగా కావాల్సిన చీరల జాబితాను ప్రభుత్వానికి పంపించారు. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున ఒకటి, సద్దుల బతుకమ్మకు మరో చీరను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. చీరలను ప్రత్యేక సంచిలో ప్యాక్ చేసి ఇవ్వనున్నారు. ఆ సంచిపై ఇందిరాగాంధీ ఫొటో, ఇందిర మహిళా శక్తి లోగోతో పాటు శ్రీఅక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుకశ్రీ అని రాసి ఉండనుంది. సీఎం రేవంత్రెడ్డితో పాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురి మంత్రుల ఫొటోలను ముద్రించారు. మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే.. ఒక్కొక్కరికి రెండు చీరలు ఈనెల 22నుంచి పంపిణీకి ఏర్పాట్లుమండలం మహిళలు చీరలు ములుగు 17,043 34,086 మంగపేట 12,535 25,070 వెంకటాపురం(ఎం) 8,438 16,876 గోవిందరావుపేట 7,959 15,918 ఏటూరునాగారం 7,544 15,088 వెంకటాపురం(కె) 7,522 15,044 తాడ్వాయి 6,183 12,366 వాజేడు 6,002 12,004 కన్నాయిగూడెం 3,245 6,490 -
17నుంచి స్వస్తు నారీ స్వశక్తి పరివార్ అభియాన్
ములుగు రూరల్ : ఈ నెల 17నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వస్తు నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధి కారి గోపాల్రావు అన్నారు. శుక్రవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ గోపాల్రావు మాట్లాడుతూ కార్యక్రమాలను వైద్యాధికారులు, సూపర్వైజర్లు పర్యవేక్షించినప్పుడే ప్రభుత్వ నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కువ ప్రసవాలు అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ చంద్రకాంత్, పవన్కుమార్, శ్రీకాంత్ రణధీర్, సంపత్ ఉన్నారు. ములుగు రూరల్ : మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం బీమా వర్తింపజేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మల్లంపల్లి యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. భోజనం తయారు చేస్తున్న సమయంలో కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు గున్నాల రాజకుమారి, పద్మ, శ్రీనివాస్, కమల, రాధ, భగ్య, కనుకలక్ష్మీ, పూల, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్ : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దేవగిరిపట్నం జిల్లా పరిషత్ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మోటారు వెహికిల్ చట్టం, బా ల్యవివాహ నిరోధక, బాలకార్మిక చట్టాల గు రించి వివరించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ పోక్సో, నిర్భంద విద్యాహక్కుల చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏజీపీ బా లుగు చంద్రయ్య, ప్రధానోపాద్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గోవిందరావుపేట : కోతుల బారి నుంచి ప్రజలను రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ అన్నారు. మండలంలో రో జురోజుకి కోతుల బెడద తీవ్రమవుతుందని వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో పస్రా సెంటర్లో శుక్రవారం భారీ ర్యాలీ తీసి గ్రామ పంచా యతీ, ఫారెస్ట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ మండలంలో విచ్చలవిడిగా కోతులు వీరంగం సృష్టిస్తున్నాయని పగలు, రాత్రి తేడా లేకుండా ఇళ్లలోకి వస్తున్నాయని, ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం, గ్రామ పంచాయతీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను సమన్వయపరిచి కోతులబెడద నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్/గోవిందరావుపేట: మద్యం తాగి వాహనాలు నడుపొద్దని ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. గతంలో మద్యం తాగి పట్టుబడిన 91 మందిని శుక్రవారం కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై తెలిపారు. దీంతో ములుగు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి 85 మందికి రూ.1.68 లక్షల జరిమానా విధించినట్లు తెలి పారు. ఆరుగురు వ్యక్తులకు రెండు రోజుల సాధారణ శిక్షతో పాటు రూ.12 వేలు జరిమానా విధించినట్లు వెల్లడించారు. -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మల ను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు అఽ దిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల గ ద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర సారె, కానుకలు, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించి మొ క్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరా జు లకు పూజలు చేశారు.అమ్మవార్లకు యాటలను, కో ళ్లను మొక్కుగా సమర్పించారు. మొక్కుల అనంత రం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చే సుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు జగదీశ్వర్, మధు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. -
పరిహారం కోసం ఐక్యంగా ఉద్యమించాలి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం ప్రాంత రైతులకు పంట నష్ట పరిహారం ప్రభుత్వం చెల్లించేంత వరకు రైతుల పక్షాన ఐక్యంగా ఉద్యమించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కొత్తూరులో జాతర పంట నష్టపరిహార సాధన సమితి అధ్యక్షుడు అల్లెం కృష్ణార్జున్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథులుగా బీర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, బీజేపీ జి ల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, సీపీఎం రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి, జి ల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మేడారం జాతర సందర్భంగా రెండో పంట సా గుచేయకుండా నష్టపోతున్న మేడారం, ఊరట్టం, నార్లాపూర్, వెంగళపూర్, రెడ్డిగూడెం, కన్నెపల్లి రైతులకు ఎకరానికి రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పంట నష్టపరిహార సాధన సమితి చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. పరిహారానికి సంబంధించిన ప్రభుత్వ జీఓ ఇచ్చేంత వరకు రైతులు ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మేడారం ప్రాంత రైతుల ప్రధాన సమస్య అయినటువంటి జంపన్నవాగు, తూముల వాగుపై కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచులు శ్రీధర్, బాబు రావు, అరుణ, కమిటి ఉపాధ్యక్షులు హనుమంత రెడ్డి, శ్రీను కిరణ్, రమేష్, మొక్క నరేందర్, ప్రధా న కార్యదర్శులు చర్పా చంద్రశేఖర్, ముర్తేష్, నరేష్, ప్రణయ్. బీఆర్ఎస్, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు శివరాజ్, శ్యామ్ ప్రసాద్, స్వరూప, బుచ్చ య్య, ఆలేం అశోక్, మహిళా అధ్యక్షురాలు సరో జన, ప్రధాన కార్యదర్శి కొప్పుల బతుకమ్మ, తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష నాయకుల పిలుపు ఎకరానికి రూ. 50వేలు చెల్లించాలని డిమాండ్ -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించాలి
ములుగు: దరఖాస్తులను నిష్పక్షపాతంగా పరిశీలించి భూ రికార్డులను ప్రామాణికంగా రూపొందించాలని కలెక్టర్ దివాకర సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్లతో కలిసి గురువారం సాదాబైనామాల దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, భూ పరమైన వివాదాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన సాదాబైనామాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అందులో ఎన్ని నోటీసులు జనరేట్ చేసి సర్వే ప్రక్రియ పూర్తి చేశారు, పెండింగ్లో ఉన్న వాటి కారణాల గురించి తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ ఉన్న మండలాల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్డీఓ లాగిన్లో ఉన్న విరాసిత్, మిస్సింగ్ సర్వే నంబర్లు, పేరు, సర్ నేమ్, తదితర పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని తెలిపారు. భూ భారతి అప్లికేషన్లో నమోదవుతున్న సాదాబైనామాలు, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, గ్రీవెన్స్ దరఖాస్తుల పరిశీలన, ధ్రువీకరణలో వేగం పెంచాలని ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు, కలెక్టరేట్ కార్యాలయ పర్యవేక్షకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
అటవీ అమరుల త్యాగాలు మరువలేనివి
ములుగు రూరల్: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవి సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పాటుపడి ప్రాణాలు కోల్పోయారని వారి సేవలను కొనియాడారు. అటవీ సంపద పరిరక్షణ ప్రతీవ్యక్తి బాధ్యతని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ములుగు పరిధిలో 35, ఏటూరునాగారం పరిధిలో 31 యూనిట్ల రక్తాన్ని సేకరించి అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ డోలి శంకర్, సిబ్బంది పాల్గొన్నారు. వైద్యశిబిరం ఏటూరునాగారం: అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ ఉద్యోగులు గురువారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ అడవుల రక్షణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను విస్మరింఝ ద్దని సూచించారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనాలతో బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 31 మంది అధికారులు, ఉద్యోగులు కార్యాలయంలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), దూలాపురం అటవీ రేంజ్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
● రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంకట్రెడ్డి ములుగు రూరల్: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ దివాకరను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించాలన్నారు. లేని పక్షంలో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైతులకు యూరియా అందించాలని కోరారు. రబీ సీజన్లో వడగండ్ల వానల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. జిల్లాలో 2,993 ఎకరాల్లో రూ.5.72కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని వివరించారు. యాసంగి సన్నదాన్యానికి బోసన్ డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రత్నం రాజేందర్, కొర్ర రాజు, కృష్ణారావు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులు మాత్రమే ఎంపిక
ఏటూరునాగారం: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు సాగునీటిని అందించేందుకు సౌర జల గిరివికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జనవరి నుంచి అధికారులు సర్వేలను ముమ్మరంగా చేపట్టారు. 2025–26 వరకు ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఐటీడీఏ అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఉన్న గిరిజనులు సాగుచేస్తున్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తించే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపకల్పన చేసింది. అయితే ఈ సర్వేల ద్వారా ఇప్పటి వరకు 250 ఎకరాలను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం 560 మందికి పథకం వర్తింపజేయాలని ఐటీటీఏకు టార్గెట్ను కేటాయించింది. దీంతో ఐటీడీఏ అధికారులు ఆర్ఓఎఫ్ఆర్ భూములు కలిగిన రైతుల వద్దకు వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. జీసీఎస్ద్వారా ఆ భూములను గుర్తించి అర్హులైన రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల కలెక్టర్ దివాకర సైతం అధికారులతో సమీక్షించి ఈ పథకాన్ని అతి త్వరలో గ్రౌండింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. రెండు ఎకరాలకు పైనే.. రెండు ఎకరాలకు పైగా సాగు భూమి కలిగిన రైతులనే అర్హులుగా పరిగణలోకి తీసుకుంటారు. రెండు ఎకరాల కంటే తక్కువ ఉంటే పక్కనే ఉన్న గిరిజన రైతు భూమిని కలిసి ఒక యూనిట్ను మంజూరు చేస్తారు. ఇలా రెండు నుంచి ఆపైన భూమి కలిగి ఉన్న గిరిజన రైతులను ఇందిర సౌర జల గిరివికాసం పథకాన్ని అప్పగించనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ అనేక మంది గిరిజన దర్బార్లో రైతులు వినతులు సమర్పిస్తున్నారు. వాటి ఆధారంగా సర్వేలు చేయడంతో పాటు నేరుగా వచ్చి దరఖాస్తులు చేసుకున్న వారితో పాటు అర్హులైన రైతుల భూములను కూడా పరిశీలించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఒక్క యూనిట్కు రూ.6 లక్షలు గిరిజనుల ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూమిలో రైతుకు సోలార్ ప్యానెల్, బోరు, మోటారు ఇతర సామగ్రిని అందించడానికి ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా రూ.6 లక్షలతో ఒక యూనిట్ను మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ మంజూరైన రైతు పొలంలో బోరును దింపి సోలార్ ప్యానెల్తో త్రీఫేజ్ విద్యుత్ వచ్చేలా సౌకర్యాలు ఏర్పాటు చేసి మోటారు బిగించి సాగునీరు అందేలా చూస్తారు. దీంతో ఒక రైతుకు రూ. 6 లక్షలు విలువ చేసే యూనిట్ దక్కనుంది. అయితే సర్వేలు పూర్తికాగానే యూనిట్ను మంజూరు చేసేందుకు ఐటీడీఏ పీఓ కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. దీంతో గిరిజనులకు సాగునీటి కష్టాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో విద్యుత్ సరఫరా లేక అటవీ హక్కుల భూములకు మోటార్లను బిగించుకోలేక, పంటలు పండించక భూములు పడావు పడి ఉన్నాయి. ప్రస్తుతం సోలార్ వసతితో రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే 560 మందికి పథకం వర్తించేలా ఐటీడీఏకు టార్గెట్ -
వాగు దాటి వైద్యం చేసిన సిబ్బంది
వెంకటాపురం(కె): వాగు దాటి వైద్య ఆరోగ్య సిబ్బంది ఆదివాసీలకు వైద్యం చేశారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని పరిధిలోని సీతారాంపురం గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో పూసు వాగు అడ్డుగా ఉంటుంది. ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ద్విచక్ర వాహనాలపై వాగు వరకు వైద్య సిబ్బంది వెళ్లారు. వాహనాలను వాగు వద్ద పెట్టి వాగు దాటి రెండు కిలో మీటర్లు నడిచి గ్రామానికి చేరుకున్నారు. మాతా శిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది మలేరియాపై ఇంటింటా సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చి రక్త నమూనాలు సేకరించారు. తాగునీటి బావిని పరిశీలించి క్లోరినేషన్ చేశారు. గ్రామంలో నిల్వ ఉన్న నీటిని ఇంటింటా తిరిగి పార బోశారు. ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినాలని సూచించారు. డెంగీ, మలేరియా రాకుండా జాగ్రత్తలను పాటించాలని, నీటితో ఉన్న డ్రమ్ములు, గోలాలపై మూతలను పెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఈఓ కోటిరెడ్డి, వెంకట రమణ, నాగమణి, సమ్మక్క, మోహన్ ఉన్నారు. -
ఓటరు తుది జాబితా ప్రదర్శన
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండల పరిషత్ సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ సభ్యుల (జెడ్పీటీసీ) తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాను జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.సంపత్రావు బుధవారం విడుదల చేశారు. ఈ నెల 8లోపు అభ్యంతరాలు స్వీకరించి, 9న అభ్యంతరాలు పరిష్కరించి, బుధవారం పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటి పరిధిలో మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు.మండలం గ్రామ ఎంపీటీసీలు ఓటర్లు పంచాయతీలువెంకటాపురం(ఎం) 23 9 28,236 ఏటూరునాగారం 12 9 24,636 గోవిందరావుపేట 18 9 25,441 కన్నాయిగూడెం 11 5 9,992 మల్లంపల్లి 10 5 13,507 మంగపేట 25 14 39,369 ములుగు 19 9 24,985 ఎస్ఎస్ తాడ్వాయి 18 7 18,226 వెంకటాపురం(కె) 18 9 25,336 వాజేడు 17 7 19,431 171 గ్రామపంచాయతీలు 473 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు -
ప్రతిభను వెలికితీసేందుకే పోటీలు
ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే కళాఉత్సవ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా విద్యాధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సమగ్రశిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కళాఉత్సవ్ పోటీలు జరగగా డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించగా అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, కోఆర్డినేటర్ సాంబయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందాల రామయ్య, సముద్రాల శ్రీనివాసచారి, హమీద్, బాలాజీ రవి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక ఈ కళాఉత్సవ్ పోటీల్లో బండారుపల్లి తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన విద్యార్థి దీక్షరామ్ క్లాసికల్ డ్యాన్స్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎంఈఓ మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని డీఈఓ సిద్ధార్థరెడ్డి, పాఠశాల హెచ్ఎం దేవకి, సిబ్బంది అభినందనలు తెలిపారు. అదే విధంగా ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు కళాఉత్సవ్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారని ఎంఈఓ మల్లయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రూప్ డ్యాన్స్ , ఫోక్లో హర్షవర్ధన్, ఉమా మహేష్, రిషీక్, సాయినాధ్, కార్తీక్, వరుణ్, సందేశ్ల బృందానికి ప్రథమ బహుమతి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు వారు రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2025కు ఎంపికై నట్లు ఆయన వివరించారు.జిల్లా విద్యాధికారి సిద్ధార్థరెడ్డి -
మద్యం టెండర్లకు కసరత్తు
ఉమ్మడి వరంగల్లో జిల్లాల వారీగా మద్యం దుకాణాలుసాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది.జిల్లా వైన్స్లు హనుమకొండ 65వరంగల్ 63జనగామ 47మహబూబాబాద్ 59జేఎస్ భూపాలపల్లి ములుగు 60294మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు -
మరింత సహకారం
రైతు ఉత్పత్తి సంఘాలుగా పీఏసీఎస్లుములుగు రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందించడం, వసూలు చేయడానికి పరిమితమైన పీఏసీఎస్లు రూపు మార్చుకోనున్నాయి. విడతల వారీగా సంఘాలను ఆధునికీకరించడంతో పాటు రైతులకు ఆదాయం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రైతు ఉత్పత్తి సంఘాలను(ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) మార్పు చేసింది. ఈ మేరకు జిల్లాలో 8 సంఘాలను ఎంపిక చేసింది. 10 మండలాలు.. 12 సంఘాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో రైతు ఉత్పత్తి కేంద్రాలుగా 8 సంఘాలు ఎంపికయ్యాయి. ఈ సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులే సంఘాలుగా ఏర్పడి తమ పంట ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. దీంతో పాటు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు ఇవ్వనుంది. డ్రోన్, రోబోటిక్స్ వంటి యంత్రాల వినియోగంపై సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మార్కెటింగ్, ధాన్యం నిల్వలు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ, పాల ఉత్పత్తి సంఘాల ఏర్పాటు, శీతల గిడ్డంగుల నిర్మాణం, జౌషది కేంద్రాల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయ పరికరాల విక్రయం, మత్స్యకేంద్రాల నిర్వహణ వంటి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తారు. నిర్వహణ ఖర్చులు మంజూరు రైతు ఉత్పత్తి కేంద్రాలుగా ఎంపికై న పీఏసీఎస్లకు ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడేళ్లకు రూ.18లక్షలు నిర్వహణ ఖర్చుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీంతో పాటు అదనంగా రూ.15 లక్షలు ఈక్విటి గ్రాంట్ విడుదల చేస్తుంది. ఒక్కో ఎఫ్పీఓకు క్రెడిట్ గ్యారంటరీ కింద రూ. 2 కోట్ల వరకు గ్యారంటీ సదుపాయం లభిస్తుంది. జిల్లాలో 8 సొసైటీల ఎంపిక ప్రభుత్వ నిధులతో వ్యాపారం రైతుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులుజిల్లాలో మొత్తం 12 సంఘాలు ఉండగా అందులో 8 సంఘాలు రైతు ఉత్పత్తి కేంద్రాలుగా ఎంపికయ్యాయి. సంఘాల అభివృద్ధితో పాటు సొసైటీల పరిధిలో ఉన్న రైతులు ఐకమత్యంతో వ్యాపారం చేసుకోవడానికి వీలుకలుగుతుంది. సంఘాల పరిధిలోని రైతులకు ఆధునాతన వ్యసాయం, యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తారు. – సర్దార్సింగ్, జిల్లా సహకార అధికారి -
ఏజెన్సీ విద్యపై దృష్టి సారించాలని వినతి
వెంకటాపురం(కె): ఏజెన్సీ మండలాల్లో విద్యా వ్యవస్థపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ బుధవారం ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్ధరెడ్డికి వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ వెంకటాపురం, వాజేడు మండలాల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్నారు. విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ఒక్కరే ఉంటున్నారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 11 మంది విద్యార్ధులకు ఒక్క ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉండగా 30 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయని తెలిపారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు కేవలం కేర్ టేకింగ్ స్కూల్స్గానే నడుస్తున్నాయని తెలిపారు. విద్యాబోదన సరిగా ఉండడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజయ్, మహేష్, నారాయణ, నర్సింహరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి
ములుగు రూరల్: వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా సంక్షేమాధికారి తుల రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోని పక్షంలో సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారు కలెక్టర్ లేదా ఆర్డీఓను సంప్రదించాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార మార్గం చూపుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో బాసాని రాంమూర్తి, అసోసియేషన్ అధ్యక్షుడు దామెర నర్సయ్య, దామోదర్, యుగేందర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్గా బాసాని రాంమూర్తి, కో కన్వీనర్లుగా వెంకట్రెడ్డి, చందర్రావు, సంజీవరావులను ఎన్నుకున్నారు. ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని బీసీ వెల్ఫేర్ అధికారి తులరవి అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్థంతిని జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ అధికారి తుల రవి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ మహిళా శక్తికిప్రతీకగా నిలిచారన్నారు. భూస్వాముల దౌర్జన్యాలకు తలొగ్గకుండా రైతుల పక్షన నిలబడి పోరాడిన వీరవనిత అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు రమేష్, చాపర్తి రాజు, మహేందర్, పరికరాల రవి, గూడెళ్లి ఓదెలు, నేరెళ్ల శంకర్, జాలిగం శ్రీనివాస్, భద్రయ్య, సారంగపాణి, బీసీ వెల్పెర్శాఖ అధికారులు సరిత, మానస, కుమారస్వామి, ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా సంక్షేమాధికారి తుల రవి -
కాంగ్రెస్ పాలనలోనే సొంతింటి కల సాకారం
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర –శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మదనపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి బుధవారం హాజరై మాట్లాడారు. జిల్లాలో 5వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గిరిజనభవన్లో నిర్వహించిన కృతజ్ఞత సన్మానసభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ ఉపకులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో నియోజకవర్గంలో 100ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో ఎస్సీ ఉపకులాలకు కమ్యూనిటీ భవన నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్కను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గడ్డం వెంకటేశ్వర్లు, కుమారస్వామి, రమేష్, గోపాల్ వెంకటరాంనర్సయ్య, రాజమౌళి, రమేష్ పాల్గొన్నారు. రూ.4లక్షల డిపాజిట్ పత్రాలు అందజేత ములుగు మున్సిపాలిటీ పరిధిలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి బాధితుడి పిల్లల పేరున రూ.4లక్షల డిపాజిట్ చేసిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేష్ మృతికి కారణమైన ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం మహేష్ మరణాన్ని వాడుకుంటున్నారని వివరించారు. అనంతరం మదనపల్లి గ్రామానికి చెందిన దూడపాక మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ములుగు/వెంకటాపురం(ఎం)/గోవిందరావుపేట: జిల్లా కేంద్రంలోని అంతర్గత రోడ్లు, గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి మదనపల్లి వరకు రూ.4 కోట్లతో విస్తరించనున్న రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మహిళా శక్తి పథకం ద్వారా ఇద్దరు మహిళలకు రూ.10లక్షల విలువ చేసే మొబైల్ ఫిష్ ఔట్లేట్ వాహనాలను మంత్రి సీతక్క అందజేశారు. ఈక పద్మ, కట్ల శిరీషలకు 60శాతం సబ్సిడీపై వాహనాలను అందించారు. వీహబ్ ఆధ్వర్యంలో ర్యాంప్ ఉమెన్ ఆక్సెలేరేషన్ ప్రోగ్రాంపై అవగాహన సదస్సు నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషన్ సంపత్, జిల్లా మత్స్యశాఖ అధికారి సల్మాన్రాజ్, ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, వీహబ్ సీఈఓ సీత, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆసోసిఝెట్ డైరెక్టర్ ఊహా, డీఆర్డీఓ శ్రీనివాస్రావు, కోఆర్డినేటర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని సింగరకుంటపల్లి పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 20 లక్షలు, నర్సాపూర్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.40లక్షలు, నారాయణగిరిపల్లి అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.12లక్షలు, నారాయణగిరిపల్లెలో రూ.45లక్షలతో నిర్మించనున్న అంతర్గత రోడ్ల పనులకు కలెక్టర్తో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన 495 కుటుంబాలకు, గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టునగర్లో 149 కుటుంబాలకు యునైటెడ్ వే, ఇన్ఫోసెస్ సంస్థల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంటనష్ట పరిహారంపై సానుకూలం ఎస్ఎస్తాడ్వాయి: మేడారం రైతుల పంటనష్ట పరిహారంపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు. మంగళవారం మేడారానికి వచ్చిన మంత్రి సీతక్కను పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షుడు చర్పా రవీందర్ల ఆధ్వర్యంలో మేడారం ప్రాంతంలోని రైతులు పంట నష్టపరిహారం ఇప్పించాలని మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. జాతర సమయంలో భక్తుల వాహనాలు పార్కింగ్ కోసం 1500 ఎకరాలు నష్ట పోతున్నారని సీతక్కకు వివరించగా పరిహారం ఇప్పించేందుకు వెంటనే సర్వే నిర్వహించి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ముజఫర్, నాయకులు పీరీల వెంకన్న, జంగా వెంకటేశ్, వీరమోహన్ రావు, రాజయ్య, బాపురెడ్డి, పోడెం బాబు రైతులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి సీతక్క -
కాళోజీ సేవలు మరువలేనివి
● అదనపు కలెక్టర్ సంపత్రావు ములుగు రూరల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని అదనపు కలెక్టర్ సంపత్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కాళోజీ నారాయణరావు తెలుగు సాహిత్యం, ప్రజా ఉద్యమాల్లో చేసిన కృషి విశేషమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజ్కుమార్, సూపరింటెండెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో.. ములుగు: అదే విధంగా ములుగు మున్సిపల్ కార్యాలయంలో కాళోజీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గోవిందరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మమత, అధికారులు లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలి
హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్నిర్మాణంలో వేగం పెంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలన్నారు. మంగళవారం హనుమకొండ అదాలత్ కూడలిలోని రాచకొండ ప్రవీణ్ నివాసంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల వివక్షకు గురికాగా, స్వరాష్ట్రంలో కల్వకుంట్ల పాలకుల కుటుంబ ప్రయోజనాల కోసం వరంగల్ జిల్లాను ముక్కలు చెక్కలు చేసి తీవ్ర విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించిన మేరకు వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.6,000ల కోట్ల అభివృద్ధి నిధులను సమకూర్చి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మామునూరు ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన అమలు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక కోఆర్డినేటర్ సోమ రామమూర్తి, ఆయా సంఘాల నాయకులు రాచకొండ ప్రవీణ్, సోమిడి శ్రీనివాస్, చాపర్తి కుమార్ గాడ్గే, సోయం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ -
మహిళ ఆరోగ్యం..
జిల్లాలో మహిళల కోసం నాలుగు ఆరోగ్య క్లినిక్లుఇంటికి సౌభాగ్యంవెంకటాపురం(ఎం): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. మహిళల కోసం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళ క్లినిక్లను ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంత పేద మహిళలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో 2023 మార్చి 8న గత ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్ సెంటర్లను ప్రారంభించి మహిళలకు వైద్య సేవలు అందిస్తుంది. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ప్రతీ మంగళవారం వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. 33,788 మంది మహిళలకు పరీక్షలు జిల్లాలోని వెంకటాపురం(ఎం), మంగపేట, రొయ్యూరు, ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య క్లినిక్ల ద్వారా ఇప్పటి వరకు 33,788 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఇందులో అనుమానిత లక్షణాలు ఉన్న 287 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇందులో నోటి, రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ లక్షణాలు, థైరాయిడ్, కడుపులో నీటి బుడగలు లాంటివి ఉన్న వారిని జిల్లా ఆస్పత్రితో పాటు వరంగల్ ఎంజీఎం, హైదారాబాద్లోని ఎంఎన్జే ఆస్పత్రికి సిఫారసు చేస్తున్నారు.● పీహెచ్సీల్లో ప్రతీ మంగళవారం పరీక్షలు ● ఇప్పటి వరకు 33,788 మందికి పరీక్షలు ● 18 మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తింపుప్రాథమిక దశలోనే గుర్తింపు ప్రతీ మంగళవారం మహిళా క్లినిక్ల ద్వారా వైద్య సిబ్బంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతీ మహిళకు ప్రాథమిక పరీక్షలు జరిపి వ్యాధిని నిర్ధారించడం, అనుమానితులను జిల్లా ఆస్పత్రులకు సిఫారసు చేస్తున్నారు. వ్యాధి గుర్తిస్తే ఉచితంగా వైద్య చికిత్సలు చేసి మందులు అందజేస్తున్నారు. మహిళలు ఆరోగ్య సమస్యలతో పాటు పలు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. జిల్లాలో 18 మంది వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వ్యాధి తీవ్రమైన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా ప్రాథమిక దశలోనే పరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యాధికారులు మహిళలకు సూచిస్తున్నారు. మహిళలు తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి మహిళలు ఏమైనా అనుమానిత లక్షణాలు ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా పూర్తిగా వ్యాధిని నయం చేయవచ్చు.18 ఏళ్లలోపు ఆడపిల్లలకు థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటున్నందున తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు, యువతులు మంచి పోషకాహారం తీసుకోవాలి. – చీర్ల శ్రీకాంత్, మాతా శిశుపోషక జిల్లా అధికారి ● -
పంట నష్టపరిహార మహిళా సాధన కమిటీ ఎన్నిక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతర పంట నష్ట పరిహార మహిళ సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ కమిటీ గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం మేడారంలో కమిటీ అధ్యక్షుడు కృష్ణాఅర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మహిళ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా జాలిగాపు సరోజన, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల బతుకమ్మ, ఉపాధ్యక్షులుగా నాలి ప్రతిభ, దానుక దేవమ్మ, చింత సునీత, గడ్డం సంధ్యారాణి, కార్యదర్శులుగా బోడ స్వరూప, జంగ వసుమతి, ఈక సుగుణ, ప్రచార కార్యదర్శులుగా దేవులపల్లి భద్రమ్మ, బానూరి రజిత, అల్లెం సరోజన, రాధమ్మలను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని కొత్తూరులో 12న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి రైతులు, కుల సంఘాలు, రాజకీయ నాయకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు బాబురావు, గడ్డం అరుణ, నాయకులు సిద్ధబోయిన శివరాజ్, జంగా హన్మంతరెడ్డి, సోలం వెంకన్న సతీష్, సంకె ప్రణయ్ పాల్గొన్నారు. -
సేవలు అందట్లే..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మూడేళ్లుగా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో గర్భిణులు, పిల్లలు, బాలింతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఇన్చార్జ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు ప్రాజెక్టులు.. జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్ అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 644 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 40 టీచర్, 120 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయడం లేదు. పదవీ విరమణ పొందిన వారితో పాటు విధుల్లో మరణించిన వారితో ఖాళీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు పనిభారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. టీచర్లు, హెల్పర్లది కీలక పాత్ర... ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పలు రకాల సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బూత్ లెవెల్ అధికారులుగా ఎన్నికల విధుల్లో సేవలు అందిస్తున్నారు. ఖాళీలు భర్తీ అయితే వీరికి పనిభారం తగ్గడంతోపాటు, కేంద్రాల్లో మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఖాళీలు ఉన్న కేంద్రాల్లో ఇన్చార్జ్లను నియమించాం. ఎప్పటికప్పుడు సీడీపీఓలు, సూపర్వైజర్లు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – మల్లీశ్వరి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి మూడేళ్లుగా భర్తీకాని టీచర్, ఆయా పోస్టులు అంగన్వాడీల్లో ఇన్చార్జ్లతో కార్యకలాపాలు ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, పిల్లలు, బాలింతలు -
పరిష్కారం ఏదీ?
ములుగు రూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లు రాలేదని ఒకరు, పింఛన్ మంజూరు చేయాలని వృద్ధుడు, ఉపాధి కల్పించాలని మరొకరు.. ఇలా జిల్లా వ్యాప్తంగా పలువురు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అర్జీదారుల నుంచి కలెక్టర్ దివాకర దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రీవెన్స్లో మొత్తం 49 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను సత్వర పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కాని దరఖాస్తులు అర్జీదారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా దరఖాస్తులు ఇలా.. ప్రజావాణిలో మొత్తం 49 దరఖాస్తులు రాగా గృహ నిర్మాణ శాఖ 13, భూ సమస్యలు 10, పెన్షన్ 9, ఉపాధి కల్పన 2, ఇతర శాఖలకు సంబంధించినవి 15 దరఖాస్తులు వచ్చాయి. ఏటూరునాగారం: గిరిజన దర్బార్లో గిరిజనులు సమర్పించిన వినతులను పరిశీలించి వాటికి పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపడుతామని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం 16 మంది గిరిజనుల నుంచి వినతులను స్వీకరించారు. ఏటూరునాగారం మండలం ఎస్టీ నాయకపోడు చెందిన గిరిజనులమని, గోదావరి నది ప్రాంతానికి దగ్గర ఉండడంతో వరదలు వస్తే ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని, తమకు ఇంటి స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. వెంకటాపురం(కె) మండలం సీతారాంపురం గ్రామంలో రోడ్డు, పూసూరు వాగుపై కాజ్వే నిర్మించి రవాణా మార్గం ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఏటూరునాగారం మండలం లంబాడీతండాకు చెందిన గిరిజనుడు ఈఎస్ఎస్లో మంజూరు అయిన కెనరా బ్యాంక్లో సబ్సిడీ జమ అయిన డబ్బులను ఇవ్వడం లేదని, వాటిని ఇప్పించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. కన్నాయిగూడెం మండలం సర్వాయిగ్రామంలో సమ్మక్క సారలమ్మ గుడి వెళ్లే దారిని మరమ్మతు చేయాలని విన్నవించారు. తాడ్వాయి మండలం ఒడ్డుగూడెంలో త్రీఫేజ్ కరెంటు, వ్యవసాయ పంటలకు బోర్లు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఇలా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని పీఓకు విన్నవించారు. వినతులు పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, జీసీసీ డీఎం వాణి, డీటీలు కిషోర్, అనిల్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో 49, ఐటీడీఏలో 16 వినతులు స్వీకరించిన కలెక్టర్ దివాకర, పీఓ చిత్రామిశ్రా సత్వరమే పరిష్కరించాలని ఆదేశం -
చాట్బాట్ను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు: విద్యుత్ వినియోగదారుల కోసం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో వాట్సాప్ చాట్ బాట్ను అందుబాటులోకి తెచ్చినట్లు ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ వినియోగదారులు స్మార్ట్ఫోన్ వాట్సాప్లో 7901628348 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపగానే వెల్కమ్ టు టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ అని సందేశం అందుతుందన్నారు. వెంటనే రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ వంటి ఆప్షన్లు వస్తాయన్నారు. వినియోగదారులు యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే విద్యుత్ సర్వీస్ వివరాలు ప్రదర్శించ బడతాయన్నారు. వివరాలను ఓకే చేసిన తర్వాత కంప్లైంట్కు సంబంధించిన విభాగాల మెనూ కనిపిస్తుందని, వినియోగదారుడు తాను ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చన్నారు. అలాగే సమస్య పురోగతి ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. సమస్య పరిష్కారమైన తర్వాత వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. వినియోగదారుడు సంతృప్తి చెందనట్లయితే కంప్లైంట్ను మళ్లీ రీఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించడం, సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకతను కాపాడటం చాట్బాట్ ప్రత్యేకత అన్నారు. వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యమని డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.టీజీ ఎన్పీడీసీఎల్ డీఈ నాగేశ్వరరావు -
మాత్రలు మింగి విద్యార్థినికి అస్వస్థత
ఎస్ఎస్తాడ్వాయి: మండలంలోని మేడారం ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పారాసెటమాల్ మాత్రలు (ట్యాబెట్లు) మింగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి... వెంకటాపురం మండలంలోని రామంజపూర్ గ్రామానికి చెందిన విద్యార్థి సాయిప్రసన్నకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇంటికి తీసుకెళ్లి వారం రోజుల క్రితం పాఠశాలకు తీసుకువచ్చారు. ఇన్ని రోజులు ఇంటి వద్ద ఏమి చేశావని హిందీ టీచర్ ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఎక్కువ మొత్తంలో జ్వరం ట్యాబెట్లు (పారాసెటమాల్) వేసుకుంది. గమనించిన పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది వైద్య చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై హెచ్ఎం సాయిబాబాను వివరణగా కోరగా విద్యార్థి సాయిప్రసన్నకు జ్వరం ఉండటంతో ఇంటికి వెళ్లి వచ్చిందని, తరగతి గదిలో కొంతమంది విద్యార్థినులను ఎఫ్ఏ మొదటి యూనిట్ పరీక్ష రాయలేదని, రెండో ఎఫ్ఏ యూనిట్ పరీక్ష ఎలా రాస్తారని టీచర్ ప్రశ్నించారు. అంతేగాని సాయిప్రసన్నను మందలించడం, తిట్టిందనే పుకార్లు అవాస్తవమన్నారు. -
ఉన్నట్టా.. లేనట్టా!
● నాలుగు రోజులుగా కనిపించని పెద్దపులి ● గాలింపు చర్యలు చేపడుతున్న ఫారెస్ట్ అధికారులుములుగు: జిల్లాలో ఐదు రోజుల క్రితం ఆకస్మికంగా దర్శనమిచ్చిన పెద్దపులి జాడ దొరకడం లేదు. ఈనెల 3న ములుగు మండలంలోని పత్తిపల్లిలో పు లి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించా రు. 4న వెంకటాపురం(ఎం) మండలంలోని నర్సాపూర్ శివారులో పెద్దపులి అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు పాలంపేట వానగుట్ట వైపు వెళ్లినట్లు చెప్పారు. అప్పటి నుంచి పులి జాడ దొరకడం లేదు. అటవీశాఖ అధికారులు మాత్రం వానగుట్ట సమీపంలోనే ఉందని చెబుతున్నారు. రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు నడిచే పెద్దపులి వానగుట్ట సమీపంలోనే మకాం వేసి ఉందని చె బుతుండడం అనుమానాలకు తావిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ 10న గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించిన బెంగాల్ టైగర్ వెంకటాపురం(కె) మండలంలోని బోదాపూర్ మీదుగా మల్లూరు గుట్టల వైపు వెళ్లినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. 2025 మార్చి 7న వెంకటాపురం(ఎం) మండలంలోని లింగాపూర్ ప్రాంతంలో పులి సంచరించింది. ప్రతీఏటా పులులు జిల్లాలో సంచరిస్తున్నా..వాటికి భద్రత లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో జిల్లా కేంద్రం మీదుగా పులి చర్మాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 లో తాడ్వాయి మండలంలో వేటగాళ్ల ఉచ్చులకు గర్భంతో ఉన్న పులి (ఎస్–1) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వానగుట్టలో వేటగాళ్ల ఉచ్చు.. వానగుట్ట, వరాలగుట్ట ప్రాంతంలో అడవి పందుల కోసం వేటగాళ్లు ఉచ్చులు పెట్టినట్లు అనుమానా లున్నాయి. నాలుగు రోజులుగా పులి జాడ తెలవకపోవడంతో పాటు రైతులు, పశువుల కాపరులు పా దముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందిస్తే త ప్ప అధికారులు స్వచ్ఛందంగా తెలుసుకునే పరిస్థి తి కనిపించడం లేదు. అ క్రమ కలప రవాణా, ఇస ుక రవాణాపై రాత్రింబవ ళ్లు విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులకు జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రయాణంపై సమాచారం లేకుండాపోయింది. పు లి కోసం గాలిస్తున్నామని చెబుతున్నారే తప్ప పులి వానగుట్ట ప్రాంతంలో ఉందా.. ఇతర ప్రాంతానికి తరలివెళ్లిందా.. అనే పూర్తి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం. పులి వేటగాళ్ల ఉచ్చులకు బలి కాకముందే గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి, భద్రత చర్యలు చేపట్టాలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు. -
నాణ్యమైన విద్యనందించాలి
ములుగు రూరల్: గురుకుల పాఠశాలలు, ఆశ్రమ, మోడల్, కేజీబీవీ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల, ఆశ్రమ పాఠశాలలు, మోడల్, కేజీబీవీల్లో నిత్యం విద్యాశాఖ అధికారులు తనిఖీ నిర్వహించాలన్నారు. వార్డెన్ నుంచి డీఈఓ వరకు విధులు సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఏపీఓ వసంతరావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, గిరిజనశాఖ ఆర్సీఓ హరిసింగ్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి సర్ధార్, అధికారులు పాల్గొన్నారు. రేపు స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా ములుగు: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈనెల 10న వెలువరించడం జరుగుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారితో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మార్పులు, చేర్పుల ఆనంతరం తుది జాబితాను వెలువరిస్తామన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్రావు, డీప్యూటీ ఈఓ రాజు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ దివాకర -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఎమ్మార్పీఎస్ జాతీయ నేత, దళిత రత్న నెమలి నర్సయ్య, జిల్లా ఇన్చార్జ్ చాతాల్ల రమేశ్ అన్నారు. సోమవారం ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి నుంచి ర్యాలీగా వెళ్లిన నాయకులను, పెన్షన్దారులను కలెక్టరేట్ గేటు వద్దనే పోలీసులు నిలిపేశారు. దీంతో పోలీసులకు, ఎమ్మార్పీఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పెంచి ఇవ్వాలన్నారు. ఇప్పటికై న ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర నాయకుడు మంచోదు చంద్రమౌళి, తడుగుల విజయ, వెలుకుర్తి మోహన్రావు, మహాజన సోషలిస్టు పార్టీ నాయకుడు కల్లేపల్లి రమేశ్, వికలాంగుల కుల పోరాట సమితి నాయకులు దూడపాక రాజు, కొండి రమేశ్, గజ్జల ప్రసాద్, మరాటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’.. ఎన్నాళ్లీ ట్రబుల్!
సాక్షిప్రతినిధి, వరంగల్:● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్లో 320 నిర్మించారు. రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగానే ఉన్నాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇండ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది. .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్లపంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పకడల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే పూర్తయిన ఇళ్లలో పంపిణీ చేసింది 44.56 శాతం చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245.. ఆ నిర్మాణాలపై నీలినీడలు నెరవేరని పేదోళ్ల సొంతింటి కల.. ‘ఇందిరమ్మ’పై అర్హుల ఆశలు -
కాళేశ్వరంలో బాలకవి సమ్మేళనం
కాళేశ్వరం: తెలంగాణ భాషా దినోత్సవం (కాళోజీ జయంతి) పురస్కరించుకొని పీఎం శ్రీ కాళేశ్వరం పాఠశాలలో ఆదివారం ‘బాలకవి సమ్మేళనం’ నిర్వహించారు. కాళేశ్వరం, మహదేవపూర్ పాఠశాల బాల బాలికలు కవితా పఠనం కార్యక్రమం పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం దొనికల రాజేందర్ అధ్యక్షతన జరిగింది. 20 మంది బాల కవులతో పాటు 20 మంది కాళేశ్వరం పాఖాల కవులు పాల్గొని తెలుగుభాష, తెలంగాణ నుడికారం, పలుకు బడుల సోయగం, కాళోజీ ఔన్నత్యాన్ని కవితలతో అక్షరాంజలి సమర్పించారు. బాల కవులు విద్య, అక్షయ, జ్యోతిక, తన్మయి, తరుణ, సంయుక్త ఉత్తమ ప్రదర్శనతో సభను రంజింపచేశారు. హెచ్ఎం రాజేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో పాఠశాలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య అతిథి మాడుగుల భాస్కరశర్మ మాట్లాడుతూ కవి సమ్మేళనం గొప్ప కార్యక్రమన్నారు. సాహిత్య కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరానికి చెందిన కవులు మాడుగుల భాస్కరశర్మ, నారాయణమూర్తి, శ్రీనివాస శర్మ, రామగుండం రామ్మూర్తి, ఉపాధ్యాయులు మడక మధు, జ్యోతి, శ్రీధర్, శ్యామ్, బండారి రాజ్ కుమార్లతో పాటు తండా హరీశ్గౌడ్, రహీమొద్దీన్, గన్నోజు ప్రసాద్, చిట్ల ప్రేమ్ కుమార్, పుచ్చ కుమారస్వామి, కాయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
ములుగు/ములుగు రూరల్: పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మున్సిపల్ వర్కర్స్, అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులకు జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు. కనీస వేతనాల అమలుతో పాటు 2వ పీఆర్సీ ప్రకారం రూ. 26వేలు చెల్లించాలని కోరారు. అదే విధంగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రమాదాలలో మరణించిన కార్మికులకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నద్దునూరి సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా మాట్ల జయకర్, కోశాధికారిగా కావటి భాస్కర్, ఉపాధ్యక్షుడిగా నాంపెల్లి రఘు, ఎంపెల్లి స్వరూప, సహాయ కార్యదర్శులుగా గడ్డం నాగార్జున, దామర రాజు, కమిటీ సభ్యులుగా సాంబయ్య, రఘు, రాజేశ్వరి, మహేష్, బాలు, రాజేష్, పల్లవి, రంజిత్లను ఎన్నుకున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
జీపీఓలు వస్తున్నారు..
వెంకటాపురం(ఎం): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామపాలన అధికారులు రానే వచ్చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఆగస్టు 1న వీఆర్ఓ వ్యవస్థను, 10వ తేదీన వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వీఆర్ఓ, వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దు చేయడంతో పాటు గతంలో ఉన్న వీఆర్ఏ, వీఆర్ఓలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో 97 మంది దరఖాస్తు చేసుకోగా వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారిని జీపీఓలుగా ఎంపిక చేశారు. ఈనెల 5న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా జిల్లాకు చెందిన 47 మంది గ్రామపాలన అధికారులు నియామక పత్రాలు అందుకున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో జీపీఓలను గ్రామాలకు కేటాయించనున్నారు. దీంతో గ్రామాల్లో జీపీఓల వ్యవస్థ ప్రారంభమైతే రైతులకు సంబంధించిన భూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 335 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలను 99 క్లస్టర్లుగా విభజించారు. ప్రతీ క్లస్టరుకు ఒక జీపీఓను కేటాయించి బాధ్యతలను అప్పగించనున్నారు. జిల్లాలో 99 క్లస్టర్లకు 47 మంది జీపీఓలను (గ్రామపాలన అధికారులు) మాత్రమే ఎంపిక చేయడంతో మిగిలిన 52 క్లస్టర్లలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్ ఆసిస్టెంట్లకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. కొత్తగా గ్రామాల్లో బాధ్యతలు చేపట్టే గ్రామపాలన అధికారులు పల్లెల్లో ప్రజలతో నిత్యం మమేకమై పని చేయాల్సి ఉంటుంది. భూమి వివాదాల పరిష్కారం, కొలతలు, పహాణీల సవరణలు, ఎన్నికల విధులు, ఓటరు జాబితా పనులు, గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రజా సమస్యలు, పరిపాలన సమస్యలు పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. గతంలో పనిచేసిన వీఆర్ఓలను తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకొని గ్రామాలకు జీపీఓలుగా నియమి స్తుండడంతో శాఖాపరమైన ఇబ్బందులు తొలగనున్నాయి. గ్రామస్థాయిలో వీఆర్ఏ, వీఆర్ఓలు లేక ఆర్ఐ(రెవెన్యూ ఇన్స్పెక్టర్)లపై అదనపు భారం పడేది. ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన సమయాల్లో, విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ, విచారణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం గ్రామాల్లో గ్రామపాలన అధికారుల వ్యవస్థ మొదలు కానుండడంతో రెవెన్యూశాఖకు కొంతమేర ఇబ్బందులు తొలగనున్నాయి. కొండాయి గ్రామం వ్యూ జిల్లాలో 47 మంది గ్రామాధికారుల నియామకం సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు రెవెన్యూశాఖలో తొలగనున్న ఇబ్బందులు జిల్లాలో 355 గ్రామాలు 99 క్లస్టర్లు -
హేమాచలుడి ఆలయం మూసివేత
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా పూజారులు స్వామి వారి గర్భాలయం, ఉప ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నైవేద్యం సమర్పణ అనంతరం ద్వార బంధనం చేసి ఆలయాలను మూసివేసినట్లు ఈఓ రేవెల్లి మహేష్ తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఆలయంలో సంప్రోక్షణ పూజా కార్యక్రమాలను నిర్వహించి ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు స్వామివారిని ఎప్పటి విధంగానే దర్శించుకోవచ్చని ఈఓ తెలిపారు. -
భక్తుల భద్రతకు చర్యలేవి?
ఎస్ఎస్తాడ్వాయి: ఇటీవల జోరుగా వర్షాలు కురియడంతో మేడారం జంపన్నవాగులో వరద ప్రవాహం కొనసాగుతోంది. మొన్నటి వరకు ఇసుక దిబ్బలతో కనిపించగా నేడు నీటితో కళకళలాడుతోంది. దీంతో తొలుత స్నానఘట్టాలపై ఉన్న షవర్ కింద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు ప్రస్తుతం వాగులోనే స్నానాలు చేస్తున్నారు. వరద ఉధృతితో వాగులో భక్తులు ప్రమాదాల బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని మేడారం దేవాదాయశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ పట్టనట్లుగా వ్యహరిస్తున్నారే విమర్శలు వస్తున్నాయి. ఆదివారం తాజాగా అమ్మవార్ల దర్శనానికి వచ్చిన జనగామకు చెందిన కనికంటి మనీష్ జంపన్నవాగులో స్నాన చేసేందుకు వెళ్లి గల్లంతై మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు ప్రతిఏటా వర్షాకాలంలో చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు చర్యలు నిల్.. మేడారం వచ్చిన భక్తులు చాలా మంది జంపన్నవాగు నీటిలో పుణ్యస్నానాలు చేస్తేనే మంచిదని విశ్వసిస్తారు. వాగు వరద సమాంతరంగా వెళ్లడంతో స్నానాలకు వెళ్లిన భక్తులకు నీటి లోతు తెలియకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. గతంలో భక్తులు నీట మునిగి మృత్యువాత పడిన విషాద ఘటనలు ఉన్నాయి. హెచ్చరిక బోర్డులతో నివారణ జంపన్నవాగులో నీటి ప్రవాహం, ప్రమాదభరితంగా ఉన్న స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. ప్రస్తుతం రెడ్డిగూడెం లోలెవల్ కాజ్వే వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మేడారానికి వచ్చిన భక్తులు చాలా మంది ఈ–కాజ్వే వద్ద నీటి ప్రదేశంలో ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు. కాజ్వే కింద వాగులో నీరు కూడా సమృద్ధిగా ఉండడంతో భక్తులు స్నానాలు చేస్తుంటారు. కానీ లోతు కూడా భారీగానే ఉంటుంది. ఈ–కాజ్వే ప్రాంతంలో గతంలో పదుల సంఖ్యలో భక్తులు నీటమునిగి మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ లోలెవల్ కాజ్వే వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే ఊరట్టం జంపన్నవాగు వద్ద కాజ్వే ధ్వంసమైన ప్రదేశంలో కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు స్నానాలు చేస్తుంటారు. గత మూడేళ్ల క్రితం వర్షాకాలంలో ఇద్దరు భక్తులు ఒకేసారి నీటి మునిగి మృత్యువాత పడ్డారు. అలాగే జంపన్నవాగు వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తే పుణ్యస్నానాలు చేసే భక్తులకు సూచనలు చేయడంతో పాటు ప్రమాదవశాత్తు నీటమునిగిన భక్తులను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు కరువు పట్టించుకోని అధికారులు -
అభివృద్ధిపై దృష్టి సారించని మంత్రులు
వెంకటాపురం(కె): జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా అభివృద్ధిపై దృష్టి సారించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని రోడ్డు సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టి ముగింపు సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క ఇద్దరు మంత్రులు ఉన్నా ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ మారిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. వందలాది ఇసుక లారీల రాకపోకలతోనే రోడ్డు పాడైపోయిందన్నారు. ఇసుక లారీలతో వచ్చే ఆదాయంతో రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమస్యను పరిష్కరించపోతే దశల వారీగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, వంకా రాములు, కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారెడ్డి -
ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
వివిధ భాషల్లో 5వేల పుస్తకాలు, వందలాది జర్నల్స్, పురాతన స్క్రిప్ట్లు.. ఒకేచోట కొలువై ఉన్న ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇక.. అనేక మంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడనుంది. అరుదైన విజ్ఞాన సంపద ఉన్న ఈ ప్రకృతి గ్రంథాలయంతో ఇటీవల కాకతీయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. గత జూలైలో పుణే జాతీయ ప్రకృతి వైద్య సంస్థ కూడా పరస్పర ఒప్పందం చేసుకుంది. భారతీయ సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థ అభివృద్ధి వ్యాప్తికి పరిశోధనలు, శిక్షణ వంటి విద్యా కార్యక్రమాల్లో పరస్పర ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయం ప్రత్యేకతలు, విద్యార్థులకు ఉపయోగం, తదితర అంశాలపై ఈ వారం ప్రత్యేక కథనం.నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో కేయూ, పుణే సంస్థల ఎంఓయూకేయూతో ఎంఓయూతో కలిగే ప్రయోజనాలు.. కాకతీయ యూనివర్సిటీ వారు ఈ నెల ఒకటో తేదీన ప్రకృతి వైద్య గ్రంథాలయంతో ఎంఓయూ చేసుకున్నారు. ● ప్రకృతి వైద్యజ్ఞానాన్ని సమయానికి పొందేలా ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్లోని పుస్తకాల క్యా టలాగ్, వర్గీకరణ చేపడతారు. ఇందుకు కేయూ లైబ్రరీ సైన్స్ విద్యార్థులను వినియోగిస్తారు. ● ఇరు సంస్థల వర్క్షాప్లు, సేవల మార్పిడి కోసం ఎలాంటి ఆర్థిక భారం ఉండబోదు. సదస్సులు, సమావేశాలను సంయుక్తంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది. ● ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులు, పీహెచ్డీ పరిశోధకులు తమ ప్రాజెక్ట్ వర్క్స్, ఇంటర్న్షిప్లకు అధ్యయనం చేసేందుకు ఈ ప్రకృతి వైద్య లైబ్రరీలోకి అనుమతి ఉంటుంది. ● ఆర్ట్స్ విద్యార్థులు ప్రకృతి వైద్య విజ్ఞాన సంపదను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు తెలుగు భాషలో ప్రకృతివైద్యంపై పద్యాలు, కవితల రూపంలో కూడా చికిత్స విధానాలున్నాయి. ● అమెరికా సిలికాన్ యూనివర్సిటీలో ఆయుర్వేద డిప్లొమా కోర్సు నడుస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో ప్రకృతి వైద్యానికి సంబంధించిన పుస్తకాలు, జర్నల్స్ ఉన్నాయి. ఆయా భాషల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన చేయాలనుకునేవారికి ఎంతో ఉపయోగపడనుంది. ● ఫార్మసీ విద్యార్థులకు ఫార్మాకాగ్నెన్స్ నేచురోపతికి సంబంధించిన ఆయుర్వేదం, యోగా, నేచురోపతి మీద ఒక పేపర్ ఉంది. ఆయా విద్యార్థుల సిలబస్కు అనుగుణంగా నూట్రిషన్స్, రోగ నిరోధకత పరిశోధనలకు ఉపయోపడే ప్రకృతి వైద్యం, విజ్ఞాన పుస్తకాలను ఉపయోగించుకోవచ్చు. ● ఇంటినే గ్రంథాలయంగా మార్చిన గజ్జెల రామేశ్వరం ● వివిధ భాషల్లో 5 వేల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో.. ● ప్రకృతి వైద్యపరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశం కేయూ క్యాంపస్: హనుమకొండ ప్రకాశ్రెడ్డిపేటలోని ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్లో దేశ, విదేశీ భాషా గ్రంథాలు ఉన్నాయి. ప్రకృతివైద్యానికి సంబంధించిన 50 పత్రికలు లభిస్తాయి. కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశ్రాంత ఆచార్యులు గజ్జెల రామేశ్వరం 2018 జూలై 24న తన ఇంటిలోనే ఈ లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఆసక్తి ఉన్నవారు ఈ లైబ్రరీలో ఉచితంగా ప్రవేశించి చదువుకునే అవకాశం కల్పించారు. పుణే జాతీయ ప్రకృతివైద్య సంస్థతో.. పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థ గత జూలై 1న ఈ ప్రకృతి వైద్య గ్రంథాలయ పరిశోధన కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ సత్యలక్ష్మి, రామేశ్వరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పుణే జాతీయ ప్రకృతి వైద్యసంస్థలో ఆస్పత్రి ఉంటుంది. అక్కడి నేచురోపతి కోర్సుల విద్యార్థులకు క్లినికల్ రీసెర్చ్కు సంబంధించిన ప్రకృతి వైద్య విజ్ఞాన పుస్తకాలు, జర్నల్స్ ఇక్కడి లైబ్రరీ రీసెర్చ్సెంటర్లో ఉన్నాయి. ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వినియోగించుకుంటారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు తమ సంస్థను సందర్శించిన సమయంలో పరిశోధనల విజ్ఞాన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల వారిని తరచూ ఇక్కడికి పంపే అవకాశాలున్నాయి. ఇది హెల్త్ ఎడ్యుకేషన్ టూరిజానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. యోగా, హిస్టరీ, లైఫ్ సైన్సెస్ వారికి ఉపయుక్తం కేయూ దూరవిద్యలో యోగా డిప్లొమా కోర్సు నడుస్తోంది. ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు 300 వరకు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్లోనూ నేచురోపతిపై ఒక పేపర్ ఉంది. సైకాలజీ విద్యార్థులకు మానసిక వైద్య విద్యకు సంబంఽధించి ప్రకృతి వైద్యపరంగా విజ్ఞానసంపద ఉంది. భారత ప్రకృతివైద్య చరిత్ర, ప్రకృతి వైద్య ఉద్యమ వైతాళికులు ఎవరు అనే అనేక అంశాలు, చారిత్రక పరంగా ప్రకృతి వైద్యవిధానం ఎలా వచ్చిందనే దానిపై హిస్టరీ విద్యార్థులు, పరిశోధనలకు ఈలైబ్రరీ రీసెర్చ్సెంటర్లో అనేక దేశ, విదేశాల పుస్తకాలు, జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. లైఫ్సైన్సెస్ పీజీకోర్సుల విద్యార్థులకు ఉపయోగపడే జ్ఞాన సంపద అందుబాటులో ఉంది. మహిళలతోనే దేశాభివృద్ధి సాధ్యంప్రకృతి వైద్యవిజ్ఞానం ప్రజాబాహుళ్యంలోకి.. మూడున్నర దశాబ్దాలుగా సేకరించిన అరుదైన ప్రకృతి వైద్యవిద్య, సాహిత్య విజ్ఞాన సంపదను అందుబాటులో ఉంచా. కేయూ, పుణేలోని జాతీయ ప్రకృతివైద్య సంస్థతో మా లైబ్రరీ రీసెర్చ్ సెంటర్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. విజ్ఞాన సంపదను విద్యార్థులు, పరిశోధకులు ఉపయోగించుకోవాలి. – గజ్జెల రామేశ్వరం, ప్రకృతి వైద్య లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడుఇంటర్న్షిప్నకు కూడా.. ఈ ఎంఓయూతో ఎంఎల్ఐఎస్సీ విద్యార్థులకు ఇంటర్న్షిప్నకు అవకాశం లభించింది. తొలుత ఒకటి రెండురోజుల్లోనే ఇద్దరు విద్యార్థులను ఆ లైబ్రరీ సెంటర్కు పంపనున్నాం. మా లైబ్రరీ సైన్స్ విభాగంనుంచి ఆ లైబ్రరీలో పుస్తకాల క్యాట్లాగ్, క్లాసిఫికేషన్కు విద్యార్థులు సహకారం అందిస్తారు. – డాక్టర్ రాధికారాణి, కేయూ లైబ్రరీ సైన్స్ విభాగం అఽధిపతి -
పరిషత్కు ముందడుగు !
ములుగు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రాదేశిక ఎన్నికలకు ముందడుగు పడింది. మండల పరిషత్ సభ్యులు (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ సభ్యుల (జెడ్పీటీసీ) ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల రూపకల్పనపై జెడ్పీ సీఈఓ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.సంపత్రావు శనివారం డ్రాఫ్ట్(ముసాయిదా)ను విడుదల చేశారు. రేపటి(సోమవారం) లోపు అభ్యంతరాలు స్వీకరించి, 9న పరిష్కరించి, 10న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితా యథావిధిగా ఉండనుండగా, పోలింగ్ స్టేషన్ల మార్పుతో పాటు ఎంపీటీసీ పరిధిలో వచ్చే గ్రామాల వివరాలను తుది జాబితాలో అధికారులు ప్రకటించనున్నారు. 83 ఎంపీటీసీ స్థానాలు.. 473 పోలింగ్ స్టేషన్లు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉండగా 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. 8న వివిధ రాజకీయ పార్టీల నేతలతో మండల స్థాయిలో ఎంపీడీఓలు, జిల్లా స్థాయి అధికారులు సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 9వ తేదీన స్వీకరించిన అభ్యంతరాలను పరిష్కరించి 10న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుండగా, రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్లో ఉంది. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పాత రిజర్వేషన్లను కొనసాగిస్తారా.. కొత్తగా రిజర్వేషన్లను ప్రకటిస్తారా అనేది స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉండడంతో సెప్టెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణ పూర్తవుతుందా అనేది సందేహాంగానే మారింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం మరింత సమయం కావాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. రిజర్వేషన్లపై ఆదేశాలు లేవు..ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో 10 జెడ్పీటీసీ స్థానాలు, 83 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 473 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి 10వ తేదీన తుది జాబితా ప్రకటిస్తాం. – సంపత్రావు, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలుఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై డ్రాఫ్ట్ విడుదల 8 వరకు అభ్యంతరాల స్వీకరణ 10న ఓటర్ల తుది జాబితా విడుదల జిల్లాలో 83 ఎంపీటీసీలు, 10 జెడ్పీటీసీలు -
హేమాచలుడిని దర్శించుకున్న పీఓ
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన పీఓకు ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేష్, పూజారులు స్వాగతం పలికారు. ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్న పీఓ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. అనంతరం స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించి శేష వస్త్రాలను అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు ములుగు రూరల్: జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో 2026–27 విద్యా సంవత్సరంలో చేరేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణిమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకోదలచిన విద్యార్థులు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినవారై ఉండాలని వెల్లడించారు. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ –23 వరకు ఉందని ఎంపిక పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఉంటుందని వివరించారు. 9వ తరగతి దరఖాస్తులు చేసుకునే వారు 2025–26 విద్యాసంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలని 1 మే 2011 నుంచి 31 జూలై 2013 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. 11వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు చేసుకునే వారు 2025–26లో 10వ తరగతి చదువుతూ 1 జూన్ 2009 నుంచి 31 జూలై 2011 మధ్యలో జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఎన్వీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ‘విల్ట్’ సోకకుండా సేంద్రియ ఎరువు వాజేడు: మిర్చి తోటకు విల్ట్ వైరస్ రాకుండా ఉండటం కోసం ముందస్తు నివారణలో భాగంగా ఓ రైతు ప్రత్యేకంగా సేంద్రియ ఎరువును తయారు చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఇర్ప రామ్ముర్తి శనివారం ఎరువు వివరాలను వెల్లడించారు. ట్రైకో డర్మ్, సూడో మోనాస్ మందులను పశువుల ఎరువులో కలిపి మురగపెట్టాలని తెలిపారు. ఆ మందు ఎరువులో పూర్తిగా కలిసిన తర్వాత మిర్చి తోటను పాతే చేనులో చల్లి కలియ దున్నాలని వివరించారు. గతంలో ఈ పద్ధతి పాటించడం వల్ల విల్ట్ వైరస్ రాలేదని వెల్లడించారు. మొక్కేతలు ప్రారంభం వాజేడు: గోదావరి వరద కొంతమేర తగ్గడంతో కొందరు రైతులు మిర్చి మొక్కేతలను శనివారం ప్రారభించారు. మిర్చి నార్లు నాటడం ఇప్పటికే ఆలస్యం కావడంతో గోదావరి వరద తమ చేల వరకు రాదని భావించిన రైతులు మొక్కేతలను వేస్తున్నారు. మండల పరిధిలోని వాజేడు, గుమ్మడి దొడ్డి, జగన్నాథపురం గ్రామాల్లో ఈ మొక్కేతలు ప్రారంభం అయ్యాయి. రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్ వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్గా ఉందని జర్మనీకి చెందిన జీస్టాస్ నిమాన్ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన శనివారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. -
రూ.100 కోట్లు కేటాయించాలి
రహదారుల మరమ్మతులకు వెంకటాపురం(కె): మండలంలోని ఆర్అండ్బీ రహదారుల మరమ్మతులకు రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని యాకన్నగూడెం నుంచి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెబుతున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మండలంలో ఏం అభివృద్ధి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఆయన గాలికి వదలడం సరికాదన్నారు. ఎమ్మెల్యే వైఫల్యం కారణంగానే రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. ఒక్కొక్క ఇసుక లారీ నుంచి ప్రభుత్వం టాక్స్ల పేరుతో రూ.1340 వసూలు చేస్తూ రోడ్ల ను ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ, మండల కార్యదర్శి గ్యానం వాసు, నాయకులు కుమ్మరి శ్రీను, కట్ల నర్సింహచారి, తోట నాగేశ్వరావు, కుంజా శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణారెడ్డి -
లడ్డూ @ రూ.1.16 లక్షలు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలోని గణేశ్ చౌక్ వద్ద వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వినాయక లడ్డూ వేలం పాటను నిర్వహకులు నిర్వహించగా జిల్లా కేంద్రంలోని వారాహి రెస్టారెంట్ యజమాని బొమ్మగాని హైమవతి–జగదీశ్వర్ దంపతులు రూ.1.16లక్షలకు పాడి దక్కించుకున్నారు. ఈ మేరకు నిర్వహకులు వారికి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు చింతలపూడి భాస్కర్రెడ్డి, బలరాం, కొత్త సురేందర్, ఇమ్మడి రాకేష్యాదవ్, ఎల్లావుల అశోక్, రాకేష్రెడ్డి, అజయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులు
ఎస్ఎస్తాడ్వాయి: మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట శనివారం యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో బారులుదీరారు. పది రోజుల తర్వాత సహకార సంఘం కార్యాలయానికి యూరియా బస్తాలు రావడంతో రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఎస్సై శ్రీకాంత్రెడ్డి, ట్రైనీ ఎస్సై మధు రైతులు ఇబ్బంది పడకుండా క్రమ పద్ధతిలో యూరియా బస్తాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. రైతులు కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు క్యూ కట్టి గంటల తరబడి క్యూలో నిలబడి పలువురు రైతులు ఇబ్బంది పడ్డారు. మండల వ్యవసాయశాఖ అధికారి కుమార్యాదవ్, ఇద్దరు ఏఈఓలను పీఏసీఎస్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచారు. పట్టాపాస్ పుస్తకం, ఆధార్కార్డు తీసుకు వచ్చిన రైతులకు అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు. మరికొంతమంది రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ పేదల సంక్షేమం కోసం పని చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో జాతీయ రహదారిపై ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. గృహ వినియోగ వస్తువులపై 18 శాతం ఉన్న జీఎస్టీ 5శాతానికి తగ్గించారని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వస్తువులపై 12 శాతం నుంచి 5 శాతానికి ఆరోగ్యరంగంలో 18 శాతం నుంచి 5 శాతం తగ్గించారని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో చిరువ్యాపారులకు మేలు జరుగుతుందన్నారు. దీంతో ప్రధాని మోదీ, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. చింతలపూడి భాస్కర్రెడ్డి, కొత్త సురేందర్, కృష్ణాకర్, రాజ్కుమార్, రాకేష్యాదవ్, రవిరెడ్డి, సుమలత, మహేందర్, బాబు, శ్రీహరి పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
ములుగు: విద్యార్థులు, సమాజ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతిల్లోనే నిర్మాణం అవుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో నిర్వహించిన గురుపూజోత్సవానికి జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అధ్యక్షత వహించగా కలెక్టర్ దివాకర టీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయమన్నారు. విద్యార్థుల అభివృద్ది కోసం ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంపత్రావు, చైర్మన్ రేగ కల్యాణితో కలిసి కలెక్టర్ దివాకర జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 33 మందిని సత్కరించి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి సూర్యనారాయణ, సమగ్ర శిక్షా కోఆర్డినేటర్లు అర్షం రాజు, కాటం మల్లారెడ్డి, గుళ్లపెల్లి సాంబయ్య, మండల విద్యాధికారులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్ 33 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం -
వానగుట్ట ప్రాంతంలోనే పులి మకాం
వెంకటాపురం(ఎం): జిల్లాలో గత మూడు రోజులుగా సంచరిస్తున్న పులి శుక్రవారం సా యంత్రం వరకు వెంకటాపురం(ఎం) మండలంలోని వానగుట్ట అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ములుగు మండలంలోని పత్తిపల్లి, పోట్లాపూర్ సమీప అడవుల్లో సంచరించిన పులి.. గట్టమ్మ మీదుగా గురువారం వెంకటాపురం(ఎం) మండలంలోకి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం సింగరకుంటపల్లె రోడ్డు దాటుతూ వానగుట్ట వైపు వెళ్లినట్లు తెలిసింది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా ములుగు ఎఫ్ఆర్ఓ శంకర్ ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వానగుట్ట సమీపంలో పులి పాదముద్రలను గుర్తించినట్లు ఎఫ్ఆర్ఓ శంకర్ తెలిపారు. పులి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.గాలింపు చర్యలు చేపట్టిన అటవీశాఖ అధికారులు -
ప్రయాణం సాహసమే..
మంగపేట: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం నుంచి మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు గ్రామం బ్రాహ్మణపల్లి వరకు ప్రధాన రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రాహ్మణపల్లి నుంచి ఏటూరునాగారం ఎన్హెచ్ 163 వరకు 34 కిలోమీటర్ల ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. నిర్లక్ష్యమే పాపం.. మండలం నుంచి ఏటూరునాగారం వరకు ప్రధాన రోడ్డు అభివృద్ధి కోసం నాటి ప్రభుత్వం 2019 నుంచి 2021 వరకు పలు దఫాలుగా సుమారు రూ.20 కోట్లకుపైగా మంజూరు చేసింది. అప్పటి అధికార పార్టీ అండదండలతో టెండరు పొందిన గుత్తేదారుతో సంబంధిత అధికారులు కమీషన్ల కోసం కుమ్మక్కై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్డుపై ఏర్పడిన గోతులను పూడ్చకుండా ఆర్ఆండ్బీ అధికారులు పట్టింపులేనట్లుగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సైడ్బర్మ్లు కోతకు గురై గోతుల ఏర్పడ్డాయి. మంగపేట రైతువేదిక వద్ద కల్వర్టు పక్కన రెండు చోట్ల 15 మీటర్ల వెడల్పుతో సుమారు 4 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడింది. అదే చోట రోడ్డు మధ్యన, కోమటిపల్లి క్రాస్రోడ్డు సమీపంలో పలు చోట్ల మోకాలు లోతుతో 10 మీటర్ల వెడల్పుతో భారీగోతులు ఏర్పడి నీరు నిలిచి ఉంటున్నాయి.మల్లూరు, వాడగూడెం ఇసుక క్వారీలతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక, మణుగూరు 10కి పైగా ఇసుక క్వారీల నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీలు వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఇసుకను రవాణా చేస్తున్నాయి. వరంగల్ నుంచి నిత్యం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాలు, మండలం మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం, పట్టణాలతోపాటు ఖమ్మం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వరకు రేయింబవళ్లు ప్రధాన రోడ్డుపై రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటుంది. ఇసుక లారీల కారణంగా రోడ్డుపై భారీగోతులు ఏర్పడి నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యకృత్యంగా మారి ప్రమాదాలు చోద్యం చూస్తున్న ఆర్అండ్బీ అధికారులు -
సందిగ్ధంలో హరిత హోటళ్లు
ఎస్ఎస్తాడ్వాయి: జిల్లాలోని మేడారం, తాడ్వాయి, ములుగు, బొగత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన హరితహోటళ్ల నిర్వహణ సందిగ్ధంగా మారింది. టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హరితహోటళ్లను గుజరాత్కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ లీజుకు తీసుకుని పెరియాడో రిసార్ట్స్ పేరుతో నిర్వహించింది. అయితే గురువారం రాత్రి తాడ్వాయిలోని హరి తహోటల్ నుంచి రెండు కంటైనర్లలో నిర్వాహకులు సామగ్రిని తీసుకెళ్లారు. లీజుకు తీసుకున్న హరితహోటళ్లను వదులుకున్నట్లు తెలుస్తుంది. అయితే పెరియాడో రిసార్ట్స్లో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల వేతనాలు చెల్లించలేదు. ఈక్రమంలో హరితహోటల్ ఖాళీ చేస్తున్నట్లు తెలిసి వేతనాల విషయంపై సంబంధిత ఎండీని సిబ్బంది అడగగా తర్వాత చెల్లిస్తామని చెప్పి వెళ్లిపోయినట్లు తెలిసింది. వారు వెళ్లిపోవడంతో సిబ్బంది శుక్రవారం హరితహోటల్ మెయిన్ గేట్కు తాళం వేశారు. మేడారం, బొగత, తాడ్వాయి పెరియాడ్ రిసార్ట్స్లో పని చేసిన సిబ్బంది అందరూకలిసి జీతాలు ఇప్పించాలని తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హరితహోటళ్లను లీజుకు తీసుకున్న ప్రైవేట్ సంస్థ టూరిజంశాఖకు లీజు బకాయిలు కూడా చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. దీంతో మళ్లీ హరిత హోటళ్లు తెరుచుకుంటాయా.. లేదా.. అనే సందేహాలు పర్యాటకుల్లో వ్యక్తమవుతున్నాయి. పెరియాడో రిసార్ట్స్ సంస్థ వారు ఖాళీ చేయడంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా టూరిజంశాఖ అధికారులు హరితహోటళ్లు అందుబాటులోకి తీసుకొస్తారా.. లేదా.. వేచిచూడాలి. కాగా టూరిజంశాఖ అధికారులు హరితహోటల్ను సందర్శించి సిబ్బందితో మాట్లాడినట్లు తెలిసింది. ఈవిషయంపై టూరిజంశాఖ ఈడీ ఉపేందర్రెడ్డిని వివరణ కోరగా హరిత హోటల్ లీజుకు తీసుకున్న సంస్థ బకాయిలు చెల్లించాల్సి ఉంది. లీజ్ బకాయిలు చెల్లించాని గతంలోనే 15 రోజుల గడువు ఇస్తూ నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 3వ తేదీతో గడువు ముగిసిందని.. బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేతనాలు చెల్లించలేదని సిబ్బంది తాళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు -
వైకల్యంతో పుట్టిన పిల్లలను గుర్తించాలి
ములుగు: వైకల్యంతో పుట్టిన పిల్లలను గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు వైద్య సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్రీయ బాలికల స్వస్థత కార్యక్రమంపై గురువా రం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్ర రక్తహీనత గల పిల్లలను గుర్తించి సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, ములుగు ప్రభుత్వ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేయాలన్నారు. రోజు వారిగా స్క్రీనింగ్ వివరాలను ఆర్బీఎస్కే పోర్టలో నమోదు చేయాలన్నారు. ప్రతీ నెలలో పాఠశాలలను సందర్శించి వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు రణధీర్, పవన్ కుమార్, నరహరి, శ్రీనివాస్, మల్లిఖార్జున్, జయప్రద, డెమో సపంత్, కోఆర్డినేటర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఏటూరునాగారం/మంగపేట: మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ అన్నారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని మీసేవ కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మింకగా తనిఖీ చేశారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. అతి త్వరలో ఏటూరునాగారంలో నూతన ఆధార్ సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మంగపేట మండలంలోని పలు మీ సేవ కేంద్రాలను తహసీల్దార్ రవీందర్, ఈ – డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్లతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మీ సేవ కేంద్రాల నిర్వహకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేయాలని సూచించారు. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ రుసుము దరఖాస్తుదారుడి నుంచి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీసేవ సెంటర్లో తప్పకుండా సిటిజన్ చార్టర్, భూ భారతికి సంబంధించిన ఫ్లెక్సీలు, మీసేవ లోగో, తహసీల్దార్, ఈడీఎం, పరిష్కారం కాల్ సెంటర్ల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్ పోలోజు విజయ్, మీసేవ సెంటర్ నిర్వహకులు పాల్గొన్నారు. ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
బడికి రాకుంటే ఊరుకునేదే లేదు..
ఏటూరునాగారం: మండల పరిధిలోని నార్త్ పాఠశాల ఉపాధ్యాయుడిగా పోతు రాజశేఖర్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలకు విద్యార్థులు డుమ్మా కొడితే ఊరుకునేదే లేదు.. ఎట్లాగైనా బడికి తీసుకురావాలే.. అనే సంకల్పంతో ఇంటింటికి తిరిగి పిల్లలను బడికి తీసుకొస్తాడు. ఈ ఏడాది 25 మంది విద్యార్థులను కొత్తగా అడ్మిషన్ చేయించారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం ఈ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు. అంతేకాకుండా అందులో 16 మంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండడం గమనార్హం. ఇంగ్లిష్ మీడియంలో పాఠాలను బోధిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నాడు. -
గొత్తికోయగూడెంపై దాడి
శాంతినగర్లో అటవీశాఖ అధికారులు కూల్చిన గుడిసెమంగపేట: మండల పరిధిలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతం సమీపంలోని శాంతినగర్ గొత్తికోయగూడెంపై మంగపేట అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..అటవీ ప్రాంతంలోని శాంతినగర్లో పదేళ్ల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన సుమారు 15 పైగా గొత్తికోయ గిరిజన కుటుంబాలు గుడిసెలు వేసుకున్నాయి. పోడు చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా గూడెంపై దాడికి దిగి తొమ్మిదికి పైగా గుడిసెలను కూల్చివేసి అడ్డువచ్చిన అమాయక గొత్తికోయ గిరిజనులపై దాడి చేసి గాయపరిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై అటవీశాఖ రేంజ్ అధికారి అశోక్ను వివరణ కోరగా మంగపేట బీటు పరిధిలోని అటవీప్రాంతంలో శాంతినగర్లో కొత్తగా పోడుచేసి అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా 20 రోజుల క్రితం స్థానిక పోలీసులతో కలిసి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఉండాలని కొత్తగా పోడు చేయొద్దని, గుడిసెలు వేయవద్దని హెచ్చరించామని వివరించారు. అయినప్పటికీ వినిపించుకోకుండా నూతనంగా గుడిసెలు వేసినట్లు తెలిసిందన్నారు. దీంతో సాయంత్రం 3 గుడిసెలను తొలిగించినట్లు వివరించారు. గిరిజనులపై దాడి, గుడిసెలు కూల్చేసిన అటవీశాఖ అధికారులు -
ఆదర్శం యాదలక్ష్మి
గోవిందరావుపేట: మండల పరిధిలోని గాంధీనగర్ యూపీఎస్ పాఠశాలలో యాదలక్ష్మి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మూడేళ్లుగా పాఠశాలలో విద్యార్థులు లేని పరిస్తితి ఉంది. దీంతో పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలిగా అడుగుపెట్టినప్పటి నుంచి పెను మార్పులు తీసుకొచ్చారు. తన సొంత ఖర్చులతో భవనానికి పెయింటింగ్ వేయించి సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల ఇంటింటికీ తిరిగారు. తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఈ ఏడాది ఆరుగురు విద్యార్థులను బడిలో చేర్పించారు. వారికి షూస్తో పాటు స్టడీ మెటీరియల్ అందజేసి వినూత్న రీతిలో బోధిస్తూ ఆదర్శంగా నిలిస్తోంది. -
నిమజ్జనానికి వేళాయె..
ములుగు: నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడికి నేడు ప్రజలు వీడ్కోలు పలకనున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పోలీసు అధికారులు సంయుక్తంగా కలిసి వినాయక నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. భక్తులు చెరువుల్లోకి దిగకుండా ప్రధాన చెరువుల వద్ద గ్రామ పంచాయతీ, పోలీస్ అధికారులు క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దివాకర, డీపీఓ దేవరాజ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చెరువులు, కుంటల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. రామప్ప, లక్నవరం సరస్సుల్లో అనుమతి లేదు.. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని రామప్ప, గోవిందరావుపేట మండల పరిధిలోని లక్నవరం జలాశయం వంటి ప్రధాన చెరువుల్లో వినాయక నిమజ్జనానికి పోలీసు శాఖ అనుమతులు నిరాకరించింది. నిమజ్జనం సమయంలో యువకులు సరస్సుల్లో దిగి మృత్యువాత పడతారనే నెపంతో నిమజ్జనం చేసేందుకు అనుమతులు ఇవ్వలేదు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాలను ఆయా మండలాలకు చెందిన పోలీసు అధికారులు గురువారం పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ బందోబస్తు జిల్లాలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనానికి సంబంధించి 400 మంది సివిల్, ఏఆర్, టీఎస్పీఎస్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో 800కు పైగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు ధృవీకరించారు. నిమజ్జన ప్రక్రియ మొదలు నుంచి పూర్తి అయ్యేంత వరకు పూర్తి కార్యక్రమాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇంటెలిజెన్స్, ఎస్బీ ఫీల్డ్ అధికారులు పరిశీలించనున్నారు. ములుగు సబ్ డివిజన్ డీఎస్పీ రవీందర్, ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పరిశీలనలో నిమజ్జన కార్యక్రమం కొనసాగనుంది. జిల్లాలో ప్రధానంగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలోని తోపుకుంట, మల్లంపల్లి మండలంలో ఊర చెరువు, వెంకటాపురం(ఎం) మండలంలో నల్లకాలువ, గోవిందరావుపేట మండలంలోని గౌరారం చెరువు, రంగాపూర్ కాల్వ, ఎస్ఎస్ తాడ్వాయి మండలంలో జంపన్నవాగు, కన్నాయిగూడెం మండలంలో తుపాకుల గూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ, వెంకటాపురం(కె) మండలంలో పాలెం వాగు వద్ద, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు మండలాలకు చెందిన వారు ఏటూరునాగారం ముళ్లకట్ట పూసూరు బ్రిడ్జి వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జనానికి క్రేన్లు, జేసీబీలను వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు, విద్యుత్కు అంతరాయం కలిగితే జనరేటర్లను సైతం వినియోగించేలా చర్యలు చేపట్టారు. ఆయా చెరువుల వద్ద గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. చెరువులు, వాగుల వద్ద ఏర్పాట్లు జిల్లాలో 800కు పైగా గణపతి విగ్రహాలు 400 మంది పోలీసులతో బందోబస్తు రామప్ప, లక్నవరం చెరువుల్లో అనుమతి నిరాకరణవినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. జిల్లా వ్యాప్తంగా రహదారులు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. శోభాయాత్ర భక్తిభావంతో శాంతియుతంగా సాగేలా ఉత్సవ కమిటీ సభ్యులు చూసుకోవాలి. గ్రామాలలో ప్రజల సంరక్షణకు స్థానిక పోలీసు బృందాలు పెట్రోలింగ్ నిర్వహిస్తాయి. నిమజ్జనం సమయంలో స్థానిక పోలీసులకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ శబరీశ్, ఎస్పీ -
యూరియా కోసం పడిగాపులు
ఏటూరునాగారం: యూరియా కోసం రైతులు పడిగాపులు పడ్డారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా బస్తాలను కొనుగోలు చేసేందుకు రైతులు గురువారం ఉదయం నుంచి బారులుదీరారు. ఒక్కో రైతు ఆధార్ కార్డుపై రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో అవసరం ఉన్న రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై రాజ్కుమార్లు సిబ్బందితో కలిసి బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది రైతులు బస్తాలు క్యూలో నిలబడ్డారు. అయితే రైతుల మాత్రం తమకు రెండు బస్తాలు సరిపోవని ఎక్కువ ఇవ్వాలని అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చే అనుమతి ఉందని ఏఓ వేణుగోపాల్ తెలిపారు. ఈ బస్తాలను చిన్నబోయినపల్లి తో పాటు షాపెల్లి, గోగుపల్లి, శివాపురం, పెద్ద వెంకటాపురం, కొండాయి, దొడ్ల, మల్యాల తదితర గ్రామాల రైతులకు మాత్రమే అందజేశారు.ఒక్కో రైతుకు రెండు బస్తాలు పంపిణీ -
అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు
వాజేడు/వెంకటాపురం(కె): మీసేవ కేంద్రాల్లో నిర్ణీత రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ అన్నారు. వాజేడు, వెంకటాపురం(కె) మండలాల పరిధిలోని వాజేడు, పేరూరు, ఆలుబాక, పాత్రాపురం, మొర్రవానిగూడెం, వెంకటాపురం(కె)లోని మీసేవ కేంద్రాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవ కేంద్రాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఈఎస్డీ నిబంధనల ప్రకారం కేంద్రాలను నడపాలన్నారు. ఆపరేటర్లు అందుబాటులో ఉండి మీ సేవ ద్వారా నిర్వహించే అన్ని రకాల సర్వీసులతో పాటు ఆన్లైన్ సర్వీసులను ప్రజలకు అందించాలని సూచించారు. రెండు మండలాల్లో ప్రజలు ఆధార్ సేవల పట్ల పడుతున్న ఇబ్బందులను గుర్తిస్తామని తెలిపారు. త్వరలోనే అదనపు ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్ చేసే సమయంలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మేనేజర్ పోలోజు విజయ్ ఉన్నారు.ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ -
రామప్ప శిల్పకళ మరుపురానిది..
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద మరుపురానిదని భారత విదేశాంగ శాఖ, సాన్ఫ్రాన్సిస్కు చెందిన భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్రెడ్డి, బ్రూనై భారత హై కమిషనర్ అబ్బగాని రాము పేర్కొన్నారు. బుధవారం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని వారు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆల య పూజారి ఉమాశంకర్ వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రా మప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొని యాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్శర్మ, తహసీల్దార్లు గిరిబాబు, సత్యనారా యణ, ఆర్ఐ విజేందర్ తదితరులు పాల్గొన్నారు.రామప్ప ఆలయ విశిష్టతను వివరిస్తున్న గైడ్ విజయ్కుమార్ రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తున్న భారత విదేశీ రాయబారులుభారత విదేశీ రాయబారులు శ్రీకర్రెడ్డి, రాము -
పారిశుద్ధ్య కార్మికుడి ఆత్మహత్య
ములుగు రూరల్: ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధి మాధవరావుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లికి చెందిన మైదం మహేష్(30)మూడేళ్లుగా ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తోటి కార్మికులకు వేతనం రాగా, తనకు ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో పలుమార్లు పంచాయతీ అధికారులను కలిశాడు. అయినా వేతనం ఇవ్వకపోవడంతో మనోవేదనకు గురై మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మైరుగైన వైద్యం కోసం అక్కడినుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రభుత్వ బడులకు రేటింగ్
ములుగు: ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై దేశవ్యాప్తంగా బడులకు రేటింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా 200 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులను మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న విహార కేంద్రాల సందర్శనకు తీసుక వెళ్లనున్నారు. అయితే గతంలో ప్రభుత్వం స్వచ్ఛత పురస్కారాలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం నిలిచిపోవడంతో మళ్లీ జాతీయస్థాయిలో పాఠశాలలకు రేటింగ్ పేరుతో పురస్కారాలు అందించనున్నారు. 30వ తేదీ వరకు గడువు జిల్లాలో 561 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు స్వచ్ఛ ఏవమ్ హరిత్ స్కూల్ రేటింగ్ కోసం ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగు దొడ్లు, మూత్రశాలల నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రతతో పాటు తదితర పాఠశాల నిర్వహణపై ఆన్లైన్లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అక్టోబర్లో కమిటీ బృందం తనిఖీ చేపట్టనుంది. 3 స్టార్ వచ్చిన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ఆరు పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 4 స్టార్ వచ్చిన వాటిని జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. దేశంలోని ఉత్తమంగా ఉన్న 200 పాఠశాలలకు స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారం అందజేస్తారు. లక్ష నగదుతో పాటు ఉపాధ్యాయులను విహార యాత్రకు తీసుకెళ్తారు. అయితే 35 నుంచి 50 పాయింట్లు ఉన్న పాఠశాలలకు 2 స్టార్, 51 నుంచి 74 పాయింట్లు గల పాఠశాలలకు 3 స్టార్, 75 నుంచి 89 పాయింట్లు ఉన్న స్కూళ్లకు 4 స్టార్, 90 నుంచి 100 పాయింట్లు ఉన్న బడులకు 5 స్టార్ కేటాయిస్తారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఎంఈఓలకు, ఉపాధ్యాయులకు శిక్షణ స్వచ్ఛ ఏవమ్ హరిత్ పురస్కారంతో సర్కారు పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొననుంది. మరుగుదొడ్ల నిర్వహణ బాగుపడనుంది. ఆయా బడుల్లో స్వచ్ఛ వాతావరణం నెలకొల్పడానికి దోహద పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, నీటి సదుపాయం ఉన్నప్పటికీ వాటిని సరిగా వినియోగించడం లేదు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం, పరిసరాల శుభ్రత, పచ్చదనం కోసం దోహదపడనుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే జిల్లాతో పాటు పాఠశాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్ కింద పాఠశాలలను జాతీయస్థాయిలో ఎంపిక చేయనున్నారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంఈఓలతో పాటు మండలానికి ఒక్కో ఉపాధ్యాయుడికి బుధవారం జిల్లా కేంద్రంలోని ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ ఇప్పించాం. మండల స్థాయిలో ప్రతీ పాఠశాల నుంచి ఒక ప్రధానోపాధ్యాయునికి అవగాహన కల్పించి పాఠశాలలో ఉండే అనేక వసతులను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పాఠశాల రేటింగును మెరుగుపరుచుకోవాలి. జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు రాష్ట్రస్థాయికి, జాతీయస్థాయికి ఎంపిక కావాలి. – సిద్ధార్థ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి -
రూ. 21లక్షల కరెన్సీతో అలంకరణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఇండియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని మహాలక్ష్మీ అవతారంలో రూ.21 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు యల్లాప్రగడ రాధాకృష్ణశర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. బుధవారం ఇండియన్ యూత్ మండపం వద్ద కరెన్సీ నోట్లతో అలంకరణ చేయగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కమిటీ వారు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ములుగు రూరల్: ములుగు మండలంలోని పత్తిపల్లి శివారులో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు బుధవారం గుర్తించారు. అటవీశాఖ రేంజ్ అధికారి డోలి శంకర్ కథనం ప్రకారం... పత్తిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పత్తి చేనులో అడవి జంతువుల పాదముద్రలు ఉన్నాయని అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ మేరకు ఎఫ్ఆర్ఓ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిశీలించి పెద్దపులి పాదముద్రలుగా గుర్తించామని తెలిపారు. పాదముద్రల ఆధారంగా అటవి ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఆచూకీ లభించలేదని తెలిపారు. పాదముద్రల ఆధారంగా మగ పెద్దపులి అని గుర్తించినట్లుగా వివరించారు. పత్తిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం, రాత్రిళ్లు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. పశువులు, గొర్రెల కాపరులు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. అడవి సమీపంలో ఉన్న వ్యవసాయ పంట పొలాలకు రైతులు, కూలీలు వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే సెల్ నంబర్ 9849358923కి సమాచారం అందించాలని తెలిపారు.ఎస్ఎస్తాడ్వాయి: పంటనష్ట పరిహార సాధన సమితి ఆధ్వర్యంలో మేడారంలో ప్రచార రథాన్ని ప్రారంభించారు. బుథవారం సమ్మక్క పూజారులు సిద్ధబోయిన మునీందర్, సిద్ధబోయిన సురేందర్, కొక్కెర కృష్ణయ్య, కమిటీ అధ్యక్షుడు కృష్ణా అర్జున్లు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పంటనష్ట పరిహార సాధన సమితి అధ్యక్షుడు కృష్ణాఅర్జున్ మాట్లాడుతూ మేడారంలో ఈ నెల 6న పంటనష్ట పరిహారం కోసం నిర్వహించనున్న సమావేశానికి నార్లాపూర్, వెంగ్లాపూర్, బయ్యక్కపేట, కాల్వపల్లి గ్రామ పంచాయతీల్లోని రైతులు హాజరయ్యేందుకు ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్రెడ్డి, కమిటీ సభ్యులు జంగా హన్మంతరెడ్డి, గొంది శ్రీధర్, సమ్మారావు, లక్ష్మణ్, బాబురావు పాల్గొన్నారు. -
గోదావరి పరవళ్లు
కన్నాయిగూడెం/వాజేడు: మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద బుధవారం గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ ప్రాంతమంతా వరద నీటితో జలమయమైంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో పాటు సరస్వతీ, లక్ష్మీ, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతుండడంతో సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఉదయం 7,72,748 క్యూసెక్కులకు నీరు వచ్చి చేరగా సాయంత్రం 7,58,013క్యూసెక్కులకు మేర కొంత తగ్గింది. ఒక్కసారిగా గోదావరి భారీగా చేరడంతో ప్రజలు భయానికి గురయ్యారు. అలాగే వాజేడు మండల పరిధిలోని బుధవారం గోదావరి వరద ఉధృతంగా పెరగడంతో టేకులగూడెం చివరన జాతీయ రహదారి ముంపునకు గురైంది. రెండు రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచి పోయాయి. అదే విధంగా పేరూరు–కృష్ణాపురం, ఏడ్జెర్లపల్లి– పూసూరు, వాజేడు– గుమ్మడి దొడ్డి గ్రామాల మధ్యన ఉన్న బ్రిడ్జీలు వరద నీటిలో మునగడంతో పలు గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. అప్రమత్తమైన అధికారులు వరదలోకి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లను అడ్డంగా పెట్టారు. పూసూరు గోదావరి బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి
మంగపేట: పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో రిసెప్షన్ సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ శబరీశ్ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగపేట పోలీస్స్టేషన్ను ఎస్పీ బుధవారం సందర్శించి పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అని స్టేషన్ మొత్తం కలియతిరిగి పరిశీలించారు. అనంతరం స్టేషన్ నిర్వహణ రికార్డులను పరిశీలించి ప్రతీ వర్టికల్కు ఒక అధికారిని కేటాయించి రికార్డులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని తెలిపారు. విచారణలో ఉన్న కేసులను పరిశీలించి మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంప్యూటర్ సిబ్బంది పనులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ టీవీఆర్ సూరి, సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి ఉధృతి పరిశీలన పోలీస్ స్టేషన్ తనిఖీ అనంతరం ఎస్పీ కమలాపురంలో గల ఇంటెక్వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా వస్తుందని తెలిపారు. దీంతో గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు గోదావరికి చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. ఎస్పీ డాక్టర్ శబరీశ్ -
సర్వేలతో సరి.. అందని పరిహారం
వర్షాలతో 644 ఎకరాల్లో పంటనష్టంకొండాయిలో ఇసుక మేటలతో ఉన్న పొలాలుజిల్లాలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి. వరి, పత్తి, ఇతర పంటలను కోల్పోయిన రైతులను గుర్తించి వారికి పరిహారం అందిస్తే మళ్లీ సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సర్వేలు చేసి కేవలం కాగితాలకే పరిమితం చేయడం సరికాదు. – వినుకోలు చక్రవర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు, ఏటూరునాగారంఏటూరునాగారం: జిల్లాలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలకు గోదావరితో పాటు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో వరద నీరు వరి, మిర్చి, పత్తి, అరటి తోటల నుంచి ప్రవహించి నష్టానికి గురిచేసింది. దీంతో గత నెలలో వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక సర్వేలు చేపట్టి జిల్లాలో 450 ఎకరాల మేరకు పంటనష్టం వాటిలినట్లు ఉన్నతాధికారులకు నివేదికను అందజేశారు. అయినా రైతులకు ఎలాంటి పంట నష్టపరిహారం అందలేదు. వాటి నుంచి తేరుకోకముందే ఇటీవల కురిసిన వర్షాలకు మరికొన్ని చోట్ల 194 ఎకరాల్లో వరి పంట పొలాల నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహించి ఇసుక మేటలు వేసింది. దీంతో మొత్తంగా 644 ఎకరాల్లో పంట నష్టపోయిన అన్నదాతలు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇసుక మేటలు ఏటూరునాగారం మండల పరిధిలోని కొండాయి గ్రామంలో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు 25 ఎకరాల్లో పంట నీటి పాలైంది. అలాగే గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల నుంచి వరద నీరు ప్రవహించడంతో సుమారు 35 ఎకరాల మేర ఇసుక మేటలు వేసింది. భూమి పంటల సాగుకు పనికిరాకుండా పోయింది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మంగపేటలో జూలై నెలలో కురిసిన వర్షాలకు 89 ఎకరాలు, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు 45 ఎకరాల మేరకు పంటలకు నష్టం వాటిలినట్లు అధికారులు అంచనా వేశారు. ఇలా మండలాల వారీగా అధికారుల క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నష్టం బయటకు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. గోదావరి వరదతో పొలాల్లో ఇసుక మేటలు ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు -
పంట నష్టంపై క్షేత్రస్థాయిలో సర్వే
ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో 25ఎకరాల్లో భారీ వర్షాలతో నష్టపోయిన పంటలను ఏఈఓ రాజు బుధవారం సర్వే చేశారు. రైతులు సాగు చేస్తున్న వరి, ఇతర పంటలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. వరద ఉధృతి వల్ల నీరు పొలాల మీదుగా ప్రవహించడంతో ఇసుక మేటలు, వరి పైరు కొట్టుకుపోయినట్లు తెలిపారు. ప్రాథమిక సర్వే నివేదికలను అధికారులకు అందజేయనున్నట్లు ఏఈఓ రాజు తెలిపారు. కొండాయి గ్రామానికి రవాణా మార్గం లేకపోవడంతో పడవలో ప్రయాణించి సర్వే చేపట్టారు.అదేవిధంగా మండలంలోని గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లి గ్రామాల్లో ఏఈఓ రవి సర్వే చేపట్టారు. పొలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. -
నవ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలి
ములుగు: నవ సమాజ నిర్మాణానికి యువత నడుం బిగించాలని డీఎంహెచ్ఓ గోపాల్రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడి నవసమాజ నిర్మాణ ఏర్పాటుకు పాటుపడాలన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు నో చెప్పి, బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ప్రణాళికతో ముందుకుసాగాలన్నారు. దూమపానం, గంజాయి, మద్యపానం, కొకై న్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొందరు చెడు అలవాట్లతో మానసిక ఒత్తిడికి గురై చదువు, ఆటల్లో రాణించలేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారి ప్రసాద్, ఆరోగ్య కార్యకర్త రవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ గోపాల్రావు -
జిల్లా ఓటర్లు 2,29,159
ములుగు: జిల్లాలోని 171 గ్రామ పంచాయతీల పరిధిలో 2,29,159 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్రావు, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఒంటేరు దేవరాజ్ మంగళవారం తుది జాబితా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. గత నెల 30వ తేదీ లోపు అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు 31న పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 224 అభ్యంతరాలు రాగా విచారణ చేసి పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించినట్లు వెల్లడించారు. 171జీపీలు.. 1520 వార్డులు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు, 1,520 వార్డులు ఉండగా 1536 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్త ంగా మొత్తం 2,29,159 మంది ఓటర్లు ఉండగా అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, 22 మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే అన్ని మ ండలాల్లో ఎక్కువగా ఉండడం గమనార్హం. గతంలో 1,535 పోలింగ్ స్టేషన్లు ఉండగా అదనంగా మరో పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు అ ధికారులు ప్రకటించారు. గత నెల 28న జిల్లాలో 2,28,911 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించగా అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం 248 మంది అదనంగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించి 2,29,159 మందితో తుది జాబితా ప్రకటించారు. తుది జాబితా ప్రకటించిన అధికారులు 224 అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన అధికారులు -
యూరియా కోసం.. అరిగోస
వెంకటాపురం(ఎం): పగలనకా.. రాత్రనకా.. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆపై రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. పలు చోట్ల పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయిస్తున్నారు. పోలీసులే రైతులకు యూరియా టోకెన్లు అందిస్తూ దగ్గరుండి అధికారులచే యూరియా పంపిణీ చేయిస్తున్నారు. అయినప్పటికీ యూరియా కోసం రైతుల ఆందోళనలు ఆగడం లేదు. కష్టాలు తీరడం లేదు. వ్యవసాయ పనులు మానుకొని సహకార సంఘాల వద్ద క్యూలు కడుతున్నారు. మంగళవారం వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లక్ష్మీదేవిపేటలో అర్ధరాత్రి 2 గంటల నుంచి, వెంకటాపురం మండల కేంద్రంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట క్యూ కట్టారు. అర్ధరాత్రి నుంచి క్యూలో నిలబడిన ఒక్కొక్కరికి ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి పంపుతున్నా చివరి వరుసలో ఉన్న రైతులకు అందలేదు. దీంతో పంటలను ఎలా సాగుచేయాలని, యూరియా కొరతతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అప్పడు లేని కొరత.. ఇప్పుడెందుకు? గతంలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎలా ఎదురైందని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో వరిపంట 1,30,117 ఎకరాల్లో, పత్తి 27,143, మొక్కజొన్న 8,365 ఎకరాలు, మిర్చి 6,900 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో 1,70,169 ఎకరాల్లో పంటలు సాగు అవుతుండగా, 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 11 వేల మెట్రిక్ టన్నుల యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంపిణీ చేసినప్పటికీ యూరియా కొరత ఉండడంతో ప్రశ్నార్థకంగా మారింది. యూరియాను రైతులు ముందస్తుగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మూలంగానే సన్న, చిన్న కారు రైతులకు యూరియా దొరకకుండా ఇబ్బందులు పడుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. పోలీసుల పహారాలో రైతులకు పంపిణీ పనులు మానుకుని క్యూలో ఉంటున్న అన్నదాతలు -
సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: ఏజెన్సీ గ్రామాలలో నెలకొన్న దళిత, గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిచేందుకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పా టు చేశారు. ఈ సమావేశానికి ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల నుంచి దళిత గిరిజన సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముందుగా ఐటీడీఏలో ఆయా శాఖల వారీగా అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో 1/70 యాక్ట్ ఉన్నప్పటికీ హక్కులను ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వెంకటయ్య మాట్లాడుతూ ఏజెన్సీలో జీవో నంబర్ 3 రద్దయిందని దాని అమలుకు కృషి చేస్తానని తెలిపారు. 6న కలెక్టర్రేట్లో సమావేశం ఈ నెల 6న కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాలన్నారు. దళిత గిరిజన సంఘాల నాయకులు కూడా పాల్గొనాలన్నారు. అధికారులందరూ ఒకేచోట ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు. వనదేతల దర్శనం.. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం వనదేవతలను వెంకటయ్య దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు నీలాదేవి, రాంబాబునాయక్, శంకర్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్లతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని పైలట్ గ్రామ పంచాయతీ టేకులగూడెంలో మంగళవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. బిల్లులు ఖాతాల్లో పడుతున్నాయని అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఇల్లు రాని వారు ఆందోళన చెందవద్దని అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతాయని వివరించారు. అలాగే మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడిన ఆయన మధ్యాహ్న భోజనంతో పాటు వంటగదిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిధిలోని పేరూరు పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో తయారు చేసిన ప్రణాళికల షెడ్యూల్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తప్పని సరిగా అమలు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అమలు తీరును సూపర్వైజర్లు పర్యవేక్షించాలన్నారు. ఆశ కార్య కర్తలు ప్రతీరోజు 20 ఇళ్లను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారికి మందులను ఇవ్వాలన్నారు. జ్వరం తగ్గకపోతే పీహెచ్సీలకు తీసుకురావాలని సూచించారు. అనంతరం ల్యాబ్, మందుల గది, ఇన్పేషెంట్ వార్డులను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. పేరూరు వైద్యశాలకు మరో మేడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జ్ ఎంపీవో శ్రీకాంత్ నాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.కలెక్టర్ టీఎస్.దివాకర -
కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు
● బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి ములుగు: కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసు నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించి రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ.. కాళేశ్వరంపై విచారణ పేరుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, ప్రధాని మోడీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్రగా పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టును మూసేసి, గోదావరి జలాలను ఆంధ్రకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయని అలాంటి ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలో రైతులకు సకాలంలో యూరియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.. -
లింగనిర్ధారణ పరీక్షలు నేరం
ములుగు రూరల్: లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ గోపాల్రావు అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్సీ వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడ పిల్లలను రక్షించాలి– ఆడ పిల్లలను చదివించాలి అనే నినాదంతో గ్రామాల్లో విస్తృతంగా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, శిశు సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి జిల్లా కోఆర్డినేటర్ రమాదేవి, వైద్యులు ప్రసాద్, నాగఅన్వేష్, డోమో సంపత్, సఖి సెంటర్ అడ్మిన్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా రాయినిగూడెం పీహెచ్సీలో అశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నియంత్రణలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు సమన్వయంతో పనిచేసి క్షయ రహిత సమాజాన్ని నిర్మించాలని సూచించారు. ములుగు: రేపు(గురువారం) జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రం వద్ద ప్రత్యేక అవసరాల చిన్నారులకు ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ సిద్ధార్థరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష, అలింకో వారి సౌజన్యంతో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ అవకాశాన్ని దివ్యాంగుల పిల్ల ల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరానికి చిన్నారులను తీసుకొచ్చే తల్లిదండ్రులు రెండు పాస్ఫొటోలు, 40 శాతం కంటే ఎక్కువగా దివ్యాంగత్వం ఉన్నట్లు సదరం ధృవపత్రం, ఆదాయం, రేషన్కార్డు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో మంగళవారం బాండ్ మొక్కజొన్న డీలర్లతో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా మొక్కజొన్న విత్తనాలు ఉత్పత్తి చేసి ఇబ్బందులకు గురికావద్దని తెలిపారు. భవిష్యత్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. విత్తనోత్పత్తి చేయదలిచిన రైతులు తప్పనిసరిగా ఆర్గనైజర్, కంపెనీ డీలర్ల నుంచి అగ్రిమెంట్ తీసుకోవాలని సూచించారు. రైతులు పాటించాల్సిన పద్ధతులు, దిగుబడిలో వచ్చే వ్యత్యాసం లాంటి వివరాలను అగ్రిమెంట్లో పొందు పరచాలన్నారు. -
వైఎస్సార్ దేశానికే ఆదర్శం
వెంకటాపురం(ఎం): దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి దేశానికే ఆదర్శమని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తాళ్లపహాడ్లో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మంగళవారం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల గుండెల్లో రాజన్న ఇంకా పదిలంగానే ఉన్నాడని, వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు మరువలేనివని అయిలయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి నవనీత్, కాంగ్రెస్ నాయకులు చెన్నోజు శ్రీనివాస్, జంగిలి రవి, చీకూర్తి రమేష్, ఎస్కె.జాకీర్, భూస సాంబయ్య, అన్నవేన రాజు, భూస గణేశ్, కూరెళ్ల సాంబయ్య, పులి రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పడిగాపులు కాసినా.. దొరకడం లేదు..
మూడు ఎకరాల సొంత భూమి ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేశాను. యూరియా కోసం ప్రతిరోజూ పడరాని పాట్లు పడుతూ యూరియా వచ్చిందంటే సొసైటీకి పరుగులు తీస్తున్న పరిస్థితి. రాత్రి నుంచి ఉదయం వరకు పడిగాపులు కాసినా బస్తా కూడా దొరకడం లేదు. ప్రస్తుతం యూరియా వేసేందుకు అదను దాటిపోతుంది. ప్రభుత్వం యూరియా పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలి. – దుర్గం సమ్మయ్య, లక్ష్మీదేవిపేట యూరియా కోసం రాత్రి నుంచి సొసైటీ ఎదుట క్యూలో నిల్చున్నాను. అయినా ఒక బస్తా కూడా దొరకలేదు. మూడు ఎకరాల్లో పత్తి, మూడు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. పంట సాగుకు 18 బస్తాల యూరియా అవసరం ఉండగా ఇప్పటికీ నాలుగు బస్తాలు మాత్రమే తీసుకున్నాను. యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. – శెట్టి రజినీకర్, వెంకటాపురం(ఎం) జిల్లాలో ఆగస్టు 31 వరకు 10,790 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశాం. సోమవారం 450, మంగళవారం 150 మెట్రిక్ టన్నుల యూరి యా పంపిణీ చేశాం. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు. అవసరానికి అనుగుణంగా మాత్రమే రైతులు యూరియా తీసుకెళ్లాలి. సెప్టెంబర్ 30 వరకు మరో 3,400 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది. – సురేష్కుమార్, ములుగు వ్యవసాయ అధికారి -
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
ములుగు రూరల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి నిమజ్జనానికి జిల్లా కేంద్రంలోని తోపుకుంట వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసీల్దార్ విజయభాస్కర్, సీఐ సురేష్కుమార్, ఎస్సై వెంకటేశ్వర్రావులు పరిశీలించారు. నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ఐదవ రోజు నిమజ్జనం చేశారు. అటవీశాఖ సిబ్బంది వినాయక నిమజ్జనంలో ఆటపాటలతో అలరించారు. వినాకుడిని వైభవంగా ఊరేగించి అనంతరం తోపుకుంటలో నిమజ్జనం చేశారు. -
సీపీఎస్ను రద్దు చేయాలని నిరసన
ములుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా జేఏసీ చైర్మన్ పోలురాజు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగులకు శాపమైన సీపీఎస్ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న యూపీఎస్ విధానం కూడా ఆమోధయోగ్యంగా లేదన్నారు. అనంతరం సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సర్వర్ అహ్మద్, వాసుదేవరెడ్డి, ఆదిరెడ్డి, రాజునాయక్, మేడి చైతన్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా జంపన్నవాగు
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/వాజేడు: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మండల పరిధిలోని మల్యాల, కొండాయి, గోవిందరాజులకాలనీ, ఐలాపురం గ్రామాలకు రాకపోకలు చిలిపోయాయి. వాగు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాగు ఉధృతి పెరిగినప్పుడు రాకపోకలను నిలిపివేస్తున్న పరిస్థితి. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పడవలను సైతం వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పక్కన పెడుతున్నారు. అలాగే మండల పరిధిలోని ఎలిశెట్టిపల్లి గ్రామానికి సైతం రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతలి గ్రామాల ప్రజలు వాగు వరద తగ్గితేగాని బయటకు వచ్చే పరిస్థితి లేదు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని కలిపాక వాగు ఉధృతంగా ప్రమాధ స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు గిరిజన గ్రామాలైన కలిపాక, ముత్తారం, పెంకవాగు, సీతరాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతున్న గోదావరి వరద రెండు రోజుల క్రితం నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి తగ్గుముఖం పట్టింది. రామన్నగూడెం వద్ద ఆదివారం 15.50మీటర్లు ఉండగా సోమవారం 13.91కు తగ్గింది. క్రమ క్రమంగా గోదావరి వరద తగ్గుతుండడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా వాజేడు మండల పరిధిలోని నీటిలో మునిగి ఉన్న రహదారులు క్రమంగా బయటపడ్డాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు కొనసాగుతున్నాయి. టేకులగూడెం గ్రామ చివరన మర్రిమాగు వద్ద జాతీయ రహదారి నుంచి వరద నీరు తగ్గడంతో రెండు రాష్ట్రాల మధ్యన రాకపోకలు కొనసాగుతున్నాయి. భారీ వర్షం.. లోతట్టు ప్రాంతం జలమయం మంగపేట: మండల పరిధిలోని రమణక్కపేట అటవి ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదతో లోతట్టు ప్రాంతం పూర్తిగా జలమయమైంది. సుమారు మూడు గంటల పాటు కుండపోతగా వర్షం పడడంతో గండొర్రెగుట్ట నుంచి వచ్చిన వరద నీటితో పాటు మల్లూరు వాగు మధ్యతరహ ప్రాజెక్టు కుడి కాల్వ ద్వారా వచ్చిన భారీ వరద తోడు కావడంతో గండిపడిన చోటు నుంచి గ్రామంలోని సీఎస్ఐ స్కూల్, అంబేడ్కర్ కాలనీ మీదుగా వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఉదయం 7 గంటల వరకు వరదనీరు ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు పైనుంచి ప్రవహించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం వర్షం తగ్గిపోవడంతో పాటు వరదనీరు పూర్తిగా తొలగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ తగ్గుముఖం పట్టిన గోదావరి -
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు..
మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. పింఛన్ కోసం వెళ్తే నీ పేరున డబ్బులు జమ కాలేదని చెబుతున్నారు. పింఛన్ అందించే ఉద్యోగిని అడిగితే పంచాయతీ కార్యదర్శి రాలేదు అంటూ తిప్పుతున్నాడు. మూడు నెలలుగా పింఛన్ రా కపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. అధి కారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – అంబటి సరోజన, జాకారం, ములుగు మండలం ఇందిరమ్మ ఇళ్ల జాబి తాలో పేరు వచ్చింది. దరఖాస్తు సమయంలో ఇంటి నిర్మా ణం ఉమ్మడి స్థలంలో నిర్మించుకుందామనుకుని నమోదు చేయించాను. ఇప్పడు అక్కడ అన్నదమ్ముల భూమి పంపకంలో ఇంటి నిర్మాణానికి ఇబ్బందిగా ఉంది. నాకు వేరే చోట స్థలం ఉంది. అక్క డ ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పించాలి. – అల్లి రాంబాబు, సుందరయ్య కాలనీ, వాజేడు ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా సమయంలో ల్యాబ్ టెక్నీషియన్గా తాత్కాలిక పద్ధతిలో పనిచేశాను. మూడు నెలలు ఈ –హెల్త్ ప్రొఫైల్ ప్రోగ్రాంలో పని చేశాను. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. ములుగు ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఇప్పించి ఉపాధి కల్పించాలి. – చిక్కుల రాకేశ్, అబ్బాపూర్, ములుగు మండలం -
కబడ్డీ పోటీల్లో తరంగిణి ప్రతిభ
వాజేడు: నేషనల్ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీల్లో ఆదివాసీ బిడ్డ ఉయిక తరంగిణి ప్రతిభ చూపింది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన ఉయిక రమేష్–రాంబాయి ల కూతురు తరంగిణి ఖమ్మంలోని నవోదయలో చదువుతున్న క్రమంలో ఆటలపై మ క్కువ చూపేది. ఈ క్రమంలో కబడ్డీపై దృష్టి సారించి నేషనల్ స్థాయికి చేరుకుంది. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించిన నేషనల్ జూనియర్ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబర్చింది. దీంతో ఆమె ఉత్తమ రైడర్గా ఎంపికై జిల్లాకు మంచిపేరు తీసుకొచ్చింది. ఆటల్లో మరింత ప్రతిభ చూపి ఉత్తమ క్రీడాకారిణిగా రాణించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని ఆమె వెల్లడించారు. తరంగిణి తండ్రి ఉయిక రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో 2024 నవంబర్ 21న మావోయిస్టులు హతమార్చిన ఘటన విధితమే. -
గిరిజన దర్బార్లో..
ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో కోయ భవన్ నిర్మాణానికి భూమిని కేటాయించడానికి ఐటీడీఏ అధికారులు దృష్టి పెట్టాలని బూటారానికి చెందిన గిరిజనులు కోరారు. మహబూబాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన గిరిజనుడు బెస్ట్ అవైలబుల్ స్కీం ఫీజు ఇప్పించాలని వేడుకున్నారు. రేగొండ మండలం రామన్నగూడెంకు చెందిన నిరుద్యోగి తనకు టెంట్హౌజ్ మీద రుణం ఇప్పించాలని కోరారు. ఇదే మండలంలోని రామన్నగూడెం తండాలో డ్రెయినేజీ నిర్మాణం చేపట్టానని అందుకు రావాల్సిన బిల్లు ఇప్పించాలని కోరారు. మహదేవ్పూర్ మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన రైతులు రైతు భరోసా ఇప్పించాలని వేడుకున్నారు. ఏటూరునాగారం మండలంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్వాహకులు కోరారు. ఇలా పలు సమస్యలపై బాధితులు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేష్బాబు, డీటీలు కిశోర్, అనిల్, కొమురం ప్రభాకర్, కొండల్రావు పాల్గొన్నారు. -
సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలి
ములుగు రూరల్: భారీ వర్షాలు, వరద సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క సీఎం సలహదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్, అదనపు కలెక్టర్ సంపత్రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కంట్రోల్ రూంలలో 24 గంటలు అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, కుంటల మరమ్మతులకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నేటి నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందని తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు.వీసీలో సీఎం రేవంత్రెడ్డి -
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం
ములుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ, ఫ్లెక్సీని దహనం చేసేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల నుంచి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం బడే నాగజ్యోతి విలేకర్లతో మాట్లాడారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అనేది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడి కాదని, తెలంగాణను ఎడారిగా మార్చే విద్రోహ చర్య అన్నారు. ఇందులో ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్రెడ్డిల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకే ముగ్గురు ఒక్కటయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఎదురు తిరుగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పోరిక విజయ్ రాంనాయక్, కోగిల మహేష్, వేములపల్లి భిక్షపతి, చెన్న విజయ్, గొర్రె సమ్మయ్య, గండి కుమార్, ఆకుతోట చంద్రమౌళి పాల్గొన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నాగజ్యోతి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా -
వినతులిచ్చాం పరిష్కరించండి
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు అజ్మీర బాలు. ఏటూరునాగారం మండలం లంబాడీతండా. ఈయన 2021–22లో ఈఎస్ఎస్ కింద కంగన్హాల్ షాపునకు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఇతడికి ఐటీడీఏ ట్రైకార్, కెనరా బ్యాంక్ ద్వారా సబ్సిడీ రుణం వచ్చింది. ఈయన ఖాతాలో సుమారు రూ.80 వేలు రుణం జమ అయ్యాయి. కానీ ఆ రుణాన్ని బ్యాంక్ అధికారులు, ఐటీడీఏ అధికారులు కలిసి లబ్ధిదారుడికి అందజేయాల్సి ఉంది. కానీ దానిని అందించడం లేదు. నాలుగేళ్ల నుంచి బ్యాంక్, ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. కానీ గ్రౌండింగ్ మాత్రం ఇవ్వడం లేదు. వ్యవసాయం చేయలేక ఇంటి వద్ద ఒక షాపు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకునేందుకు చేసిన ప్రయత్నం అధికారుల వల్ల నీరుగారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల బాధితులు అనేకమంది ఉండడం గమనార్హం. ములుగురూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ సమస్యలపై 70 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ టీఎస్.దివాకర అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్తో కలిసి వినతులు స్వీకరించగా ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు డీడీ పోచంతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో 50 ఫిర్యాదులు రాగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్లో 20 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆయా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో దరఖాస్తుదారుడికి సమాచారం అందించి సమస్యను వివరించాలని సూచంచారు. స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఏపీఓ వసంతరావు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు -
ఇన్చార్జ్ డీఈఓగా సిద్ధార్థరెడ్డి బాధ్యతలు
ములుగు: జిల్లా విద్యాశాఖ అధికారిగా సోమవారం సిద్ధార్థరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ములుగు ఇండస్ట్రీస్ మేనేజర్గా కొనసాగుతున్న సిద్ధార్థరెడ్డికి ఇన్చార్జ్ డీఈఓగా అదనపు బాధ్యతలను కలెక్టర్ దివాకర అప్పగించారు. గత జూన్ 16న డీఈఓ పాణిని లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో సస్పెండ్ అయ్యాడు. హనుమకొండ డీఈఓ వాసంతికి జూన్ 17న జిల్లా డీఈఓగా అదనపు బాధ్యతలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆమె విధుల్లో చేరలేదు. దీంతో కలెక్టర్ చొరవ తీసుకుని ఇంటర్ విద్యాశాఖ అధికారి చంద్రకళకు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు బాధ్యతలు నిర్వర్తించడం ఆమెకు ఇబ్బందిగా మారడంతో సోమవారం సిద్ధార్థరెడ్డికి ఇన్చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగించారు. ఎస్ఎస్తాడ్వాయి: ఆదివాసీ ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దు, హింసామార్గం విడిచి సాధారణ ప్రజా జీవితంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కరపత్రాలు వెలిశాయి. మండల పరిధిలోని బయ్యక్కపేట, ఊరట్టం, కాల్వపల్లి గ్రామాల్లో పలుచోట్ల కరపత్రాలు కనిపించాయి. మావోయిస్టులతో ఒరిగేదేమి లేదని అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మావోయిస్టుల అవసరం లేదని.. గ్రామాల అభివృద్ధికి, పిల్లల భ విష్యత్ బాగుండాలంటే మావోయిస్టుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయం ఆయా గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ములుగు రూరల్: యాసంగిలో రైతులు పండించిన సన్నధాన్యానికి బోనస్ డబ్బులు చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందించి మాట్లాడారు. బోనస్ డబ్బులు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు సకాలంలో యూరియా అందించాలన్నారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని దుయ్యబట్టారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర దక్కేలా చట్టం చేయాలని కోరారు. ములుగు రూరల్: ఆశ కార్యకర్తలకు అందిస్తున్న వేతనాలను తగ్గిస్తామని ఆరోగ్యశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ వేతనాల జీఓను విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టగా అడ్డుకుని అరెస్టులు చేయడం సరికాదన్నారు.అరెస్టు అయిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, మంజుల, సరిత, రజిత, యశోద, శ్రావ్య, మాధవి, శోభ, స్వరూప పాల్గొన్నారు. ములుగు: గంజాయి సేవిస్తున్న 8 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం ములుగు మండలం ఇంచర్ల సమీపంలో కిలోన్నర గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ములుగు పోలీసులు పట్టుకొని విచారించినట్లు తెలిసింది. దీంతో వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన నలుగురు, ములుగుకు చెందిన ఇద్దరు, ఇంచర్లకు చెందిన మరో యు వకుడికి సుమారు 500 గ్రాముల గంజాయిని విక్రయించానని పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మిగతా ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్టెక్వెల్ వద్ద ఫేజ్.2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇలానే తగ్గుముఖం పడితే కొన్నిచోట్ల రహదారులు బయటపడే అవకాశం ఉంది. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో ఆయా గ్రామాలకు ఇంకా రాకపోకలు కొనసాగడం లేదు. జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద మునగడంతో గ్రామస్తులు గుట్ట పక్కన ఉన్న పాత దారి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల -
3న కార్మిక పోరాట బహిరంగ సభ
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3వ తేదీన బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక పోరాట బహిరంగ సభను భూపాలపల్లి ఏరియాలో నిర్వహించనున్నట్లు బీఎంఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు యూని యన్ కార్యాలయంలో ఆదివారం వాల్పోస్టర్ ఆవి ష్కరణ చేపట్టారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏరియాలోని అంబేడ్కర్ సెంటర్లో సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్, బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ లక్ష్మారెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాధవనాయక్, హాజరు కానున్నట్లు తెలిపారు. -
రైతులను రోడ్డు మీదేసిన కాంగ్రెస్
రేగొండ: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం గోస పడుతుందని, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నమ్మి ఓట్లేస్తే .. రైతులను నడి రోడ్డున నిలబెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆదివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగం సాగు అవసరాలపై ముందు చూపు లేకపోవడమే రైతుల కష్టానికి కారణమన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. -
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి అర్బన్: ఆదాయాన్ని రాబట్టి లాభాల బాటపట్టేలా అన్ని మార్గాలను ఆర్టీసీ యాజమాన్యం అన్వేషిస్తోంది, గతంలో ప్రయాణికుల సమస్యలను అంతగా పట్టించుకోని ఆర్టీసీ నేడు ప్రయాణికులకు చేరువయ్యేందుకు వినూత్న సేవలను ప్రవేశపెట్టడానికి ప్రణాళిక రూపొందించుకుంది. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి వినోద, విహరయాత్రలకు ప్రత్యేక బస్సులను నడిపించే చర్యల్లో నిమగ్నమైంది. ఆదాయానికే పరిమితం కాకుండా ప్రయాణికుల కుటుంబాలకు సైతం వినోదం, విహరయాత్రలను పంపించేందుకు ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. ఇది వరకే ప్రయాణికులను ఆదరించేలా ప్రతి డిపోలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్య విధుల్లో తీరికలేకుండా గడిపే వారికి కాలక్షేపం కోసం, తీర్థయాత్రలపై ఆసక్తి ఉన్న వారికోసం ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నారు. ప్రయాణికులు ఎక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారన్నది తెలుసుకొని ఈ యాత్ర ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా యాత్ర వివరాలు, తేదీలు, చార్జీలను ప్రకటించి ప్రయాణికులు పేరు నమోదు చేసుకునే విధంగా ప్రచారం చేపడుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఈ నెలలో 4 టూర్ ప్యాకేజీల వివరాలను ప్రారంభించారు. విహర, వినోద యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఈ నెలలో నాలుగు రూట్లలో బస్సులు నడపడానికి ప్రణాళికలు రూపొందించాం. ముందస్తుగా డిపోలో పేర్లు నమోదు చేసుకొని సీట్లు రిజర్వేషన్ చేసుకోవాలి. – ఇందూ, డిపో మేనేజర్, భూపాలపల్లి ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఆదాయ పెంపునకు అధికారుల చర్యలు ఈ నెలలో మూడు టూర్లకు ప్యాకేజీలు సిద్ధం -
గుంతలో దిగబడిన 108 వాహనం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామ సమీపంలో ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో 108వాహనం శనివారం రాత్రి రెండు గంటల సమయంలో దిగబడింది. వివరాల్లోకి వెళ్లే.. బోదాపురం గ్రామ సమీపంలోని ఇసుక రీచ్ వద్ద లారీ డ్రైవర్ పాము కాటుకు గురయ్యాడు. గమనించిన లారీ డ్రైవర్లు 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు పాము కాటుకు గురైన డ్రైవర్ను తీసుకువచ్చేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం రామచంద్రాపురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా లారీలు అడ్డురావడంతో పక్క నుంచి వెళ్తున్న 108వాహనం గుంతలో దిగబడింది. దాన్ని బయటకు తీసేందుకు 108 సిబ్బంది, గ్రామస్తులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు. అనంతరం బోదాపురం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎస్సైకి సమాచారం అందించారు. దీంతో ఆలుబాక గ్రామానికి చెందిన ముస్తాఫా పాము కాటుకు గురై న డ్రైవర్ పాషాను ద్విచక్రవాహనంపై రామచంద్రాపురం తీసుకొచ్చి 108 వాహనం ఎక్కించారు. దీంతో సిబ్బంది పాషాకు వాహనంలో చికిత్స అందిస్తూ వెంకటాపురం వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించగా కోలుకుంటున్నాడు.గంటపాటు శ్రమించి బయటకు తీసిన సిబ్బంది, గ్రామస్తులు -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: స్కావెంజర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జిల్లా పరిషత్ పాఠశాలల స్కావెంజర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యనమల ప్రవీణ్కుమార్ అన్నా రు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో స్కా వెంజర్ల జిల్లా కమిటీ ఎన్నిక, సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని తెలిపారు. స్కావెంజర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పిల్లల సంఖ్య ఆధారం కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా వాసం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా మానస, ఇర్ప రాధికలను ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్కుమార్ -
అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
వెంకటాపురం(కె): మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. ఎఫ్డీఓ ద్వాలి యా తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురం గ్రామ సమీపం నుంచి అక్రమంగా ఓ వ్యాన్లో తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎదిర, రామచంద్రాపురం, వెంకటాపురం అటవీ శాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. మొర్రవానిగూడెం గ్రామ శివారుల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో వారిని గమనించిన వ్యాన్ డ్రైవర్ సుమారు రూ.8 లక్షల విలువ చేసే టేకు కలపను వదిలేసి పారిపోయాడు. వాహనంతోపాటు కలపను వెంకటాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ద్వాలియా తెలిపారు. దాడిలో శ్రీనివాసరా వు, దేవయ్య, లక్ష్మణ్దాస్ ఉన్నారు.