breaking news
Mulugu District News
-
వైభవంగా గోదాదేవికి సారె..
మంగపేట: మండలంలోని కమలాపురం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా గోదారంగనాయక మహిళా కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, వంశీకుమారాచార్యులు ఉదయం గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో కమలాపురం పాతూరులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి అమ్మవారికి పసుపు. కుంకుమ, పూలు, గాజులు, పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం, వివిధ రకాల పిండి వంటలు, పండ్లు పట్టుకుని భక్తులు సతీసమేతంగా మంగళవాయిద్యాల నడుమ ఆటోస్టాండ్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఆలయానికి చేరుకుకున్నారు. అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపించి సారెను సమర్పించారు. అనంతరం నిర్వహించిన కుంకుమ పూజలో గోదారంగనాయక మహిళా కమిటీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ పాల్గొని గోదాదేవి అనుగ్రహించి తమ కోరికెలను తీర్చాలని వేడుకుంటూ పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తుల గోత్రనామాలతో ఆలయ పూజారి ప్రత్యేక అర్చనలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేడు(మంగళవారం) గోదాదేవి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పూజారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.భక్తిశ్రద్ధలతో మహిళల పూజలు -
ఓటర్లు 13,963
వార్డుల వారీగా ఓటర్ల వివరాలుమున్సిపాలిటీ తుది ఓటరు జాబితా విడుదలములుగు: మున్సిపాలిటీ అధికారులు ఎన్నికల తుది ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసి ప్రదర్శించారు. ములుగు పట్టణంతో పాటు బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను కలుపుకొని 2024 ఫిబ్రవరి 2న ములుగు మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో 13,963 మంది ఓటర్లతో జాబితాను ప్రకటించారు. ఇందులో పురుషులు 6,661 మంది, మహిళలు 7,300 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నా రు. మున్సిపాలిటీగా ఆవిర్భవించిన ములుగులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీలో 20 వార్డులు ములుగు మున్సిపాలిటీలో ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. జనవరి 20వ తేదీ లోగా నోటిఫికేషన్ రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం మున్సిపాలిటీల పరంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో సోమవారం తుది ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. ములుగు పట్టణంలో 20 వార్డులకు గాను 20 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. జనవరి 1న అధికారులు 14,112 మందితో ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత 149 ఓటర్లను తొలగించి 13,963 మందితో తుది జాబితా విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 వేల జనాభా ఉండగా 1,844 మంది ఎస్టీలు, 2,470 మంది ఎస్సీలు ఉండగా మిగిలిన జనాభాలో బీసీ, ఓసీలు ఉన్నారు.వార్డు పురుషులు మహిళలు ఇతరులు 1 321 350 0 2 333 404 1 3 342 410 0 4 380 393 0 5 299 355 0 6 315 312 0 7 371 364 0 8 355 342 0 9 329 366 0 10 350 395 1 11 344 367 0 12 381 409 0 13 326 362 0 14 354 402 0 15 380 379 0 16 291 325 0 17 312 317 0 18 293 345 0 19 277 337 0 20 308 366 0 పురుషులు 6,661.. మహిళలు 7,300 తొలిసారిగా ములుగు మున్సిపాలిటీలో ఎన్నికలు రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠచైర్మన్ పీఠంపై పార్టీల నజర్ ములుగు మున్సిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనుండడంతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ కావడంతో చైర్మన్ పదవి ఎస్టీ రిజర్వేషన్ వస్తుందా.. లేదా జనాభా ఆధారంగా ఎస్సీ, బీసీలకు కేటాయిస్తారా అని ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుండగా, పట్టణంలో ఎలాగైన తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు బీఆర్ఎస్, బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. -
రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించగా రూ.6,71,954ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్లు పాల్గొన్నారు. ములుగు రూరల్: విద్యుత్ వినియోగదారులు ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్శాఖ ఎస్ఈ ఆనందం అన్నారు. ఈ మేరకు సోమవారం ఉచిత విద్యుత్ వినియోగదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. వ్యవసాయ రైతులకు సైతం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. జిల్లాలో గృహజ్యోతి పథకంలో 40,855 మంది, వ్యవసాయ విద్యుత్ వినియోగంలో 25,427 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్రావు, ఏఈ రవి, లైన్ ఇన్స్పెక్టర్లు జహీర్ తదితరులు పాల్గొన్నారు. వాజేడు: అడవుల సంరక్షణ అందరి బాధ్యతని ఎఫ్ఎస్ఓలు నాగమణి, భిక్షపతి అన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని పూసూరు, కృష్ణాపురం గ్రామాల్లో సోమవారం అడవులతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అడవులతో మానవాళికి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. అడవులకు నిప్పు పెడితే చెట్లతో పాటు జంతువులు మృత్యువాత పడుతాయని తెలిపారు. అనంతరం యువకులకు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి పూసూరు, కృష్ణాపురం సర్పంచ్లు దబ్బగట్ల సుమన్, పూనెం విజయ్బాబులు బహుమతులు ప్రదానం చేశారు. ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వయోవృద్ధుల కొరకు ఏర్పాటు చేసిన ప్రణమ్ డే కేర్ సెంటర్ను సీఎం రేవంత్రెడ్డి సోమవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి తుల రవి, ములుగు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కోశాధికారి సతీష్, కార్యదర్శి రమేష్, నాగరాజు, జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు ఐలయ్యలు రిబ్బన్ కట్ చేసి కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ డే కేర్ సెంటర్ వయోవృద్ధుల ఉల్లాసానికి, క్రీడా కార్యక్రమాలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్చార్జ్ నాగేంద్ర, ఎఫ్ఆర్ఓ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రేపు ఉదయం 10 గంటలకు శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. -
విద్యాసంస్థల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలి
ములుగు: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం సాయంత్రం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణంపై ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ఈ వీసీలో ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో ఉంచేందుకు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పుతుందన్నారు. జిల్లాల వారీగా స్కూల్స్ నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తగు ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాకు ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేయగా సంబంధిత పాఠశాలకు భూమిని కేటాయించినట్లు తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు అదనపు కలెక్టర్ మహేందర్ జీ, మున్సిపల్ కమిషనర్ సంపత్ రావు, డీఈఓ సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు.వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క -
పరిశుభ్రతే లక్ష్యం
సేకరించిన చెత్తను ట్రాక్టర్లో వేస్తున్న కార్మికులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా అధికారులు ప్రణాళికతో తగిన చర్యలు చేపడుతున్నారు. ఈ సారి మహాజాతరకు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారనే అధికారుల అంచనాతో జిల్లా పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో జాతరలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. మహాజాతర సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా మేడారం ప్రాంతంలో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి దింపనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ రోడ్లు, జంపన్నవాగు, ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచనున్నట్లు చెబుతున్నారు. జాతరకు 20 మంది డీపీఓలు మేడారం మహాజాతరలో జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో విధుల నిర్వహణకు భారీ సంఖ్యలో అధికారులను, సిబ్బందిని నియమించనున్నారు. డీపీఓలు 20 మంది, డీఎల్పీఓలు 40 మంది, ఎంపీఓలు 120 మంది, పంచాయతీ కార్యదర్శులు 500 మందిని జాతరలో పారిశుద్ధ్య పనుల విధుల నిర్వహణకు నియమించనున్నట్లు డీపీఓ వెంకయ్య తెలిపారు. ముందస్తు జాతరలో చెత్త సేకరణ, శుభ్రత నిర్వహణ, దుమ్ము ధూళి సమస్యలు తలెత్తకుండా ముందస్తు పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మేడారంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన జాకెట్లు, మాస్కులు వంటి రక్షణ సామగ్రిని అందించేందుకు 9 మంది ఎంపీఓలు, 150 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.మేడారం మహాజాతరలో పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశాం. భక్తులకు పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. గత జాతర కంటే ఈ సారి జాతరలో వెయ్యిమంది కార్మికుల సంఖ్యను పెంచాం. మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు, కలెక్టర్ దివాకర సూచనలు, సలహాల మేరకు జాతరలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. జాతరలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేయకుండా భక్తులు సహకరించాలి. – కొండ వెంకయ్య, డీపీఓ●ఈ సారి జాతరలో పారిశుద్ధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక యంత్రాలను వినియోగించనున్నారు. 150 ట్రాక్టర్లు, 5 వేల జాకెట్లు, 1.50 లక్షల మాస్కుల కొనుగోలు, 18 స్వీపింగ్ యంత్రాలు, 50 స్వచ్ఛ ఆటోలు, 20 బాబ్ క్యాట్లు, 20 జేసీబీలు, 40 డోజర్లు, 10 వ్యాక్యూమ్ క్లీన్ యంత్రాలు, 50 వాటర్ ట్యాంకులు, మహిళల కోసం 13 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖల నుంచి సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతరలో పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రజారోగ్య పరిరక్షణతో పాటు జాతర గౌరవాన్ని మరింత పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. మూడు షిఫ్టుల్లో పనులు క్లీనింగ్కు భారీగా యంత్రాలు -
‘సీఎం పర్యటనను విజయవంతం చేయండి’
ములుగు రూరల్: ఈ నెల 18న మేడారం రానున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్ అన్నారు. మండల పరిధిలోని మల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం మేడారం వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, నాయకులు బొక్క సత్తిరెడ్డి, వెంకన్న, వాకిడి రామకృష్ణారెడ్డి, మల్లంపల్లి సర్పంచ్ శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్: జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు మండలంలోని రాయినిగూడెం ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు పాఠశాలలో సోమవారం విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈరులాల్ అభినందించారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఈ నెల 7 వ తేదీ నుంచి 9 వరకు నిర్వహించిన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మేరకు పాఠశాలకు చెందిన తరుణ్, మహేశ్లు హెల్త్ అండ్ హైజెనిక్ అనే అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 18న జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు జిల్లా నుంచి పాల్గొననున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బానోత్ ఈరులాల్, గైడ్ టీచర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
లక్ష్మీదేవరకు బోనమెత్తిన భక్త జనం
కాళేశ్వరం: కాళేశ్వరంలో లక్ష్మీదేవర కిష్టస్వామి కల్యాణం భక్తిశ్రద్ధలతో నాయకపోడ్ పూజారుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం కల్యాణం, బోనాల సందర్భంగా మహిళా భక్తులు బోనమెత్తారు. ఆలయం చుట్టూర డప్పు చప్పుళ్లు, శివసత్తుల ఆటపాటలు, పూనకాలతో జయజయ ధ్వానాలతో మార్మోగింది. లక్ష్మీదేవరకు పట్నంతో బోనం సమర్పించి ప్రత్యేకంగా పూజలు, మొక్కులు చెల్లించారు. దీంతో భారీగా భక్తజనం తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూజారులు ఇనుముల వెంకటేష్, ఇనుముల రాకేష్, పోలం లస్మయ్య, ఇనుముల రాములు, ఇనుముల కిష్టయ్య, కిరణ్ పాల్గొన్నారు. -
జేబు దొంగల హెచ్చరిక
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో జేబు దొంగలున్నారు..జాగ్రత్త చేతివాటం ప్రదర్శించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మేడారంలోని నార్లాపూర్ పీఎస్ పోలీసులు గత జాతరలో జేబు దొంగతనాలకు పాల్పడిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్ను సోమవారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భక్తులు నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు జాగ్రతగా ఉంచుకోవాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. -
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
వెంకటాపురం(ఎం): ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం జాతర ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మేడారం తరలివచ్చి సీఎం రేవంత్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పీవీ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలం నుంచి ప్రతీ కార్యకర్త హాజరయ్యేలా సంబంధిత నాయకులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిల్కూరి అయిలయ్య, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్రెడ్డి, నాయకులు బండి శ్రీనివాస్, పోశాలు, రేవంత్, కోటి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్ -
మేడారంలో భక్తుల సందడి
ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తల్లులకు ఎత్తు బంగారం సమర్పించారు. చీర, సారె సమర్పించి తల్లులకు మొక్కులు చెల్లించారు. భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. కాగా, ఆదివారం ఒక్క రోజే సుమారు 5 లక్షల మంది తల్లులను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. – ఎస్ఎస్ తాడ్వాయి -
బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్
మల్హర్: తాడిచర్ల ఓపెన్కాస్ట్–2 ప్రాజెక్ట్ ఏర్పాటుకు మండలంలోని మల్లారం (దుబ్బపేట) కస్తూర్భా సమీపంలోని వ్యవసాయ భూముల్లో జీహెచ్ఐ కంపెనీ బొగ్గు అన్వేషణకు డ్రిల్లింగ్ చేస్తుంది. జీహెచ్ఐ కంపెనీ ప్రతినిధులు సదరు వ్యవసాయ భూమిలో ఇప్పటికే 450 మీటర్ల లోతులో డ్రిలింగ్ చేపట్టారు. మరో 200 నుంచి 300 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేస్తే బొగ్గు నాణ్యతను గుర్తించవచ్చని అంటున్నారు. ఇప్పటికే పెద్దతూండ్ల కిషన్రావుపల్లిలో, తాడిచర్ల శివారులోని పెద్దతూండ్ల ఆరెవాగు వంతెన సమీపంలో డ్రిల్లింగ్ వేశారు. భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షకు 159 మందికి గాను 113 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారు. డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షకు 50 మంది విద్యార్థులకు 46 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. -
పుస్తకావిష్కరణ
ఎస్ఎస్తాడ్వాయి: సమ్మక్క –దీ గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెంటి వెంకటరమణ రచించిన పుస్తకాన్ని మేడారంలో మంత్రి సీతక్క కలెక్టర్ దివాకరతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం జాతర విశిష్టతను ఆదివాసీ సంస్కృతి– సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రూపొందించారని సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, డీపీఆర్వో రఫీక్ పాల్గొన్నారు. చిన్నారి తల్లిదండ్రులకు అప్పగింత అదే విధంగా మేడారంలో జాతర ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షిస్తున్న సమయంలో ఓ చిన్నారి తప్పిపోయిన విషయాన్ని సీతక్క గమనించారు. వెంటనే అధికారులు ఆ చిన్నారి వివరాలు సేకరించి తల్లిదండ్రులను గుర్తించగా వారికి అప్పగించారు. జాతరలో చిన్నపిల్లలను జాగ్రతగా చూసుకోవాలని మంత్రి సీతక్క తల్లిదండ్రులకు సూచించారు. మేడారంలో భక్తులు, పిల్లలు తప్పిపోతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
ప్రత్యేక అలంకరణలో హేమాచలుడు, స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు ఆచరించి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారిని నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
ప్రగతిపథాన నిలుపుతాం..
యువత సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను. నేను బీఎస్సీ చదవాను. రాజకీయాల్లోకి వచ్చి గ్రామాన్ని బాగు చేయాలనే ఆలోచనతో వచ్చి సర్పంచ్ అయ్యాను. గ్రామంలోని యువతరం సహకారం తీసుకుని ప్రజల సమస్యలను పరిష్కరిస్తాను. రోడ్లు, తాగునీరు, విద్య, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూస్తాను. – బోదెబోయిన భరత్ కుమార్, గుమ్మడి దొడ్డి గ్రామ సర్పంచ్నేను ఇంటర్మీడియట్ చదివాను.26ఏళ్లకే సర్పంచ్ అయ్యాను. గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నాను. తొలుత గ్రామంలోని ప్రధాన సమస్యలపై దృషిసారించి ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్లాన్తో ముందుకు వెళ్తాను. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రామాభివృద్ధికి పాటుపడుతాను. – రాందేని నర్సింహామూర్తి రాజు, షాపెల్లి సర్పంచ్ -
ఘనంగా వడ్డె ఓబన్న జయంతి
ములుగు రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఓబన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సాయుధ పోరాట సైనాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రభుత్వం ఓబన్నకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దండుగుల మల్లయ్య, సారంగపాణి, నర్సయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘నాయీబ్రాహ్మణులకు గుర్తింపు కార్డులివ్వాలి’ ములుగు రూరల్: మేడారం జాతరలో నాయీబ్రాహ్మణులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కల్యాణ కట్టల అధ్యక్షుడు అన్నం మోహన్కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో నాయీబ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూ డాలన్నారు. వృత్తిదారులు ఆధార్, కుల ధ్రువీ కరణ సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తించి ఉచిత వసతి, భోజనం సౌకర్యం కల్పించాలన్నారు. జాతర ఆదాయంలో ఎక్కువశాతం కేశఖండన ద్వారానే సమకూరుతుందని తలనీలాలతో వచ్చే ఆదాయంలో నాయీబ్రాహ్మణులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతర ట్రస్టు బోర్డులో సైతం అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. రేగొండ: మండలంలోని కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా నేడు (సోమవారం) స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మహేష్, చైర్మన్ ముల్కనూరి భిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 19న సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలో నిర్వహించిన జీపు జాతలో పాల్గొని మాట్లాడారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సకల జనులను చైతన్యం చేయడం కోసం జీపు జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బందు సాయిలు, నాయకులు రజినీకాంత్, శ్రీకాంత్, దేవేందర్, ప్రీతి, నవీన్, క్రాంతి, రవికమార్, రాజేందర్ పాల్గొన్నారు. -
4.30 ఎకరాలు.. 2,732 మొక్కలు
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగుఏటూరునాగారం: ఏడేళ్లుగా పడావుపడిన భూమిని ఐటీడీఏ అధికారులు సాగులోకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ భూమి అసాంఘిక శక్తులకు, అక్రమార్కులకు అడ్డాగా మారింది. ఈ క్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా స్పందించి ఏటూరునాగా రం మండల కేంద్రంలోని ఉద్యాన నర్సరీ(గార్డెన్) స్థలంలో పండ్లు, పూల మొక్కల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ ద్వారా బడ్జెట్ను కేటాయించి నర్సరీలో బోరు నిర్మాణ చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాంతాల నుంచి అనేక రకాల మొక్కలను తెప్పించారు. అనునిత్యం మొక్కల పర్యవేక్షణ ఐటీడీఏకు చెందిన 4.30 ఎకరాల్లో గార్డెన్లో 2 వేల మల్లె మొక్కలు, 116 నిమ్మ, 116 సపోట, 250 టేకు మొక్కలను ఇటీవల ఐటీడీఏ ఏపీఓ వసంతరావు చేతుల మీదుగా మొక్కలను నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే 250 కొబ్బరి మొక్కలు నాటే పనులతో పాటు డ్రిప్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ మొక్కలను పెంచేందుకు ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేశారు. నిత్యం పర్యవేక్షణతో పాటు దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్, హాస్టళ్లలో సరఫరా చేసే విధంగా పక్కా ప్లాన్ చేశారు. వీటికి ఖర్చును ఐటీడీఏ ద్వారా బడ్జెట్ కేటాయించారు. అలాగే వెదురు మొక్కలను మాత్రం ఉపాధి హామీ పథకం ద్వారా నాటించేలా చర్యలు తీసుకున్నారు. వెదురు మొక్కల సాగు వల్ల వచ్చే ఆర్థిక ఫలాలను ఐటీడీఏకు అందజేయనున్నారు. ఇప్పటికే మల్లె, సపోట, టేకు, నిమ్మ మొక్కలు నాటే పనులు పూర్తయ్యాయి. వెదురు ప్లాంటేషన్ పనులు సాగుతున్నాయి. రెండేళ్లలోపు దిగుబడి తీసి ఫలాలను హాస్టళ్లకు సరఫరా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. గతంలో గిరిజనులకు ఈ స్థలాన్ని లీజ్కు ఇచ్చి కూరగాయల పంటలను దిగుబడి చేసి ఆర్థిక ఫలాలు వచ్చేవిధంగా చేశారు. అయితే ఆ సమయంలో ఏడాది పాటు సాగు జరిగింది. తర్వాత లాభాలు రావడం లేదని గిరిజన మహిళా సంఘం ఉపసంహరించుకున్నారు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిలో ఎలాంటి సాగు జరగలేదు. అనేక మార్లు సాక్షి కథనాలు ప్రచురించింది. పడావుపడిన భూముల్లో అసాంఘిక శక్తులు, భూమి కబ్జా విషయాలపై అధికారులకు కళ్లు తెరిచేలా కథనాలు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి స్వయంగా పంటల సాగుకు చర్యలు చేపట్టారు. పీఓ చిత్రామిశ్రా చొరవతో సాగులోకి భూమి బడ్జెట్ కేటాయింపు.. బోరు నిర్మాణం -
భక్తులతో రామప్ప కళకళ
వెంకటాపురం(ఎం) : మేడారం భక్తులతో రామప్ప ఆలయం కళకళ లాడుతోంది. సమ్మక్క–సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు రామప్ప ఆలయాన్ని చూసేందుకు వస్తుండడంతో రామప్ప కిక్కిరిసిపోతుంది. దీంతో పూజారులు గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా ప్రదానం ద్వారం వద్దనే తీర్థప్రసాదాలు అందించి పంపిస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప గార్డెన్లో ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. రామప్ప సరస్సు వద్దకు వెళ్లి బోటింగ్ చేశారు. రామప్పను సందర్శించిన మహబూబాబాద్ జిల్లా జడ్జి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. రామప్ప శిల్పకళా సంపదను గైడ్ వెంకటేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూమిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట : మండలంలోని మల్లూరు హేమాచల క్షేత్రం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీనర్సింహ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద స్నానాలు చేసి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరంతో పోలి ఉండే స్వామి వారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. భక్తుల గోత్రనామాలతో అర్చకులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేదాశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా మారింది. -
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
● మంత్రి సీతక్కములుగు రూరల్ : మేడారం మహాజాతరకు రానున్న భక్తులకు రవాణా అంతరాయం కలగకుండా బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. శనివారం మల్లంపల్లి కెనాల్పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతకు వచ్చే భక్తులకు మల్లంపల్లి బ్రిడ్జి అత్యంత కీలకమని, జాతర ప్రారంభానికి ముందే బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూసుకో వాలని, తాత్కాలిక రోడ్డు, భద్రత ఏర్పాట్లు చే యాలని వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మార్కెట్ కమిటీ చైర్ పర్స న్ రేగ కల్యాణి, ఆత్మ చైర్మన్ కొండం రవీంద ర్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. శనివారం రాత్రి వరకు జాతర పనుల పురోగతిని సమీక్షించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ అధికారులు, పోలీసు సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జాతర విధుల్లో ఉన్న పోలీసులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆమె సూచించారు. కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలి ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. 20 వార్డులను గెలిచి ములుగు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగుర వేయాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా సీతక్క హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కష్టపడిన ప్రతీ కార్యకర్తకి పార్టీ పరంగా గుర్తింపు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనను జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సీఎం విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, పీసీసీ కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, నాయకులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, భగవాన్ రెడ్డి, వంగ రవియాదవ్, మామిడిశెట్టి కోటి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
జాతరలో మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్ : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో సిద్ధమయ్యారు. గత జాతర అనుభవాల దృష్ట్యా భక్తులకు వైద్య సేవలు కల్పించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. భక్తులకు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సేవలు అందించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ముందస్తుగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ములుగు జనరల్ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వసతుల కల్పన చేపట్టారు. టీటీడీ కల్యాణ మండపంలో ప్రధాన ఆస్పత్రి మేడారం గద్దెల పరిసరాల్లోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ప్రధాన ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు జంపన్నవాగు, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆరు పడకల సామర్థ్యంతో రెండు మినీ ఆస్పత్రులు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర చికిత్స, గుండెపోటు, ప్రమాదాలు జరిగిన సమయంలో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు వీలుగా 35 అంబులెన్స్లను సిద్ధం చేశారు. 8 రూట్లలో 42 రూట్ క్యాంపులు 8 ప్రధాన రహదారుల్లో భక్తులకు సేవలు అందించేందుకు 42 రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ నుంచి మేడారం రూట్లో 9 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే రూట్లో ఆరు, భద్రాచలం రూట్లో ఐదు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. 3,199మంది వైద్య సిబ్బంది ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన 3,199 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది మహిళా వైద్యులు, 544 మంది వైద్యులు విధులు నిర్వహించడంతో పాటు 2,150 మంది పారా మెడికల్ సిబ్బంది, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వైద్యసేవలు అందించనున్నారు. జనవరి 25 నుంచి పూర్తిస్థాయిలో.. జనవరి 25వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వైద్య శిబిరాలు ప్రాంభించనున్నారు. శిబిరాల్లో 248 రకాల మందులు, సర్జికల్ సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. ప్రణాళికా బద్ధంగా వైద్య సేవలు అందించడంలో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ ఉండనుంది. మేడారంలో 3 ఆస్పత్రులు, 30 మెడికల్ క్యాంపులు 42 రూట్ క్యాంపులు, 35 అంబులెన్స్లు విధులు నిర్వహించనున్న 3,199 మంది సిబ్బంది -
గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ములుగు రూరల్ : ఆది దేవత గట్టమ్మ తల్లిని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మేడారంలోని సమ్మక్క–సారలమ్మల దర్శనానికి కుటుంబ సమేతంగా బయలుదేరిన ఆయన మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రకృతి ఒడిలో కొలువైన గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి ములుగు రూరల్ : మైదాన ప్రాంతాల్లో గాలిపటాలు ఎగురవేయాలని, విద్యుత్ వాహకం కలిగిన చైనా మాంజాను వినియోగించకూడదని విద్యుత్ శాఖ ఎస్ఈ ఆనందం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా.. సురక్షితంగా సంక్రాంతి సంబురాలు నిర్వహించుకోవాలని ఆయన వివరించారు. గాలిపటాలు ఎగురవేయడం సాంప్రదాయంగా వస్తోందని, అలాంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో గాలిపటాలు ఎగురవేయకూడదని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు సంభవించిన 1912 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. హేమాచలుడి వరపూజకు ఆహ్వానం మంగపేట : మల్లూరు హేమాచల క్షేత్రంలో ఈనెల 15న మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవం (పెళ్లిచూపులు) కార్యక్రమానికి రావాలని ఈఓ రేవెల్లి మహేష్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులకు ఆహ్వాన పత్రికను శనివారం అందజేశారు. ప్రతి ఏటా హేమాచల లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. కార్యక్రమంలో అర్చకులు కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, సిబ్బంది శేషు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో పూజలు చేశారు. సెలవు రోజు కావడంతో విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకొని కోటగుళ్ల శిల్ప సంపదను తిలకించారు. ఎలుగుబంటి వేషంతో కోతులు పరార్ చిట్యాల : చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పంటలను కోతులు నష్టపరుస్తున్నాయి. ఇంట్లోకి కూడా వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతుల బాధనుంచి ఉపశమనం కోసం రైతు శనివారం ఎలుగుబంటి వేషం వేసి కోతులను తరిమి కొట్టాడు. దీంతో కోతులు అక్కడినుంచి పారిపోయాయి. రైతు వేషాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జంపన్న వాగులో షవర్ల కింద స్నానాలు ఆచరించి, వనదేవతల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో చెట్ల కింద వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు చేశారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. -
వామ్మో డేంజర్..
మల్హర్ మండలం కొయ్యూరు నాగులమ్మ సమీపంలో బొగ్గుల వాగు వంతెన ప్రమాదకరంగా ఉంది. వంతెన సైడ్ వాల్ను గతంలో లారీ ఢీకొట్టడంతో వాల్ సగభాగం కూలిపోయింది. వంతెన మీదుగా మంథని–కాటారం ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 28న నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో రద్దీ పెరగనుంది. జిల్లా అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనకు సైడ్ వాల్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు. – మల్హర్ -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఎస్ఎస్తాడ్వాయి : ఈనెల 18న సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శనివారం కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతలు, బందోబస్తు ఏర్పాట్లు, ప్రొటోకాల్కు సంబంధించిన అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. సీఎం పర్యటన సురక్షితంగా, క్రమబద్ధంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మేడారంలో మ్యూజియం, ఆర్టీసీ పార్కింగ్ స్థలాలు, టెంట్ సీటీ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
రామప్పలో భక్తుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టత గురించి గైడ్లు పర్యాటకులకు వివరించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోట్ షికారు చేశారు. ములుగు రూరల్: క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. మండలంలోని కొత్తూరు దేవునిగుట్ట ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను శుక్రవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కనబరచాలని అన్నారు. కొత్తూరు–పత్తి పల్లి మ్యాచ్ ప్రాంభించారు. పత్తిపల్లి టీం గెలుపొందగా అభినందించారు. కార్యక్రమంలో పత్తిపల్లి ఉప సర్పంచ్ పోరిక భద్రు నాయక్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాజేడు: అడవుల మూలంగా మానవాళికి ఎంతో మేలు జరుగుతుందని దానిని కాపాడుకుందామని ఎఫ్ఎస్ఓ నారాయణ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామంలో శుక్రవారం జిల్లా అటవీ శాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ ఆదేశాల మేరకు యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన వారికి సర్పంచ్ వాసం రాజబాబు చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువతీ యువకులకు అడవిలో నిప్పు మూలంగా జరిగే కష్ట, నష్టాలను వివరించారు. కార్యక్రమంలో పద్మ, మనీష, జనార్ధన్, దామోదర్ ఉన్నారు. గణపేశ్వరుడికి లక్ష్మీవారం పూజలు భూపాలపల్లి: కాకతీయుల కళావైభవం గణపు రం కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ, విభూతి, గంధంతో గణపేశ్వరుడిని అలంకరించారు. భక్తులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. -
టెట్నుంచి మినహాయింపు ఇవ్వాలి
ములుగు రూరల్ : ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాఠశాల వద్ద నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. 317 జీఓ ఉత్తర్వులను సమీక్షించి ఉపాధ్యాయులకు ఉద్యోగ స్థానికతను కల్పించుట కోసం ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరిగే ధర్నాకు సంఘీభావంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వాజేడు : సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన పట్ల పునరాలోచన చేయాలని తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ములుగు జిల్లా అధ్యక్షుడు తోలెం చిరంజీవి కోరారు. స్థానిక ఉన్నత పాఠ శాల ఆవరణలో శుక్రవారం ఎంఈఓ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఏటీఏ క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలాజీ, జనార్ధన్, రాంబూపతి, కవిత, విష్ణుప్రియ, పీఆర్టీయూ నాయకులు ప్రభాకర్, శ్రీరంగం తదితరులున్నారు. కన్నాయిగూడెం : ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం గూర్రేవుల జెడ్పీఎస్ఎస్ ఉపాధ్యాయులు న్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. -
పాఠశాలల్లో సంక్రాంతి సంబురాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి మోడల్ స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల కోసం ము గ్గుల పోటీలు, పతంగుల ఫెస్టివల్ను ప్రిన్సిపాల్ గండు కుమార్ ఏర్పాటు చేయగా, స్కూల్ ఆవరణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థినిలు రంగురంగుల ముగ్గులు వేసి పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే విధంగా రూపొందించిన ముగ్గులు అందరి మనసుకు ఆకట్టుకున్నాయి. మరో వైపు అబ్బాయిలు స్వయంగా తయారు చేసుకున్న పతంగులతో పతంగుల ఎగురవేత పోటీలో ఆనందంగా పాల్గొని సంక్రాంతి సందడిని రెట్టింపు చేశారు. ముగ్గుల పోటీలను ఉపాధ్యాయులు పరిశీలించి అత్యుత్తమ ముగ్గులు వేసిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వెంకటాపురం(కె) : మండల కేంద్రంలోని విజన్ స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఆనంతరం స్కూల్ ఆవరణలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జ్ రామారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను సర్పంచ్ తాటి సరస్వతి, ఉప సర్పంచ్ సన్నిలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు బోల్లే శ్రీనివాస్, జయరాం, రమాదేవి, భిక్షమణి, పుష్పావతి తదితరులు ఉన్నారు. ఏటూరూనాగారం : మండల పరిధిలోని కొమరం భీం ఎంపీపీఎస్లో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో గెలుపోందిన విద్యార్ధులకు బహుమతులను అందజేశారు. పాఠశాల హెచ్ఎం గుమ్మల రవిందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాజేడు : స్థానిక ఎంపీపీఎస్లో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్ధులకు, తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి మండల విద్యాశాఖాధికారి తేజావత్ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. మంగపేట: మండల కేంద్రంలోని శ్రీ వైష్నవి ప్రైవేటు పాఠశాలలో ముందస్తు మకర సంక్రాంతి పండుగ సంబరాలను పాఠశాల ప్రిన్సిపాల్ రావుల రాజేశ్వర్రావు పర్యవేక్షణలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు కలిసి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. డిగ్రీ కళాశాలలో ముగ్గుల పోటీలు ఏటూరునాగారం : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముందస్తు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీలను మహిళా సాధికారత, కళాశాల సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలను కాలేజీ ప్రిన్సిపాల్ రేణుక ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళా సాధికారిత విభాగం కన్వీనర్ పాతిమా, కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మలుగు రూరల్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఘనంగా రంగోలి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రిన్సిపాల్ మల్లేశం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఉదయశ్రీ, అనిల్ కుమార్ అ ధ్యాపకులు బాల య్య, కవిత, శిరీష, రాధిక, ఉదయశ్రీ, పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు వినియోగించుకోవాలి
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ అన్నారు. బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ పాఠశాలను శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ రాజేశ్ శర్మ, రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అశిష్ కోహ్లి, డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ అమర్జీత్ శర్మ, ఉన్నతాధికారుల బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. ఒకేషనల్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేయాలని రూ.10 వేలను ప్రిన్సిపాల్ దేవకి కి అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్దార్థ్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు అర్షం రాజు, శ్యాంసుందర్రెడ్డి, సాంబయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రామప్ప శిల్పకళ బాగుంది.. వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాగూర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి మంత్రి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి శాలువాలతో వారిని సత్కరించారు. అనంతరం ఆలయ విశిష్టత, శిల్పకళా ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళ సంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేస్తూ సరస్సు అందాలను తిలకించారు. వారివెంట అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
మేడారంలో ‘హలాల్’ను నిషేధించాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం జాతరలో హలాల్ విధానాన్ని నిషేధించాలని వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మైపతి సంతోష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లిస్తూ సంప్రదాయబద్దంగా కోళ్లు, యాటలను దేవతలకు సమర్పిస్తారన్నారు. గిరిజన సంప్రదాయాలకు విరుద్ధంగా మేడారం జాతరలో దుకా ణాలను ఏర్పాటు చేసుకుని కోళ్లు, మేకలను హలాల్ పద్ధతితో కోయడం జరుగుతుందన్నా రు. ఈ విధానం గిరిజన సంప్రదాయాలకు అనుకూలం కాదని దీంతో గిరిజన సంస్కృతికి భంగం కలుగుతుందని తెలిపారు. జాతరలో ఈవిధానాన్ని తక్షణమే నిషేధించి దుకాణా లను తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి గిరిజన సంస్కృతి, పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వనదేవతలను దర్శించుకున్న వాసుదేవరావు ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మలను బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు శుక్రవారం దర్శించుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. తల్లుల కరుణ కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరికీ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలి వాజేడు : బకాయి ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని పీఆర్టీయూ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఎంఈఓ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాజేష్, బాలాజీ, ప్రభాకర్, రాజ్యలక్ష్మి, శ్రీకాంత్, రాజెష్, ఆనంద్, కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి పరామర్శ ఏటూరునాగారం: నేతకాని కులసంఘం రాష్ట్ర నాయకుడు గోగు మల్లయ్య అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను నేతకాని కుల సంఘం జిల్లా నాయకులు పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జాడి రాంబాబు మాట్లాడుతూ సంఘం కోసం మల్లయ్య చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎల్లయ్య, నారాయణ, అర్జున్, లక్ష్మికాంత్, నర్సింహరావు, పోషయ్య తదితరులు పాల్గొన్నారు. నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలివెంకటాపురం(కె): నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలని తెలంగాణ నేతకాని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జాడీ ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో నేతకాని కులస్తుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతకాని కులస్తులకు సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. సమస్యలు ప రిష్కరించాలని కోరుతూ ఈ నెల 12న ము లుగు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
వెంకటాపురం(ఎం): స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలోని 40 మంది విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, హైదరాబాద్ ఇంటిలిజెన్స్ ఎస్పీ దండుగూడి రమేశ్ స్టడీ మెటీరియల్ను అందించగా పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. తాను చదివిన ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతను అందించేందుకు 40 మందికి స్టడీ మెటీరియల్ పాఠశాలకు పంపించారు. ఎంఈఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డుకాకూడదని కష్టపడకుండా ఇష్టంతో చదువుకొని చదువులో బాగా రాణించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఫరినా బేగం, పాల్గొన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు నిర్వహించుకున్నా రు. ఈ డీఈఓగా శ్రీజ, హెచ్ఎంగా వర్షిణి, ఉపాధ్యాయులుగా జయశ్రీ, అంజలి, హేమశ్రీ, అవంతి క, హారిక, రోహిణి, శృతి, స్వాతి, అలేఖ్య, రంజిత్, ప్రత్యూష, రాకేష్, ఎల్లస్వామి, పీడీగా ప్రణయ్లు వ్యవహరించారు. -
యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
మంగపేట: నేటి యువత వ్యసనాలకు దూరంగా ఉండి సమాజానికి దోహదపడే విధంగా సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముందుకు సాగాలని యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కుంజ సూర్య అన్నారు. మండలంలోని రాజుపేటలో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడాపోటీలను ఆయన శుక్రవారం ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పానీయాలు, గంజాయి వంటి పదార్థాలకు బానిస కావొద్దన్నారు. ప్రతీ క్రీడాకారుడు ఓటమి గెలుపునకు నాంది అనే స్ఫూర్తితో స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొని వారి ప్రతిభను చాటి ఇతర క్రీడా కారులకు ఆదర్శంగా నిలువాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కర్రి నాగేంద్రబాబు మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
ములుగు జిల్లా జోలికొస్తే ఖబడ్దార్..
● బడే నాగజ్యోతి ములుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్రలో భాగంగా ములుగు జిల్లాకు కూడా ప్రమాదం పొంచి ఉందని, ములుగు జిల్లా రద్దుకు కుట్ర చేస్తే సహించేదిలేదని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ములుగు ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నా రు. ములుగు జిల్లా జోలికొస్తే జిల్లా ప్రజల తిరుగుబాటును ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వేములపల్లి భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గండి కుమార్, గోర్రె సమ్మయ్య, బైకాని సాగర్, మాదం సాగర్, దూడబోయిన శ్రీను, రఘు, రాణా ప్రతాప్, పోరిక శ్యామల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం భక్తులకు గాయాలు
ఎస్ఎస్తాడ్వాయి: పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టడంతో మేడారానికి వస్తున్న భక్తులు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన భక్తులు టాటా మ్యాజిక్ వాహనంలో మేడారానికి వస్తున్నారు. అదేసమయంలో కాల్వపల్లి నుంచి పత్తి లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం వీరి వాహనాన్ని మండలంలోని కాల్వపల్లి శివారులో ఢీకొట్టింది. దీంతో మంచిర్యాలకు చెందిన పోసక్క, రాజలక్ష్మి, రోజా తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురిని 108 అంబులెన్స్లో ఎంఈటీ నద్దునూరి మధు, పైలెట్ అరె కరుణాకర్ ప్రథమ చికిత్స నిర్వహించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో టాటా మ్యాజిక్ నుజ్జునుజ్జయింది. మరో 12 మంది భక్తులకు ఎలాంటి ప్ర మాదం జరగకపోవడంతో ఊపిరిపిల్చుకున్నారు.కాల్వపల్లి దాటిన తర్వాత ప్రమాదం -
తరలివచ్చి మొక్కులు తీర్చి..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు శుక్రవారం వేల సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల గద్దెల వద్ద భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తుల రద్దీని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. మేడారంలో తల్లుల దర్శనానికి తరలివస్తున్న భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా సంప్రదాయ ప్రకారం ఎదురకోడిని ఎగిరేస్తున్నారు. కోడిని ఒకసారి ఎగరేయడానికి కోడి యజమానులు రూ.10 తీసుకుంటున్నారు. ఈ ఎదురుకోళ్లను ఎగరేసేవిధానం చాలాఏళ్లుగా కొనసాగుతోంది. -
డ్రైవర్లకు ఉచిత కంటి వైద్యశిబిరం
ములుగు: రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు డీటీఓ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఐబీ, ఆటో, టాటా మ్యాజిక్, లారీ డ్రైవర్లకు నిపుణులైన వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ శ్రీని వాస్ మాట్లాడారు. వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైందని, రోడ్డు ప్రమాదా లను నివారించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనంతరం వెంకటాపూర్ మండల కేంద్రంలోని జోహార్ పాఠశాల విద్యార్థులచే పాదచారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు. రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత, పాదచారుల భద్రత వంటి అంశాలపై వివరంగా అవగా హన కల్పించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం అబ్దుల్ జావీద్, పాల్గొన్నారు. -
విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
చిట్యాల : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని భూపాలపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రైతు సంఘం జీపుజాతా మండల కేంద్రానికి చేరుకుంది. దీంతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 11 వరకు జిల్లాలోని 10 మండలాలు 343 గ్రామాల 302 కిలోమీటర్ల వరకు జీపుజాతా తిరుగుతుందన్నారు. ఈ నెల 19న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు. -
భక్తుల రద్దీ పర్యవేక్షణకు నిఘానేత్రాలు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో నిఘానేత్రాల ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మేడారం జాతరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును మేడారంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి శుక్రవారం ఎస్పీ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణకు ఎలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సీసీటీవీ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జాతర సమయంలో భారీ రద్దీ ఉన్న ప్రధాన ప్రాంతాలైన జంపన్నవాగు, అమ్మవార్ల గద్దెలు, హరిత వై జంక్షన్, ట్రాఫిక్ మార్గాలు, కూడళ్ల రద్దీ, కోర్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో ఈసారి గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. -
రిజర్వేషన్పై ఉత్కంఠ..!
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండటంతో రిజర్వేషన్లపై ఆశావహుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో తొలిసారిగా ములుగు పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండడంతో రిజర్వేషన్పై ఉత్కంఠ నెలకొంది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 14,112 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,731 మంది పురుషులు 7,379 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ఓటరు ముసాయిదాను విడుదల చేసిన సంబంధిత అధికారులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 12న ఓటరు తుది జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాలను టీ పోల్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. తొలిసారిగా ములుగులో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతుండడంతో చైర్మన్ పదవిని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ ఇప్పటికే పావులు కదుపుతుండగా, మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్.. కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్న పలువురు ఆశావహులు ఇప్పటికే ఆయా వార్డుల్లో గ్రౌండ్ వర్క్ను ప్రారంభించారు. ఒక్కొక్కరు రెండు నుంచి మూడు వార్డులపై దృష్టి పెట్టారు. ఏ వార్డు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే అక్కడినుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు జనం మధ్యనే ఉంటున్నారు. ఆయా కాలనీల్లో ఏదైనా సమస్యను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతూ.. ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇలా ఎన్నికలకు ముందే ప్రజల మన్ననలు పొందాలని ఆశావహులు ఉత్సాహంగా తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆశావహుల్లో టెన్షన్ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రాలేదు. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ములుగు ఎస్టీ నియోజవర్గం కావడంతో ఎస్టీ రిజర్వేషన్కు కేటాయిస్తారా.. ఇతర సామాజిక వర్గాలకు కేటాయిస్తారా.. అనేది సందేహంగా మారింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపు ఏ పద్ధతిలో ఉంటుంది.. 42 శాతం కొత్త రిజర్వేషన్లు అమలు చేస్తారా? అని ఆశావహులు జోరుగా చర్చించుకుంటున్నారు. తమకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పలువురు అదినాయకుల వద్ద క్యూ కడుతున్నట్లు సమాచారం. కీలకంగా మారనున్న చైర్మన్ స్థానం మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానం రిజర్వేషన్ కీలకంగా మారనుంది. ఈ పీఠం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలోని ప్రధాన నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా కుర్చీని దక్కించుకొని తొలిసారిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగురవేసేందుకు అధికార పార్టీతోపాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు 12న వార్డుల వారీగా ఓటరు తుది జాబితా విడుదల -
క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయి
ఏటూరునాగారం/మంగపేట/వాజేడు : క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎంఈఓలు కోయడ మల్లయ్య, వెంకటేశ్వర్లు, పోదెం మేనక అన్నారు. శుక్రవారం ఆయా మండల కేంద్రాల్లో సీ ఎం కప్ 2026 టార్చ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల ద్వారానే శారీరక దారుఢ్యం పెంపొందుతుందని అన్నారు. ఈ నెల 17 వరకు సీఎం కప్పై ర్యాలీ నిర్వహించి అనంతరం మండల స్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని మండలానికి పేరు తీసుకు రావాలని వారు కోరారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కోచ్ ఎండీ హుస్సేన్, సతీష్, ఎస్సై రాజ్ కుమార్చ హెచ్ఎం సాంబశివరావు, క్లస్టర్ ఇన్చార్జ్ పద్మశ్రీ, మున్వర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మంగపేట జెడ్పీహెచ్ఎస్లో ఆమె మండలంలోని వ్యాయామ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి సీఎం కప్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు శ్రీనివాస్, నాగేందర్, వెంకటేశ్వ ర్లు, నరేష్, శ్యాంప్రసాద్, సుజాత పాల్గొన్నారు. -
కోతకు గురైన రోడ్డు
మంగపేట : మండలంలోని రాజుపేట, బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డు కప్పవాగు మలుపు వద్ద ప్రమాదం పొంచి ఉంది. 2023–04 వర్షాకాలంలో అతిభారీ వ ర్షాల కారణంగా వరదలు ఏటూరునాగారం–బూ ర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి పారడంతో సుమారు 30 మీటర్ల వరకు రోడ్డు కోతకు గురైంది. ఏళ్లు గడుస్తున్నా ఆర్ అండ్బీ అధికారులు నేటి వ రకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో అ త్యంత ప్రమాదకరంగా తయారైంది. పగలు, ర్రాతి తేడా లేకుండా నిత్యం వందలాది ఇసుక లారీలు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల రాక పో కలతో రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో సుమారు పదికి పైగా ప్రమాదాలు చోటు చే సుకున్నాయి. ఆయా సంఘటనల్లో నలుగురికి పైగా మృతి చెందగా పది మందికి పైగా తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో న్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు మంచానికి పరిమితం కావడంతో వారిపై ఆధార పడిన కుటుంబాల పరిస్థితి అ త్యంత దయనీయంగా మారిందన్నారు. ఏడాది కోసారి రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తూ నీతులు వల్లించకుండా ప్రమాదకరంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి మేడారం జారతకు వెళ్లే వచ్చే భక్తుల వాహనాలు ఇదే రోడ్డుపై నుంచి వెళ్తుంటాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా రో డ్డు కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం మరమ్మతు చేయని అధికారులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
జిల్లా ఏర్పాటులో బీజేపీ క్రియాశీలక పాత్ర
ములుగు రూరల్: ములుగు జిల్లా ఏర్పాటు కోసం శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన త్వర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. గట్టమ్మ ఆలయం వద్ద గజమాలతో సత్కరించారు. అనంతరం గట్టమ్మ ఆలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గం వెనుక బడిన ప్రాంతం ఇక్కడి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ములుగు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్, గౌతం రావు, వాసుదేవరావు, నరేష్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాజు నాయక్, జవహర్ లాల్, గుగులోతు స్వరూప, రవీంద్రచారి, జాడి వెంకట్, రమేష్ తదితరులు ఉన్నారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు -
నిట్లో సీఈటీఎస్బీ–26 జాతీయ సదస్సు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో సీఈటీఎస్బీ–26 (ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ స్టక్చరల్ బయోఫిజిక్స్)పై మూ డు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నిట్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో శుక్రవారం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగంలో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలకుగాను అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎస్ఐఆర్ మాజీ డీజీ, ప్రొఫెసర్ శేఖర్.సీ.మండే, బయోటెక్నాలజీ విభాగం హెడ్, ప్రొఫెసర్ బి.రామరాజు, ప్రొఫెసర్లు రాజన్ శంకర్నారాయణన్, కిరణ్కుమార్, సౌమ్య లిప్సా పాల్గొన్నారు. -
పునరుద్ధరణ రెండోదశ పనులు షురూ
హన్మకొండ కల్చరల్: హైదరాబాద్ సర్కిల్ భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో వేయిస్తంభాల ఆలయం కల్యాణ మండపం పునరుద్ధరణలో భాగంగా రెండో దశ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నిఖిల్దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలాజికల్ ఇంజనీర్ కృష్ణ చైతన్య, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ హెచ్ఆర్ దేశాయ్ పాల్గొని పూజలు నిర్వహించి కళ్యాణ మండపం పైకప్పు వాటర్ ప్రూఫింగ్ పనులు ప్రారంభించారు. ప్రస్తుత ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 32 లక్షలు కాగా, 90రోజుల్లోపు పూర్తయ్యేలా వాటర్ ప్రూఫింగ్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన అనంతరం కళ్యాణ మండపం దక్షిణ భాగం రీసెట్టింగ్ పనులను ఏఎస్ఐ చేపట్టనుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, నిట్ విశ్రాంతాత ఆచార్యులు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, కన్జర్వేషన్ అసిస్టెంట్లు మల్లేశం, అజిత్, దేవాదాయశాఖ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. -
జాతరను విజయవంతం చేయాలి
మల్హర్(కాటారం): మండలంలోని జాదరావుపేటలో ఈ నెల 11 నుంచి 12 వరకు జరిగే నాయక పోడుల ఆరాధ్య దైవం లక్ష్మీదేవర బోనాల జాతరను వియవంతం చేయాలని నాయకపోడు యువత కోరారు. శుక్రవారం జాతరకు సంబంధించిన వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కోర్కెల తీర్చే కొంగుబంగారం లక్ష్మిదేవర బోనాల జాతర మహోత్సవా లను జాదరావుపేట గ్రామ పంచాయతీలో నాయకపోడ్ల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కోట అశోక్, బద్ది వెంకటేష్, పెరుమాండ్ల రాజేందర్, గుంటి రాహుల్, చింతకుంట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి
ములుగు: జిల్లాలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 ఏళ్ల లోపు బాలలకు సంబంధించిన కేసుల విచారణను నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేయాలని, పొడిగించదగిన సహేతుకమైన కారణాలుంటే గరిష్టంగా 6 నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలో బాలరక్ష భవన్ ప్రాంగణంలో బాలల న్యాయ మండలిని (జేజేబీ) ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీపీఓ రమణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చట్టంతో విబేధిస్తున్న పిల్లల కేసుల సత్వర పరిష్కారమే బాలల న్యాయ మండలి ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రతీ మూడు నెలలకోసారి ఈ కేసుల స్థితిని హైకోర్టు డీఎల్ఎస్ఏ సెక్రటరీ సమీక్షిస్తారని పేర్కొన్నారు. పిల్లలకు పోలీస్, కోర్టు, జడ్జి అనే భావన రాకుండా అధికార యంత్రాంగం డ్రెస్ కోడ్ లేకుండా సివిల్ డ్రెస్లో, పిల్లలకు స్నేహాపూర్వకమైన వాతావరణంలో కేసుల విచారణ ఉంటుందని తెలిపారు. ఈ బోర్డు ద్వారా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని బోర్డు ముందుకు వచ్చే పిల్లల్లో పరివర్తన తీసుకొచ్చి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు కలిసి కట్టుగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కన్హయ్యలాల్, జిల్లా బాలల న్యాయ మండలి మెజిస్ట్రేట్ గుంటి జ్యోత్స్న, జిల్లా సంక్షేమాధికారి తుల రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధుళిక తేజ, జేజేబీ సోషల్ వర్కర్ మెరుగు సుభాశ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలాచారి, భిక్షపతి, న్యాయవాదులు రాంసింగ్, శంకర్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్యచంద్రకళ -
క్రీడా ప్రతిభకు సీఎం కప్ పోటీలు
ములుగు: యువత తమ క్రీడా ప్రతిభను కనబర్చడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నాయని కలెక్టర్ టీఎస్.దివాకర పేర్కొన్నారు. కలెక్టరేట్లో సీఎం కప్ రెండో ఎడిషన్ టార్చ్ ర్యాలీని కలెక్టర్ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణస్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీయడానికి సీఎం కప్ రెండో ఎడిషన్ సరైన వేదికని తెలిపారు. ఈ క్రీడాపోటీలు రేపటి వరకు టార్చ్ ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. 8న ములుగు జిల్లా కలెక్టరేట్లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, మల్లంపల్లి జెడ్పీఎస్ఎస్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వెంకటాపురం(ఎం) జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, గోవిందరావుపేట జెడ్పీహెచ్ఎస్లో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు, 9న ఐటీడీఏ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మంగపేట జెడ్పీహెచ్ఎస్లో 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తాడ్వాయి పాఠశాలలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 10న ముప్పనపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, వాజేడు జెడ్పీహెచ్ఎస్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, వెంకటాపురం(కె) జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3గంటల వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుందని వెల్లడించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 44 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామస్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో, 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, 19 నుంచి 26 వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా అధికారి సర్ధార్ సింగ్, డీఈఓ సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
ములుగు: యువత మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యర్యంలో నేషనల్ యూత్ డే ప్రోగ్రాంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. యువత కష్టపడి చదివి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మోటార్ వెహికల్ చట్టం, పోక్సో చట్టం గురించి వివరించారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కి కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, యాంటీ డ్రగ్స్ కమిటీ కన్వీనర్ అనిల్ కుమార్, ప్రొఫెషర్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
మేడారంలో ప్లాస్టిక్కు నో..
ఎస్ఎస్తాడ్వాయి: ఎకో ఫ్రెండ్లి సమ్మక్క– సారలమ్మ జాతర నిర్వహణకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు గురువారం మేడారంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్కు నో చెప్పండి నినాదంతో భక్తులకు, వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఎకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ సరిత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ ఉదయశ్రీల ఆధ్వర్యంలో పెక్ల్సీలు ఏర్పాటు చేసి కరప్రతాలను పంపిణీ చేశారు. కాగితపు క్లాత్ సంచులు వాడాలని వ్యాపారులకు సూచించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే పర్యావరణ, ఆరోగ్య నష్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బాలయ్య, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు.ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రచారం -
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో జోనల్, సెక్టార్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మేడారం హరిత హోటల్లో జాతర విధుల నిర్వహణపై జోనల్, సెక్టార్ అధికారులకు గురువారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేడారం జాతర ప్రదేశాలను 12 జోన్లుగా విభజించి 62 మంది జోనల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే 51 సెక్టార్లకు 179 మంది అధికారులను కేటాయించినట్లు వివరించారు. జాతర సమయంలో చేపట్టాల్సిన బాధ్యతలు, నిర్వహణ విధానం, ప్రజల భద్రత, రవాణా నియంత్రణ, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతీ అధికారికి స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన మాన్యువల్ను అందజేశామని వివరించారు. జాతర నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. దీంతో సమస్యలు తలెత్తిన వెంటనే గుర్తించి తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జంపన్నవాగు ప్రాంతంలో జన సందోహం ఎక్కువగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 3 షిఫ్టుల్లో గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.అదనపు కలెక్టర్ మహేందర్జీ -
‘ఆపరేషన్ స్మైల్’తో.. బాలలకు భరోసా
● 2019 నుంచి 854 మంది బాలకార్మికులకు విముక్తి ● పాఠశాలల్లో చేర్పిస్తున్న అధికారులుజిల్లాలోని పది మండలాల్లో దాడులు నిర్వహించి గుర్తించిన బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పించాం. అంతేకాకుండా బాల కార్మికుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. లేబర్ యాక్టు ప్రకారం యజమానులు శిక్షకు అర్హులు. ప్రతీఏడాది జనవరి, జూలైలో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలి. – తుల రవి, జిల్లా సంక్షేమశాఖ అధికారిములుగు రూరల్: వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసి బాల కార్మికులుగా మారిన పిల్లల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోంది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు హోటళ్లు, కిరాణం దుకాణాలు, ఇటుకబట్టీలు, బైక్ మెకానిక్ షాపుల వద్ద పనులు చేస్తున్న వారిని గుర్తించి వెట్టిచాకిరి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం 2014 నుంచి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అధికారులు ప్రతిఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్, మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్, చైల్డ్ హెల్ప్లైన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతూ 18 ఏళ్ల లోపు పిల్లలను, చదువు మానేసి కార్మికులుగా మారిన వారి వివరాలు సేకరించి అదుపులోకి తీసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న బాల కార్మికుల పరిస్థితులను బట్టి వారికి అందుబాటులో ఉండే పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి చదువు చెప్పిస్తున్నారు. 854 మంది చిన్నారులకు విముక్తి జిల్లాలోని పది మండలాల పరిధిలో ప్రతీ ఏడాది జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను అధికారులు 2014 నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు 854 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించి పాఠశాలల్లో చేర్పించారు. బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పనిలో పెట్టుకున్న యజమానులపై లేబర్ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఇటుకబట్టీలు, క్రషర్లలో పనుల నిమిత్తం వచ్చిన కార్మికుల పిల్లలను అందుబాటులో ఉన్న పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాల కార్మికులను గుర్తించిన, బడీడు పిల్లలను బడిలో చేర్పించకుండా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతో పాటు పాఠశాలలకు పంపించేందుకు అంగీకార పత్రాలను రాయిస్తున్నారు. సంవత్సరం నెల బాలకార్మికులు 2019 జనవరి 19 జూలై 58 2020 జనవరి 138 జూలై 30 2021 జనవరి 190 జూలై 47 2022 జనవరి 129 జూలై 30 2023 జనవరి 32 జూలై 32 2024 జనవరి 63 జూలై 33 2025 జనవరి 47 జూలై 02 2026 జనవరి 04 -
వనదేవతలకు.. మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సుందరీకరణ పనుల్లో భాగంగా స్కేపింగ్ ల్యాండ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ జీవన శైలి, ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయి. రైతులు, ఎద్దులు, అడవి జంతువుల రూపాలతో మేడారం జాతర ఆత్మను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎస్ఎస్తాడ్వాయి: వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు గురువారం భారీగా తరలివచ్చారు. సమ్మక్క రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. జంపన్నవాగులోని షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి.. అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు భక్తులను క్రమపద్ధతిలో సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల గద్దెలను దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. మొక్కుల అనంతరం మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనలు ఆరగించారు. -
రూ.2వేల కోట్లతో వరంగల్ అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజిపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయలుదేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేధ బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తరువాత వరంగల్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాష్, డా.పగడాల కాళీ ప్రసాద్, గుండె గణేష్, ఒంటేరు జైపాల్, ఎడ్ల అశోక్ రెడ్డి, దిలీప్ నాయక్, చాడ స్వాతి, గుజ్జల వసంత, రావుల కోమల, అభినవ్ భాస్కర్, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం -
ఈసారి గిరిజన గ్రామం లేనట్టేనా?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని ఆదివాసీ మ్యూజియంలో ఈసారి కోయ గిరిజన గ్రామ ఏర్పాటు లేనట్లుగానే కనిపిస్తుంది. ఆదివాసీ మ్యూజియం నిర్మించిన నాటి నుంచి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు జాతరకు వచ్చే భక్తులు తెలిసేలా మ్యూజియంలో మోడల్ కోయ గిరిజన గ్రామాన్ని ఏర్పాటు చేశారు. వెదురుతో గుడిసెలు నిర్మించి పైకప్పు గడ్డితో ఏర్పాటు చేసి మట్టితో గోడలు ఏర్పాటు చేసి ముగ్గులతో అందంగా అలకరించే వారు. కాని ఈ సారి జాతరలో కోయ గిరిజన గ్రామం ఏర్పాటుపై గిరిజన సంక్షేమశాఖ అధికారులు పక్కనబెట్టడంపై ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పిల్లర్ వంకరగా..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో భక్తుల క్యూలైన్ల కోసం నిర్మిస్తున్న జీఐ షెడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. పిల్లర్ల దిమ్మలు పైన ఒకలాగా కింద ఒకలాగా వంకరగా ఒరిగి పోయినట్లు కనిపిస్తుండడంతో పనుల నాణ్యత ప్రమాణాల తీరుపై తీవ్ర విమర్శలు తలెతుత్తున్నాయి. పనుల ప్రాథమిక దశలోనే లోపాలు కనిపిస్తే షెడ్ల నిర్మాణంలో మరెన్ని లోపాలు ఉంటాయోనని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాతర సమీపిస్తున్న వేళ హడావుడిగా పనులు చేయడంతోనే లోపాలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.● భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్వాజేడు : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెం గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆయన సమక్షంలో బుధవారం పది కుటుంబాలకు చెందిన వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో 37మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ విజయ, ఆర్ఐ కుమారస్వామి, ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, నాయకులు దంతులూరి విశ్వనాథప్రసాద రాజు, జగన్నాథరాజు, అల్లి నాగేశ్వరావు, విజయ్ ఉన్నారు. ఏటూరునాగారం : మండల కేంద్రంలోని కొమురం భీమ్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడాకారులకు ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే వైద్యసేవలను అందించేందుకు సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉన్నట్లు ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ క్రాంతికుమార్ తెలిపారు. బుధవారం క్రీడా మైదానంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయగా ఆయన పరిశీలించి మాట్లాడారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎమర్జెన్సీ సేవలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యురాలు సుమలత, గిరి, ఫార్మాసిస్ట్ స్వామి, సుగుణావతి, ధనలక్ష్మి, ఖలీల్, ఈఎంటీ రాజ్కుమార్ పాల్గొన్నారు. -
రోడ్డు భద్రత అందరి కర్తవ్యం
ఏటూరునాగారం: రోడ్డు భద్రత అందరి కర్తవ్యమని జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో బుధవారం రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్రెడ్డి హాజరై మాట్లాడారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. వాహనదారులు మద్యం సేవించి నడపరాదని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ డైరెక్టర్ వసంత శ్రీనివాస్, డిగ్రీ కళాశాల ప్రిన్సి పాల్ రేణుక, స్థానిక సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్.వెంకటయ్య, జ్యోతి, ఫాతిమా, సంపత్, రమేశ్, భాస్కర్ పాల్గొన్నారు.జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్రెడ్డి -
భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యం
ఎస్ఎస్తాడ్వాయి: భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోని సమ్మక్కతల్లి కొలువైన చిలకలగుట్ట ప్రాంతాన్ని సీతక్క అధికారులతో కలిసి బుధవారం సందర్శించారు. గుట్ట పైనుంచి అమ్మవారిని పూజారులు తీసుకొచ్చే దారిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జంపన్నవాగు, ఊరట్టం కాజ్వే ప్రాంతాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. గద్దెల ప్రాంగణంలో పునరుద్ధరణ పనులు, రాతి స్తంభాల అమరిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్చి పిల్లర్లు ప్రాకారం పనులన్నీ రేపటి కల్లా పూర్తి చేయాలన్నారు. సీఎం రేవంతర్రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు స్థలాన్ని పరిశీలన చేసి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేయాలని సీతక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. హేమాచలుడి వరపూజకు రావాలని మంత్రికి ఆహ్వానం మంగపేట: శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వరపూజ మహోత్సవానికి రావాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ఆహ్వానిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్ బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతిఏటా మకర సంక్రాంతి రోజున లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ మూర్తులకు మల్లూరు గ్రామంలో వరపూజ మహోత్సవం(పెళ్లిచూపులు) నిర్వహించడం ఆనవాయితీ. వైభవంగా జరిగే స్వామివారి వరపూజ మహోత్సవానికి రావాలని కోరుతూ బుధవారం మేడారం వచ్చిన మంత్రి సీతక్కను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణికి ఆహ్వాన పత్రికను ఆలయ ఈఓ మహేశ్ అందజేశారు. అనంతరం ఆహ్వాన కరపత్రాలు, వాల్ పోస్టర్లను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
అభివృద్ధి పనులేవి?
కొండాయిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అధ్వానంగా ఉన్న ప్లోరింగ్మల్యాలలో సమ్మక్క గుడికి రంగులు వేస్తూ..ఏటూరునాగారం: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు మరో 21 రోజుల సమయం మాత్రమే ఉంది. కొండాయిలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజుల ఆలయంపై అధికారులకు చిన్నచూపు ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆలయానికి రంగులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. జాతర సమీపిస్తున్నప్పటికీ అభివృద్ది పనులు మొదలుపెట్టకపోవడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు. మేడారం జాతర సమీపిస్తున్నా అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఆలయం చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గోవిందరాజులను మేడారం జాతర సమయంలో సారలమ్మ వచ్చే రోజునే గద్దెలపైకి తీసుకెళ్లడం ఆనవాయితీ. జాతర సమయం దగ్గరపడుతుందని హడావుడి పనులు చేయడం అధికారులకు పరిపాటిగా మారిందని భక్తులు వాపోతున్నారు. దెబ్బతిన్న ఫ్లోరింగ్, పగిలిపోయిన నాపరాయి కొండాయిలో గల సమ్మక్క,– సారలమ్మ గద్దెల వద్ద ఫ్లోరింగ్ పనులు మొదలు కాలేదు. మేడారం జాతర సమయంలో జాతరకు వెళ్లే భక్తులు ఎడ్లబండ్లు, ప్రైవేట్ వాహనాల్లో ఇక్కడకు వచ్చి గద్దెలను దర్శించుకొని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్, నాపరాయి పగిలిపోయి అధ్వానంగా మారింది. భక్తుల సౌకర్యార్ధం మరమ్మతులు చేయాల్సిన ఎండోమెంట్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. మల్యాలలో రంగుల పనులు మల్యాలలో కొలువైన సమ్మక్క గుడికి రంగులు వేస్తున్నారు. మేడారం జాతర సమయంలో గోవిందరాజుల పూజారులు పడిగెతో ఇక్కడికి చేరుకుని ఆతిఽథ్యం స్వీకరించి మేడారానికి బయలుదేరుతారు. ఇందుకోసం సమ్మక్క గుడిని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద దెబ్బతిన్న ఫ్లోరింగ్ జాతర సమీపిస్తున్నా పట్టించుకోని అధికారులు -
నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన
హన్మకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు గురు, శుక్రవారాలు రెండు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖ పర్యటన వివరాలు విడుదల చేసింది. గురువారం ఉదయం 10 గంటలకు కాజీపేటలో ఘనస్వాగతం అనంతరం ర్యాలీగా భద్రకాళి దేవస్థానానికి చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం హనుమకొండ హంటర్ రోడ్లోని వేద బాంక్వెట్ హాల్కు చేరుకుని ప్రెస్మీట్లో మాట్లాడుతారు. అనంతరం ఇక్కడ జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో ర్యాలీ అనంతరం కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరునుంచి ర్యాలీగా జిల్లాకేంద్రానికి చేరుకుని పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రి గుడెప్పాడ్లోని ఓ హోటల్లో బస చేస్తారు. 9న ఉదయం 9 గంటలకు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. 10.30కు మేడారం చేరుకుని సమక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. మీడియాతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారు. ములుగు రూరల్: ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాలని కోరుతూ బుధవారం మున్సిపల్ కమిషనర్ సంపత్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవితేజ మాట్లాడుతూ ఒకే వ్యక్తి ఒకే ఓటు ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీలో కూడా ఓటుహక్కు కలిగి ఉన్న ఓటర్ల పేర్లను సరిచేయాలన్నారు. కుటుంబ సభ్యులను యూనిట్గా తీసుకుని తుది ఓటరు జాబితా ప్రకటించాలని కోరారు. జాబితా వివరాలను మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు బండారుపల్లి, జీవింతరావుపల్లిలో ప్రదర్శించాలని కోరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ములుగు రూరల్ : బైక్ను టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఇంచర్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 53 మంది విద్యార్థులు జిల్లాలోని రామప్ప, లక్నవరం పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అజాగ్రత్త.. అతివేగం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. బస్సు ప్రమాదానికి గురికావడంతో విద్యార్థినులు భయందోళనకు గురయ్యారు. ప్రైవేటు వాహనాల్లో విహార యాత్రలకు తీసుకొచ్చినప్పుడు యాజమాన్యాలు జాగ్రత్తలు వహించాలని గ్రామస్తులు.. ఉపాధ్యాయులను, డ్రైవర్ను మందలించారు. మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణానికి చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని దామెరకుంట గ్రామంలో బుధవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా దామెరకుంట గ్రామ పంచాయతీ ఆవరణలో 6.02 ఎకరాలు, మల్లారంలో 17.15, గూడురులో 6.01 ఎకరాలు, జాదరావుపేటలో 5.04 ఎకరాలు మొత్తం దామెరకుంట క్లస్టర్ పరిధిలోని 34.22 ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదవి వినిపించారు. అలాగే పలువురి రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరించారు. -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా మా మునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరి యా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రి య, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజు ల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్య మంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలి క సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో రెండు పడకల గదులకు లబ్ధిదా రుల ఎంపిక ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, భూక్య మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
జాతరలో మెరుగైన వైద్యసేవలు
ములుగు రూరల్: మేడారం మహాజాతరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరలో మెడికల్ క్యాంపుల ఏర్పాటు, మందుల పంపిణీ నిర్వహణకు అధికారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సూత్రాలు, జాతీయ ఆరో గ్య కార్యక్రమాల ప్రచారానికి మాస్ మీడియా వి భాగం, కర పత్రాలు, ఆరోగ్య ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, రణధీర్, డెమో సంపత్, సూపరింటెండెంట్ విజయభాస్కర్, గణేశ్, వినోద్, హిమ, కిరణ్, వెంకటేశ్ పాల్గొన్నారు.జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని భారతి విద్యానికేతన్, విజన్ స్కూల్లో బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాల్య వివాహాల చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహలతో బాలికల చదువు, ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు వివాహాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ సమితి సభ్యులు జ్యోతి, సుమన్, రాజు రజిని పాల్గొన్నారు. -
ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం
ములుగు: ములుగు మున్సిపాలిటీలో ఓటరు జాబితాపై వివిధ పార్టీల నేతలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయని, మృతుల పేర్లు కూడా జాబితాలో ఎలా ప్రదర్శించారని అధికారులను ప్రశ్నించారు. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తానని మున్సిపాలిటీ కమిషనర్ జనగాం సంపత్ తెలిపారు. ఓటరు జాబితాపై ప్రజల నుంచి ఇప్పటి వరకు 31 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రష్యా దేశానికి చెందిన ఇరినా, అమీయాలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఏటూరునాగారం: క్రీడల్లో గెలుపోటములు సహజమని అటవీశాఖ దక్షిణ రేంజర్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల కేంద్రంలోని కొమురం భీం స్టేడియంలో అటవీ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొనగా ఎక్కెల టీంకు మొదటి బహుమతి, కొమురం భీం నగర్ టీం రెండో బహుమతి గెలుచుకున్నట్లు అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఆర్ఓ నారాయణ, ఎఫ్బీఓ దయానంద్, కల్యాణ్, చిట్టి, రాజేష్, ప్రశాంత్, పవన్, దిలీప్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి ఎన్నిక ములుగు: ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్హెచ్ఎం) జిల్లా యూనియన్ను సోమవా రం గోవిందరావుపేట మండలంలోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మధు, ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా నాగేశ్వర్రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా హెడ్మాస్టర్లు పనిచేయాలని సూచించారు. గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. -
మహాజాతరను విజయవంతం చేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. మేడారంలోని హరిత హోటల్ లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి జోనల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం మహాజాతర విజయవంతం చేయడంలో జోనల్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. జోనల్ అధికారులు సెక్టార్ అధికారులతో కలిసి తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. జోనల్, సెక్టార్, వివిధ శాఖల అధికారులకు మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మూడు షిఫ్టులవారీగా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా ప్రతీ జోనల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య పనులు నిరంతరం జరిగేలా చూసుకోవాలన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. దుకాణాల మార్పునకు చర్యలు మేడారంలో రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను నిర్ధేశిత స్థానాలకు వెనక్కి మార్పించే కార్యక్రమాన్ని కలెక్టర్ దివాకర, ఎస్పీ రాంనాథ్ కేకన్ సోమవారం రాత్రి సమన్వయంతో అమలు చేశారు. జాతర సమయంలో రహదారులపై విపరీతమైన భక్తుల రద్దీ, వాహనాల గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున రోడ్డు నుంచి 12 అడుగుల దూరంలోనే దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు వ్యాపారులకు సూచించారు. అధికారులు వ్యాపారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి మేడారం జాతర సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నామని వివరించారు. భక్తులు సురక్షితంగా రాకపోకలు, వాహనాలు సాఫీగా నడిచేలా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. వ్యాపారులు అధికారుల సూచనలను అర్ధం చేసుకొని సహకరించడంతో రహదారి విస్తరణ సక్రమంగా సాగడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్గం సుగమమైందని కలెక్టర్, ఎస్పీ తెలిపారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఏటూరునాగారం: గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో పీఓ గిరిజనుల నుంచి 8 వినతులను స్వీకరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘానికి మేడారం జాతరలో నాలుగు కోళ్ల షాపులు, 200ల టీషర్టులు, 50 వీఐపీ పాస్లు, 50 వీవీఐపీ పాస్లు ఇవ్వాలని పీఓకు విన్నవించారు. ఆదివాసీ రైతుసంఘం సభ్యులు మంగపేట మండలానికి 50 మందికి టీషర్టులు, బెల్లం, కొబ్బరి షాపులు ఇప్పించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లాలోని మదగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ట్రైబల్ రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం ఇప్పించాలని కోరారు. కన్నాయిగూడెం మండలం రాయినిగూడెంలో సాగు భూములకు 10 హెచ్పీ మోటార్లు, పైపులైన్ ద్వారా నీరు అందించాలని విన్నవించారు. మంగపేట మండలం గంపోనిగూడెంకు చెందిన ఓ గిరిజన మహిళా నా భర్త 2022లో మరణించారని, పేద కుటుంబం కావడంతో కుటుంబం గడవడం లేదని ఉపాధి కల్పించాలని అధికారులను వేడుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్ బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ ఆలెం కిశోర్, ఐటీడీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గిరిజనదర్బార్లో వినతులు స్వీకరించిన పీఓ -
సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు
● రాష్ట్రస్థాయికి పలువురి ఎంపిక ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలను మండల పరిధిలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించారు. ఈ మేరకు సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి వెళ్లాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు ఈ నెల 18న ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించనున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విజేందర్రెడ్డి, పీఈటీ రాజ్కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఏటూరునాగారం మండలానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబర్చినట్లు అథ్లెటిక్స్ కోచ్ పర్వతాల కుమారస్వామి, కరిష్మా తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ వెంకటేశ్వర్రెడ్డి మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. మెడల్స్ సాధించిన వారిలో సంజన, ఎం.వైష్ణవిదేవి, కార్తిక్, బీమయ్య, ప్రణీత్ ఉన్నారు. -
సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం
● మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కల్యాణి ఎస్ఎస్తాడ్వాయి: బాలికల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కొయ్యడ మల్లయ్య అధ్యక్షతన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేగ కల్యాణి హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. బాలికల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని తెలిపారు. బాలికలు చదువుకునేందుకు పాఠశాలలను స్థాపించారని ఆమె సేవలను కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి చెంచయ్య మాట్లాడుతూ విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథం పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలను అందించిన 20 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సూర్యనారాయణ, ఏఎంఓ శ్యాంసుందర్రెడ్డి, ఎంఈఓ గడ్డి శ్రీనివాస్, పీజీ హెచ్ఎంలు బద్దం లక్ష్మారెడ్డి, రేవతి, నాయకులు వాసుదేవరెడ్డి, వెంకటస్వామి, బాబురావు, డీటీఎఫ్ నాయకులు రేగ నరేందర్, కేజీబీవీ స్పెషలాఫీసర్ పుష్పనీల పాల్గొన్నారు. -
రోడ్ల పనులు.. పూర్తయ్యేదెన్నడో?
మేడారం జాతర సమయం సమీపిస్తున్నా పూర్తికాని పనులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనుంది. జాతర సమయం సమీపిస్తున్నా ఇంకా రోడ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. వనదేవతల దర్శనానికి వచ్చే వాహనాల దారి మళ్లింపులతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఒకే రోజున సుమారుగా 2 లక్షల మంది భక్తులు మేడారానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. మేడారం ప్రధాన దారుల్లో రోడ్ల నిర్మాణం పనులు సాగుతున్న తీరుపై భక్తులు, గ్రామస్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మేడారానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లోగా రోడ్ల నిర్మాణం పనులన్నీ పూర్తి కాకపోతే భక్తులకు మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సూచిక బోర్డులు నిల్.. వివిధ ప్రాంతాల నుంచి మేడారం వచ్చే భక్తుల వాహనాలను అధికారులు దారి మళ్లిస్తుండడంతో ప్రయాణ దూరం పెరగడంతో పాటు సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. పస్రా నుంచి వచ్చే భక్తుల వాహనాలను దారి మళ్లించి నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి పంపిస్తున్నారు. ఇలా తిరిగి రావడం వల్ల మేడారం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల దూరం ఎక్కువగా ఉంటుందని భక్తులు వాపోతున్నారు. అలాగే కొత్తూరులో సీసీ రోడ్ల నిర్మాణం పనుల కారణంగా చెక్పోస్టు నుంచి కాల్వపల్లికి వెళ్లే దారిలోని మార్గ మధ్య నుంచి అటవి మార్గంలో కన్నెపల్లి మీదుగా వాహనాలను పంపిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దారి మళ్లింపుతో గంటల తరబడి ఆలస్యం అవుతుందని భక్తులు వాపోతున్నారు. అక్కడక్కడా అసంపూర్తిగా పనులు మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు అతుకులు గతుకులుగా సాగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం పనులను మధ్యమధ్యలో అర్ధాంతరంగా వదిలేయడంతో మేడారం ప్రాంతవాసులతో పాటు భక్తులు అవస్థలు పడుతున్నారు. మేడారంలో ప్రధానంగా స్కేపింగ్ ల్యాండ్, చిలకలగుట్ట జంక్షన్ వద్ద రోడ్డు పనులు అసంపూర్తిగా వదిలేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి గద్దెల వద్దకు వచ్చే దారిలో జంక్షన్ వద్ద సీసీ రోడ్డు నిర్మించారు. కాని ర్యాంపు వేయకపోవడంతో వాహనాలు కిందకు దిగే పరిస్థితి లేదు. దీంతో వెనుతిరిగి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన దారికి అడ్డంగా కంకర పోసి వాహనాలు వెళ్లకుండా చేశారని మేడారం సమీపంలోని రెడ్డిగూడెం గ్రామస్తులు సోమవారం రోడ్డెక్కారు. జంపన్నవాగు నుంచి వచ్చే దారిలో రెడ్డిగూడెంలోకి వెళ్లే సీసీ రోడ్డు దగ్గర వాహనాల రాకపోకలు సాగకుండా కంకర కుప్పలు పోశారు. అంతేకాకుండా జంపన్నవాగు నుంచి వచ్చే బీటీ రోడ్డు వద్ద డివైడర్ నిర్మించారు. దీంతో హరితహోటల్ నుంచి రెడ్డిగూడెంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు, రోడ్డు కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామస్తులు ఆందోళన చేస్తుండగా పోలీసులు వచ్చి దారి సమస్యను తక్షణమే పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వనదేవతల దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు వాహనాల దారి మళ్లింపులతో తప్పని తిప్పలు -
నేటినుంచి విద్యుత్ ప్రజాబాట
హన్మకొండ : వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి(మంగళవారం)నుంచి ప్రజాబాట ద్వారా వినియోగదారుల ముంగిటికి వెళ్లనుంది. పొలంబాట ద్వారా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు చేరుకుని నేరుగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లోనూ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధానాలు కొనసాగుతుండగానే కొత్తగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. ఆయా సెక్షన్ పరిధిలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారులనుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు, నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వీరి సమక్షంలో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకుంటారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. సెక్షన్ స్థాయిల ఏఈల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్.ఈ, డీఈ, ఏడీఈలు అందరూ ఒకేచోట పాల్గొనవద్దని ఆదేశాలున్నాయి. ఒక కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొంటే మరో కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్, మరో కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్గొంటారు. ఇలా సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఉన్నతాధికారులు మూడు సెక్షన్లలో నిర్వహించే ప్రజా బాటలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీరితో పాటు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొనే అవకాశముంది. నేటి (మంగళవారం)నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అధికారుల క్షేత్రస్థాయి పర్యటన సమస్యల గుర్తింపు, అప్పటికప్పుడు పరిష్కారం ప్రతి సెక్షన్లో వారానికి మూడు రోజులు -
బైక్, టాటాఏస్ ఢీ
ఏటూరునాగారం/వాజేడు/మంగపేట: బైక్, టాటాఏస్ ఢీ కొన్నాయి. ఈ క్రమంలో టాటాఏస్ ట్రాలీ, మిల్లర్ బోల్తా పడగా ఒకరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వాజేడు మండల పరిధిలోని మండపాక వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వాజేడు ఎస్సై జక్కుల సతీష్ కథనం ప్రకారం.. మంగపేట మండల పరిధిలోని కమలాపురానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు వాజేడులోని పూసూరులో స్లాబ్ సెంట్రింగ్ పనులు, స్లాబ్ కాంక్రీట్ పనులు ముగించుకొని టాటాఏస్లో 15 మంది కార్మికులు సామగ్రితో ఏటూరునాగారం వైపు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మండపాక వద్ద మంగపేటకు చెందిన గుగ్గిళ్ల సూర్యనారాయణ తన బైక్పై వచ్చి కార్మికుల వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఏఎస్ వాహనం తిరగపడింది. ఈ క్రమంలో కమలాపురంలో నివాసం ఉంటున్న కార్మికుడు ఛత్తీస్గఢ్ వాసి బొజ్జ ఏసు(30)పై సెంట్రింగ్ పనిముట్లు మీదపడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహన దారుడు సూర్యనారాయణ, టాటాఏస్ డ్రైవర్ సూరితో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన క్షతగాత్రులను వరంగల్, ములుగుకు రెఫర్ చేసినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. పొట్ట కూటికోసం భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదం బారిన పడగా పలువురి కాళ్లు ,చేతులు విరిగిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఒకరి మృతి.. ఎనిమిది మందికి గాయాలు -
చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటరు జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గు ర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే? మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓట రు జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వ రంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు 11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ముసాయిదామౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటరు ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభామున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు సంఖ్య జనాభా పరకాల 22 34,318 472 8,262 నర్సంపేట 30 51,086 4,397 7,110 వర్ధన్నపేట 12 13,732 3,980 2,470 జనగామ 30 52,408 1,694 8,335 స్టేషన్ఘన్పూర్ 18 23,483 962 6,663 భూపాలపల్లి 30 57,138 4,464 11,966 మహబూబాబాద్ 36 68,889 14,220 9,709 డోర్నకల్ 15 14,425 3,536 2,866 కేసముద్రం 16 18,548 3,754 2,418 మరిపెడ 15 17,685 7,635 3,062 తొర్రూరు 16 19,100 2,093 3,985 ములుగు 20 16,533 1,844 2,470 మొత్తం 260 3,87,345 49,051 69,316 -
పవర్ జనరేట్ హుళక్కేనా?
ఏటూరునాగారం: గోదావరి నదిపై నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో 2019లో సమ్మక్క బ్యారేజీకి ఆనుకొని పవర్ జనరేట్ ప్రాజెక్టు ఏర్పాటుకు రూపకల్పన చేశారు. పాలకులు, జెన్కో అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి తయారీ హుళక్కేనా అన్నట్లుగా మారింది. పవర్ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో సమ్మక్క బ్యారేజీకి సమీపంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారులు సివిల్ వర్క్ను పూర్తి చేశారు. డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టును సైతం జెన్కోకు సమర్పించి ఆరేళ్లు అవుతుంది. అయినా ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడని పరిస్థితి నెలకొంది. 59 గేట్లు మూసివేస్తే.. 6.5 టీఎంసీల నీరు నిల్వ 12 టర్బెన్లను అమర్చి 250 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే పవర్ జనరేట్ ప్రాజెక్టుపై గత, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు బ్యారేజీలోని 59 గేట్లు మూసివేస్తే 6.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. గోదావరిలో ప్రవహించే నీటితో హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి పవర్ జనరేట్ చేసే విధంగా టర్బన్స్ ఇతర పనిముట్లను అమర్చాల్సి ఉంది. దీంతో తయారయ్యే విద్యుత్ను పవర్ గ్రిడ్కు తరలిస్తే ఇతర రాష్ట్రాల నుంచి 250 మెగావాట్ల విద్యుత్ను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. హైడల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపని జెన్కో గోదావరిలో ప్రవహించే జలాలతో హైడల్ ప్రాజెక్టును పూర్తి చేసి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో రూ.3 వేల కోట్లను పవర్ జనరేషన్ కోసం ప్రభుత్వం కేటాయించింది. గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ దానిపై అధికారులు మొగ్గుచూపడం లేదు. కన్నాయిగూడెంలోని ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ వర్క్ పూర్తి అయినపప్పటికీ అందులో పవర్ ప్లాంట్ను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవర్ జనరేట్ చేసేందుకు అనువైన స్థలం, నీటి సామర్ధ్యం ఉన్నా కూడా జెన్కో అధికారులు ఆసక్తి చూపకపోవడం, పాలకులు పట్టించుకోకపోవడం ఏజెన్సీ ప్రజలకు శాపంగా మారింది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకులగూడెం బ్యారేజీ పక్కనే ఉన్న పవర్ జనరేషన్ ప్లాంట్పై దృష్టి సారించి పనులు పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి తయారీ పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సివిల్ వర్క్ పూర్తిచేసి డీపీఆర్ అందజేత ఆరేళ్లు అయినా పట్టించుకోని జెన్కో అధికారులు -
మేడారం జాతర పవిత్రతను కాపాడాలి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్ తాడ్వాయి: ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం జాతర రూపుదిద్దుకుంటుందని, జాతర పవిత్రతను కాపాడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సూచించారు. మేడారంలోని హరిత హోటల్లో సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలన్నారు. జాతర నిర్వహణపై ఆదివాసీ సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసం మేడారం జాతర కలకలాం గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకుంటుందని వెల్లడించారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు ఆదివాసీ యువజన సంఘాలు సమన్వయం పాటించాలని, వలంటరీ సభ్యులకు, మహిళలకు ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. జాతర సమయంలో ఇసుక లారీల రవాణాను పూర్తిగా నిలిపివేయనున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే భక్తులు ఏ విధంగా దర్శనం చేసుకోవాలనే అంశంపై ప్రత్యే క రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ సంపత్రావు, డీఎఫ్ఓ కిషన్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఆదివాసీ సంఘాల నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన మేడారం
భక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ సమ్మక్క గద్దె వద్ద భక్తులు..మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుకిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
యూరియా పంపిణీపై అసహనం
ములుగు రూరల్: యాసంగి సాగుకు సరిగా యూరియా పంపిణీ చేయకపోవడంతో ఓ రైతు అసహనానికి గురై రెండు బస్తాల యూరియాను పెట్రోల్ పోసి తగలపెట్టి నిరసన తెలిపాడు. ఈ ఘటన శనివారం మల్లంపల్లి మండలం దేవనగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 450 యూరియా బస్తాల పంపిణీ చేపట్టారు. గ్రామానికి చెందిన గుడెళ్లి హరీశ్ లైన్లో నిలబడి రెండు బస్తాల యూరియా తీసుకున్నాడు. ప్రస్తుతం మొక్కజొన్నకు యూరియా అవసరం ఉందని తనకు ఇంకా కావాలని అడుగగా లేవని తెలిపారు. దీంతో హరీశ్ అధికార పార్టీ నాయకులు పదుల సంఖ్యలో బస్తాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సాధారణ రైతులకు మాత్రం రెండు బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో అసహనికి గురైన హరీశ్ గ్రామంలోనే తను తీసుకున్న యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పు అంటించారు. సమ్మక్కసాగర్లో రొయ్య పిల్లల విడుదల కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజీలో రొయ్య పిల్లలను శనివారం విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారులు సబ్సిడీ రొయ్య పిల్లలను అందించగా పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ వాటిని గిరిజన సొసైటీ కమిటీ, సర్పంచ్ పీరీల స్వప్న ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీపై రొయ్య పిల్లలను అందజేస్తుందని వివరించారు. హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీమంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటు మేడారం వెళ్లివచ్చే భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వులనూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. దర్శించుకున్న భక్తుల గోత్ర నామాలతో అర్చనలు జరిపించి స్వామివారి చరిత్రను వివరించారు. నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని గొత్తికోయగూడెం తొర్రిచింతలపాడుకు చెందిన నిరుపేదలకు శనివారం యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు దుప్పట్లు, సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి మాట్లాడారు. చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం మరు వలేనిదన్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అయిలయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన
మంగపేట: మండలంలోని బోరునర్సాపురంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటం, కలశంతో గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం నుంచి ఏటూరునాగారం–బూర్గపాడు ప్రధాన రోడ్డు మీదుగా ఉమాచంద్ర శేఖరస్వామి ఆలయం, పాతనర్సాపురం మీదుగా తిరిగి ఆలయం వరకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర సంకీర్తన చేపట్టిన భక్తులకు గ్రామస్తులు మంగళహారతితో ఎదురేగి బిందెలతో నీల్లారపోసి స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న నగరసంకీర్తన భక్తుల బృందం ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తూ భజన చేస్తూ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారి జీడికంటి మధుసూదనాచార్యులు భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం ఆలయంలో ఉదయం 8 నుంచి స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించనున్నట్లు పూజారి మధుసూదనాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు దేవకి, కరి వెంకాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి పూసాల సరోజీ, భక్తులు నాగేశ్వర్రావు, కడియాల సుదర్శన్, కొత్త శ్రీనివాస్, గుజ్జుల కోటిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శం ఆర్చ్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న పీటీ బీమ్గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
జాతర పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ముందస్తుగానే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ పరిసరాల్లో చేపట్టిన పునరుద్ధరణ, ల్యాండ్ స్కేపింగ్ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన ల్యాండ్ స్కేపింగ్ సుందరీకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. పచ్చదనంతో ప్రతిబింబించేలా మొక్కలు నాటడం, నడక మార్గాలను, విశ్రాంతి ప్రదేశాలుగా రూపొందించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రాకారపు రాతి స్తంభాలపై బ్రాకెట్లు, ప్రధాన ఆర్చి రాతి స్తంభాలపై పీటీ బీమ్లు వెంటనే అమర్చాలని ఆదేశించారు. జాతర ప్రారంభానికి ముందుగా అన్ని నిర్మాణాలు, సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం, జంపన్నవాగు పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహాజాతరను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
మిగిలింది 24రోజులే..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. మహాజాతరకు ఇంకా 24 రోజులే గడువు ఉంది. జాతర సమయం దగ్గర పడుతున్నా అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రేపటి కల్లా గద్దెల పునర్నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి డెడ్లైన్ విధించినా పనులు ఇంకా పూర్తి స్థాయిలో పూర్తికాలేదు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్కలు నేడు మేడారానికి రానున్నారు. జాతర పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆలయ పనుల్లో ఆలస్యం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చేపడుతున్న ప్రాకారం రాతి స్తంభాల ఏర్పాట్ల పనులు ఇంకా కొంత మేర మిగిలే ఉన్నాయి. ప్రాకారం చుట్టూ 8 ప్రధాన ఆర్చ్ ద్వారాల వద్ద నిలిపిన స్తంభాలపై పీటీ బీమ్ల ఏర్పాటు పనులు సైతం పూర్తి కాలేదు. సారలమ్మ ఆర్చ్ ద్వారం వద్ద స్తంభాలపై మాత్రమే రెండు పీటీ బీమ్లను ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ ప్లోరింగ్ పనులు సైతం కొనసాగుతున్నాయి. అమ్మవార్ల గద్దెల చుట్టూ బంగారు వర్ణం గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల చుట్టూ స్తంభాలను ఏర్పాటు చేశారే తప్పా విస్తరణ పనులు ఇంకా మొదలే కాలేదు. సాగుతున్న రోడ్ల విస్తరణ పనులు మేడారంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మేడారంలో సగంమేర సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సగం బీటీ రోడ్ల నిర్మాణం పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనుల్లో హరితహోటల్ నుంచి జంపన్నవాగు వరకు ఒక భాగంలో మాత్రమే బీటీ వేయగా మరో వైపు డీడబ్ల్యూజీఎం కంకర చదును పనులు సాగుతున్నాయి. మేడారం గ్రామశివారు నుంచి బస్టాండ్ వరకు ఇంకా కంకర చదును పనులు మాత్రమే సాగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద జంక్షన్ పనులు కూడా మొదలు కాలేదు. జంపన్నవాగు నుంచి ఊరట్టం స్తూపం వరకు రోడ్డు విస్తరణ పనులు కూడా నెమ్మదిగానే సాగుతున్నాయి. రోడ్ల నిర్మాణం పనులు పూర్తయే సరికి మరో వారం రోజులు పట్టొచ్చనే అభిప్రాయాలు భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం స్లో జాతరలో భక్తుల సౌకర్యార్థం ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తాత్కాలిక జీఐ షీట్స్ మరుగుదొడ్ల పనులు కూడా నెమ్మదిగానే సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మరుగుదొడ్ల ఏర్పాట్ల కోసం బేస్మెంట్ల పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం పూర్తయిన మరుగుదొడ్లపై జీఐ షీట్ రేకులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సారి జాతరలో 1020 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. వాటిని తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోలేదు. జాతరలో తాగునీటి కోసం పైపులైన్ ఏర్పాట్ల పనులు కూడా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేయగా మరికొన్ని ప్రదేశాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. అదే విధంగా మేడారంలో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయి కంపు వాసన వస్తుందని భక్తులు ఆరోపిస్తున్నారు. మేడారంలో కొనసాగుతున్న మహాజాతర పనులు ఇంకా పూర్తికాని గద్దెల పునర్నిర్మాణ పనులు రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల తాకిడి నేడు మేడారానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ధనసరి సీతక్క -
ఆదివాసీ చిత్రాలపై పునఃపరిశీలించాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో రాతి స్తంభాలపై చెక్కిన ఆదివాసీ చిత్రాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని తుడుందెబ్బ కమిటీ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు. తుడుందెబ్బ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన రాతి స్తంభాల చెక్కిన చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల ఆరాధ్య దేవతలైన సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులకు నిధులు కేటాయించి, ఆదివాసీల చరిత్రను ప్రపంచానికి తెలిసేలా పనులు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతి ఆరాధకులుగా ఉంటూ ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలను అవలంభిస్తున్నారని, అటువంటి విధానం కలిగిన ఆదివాసీలకు హిందుత్వ మూలాలు అంటగట్టే ప్రయత్నం సరికాదని అభిప్రాయపడ్డారు. ముఖద్వారం మీద స్వస్తిక్ గుర్తు, పగిడిద్దరాజు గద్దెల వద్ద రాతి చిత్రాలపై ఉన్న శంఖు, చక్రాలు, తిరునామాల చిత్రాలను సంస్కృతిలో పెట్టడం ద్వారా ఆదివాసీల చరిత్రను భవిష్యత్ తరానికి తప్పుగా తెలియజేసినట్టేనన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ చిత్రాలపై పునఃరిశీలన చేసి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. సంస్కృతి, సంప్రదాయాల్లో పెద్దమనుషులు, పడిగెలు కుట్టె కళాకారులు, కోయ పురాణం చెప్పే కోయ కళాకారుల ప్రాతినిథ్యం ఉంటుందని.. నిర్మాణంలో వారి భాగస్వామ్యం లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆదివాసీ రాజకీయ జేఏసీ చైర్మన్ వాసం రామకృష్ణ, గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, తుడుం దెబ్బ జాతీయ కోకన్వీనర్లు రత్నం, యాసం రాజు, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు వట్టం కన్నయ్య, పూనెం శ్రీను, పాయం జా నకి, చిట్టిబాబు, జనార్ధన్, జిల్లా అధ్యక్షుడు చందా మహేష్, కార్యదర్శి కాపుల సమ్మయ్య పాల్గొన్నారు.తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ లక్ష్మయ్య -
ఆర్చి పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: గద్దెల ప్రాంగణంలో పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన ఆర్చీ ద్వారాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. సారలమ్మ ప్రధాన ఆర్చీ ద్వారం రాతి స్తంభాలపై సిమెంట్ బీమ్ ఏర్పాట్ల పనులను శుక్రవారం పూజారులతో కలిసి కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆర్చీ ద్వారంపై ఏర్పాటు చేసిన బీమ్, మోడల్ క్యూ నిర్మాణ పనులతోపాటు గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సారలమ్మ ఆర్చీ ద్వారంపై వనదేవత వంశవృక్షం, కోయ బొమ్మల లిపి, చిత్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, డీఎస్పీ రవీందర్, సీఐ దయాకర్ ఉన్నారు. -
మహిళా ఓటర్లే అధికం
ములుగు మున్సిపాలిటీ పరిధిలో 14,112 మంది ఓటర్లుములుగు: జిల్లా కేంద్రంగా ఉన్న ములుగు 2024 ఫిబ్రవరి 2న మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామాలను కలుపుకొని ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయగా.. తొలిసారి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ములుగు మున్సిపాలిటీ అధికారులు ఓటర్ల జాబితాను విడుదల చేశారు. కాగా, ములుగు మున్సిపాలిటీ పరిధిలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 20 వార్డులు.. 20 పోలింగ్ బూతులు ములుగు మున్సిపాలిటీలో ప్రాథమికంగా ఓటర్ల లెక్క తేలింది. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో మున్సిపల్ కమిషనర్ గత మూడు రోజులుగా కసరత్తు ప్రారంభించి ప్రాథమిక ఓటర్ల జాబితాను ప్రకటించారు. జిల్లాలో 20 వార్డులకు గాను 20 పోలింగ్ బూతులను ఏర్పాటు చేస్తుండగా 14,112 మందితో ఓటర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో 6,731 మంది పురుషులు, 7,379 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 18 వేల జనాభా ఉండగా 1,844 మంది ఎస్టీలు, 2,470 మంది ఎస్సీలు ఉండగా మిగిలిన జనాభాలో బీసీ, ఓసీలు ఉన్నారు. నేటి వరకు అభ్యంతరాల స్వీకరణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను ఇప్పటికే మున్సిపాలిటీలో వార్డుల వారీగా ప్రదర్శించారు. ప్రకటించిన ఓటరు జాబితాపై శనివారం(నేడు) వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పేర్లు, వార్డుల మార్పుల్లో ఏమైనా తప్పులు ఉంటే అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించనున్నారు. ఓటరు జాబితాపై 5వ తేదీన రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. రాజకీయ నాయకుల నుంచి వచ్చే అభ్యంతరాలను సైతం పరిష్కరిస్తారు. ఈనెల 10న మున్సిపాలిటీ పరిధిలోని తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. పంచాయతీ ఎన్నికల ఉత్సాహంతో.. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్నారు. దీంతో ఇదే ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయభేరి మోగించేందుకు నాయకులు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. రెండేళ్ల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినప్పటికీ హస్తం హవానే కొనసాగింది. జనవరి 28 నుంచి 31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉండడంతో జాతర ముగిసిన తర్వాత మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ. ఓటర్ల తుది జాబితా అనంతరం రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సన్నహాలు చేపడుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో ఇప్పటికే ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలను మొదలు పెట్టారు. ఈనెల 10న ఓటరుల తుది జాబితాను ప్రకటిస్తాం. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డుల పరిధిలో 14,112 మంది ఓటర్లు ఉన్నారు. శనివారం వరకు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరిస్తాం. 5న వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సమావేశాన్ని నిర్వహించి సలహాలు తీసుకుంటాం. తుది జాబితా ప్రకటించాక ఎన్నికల సంఘం ఆదేశానుసారం ముందుకు వెళతాం. – జనగాం సంపత్, మున్సిపల్ కమిషనర్, ములుగువార్డు పురుషులు మహిళలు ఇతరులు 1 323 350 0 2 348 412 1 3 344 410 0 4 374 375 0 5 315 378 0 6 330 321 0 7 362 364 0 8 360 370 0 9 300 330 0 10 353 396 1 11 338 363 0 12 372 397 0 13 333 375 0 14 369 420 0 15 352 357 0 16 315 344 0 17 328 327 0 18 295 353 0 19 288 345 0 20 332 392 0మున్సిపాలిటీగా ఆవిర్భంచిన తర్వాత తొలిసారిగా ములుగు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 14,112 మంది ఓటర్లతో 20 వార్డులు ఏర్పాటు చేయగా 20 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పురుషుల కంటే 648 మంది మహిళ ఓటర్లే ఎక్కువగా ఉండడం విశేషం. మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపితే అటువైపే గెలుపు ఉంటాయని చర్చించుకుంటున్నారు. పురుషుల కంటే 648 మంది మహిళా ఓటర్లే ఎక్కువ 5న పార్టీల ప్రతినిధులతో సమావేశం 10న తుది ఓటరు జాబితా విడుదల -
ఏఆర్కు మారిన పోలీస్ సిబ్బందికి సన్మానం
గోవిందరావుపేట: 5వ బెటాలియాన్లో విధులు నిర్వహిస్తున్న 9 మంది టీజీఎస్పీ సిబ్బంది.. ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) విభాగానికి మారిన సందర్బంగా బెటాలియాన్ కమాండెంట్ కే.సుబ్రహ్మణ్యం వారిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈసందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వారి సేవా కాలంలో చూపిన క్రమశిక్షణ, అంకితభావం ప్రశంసనీయమని అన్నారు. ఏఆర్ విభాగంలోనూ ఇదే ఉత్సాహంతో, ప్రజల భద్రతకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. సన్మాన కార్యక్రమంలో ఆర్ఐలు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు. -
టికెట్ల జారీలో ఆగని అవినీతి!
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరో సారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే.. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మ్యాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలా డింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మ రోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టా యి. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 శుక్రవారం వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘాలోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలు న్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై దేవాలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి ఎక్కడా జరగలేదని, సోషల్మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో కేవలం ప్రసాదాల అమ్మ కం ద్వారా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. పూజల అనంతరం భక్తులు సంతోషంగా ఇచ్చే సంభావన తీసుకోవాలి తప్ప పూజారులు డిమాండ్ చేయవద్దని గతంలోనే ఆదేశించినట్లు తెలిపారు. భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్.. -
బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు
ఎస్ఎస్తాడ్వాయి/ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఆర్బీ డీఎస్పీ, ఆపరేషన్ స్మైల్ –12 కార్యక్రమ జిల్లా ఇన్చార్జ్ కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మేడారంలోని హరిత హోటల్లో బాలల పరిరక్షణ జిల్లా అధికారి ఓంకార్ అధ్యక్షతన నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైనర్లను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేడారం జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార వృత్తిదారులు, భిక్షాటన చేసేవారిలో బాలకార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలన్నారు. పిల్లలు చదువుకుంటనే వారి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ వసుధ మట్లాడుతూ.. బాల్యం అమూల్యమైన దశ అని 14 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ.. బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ మధు, ఎస్సై ఇమ్మాన్యూఝెల్, హరికృష్ణ, సంజీవ, రజిని, విక్రమ్, గీత, చంటి, తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ములుగు రూరల్: జిల్లాలోని రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిసే్ట్రషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ రిజిసే్ట్రషన్లో రైతులకు గుర్తింపు నంబర్ కేటాయించనున్నట్లు తెలిపారు. రైతులు పట్టాదార్ పాస్ బుక్తో రైతులు తమ సమీపంలోని మీసేవా కేంద్రం, వ్యవసాయ విస్తర్ణాధికారిని సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. యాసంగి పంటలకు సంబంధించి జిల్లాకు కావాల్సి యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వపరంగా వ్యవసాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మల్హర్ (కాటారం): చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చిన్న కాల్వల నిర్మాణం కోసం చేపట్టే భూ సేకరణ నిమిత్తం మండలంలోని ధన్వాడ గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో భూ సేకరణ గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వాడ క్లస్టర్ పరిధిలోని ధన్వాడ, రేగులగూడెం గ్రామాలకు చెందిన 29 ఎకరాలకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఉన్న రైతుల పేర్లును తహసీల్దార్ నాగరాజు గ్రామసభలో చదవి వినిపించారు. అభ్యంతరాలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నేడు (శనివారం) ఒడిపిలవంచ (ఒడిపిలవంచ, ఆదివారంపేట, గుమ్మళ్లపల్లి, వీరాపూర్) క్లస్టర్ సంబంధించిన భూ సేకరణ గ్రామసభ జరగనున్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ వెంకన్న, ఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ వెంకన్న, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఉత్తమ పరిశోధనలకు పారితోషికం కేయూ క్యాంపస్: ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించేందుకు పరిశోధనపత్రం, ఉత్తమ ప్రాజెక్టు ఉత్తమ ప్రచురణలకు నగదు పారితోషికం అందజేయనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం తెలిపారు. వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు వర్సిటీలోని వివిధ విభాగాల డీన్లకు, వర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, పరిశోధక విద్యార్ధులు ఈ అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. మొదటి బహుమతి కింద రూ.15,000, ద్వితీయ బహుమతి రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలతోపాటు ఈఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 10లోపు అకడమిక్ బ్రాంచ్లో ఆధారాలతోపాటు దరఖాస్తుల సమర్పించాలని సూచించారు. -
వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ
మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారి జీడికంటి వదుసుదనాచార్యులు వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 16 నుంచి కొనసాగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఆలయంలోని గోదాదేవి అమ్మవారికి పూజారి వదుసుదనాచార్యులు వేద మంత్రోశ్చరణ నడుమ సారె సమర్పణ కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయకమిటీ బాధ్యులు, భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు నూతన పట్టు వస్త్రాలు, వివిధ రకాల పిండి వంటలు, పండ్లతో మంగళవాయిద్యాల నడము ఆలయానికి చేరుకుని సారె సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. ఈనెల 13న గోదాదేవి కల్యాణ మహోత్సవంతో ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయని పూజారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, గౌరవ అధ్యక్షులు దేవకి, కరి వెంకాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్ల కొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి పూసాల సరోజి, భక్తులు మన్నె నాగేశ్వర్రావు, కడియాల సుదర్శన్, శ్రీనివాస్, గుజ్జుల కోటిరెడ్డి పాల్గొన్నారు. -
మధ్యాహ్నమే పీహెచ్సీకి తాళం
కాళేశ్వరం: కొత్తసంవత్సరం పూట పీహెచ్సీలకు ఏమైనా సెలవు ప్రకటించారా.. లేదా ఉద్యోగులు అంతా లీవులో ఉన్నారా అనే అనుమానాలు కాళేశ్వరంలో వెల్లువెత్తాయి. గురువారం మధ్యాహ్నమే పీహెచ్సీకి తాళాలు వేసి వైద్యులు, సిబ్బంది బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు ఉండి రోగులకు సేవలందించాల్సిన సిబ్బంది, వైద్యబృందం ఆన్డ్యూటీలో వ్యక్తిగతంగా ఒంటిపూట సెలువు తీసుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం పుణ్యక్షేత్రం అయినందున ఉన్నతాధికారులు దృష్టిసారించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. -
వాణిజ్యపన్నులశాఖ జేసీ బదిలీ
● సీసీటీ ఆఫీస్కు రావుల శ్రీధరాచారి ● వరంగల్ జాయింట్ కమిషనర్గా టి.శ్రీనివాస్ సాక్షిప్రతినిధి, వరంగల్: వాణిజ్యపన్నులశాఖ వరంగల్ జాయింట్ కమిషనర్ రావులు శ్రీధరాచారి బదిలీ అయ్యారు. సుమారు రెండున్నర సంవత్సరాలకు పైగా పనిచేసిన ఆయనను కమిషనర్ కమర్షియల్ టాక్స్ (సీసీటీ) కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్లో జేసీగా ఉన్న తాళ్లపల్లి శ్రీనివాస్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్రావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలు, నియామకాల్లో భాగంగా కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న ఉన్నతాధికారులు మొదటగా జాయింట్ కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేస్తున్న సీటీఓలు, డీసీటీఓలు, ఏసీటీఓలను కదిలించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారులు బదిలీల జాబితాలో ఉన్న వివిధ కేడర్లకు చెందిన అధికారులు, ఉద్యోగులనుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కన్నాయిగూడెం: అంబులెన్స్లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గుర్రేవులకు చెందిన వాసంపెల్లి మహేశ్వరి నిండు గర్భిణి. బుధవారం రాత్రి పురటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది అంబులెన్స్లోనే డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని తాళ్లగడ్డ సమీపంలో 163వ జాతీయ రహదారిపై ఏర్పడిన గోతులను ఎట్టకేలకు గురువారం పూడ్చివేశారు. ‘సాక్షి’లో పలుమార్లు ఈ గోతులపై కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో 163వ జాతీయ రహదారి అధికారులు స్పందించి గోతులను పూడ్చివేసి బీటీ నిర్మాణం చేపట్టారు. దీంతో ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలను తెలిపారు. కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి టింగి చందు అండర్–14 వాలీబాల్ విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ నెల 5 నుంచి 9 వరకు ఉత్తరాఖండ్లో జరిగే పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననున్నారు. కలెక్టర్ రాహుల్శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి ఎం.రాజేందర్ గురువారం విద్యార్థిని భూపాలపల్లిలో అభినందించారు. తిరుపతిలో జరిగిన 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో శ్రీఐ బ్రో కోడింగ్శ్రీ ప్రదర్శన చేసిన మాడిగ స్నిగ్ధ, వెలగందుల తణ్మయి, గైడ్ టీచర్ మధు, శ్రీజీవ వైవిధ్య పరిరక్షణశ్రీ అంశంపై ప్రెజెంటేషన్ చేసిన టీచర్ ప్రభాకర్ రెడ్డి, క్రీడల్లో శిక్షణ అందించిన పీడీ సిరంగి రమేష్లను కూడా సత్కరించారు. ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు నియమాలు పాటిస్తూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని డీటీఓ సందాని సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీటీఓ హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రయాణికుల భద్రతతో పాటు తమ సొంత భద్రత కోసం డ్రైవర్లు, కండక్టర్లు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో అవగాహన, క్రమశిక్షణ ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందూ, ఏఎంటీ అమృత, డిపో సిబ్బంది పాల్గొన్నారు. -
నిర్వహణ భారం
ములుగు రూరల్: రైతులకు లాభసాటి వ్యవసాయం, పంటలను ఆశించే చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలను ఏర్పాటు చేసింది. రైతువేదికల నిర్మాణాలతో రైతులతో వ్యవసాయశాఖ అధికారులు అనుసందానంగా ఉండేందుకు వీలుగా ఉంటుంది. రైతు వేదికలకు గతకొన్ని నెలలుగా నిర్వహణ నిధులు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం ఆగస్టు –2022 వరకు రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేసింది. 40 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. రైతు వేదికల నిర్వహణ వివరాలు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 31 క్లస్టర్లుగా విభజించారు. వీటిల్లో 31 రైతు వేదికలను నిర్మించి 31 మంది ఏఈఓలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతు వేదికకు రూ. 9 వేలను మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతు వేదికల్లో తాగునీరు రూ.500, పారిశుద్ధ్యం రూ.3 వేలు, స్టేషనరీ రూ.1,000, కరెంట్ బిల్లు రూ.1,000, మైనర్ రిపేర్లు రూ.1,000, నెలలో 8 సార్లు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం నెలకు రూ.2.79 లక్షల నిధులను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల నిర్వహణకు సొంత డబ్బు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.రైతు వేదికల నిర్వహణకు నిధులు రావడం లేదనే విషయం వాస్తవమే. సెప్టెంబర్ –2022 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 నెలలుగా రైతు వేదికల నిర్వహణ నిధులు మంజూరు కాలేదు. రైతు వేదికల నిర్వహణలో కరెంటు బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్యం, సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ప్రభుత్వం నిధులను ఎప్పుడు మంజూరు చేస్తుందో చూడాలి. – సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి●జిల్లాలో 31 క్లస్టర్లలో రైతు వేదికల నిర్వహణ కొనసాగుతోంది. ప్రతినెలా ఒక్కో రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ. 9 వేలు మంజూరు చేయాల్సి ఉంది. 40 నెలలుగా నిర్వహణ నిధులు మంజూరు కాకపోవడంతో రూ.1,11,60,000 పెండింగ్లో ఉన్నాయి. రైతు వేదిక నిర్వహణ తప్పనిసరి కావడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహణకు డబ్బు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారు. రైతులకు రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటూ రైతులకు పంటల సాగుపై సలహాలు సూచనలు అందిస్తూ క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేపడుతున్నారు. పెండింగ్లో రూ.1,11,60,000 ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు -
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తాం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం కేటాయించిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూపాలపల్లి ఏరియాకు సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలో 46.54లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని విధించిందన్నారు. గడిచిన తొమ్మిది మాసాల్లో 22.94లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టి 69శాతంలో నిలిచామని పేర్కొన్నారు. గతేడాది 37లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయగా.. ఈ ఏడాది అంతకుమించి బొగ్గు ఉత్పత్తి చేపడుతామని తెలిపారు. గడిచిన డిసెంబర్ మాసంలో 65శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. సాధించిన బొగ్గు ఉత్పత్తిలో 2.91లక్షల టన్నుల బొగ్గును రవాణా చేశామన్నారు. ఏరియా అక్టోబర్ మాసం వరకు రూ.440 కోట్ల నష్టాల్లో ఉందని తెలిపారు. ఏరియాలో ప్రతీ రోజు సుమారు 9500వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నట్లు చెప్పారు. శీతాకాలం నేపథ్యంలో బొగ్గు డిమాండ్ తగ్గిందని, వర్షాకాలం నేపథ్యంలో ఏరియాలోని ఓపెన్కాస్టు గనుల్లో భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులకు అంతరాయం కలిగిందన్నారు. యువ కార్మికుల గైర్హాజరు శాతం అధికంగా ఉంటుందన్నారు. భవిష్యత్లో భూపాలపల్లి ఏరియాలో ఏడాదికి 100లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తిచేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వెంకటాపూర్ పీవీఎన్ఆర్ ఓపెన్ కాస్టు ఏర్పాటుపై త్వరలోనే ములుగు కలెక్టర్ను కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది నుంచి బొగ్గు ఉత్పత్తి చేపట్టనున్నట్లు జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి వెల్లడించారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి -
విశాలంగా.. సులభంగా..
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు క్యూలో ఇబ్బందులు పడకుండా అధికారులు ఎత్తు, వెడల్పు పెంచారు. ఈ సారి అధికారులు పెద్ద ఎత్తున క్యూలైన్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ద్వారా మ్యాపింగ్ చేయించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు నేరుగా క్యూలైన్ వద్దకు వెళ్లేలా మ్యాపింగ్ చేయించారు. మరొక దారి బస్టాండ్ నుంచి వచ్చే భక్తులు క్యూలైన్కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉన్న క్యూలైన్ మాదిరిగానే ఈ సారి కూడా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఎత్తు ఎక్కువగా, విశాలంగా ఉండేలా పందిళ్లను ఏర్పాటు చేసి లైన్లను మరిన్ని పెంచారు. దీంతో ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా విశాలంగా, విరివిరిగా దర్శనానికి వెళ్లేలా సులభమైన మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ దర్శనానికి కూడా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. బెల్లం(బంగారం) కౌంటర్లు ఏవీ? అమ్మవార్లకు సమర్పించిన బంగారం (బెల్లం) ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు గద్దెల వద్ద పడిగాపులు పడుతున్నారు. బెల్లం ప్రసాదాన్ని స్వీకరించడానికే ఎక్కువ సమయం భక్తులు కేటాయించడంతో గద్దెల ప్రాంగణంలోనే భక్తులు నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో గంటల తరబడి భక్తులు గద్దెల చుట్టూ గుమికూడడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు గద్దెల వద్దకు వచ్చేందుకు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే భక్తుల రద్దీ ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జాతరలోనైనా ప్రసాదం (బెల్లం) పంపిణీ కౌంటర్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను విశాలంగా చేయడంతో ఒకేసారి వేలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోకుండా వెంటవెంటనే దర్శనం చేయించే విధంగా ప్రవేశం, బయటకు వెళ్లే ప్రదేశాలను మరింత విస్తరిస్తున్నారు. దీంతో వేలాది మంది భక్తులు దర్శించుకొని ఒకేసారి బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో క్యూలైన్లలో ఒత్తిడి, రద్దీ తగ్గనుంది. ఎత్తు, వెడల్పు ఎక్కువగా ఉండేవిధంగా ఏర్పాట్లు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని వనదేవతలను నూతన సంవత్సరం గురువారం రోజు భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. స్నానఘట్టాల వద్ద షవర్ల కింద జల్లు స్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించారు. నూతన సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లకు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పూజారుల చేతుల మీదుగా నుదట బొట్టు పెట్టించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి
ములుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ టీఎస్.దివాకర పిలుపునిచ్చారు. ఈ మేరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను అధికారులతో కలిసి ఆయన కలెక్టరేట్లో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఉంటాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సామాజిక బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని సూచించారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి తద్వారా వారి తల్లిదండ్రులకు వివరించేలా చూడాలన్నారు. ఇందుకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా, డ్రంకెన్ డ్రైవ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడపవద్దని సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో అధికారులు విద్యార్థులను విస్తృతంగా భాగస్వాములు చేయాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్లాక్ స్పాట్స్ వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఆర్టీఓ శ్రీనివాస్, ఏఎంవీఐ వినోద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కలెక్టర్ టీఎస్.దివాకర -
నార్లాపూర్ పోలీస్స్టేషన్ ప్రారంభం
ఎస్ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో నూతనంగా నిర్మించిన నార్లాపూర్ పోలీస్ స్టేషన్ను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్టేషన్ ఏర్పాటుతో మేడారం వచ్చే భక్తులకు, స్థానికులకు శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. నార్లాపూర్ పోలీస్స్టేషన్ హౌస్ అధికారిగా ఎస్సై కమలాకర్, 30 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్ సిబ్బంది పస్రా సర్కిల్ ఇన్స్పెక్టర్ దయాకర్ పర్యవేక్షణలో బాధ్యతలు నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ మనన్ బట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అధ్యయనం అత్యవసరం
‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్స్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. ‘తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తా’ అంటుంది పుస్తకం. -
మహాజాతరను విజయవంతం చేయాలి
ములుగు: మేడారం మహాజాతరను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావులతో కలిసి మేడా రం మహాజాతర 21 లైన్ శాఖల జోనల్, నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ జాతరకు, గద్దెల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తుందని తెలిపారు. గత జాతరలో వచ్చిన భక్తుల సంఖ్యతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వనదేవతల దర్శనం జరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. రేపటి నుంచి నోడల్ అధికారులు మేడారంలో జోన్, సెక్టార్లలో ఫీల్డ్ విజిట్ నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్, నోడల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్.దివాకర -
పరీక్షల కాలం..
స్వీట్లు కొనుగోలు చేస్తున్న యువకులుఇంటి ఎదుట ముగ్గు వేస్తున్న మహిళలుకొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లా నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. -
శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి
ములుగు రూరల్: జిల్లాలో పోలీస్శాఖ నిబద్ధతతో పనిచేసి శాంతిభద్రతలను పరిక్షణపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నా రు. ఈ మేరకు బుధవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్శాఖ వార్షిక సమాచార నివేదికను విలేకర్ల సమావేశంలో ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా మావోయి స్టు ప్రభావిత ప్రాంతమైనప్పటికీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేసిందని తెలిపారు. 2023లో 1,597 కేసులు, 2024లో 2,171 కేసులు నమోదు అయ్యాయన్నారు. 2025లో 14 శాతం పెరిగిందని తెలిపారు. జిల్లాలోని 10 పోలీస్స్టేషన్ల పరిధిలో 2,472 కేసులు నమోదు అయ్యాయని వె ల్లడించారు. తీవ్రమైన నేరాల విభాగంలో 12 హత్య కేసులు, 8 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయని తెలిపారు. మహిళలు, బాలికలపై జరిగిన నేరాలలో 21 పొక్సో కేసులు నమోదయ్యాయని వివరించారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 18, మిస్సింగ్ కేసులు 127, సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ 235 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వివిధ కేసుల్లో రూ.36,99,330 రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. 73 రోడ్డు ప్రమాద కేసుల్లో 77 మంది మృతి చెందగా 152 మంది గాయపడినట్లు వివరించారు. 14 గంజాయి కేసులు నమోదు చేసి 57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ములుగు కోర్టు పరిధిలో నిర్వహించిన లోక్ అదాలత్ లో 1,334 కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారయ్యాయని తెలిపారు. వివిధ కేసుల్లో చట్ట ప్రకారం 26మందికి శిక్షపడినట్లు తెలిపారు. జిల్లాలో 87 మంది మావోయిస్టులకు పునారావసం కల్పించినట్లు తెలిపారు. 2025లో 39 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గవర్నర్ బందోబస్తు, మినీ మేడారం జాతర సమయంలో పోలీస్శాఖ విశేష సేవలు అందించిందని వివరించారు. మహాజాతరకు 460 సీసీ కెమెరాలు మేడారం మహాజాతరకు 12 వేల మంది పోలీసులు విధులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని వివరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 460 సీసీ కెమెరాలు, 20 డ్రోన్ కెమెరాలతో జాతర పర్యవేక్షణ, ట్రాఫిక్ పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. మేడారం మహా జాతరకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారని అందుకు అనుగుణంగా పోలీసు భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ ఏటూరునాగారం మనన్బట్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, డీసీఆర్బీ కిశోర్ పాల్గొన్నారు. మహాజాతరకు 12 వేల మంది పోలీసులు జిల్లాలో క్రైం రేటు గతేడాది కంటే తగ్గింది ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
మేడారం జాతర చైర్పర్సన్గా ఇర్ప సుకన్య?
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతర కమిటీని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. తాడ్వాయికి చెందిన ఇర్ప సుకన్యను జాతర కమిటీ చైర్పర్సన్గా నియమించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జాతర కమిటీలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. చైర్పర్సన్తో పాటు కమిటీ డైరెక్టర్లుగా మహిళలను నియమించనున్నట్లు సమాచారం. ఈ సారి జాతర కొత్తదనంతో నిర్మితమవుతున్న తరుణంలో కమిటీలో కూడా మహిళలకే ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జాతర కమిటీని ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు తెలియగా ఇంకా అధికారంగా ఉత్వర్వులు వెలువడలేదు. -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద భక్తులు స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద జంపన్న గద్దె వద్ద భక్తులు పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు ఆరగించారు. భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. -
ఫుట్ ఓవర్బ్రిడ్జి త్వరగా పూర్తిచేయాలి
ములుగు రూరల్: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గట్టమ్మ వద్ద ఏర్పాటు చేస్తున్న ఫుట్ ఓవర్బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం గట్టమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం కలెక్టర్ దివాకర, అటవీశాఖ జిల్లా అధికారి రాహుల్ కిషన్జాదవ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి గట్టమ్మ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదిదేవత గట్టమ్మ తల్లికి మేడారం వచ్చే భక్తులు మొదటి మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ స్థలాలు, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఆత్మ చైర్మన్ రవీందర్రెడ్డి, ఆర్అండ్బీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కరాటేతో ఆత్మస్థైర్యం ఏటూరునాగారం: కరాటే నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు కరాటే పోటీల్లో విజేతలను మంత్రి సీతక్క బుధవారం సన్మానించి బహుమతులు అందజేశారు. జిల్లా కరాటే అకాడమి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ఏటూరునాగారం జెడ్పీహెచ్ఎస్కు చెందిన విద్యార్థులు పోటీల్లో విజయం సాధించగా బహుమతులను సీతక్క నుంచి అందుకున్నారు. ఈ పోటీల్లో ఐశ్వర్యకు సిల్వర్ మెడల్తో పాటు రూ.15వేలు, దినేష్కు మెడల్తో పాటు రూ.15వేలు, బ్రాంచ్ మెడల్స్ హరిని, హర్ష, రాంచరణ్, అలువాల విఘ్నశ్రీ సాధించగా వారికి ఒక్కొక్కరికి రూ.5వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఎస్జీఎఫ్ఐ క్రీడాకారులను మంత్రి సన్మానించారు. కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బు, కోచ్ హుస్సేన్, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క -
క్రమశిక్షణ అవశ్యం
సచిన్ టెండూల్క ర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. -
యాసంగికి సరిపడా యూరియా నిల్వలు
ములుగు రూరల్: జిల్లాలో యాసంగి పంటకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం యూరియా నిల్వల వివరాలను వెల్లడించారు. అన్ని సహకార సంఘాల్లోనూ ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంటసాగు చేసిన రైతులకు అందే విధంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ములుగు మండలంలో 137 ఎంటీఎస్, మల్లంపల్లి 68, వెంకటాపురం(ఎం)లో 107, గోవిందరావుపేటలో 40, మంగపేటలో 214, ఎస్ఎస్ తాడ్వాయిలో 29, ఏటూరునాగారంలో 46, వాజేడులో 22, వెంకటాపురం(ఎం)లో 126, కన్నాయిగూడెంలో 22 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైతులకు యూరియా సరఫరాలో సమస్య ఎదురైతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు. రామప్ప తైబందీ ఖరారు వెంకటాపురం(ఎం) : మండల పరిధిలోని పాలంపేట గ్రామంలో రైతు వేదికలో రామప్ప సరస్సుకు సంబంధించిన తైబందీని ఖరారు చేసినట్లు నీటి పారుదల శాఖ డీఈ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప సరస్సు ద్వారా యా సంగి సీజన్కు సుమారుగా 5,180 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తైబందీ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహాజాతరలో మెరుగైన వైద్యసేవలుములుగు రూరల్: మేడారం మహాజాతరలో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్రావు అన్నారు. జిల్లా కేంద్రంలో సమ్మక్క, సారలమ్మ జాతరపై ముందస్తు ప్రణాళికలో భాగంగా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ఫస్టు రిఫరల్ సెంటర్గా మేడారంంలో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. సెకండ రీలెవల్ ట్రీట్మెంట్కు ములుగు జనరల్ ఆస్పత్రిలో 20 బెడ్లతో వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. టైర్షరీలెవ్ వైద్యసేవలకు వరంగల్ ఎంజీఎంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ పవన్కుమార్, ఏడీ గఫర్, డాక్టర్ శ్రీకాంత్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ‘మంత్రి మాటల్లోనే అభివృద్ధి’ మంగపేట: ములుగు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మంత్రి సీతక్క మాటల్లోనే వినిపిస్తుంది తప్పా చేతల్లో ఏమీ కనిపించడం లేదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు లింగయ్య తండ్రి దశదిన కార్యక్రమానికి బుధవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఏటూరునాగారం– బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై గోతులు ఏర్పడినా మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు మరమ్మతులు చేయించలేదన్నారు. మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మేడారం మహాజాతరకు ఈ దారి మీదుగా వేలాది వాహనాల్లో లక్షలాది మంది భక్తులు తల్లుల దర్శనానికి వెళ్తుంటారని తెలిపారు. మహాజాతరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకునే మంత్రి రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మినారాయణ, సోషల్ మీడియా ఇన్చార్జ్ గుడివాడ శ్రీహరి, నాయకులు సుధాకర్, రాజుయాదవ్, శ్రీనివాస్, రాజేందర్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కామన్ మెస్లో అధిక బిల్లులు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కా మన్ మెస్లో బిల్లులు అధికంగా వచ్చాయని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం తినకుండా ఆందోళన చేపట్టారు. ఒక్కో విద్యార్థికి జూలై బిల్లు రూ. 2,178, ఆగస్టులో రూ. 2,435 చొప్పున వేశారు. ఈ బిల్లులను ఈనెల 29న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ ప్రదర్శించారు. ఆగస్టులో 8 నుంచి 20వ తేదీ వరకు సెలవుల సందర్భంగా మెస్ నడపలేదని, 18 రోజులకే ఒక్కో విద్యార్థికి రూ. 2,435 బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం ఒక్కో విద్యార్థికి రూ. రూ.2వేల వరకు రావాల్సిండగా 18 రోజులకే ఎక్కువ బిల్లు రావడం ఏమిటని, అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న హాస్టళ్లడైరెక్టర్ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జనవరి 3న రిజిస్ట్రార్ రామచంద్రం వద్ద ఈ బిల్లుల విషయంపై సమావేశం నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుపగా మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన విరమించి విద్యార్థులు భోజనం తిన్నారు. కాగా, కామన్ మెస్ వద్ద విద్యార్థులతో జనవరి 3న సమావేశం నిర్వహించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్ిపీ రాజ్కుమార్ మంగళవారం సర్క్యూలర్ జారీచేశారు. మెస్ బిల్లులు, మెస్లో మాల్ప్రాక్టీసెస్, టెండర్ నోటిఫికేషన్లపై చర్చించనున్నామని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల ఆందోళన రిజిస్ట్రార్తో సమావేశం ఏర్పాటు చేస్తామన్న డైరెక్టర్ -
వైరెటీ థీమ్స్.. ఈవెంట్స్!
గ్రేటర్ వరంగల్లో థర్టీ ఫస్ట్ వేడుకలకు ఏర్పాట్లుసాక్షి, వరంగల్: నగర ప్రజలు 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకనున్నారు. కీలకమైన ‘డిసెంబర్ థర్టీ ఫస్ట్’ వేడుకలు జరుపుకునేందుకు వరంగల్, హనుమకొండ, కాజీపేట వాసులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవ్విళ్లూరుతారు. ఇందులో భాగంగా నగరంలోని కన్వెన్షన్ హాల్స్, హోటళ్లు, రిసార్టులు, వివిధ పాఠశాలల్లోని ఓపెన్ గ్రౌండ్లు, భద్రకాళి ట్యాంకుబండ్ నయా జోష్కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లతో ప్రముఖ సింగర్లు, డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇలా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జోష్లో వరంగల్ తేలిపోనుంది. రారమ్మంటున్న ఈవెంట్స్.. విభిన్న థీమ్స్తో వేడుకలు నిర్వహించేలా ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇలా రూ.149 మొదలుకొని.. ఆపై ధరలతో విభిన్న ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నారు. వెబ్సైట్లలోనూ టికెట్లను విక్రయిస్తున్నారు. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్.. ఇలా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుండడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అధికంగా అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు డిమాండ్ ఉంది. వరంగల్లోని గ్రీన్వుడ్ హైస్కూల్ డే స్కాలర్ ప్రాంగణంలో రాక్ మ్యూజిక్ స్టార్ రోల్ రైడా రాత్రి 8 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉండనుంది. భద్రకాళి ట్యాంకు బండ్ వద్ద బిగ్బాస్ ఫేమ్ ఫోక్ సింగర్ రాంరాథోడ్ లైవ్ పార్టీకి నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం.. లైవ్ మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బబుల్ థీమ్, ఫుడ్ స్టాల్స్తో థర్టీ ఫస్ట్ వేడుకలకు సిద్ధమవుతోంది. డీ కన్వెన్షన్ సెంటర్లోనూ ఫుడ్తోపాటు ఆల్కాహాల్ అందించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. వరంగల్ బిగ్గెస్ట్ హిప్ హప్ అండ్ ఫోక్ నైట్ మ్యూజిక్ సెలబ్రేషన్ కూడా జరగనుంది. ఇలా ఆయా ఈవెంట్లలో లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రీమియం సౌండ్ అండ్ లైటింగ్, వీఐపీ జోన్లు, టేబుల్ సర్వీస్ వంటివి ఉండడంతో ఈవెంట్లకు పైసా వసూలు కానుంది. పిల్ల లు, కుటుంబ సభ్యులు, దంపతులు, పార్టీ లవర్స్.. ఇలా అందరికీ అవకాశం ఉండడంతో థర్టీ ఫస్ట్ వేడుకల్లో జోష్ ఉండనుంది. లైవ్ మ్యూజిక్, స్టెప్పులతో సెలబ్రెటీల సందడి అన్ లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ ప్యాకేజీలకు డిమాండ్ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి ఫుల్జోష్.. పంచాయతీ ఎన్నికలతో సందడిగా మారిన గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు డిసెంబర్ థర్డీ ఫస్ట్ వేడుకలు గ్రాండ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గెలిచిన ఉత్సాహంలో ఉన్న సర్పంచ్లు తమ అనుచరుల కోసం ఇప్పటికే చికెన్, మటన్, మద్యం కొనుగోలు చేశారు. డీజే సిస్టం కూడా సమకూర్చుకుంటున్నారు. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండనుండడంతో ఆ పదవులు ఆశించే నాయకులు ఇప్పటి నుంచే తమ బలగం కోసం వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ నయాసాల్ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
డెడ్లైన్ టెన్షన్..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనుల డెడ్లైన్ సమీపిస్తుడడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డిసెంబర్ 31 లేదా జనవరి 5వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా స్రెడ్డి, సీతక్క డెడ్లైన్ విఽధించిన విషయం తెలిసిందే. అలాగే, గద్దెల ప్రాంగణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ వారంలో నాలుగు దఫాలుగా పనులను పరిశీలించి డెడ్లైన్ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఏఈ నుంచి మొదలు.. కలెక్టర్ వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ క్రమంలో గద్దెల పునర్నిర్మాణ పనుల్లో కొన్ని పూర్తికాగా మరిన్ని డెడ్లైన్ నాటికి పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. సాలహారం పనుల పూర్తిపై అనుమానాలు గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం రాతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో డెడ్లైన్ నాటికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వైపే ఈ పనులు పూర్తి కాగా మరో వైపు పిల్లర్ల స్థాయిలోనే ఉంది. ప్రహరీ నిర్మాణంతోపాటు 8 ఆర్చ్ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను నిలిపారు. కానీ వాటిపై భీమ్లు నిలపడంతోపాటు ఆదివాసీ సంస్కృతి చిత్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐరన్ గేట్లను కూడా అమర్చాల్సి ఉంది. ఈ పనులేవీ నేటి వరకు కాలేదు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. అయితే రాళ్ల మధ్యలో సిమెంట్ పూతల పనులు ఇంకా పూర్తి కాలేదు. అమ్మవార్ల గద్దెల విసర్తణ పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ కేవలం రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. పైన రాతి పిల్లర్లను నిలపడంతోపాటు గద్దెల చుట్టూ రాతి స్టోన్స్ డిజైన్ల ఏర్పాటు పనులు కూడా నేటి వరకూ కాలేదు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా పాయింట్ మంచెల పనులూ అంతే.. జాతరలో కవరేజ్ కోసం మీడియా పాయింట్ మంచెల నిర్మాణ పనులు ఇంకా స్లాబ్ స్థాయిలోనే జరుగుతున్నాయి. జాతరలో మీడియా కవరేజ్ కీలకం. గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా మీడియా కవరేజ్, అధికారుల పర్యవేక్షణ కోసం సాలహారానికి అవతల వైపు రెండు, ఇవతల వైపు రెండు చొప్పున మీడియా పాయింట్ మంచెలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఒక మంచె రెండో స్లాబ్ వేయగా, మిగతా మూడు మంచెల నిర్మాణం పనులు మొదటి స్లాబ్ దిశలోనే కొనసాగుతున్నాయి. జాతరకు ముందుగా మంచెల నిర్మాణ పనులు పూర్తికావడం అనుమానంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర గడువు సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో తొందరపాటుతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు మిగిలింది 27 రోజులే. మేడారం జాతరకు ఇంకా 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం, బుధ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలొస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి భక్తుల సంఖ్య లక్షల్లో పెరగనుంది. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ మధ్యలో జీపీ సిమెంట్ పూయడంతో భక్తుల రద్దీ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి నిరంతరం మేడారం పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మహాజాతర నాటికి పూర్తయ్యేనా? -
అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం..
● కేయూ పాలకమండలి సమావేశంలో నిర్ణయంకేయూ క్యాంపస్ : హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించారు. మొత్తం 11 అంశాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కొంతకాలం క్రితం కేరీర్ అడ్వాన్స్మెంట్ స్కీం కింద (క్యాస్)అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో ఎక్కువశాతం మంది అధ్యాపకుల పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం లభించగా రెండు విభాగాలకు చెందిన నలుగురికి మాత్రం ఆమోదం లభించలేదని సమాచారం. ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్ల ఎండోమెంట్ లెక్చర్లు ఏర్పాటుకు కూడా చర్చించి ఆమోదించారు. ఓ మాజీ వీసీ, రిజిస్ట్రార్పై తమ హయాంలో జరిగిన నియామకాల విషయంలో కొంతకాలం క్రితం విజిలెన్స్ విచారణ జరిగింది. ఆ మాజీ వీసీ, మాజీ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకునే విషయంపై కూడా పాలకమండలి సమావేశంలో చర్చించినట్లు సమాచారం. వీరిపై చర్యల కోసం గవర్నర్కు, ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. సూపరింటెండ్ల నుంచి అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా నియామకాలకు ఉస్మానియా యూనివర్సిటీలో అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే కే యూలో కూడా ఏఆర్ల నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు.దీంతో ఇక సూపరింటెండెట్లకు రాత పరీక్షలోని మెరిట్ అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారాతోనే నియామకాలు చేపట్టబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యాకమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు సుధాకర్, బి. రమ, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు. విచారణ కమిటీ నియామకం..తనను వేధిస్తున్నారని కేయూ ఎడ్యుకేషన్ విభాగంలోని పార్ట్టైం అధ్యాపకుడు పి.రమేశ్.. ఆవిభాగంలోని పలువురిపై ఆరోపణలు చేస్తూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపేందుకు ఆరుగురు ప్రొఫెసర్లతోకూడిన విచారణ కమిటీని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం 29న ఉత్తర్వులు జారీ చేశా రు. ఈవిచారణ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ వ్యవహరిస్తున్నారు. పదిరోజుల్లో విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించాలని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
వరంగల్ చౌరస్తా : వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ముక్కోటి (వైకుంఠ ) ఏకాదశి సందర్భంగా మంగళవారం వరంగల్ బట్టల బజార్లోని ఆలయంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో బారులుదీరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా, దేవాలయం ప్రధాన రహదారిలో ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మహాజాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల క్యూలైన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మహాజాతరలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దన్నారు. భక్తులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రహదారులకు ఇరువైపులా బోర్లు, చేతి పంపులు, రహదారుల జంక్షన్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతకుముందు కాల్వపల్లి –ఊరట్టం బీటీ నిర్మాణ పనులు, ఊరట్టం– కొండాయి రోడ్డు పనులు, గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో వెంకటేష్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష -
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్ రఘునాథపల్లి సబ్ డివిజన్ నర్మెట సెక్షన్లో పనిచేస్తూ మృతి చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ బానోత్ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, ఎస్ఈలు, తదితరులు పాల్గొన్నారు. -
గణితంపై మక్కువ పెంచుకోవాలి
● డీఈఓ సిద్దార్థరెడ్డి ములుగు: ఆధునిక శాస్త్ర–సాంకేతిక, కృత్రిమ మేథా యుగంలో గణితశాస్త్రమే ముఖ్యభూమిక పోషిస్తుందని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే గణితంపై మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అ ధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి చందా భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని 10 మండలాల నుంచి మండలస్థాయిలో విజేతలుగా నిలిచిన 35 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రశ్నపత్రాలను సెక్టోరియల్ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీల కు ఎంపికై న చరణ్యలక్ష్మి, శివకుమార్, రాజేష్, తహరిన్, కావ్యశ్రీ, సిరిగ్రేస్లకు ప్రశంసపత్రాలను అందించారు. అనంతరం డీఈఓ మాట్లాడారు. భవిష్యత్లో ఏ రంగంలో అయినా ఎదగాలంటే ప్రాథమిక గణిత భావనలదే పునాది అని, గణితాన్ని కేవలం పాఠ్యాంశంగా కాకుండా నిజ జీవిత సమస్యల పరి ష్కారానికి ఉపయోగించే విధంగా నేర్చుకోవాలన్నా రు. జిల్లాలో గణిత విద్య వ్యాప్తికి కృషి చేస్తున్న గణి త ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహా దారుడు కందాల రామయ్య, రాష్ట్ర పరిశీలకుడు అడిక సతీష్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు హర్షం రాజు, శ్యాంసుందర్ రెడ్డి, గుల్లపల్లి సాంబయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. -
1న వరంగల్ మార్కెట్కు సెలవు
వరంగల్: ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజు గురువారం (జనవరి 1, 2026)న గుమస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ కోరిక మేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం మంగళవారం ప్రకటనలో తెలి పారు. సెలవు నేపథ్యంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని తెలిపారు. శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. యార్డు బంద్ ఉన్నా 1వ తేదీన (గురువారం) జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని మల్లేశం తెలిపారు. పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ● తొమ్మిది మంది అరెస్ట్.. రూ.1,86,020 స్వాధీనం ● మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్హసన్పర్తి: గోపాలపురంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్, కేయూసీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గోపాలపురంలోని చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, కేయూ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న గోపాలపురానికి చెందిన చింతల రాజు, పిట్టల రామ్మోహన్, పిట్టల ప్రవీణ్, సీతంపేటకు చెందిన డి. వీరస్వామి, హనుమకొండ భవానీనగర్కు చెందిన గొట్టిముక్కుల రవికుమార్, హుస్నాబాద్కు చెందిన కారెపు శ్రీనివాస్, దేవన్నపేటకు చెందిన సూరం మల్లికార్జున్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కందారపు చంద్రమౌళి, భీమారానికి చెందిన లాలెల్లా శివప్రసాద్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,86,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తె లిపారు. అలాగే, మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ బాబులాల్,ఎస్సై చందర్, వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నకిలీ గన్తో బెదిరించి డబ్బుల డిమాండ్..● ఈ ఘటనలో నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు జనగామ రూరల్: నకిలీ గన్తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై భరత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 28 తేదీన జనగామకు చెందిన మల్లిగారి సతీశ్ పట్టణంలోని ఓ లిక్కర్ మార్ట్లో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో రఘునాథపల్లి మండలం గబ్బెటకు చెందిన నిందితుడు ఇంజ ప్రశాంత్ నకిలీ గన్తో సతీ శ్ను బెదిరించి రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై బాధితుడు సతీశ్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టి మంగళవారం జనగామలో నిందితుడిని అరెస్ట్ చేసి అ తడి వద్ద నుంచి నకిలీ గన్ను స్వాధీనం చేసుకుని రి మాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కా గా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కృష్ణ, సాగర్, చరణ్ను డీసీపీ, ఏసీపీ అభినందించారు. బావిలో పడి వ్యక్తి మృతి ఖిలా వరంగల్: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఎస్ఆర్ఆర్తోటకు చెందిన వీరసారపు గణేశ్కుమార్(40) ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో బయటకెళ్లి ఇంటికి రాలేదు. మంగళవారం ఎస్ఆర్ఆర్తోటలోని చేదబావిలో అతడి చెల్లికి చనిపోయి కనిపించాడు. వెంటనే మిల్స్కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తు కాలు జారి చేదబావిలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. -
సమష్టి కృషితోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ –12లో భాగంగా మంగళవారం కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పారిశ్రామిక ప్రాంతాలు, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా 339 బాలలను కాపాడి 26 ఎఫ్ఐఆర్లు, 160 ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద, ఎన్సీఎల్పీ డైరెక్టర్ అశోక్ కుమార్, బాలల సంక్షేమ స మితి చైర్మన్లు ఉప్పలయ్య, వసుధ, సభ్యుడు పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హె ల్ప్ లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి.. స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు నిరంతం పర్యవేక్షించాలని సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట డివిజన్ల సంబంధించిన పలు రికార్డులతోపాటు, గ్రీవెన్స్ ఫిర్యాదులు, రౌడీషీటర్ల వివరాలతో కూడిన ఫైళ్లను పరిశీలించి డీసీపీ దార కవితకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ ఏఎస్పీ శుభం, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ -
అడవికి నిప్పు ప్రజలకు ముప్పు
వాజేడు: అడవిలో అగ్ని ప్రమాదాలపై మంగళవారం మండలపరిధిలోని ధర్మవరం గ్రామంలో ఎఫ్ఎస్ఓ ఎల్. నారాయణ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిలో నిప్పు అంటుకుంటే చెట్లు కాలి పోవడంతో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అడవిలో సంభవించే అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్య ప్రాణుల సంరక్షణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ప్లాస్టిక్ రహిత అడవులుగా ఉండాలని, ఏ ఒక్కరూ ప్లాస్టిక్ను అడవుల్లో పడేయొద్దన్నారు. కార్యక్రమంలో పద్మ, మనీష, దామోదర్, జనార్దన్, రాంబాబు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి... ఉమ్మడి వరంగల్లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ఈ నెల 3న హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతోంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేశ్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ చీఫ్ ఇంజినీరు ములుగు సర్కిల్ పరిధిలో ఎస్సారెస్పీ 1,03,883 58,901 6.000 (బిలో ఎల్ఎండీ) దేవాదుల 4,170 1,630 0.22 పాకాల లేక్ 18,193 18,193 2.00 రామప్ప లేక్ 5,180 6,780 0.6 లక్నవరం 8,794 4,550 0.91 మల్లూరువాగు 7,500 1,500 0.2 పాలెంవాగు 7,500 3,000 0.35 ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్ శాఖ సన్నద్ధం వారబందీ పద్ధతి అమలుప్రాజెక్టు మొత్తం ప్రతిపాదించింది నీటి కేటాయింపుదేవాదుల 4,66,600 1,95,095 11.30 ఎస్పారెస్పీ 2,29,623 1,57,038 12.88 (బిలో ఎల్ఎండీ) ఎస్సారెస్పీ–2 96,671 83,039 6.82 -
గ్రామస్తులకు అండగా ఉంటాం..
వెంకటాపురం(కె): గ్రామస్తులకు ఎలాంటి సహాయం కావాలన్నా.. పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బర్లగూడెం పంచాయతీ పరిధిలోని కర్రిగుట్టలో ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతం పామునూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎప్పులు ఎలాంటి సహాయం కావాలన్నా.. పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించవచ్చునన్నారు. అనంతరం చిన్నారులను ఆప్యాయంగా పలకరించారు. ఆయన వెంట ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, సిబ్బంది ఉన్నారు. వసతులు మెరుగ్గా ఉండాలి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో బందోబస్తు కోసం వచ్చే పోలీసు సిబ్బందికి వసతి సౌకర్యాలు మెరుగ్గా కల్పించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మంగళవారం మేడారంలో జాతరకు బందోబస్తు కోసం విధులు నిర్వర్తించే అధికారులకు, సిబ్బంది కోసం ఏర్పాటు చేస్తున్న స్థలాలను పరిశీలించారు. సిబ్బందికి ఎలాంటి లోటు రాకుండా చూడాలని నిర్వాహణాధికారులను ఆదేశించారు. ఆయన వెంట డీఎస్పీ రవీందర్, సీఐలు దయాకర్, శంకర్ తదితరులు ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా సంబురాలు చేస్తే చర్యలు ములుగు రూరల్: నూతన సంవత్సర వేడుకలు చట్ట వ్యతిరేకంగా సంబురాలు చేపడితే శాఖ పరమైన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ప్రతీఒక్కరి జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలు భద్రత నియమాలు పాటిస్తూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటన -
మేడారం తొలి ఎస్సైగా కమలాకర్
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం పోలీస్స్టేషన్కు తొలి ఎస్సైగా అచ్చ కమలాకర్ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్లు జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం జాతరలో భక్తుల భద్రతకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. పస్రా పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న కమలాకర్ను మేడారం ఎస్సైగా నియమించారు. అలాగే తాడ్వాయి ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్రెడ్డిని ములుగు డీఎస్బీకి బదిలీ చేశారు. ములుగు డీసీఆర్బీలో పని చేస్తున్న జగదీశ్ను తాడ్వాయి ఎస్సైగా నియమించారు. మేడారం ఎస్సై కమలాకర్, తాడ్వాయి ఎస్సైగా జగదీశ్లు బాధ్యతలను స్వీకరించారు. ఏటూరునాగారం: ట్రైబర్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 5, 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ హరీష్సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మంగపేట: మండంలోని మంగపేట, రాజుపేట కమలాపురంలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి సురేష్ ఏటూరునాగారం సహాయ సంచాలకులు అవినాష్వర్మతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన అనంతరం నెలవారి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ చేరాలు, ఏఈఓలు పాల్గొన్నారు. ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో చిలకలగుట్ట దారిలో సీసీ రోడ్డుపై కింద నుంచి ఇనుప చువ్వలు పైకి తేలడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో చువ్వలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో సమ్మక్క పూజారి సిద్దబోయిన అనిల్కుమార్ స్పందించి మంగళవారం సొంత ఖర్చులతో ఇనుప సువ్వలను కట్ చేయించారు. మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు బోజరావు, ఆలం సమ్మారావు, అనిల్, శంకర్తోపాటు భక్తులు ఆయనను అభినందించారు. కాటారం: క్రీడలు శారీరక ధృడత్వానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడుతాయని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద మంగళవారం క్రాస్ కంట్రీ మీట్ నిర్వహించారు. సుమారు 200 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయిలో జనవరి 2న హైదరాబాద్లో జరిగే పోటీలకు ఎంపికై నట్లు జిల్లా ప్రెసిడెంట్ పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 16, 18, 20 సీనియర్స్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తిరుమల అభినందించారు. ఈ కార్యక్రమంలో కడారి విక్రమ్, చీమల సందీప్, కరుణాకర్రావు, ఉపాధ్యక్షుడు అజయ్, ట్రెజరరీ సాంబమూర్తి, జాయింట్ సెక్రటరీ సారంగపాణి, పీఈటీలు పాల్గొన్నారు. -
గ్రాంట్ ఇన్ ఎయిడ్తో వేతనాలివ్వాలి
కాళేశ్వరం: రాష్ట్రంలోని అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకారం దేవాలయాల నుంచి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ అద్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అర్చక, ఉద్యోగుల సమస్యలపై జనవరి 2న వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యలు 40శాతం పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కార దిశగా రెండు దఫాలుగా సీఎం రేవంత్రెడ్డిని కలిశామన్నారు. ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తామన్నారు. 121 జీఓను రద్దు చేసి 577 జీఓను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, శరత్చంద్రతోపాటు అర్చక, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
ములుగు: ప్రజావాణిలో వివిధ సమస్యలపై బాధితులు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 59 మంది వినతులు అందజేశారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 12 దరఖాస్తులు రాగా గృహ నిర్మాణశాఖకు 8, పింఛన్లు 8, ఉపాధి కల్పనకు 5, ఇతర శాఖలకు సంబంధించి 25 దరఖాస్తులు రాగా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడి కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. ఈ గ్రీవెన్స్లో ఆదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ సమస్యలపై గిరిజనులు 19 వినతులు అందజేశారు. పీఓ చిత్రామిశ్రా వాటిని స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని పీఓ వెల్లడించారు. గిరిజనులు అందించిన వినతులు ఇలా.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం దొంగల చలిమితండాలో నిధులు రద్దు చేయాలని అక్కడి గిరిజనులు విన్నవించారు. గూడూరు మండలం చిన్న ఐలాపురంలో సీసీ రోడ్డు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. మేడారం మహాజాతరలో చైతన్య జానపద కళాబృందానికి అవకాశం కల్పించాలని కళాకారులు కోరారు. నర్సంపేట ఆదివాసీ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కోసం 20 ఎకరాల భూమి ఇప్పించాలని తుడుందెబ్బ నాయకులు పీఓను కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో హుండీ కానుకుల్లో 25 శాతం నర్సంపేటలోని ఆదివాసీలకు వాటా ఇవ్వాలని కోరారు. వెంకటాపురం(కె) నూగూరుకు చెందిన పది మంది గిరిజనులు పీఎం జుగా కింద మేకలు, గొర్రెలు, తదితర పథకాలు అందించాలని పీఓకు మొరపెట్టుకున్నారు. గోవిందరావుపేట మండలం పస్రా నాగారం గ్రామానికి చెందిన గిరిజనుడు టీఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన గిరిజనుడు సర్వేయర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు. ఇలా పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఓకు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్మోహన్రెడ్డి, డీటీ అనిల్, మహేందర్, కొమురం ప్రభాకర్, ఆలెం కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గ్రామమైన అంకన్నగూడెంలో సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా గ్రామంలో నిర్వహించే బాల కుమారస్వామి జాతరకు నిఽ దులు కేటాయించాలి. పదేళ్లుగా ఆదివాసీలమే జాతర ఖర్చులు భరిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జాతర సందర్భంగా తాగునీటి వసతి, విద్యుత్, రోడ్డు నిర్మాణం చేప ట్టి, జాతరకు రూ. 2 లక్షల నిధులు కేటాయించాలి. – కొట్టెం రాజు, అంకన్నగూడెం సర్పంచ్, ములుగు మండలం కలెక్టర్ టీఎస్.దివాకర ప్రజావాణిలో 59 దరఖాస్తుల స్వీకరణ -
లయన్స్క్లబ్కు గ్లోబల్ సర్వీస్ ఆక్టివిటీ అవార్డు
ములుగు: హనుమకొండలోని శాయంపేట లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు నైట్ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్కు గ్లోబల్ సర్వీస్ ఆక్టివిటీ అవార్డు లభించింది. 2024–25లో చేసిన సేవలను గుర్తించి గ్లోబల్ సర్వీసెస్ సర్వీస్ అవార్డు అందజేసినట్లు తెలిపారు. అలాగే బెస్ట్ సెక్రటరీగా చుంచు రమేశ్, బెస్ట్ కోశాధికారిగా సానికొమ్ము రవీందర్రెడ్డికి, కుందూరు వెంకట్ రెడ్డిని డిస్ట్రిక్ట్ గవర్నర్గా గుర్తించి శాలువాలతో ప్రస్తుత గవర్నర్ చంద్రశేఖర ఆర్య సత్కరించారు. ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మెరుగు రమేశ్, జిల్లా చైర్మన్ కొండి సాంబశివ పాల్గొన్నారు. -
ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్
వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామ శివారులో ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే..ఆలుబాక శివారులో రోడ్డుపక్కన ఇసుక లారీలు పార్కింగ్ చేయడంతో బస్సులు, ద్విచక్రవాహనదారులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా సోమవారం మధ్యాహ్నం చర్ల వైపు నుంచి వస్తున్న ధాన్యం లారీ, వెంకటాపురం వైపు నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ మూడు ఒకే వరుసలోకి వచ్చి చేరడంతో బస్సు చిక్కుకుపోయింది. ఈ క్రమంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో హమాలీలు, కార్మికులు లారీలో ఉన్న బస్తాలను తొలగించి బస్సు, లారీ వెళ్లేలా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇప్పటికై నా అధికారులు రోడ్డు పక్కన లారీలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రాష్టస్థాయి సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ
ములుగు రూరల్: 69వ రాష్ట్రసాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ లో నిర్వహించిన ట్రాక్, రోడ్ సైక్లింగ్ పోటీలలో జిల్లా ఖేలో ఇండియా సెంటర్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఈ మేరకు సోమవారం జిల్లా క్రీడల, యువజన సర్వీసుల శాఖ అధికారి సర్ధార్ సింగ్ పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం అభినందించారు. ట్రాక్ సైక్లింగ్లో అండర్–14 విభాగంలో శ్రీహర్షవర్ధిని, అండర్ –19 విభాగంలో వర్షిణి, అండర్–14 బాలుర విభాగంలో విష్ణులు తృతీయ స్థానంలో నిలిచారు. రోడ్డు సైక్లింగ్ అండర్–14 బాలుర విభాగంలో విష్ణు తృతీయ స్థానం, అండర్ –14 బాలికల విభాగంలో దూడబోయిన అక్షర ద్వితీయ స్థానం, అండర్–17 విభాగంలో లహరి తృతీయ స్థానం, అండర్ –17 బాలికల మాస్టార్ట్ విభాగంలో ఐషు తృతీయ స్థానం, అండర్–19 విభాగంలో వర్షిణి ద్వితీయ స్థానం సాధించారు. జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచిలో నిర్వహించబోయే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని కోచ్ శ్రీరాం తెలిపారు. ములుగు: ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలనుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యర్యంలో ములుగులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)లో సోమవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించి జీవరాశులను కాపాడాలన్నారు. సహజ వనరులను పరిరక్షించాలని సూచించారు. విద్యార్థులందరూ పరిశుభ్రంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉచిత న్యాయ సహాయానికి టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్,ఉపాధ్యాయులు రాజేందర్, మల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమ్మానాన్నా.. మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్న.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని అమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24) అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవడంతో భావన, మేఘన రా ణి అక్కడికక్కడే మృతిచెందారు. మీ అమ్మాయిలు మృతిచెందారని సోమవారం తెల్లవారుజామున అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బందువులు పేర్కొంటున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత.. గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ, వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
చలికాలం.. జాగ్రత్త
ములుగు రూరల్: జిల్లాలో కొద్ది రోజులుగా పెరిగిపోతున్న చలితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సూచించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రక్షణ చర్యలు పాటించాలన్నారు. లేదంటే రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో దగ్గు, జలుబు, జ్వరం బారిన పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. చలిగాలుల కారణంగా వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని పిల్లలు, వృద్ధులు, గర్భిణులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. చలిగాలి తగలకుండా మాస్క్లు, స్వెటర్లు ధరించాలని వివరించారు. చలికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షి సోమవారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు పలు సూచనలు చేశారు. ప్రశ్న: చలితో వచ్చే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపండి? – కందకట్ల రణధీర్, మల్లంపల్లిడీఎంహెచ్ఓ: చలి తీవ్రత కారణంగా తరుచూ జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అస్తమ, నిమోనియా, గుండె సమస్యలు తలెతుత్తాయి. చలికాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసం సగం వరకు తీవ్రత ఉంటుంది. ఉదయం 7 గంటల కంటే ముందుగా చలిలో తీరగకూడదు. సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లోకి వచ్చే విధంగా చూసుకోవాలి. దగ్గు, జలుబు వస్తే భయపడాల్సిన పనిలేదు. ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. మూడు రోజులు గడిచినా తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. ప్రశ్న: దగ్గు, జలుబు తగ్గడం లేదు? – గడ్డం తిరుపతి, వెంకటాపురం(ఎం)డీఎంహెచ్ఓ: చలికాలంలో ఇన్ల్పూఝెంజా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వ్యాప్తి చెందుతుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల్లో వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. చలి సమయంలో వెచ్చగా ఉండే విధంగా ఉన్ని దుస్తులు ధరించాలి. వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే శరీరం నిండుగా ఉండేలా దుస్తులు ధరించాలి. ప్రశ్న: చలికాలంలో గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – లక్ష్మీ, అడవిరంగాపూర్డీఎంహెచ్ఓ: గర్భిణులకు చలితీవ్రత కారణంగా దగ్గు, జలుబు వస్తుంటాయి. గర్భిణులు చలి సమయంలో బయటకు రాకుండా ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, న్యూటిషన్, డ్రైప్రూట్స్ తీసుకోవాలి. కాచి చల్లార్చిన గోరు వెచ్చని నీటిని తాగాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. జలుబు, దగ్గును సంప్రదాయ పద్ధతులతో తగ్గించుకోవాలి. ప్రశ్న: పిల్లలు తరుచూ దగ్గు, జలుబు బారిన పడుతున్నారు.. సూచనలు అందించండి? – పంబిడి దేవేందర్రావు, వెంకటాపురం(ఎం)డీఎంహెచ్ఓ: చలి కాలంలో వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్ కారణంగా పిల్లల్లో తరుచూ దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబును ఇంటి చిట్కాలతో తగ్గించుకోవడం మంచిది. తగ్గని పక్షంలో వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. వీలైనంత వరకు యాంటిబయాటిక్లను వినియోగించడం తగ్గించాలి. రాత్రి సమయాల్లో పిల్లలకు వెచ్చని బ్లాకెట్లను కప్పి తలకు మంకిక్యాపులు ఉండేలా చూడాలి. పిల్లలకు ఉదయం వేడి నీటితో స్నానం చేయించాలి. చలి సమయాలలో బయట తిరగకుండా చూసుకోవాలి. ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? – నేతాజీ, ఎస్ఎస్ తాడ్వాయిడీఎంహెచ్ఓ: వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్న లేదా ఫ్రిజ్లో నిల్వ చేసిన ఆహారం తీసుకోకూడదు. బయట దొరికే చిరుతిండ్లు మానేయాలి. కూల్డ్రింక్స్, ఐస్క్రీం వంటి చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలి. చలికాలంలో ప్రజలు తక్కువ మోతాదులో నీటిని తీసుకుంటారు. తప్పనిసరిగా సరిపడా నీటిని తీసుకోవాలని లేని పక్షంలో కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. పండ్లు, ఆకుకూరలు, పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి. ప్రశ్న:పొగమంచు ఎక్కువగా ఉంటుంది. తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఏంటి? – గుంటి రాజు, బుట్టాయిగూడెండీఎంహెచ్ఓ: ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏజెన్సీలోని గ్రామాల్లో మరింతగా ఉంది. 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు మనం తట్టుకోగలుగుతాం. ఉదయం ఎక్కువగా చలి, మంచు కురుస్తుంది. కాబట్టి బయటకు వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరించాలి. తలకు మంకి క్యాంపులు, చెవులకు గాలి తగలకుండా, చేతులకు గ్లౌజ్లు, శరీరానికి చలిగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపులు, కిటికీలు మూసి వేయాలి.డీఎంహెచ్ఓ: చలి కారణంగా ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతాయి. గుండె సమస్యలు, బీపీ, షుగర్ ఉన్నవారు చలి సమయంలో బయటకు రాకుండా ఉండాలి. చలి కారణంగా రక్తనాళాలు దగ్గరకు వచ్చి గుండెపోటు, బ్రెయిన్ స్టోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించాలి. బీపీ, షుగర్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ జలుబు, దగ్గుకు ఇంటి రెమిడితో నయం ‘సాక్షి ఫోన్ఇన్’లో జిల్లా వైద్యాధికారి గోపాల్రావు -
ఓరుగల్లు పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు
ములుగు: కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, వేయిస్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం, గణపురం కోటగుళ్లు, లక్నవరం సరస్సు, పాకాల సరస్సు, బొగత జలపాతం, మేడారం జాతర, అభయారణ్యాలు చూసి తనివితీరా ఆస్వాధించవచ్చని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఓరుగల్లు పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపు ఉందని వెల్లడించారు. సోమవారం తన ఛాంబర్లో టూరిజం అధికారులతో కలిసి పర్యాటక శాఖ రూపొందించిన బ్రోచర్ (వాల్ పోస్టర్)ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 100 ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్గా చేయడానికి ఔత్సాహికులకు పర్యాటక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి పర్యాటక ప్రదేశాల సమాచారంపై పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా 3 ఫొటోలు, 60 సెకన్ల వీడియో, వంద పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జనవరి 5లోగా ఎంట్రీలను పంపాలని సూచించారు. అందులో హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ, వసతి తదితర వివరాలను తెలియజేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇస్తామని వివరించారు. పది మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు. సంక్రాంతి రోజున కై ట్ ఫెస్టివల్లో బహుమతులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీపీఆర్ఓ రఫిక్, టూరిజం అధికారి కుసుమ సూర్య కిరణ్ పాల్గొన్నారు. యాసంగికి సరిపడా యూరియా జిల్లాలో యాసంగి (రబీ) సీజన్లో పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ టీఎస్.దివాకర పేర్కొన్నారు. కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల పంపిణీ సాఫీగా జరిగేలా ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలలో యూరియా సహా ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని, పంటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుకు యూరియా అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో జిల్లాలో 17 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అవసరమున్నట్లు గుర్తించమన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి ఇప్పటివరకు 9,945 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని వివరించారు. మరో 2,381 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. యురియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. పంపిణీ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ టీఎస్.దివాకర పర్యాటకశాఖ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ -
నియామకం
ములుగు రూరల్ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా నద్దునూరి రమేశ్ను నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం కాకతీయ యూనివర్శిటీ సెమినార్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం రమేశ్ మా ట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన జా తీయ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జి ల్లా అధ్యక్షుడు శ్రీకాంత్కు కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వరుస సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ముందుగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి, సరస్వతి అమ్మవార్ల ఆలయంలో మహిళలు పూ జలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. రూ.30కోట్ల పనులకు ప్రతిపాదనలు కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ ఏడాది మే లో సరస్వతీ నది పుష్కరాలను 12 రోజుల పాటు రాష్ట్రప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలి సిందే. వచ్చే మే 21 నుంచి 12 రోజులు సరస్వతీ నదికి అంత్యపుష్కరాలకు పండితులు ముహూర్తం ఖరారు చేశారు. రూ.30కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. పుష్కరఘాట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. -
కలిసిరాని కాలం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా 2025లో రైతులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎరువుల కోసం తండ్లాట! సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు. రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు.. రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. జూలై వరకు లోటు వర్షపాతమే... ఉమ్మడి వరంగల్లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. తగ్గిన పప్పుధాన్యాల సాగు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పప్పు దినుసుల సాగు గణనీయంగా తగ్గింది. గతేడాది 49,876 ఎకరాల్లో పెసర, కంది, వేరుశనగ తదితర పంటలు వేశారు. ఈసారి వానాకాలంలో 31 వేల ఎకరాలకు తగ్గినట్లు అధికారుల గణాంకాలు వెల్లడించాయి. అలాగే, సన్ఫ్లవర్, గ్రౌండ్ నట్, ఆముదం తదితర ఆయిల్ సీడ్స్ పంటలు 19,210 ఎకరాల నుంచి 5,429 ఎకరాలకు పడిపోయినట్లు వ్యవసాయశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సాగు ఇలా (ఎకరాల్లో)..ములుగు రూరల్: చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి గోపాల్రావుతో నేడు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించాలి. తేది: 29–12–2025 సోమవారం సమయం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 6281952139, 9989830060 (ఎకరాల్లో) సాగైంది8,15 లక్షలు8,58,376 రైతులను వెంటాడిన ప్రకృతి వైపరీత్యాలు తుపానుతో దెబ్బతిన్న వరి, పత్తి పంటలు ధీమా ఇవ్వని ‘బీమా’.. ఇంకా చేతికందని పరిహారం పెరిగిన వాణిజ్య పంటల సాగు... వరి, పత్తి తర్వాతే పప్పు దినుసులు రైతులకు తప్పని ఎరువుల కొరత.. వరి, పత్తికి దక్కని మద్దతు ధర ఒడిదుడుకుల మధ్య సాగిన వ్యవసాయం -
హేమాచల క్షేత్రంలో సందడి
● సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రం ఆదివారం మేడారం భక్తులతో సందడిగా మారింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జాతరను తలపించేలా.. మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు హేమాచలుడిని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తి శ్రద్ధలతో పూజలు ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ, కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. సౌకర్యాలు కరువు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయానికి వచ్చే భక్తుల నుంచి వివిధ రకాల అర్చనలు, నాభిచందన ప్రసాదం, శాశ్వత పూజ పేరిట రుసుము వసూలు చేస్తున్నారే తప్ప.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం లేదని భక్తులు అంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాధనం దుర్వినియోగం
మంగపేట : మండల కేంద్రంలో చేపట్టిన నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోిపించిందని.. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం వెనుక అంతర్యం ఏంటని బీజేపీ జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం బస్టాండ్లో చేపట్టిన పనులను ఎడవెళ్లి సాయికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి సీతక్క బస్టాండ్ నిర్మాణానికి రూ.52లక్షల డీఎంఎఫ్టీ నిధులతో పనులను ప్రారంభించగా ఇటీవల అదనంగా మరో రూ.11లక్షలు మంజూరయ్యాయన్నారు. అగ్రిమెంటు గడువు ముగిసి 8 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ నేటి వరకు పనులు పూర్తి చేయలేదని, అధికారుల పర్యవేక్షణ లేక నిర్మాణ పనుల్లో లోపాలు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బస్టాండ్ ప్రాంగణంలో కాంట్రాక్టర్ మొరానికి బదులు మట్టిని నింపి చేతులు దులుపుకున్నాడని ప్రశ్నించారు.ఈ విషయంపై మంత్రి సీతక్క, కలెక్టర్ స్పందించి బస్టాండ్ నిర్మాణంలో నాణ్యతగా పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రాంకీ, గోపాలకృష్ణ ఉన్నారు. -
బస్టాండ్ క్యూ లైన్ పనుల్లో నిర్లక్ష్యం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం ఆర్టీసీ బస్టాండ్లో భద్రాచలం, కొత్తగూడెం క్యూలైన్ పనుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జాతర సమయంలో కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లే భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. జాతర సమయం దగ్గరపడుతున్న తరుణంలో క్యూలైన్లపై తడుకల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు నీడ కోసం పలుచటి తడుకలను ఏర్పాటు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నాణ్యమైన తడుకలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. గట్టమ్మ వద్ద కోలాహలం ములుగు రూరల్: ఆది దేవత గట్టమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లుల దర్శనానికి వచ్చే భక్తులు ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలి వచ్చారు. ముందుగా గట్టమ్మ తల్లికి భక్తులు పసుపు–కుంకుమలు, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఆలయ పరిసరాలలో ఉన్న సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమలు సమర్పించారు. దీంతో గట్టమ్మ ఆలయ ప్రాగణం భక్తులతో కిక్కిరిపోయింది. అనంతరం భక్తులు వనదేవతల దర్శనానికి బయలుదేరారు. జంపన్నవాగులో ఇసుక బస్తాలతో అడ్డుకట్ట ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జంపన్నవాగులో నీటి లభ్యత కోసం ఇరిగేషన్శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇసుక బస్తాలతో అడ్డుకట్ట పనులు చేపట్టారు. మేడారం భక్తులు పుణ్యస్నానాల కోసం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం నీటిని విడుదల చేస్తారు. నీటి లభ్యతగా ఉండేలా వాగులో తొమ్మిది ప్రదేశాల్లో బస్తాల్లో ఇసుక నింపి వాగుకు అడ్డుకట్టగా వేస్తున్నారు. నీరు నిల్వ ఉండడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఆటోల్లో భక్తుల తరలింపు ఎస్ఎస్తాడ్వాయి: అమ్మవార్ల దర్శనం కోసం మేడారానికి ఆదివారం భక్తులు వేలాది తరలివచ్చారు.ఆర్టీసీ బస్టాండ్ నుంచి జంపన్నవాగుకు సుమారుగా మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. జంపన్నవాగుకు భక్తులను తరలించేందుకు యజమానులు, డ్రైవర్లు ఆటోలను బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. బస్టాండ్లో దిగిన భక్తులు ఆటోలను ఆశ్రయించడంతో స్నానాల కోసం జంపన్నవాగుకు ఆటోలలో తరలించడంతో భక్తులను తరలించారు సాధరణ చార్జీలు తీసుకున్నారు. -
కిలో దాటట్లే..
ఏటూరునాగారం: జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పోసిన చేపపిల్లలు ఎదగడం లేదు. ఏ చెరువులోనూ కిలోకు మించి చేపలు పెరగలేదు. చేప పిల్లలను మత్స్యశాఖ ద్వారా అందజేసే కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మకై ్క నాసిరకం చేప పిల్లలను అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. 38 సొసైటీలకు ఉచితంగా పంపిణీ జిల్లాలో 9 మండలాల్లో 38 సొసైటీలు ఉండగా.. 997 మంది గిరిజన సొసైటీ మత్స్యకారులు ఉన్నారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి నూటికి నూరుశాతం చేప పిల్లలను ఉచితంగా అందజేస్తోంది. దీంతో జిల్లాలోని 38 గిరిజన సొసైటీలకు చేప పిల్లలు పంపిణీ చేశారు. 9 మండలాలకు చెందిన 38 గిరిజన సొసైటీల్లోని 997 మంది గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా ఐటీడీఏ, మత్స్యశాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. చెరువుల విస్తీర్ణం బట్టి 50 వేల నుంచి 1.5లక్షల వరకు చేప పిల్లలను అందజేయడంతోపాటు వాటి పెంపకం బాధ్యతను గిరిజన సంఘాలకు అప్పగించారు. కానీ ఎక్కడ కూడా చేపపిల్లల ఎదుగుదల లేదని గిరిజన సొసైటీల సభ్యులు వాపోతున్నారు. దీనివల్ల ఆర్థిక ఫలాలను పొందాల్సిన తమకు దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజన సొసైటీలకు అందించే చేపపిల్లలు నాసిరకమా లేకా.. నాణ్యతగా ఉన్నాయా అని మత్స్యశాఖ అధికారులు పరిశీలించిన తర్వాతనే వాటిని సభ్యులకు పంపిణీ చేస్తారు. కానీ చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టు దక్కించుకున్న దళారులు కాసులకు కక్కుర్తి పడి నాసిరకం సీడ్ చేప పిల్లలను తెచ్చినట్లుగా తెలుస్తోంది. నాసిరకం ఫిష్ సీడ్ పంపిణీ నాణ్యతలేని వాటికి మత్స్యశాఖ ఆమోదం గిరిజన సొసైటీ సభ్యులకు అన్యాయం పట్టించుకోని ఐటీడీఏ అధికారులు మండలాలు సొసైటీల సభ్యులు సంఖ్య ములుగు 1 13 వెంకటాపురం(ఎం) 1 88 గోవిందరావుపేట 2 102 కన్నాయిగూడెం 7 209 తాడ్వాయి 10 260 ఏటూరునాగారం 4 77 వాజేడు 2 27 వెంకటాపురం(కె) 1 24 మంగపేట 10 197 మొత్తం 38 997ఈ ఫొటోలోని చెరువులు మంగపేట మండలం మల్లూరులోని అత్త చెరువు..కోడలు చెరువు. ఇందులో 98వేల వరకు చేప పిల్లలను వదిలారు. కానీ అవి పెరగడం లేదు. ఎదుగుదల లేక దిగుబడి రాక గిరిజన సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఈ చెరువుల్లో చేప పిల్లలను వదిలి నెలలు దాటుతున్నా ఇంత వరకు కావాల్సిన మోతాదులో బరువు పెరగడం లేదని ఆ సంఘం సభ్యులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు లేఖ కూడా రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి సమాధానం, స్పందన లేదు. చేసేదేమీ లేక గిరిజనులు చూస్తూ ఉండిపోయారు. మత్స్యశాఖ అధికారులు కక్కుర్తిపడి గుడ్డిగా కాంట్రాక్టర్కు అప్రూవల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది.నేరుగా కొనుగోలు చేస్తాం..చేప పిల్లలను సొసైటీలద్వారా తామే నేరుగా కొనుగోలు చేసే అవకాశం కల్పించాలి. దీంతో మాకు కావాల్సిన రకం, నాణ్యతను పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే చేపపిల్లలు నాసిరకంగా కావడం వల్ల మా కష్టం వృథా అవుతుంది. సంఘాలే నేరుగా కొనుగోలు చేసే అవకాశం కల్పించి ఉంటే ఇలాంటి పొరపాట్లు ఉండవు. ఇప్పుడు చేప పిల్లలను ఉచితంగా ఇచ్చినట్లే కానీ ఎలాంటి ఫలితం లేదు. ఆర్థిక ఫలాలు అందించే అవకాశం లేదు. – ఈసం సారయ్య, శివాపురం, ఏటూరునాగారం -
పెండింగ్ డీఏలు వెంటనే ఇవ్వాలి
ఏటూరునాగారం : రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఏలు, హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సారయ్య, మండల అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండేళ్ల పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై న కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహారావు దంపతులను విశ్రాంత ఉద్యోగులు సన్మానించారు. -
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ములుగు: జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. 2024లో 1,066 కేసులు నమోదు కాగా 608 కేసులను ఛేదించారు. 2025లో 1,118 కేసులు నమోదు కాగా అందులో 646 కేసులను పరిష్కరించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య 52 పెరగడంతో దోషులకు శిక్ష పడేలా పోలీసులు విశేష కృషి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు కేసులలో పురోగతి సాధిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారు. సగానికంటే ఎక్కువ కేసులను పోలీసులు పరిష్కరించి దోషులకు శిక్షపడేలా చేశారు. 44 సైబర్ కేసుల నమోదు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 44 సైబర్ కేసులు నమోదయ్యాయి. వాటిని ఛేదించి రూ.6,92,994లు రికవరీ చేసి లోక్ అదాలత్లో బాధితుల ఖాతాకు తిరిగి చెల్లించారు. కళా శాలలు, పాఠశాలలు, గ్రా మాల్లో సైబర్ క్రైమ్పై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. జిల్లాలో మహిళలు, పిల్లలపై జరిగిన దాడుల ఘటనలపై 183 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రమాదాల్లో 69 మంది మృత్యువాత పడగా 132 మందికి గాయాలయ్యాయి. ములుగు రూరల్: చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి గోపాల్రావుతో రేపు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించాలి. తేది: 29–12–2025 సోమవారం సమయం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 6281952139, 9989830060 మావోయిస్టుల లొంగుబాటు 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 85 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో డీవీసీఎంఎస్ కేడర్కు చెందిన ముగ్గురు, ఏసీఎంఎస్ కేడర్కు చెందిన 12 మంది, మావోయిస్టు పార్టీ సభ్యులు 28 మంది, మిలీషియా సభ్యులు 32 మంది, ఆర్పీసీ ఒకరు, డీఏకేఎంఎస్ సభ్యులు ఇద్దరు, సీఎన్ఎం సభ్యులు ఏడుగురు లొంగిపోగా వారికి పునరావస పథకం కింద తక్షణ సహాయం అందించారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి అవసరమైన సదుపాయాలు పోలీసుశాఖ తరఫున కల్పిస్తున్నారు. మేడారం జాతరపై దృష్టి జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారంలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరపై ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఇప్పటి నుంచే భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులు మేడారాన్ని సందర్శిస్తూ పోలీసుశాఖ పరంగా చేపట్టే బందోబస్తుపై అధికారులతో చర్చిస్తున్నారు. సుమారు 10 వేల మంది పోలీసులతో జాతర బందోబస్తు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరేలా పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. -
హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్ జనరల్
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు. హరేకృష్ణ రథోత్సవం భూపాలపల్లి అర్బన్: బంజారాహిల్స్ గోల్డ్న్ టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో హరినామ నగర సంకీర్తన రథోత్సవం నిర్వహించారు. స్థానిక హన్మాన్ దేవాలయం నుంచి జయశంకర్ సెంటర్ వరకు సంకీర్తన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ రథయాత్రను ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి జెండాఊపి ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కృష్ణగీతాలు, డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేపట్టారు. శ్రీవారి నామస్మరణం, హరేకృష్ణ కీర్తనలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
శరవేగంగా కాజ్వే పనులు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వేలాది మంది భక్తులు మేడారం ఊరట్టం కాజ్వే ద్వారానే చేరుకునేవారు. నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు ఊరట్టం కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో ఎడ్లబండ్లలో జాతరకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట్టం–కొండాయి కాజ్వేను కాంక్రీట్తో నిర్మాణం పనులు చేపట్టగా శరవేగంగా పనులు సాగుతున్నాయి. ప్రతీ జాతర సమయంలో కాజ్వే నుంచి ఎడ్లబండ్లు జాతర సమీపంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఊరట్టం కాజ్వేపై నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు, ఏటూరునాగారం, సమీప అడవి ప్రాంతాల నుంచి వచ్చే ఎడ్లబండ్లు సైతం ఈ దారిగుండా వచ్చేందుకు ప్రత్యేకంగా ఈ కాజ్వేను నిర్మిస్తున్నారు. ఇప్పటికే జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఈ ఊరట్టం కాజ్వే కేవలం ఎడ్లబండ్లకోసమేనని అధికారులు చెబుతున్నారు. జనవరి 10వ తేదీలోపు ఈ కాజ్వే అందుబాటులోకి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
లక్నవరం తైబందీకి గ్రీన్సిగ్నల్
గోవిందరావుపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం లక్నవరం చెరువు తైబందీ సమావేశాన్ని నిర్వహించి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సమావేశంలో తైబందీ రొటేషన్ విధానంపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతేడాది అమలు చేసిన విధానాన్ని సమీక్షించిన అనంతరం ఈ ఏడాది సాగునీటి పంపిణీపై స్పష్టమైన తీర్మాణానికి వచ్చారు. గతేడాది తైబందీ రొటేషన్ పద్ధతిలో భాగంగా శ్రీరాంపతి, నర్సింహుల కాల్వల ద్వారా సుమారు 4,150 ఎకరాలకు సాగునీరు అందించిన విషయం సమావేశంలో ప్రస్తావించారు. అదే విధానాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం రంగాపూర్, కోట, శ్రీరాంపతి కాల్వలకు సుమారు 5,650 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా రైతులు సహకరించాలని అధికారులు కోరారు. నిర్ణయించిన విస్తీర్ణం కంటే ఎక్కువగా సాగు చేయడానికి ప్రయత్నిస్తే అందరికీ సమృద్ధిగా నీరు అందక పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తైబందీ నిబంధనలు పాటించినప్పుడే ఆయకట్టు రైతులందరికీ సమానంగా నీరు అందుతుందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం మేడారం జాతర అవసరాల కోసం లక్నవరం చెరువు నుంచి 200 ఎంసీఎఫ్టీ నీటిని కేటాయించినట్లు సమావేఽశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో సాగునీటి వినియోగంలో మరింత జాగ్రత్త అవసరమని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ కార్యనిర్వహక ఇంజనీర్ నారాయణ, తహసీల్దార్ సృజన్ కుమార్, వ్యవసాయ అధికారి జితేందర్ రెడ్డి, ఇరిగేషన్ డీఈఈ రవీందర్ రెడ్డి, ఏఈ ఉపేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. రొటేషన్ పద్ధతిలోనే సాగునీటి పంపిణీ -
అడవికి నిప్పు పెట్టొద్దు
● ఏటూరునాగారం నార్త్ రేంజ్ అధికారి అప్సర్నిస్సా కన్నాయిగూడెం: అడవులకు నిప్పు పెట్టొద్దని ఏటూరునాగారం నార్త్ రేంజ్ అధికారి ఎండీ.అప్సర్నిస్సా అన్నారు. మండల పరిధిలోని కంతనపల్లి గ్రామ పంచాయతీలో గొత్తికోయగూడెం, బంగారుపల్లిలో ప్రజలకు శనివారం అటవీ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులకు నిప్పు పెడితే మానవాళి మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరించారు. అలాగే అనేక జీవరాసులు మృత్యువాత పడుతాయని వివరించారు. అడవులు అంతరిస్తే వర్షాలు సైతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందన్నారు. అటవీశాఖ సెక్షన్ అధికారులు రవి, తార, సిబ్బంది రవివర్మ, వినోద్, మోహన్, యూసప్, రాజేంద్రప్రసాద్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. -
మెరుగైన ఫలితాల సాధనకు పాటుపడాలి
● అదనపు కలెక్టర్ మహేందర్ జీ ములుగు: జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లోని విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా అధ్యాపకులు పాటుపడాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాల్స్, సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కళాశాలల వారీగా గతేడాది, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిన్సిపాల్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బోర్డు పరీక్షల వరకు 50 రోజుల యాక్షన్ ప్లాన్ తయారుచేయాలన్నారు. పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రతీ విద్యార్థి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. కళాశాలలో ఉన్నత ఫలితాలను సాధిస్తేనే వచ్చే సంవత్సరంలో అడ్మిషన్లు వస్తాయని తెలిపారు. విద్యార్థులకు మంచి చదువు, క్రమశిక్షణ నేర్పించి వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి డి.చంద్రకళ, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. -
లెప్రసీ సర్వే డబ్బులను విడుదల చేయాలి
● సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ములుగు రూరల్: ఆశ వర్కర్లు గతంలో చేపట్టిన లెప్రసీ సర్వే డబ్బులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్జీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందన్నారు. గతంలో లెప్రసీ సర్వే డబ్బులు విడుదల చేయకుండా మళ్లీ సర్వే చేయమని చెప్పడం సరికాదన్నారు. ఆశ వర్కర్లకు పారితోషికాలను రద్దు చేసి ఫిక్స్డ్ వేతనాలు రూ.18 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించిన వారికి డబ్బులు చెల్లించాలన్నారు. కేంద్రం పెంచిన రూ.1500 పారితోషికాన్ని అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అర్హత కలిగిన ఆశ వర్కర్లకు ఏఎన్ఎం, జీఎన్ఎం ప్రమోషన్ కల్పించాలని కోరారు. గత 15 రోజుల సమ్మె హామీలను అమలు చేయాలన్నారు. ఆశ వర్కర్లకు బీమా రూ. 50 లక్షలు, పదవీ విరమణ బెనిఫిట్స్ రూ.5 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన రవిగౌడ్, ఆశ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలాదేవి, శ్రావ్య, నాగమణి, సరిత, రజిత, కవిత, రాజ్యలక్ష్మీ, సంధ్య, పూర్ణ, శోభ, కృష్ణకుమారి, రమాదేవి, సుమలత, భాగ్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
మహాజాతర పనుల్లో వేగం పెంచాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతర పనుల్లో వేగం పెంచాలని, ముందస్తు మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల అభివృద్ధి పనులను కలెక్టర్ దివాకర శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెలవు రోజులలో అధిక సంఖ్యలో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే అవకాశం ఉందన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అభివృద్ది పనుల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మోడల్ క్యూలైన్ నిర్మాణాలు పరిశీలించి క్యూలైన్లలో ఉండే భక్తులకు తాగునీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై త్వరగతిన బ్రాకెట్లను ఏర్పాటు చేయాలని, ఆలయ ఫ్లోరింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ స్తంభాలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరస్వామి, ఆర్అండ్బీ ఈఈ సురేష్, తహసీల్దార్ సురేష్ బాబు, సంబంధిత గుత్తేదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి కలెక్టర్ టీఎస్.దివాకర -
మేడారంలో ఎస్పీ పర్యటన
ఏటూరునాగారం: నేడు ఆదివారం కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యల్లో భాగంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం మేడారం పర్యటించారు. గద్దెలకు భక్తులు చేరుకునే మార్గాలు, దర్శనం అనంతరం బయటకు వెళ్లే ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే వాహనాలను మళ్లించాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గద్దెల వద్ద జరుగుతున్న సాలారం పనులు పరిశీలించారు. -
సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో వచ్చే నెల 11న నిర్వహించనున్న ఆదివాసీల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు. మేడారంలో అమ్మవార్ల గద్దెల వద్ద సమ్మేళనం కరపత్రాలను నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణకు ఆదివాసీ తెగల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీలు, ఆదివాసీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు, సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు చందా మ హేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, సమ్మక్క పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుం దెబ్బ ప్రచార కార్యదర్శి మలకం సమ్మయ్య, తాడ్వాయి మండల అధ్యక్షుడు చందా నవీన్, మండల ప్రధాన కార్యదర్శి తాటి సురేష్, మండల ఉపాధ్యక్షుడు చర్ప జునేష్, పిట్టల నగేష్ పాల్గొన్నారు.తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్ -
భక్తులకు ఇబ్బంది లేకుండా గ్రౌటింగ్
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా గ్రానెట్తో ఫ్లోర్ నిర్మాణం పనులు చేపట్టారు. జాతర సమయంలో భక్తులు బంగారం(బెల్లం), కొబ్బరి, నీళ్లతో జారీ పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రానెట్పై గ్రౌటింగ్ చేయించే పనులను మొదలు పెట్టారు. దీనివల్ల కాలుకు గ్రిప్ లభించి కిందపడకుండా ఉంటారు. వృద్ధులు, చిన్నారులకు సైతం ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్ఎస్తాడ్వాయి: మేడారం జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ సారి మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జాతరలో భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలైన ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు, స్నానఘట్టాల రోడ్డు, చిలకలగుట్ట ప్రాంతంలో ప్లాస్టిక్తో కూడిన మొబైల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. జాతరలో మొత్తం 1,020 మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ధరణి నవల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక వరంగల్ శాఖ, కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టు రవీందర్ రాసిన ‘ధరణి’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ భవనంలో చెలిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల బాలరాజు, ఆర్సీటీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లుగా రాశారని ప్రశంసించారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, రామిరెడ్డి పాల్గొన్నారు. -
మేడారంలో ఈ– కానుక
ఏటూరునాగారం: మేడారంలో గతంలో భక్తులు హుండీల్లో నగదు వేసేవారు. కంప్యూటర్ యుగానికి అనుగుణంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ఈ– కానుకల సర్వీసులను మొదలు పెట్టారు. గతంలో కేవలం జాతర సమయంలో ఎక్కువగా ఈ –కానుకులు చెల్లించేది. ఇప్పుడు సాధారణ సమయంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో డిజిటల్ పేమెంట్లను కానుకల రూపంలో అమ్మవారికి చెల్లించే విధంగా ఈ–కానుక స్కానర్లను ఏర్పాటు చేశారు. దీంతో పలువురు భక్తులు కానుకలు హుండీలో వేస్తుండగా మరికొందరు నగదు రహితంగా డిజిటల్ పేమెంట్లు చేసి అమ్మవారికి కానుకలు చెల్లిస్తున్నారు. -
పీసీసీ లేకుండానే పైపులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో రోడ్ల నిర్మాణం పనుల్లో లోపాలు బయటపడుతున్నాయి. ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో జంపన్నవాగు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వై జంక్షన్ వరకు రోడ్లను విస్తరిస్తున్నారు. బస్టాండ్ సమీపంలో రోడ్డు విస్తరిస్తున్న క్రమంలో రోడ్డు కింద నుంచి నీళ్లు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రోడ్డు కింది భాగంలో పైపుల ఏర్పాటుకు ముందుగా పీసీసీ(ప్లెయిస్ సిమెంట్ కాంక్రిట్) వేయాల్సి ఉండగా దాన్ని పూర్తిగా విస్మరించి నేరుగా పైపులు అమర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ లేకుండా పైపులు వేయడం వల్ల భవిష్యత్లో అవి కుంగిపోయే ప్రమాదం ఉందని, వర్షాకాలంలో మట్టి కదలికలతో రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర సమయంలో లక్షలాది మంది వచ్చే నేపథ్యంలో రోడ్ల నిర్మాణంలో ఇలాంటి నిర్లక్ష్యం పనులు ప్రమాదకరమని భక్తులు పేర్కొంటున్నారు. పీసీసీ వేసి సైడ్ వాల్స్తో కూడిన పనులు చేపట్టాల్సి ఉండగా సంబంధిత గుత్తేదారులు ఖర్చు తగ్గించుకునేందుకు ఇలాంటి పనులు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్లో కుంగిపోయే ప్రమాదం పట్టించుకోని అధికారులు -
ఆ నిధులపైనే ఆశలు
ములుగు: పల్లెల్లో కొలువుదీరిన కొత్త పాలకవర్గాలను సమస్యలు వెంటాడుతున్నాయి. గత 23 నెలలుగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో కార్యదర్శులే అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేపడుతూ పాలన కొనసాగించారు. తాజాగా పంచాయతీల్లో పాలకవర్గాలు కొలువుదీరడంతో సమస్యలు స్వాగతం పలికాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 146 పంచాయతీల్లో గతంలో పనిచేసిన మాజీ సర్పంచ్లకు సుమారు రూ.15 కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరుణించి ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే గ్రామ పంచాయతీల్లో కొంతమేర అభివృద్ధి పనులు జరగనున్నాయి. 146 పంచాయతీల్లో పాలకవర్గాలు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 జీపీలు ఉండగా మంగపేట మండలంలో పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు ఉండడంతో 25 జీపీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 146 పంచాయతీలకు ఈ నెల 11, 14, 17వ తేదీలలో ఎన్నికలు జరగగా పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు తమ పాలకవర్గంతో ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీల్లో బాధ్యతలు తీసుకున్నప్పటికీ పనులు చేపట్టడానికి ఎలాంటి నిధులు లేకపోవడంతో సర్పంచ్లు సతమతమవుతున్నారు. లక్షల రూపాయలు అప్పు చేసి సర్పంచ్గా గెలిస్తే అభివృద్ది పనులు చేపట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని సర్పంచ్లు వాపోతున్నారు. నిధులోస్తేనే అభివృద్ది పనులు పంచాయతీలకు కేంద్రం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామపంచాయతీ ఖాతాలో జమచేస్తుంది. జనాభా ప్రాతిపదికన కేంద్రం ఈ నిధులను కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులను మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పారిశుద్ద్యం, వీధి దీపాలు, నీటి సరఫరా, రోడ్లు, డ్రెయినేజీ, ఆరోగ్యం, విద్య, వ్యవసాయంతో పాటు 29 అంశాలకు సంబంధించిన పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిధులు విడుదల చేయాలని పాలకవర్గాలు కోరుతున్నాయి. ప్రభుత్వాలు స్పందించి నిధులు మంజూరు చేస్తేనే గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగనున్నాయి. రెండేళ్లుగా 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. నిబంధనల ప్రకారం పాలక వర్గాలు ఉంటేనే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. పాలక వర్గాలు లేకపోవడంతో కేంద్రం నిధులను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. గతంలో తాజా మాజీ సర్పంచ్లు చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. పంచాయతీ కార్యదర్శులు సైతం 23 నెలలుగా చేపట్టిన పనులకు నిధులు రాకపోవడంతో తమ వేతనాలు సైతం ఖర్చుపెట్టడమే కాకుండా అప్పులు కూడా చేశామని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ, తాగునీటికి సంబంధించిన మోటార్ల మరమ్మతు, పైపులైన్ లీకేజీలకు మరమ్మతులు, ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ వంటి అత్యవసరమైన వాటికి అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని తాజా సర్పంచ్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేసి సర్పంచ్లుగా గెలిచామని, గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి పనులకు, పంచాయతీ నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం విడ్డూరంగా ఉందని వాపోతున్నారు.సర్పంచ్ ఎన్నికల ముందు బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు గెలిస్తే తమ సొంత మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీనిచ్చారు. గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీర్చడం, వీదుల్లో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రెయినేజీల నిర్మాణం, కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్స్, దేవాలయాల నిర్మాణం చేపడుతామని సొంతంగా హామీలు ఇచ్చారు. ఇప్పటికే లక్షల రూపాయలు అప్పులు చేసి గెలిచిన తాము సొంత మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు సహకరిస్తేనే ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయగలుగుతామని సర్పంచ్లు పేర్కొంటున్నారు. సమస్యలతో సతమతమవుతున్న సర్పంచ్లు ప్రభుత్వాలు కరుణిస్తేనే గ్రామాల్లో పనులు -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి


