కలెక్టర్‌కు విశ్వహిందూ పరిషత్‌ వినతిపత్రం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు విశ్వహిందూ పరిషత్‌ వినతిపత్రం

Published Sun, Apr 20 2025 1:01 AM | Last Updated on Sun, Apr 20 2025 1:01 AM

కలెక్టర్‌కు విశ్వహిందూ పరిషత్‌ వినతిపత్రం

కలెక్టర్‌కు విశ్వహిందూ పరిషత్‌ వినతిపత్రం

ములుగు రూరల్‌: బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ టీఎస్‌ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండి సాంబశివ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ బోర్డు ప్రకటన తదుపరి పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు, హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సరికొండ బలరాం, భూక్య జవహర్‌లాల్‌, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్‌, రాకేష్‌యాదవ్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement