పారితోషికం అందలే..! | - | Sakshi

పారితోషికం అందలే..!

Apr 15 2025 12:19 AM | Updated on Apr 15 2025 12:19 AM

పారిత

పారితోషికం అందలే..!

మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించిన ఎన్యూమరేటర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటి వరకు పారితోషికాలు అందించలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్‌లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 1,61,187 కుటుంబాలను సర్వే చేయడానికి 1,172 మంది ఎన్యూమరేటర్లు, 116 మంది సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. ఈ వివరాలను 1,285 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సర్వే నిర్వహించినందుకు ఎన్యుమరేటర్లకు రూ.10వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేల చొప్పున పారితోషికం ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.25 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. కానీ సర్వే పూర్తై ఐదు నెలలు దాటినా ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు.

వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తామని..

సమగ్ర కుటుంబ సర్వే చేసినా ఎన్యుమరేటర్ల, సూపర్‌వైజర్ల, డాటా ఎంట్రీ ఆపరేటర్ల డబ్బులు ఈ– కుబేరాలో పడినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియడం లేదు. గతంలో సమగ్ర సర్వే చేసినా వెంటనే ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు వారివారి వ్యక్తిగత ఖాతాలో జమచేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకోసం వారి వ్యక్తిగత ఖాతాలను కూడా తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ డబ్బులు ఈ– కుబేరా నుంచి నేరుగా ఆయా మండలాల ఎంపీడీఓల ఖాతాల్లో జమ అవుతాయని, సర్వే చేసిన వారికి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. ఐదు నెలలుగా గడుస్తుండడంతో సర్వే చేసినా ఉపాధ్యాయులు 317 జీఓ, స్పోజ్‌ భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వారికి డబ్బులు ఎలా చెల్లిస్తారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

సమగ్ర కుటుంబ సర్వే సిబ్బందిఎదురుచూపులు

నెలలు గడుస్తున్నా జరగని చెల్లింపులు

అధికారుల చుట్టూ ఎన్యూమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల ప్రదక్షిణలు

జిల్లాలో రూ.2.90 కోట్లు పెండింగ్‌..

పారితోషికం అందలే..!1
1/1

పారితోషికం అందలే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement