Narayanpet District Latest News
-
సామాన్య ప్రజలపై భారం మోపొద్దు..
అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పడమే కాకుండా ప్రజలపై భారం మోపుతోంది. ఓపెన్ స్పేస్ రుసుం భారం సామాన్య ప్రజలపై మోపడం అన్యాయం. 2022–24 మధ్యలో గ్రామ పంచాయతీ ప్లాట్లను కొందరు సబ్రిజిస్ట్రార్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ముందుగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్పై 75 శాతం రాయితీ ఇవ్వాలి. ప్లాట్లు కొన్న సామాన్య ప్రజలపై భారం మోపొద్దు. – మహ్మద్ అన్సార్ హుస్సేన్, బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్స్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం.. ఎల్ఆర్ఎస్పై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్లు, రియల్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. మార్చి 31 వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. జీపీ లే అవుట్లలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు మా దృష్టికి వచ్చిన మాట వాస్తవమే, కోర్టు ఆర్డర్స్తో కొన్ని, కొందరు రూల్స్ అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఇంకా ఎక్కడైనా అలా జరిగినట్లు మా దగ్గరకు ఆధారాలతో వస్తే చర్యలు తీసుకుంటాం. – వి.రవీందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జిల్లా రిజిస్ట్రార్ ● -
ఆశావర్కర్ల నిర్బంధం దారుణం
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేపట్టిన ఆశావర్కర్లను పోలీసులతో నిర్బంధించడం దారుణమని తెలంగాణ ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. పోలీసులచే ఆశావర్కర్లను అరెస్టు చేయించిన మాత్రాన తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న ఆశావర్కర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఆశావర్కర్ల ఆందోళనకు వికలాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కె.కాశప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిర్మల, లక్ష్మి, శివమ్మ, నర్సమ్మ, రాధిక, మహేశ్వరి, నాగమణి, నర్మద పాల్గొన్నారు. -
వ్యాపార రంగంలో మహిళలు రాణించాలి
నారాయణపేట: వ్యాపార రంగంలో మహిళలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా కేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో మంగళవారం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. అందులో భాగంగా మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులు, రైస్మిల్లులు, సోలార్ పవర్ ప్లాంట్స్ మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని సూచించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఇది జిల్లా మహిళలు సాధించిన గొప్ప విజయమన్నారు. అదే విధంగా ఇంకా ఏదైనా వినూత్నంగా ఆలోచించి వ్యాపార పరంగా జిల్లా మహిళా సమాఖ్య మరో ముందడుగు వేయాలని కలెక్టర్ సూచించారు. కాగా, మక్తల్లోనూ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలని ఉందని.. మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ప్రభుత్వ స్థలం ఉందని మండల మహిళా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్ను కోరారు. స్పందించిన కలెక్టర్.. జిల్లాలో రెండో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తే మంచిదే అని.. కానీ హైవే పక్కన స్థలంలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని చెప్పారు. మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం వివరాలను తెప్పించుకుంటానని తెలిపారు. సూపర్ మార్కెట్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ప్రైవేటు స్కూల్ ఏర్పాటు, మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ చేయడం లాంటి వ్యాపారాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చంద్రకళను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, అడిషనల్ డీఆర్డీఓ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
పేదల బియ్యం పక్కదారి..!
నర్వ: చౌకధర దుకాణాల్లో పేదలకు అందించే బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్ కార్డుదారుల నుంచి బియ్యం సేకరణతో మొదలుకుని రైస్మిల్లులకు తరలింపు వరకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ దందా సాగుతోంది. కరోనా కాలం తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం వరకు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. తర్వాత దొడ్డు బియ్యం రావడంతో ఎక్కువగా వినియోగం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో కిలో బియ్యాన్ని రూ. 12 నుంచి రూ. 15 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఒక చోట చేరుస్తుండగా.. ఏజెంట్ల ద్వారా వ్యాపారులు కొంటున్నారు. దాడులు జరుగుతున్నా.. జిల్లాలో కొన్ని రోజులుగా టాస్క్ఫోర్స్, మండల పోలీసుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉంది. ఇందులో ఎక్కువగా వనపర్తి జిల్లా అమరచింత, జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి నర్వ మీదుగా కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న బి య్యం పోలీసుల పెట్రోలింగ్లో పట్టుబడుతున్నా యి. రేషన్ బియ్యం అక్రఓమ రవాణాకు సంబంధించి ఈ ఏడాది ఇప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. పోలీసులు దాడులు నిర్వహించి రేషన్ బియ్యాన్ని పట్టుకుంటున్నా అక్రమ దందా మాత్రం ఆగడం లేదు. కొందరు మిల్లర్లు రేషన్ బియ్యం దందానే తమ ఆదాయ వనరుగా ఎంచుకున్నారని తెలుస్తోంది. జిల్లాలో జోరుగాసాగుతున్న అక్రమ దందా ● నేరుగా లబ్ధిదారుల నుంచి కొనుగోలు ● కిలోకు రూ. 15 వరకు చెల్లిస్తున్న ఏజెంట్లు ● కేసుల నమోదుకే పరిమితమవుతున్న అధికారులు రూ.లక్షల్లో అక్రమార్జన.. బియ్యం వ్యాపారులు ఏజెంట్ల ద్వారా లబ్ధిదారులతో కిలోకు రూ.15కు రేషన్ బియ్యం కొనుగోలు చేసి.. మిల్లర్లకు రూ. 25కి పైగా విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని రైస్మిల్లులో పాలిషింగ్ చేపట్టి సన్నబియ్యంగా బహిరంగ మార్కెట్లు, హాస్టళ్లు, హోటళ్లకు కిలో రూ. 43 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు, గుర్మిటకల్, బెంగళూరు, మహారాష్ట్రలోని ముంబాయి, తమిళనాడు రాష్ట్రం చైన్నెలలో ఈ బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా మార్కెటింగ్ చేపట్టిన మిల్లర్లు రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. -
డామిట్.. కథ అడ్డంతిరిగింది!
అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో అక్రమ లేఅవుట్లు, రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26లోగా సేల్డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని ప్రకటించింది. 2021లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అనుమతి లేని లేఅవుట్లు, అనధికార ప్లాట్ల రిజిస్ట్రేషన్లను గత సర్కార్ నిలిపివేయడం కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులపంట పండించింది. 2021 నుంచి 2024 వరకు పలువురు రిజిస్ట్రేషన్ అధికారులు ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు పరిష్కారం కాకుండానే.. రియల్టర్లతో కుమ్మకై ్క వేల సంఖ్యలో అనధికార జీపీ లేఅవుట్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రస్తుతం 25 శాతం రాయితీ కల్పించినా.. రిజిస్ట్రేషన్ పూర్తయిన నేపథ్యంలో ఎప్పుడైనా క్రమబద్ధీకరించుకోవచ్చనే ఉద్దేశంతో ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. -
రూ.12.32 లక్షలకు పేట తైబజార్ వేలం
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో మంగళవారం తైబజార్కు బహిరంగ వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను జరిగిన వేలంలో పట్టణానికి చెందిన బండి గణేశ్ రూ. 12.32 లక్షలకు దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. అదే విధంగా మాంసం వ్యర్థాల సేకరణకు వేలం నిర్వహించగా.. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం తిమ్మాపూర్కు చెందిన బాలరాముడు రూ. 4.80లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పెసర క్వింటాల్ రూ.7,677 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పెసర క్వింటాల్ గరిష్టంగా రూ. 7,677, కనిష్టంగా రూ. 7,557 ధర పలికింది. వేరుశనగ గరిష్టంగా రూ. 5,810, కనిష్టంగా రూ. 4,420, జొన్నలు గరిష్టంగా రూ. 4,752, కనిష్టంగా రూ. 3,405, అలసందలు గరిష్టంగా రూ. 7,069, కనిష్టంగా రూ. 5,325, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,211, కనిష్టంగా రూ. 7,166, తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,489, కనిష్టంగా రూ. 6,609 ధరలు వచ్చాయి. వేరుశనగ క్వింటా రూ.6,411 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,411, కనిష్టంగా రూ.5,100 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,792, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,791 ,జొన్నలు గరిష్టంగా రూ.4,328, కనిష్టంగా రూ.3,070, ఆముదాలు గరిష్టంగా రూ.6,300, కనిష్టంగా రూ.5,870, మినుములు రూ.7,260 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధ వారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిపాయల బహిరంగ వేలం ప్రారంభం అవుతుంది. నవోదయ ఫలితాలు విడుదల బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రేపు మెగా జాబ్ మేళా బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 33 ఏళ్లలోపు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాలెం వెంకన్న హుండీ లెక్కింపు బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ జిల్లా శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా హుండీలో రూ.3,17,864 నగదు, 35 గ్రాముల బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారని ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మనుసాని విష్ణుమూర్తి తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు, అర్చకులు జయంత్, శుక్ల, చక్రపాణి, మాజీ ధర్మకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేడు అలంపూర్లో.. అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. -
పోరాటాలతోనే హక్కుల సాధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పోరాటాలతోనే కార్మిక హక్కులను సాధించుకోగలుగుతామని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.హన్మేష్, ప్రధాన కార్యదర్శి కె.సూర్యం అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులతో ర్యాలీ తీశారు. అనంతరం బోయపల్లిగేట్ సమీపంలోని ఓ ఫంక్షన్హాల్లో సంఘం మూడో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారన్నారు. వారి కోసం సంక్షేమ పథకాలను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధనికుల కోసమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. భవ న నిర్మాణ కార్మికులకు కనీస పింఛను రూ. ఆరు వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.కృష్ణ, బీఓసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, టీయూసీఐ నాయకులు సి.వెంకటేశ్, పి.అరుణ్కుమార్, దేవదానం, కె.రవి, కిరణ్ పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నారాయణపేట: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం స్టేజీ దగ్గరలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటుచేసిన జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద, మద్దూర్, కోస్గి మండలాల పరిధిలో ఉపాధి హామీ పథకం పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్కు సంబంధించి ఉపాధి సృష్టించిన నివేదిక, కార్మిక సమీకరణ, గ్రామాల వారీగా లేబర్ నివేదిక, సగటు వేతన రేటు, 100 రోజులు పూర్తిచేసుకున్న కుటుంబాలు, సకాలంలో చెల్లింపుపై ఆయా సిబ్బందితో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల విషయంలో అధికారులు, సిబ్బంది చాలా అలసత్వం వహిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఒక్కో గ్రామంలో కేవలం 8 నుంచి 10 మంది మాత్రమే ఉపాధి పనులకు రావడం ఏమిటని ప్రశ్నించారు. కొరవడిన పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో ఎంపీడీవోల పర్యవేక్షణ కొరవడిందని, ఎంపీఓలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరూ సరిగ్గా పనిచేయడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగులు మహబూబ్నగర్ నుంచి వస్తున్నారో, ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారో అంతా తెలుసని, మంగళవారం నుంచి ఉదయం 7 గంటల వరకు గ్రామాలలో ఉండి ఉపాధి పనులకు కూలీలను అధిక సంఖ్యలో తీసుకువెళ్లి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిగతా జిల్లాలలో ఉపాధి హామీ పనులు, వనమహోత్సవం, స్వచ్ఛభారత్ మిషన్ పనులు బాగా జరుగుతున్నాయని, కానీ మన జిల్లాలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా మద్దూరు, కోస్గి, దామరగిద్ద మండలాలలో ఉపాధి హామీ పనులలో ప్రగతి ఏమీ లేదని చెప్పారు. ఎందుకింత నిర్లిప్తత ఉందని నిలదీశారు. ఉపాధి హామీ లాంటి పెద్ద పథకాన్ని వెనుకబడిన మన జిల్లాలో ఉపయోగించుకోకపోతే ఎలా ? అని, వారం తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే చర్యలు తప్పక ఉంటాయని ఆమె పునరుద్ఘాటించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో మాట్లాడారు. జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వహించగా 903 కేసులు నమోదు కాగా వాటిలో 185 టార్గెట్ ఉన్నాయన్నారు. అందులో 183 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. టీబీ వ్యాధిని అంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. పనితీరు మెరుగు పర్చుకొని కూలీల సంఖ్య పెంచాలి లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో పనిచేయాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు..
మద్దూరు: రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా వర్షాలు కురిసి కృష్ణానది పరవళ్లు తొక్కినా కూడా.. తాజాగా నదీ పరివాహక ప్రాంతం వారు సాగునీటి, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే రాష్ట్రంలో కృతిమ కరువు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. మద్దూరులో సోమవారం విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి కోస్గి సభలో మార్చి 31 వరకు రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమచేస్తానని చెప్పారని, ఇప్పటి వరకు 3 ఎకరాలలోపు వారికే మాత్రమే డబ్బులు పడ్డాయని, మిగితా వారికి ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం వల్లే నియోజకవర్గంలో తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు బీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చేదని, దానిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. హామీల మేరకు వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సలీం, రామకృష్ణ, గోపాల్, మహిపాల్, నరేష్, నర్సింహా, రాములు, మహేందర్, చంద్రశేఖర్, జగదీశ్వర్, బాల్చందర్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా, బీఆర్ఎస్ నాయకుడు సలీం ఇచ్చిన ఇఫ్తార్ విందులో పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఇంటి నుంచే తాగునీరు..
పనిచేసే ప్రదేశంలో వసతుల్లేక నీళ్ల సీసాలు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. ఎండలో పనిచేసే సమయంలో కాస్త ఉపసమనం పొందడం కోసం కనీసం గుడారాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. చెట్ల కిందకు వెళ్లాల్సినా పరిస్థితి ఉంది. పనుల దగర గాయలైతే ప్రాథమిక కిట్లు అందుబాటులో లేవు. – పద్మమ్మ, ఉపాధి కూలి సామగ్రి ఇవ్వలేదు కూలీ పనులకు వెళ్తున్న తమకు గత 12 ఏళ్ల నుంచి గడ్డపారలు, పారాలు ఇవ్వలేదు. సొంత డబ్బులు పెట్టి వాటిని కొనుగోలు చేసి పనులకు వెళ్తున్నాం. ఈ విషయాన్ని ఏటా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు సామగ్రి అందజేయాలి. – మొగులప్ప, ఉపాధి కూలి జాగ్రత్తలు తీసుకుంటున్నాం పని ప్రదేశాల్లో కూలీలకు ఎండల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైన వైద్య సామగ్రిని ఆయా మండలాల పరిధిలోని పీహెచ్సీలకు నివేదించి తెప్పించుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. టెంట్లు, గడ్డపారలు ఇతర సామగ్రి ప్రభుత్వం నుంచి రావాల్సింది. – మొగులప్ప, డీఆర్డీఓ ● -
సారా కట్టడికి కదిలిన ఎకై ్సజ్ అధికారులు
కోస్గి: సారా కట్టడికి ఎకై ్సజ్ అధికారులు నడుం బిగించారు. సోమవారం పలు తండాల్లో దాడులు నిర్వహించారు. జిల్లాలో ఇటీవల సారా విక్రయాలు పెరగడం, యువత మత్తుకు బానిస అవుతుండడంపై ‘మళ్లీ గుడుంబా..’ శీర్షికన శనివారం ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమవగా ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించారు. కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని పలు తండాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా తయారీకి వినియోగించే 100 లీటర్ల బెల్లం ఊట పట్టుబడినట్లు ఎకై ్సజ్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎకై ్సజ్ ఎస్ఐ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కుమ్మరికుంట తండా, బీమ్లా తండా, సుభ్యా నాయక్తండా, సారంగరావుపల్లి శివారులో సారా స్థావరాలపై దాడులు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం ఊట పట్టుబడగా నలుగురిని అరెస్టు చేసి గుండుమాల్ తహసీల్దార్ భాస్కర్ స్వామి ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు. పట్టుబడిన వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఎక్కడైన సారా తయారు చేసినట్లు గుర్తించిన, సారా అమ్ముతూ పట్టుబడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ పురుషోత్తంరెడ్డితోపాటు సిబ్బంది హరీష్, దయాకర్, కృష్ణ, రవి, విమల తదితరులు పాల్గొన్నారు. పలు తండాల్లో దాడులు.. 100 లీటర్ల బెల్లం ఊట పట్టివేత నలుగురి అరెస్టు.. తహసీల్దార్ ఎదుట బైండోవర్ -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
నారాయణపేట: పోలీస్ ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలని ఫిర్యాదులు అందజేశారు. మొత్తం ఆరు ఫిర్యాదులను ఎస్పీ నేరుగా స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆయా సీఐలు, ఎస్ఐలకు ఫోన్లో సూచించారు. క్రికెట్ బెట్టింగ్లకుపాల్పడితే కఠిన చర్యలు నారాయణపేట: ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడటం జరుగుతుందని.. యువత బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని, బెట్టింగ్లు నిర్వహించే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగ్స్ వల్ల యువత ఆర్థికంగా దెబ్బతిని చివరికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాలని, క్రికెట్ బెట్టింగ్స్ అనేవి చట్టారిత్యా నేరమని అట్టి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వినోదం కొరకు ఆడే ఆటను వినోదంగానే చూడాలని, అంతే కాని ఇలాంటి వాటిలో ఇరుక్కొని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. విశిష్ట సేవలకుపురస్కారాలు నారాయణపేట రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి నారాయణపేట ఆర్టీసీ మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు డీఎం లావణ్య, ఏడీసీ భాగ్యమ్మ, కండక్టర్లు రేణుక, రాజమణికి విశిష్ట మహిళా ప్రతిభా అవార్డులను అందించారు. రవాణా సేవల్లో వారు చేస్తున్న కృషిని ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో చంద్ర నాయక్, బాలయ్య, నారాయణ, లాలు నాయ క్, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్, హిందీ ప్రచార సమితి సెక్రటరీ ఏకే రాజు పాల్గొన్నారు. 27న పశువుల సంత, తైబజార్లకు టెండర్లు కోస్గి: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఈ నెల 27న గురువారం పశువుల సంత, తైబజార్లకు బహిరంగ వేలం ద్వారా టెండర్లు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి వేలంపాట నిర్వహించి అత్యధిక ధర పాడిన వారికి ఒక సంవత్సర కాలానికి టెండరు అందజేస్తామని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనదల్చిన అభ్యర్థులు పశువుల సంతకు రూ.2 లక్షలు, తైబజార్కు రూ.లక్ష మున్సిపల్ కమిషనర్, కోస్గి పేరున డీడీ తీసి ఒక రోజు ముందుగానే ఈ నెల 26న సాయంత్రం 4 గంటల వరకు అందజేయలని తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలసందలు క్వింటాల్ రూ.7,229 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం అలసందలు క్వింటాల్కు గరిష్టంగా రూ.7,229, కనిష్టంగా రూ.5,359 ధర పలికింది. అలాగే, శనగలు గరిష్టం, కనిష్టంగా రూ.5,655, పెసర గరిష్టం ,కనిష్టంగా రూ.7,580, వేరుశనగ గరిష్టం 5,240, కనిష్టం రూ.4,720, జొన్నలు గరిష్టం రూ.4,719, కనిష్టం రూ.2,810, ఎర్ర కందులు గరిష్టం రూ.7,189, కనిష్టం రూ.6,521, తెల్ల కందులు గరిష్టం రూ.7,481, కనిష్టంగా రూ.7,229 ధర పలికింది. -
‘ఉపాధి’ కష్టాలు..!
వివరాలు 8లో uమండుటెండలో కూలీల అవస్థలు మరికల్: మార్చి ప్రారంభం నుంచే బానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మండుటెండలో ఉపాధి హామీ పనులు చేసే కూలీల పరిస్థితి దారుణంగా మారింది. పైగా పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, నీడ కూడా కరువైంది. అత్యవసర మెడికల్ కిట్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద పనులు చేస్తున్న కూలీలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎండలు ముదిరి తమ ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మొత్తంలో జాబ్ కార్డులు 1,11,421 ఉండగా ప్రతి ఏడాది 60 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం 11 మండలాల్లో ఉపాధి పనులు ప్రారంభం కాగా 12,347 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. వసతుల్లేక ఇబ్బందులు ప్రస్తుతం పాం పాండ్స్, గుట్టల్లో గుంతలు తీయడం, నర్సరీల్లో మొక్కల పనులు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశంలో కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేదతీరడానికి ప్రభుత్వం గుడారాలు పంపిణీ చేసేది. ఏడేళ్ల నుంచి వాటి పంపిణీ నిలిచింది. కనీసం కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా వాటిని అందిస్తే ప్రయోజనం చేకూరుతోంది. ఏడేళ్ల కింద జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారు టెంట్లు ఇచ్చారు. మళ్లీ వాటిని వెనక్కి తీసుకున్నారు. గతంలో మెడికల్ కిట్లు పంపిణీ చేసేది. గాయాలపాలైనా, ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కిట్లను పంపిణీ చేయాల్సింది. ఓఆర్ఎస్ ప్యాకెట్, బ్యాండెడ్, దూది, అయోడిన్ సీసా, కొన్ని రకాల మందులు ఉండేవి తొమ్మిదేళ్లుగా కిట్లను కూడా పంపిణీ చేయడం లేదు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పని చేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ముంది. తాగునీరు సక్రమంగా తాగకపోతే నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు. ఈక్రమంలో కూలీలు తగినంత నీరు తాగుతూ.. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని, పని ప్రవేశాల్లో ఓఆర్ఎస్ ద్రావణం లేదా నిమ్మకాయ నీళ్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఉపాధి పనులే ఆధారం జిల్లాలో ప్రస్తుతం కూలీలకు వ్యవసాయ పనులేమి లేవు. దాదాపు అందరూ ఉపాధి పనులపై ఆధారపడుతున్నారు. ఎండల తీవ్రత మూలంగా పనులకు వెళ్లేందుకు పలువురు జంకుతున్నారు. దూరం ఎక్కువగా ఉండటం, నీడ, తాగునీటి వసతి ఏర్పాట్లు చేయకపోతుండటం లాంటి కారణాలతో పనులకు వెళ్తే ప్రాణాలకే ముప్పన్న భావనతో కొందరు కూలీలు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు వంద రోజుల పని దినాలు పూర్తి చేసిన వారు సైతం పనులకు వెళ్లడంలేదు. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. అధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామం నుంచి నిత్యం కనీసం 26 మంది కూలీలైన పనులకు రావాలి. రెండు వారాలుగా కూలీల సంఖ్యను పరిశీలిస్తే అంతకంతకు పెరుగుతూ వస్తోంది. పని ప్రదేశాల్లో కానరాని కనీస సౌకర్యాలు ప్రథమ చికిత్స కిట్ల జాడ కరువు జిల్లాలో మొత్తం 1,11,421 జాబ్ కార్డులు -
భగత్సింగ్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం
యాసంగితో పోలిస్తే పెరిగిన సాగు, ఎండిన పంటనష్టం వివరాలు.. (ఎకరాల్లో)జిల్లా గత యాసంగిలో ప్రస్తుత పూర్తిగా ఎండిన యాసంగిలో పంట (అంచనా..) మహబూబ్నగర్ 1,12,000 1,25,000 20,000 నాగర్కర్నూల్ 1,16,577 80,772 2,000 జోగుళాంబ గద్వాల 44,379 69,694 6,000 వనపర్తి 90,123 1,40,000 5,000 నారాయణపేట 1,13,000 1,28,000 3,000 ● వనపర్తి జిల్లాలో ఈ యాసంగిలో 1.40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. జిల్లాకు జూరాల, భీమా, కేఎల్ఐ సాగు నీరు తగ్గడం.. భూగర్భ జలమట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో వనపర్తి, ఖిల్లాఘణపురం, పాన్గల్ మండలాల పరిధిలో ఇప్పటివరకు సుమారు 200 ఎకరాల మేర పంట ఎండిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే జిల్లావ్యాప్తంగా ఐదు వేల ఎకరాల వరకు వరి ఎండినట్లు తెలుస్తోంది. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీరందక కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, గువ్వలదిన్నే, పాతపాలెం, ఉమిత్యాల, నందిన్నె, ధరూర్ మండలంలోని అల్లాపాడు, కోతులగిద్దె, కొత్తపాలెం, గట్టు మండలంలోని పెంచికలపాడు, మాచర్ల, ఆరగిద్ద, గొర్లఖాన్దొడ్డి గ్రామాల్లో సుమారు ఐదు వేల నుంచి ఆరు వేల ఎకరాల్లో వరి ఎండిపోయింది. అధికారులు మాత్రం 250 ఎకరాల్లో మాత్రమే పంట ఎండిపోయినట్లు చెబుతున్నారు. ● నాగర్కర్నూల్ జిల్లాలో 175 ఎకరాల్లో వరి, 72 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల మేర కంది, ఇతర పంటలు.. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో 205 ఎకరాల్లో వరి ఎండినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ రెండు జిల్లాలు కలిపి నీరందక సుమారు నాలుగు వేల ఎకరాల మేర పంట ఎండినట్లు తెలుస్తోంది. నారాయణపేట: ప్రజా పోరాటాల ద్వారానే ప్రజలకు దోపిడీ పీడనల నుండి విముక్తి జరుగుతుందన్న భగత్సింగ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జీ వెంకట్రామిరెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సిపిఎం, డివైఎఫ్ఐ ,ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించారు. అనంతరం మున్సిపల్ పార్క్ దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా అమల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ చిన్నప్పటి నుంచి లౌకిక భావాలతో విస్తృతమైన ప్రజా పోరాటాల ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కులం మతం ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరినీ సంఘటితం చేసి పోరాడారని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత చరిత్ర వక్రీకరణలు, విభజన, విద్వేష రాజకీయాలతో బ్రిటీష్ వారిని మించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నేడు భగత్ సింగ్ ఆశయాలకు బిన్నంగా పాలన నడిపించడమే కాకుండా మళ్లీ భగత్సింగ్ వారసులం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్య విస్తృత ప్రజా ఉద్యమాల ద్వారా స్వాతంత్రోద్యమ కాంక్షను పెంచారని అన్నారు. ప్రజా పోరాటాలు వ్యక్తితో ప్రారంభమై ఒక వ్యక్తితో ముగిసేవి కాదని సమాజంలో దోపిడీ, పీడన ఉన్నంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్న భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న శ్రమ దోపిడి పీడనలకు, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు కార్మిక వర్గం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద యుద్ధాల దోపిడీ పీడన నుండి మానవజాతి సామాజిక వ్యవస్థను నెలకొల్పడమే అంతిమ లక్ష్యంగా జీవితాంతం పోరాడిన భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజల పక్షాన చివరిదాకా నిలిచి సీపీఎం పోరాడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గోపాల్, బాల్ రామ్, అంజిలయ్య గౌడ్, పుంజనూరు ఆంజనేయులు,మహేష్ కుమార్ గౌడ్, కార్మిక, విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు మహ్మద్ అలీ, బాలు, పవన్ జోషి, అశోక్, దస్తప్ప, నర్సింహ, రాములు, పాల్గొన్నారు మార్గదర్శి భగత్సింగ్ నారాయణపేట ఎడ్యుకేషన్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం తృణపాయంగా వదిలేసిన ధీరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అని, వారు దేశ యువతకు మార్గదర్శులని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్ అన్నారు. పీడీఎస్యూ, పీవైఎల్, యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాశీనాథ్, సాయికుమార్, గౌస్ మారుతి, వెంకటేష్, రాము, సాగర్, ప్రేమ్రాజ్, కృష్ణ, నితిన్ విద్యార్థులు పాల్గొన్నారు.●ఆశలు.. ఆవిరి -
ఎల్ఆర్ఎస్ @ 920
నారాయణపేట: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 2020లో దరఖాస్తులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 34,396లో 17,303 ఆమోదం పొందాయి. మూడు మున్సిపాలిటీల్లో 21,384 దరఖాస్తులు రాగా..140 జీపీల్లో 13,012, రూ.10 వేలు చెల్లించిన వెంచర్లు 403 ఉన్నాయి. ఇందులో నిషేధిత జాబితాలో మూడు మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను అధికారులు గుర్తించారు. ఈనెలాఖరు వరకు ఎస్ఆర్ఎస్ చేయించుకుంటే ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తున్నారు. కాగా వీరిలో 920 మంది మాత్రమే స్పందించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎల్ఆర్ఎస్ రుసుంలో తప్పిదాలు వస్తున్నాయి. ఎస్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ యాప్ రూపొందించింది. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, సిటిజన్ లాగిన్లు ఇచ్చారు. దరఖాస్తుదారులకు ఇచ్చిన సిటిజన్ లాగిన్ఫై అవగాహన లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దరఖాస్తుదారుడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా ఫీజులు వేయాలి. ఆన్లైన్లో వచ్చిందే ఫీజు అంటున్నారే తప్పా.. ఏ దానికి ఎంత అని వివరించలేకపోతున్నారు. సిస్టమ్లో వచ్చిందే కరెక్టు.. ఆ సిస్టమేంటో చెప్పాలంటే చెప్పాలేకపోతున్నారు. రాయితీ ఇచ్చినా స్పందన అంతంతే 34,396 దరఖాస్తులకు 17,303 ఆమోదం రూ.25 కోట్ల లక్ష్యానికి వచ్చింది రూ.1.65 కోట్లే.. మిగిలింది 8 రోజులే..రాయితీతో మేలు అనధికార లే అవుట్లు, ప్లాట్లు క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలతో ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీతో చెల్లించాలి. మిగిలింది 8 రోజులు మాత్రమే. ఈ సువర్ణ అవకాశాన్ని జిల్లాలోని రియల్టర్లు, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యాజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – కిరణ్కుమార్, టీపీఓ, నారాయణపేట అంతా ఆన్లైన్లోనే.. 2020 కంటే ముందు 10 శాతం రిజిస్ట్రేషన్ చేసిన లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఎంతెంత ఫీజు వసూలు చేయాలని అంతా ఆన్లైన్లో చూపుతోంది. రూ.వెయ్యి కట్టిన వారు ఎల్ఆర్ఎస్తో పాటు రిజిస్ట్రేషన్ సైతం చేసుకోవచ్చు. – రాంజీ, సబ్రిజిస్ట్రార్, నారాయణపేట స్పందన కరువు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చినా దరఖాస్తు దారుల నుంచి స్పందన కరువైంది. బల్దియా పరిధిలో నామమాత్రంగానే ఎల్ఆర్ఎస్ చేయించుకున్నారు. రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయించుకోవాలని బల్దియా అధికారులు ప్రచారం చేస్తున్నా అంతంతే కనిపిస్తోంది. ఇక గ్రామీణప్రాంతాల్లో మరింత దారుణంగా ఉంది. -
‘జై సంవిధాన్’ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నారాయణపేట: జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి గ్రామంలో చేపట్టే పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు కదం తొక్కాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, జిల్లా ఇన్చార్జ్ ధారాసింగ్నాయక్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జై బాపు..జై భీమ్.. జై సమిధాన్ ఆల్ ఇండియన్ కాంగ్రెస్ జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండల స్థాయి సన్నాహక సమావేశ ఏర్పాట్లు మండల స్థాయిలో జరిగేలా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అధ్యక్షత వహించాలన్నారు. అలాగే గ్రామాల పాదయాత్ర జాబితా రూట్ ప్లాన్ ప్రోగ్రామ్స్ ప్రారంభం, ముగింపు తేదీలను ఖరారు చేయాలన్నారు. ఏ గ్రామంలో మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనే అంశాలపై ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్నారు. మార్చి 28 కంటే ముందు పూర్తి చేయాలన్నారు. తదనుగుణంగా జిల్లా మండల స్థాయి ప్రణాళికబద్ధమైన సమావేశాలకు పీపీటీలను భాగస్వామ్యం చేయాలన్నారు. పాదయాత్రకు గ్రామంలోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు ప్రజలకు తెలియజేయడానికి, జనాన్ని సమీకరించడానికి డప్పు చాటింపు నిర్వహించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు ప్రసన్నా రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా సైబర్ వారియర్స్
నారాయణపేట: సైబర్ బాధితులకు సైబర్ వారియర్స్ అండగా ఉండాలని సైబర్ క్రైం ఇన్చార్జ్ సీఐ గోపాల్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సైబర్ వారియర్స్కు నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలు, ప్రజలు మోసపోతున్న తీరు, నమోదైన కేసుల్లో జప్తు చేసిన నగదు, పోగొట్టుకున్న నగదు బాధితులకు తిరిగి అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సైబర్ బాధితులు తమ ఖాతా నుంచి డబ్బులు పోయినట్లు గుర్తించిన వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930, డయల్ 100కి గాని, ఎన్సీఆర్బీ పోర్టల్లోగాని ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ బాధితులకు గోల్డెన్ అవర్ ఉంటుందని.. ఆ సమయంలోగా 1930కి సమాచారం ఇస్తే నగదు బదిలీ కాకుండా చేయడం, బాధితులకు అందించడం జరుగుతుందని చెప్పారు. సైబర్ బాధితులకు డబ్బులు త్వరగా ఇప్పించేందుకు కొత్త పద్ధతిని వారికి తెలియజేశారు. పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలు సైబర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సైబర్ క్రైం ఎస్ఐ శ్రావణ్కుమార్, ఐటీ కోర్ రమేశ్, జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్ల సైబర్ వారియర్స్, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు. -
నిరంతరం శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు
● డీ1, డీ2 ప్రదేశాల్లో తవ్వకాలు మమ్మురం ● అతి క్లిష్టమైన ప్రదేశంలో మట్టి, రాళ్లు, బురద తొలగింపు ● గల్లంతైన కార్మికుల ఆచూకీ కోసం 29 రోజులుగా గాలింపు ● ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు – అచ్చంపేట – వివరాలు 8లో.. -
మూతబడ్డ సారా తయారీ కేంద్రాలు
కోస్గి: జిల్లాలో సారా విక్రయాలు, మత్తుకు బానిసలవుతున్న యువతపై శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘మళ్లీ గుడుంబా..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో అటు సారా తయారీదారులు, ఇటు ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. పుర పరిధిలోని నాగుసాన్పల్లి గుట్టల ప్రాంతంలో ఉన్న సారా తయారీ కేంద్రాన్ని మూసివేసి సామగ్రిని అక్కడ నుంచి తరలించారు. ఎకై ్సజ్ కానిస్టేబుల్ ఒకరు తయారీదారులకు సమాచారం ఇవ్వడంతో కేంద్రాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సారంగరావుపల్లితండా, అమ్లికుంట్లతండా, కొత్తపల్లి మండలంలోని లక్ష్మీనాయక్తండా, తుపాకితండాతో పాటు పలుచోట్ల సారా బట్టీలు మూసివేశారు. ఓ అధికారి ఆదేశాల మేరకు పట్టణంలోని ఓ ప్రముఖ హోల్సెల్ వ్యాపారి పెద్ద మొత్తంలో నిల్వ చేసిన బెల్లాన్ని శనివారం రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు స్పందించి సారా తయారీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
కందులు క్వింటా రూ.6,821
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,821, కనిష్టంగా రూ.5,659 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,889, కనిష్టంగా రూ.6,680, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,280, కనిష్టంగా రూ.2,027, జొన్నలు గరిష్టంగా రూ.4,527, కనిష్టంగా రూ.4,027, ఆముదాలు గరిష్టంగా రూ.6,345, కనిష్టంగా రూ.6,225 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆముదాల ధర క్వింటాల్కు గరిష్టంగా రూ.6,011 ఒకే ధర నమోదైంది. ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్కు రూ.1,962గా ఒకే ధర లభించింది. సీజన్ లేకపోవడం వల్ల లావాదేవీలు తక్కువగా జరిగాయి. ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సింథటిక్ మ్యాట్లు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా యువజన, క్రీడాశాఖకు శనివారం కబడ్డీ సింథటిక్ మ్యాట్లు చేరాయి. 35ఎంఎం సైజు గల 300 మ్యాట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఒక కబడ్డీ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ కబడ్డీ సింథటిక్ మ్యాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఈ సింథటిక్ ట్రాక్లు పంపించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడల వ్యవహారాల సలహాదారులు ఏపీ జితేందర్రెడ్డి కృషితో జిల్లాకు కబడ్డీ సింథటిక్ మ్యాట్లు వచ్చినట్లు తెలిపారు. కబడ్డీ మ్యాట్పై ప్రాక్టీస్ చేయడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
నారాయణపేట: నీటిని సృష్టించలేమని.. భూగర్భ జలాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా భూగ ర్భ జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలకు నిర్వహించిన వర్క్షాప్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూగర్భ జలాల వెలికితీత నియమాలు, సంరక్షణ, స్థిరమైన నీటి నిర్వహణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడానికి వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిత్య జీవితంలో నీరు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోవడం, తాగునీటి సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. రానున్న రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారని.. గృహ, వ్యవసాయ, పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు మితిమీరి నీటిని వినియోగించడం భూగర్భ జలమట్టం తగ్గిపోవడానికి కారణమన్నారు. నాటిన మొక్కలు సంరక్షించాలని, ప్రతి ఏటా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. గార్డెన్, గ్రీనరీ పెంపునకు కృషి చేసిన అధికారులకు అవార్డు అందించనున్నట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి భూగర్భ జలాల ప్రాధాన్యత, భూగర్భ, ఉపరితల జలాల వెలికితీత, జల సంరక్షణ, వృక్షాల రక్షణ, టీజీ వాల్టా చట్టం 2002 గురించి వివరించారు. భూగర్భ జలవనరులశాఖ డీడీ రమాదేవి నీటి నిర్వహణ, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రపంచ జలవనరుల దినోత్సవం–2025 బుక్లెట్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
ముగ్గురు వైద్యుల మూకుమ్మడి రాజీనామా
కోస్గి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ అధికారి వ్యవహరిస్తున్న తీరుకు విసుగుచెంది ముగ్గురు వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పత్రాలను జిల్లా అధికారులకు పంపడంతో పాటు మూడురోజులుగా విధులకు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నెల 19న చోటు చేసుకున్న రాజీనామాల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి మల్లికార్జున్ సూపరింటెండెంట్గా ఉండగా డా. అనుదీప్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నారు. డీఎంఓలుగా డా. తరుణ్, డా. రహీం, డా. లోకేష్ , గైనిక్ వైద్యురాలిగా డా. శ్వేత, చిన్నపిల్లల వైద్యులుగా డా. వెంకటేష్ విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యుడు రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు విధులు నిర్వర్తిస్తారు. ముగ్గురు డీఎంఓలు విడతల వారీగా 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారు. వీరంతా కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. కొంతకాలంగా డా. అనుదీప్కు, మిగిలిన వైద్యులకు విధులు, ఆస్పత్రి నిర్వహణ విషయంలో సఖ్యత లేకపోవడంతో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ నెల 16న రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు డా. రహీం రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా తెల్లవారుజామున ఆస్పత్రిలోనే భోజనం చేసి పడుకున్నారు. ఉదయం ఆస్పత్రి అరగంట ఆలస్యంగా విధులకు రాగా.. రోగులు ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుదీప్కు ఫిర్యాదు చేశారు. దీంతో డా. రహీంను రోగుల ముందే ధూషించగా మనస్థాపానికి గురయ్యాడు. ఇన్చార్జ్ సూపరింటెండెంట్ వ్యవహారశైలితో విసుగుచెంది డా. రహీం, డా. తరుణ్, డా. లోకేష్ తాము విధులు నిర్వర్తించలేమని ఈ నెల 19న తమ వృత్తులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా అధికారులఆదేశాలు అమలు చేశా.. ఆస్పత్రిలో పనిచేసే ముగ్గురు వైద్యులు రాజీనామా చేసిన విషయం వాస్తవమే. జిల్లా ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు కొంత కఠినంగా వ్యవహరించి రోగులకు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. రోజురోజుకు రోగుల సంఖ్య పెరగడంతో మెరుగైన సేవల కోసం వైద్యులపై ఒత్తిడి ఉంటుంది. విధుల ని ర్వహణలో సమయపాలన విషయంలో తప్ప వైద్యులతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడ వలు లేవు. ఈ విషయం జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – డా. అనుదీప్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్, కోస్గి సూపరింటెండెంట్ వ్యవహారశైలేకారణమా? -
‘కాడ’ పనులు వేగిరం చేయాలి
నారాయణపేట: కాడ కింద మంజూరైన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో చేపట్టాల్సిన పనులపై నారాయణపేట, వికారాబాద్ జిల్లాల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని కోస్గి, మద్దూర్ మండలాల్లో చేపట్టాల్సిన పనుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మద్దూరు నుంచి లింగాల్చేడ్ వరకు డబుల్రోడ్డు నిర్మాణం, నారాయణపేట నుంచి మద్దూర్ వరకు రహదారి విస్తరణ, కోటకొండ నుంచి మద్దూరు, రావుల్పల్లి నుంచి మద్దూరు వరకు బీటీ రోడ్ల నిర్మాణాలు ఏయే దశలో ఉన్నాయని ఆర్అండ్బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుండుమల్, కొత్తపల్లిలో మండల కాంప్లెక్స్ పనులు ప్రారంభమయ్యాయా లేదా అని సంబంధితశాఖ అధికారులతో ఆరా తీశారు. ఆయా మండలాలలో సబ్స్టేషన్లు, రహదారి విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ స్తంభాల ఏర్పాటుపై విద్యుత్శాఖ అధికారులతో చర్చించారు. మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో అర్హులను గుర్తించి గృహజ్యోతి అమలు చేయాలని ఆదేశించారు. కోస్గి పుర పరిధిలో ప్రధాన రహదారి విస్తరణ, అంతర్గత రహదారుల నిర్మాణాల గురించి ఆరా తీశారు. సమీక్షలో పంచాయతీరాజ్శాఖ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్నాయక్, ఈఈ శ్రీధర్రెడ్డి, డీఈ రాములు, విద్యుత్శాఖ డీఈ నర్సింహారెడ్డి, పీఆర్, ఆర్అండ్బీ ఏఈలు, టీజీఎంఐడీసీ అధికారి పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ఫోన్ చేయాల్సిన నంబర్: 94400 46567
సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకునారాయణపేట: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మితో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ప్రజలకు ఉపయోగపడేలా సేవలందించాలి
నారాయణపేట: ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థా నంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలందించడం అదృష్టంగా భావించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్గా శిక్షణ పూర్తిచేసుకొని వెళ్తున్న గరిమా నరుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు బేన్ షాలొమ్, సంచిత్ గ్యాంగ్వర్, ఆర్డీఓ రామచంద్ర నాయక్తో పాటు పలువురు జిల్లా అధికారులు ట్రైనీ కలెక్టర్తో విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకొని పూలమాల, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆలిండియా స్థాయిలో 39వ ర్యాంకు సాధించిన గరిమా నరుల ట్రైనీ కలెక్టర్గా.. విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, భాషలు కలిగిన జిల్లాకు రావడం, ఇక్కడ పని చేయడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగ పడుతుందని, ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నా..జిల్లాను మరవద్దని కలెక్టర్ కోరారు. ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల మాట్లాడుతూ.. శిక్షణ కాలంలో కలెక్టర్ తనకు ఎన్నో విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించారని, అదనపు కలెక్టర్లు తమ తమ శాఖల పరిధిలోని వివిధ అంశాలపై తనకు క్లుప్తంగా వివరించి మద్దతుగా నిలిచారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలి
నారాయణపేట: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిదీ అని తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి 20వ తేదీ వరకు నూతన ఓటరు నమోదుకు నారాయణపేట నియోజకవర్గంలో 1,294 దరఖాస్తులు రాగా 1,068 విచారణ పూర్తి చేశారని, చిరునామా మార్పునకు 1529 దరకాస్తులు రాగా.. 1359 విచారణ పూర్తయ్యాయని అడిషనల్ కలెక్టర్ బేన్ షాలోమ్ తెలిపారు. అలాగే మక్తల్ నియోజకవర్గంలో ఓటరు నమోదుకు 1690 దరఖాస్తులు వచ్చాయని 1269విచారణ పూరయ్యాని, చిరునామా మార్పు కోసం 1908 దరఖాస్తులు రాగా, 1625 విచారణ పూర్తి అయ్యాయన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితా తయారుకు రిటర్నింగ్ అధికారి ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్ స్థాయి ఎజెంట్లను నియమించి జాబితా అందచేయాలని సూచించారు. అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, రెండు ఓట్లున్న ఓటర్లను తొలగించే ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల ద్వారా సరైన ఓటరు వివరాలను అందించేందుకు ముందుకు రావాలని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ రామచంద్రనాయక్, డిటీ బాల్ రాజ్,ఎన్నికల విభాగం పర్యవేక్షకులు అఖిల ప్రసన్న, రాణి దేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్ రెడ్డి, వినోద్, సలీం, వెంకట్రాంరెడ్డి, అశోక్, అజయ్, వెౌకటేశ్, తాహిర్ పాషా తదితరులు పాల్గొన్నారు. భూసేకరణ ప్రక్రియలో వేగం పెంచాలి నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ మరింత వేగం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రెవెన్యూ, నీటి పారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ మండలంలోని దంతెన్పల్లిలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. అలాగే కోస్గిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై కలెక్టర్ చర్చించారు. 22 మంది వేసిన రిట్ పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ల కు పరిష్కారం చూపాలన్నారు. భూసేకరణ పనులు, కోస్గి రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. -
మొదటి రోజు 22 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 7613 మంది విద్యార్థులకుగాను 7591 మంది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 22మంది గైర్హాజరయ్యారు. మొత్తం 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు బెంచీలను ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రెండు పరీక్ష కేంద్రాలను స్టేట్ అబ్జర్వర్లు, ఆరు కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పరీక్ష ముగిసే వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు. విద్యార్థులను గంట ముందే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు -
లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కరిద్దాం
నారాయణపేట: జిల్లాలో మే 10న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని టీములు సిద్ధంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో జడ్జి మాట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మార్చి 8న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 9825 కేసులు పరిష్కరించి జిల్లా రాష్ట్రంలోనే 13వ ర్యాంకు స్థానంలో నిలిచిందని, ఇందుకు కృషిచేసిన పోలీసులు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లను అభినందించారు. జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు యధావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏజెండాలోని అంశాలను నాన్ బెయిల్ వారెంట్ కేసులను, చార్జిషీట్, ఎన్ఐ యాక్ట్ పెండింగ్లో ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా అధిక కేసులని పరిష్కరించేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. సమావేశంలో సినియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్, జూనియర్ సివిల్ జుడ్గే ఫరహీన్ బేగం కోస్గి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సురేష్ కుమార్, బాలప్ప, ఆర్డీవో ఆఫీసర్, డిఫెన్స్ కౌన్సిల్స్ కె లక్ష్మి పతి గౌడ్, నాగేశ్వరి, మరియు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జొన్నలు క్వింటాల్ రూ.4,800 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం జొన్నలు క్వింటాలుకు గరిష్టంగా రూ.4,800, కనిష్టంగా రూ.3,050 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,857, వేరుశనగ గరిష్టం, కనిష్టంగా రూ.4,350, అలసందలు గరిష్టం రూ.7,219, కనిష్టం రూ.7,106, ఎర్ర కందులు గరిష్టం రూ.7,416, కనిష్టంగా రూ.6,609 ధరలు పలికాయి. వేరుశనగ @ రూ.6,691 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శక్రవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,691, కనిష్టంగా రూ.5,611 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,935, కనిష్టంగా రూ.5,610, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,291, కనిష్టంగా రూ.1,951, జొన్నలు గరిష్టంగా రూ.4,011, కనిష్టంగా రూ.3,817 ధరలు పలికాయి. -
యువికా.. నవ శాస్త్రవేత్తలకు వేదిక
ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకారం ఇవీ కేంద్రాలు.. 1. ఐఐఆర్ఎస్, డెహ్రాడూన్ 2. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్, తిరువనంతపురం 3. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట 4. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, బెంగుళూరు 5. స్పేస్ అప్లికేషన్ సెంటర్, అహ్మదాబాద్ 6. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్ 7. నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, షిల్లాంగ్ నారాయణపేట రూరల్: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చక్కని అవకాశం కల్పిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యువికా (యువ విజ్ఞాని కార్యక్రమం) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శిక్షణకు హాజరయ్యేందుకు రవాణా చార్జీలు, బస, భోజన వసతితో పాటు అన్ని సౌకర్యాలను ఇస్రోనే కల్పించనుంది. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో 45,969 మంది 9వ తరగతి విద్యార్థులు ఉండగా ఇందులో ఎంత మంది ఔత్సాహికులు ముందుకు వస్తారో వేచి చూడాల్సి ఉంది. రేపటి వరకు అవకాశం.. దరఖాస్తులు సమర్పించేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించారు. ఎంపికై న విద్యార్థుల తొలి జాబితాను ఏప్రిల్ 7న అర్హత సాధించిన వారికి సమాచారం అందిస్తారు. ఎంపికై న విద్యార్థులు మే 18న ఇస్రో కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి మే 30 వరకు ఎంపికై న విద్యార్థులకు 7 శిక్షణ కేంద్రాల్లో యువికా కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపిక విధానం ఇలా.. ఈ విద్య సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. గ్రామీణ ప్రాంతాల వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. 8వ తరగతిలో పొందిన మార్కులు, మూడేళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన, సైన్స్ ప్రతిభ పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి, మూడు స్థానాల్లో నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. రిజిష్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటినవారు, స్కౌట్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉండటం, ఆన్లైన్ క్విజ్లో ప్రతిభ చూపిన వారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. వేసవిలో శిక్షణ.. శిక్షణకు ఎంపికై న విద్యార్థులకు వేసవి సెలవుల్లో మే 19 నుంచి 30 వరకు 12 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది. విద్యార్థితోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు లేదా గైడ్ ఉపాధ్యాయుడికి కూడా ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు తీసుకెళ్లి అక్కడి విశేషాలను ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పిస్తారు. దరఖాస్తు విధానం.. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సదావకాశం ఆన్లైన్లో అందుబాటులో ఇస్రో ప్రత్యేక వెబ్సైట్ రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లాలో 45,969 మంది విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించాలి.. వైజ్ఞానిక పోటీల్లో పాల్గొనేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, అంతరిక్ష పరిశోధనా రంగాలపై ఆసక్తి పెంపొందించడానికి యువికా తోడ్పడుతుంది. ఎంపికై న విద్యార్థులకు స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి, నారాయణపేట విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదట వారి ఈమెయిల్ ఐడీతో ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాలి. క్విజ్ పూర్తి చేసిన 60 నిమిషాల తర్వాత యువికా పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తుతో పూర్తి వివరాలు నమోదు చేసి సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతి, విద్యార్థి గత మూడేళ్లలో వివిధ అంశాల్లో సాధించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. -
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
నారాయణపేట/కోస్గి రూరల్: నేరాలను నియంత్రించడంతో పాటు, నిందితులను గుర్తించడంలోనూ సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం కోస్గి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కమ్యూనిటీ వైర్లెస్ సీసీ కెమెరాలను కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన ఈ సీసీకెమెరాలను జిల్లాతోపాటు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశామని, అసాంఘిక కార్యక్రమాలు, నేరాల నియంత్రణతోపాటు శాంతి భద్రతలు కాపాడవచ్చాన్నారు. రోడ్డు ప్రమాదాలు , దోంగతనాలు తదితర సంఘటనలో సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, కడా చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, సిఐ సైదులుతోపాటు రఘువర్దన్రెడ్డి, సీసీ కెమెరాల దాత ప్రదీప్ పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నిస్తాయని, పోలీసులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఆడాలని ఎస్పీ యోగేష్గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం సాయంత్రం జిల్లా పోలీసులు విరామ సమయంలో క్రీడలు ఆడేందుకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్ట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటుచేయగా..ఎస్పీ ప్రారంభించారు. -
పరీక్ష కేంద్రాల వద్ద144 సెక్షన్ అమలు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుంది. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – యోగేష్ గౌతమ్, ఎస్పీ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పరీక్ష కేంద్రాల్లోని సిబ్బందికి ఐడీ కార్డులు ఇచ్చాం. ఐడీ కార్డు లేని వారికి పరీక్ష కేంద్రానికి అనుమతి లేదు. విద్యార్థులు ఓఎమ్మార్ షీట్ నింపడంలో ఏవైనా పొరపాటు జరిగితే ఇన్విజిలేటర్లను సంప్రదించాలి. గైర్హాజరైన విద్యార్థుల హాల్టికెట్ నంబర్లను ఇన్విజిలేటర్లు సరిచూసుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. – గోవిందరాజులు, డీఈఓ ● -
ఫోన్ చేయాల్సిన నంబర్: 94400 46567
సమయం: శనివారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకునారాయణపేట: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వేసవిలో ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సౌభాగ్యలక్ష్మితో శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు నేరుగా ఫోన్ చేసి వడదెబ్బతోపాటు అనారోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునే అవకాశం ‘సాక్షి’ కల్పిస్తోంది. రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
ఆయిల్పాం తోటల సాగుతో అధిక లాభాలు
తాడూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా వాణిజ్య పంటల్లో భాగమైన ఆయిల్పాం తోటలతోపాటు వివిధ రకాల పండ్ల తోటల సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ఉద్యానవన శాఖ ఆయిల్పాం తోటల సలహాదారు, శాస్త్రవేత్త బీఎన్ రావు అన్నారు. గురువారం మండలంలోని మేడిపూర్లో రైతు వెంకట్రెడ్డి సాగు చేసిన ఆయిల్పాం తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక రైతులకు సూచనలు,సలహాలు ఇచ్చారు. అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను వివరించారు. ప్రధానంగా వేసవిలో లేత ఆయిల్పాం తోటల్లో నీరు, ఎరువుల యాజమాన్యం గురించి తెలిపారు. బిందు సేద్యం ద్వారా నీటితోపాటు ఎరువులను అందించాలని సూచించారు. సమృద్ధిగా నీటి వసతి ఉన్న రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్పాం తోటలను సాగుచేయాలన్నారు. మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలుగా కూరగాయలు, బొప్పాయి, అరటి, పప్పుధాన్యలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయవచ్చన్నారు. 2020– 21 సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సాగు చేస్తున్న ఆయిల్పాం తోటల దిగుబడులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి దశలో తీసుకోవాల్సిన పురుగుల యాజమాన్యం, ఎరువుల మోతాదు, ఆడ, మగ పూల గుత్తులను తొలగించే విధానం రైతులకు క్షేత్రస్థాయిలో వివరించారు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
దామరగిద్ద: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వార్డులను పరిశీలించి నిల్వ ఉన్న మందులు, స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిష్టర్లను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కుటుంబ తగాదాలతో చెవికి గాయమై చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన వివాహిత మహిళతో కలెక్టర్ మాట్లాడి బాధిత మహిళకు న్యాయ సహాయం చేయాలని అక్కడే ఉన్న సఖి కేంద్రం నిర్వాహకురాలికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి, తహాసీల్దార్ జలీల్, ఎంపీడీఓ సాయిలక్ష్మి, వైద్యురాలు సిబ్బంది పాల్గొన్నారు పనితీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు నిర్దేశించిన లక్ష్యాన్ని గుడువు లోగా పూర్తి చేయడంతో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ పూర్తిగా విఫలమయ్యాయని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ఫ్ బ్యాంక్ లింకేజీలో వంద శాతం టార్గెట్ను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, మండలంలో 94 శాతం పెండింగ్ ఉండటంతో ఏఈపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాది హామీ పథకంలో కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి పొందేలా చూడాలని, కొన్ని గ్రామాల్లో కేవలం పది మంది మాత్రమే ఉపాధి పనులకు వస్తున్నారని అన్నారు. ఎంపీడీఓగా మండలంలో ఏం చేస్తున్నారని ఎంపీడీఓ సాయిలక్ష్మిని నిలదీశారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశాని హాజరు కాని టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఆర్డీఓ అంజయ్య, డీపీఎం జయన్న, ఏపీఎం నర్సిములు తహసీల్దార్ జలీల్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ సైన్స్ వేదికకు శివారెడ్డి ఎంపిక నారాయణపేట: జపాన్ ప్రభుత్వం నిర్వహించే సకురా సైన్స్ ఉన్నత పాఠశాల ప్రోగ్రాంకు దేశం నుంచి 54 మంది విద్యార్థుల ఆవిష్కరణలు ఎంపిక కాగా.. అందులో జిల్లాలోని దామరగిద్ద సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి శివారెడ్డి ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అభినందించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో విద్యార్థి ఏ.శివారెడ్డి, గైడ్ టీచర్ జరీనా, ప్రిన్సిపల్ కె.శ్రీనివాసులును కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరులా సన్మానించారు. విద్యార్థుల వినూత్నఆలోచనలను ప్రోత్సహించాలి విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టేలా వినూత్న ప్రయోగాలు, వారి అభిరుచికి తగినట్లు ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న అటల్ కింకరింగ్ ల్యాబ్ను ఆమె పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
సమయపాలన పాటించకపోతే ఎలా..?
మాగనూర్: పాఠశాల విధులకు ఉపాధ్యాయులే సమయపాలన పాటించకపోతే ఎలా అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. గురువారం మండలంలోని కేజీబీవీని ఉదయాన్నే ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సమయం దాటిపోయినా ఉపాధ్యాయులతో పాటు ఎస్ఓ రాధిక పాఠశాలకు రాకపోవడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు తాను వచ్చిన తర్వాత కూడా రాకపోవడం ఏమిటిని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్యార్థులలో క్రమశిక్షణ కొరవడిందని పీఈటీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన విషయాలను ఒక నోట్బుక్లో రాసిపెట్టాలని సిబ్బందికి సూచించారు. వారంలోగా మళ్లీ పాఠశాల తనిఖీకి వస్తానని, ఈ సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంటగది, మూత్రశాలలలు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. కేజీబీవీ ఎస్ఓ, ఉపాధ్యాయులపైఎమ్మెల్యే ఆగ్రహం -
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు
నారాయణపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజైన గురువారం మొత్తం 3,803 మంది విద్యార్థులకుగాను 3724 మంది పరీక్షలకు హాజరయ్యారు. 79 మంది గైర్హాజరయ్యారు. అలాగే, జనరల్ విద్యార్థులు 3,335 మందికిగాను 3,277 మంది, ఒకేషనల్లో 468 మందికిగాను 447 మంది హాజరయ్యారు. బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత డ్రైవింగ్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): తెలంగాణ బీసీ సహకార ఆర్థికసంస్థ ఆధ్వర్యంలో జిల్లా లోని బీసీ నిరుద్యోగ యువతకు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఇందిర గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 38 రోజులు శిక్షణ ఉంటుందని, ఉచిత భోజనంతో పాటు వసతి కల్పించనున్న ట్లు పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారు 8వ తరగతి పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో పాటు కలెక్టరేట్లోని రెండవ అంతస్తులోని రూం నంబర్ 205 బీసీ అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఇతర వివరాలను బీసీ అభివృద్ధి శాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల ఆహ్వానం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పేరుపై రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చేనేత, జౌళి శాఖ డీడీ బాబు గురువారం ఓ ప్రకనటలో తెలిపారు. చేనేత, డిజైనింగ్ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పోచంపల్లి, గద్వాల చీరలు, నారాయణపేట చీరలు, డర్రీస్, జనరల్ వైరెటీస్ రంగాల్లో నైపుణ్యం ఉండాలని సూచించారు. వీవింగ్ కేటగిరి, డిజైనింగ్ కేటగిరిలో అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు చేనేత, జౌళి శాఖ డీడీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
అట్టడుగున నాలుగు జిల్లాలు
నారాయణపేటశుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు IIలో uసాక్షి, నాగర్కర్నూల్: వ్యక్తిగత ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కల్పనలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు ఇంకా అట్టడుగునే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆదాయం, ఉత్పత్తి, ఉపాధిలో వెనకబాటు కనిపిస్తోంది. తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్–2025 రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో నూతన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టనుంది. అనీమియా ముక్త్ కార్యక్రమంలో వైద్యసిబ్బంది తీసుకున్న చర్యల ఫలితంగా వనపర్తి జిల్లా 91.8 శాతం పనితీరుతో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ● వస్తు సేవల ఉత్పత్తిగా లెక్కించే జీఎస్డీపీ లెక్కల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే 30వ స్థానంలో ఉంది. జోగుళాంబ గద్వాల 27, వనపర్తి 26, నాగర్కర్నూల్ 19వ స్థానంలో ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా మాత్రం రూ.32,767 కోట్ల జీఎస్డీపీతో రాష్ట్రవ్యాప్తంగా పదో స్థానంలో నిలిచింది. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయంలో మహబూబ్నగర్ జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాలు వెనుకబడిపోయాయి. మహబూబ్నగర్ రూ.2,93,823 తలసరి ఆదాయంతో రాష్ట్రంలో 6వ స్థానంలో ఉండగా.. నారాయణపేట 30, జోగుళాంబ గద్వాల 26, వనపర్తి 22, నాగర్కర్నూల్ 20వ స్థానంలో ఉన్నాయి. ● ఉమ్మడి పాలమూరులో పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టడం లేదు. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో ఉమ్మడి జిల్లా వెనుకబడి ఉంది. నారాయణపేట జిల్లాలో 102 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. వీటి పరిధిలో 2,045 మంది ఉపాధి పొందుతున్నారు. కాగా మహబూబ్నగర్లో 462 యూనిట్లతో 32,443 మందికి ఉపాధి పొందుతున్నారు. మిగతా జిల్లాల్లో ఐదు వేల మందికి మించి ఉపాధి లేదు. ఇక అటవీ విస్తీర్ణంలో నాగర్కర్నూల్ జిల్లాలో 35.81 శాతం అటవీ భూమితో రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉండగా.. గద్వాల జిల్లాలో కేవలం 2.32 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉంది. డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లలో 57.4శాతంతో నాగర్కర్నూల్ అట్టడుగు స్థానంలో ఉండగా. వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలు సైతం 65 శాతం లోపే కనెక్షన్లు ఉన్నాయి. ● రాష్ట్రంలోనే సోలార్ మోడల్ విలేజ్గా నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి నిలిచింది. సీఎం రేవంత్రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మొత్తం 1,451 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 499 డొమెస్టిక్, 66 కమర్షియల్, 867 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 422 గృహ వినియోగదారులకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంచడం, ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపర్చడం, పర్యావరణ హితంలో భాగంగా ప్రభుత్వం ఈ సోలార్ మోడల్ ప్రాజెక్ట్ను చేపట్టింది. ప్లాస్టిక్ ఫ్రీగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా కొనసాగుతోంది. వన్యప్రాణులు, అటవీప్రాంత సంరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 80 శాతం వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలను నిరోధించగలిగారు. శ్రీశైలం–హైదరాబాద్ రహదారి వెంబడి సేకరించిన మొత్తం 34 వేల కేజీల ప్లాస్టిక్ను తుక్కుగూడలో రీసైక్లింగ్ ప్రాసెస్ను నిర్వహించారు. అలాగే 16 మంది స్థానిక చెంచు మహిళల ఆధ్వర్యంలో పర్యావరణ హిత బ్యాగ్లు, ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వెనుకంజ మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగు పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు కరువు సోలార్ మోడల్ విలేజ్గా కొండారెడ్డిపల్లి తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్ లుక్ 2025లో వెల్లడి -
కురుమూర్తిస్వామి ఆలయాభివృద్ధికి రూ.110 కోట్లు
పాలమూరు ప్రజల ఆరాధ్యదైవం అమ్మాపురంలో ఉన్న కురుమూర్తిస్వామి ఆలయానికి ప్రభుత్వం రూ.110 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో ఘాట్రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం 20–25 ఎకరాల స్థలాన్ని కేటాయించి, నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. -
నల్లమల పర్యాటకంపై దృష్టి..
రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా నల్లమల అటవీప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లను కేటాయించింది. ఈ నిధుల ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందించనుంది. టైగర్ సఫారీ, ఎకో టూరిజం, కృష్ణానదిపై లాంచీ స్టేషన్లు, జెట్టీలు, వాటర్ స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి పర్చనున్నారు. ● నల్లమలలో పర్యాటక అభివృద్ధితో పాటు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, ట్రెక్కింగ్ మార్గాలను అభివృద్ధి చేయనుంది. కృష్ణాతీరంలోని సోమశిల వద్ద బోటింగ్, క్యాంపింగ్, కారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కోసం ప్రణాళిక చేపట్టింది. -
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
నారాయణపేట రూరల్: రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా కేంద్రాలకు చేరుకోవాలని.. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జిల్లాను నిలపాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. ఈ నెల 21నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని.. గత పరీక్షలతో పోలిస్తే ఈ సారి కొంత మార్పులు జరిగాయని.. జీపీఏ బదులు మార్కులు ప్రకటించే అవకాశం ఉందని.. పరీక్ష నిర్వహణలో సైతం ఓఎంఆర్ షీట్తో పాటు సమాధాన పత్రానికి బదులు 24 పేజీల బుక్లెట్ అందుబాటులోకి తీసుకురానున్నారని వివరించారు. ఇక పరీక్ష కేంద్రాల ఎంపిక, అవసరమైన సౌకర్యాలు, పరీక్ష పత్రాలు చేర్చడం తదితర అంశాలపై బుధవారం డీఈఓ గోవిందరాజు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతి ప్రతి రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 20 నిమిషాలు అదనంగా ఉంటుంది. భౌతిక, జీవశాస్త్రం పేపర్ గంటన్నర మాత్రమే ఉంటుంది. పరీక్ష హాల్లోకి గంట ముందే విద్యార్థులను అనుమతిస్తాం. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షకు ముందే విద్యార్థుల సమాచారం ఇన్విజిలేటర్లు నమోదు చేసుకుంటారు. గతంలో 11 పరీక్షలు ఉండేవి. ఈ సారి కేవలం ఏడు పరీక్షలు మాత్రమే ఉండనున్నాయి. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా శిక్షణ ఇచ్చాం.. ఈ పరీక్షల నిర్వహణ ప్రతీ టీచర్కు సవాల్గా మారింది. పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సిలబస్ పూర్తి అయిన వెంటనే ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించడంతో పాటు రివిజన్ టెస్టులు, గ్రాండ్ టెస్ట్, ఫ్రీ ఫైనల్ పరీక్షలను రాయించి తప్పులను సరిచేసుకునే విధంగా విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చారు. వందశాతం ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు (జీపీఏ) సాధనకు కృషిచేస్తున్నాం. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసి వారి స్థాయికి తగ్గట్లు విషయ పరిజ్ఞానాన్ని అందించాం. చివరగా విద్యార్థులు ఇప్పటి వరకు చదివిన అంశాలనే నివృత్తి చేసుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో ఒక రోజు ముందుగానే వచ్చి చూసుకోవడం మంచిది. పరీక్షకు వచ్చే ముందు అల్పాహారం తీసుకోవాలి. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఫీజుల పేరుతో హాల్టికెట్లు ఇవ్వకుంటే చర్యలు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల పేరుతో హాల్టికెట్లు ఆపినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సైతం ‘బీఎస్ఈ.తెలంగాణ.జీఓవీ.ఇన్’ అనే వెబ్సైట్ ద్వారా తమ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. హెచ్ఎం సంతకం లేకుండానే పరీక్షకు నేరుగా హాజరు కావచ్చు. విద్యార్థుల సందేహాల నివృత్తికి జిల్లావిద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. పరీక్షలకు సంబందించి ఏమైన ఇబ్బందులు, ఫిర్యాదులు, సలహాలు తెలియచేయాలనుకుంటే సెల్ నం.9502051806 కు సమాచారం ఇవ్వడానికి అందుబాటులో ఉంచాము. పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు జిల్లాలో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు హాల్టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఈఓ గోవిందరాజులు -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ప్రజల భద్రతపై భరోసా కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేసులు పెండింగ్లో లేకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని, ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. పోలీసు అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందజేస్తు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సిసిటీవి లు ప్రాముఖ్యత అవగాహన కల్పిస్తూ నూతన సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ వారి రక్షణ ప్రధాన ధ్యేయంగా నాణ్యమైన, సత్వర సేవలు అందించాన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలనిఅన్నారు. సమావేశంలో డీఎస్పీ లింగయ్య, సిఐ లు శివ శంకర్, రాజేందర్ రెడ్డి, రామ్ లాల్, సైదులు, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాజు, విజయ్, రమేష్, రాము, భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్, కృష్ణం రాజు, సునిత పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలోని మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ జ్యోతి అధికారులను అదేశించారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో మద్దూరు, కొత్తపల్లి మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, గ్రామాల్లో వేసివిలో నీటి ఎద్దడి తదితర ఆంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో నీటిని వృథా చేయకుండా చూడాలని అధికారులకు అదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంపై పూర్తి అవగాహన కల్పించి నిర్మాణం ఎంత వరకు జరిగితే అంత బిల్లులు వస్తాయని వారికి వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాంచందర్, ఎంపీడీఓ నర్సింహారెడ్డి, కృష్ణరావ్, ఎంపీఓ రామన్న, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. నల్లకుసుమలు క్వింటాల్ రూ.4,109 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నల్లకుసుమలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.4,109 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7,475, వేరుశనగ గరిష్టం రూ.5,449, కనిష్టం రూ.5,020, జొన్నలు గరిష్టం రూ.4,735, కనిష్టం రూ.2,812, అలసందలు గరిష్టం రూ.7,176, కనిష్టం రూ.5,109, ఎర్ర కందులు గరిష్టం రూ.7,311, కనిష్టం రూ.6,069, తెల్ల కందులు గరిష్టం రూ.7,305, కనిష్టం రూ.6 వేలు పలికాయి. మెనూ అమలు తప్పనిసరి దామరగిద్ద: గురుకుల పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలోని భవనంలో కొససాగుతున్న దామరగిద్ద ఎస్సీ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ సమక్షంలో విద్యార్థుల సంఖ్య, మెస్ రిజిస్టర్లు, భోజన వసతిని పరిశీలించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతున్నారని ఆరా తీస్తూ స్టడీ అవర్స్ను పరిశీలించారు. పాఠశాలలో 6వ తరగతి నుండి ఇంటర్ వరకు 549 మంది విద్యార్థులు ఉంటున్నారని ప్రిన్సిపల్ వివరించారు. అయితే, మెయిన్గేట్, హెడ్లైట్ లేకపోవడంతోపాటు గదుల కొరత పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ను విద్యార్థులు కోరారు. -
మనోధైర్యంతో ముందుకు సాగాలి
నారాయణపేట: దివ్యాంగ విద్యార్థులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని వారికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తాయని.. వారిలో గల సృజనాత్మక నైపుణ్యాలను గుర్తించి వెలికి తీస్తే వారు చాలా ప్రతిభా వంతులుగా మారుతారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో బుధవారం భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (అలిమ్ కో) సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారికి జీవన నైపుణ్యాలు నేర్పించాలని అన్నారు. భవిత సెంటర్లలో వారానికి ఒకసారి ఫిజియోథెరపీ సేవలు అందిస్తారని దీనిని దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు. మనోధైర్యంతో వైకల్యాన్ని జయించి జీవితంలో అత్యున్నత స్థానాలలో స్థిరపడ్డారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను ఓపిక, సహనంతో పెంచి పెద్ద చేయాలని కోరారు. ప్రభుత్వం ద్వారా వారికి వచ్చేటటువంటి ప్రోత్సాహకాలను విద్యార్థులకు అందేలా తగు చర్యలు తీసుకొని వారిని సరిగ్గా పోషించాలని సూచించారు. వినికిడి యంత్రాలు, వీలైచైర్స్ గత ఆగస్టు 24న నిర్వహించిన అసెస్మెంట్ క్యాంపులో నుండి 85 మంది విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలకు కొలతలు తీసుకుని రూ.లక్షల విలువైన ఉపకరణాలను కలెక్టర్ చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగిందని సీఎం ఓ రాజేందర్ తెలిపారు. కాలిపర్స్, వినికిడి యంత్రాలు, ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, సిపి చైర్స్, ఎంఆర్ కిట్స్ మరియు రొలేటర్స్ దివ్యాంగులకు అందించారు. అనంతరం డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. భవిత సెంటర్లలో చదివే విద్యార్థులకు ఎన్టైటిల్మెంట్స్ స్టైఫండ్ ఎస్కార్ట్ అలవెన్సు రీడర్ అలవెన్న్స్ ఇస్తున్నామని, భవిత సెంటర్లలో ఫిజియోథెరపీ క్యాంపు, స్పీచ్ థెరపీ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాపతి, విద్యా శాఖ అధికారి నాగార్జునరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి బాలాజీ, అలీంకో సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు శిక్షణ తల్లిదండ్రులు ఉపయోగించుకొని పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
బెట్టింగ్లకు దూరంగా ఉండాలి : ఎస్పీ
నారాయణపేట: యువత బెట్టింగ్, గేమ్ యాప్లకు అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎస్పీ యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్కు పాల్పడినా, ఆన్లైన్లో గేమ్స్ ఆడినా, ఎవరైనా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో చాలా మంది అవగాహన లోపంతో అక్రమ యాప్లతో మోసపోతున్నారని తెలిపారు. మోసపూరిత ప్రకటనలను నమ్మి ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టడం, గ్రేమ్స్ ఆడటంవల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. బెట్టింగ్ యాప్లు చాలా ప్రమాదకరమైనవని.. వీటిలో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫార్మర్లు వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో వ్యసనం పెరుగుతుందన్నారు. వీటి కట్టడికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు, యువత అప్రమత్తంగా ఉంటూ.. ఇలాంటి కార్యకలాపాలపై డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దరఖాస్తు చేసుకోండి నారాయణపేట ఎడ్యుకేషన్: మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ ఖాజా బహ్రుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకులాలు ఉండగా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి కృష్ణా: పదో తరగతి విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదువుకుని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. మండలంలోని ముడుమాల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముడుమాల్ గ్రామంలోని నిలువురాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయో.. అదే విధంగా పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ నిజాముద్దీన్, కాంప్లెక్స్ హెచ్ఎం గణేశ్సింగ్, ఏఎంఓ విద్యాసాగర్, రిటైర్డ్ జీహెచ్ఎం రాఘవేంద్రరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మికతనుఅలవర్చుకోవాలి మాగనూర్: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని నేరడగంలో శ్రీపశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాముల విరక్తమఠం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్వామి వారిని ఎంపీ దర్శించుకున్నారు. మఠం ఆవరణలో మహిళలకు ఒడినింపే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభించడంతో పాటు అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. మఠం అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు. అలసందలు @ రూ.7,156 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్ గరిష్టంగా రూ. 7,156, కనిష్టంగా రూ. 7,073 ధరలు వచ్చాయి. పెసర గరిష్టంగా రూ. 7,620, కనిష్టంగా రూ. 7,440, వేరుశనగ గరిష్టంగా రూ. 5,200, కనిష్టంగా రూ. 4,524, జొన్నలు గరిష్టంగా రూ. 4,705, కనిష్టంగా రూ. 2,816, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,263, కనిష్టంగా రూ.6వేలు, తెల్లకందులు రూ. 7,411 ధరలు వచ్చాయి. -
ఇంటర్ పరీక్షలకు 92మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్/కోస్గి రూరల్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 3,997 మంది విద్యార్థులకు గాను 3,905 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,447 మందికి గాను 3,375 మంది, ఒకేషనల్ విభాగంలో 550 మందికి గాను 530 మంది హాజరై పరీక్షలు రాయగా.. 92 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ సుదర్శన్రావు తెలిపారు. ● జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలతో పాటు కోస్గి ప్రభుత్వ కళాశాల, ప్రజ్ఞ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను డీఐఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులకు పరీక్షలు రాసే సమయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం పలు రికార్డులను పరీశీలించారు. డీఐఈఓ వెంట పరీక్షల విభాగం అదికారులు ప్రతాప్రెడ్డి, పరశురాం, పరేష్, ఈశ్వర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నారాయణపేట: జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో హౌసింగ్, డీఆర్డీఓ, విద్యాశాఖ, ఆరోగ్య, పీఆర్, డీపీఓ, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సొంత స్థలాలు ఉన్న 859 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. వాటి గ్రౌండింగ్ వివరాలపై కలెక్టర్ ఆరా తీయగా.. ఇప్పటి వరకు 165 గ్రౌండింగ్ అయ్యాయని హౌసింగ్ పీడీ శంకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే జిల్లా 6వ స్థానంలో ఉందన్నారు. మిగతా ఇళ్ల నిర్మాణాలను కూడా త్వరగా మొదలుపెట్టి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ● జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ సమీక్షిస్తూ.. మహిళా సంఘాల సభ్యులకు సోలార్ పవర్ ప్లాంట్లు, బస్సులు, న్యూ ఎంటర్ ప్రైజెస్ యూనిట్ల మంజూరు వివరాలను డీఆర్డీఓ మొగులప్పతో తెలుసుకున్నారు. అయితే బ్యాంకు లింకేజీలో రాష్ట్రంలోనే జిల్లా ర్యాంకు 32వ స్థానంలో ఉండటంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేని ఏపీఎంలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓను ఆదేశించారు. అదే విధంగా 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు స్కూల్ యూనిఫాం కుట్టే ప్రక్రియపై కలెక్టర్ చర్చించారు. 2024–25లో జరిగిన పొరపాట్లు, లోటుపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. డీఆర్డీఓ, విద్యాశాఖ అధికారు లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలు గడువులోగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వివరాలను ఈఈ హీర్యానాయక్తో కలెక్టర్ తెలుసుకున్నారు. పదో తరగతి పరీక్షల ఏర్పాట్లు, బాబుజీ జాతర, ఆస్తిపన్ను వసూలు, ఎల్ఆర్ఎస్, ఈజీఎస్ పనులపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎంహెచ్ఓ డా.సౌభాగ్యలక్ష్మి, డీఈఓ గోవిందరాజులు, జీసీడీఓ నర్మద, డీపీఓ సుధాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ ఉన్నారు. -
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
నారాయణపేట: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఏఐకేఎస్ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో భూ సంరక్షణ కమిటీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం న్యాయబద్ధంగా రైతుల నుంచి భూములు సేకరించకుండా.. పోలీసులను పెట్టి భూ సేకరణ చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, సొంత జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం రైతుల కడుపు కొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రైతులతో చర్చించి భూమికి బదులు భూమి ఇవ్వాలని.. లేదా బహిరంగ మార్కెట్ రేటుకు మూడింతలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతాంగానికి ఎర్రజెండా అండగా ఉంటుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వెన్నంటే ఉంటామని తెలిపారు. సదస్సులో మాజీ వైస్ ఎంపీపీ మహేశ్ కుమార్, రైతు సంఘం నాయకులు వెంకట్రామారెడ్డి, గోపాల్, అంజిలయ్య, మశ్చందర్, రాజు, కేశవ్గౌడు, నారాయణ, సాయికుమార్, నర్సింహులుగౌడ్, లక్ష్మీకాంత్, అరుణ్ పాల్గొన్నారు. -
నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?
ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు ● గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం ● తాజాగా సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా.. ● పెండింగ్ పనులు పూర్తయితేనేపాలమూరు సస్యశ్యామలం ● నేడు రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈసారైనా పరుగులు పెట్టేనా? ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తికాలేదు. మొత్తం 12.50 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 2015లో తొలుత రూ.35,200 కోట్ల అంచనాతో మొదలైన ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలోనే అంచనా వ్యయం రూ.52,056 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కింద పంపుహౌస్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా.. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అన్నిచోట్ల కీలకమైన మోటార్ల బిగింపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదటి లిఫ్టు వద్ద ఒక్క మోటారును మాత్రమే ప్రారంభించారు. నార్లాపూర్ సమీపంలో మొదటి లిఫ్టు వద్ద రెండు మోటార్లు, ఏదుల సమీపంలో రెండో లిఫ్టు వద్ద నాలుగు మోటార్లు, వట్టెం సమీపంలో మూడో లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల చొప్పున బిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ● కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించేందుకు కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం ఏడాదికి రూ.200 కోట్ల వరకు నిధులు అవసరం కానున్నాయి. ● రేవంత్రెడ్డి సీఎం అయ్యాక కొడంగల్– పేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులకు సంబంధించిన సర్వే మూడు దశల్లో పూర్తి కాగా.. ప్రాజెక్టు డీపీఆర్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు దశాబ్దాలుగా.. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2005 లో చేపట్టిన నెట్టెంపాడు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులకు నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ పనులు పూర్తి చేయాలంటే రూ.231.36 కోట్లు అవసరం. వీటిని విడుదల చేస్తే రెండేళ్లలో పెండింగ్ పనులు పూర్తయ్యి నడిగడ్డలో కొత్తగా 58 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ర్యాలంపాడుకు మరమ్మతు.. నెట్టెంపాడు ప్రాజెక్టులో గుండెకాయగా చెప్పుకొనే ర్యాలంపాడు రిజర్వాయర్కు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో 4 టీఎంసీల సామర్థ్యం గల జలాశయంలో ప్రస్తుతం 2 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకునే పరిస్థితి. దీని మరమ్మతుకు సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి చేసి సుమారు రూ.137 కోట్ల అంచనాతో నివేదిక ప్రభుత్వానికి పంపారు. దీని మరమ్మతుకు అవసరమైన నిధుల కేటాయింపుపై రైతన్నలు ఆశలు పెట్టుకున్నారు. ● రెండేళ్ల కిందట రూ.581 కోట్లతో చేపట్టిన గట్టు ఎత్తిపోతల పథకం కింద కేటీదొడ్డి, గట్టు మండలాల్లో కొత్తగా 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 40 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రస్తుతం రూ.285.19 కోట్లు అవసరం ఉన్నట్లు అధికారులు నివేదిక పంపారు. ● ఆర్డీఎస్ ప్రాజెక్టులో భాగంగా తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోసి 87,500 ఎకరాలకు అందించేలా రూ.1,197.77 కోట్లతో ఎనిమిదేళ్ల కింద తుమ్మిళ్ల లిఫ్టు చేపట్టారు. ఇందులో రూ.629.26 కోట్ల పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ది అదే దారి.. కోయిల్సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్సాగర్ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్హౌస్ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్హౌస్ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. కోయిల్సాగర్ బ్యాక్వాటర్ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్ చౌదర్పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. సంగంబండ సైతం.. 2003లో మక్తల్ మండలం చిన్నగోప్లాపూర్ దగ్గర కాల్వ పనులు ప్రారంభించారు. 2004లో జలయజ్ఞం భీమా ఫేజ్–1, ఫేజ్–2లకు జీఓ నం.166 విడుదల చేయగా రూ.1,426 కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే కాల్వల పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో.. 2017లో మళ్లీ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. ఈ రెండు రిజర్వాయర్ల కింద పనులు దాదాపు 90 శాతం పూర్తి చేశారు. అయితే పొలాలకు సాగునీరందించేందుకు పిల్ల కాల్వలు పూర్తి కాకపోవడంతో మెయిన్ కెనాళ్ల ద్వారా చెరువులు నింపుతున్నారు. -
స్వయం ఉపాధికి ఊతం
నర్వ: ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీపై అందించే రుణాల కోసం నిరుద్యోగ యువత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరు ప్రక్రియ అటకెక్కడంతో యువతీ యువకులకు స్వయం ఉపాధి కరువైంది. కొందరికి ప్రైవేటు ఉద్యోగాలు సైతం లేక తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆర్థిక స్వాలంబన దిశగా.. నిరుద్యోగ యువత ఆర్థిక స్వాలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు రాయితీపై రుణాలు అందించేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని యూనిట్లు మంజూరు చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17 నుంచి ప్రారంభమైంది. అర్హులైన యువత https///tgobmmsnew.cgg. gov.in పోర్టల్లో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్జీదారులు తమ యూనిట్లకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలి. సంబంధిత కార్పొరేషన్తో పాటు కలెక్టర్ పర్యవేక్షణలో మండలస్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి తుది జాబితాను ప్రకటిస్తారు. అర్హుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2017–18 నుంచి జిల్లాలో ఇలా.. ● జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరం బీసీ కార్పొరేషన్ రుణాల కోసం యువత దరఖాస్తు చేసుకోగా.. రూ. 50వేల సబ్సిడీ ఉన్న పథకాలను మాత్రమే అధికారులు గ్రౌండింగ్ చేశారు. రూ.లక్ష, రూ. 2లక్షల రుణాలను మంజూరు చేయలేదు. 2018–19, 2019– 20, 2020–21లో ఒక దరఖాస్తుదారుడికి కూడా పైసా రుణం అందలేదు. ● 2017–18లో సబ్సిడీ రుణాల కోసం ఎస్టీ నిరుద్యోగ యువత 584 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 543 మందికి రుణాలు మంజూరయ్యాయి. మొత్తం 96.91 శాతం అచీవ్మెంట్ సాధించారు. ఇదే ఏడాది గిరిజనల కోసం రూ. 440లక్షలు మంజూరు కాగా.. ఇందులో 220 మందికి రూ.407.50 లక్షలు అందాయి. 92.61 శాతం అచీవ్మెంట్ సాధించారు. 2018–19, 2019–20 సంవత్సరాల్లో ఎలాంటి రుణాలు ఇవ్వలేదు. 2020–21, 2021–22 సంవత్సరాల్లో 697 మందికి రూ. 927.28 లక్షలు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం మండలాల వారీగా అర్హుల నుంచి అకౌంట్లు సేకరించారు. ● జిల్లాలో మైనార్టీ యువత పరిస్థితి దారుణంగా ఉంది. కార్పొరేషన్ పరిధిలో వారికి ఇప్పటి వరకు ఎలాంటి రుణాలు మంజూరు కాలేదు. పేరుకే కార్పొరేషన్ ఉందని.. ఎలాంటి రుణాలు అందవని మైనార్టీ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై టైరు పంక్చర్ దుకాణాలు, పండ్ల దుకాణాలు, పాన్ డబ్బాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరుచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పథకం ద్వారా ప్రయోజనాలు.. ఒక్కో లబ్ధిదారుకు రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ. 3లక్షల వరకు ఆర్థికసాయం అందించనున్నారు. రూ.లక్షకు 80శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు మిగతా 20 శాతం బ్యాంకు ద్వారా రుణం అందజేస్తారు. రూ. 2లక్షలకు 70 శాతం సబ్సిడీ, 30శాతం బ్యాంకు రుణం మంజూరు చేస్తారు. రూ. 3లక్షలకు 50 శాతం బ్యాంకు రుణం అందించనున్నారు. ఈ ఆర్థికసాయంతో చిరువ్యాపారాలు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందే అవకాశాలు మెరుగుపడతాయి. రుణాల మంజూరులో జాప్యం గత ప్రభుత్వ హయాంలో రుణాల మంజూరులో జాప్యం జరగడంతో నిరుద్యోగ యువత నిరాశకు గురయ్యారు. అయితే వరుస ఎన్నికలు వచ్చిన సమయంలో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తుందని ఆశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాల మంజూరు ఉంటుందనుకున్నారు. అయితే ముందస్తు ఎన్నికల తర్వాత పంచాయతీ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్, మున్సిపోల్స్ ఇలా వరుస ఎన్నికలతో అర్థాంతరంగా రుణాలకు బ్రేక్ పడింది. ఇలా అన్ని ఎన్నికలు పూర్తయినా నేటికీ ఎలాంటి రుణాలు మంజూరు కాకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘రాజీవ్ యువ వికాసం’తో సబ్సిడీపై రుణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు అవకాశం కొన్నేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అర్హుల ఎంపిక విధానంపై స్పష్టత కరువు సద్వినియోగం చేసుకోవాలి.. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సంకల్పంతో రాజీవ్ యువ వికాసం పథకం తీసుకువచ్చింది. ఈ పథకానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు జారీ కాలేదు. ఆన్లైన్లో దరఖాస్తులు మాత్రం ప్రారంభమయ్యాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం అర్హులైన వారికి రుణాల మంజూరు ఉంటుంది. – అబ్దుల్ ఖలీల్, జిల్లా బీసీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారి -
చిల్డ్రన్ హోం తనిఖీ
నారాయణపేట: పట్టణంలోని బారంబావి దగ్గర ఉన్న చిల్డ్రన్స్ హోంను సీనియర్ సివిల్ జడ్జి వింద్యానాయక్ సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. హాజరు పట్టిక, వసతులను పరిశీలించడంతోపాటు హోంలో పనిచేస్తున్న స్టాఫ్ మెంబర్స్ డైలీ వస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఆహార ధాన్యాల నాణ్యత, తాగు నీరు, పరిశుభ్రత, సీసీటీవీ పనితీరు, సిబ్బంది మూమెంట్ రిజిస్టర్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అనేదానిపై వివరాలు సేకరించారు. 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సొంత వాళ్లలా వారిని చూసుకోవాలని సిబ్బందిని జడ్జి ఆదేశించారు. భగత్సింగ్ను ఆదర్శంగా తీసుకోవాలి నారాయణపేట ఎడ్యుకేషన్: దేశాన్ని పట్టి పీడిస్తున్న పెట్టుబడిదారి వ్యవస్థకు, మతోన్మాదం, కులతత్వాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యు వతరం, ప్రజలు భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా భగత్సింగ్ వర్ధంతి సభలను నిర్వహించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో భగత్సింగ్ 94వ వర్ధంతి వాల్పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. భారత ఉపఖండంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటీష్ సామ్రాజ్యవాద చేతిలో ఉరి తీయబడి దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణ పాయంగా వదిలేశారన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం కుహానా దేశభక్తిని బట్టబయలు చూస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న భారత ప్రజలపై అనుసరించే దుశ్చర్యలకు వ్యతిరేకంగా భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సభలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీవైఎల్ ఉపాధ్యక్షుడు సలీం, మారుతి, గౌస్, శ్రీకాంత్, రాము, విష్ణు, గణేశ్, రాహుల్, మహేశ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. అలివేలు మంగ హుండీ లెక్కింపు మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయారు హుండీ లెక్కింపు సోమవారం చేపట్టారు. ఈ ఏడాది అమ్మవారికి హుండీ ద్వారా రూ.9,73,440 ఆదాయం వచ్చింది. లెక్కింపులో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు సుధా, అలివేలు మంగమ్మ, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు దైవంతో సమానం
మద్దూరు: సృష్టిలో తల్లిదండ్రులను మించిన దైవం లేదని, వారిని పూజిస్తే దేవుడిని పూజించినట్లే అని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని పెదిరిపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులు.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను పూజించే పాదపూజ కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన అడిషనల్ కలెక్టర్ బెన్షాలం, ట్రైనీ కలెక్టర్ గరిమానరులు, డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువతో కూడిన విద్యతో పాటు, ఇలాంటి సామాజిక సృమ ఉన్న కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. నేటి తరం యువతలో తల్లిదండ్రులను చులకనగా చూసే భావన పెరిగిపోయిందని, దాన్ని నివారించడానికే ఇలాంటి కార్యక్రమం చేపట్టినట్లు పాఠశాల హెచ్ఎం బాలకిష్టప్ప తెలిపారు. ఉన్నత పాఠశాల దశకు వచ్చే వరకు విద్యార్థులు తల్లీదండ్రుల మాటలను పట్టించుకోకపోవడం, మేము పెద్దవాళ్లమనే భావన ఏర్పడుతుందని, దీన్ని నివారించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాలలోని 247 విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులచే పాదపూజ కార్యక్రమాన్ని యోగా గురువు రమేష్, గాయాకుడు చింతరంజన్దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తల్లీదండ్రుల పాదాలకు అభిషేకం, పూలమాలతో అలంకరించి శాస్త్రోతంగా పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు అహుతులను అలరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్, శబరి, స్వప్న, రవీందర్రెడ్డి, రవీందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
రమణీయం.. రథోత్సవం
మాగనూర్: వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నడుమ.. అంగరంగ వైభవంగా పశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాముల రథోత్సవం సాగింది. మండలంలోని నేరడగంలో సోమవారం ఉదయం నుంచి మఠంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మఠాధిపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలలో ప్రధాన ఘటమైన స్వామివారి రథోత్సవానికి భక్తులు తరలివచ్చారు. మఠంలో ప్రత్యేక పూజలు ఆనంతరం సిద్ధలింగ మహాస్వాముల వారి విగ్రహాన్ని పురోహితుల వేదమంత్రాలు.. భక్తుల శరణుఘోష.. కాగడాల నడుమ రథంపై ఉంచారు. అనంతరం తేరును ముందుకు లాగారు. ఘనంగా సామూహిక వివహాలు.. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం మఠం ఆవరణలో సామూహిక వివాహాలు నిర్వహించారు. మొత్తం 14 జంటలకు వివాహాలు జరిపించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వాదించారు. నేరడగంలో రథాన్ని ముందుకు లాగుతున్న భక్తులు పశ్చిమాద్రి సిద్ధలింగ మహాస్వాములకు ప్రత్యేక పూజలు నేరడగంలో కనులపండుగగా సామూహిక వివాహాలు -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 30 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, బెంషాలం, ఆర్డీఓ రాంచంద పాల్గొన్నారు పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని చట్టప్రకారం పరిశీలించాల్సిందిగా సీఐలు, ఎస్ఐలకు ఫోన్లో సూచించారు. ఒకవేళ ఫిర్యాదు పెండింగ్లో ఉంటే వాటికి సంబంధించిన సమాచారం ఫిర్యాదు దారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలని ఎస్పీ తెలిపారు. -
చెత్త కాల్చేస్తున్నారు..
కోస్గి పట్టణంతో పాటు వీలిన గ్రామాలైన పోతిరెడ్డిపల్లి, సంపల్లి, మల్రెడ్డిపల్లి, మాసాయపల్లి నుంచి రోజూ చెత్తను సేకరిస్తున్నారు. డంపింగ్ యార్డు కోసం పట్టణ శివారులో ఏడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి రూ.40 లక్షల నిధులు సైతం కేటాయించారు. ఈమేరకు టెండర్లు వేసి నెలలు గడుస్తున్నా నేటికి డంపింగ్ యార్డు నిర్మాణ పనులు చేపట్టలేదు. అదే స్థలంలో రోజు చెత్తను డంపింగ్ చేస్తున్నారు. వారం పది రోజులకు ఒకసారి చెత్తకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగతోపాటు చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని జనం వాపోతున్నారు. సీఎం రేవంత్రెడ్డి డంపింగ్ యార్డుపై దృష్టి సారించి రాష్ట్రంలోనే నంబర్ వన్ డంపింగ్యార్డును నిర్మించి ఇవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
సేకరణలో నిర్లక్ష్యం
మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ రోజు విడిచి రోజు చేస్తున్నారు. ఒక ట్రాక్టరు ఒక మినీ ఆటో ద్వారా చెత్త సేకరణ చేస్తూ డంపింగ్ యార్డు స్థలానికి చేర్చుతున్నారు. రేణివట్లలో ఒక ట్రాక్టర్ ద్వారా ప్రధాన రహదారి వెంబడి చెత్తను సేకరిస్తూ చెత్తను కాలుస్తున్నారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయడం గగనం అయిపోయింది. మద్దూర్లోని ఎస్సీ బాలుర హాస్టల్ దగ్గర రోడ్డుపైనే చెత్తను వేస్తున్నారు. కాపు గేరి, అమరగడ్డ, మీదిగిరి తదితర ప్రాంతాల్లో చెత్త తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. -
కొరవడిన చెత్త‘శుద్ధి’
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు ఉన్నా చెత్తపై చిత్తశుద్ధి అంతంతగానే కనిపిస్తోంది. కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులు లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది. ప్రతి పల్లె, పట్టణాల్లో డంపింగ్ యార్డులు నిర్మించి వాహనాల ద్వారా చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నప్పటికీ మున్సిపాలిటీల్లో మాత్రం నేటికి డంపింగ్ యార్డులు లేకపోవడంతో పట్టణ శివార్లలో పాడుబడ్డ బావులు, ప్రధాన రోడ్ల వెంట చెత్తను వేస్తున్నారు. దీంతో చెత్త నుంచి వచ్చే దుర్వాసనతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో చెత్త సేకరణ చేపడుతున్నప్పటికీ ఆటోలో తడి,పొడి చెత్తను వేర్వేరు వేయాలని రాసి పెట్టారు. కానీ జనం తడి,పొడి చెత్తను ఒకే దానిలో వేస్తుండడం, నేరుగా ఆటోలో తీసుకెళ్లి డంపింగ్ యార్డులో వేస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేసేందుకు అక్కడి సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. వీలిన గ్రామాలు చెత్తమయం మక్తల్ మున్సిపాలిటీలో తిర్మలాపూర్, చందాపూర్ విలీనమయ్యాయి. మక్తల్ పట్టణంలో సేకరించిన చెత్తను నగర శివారులోని కానాపూర్కు వెళ్లే రహదారిలో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. తిర్మలాపూర్, చందపూర్లో సేకరించిన చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. వీలిన గ్రామాలపై మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదంటూ ఆయా గ్రామాల జనం వాపోతున్నారు. మద్దూర్, కోస్గిలో కానరానిసేంద్రియ ఎరువుల తయారీ పేట, మక్తల్లో తడి, పొడి చెత్త వేర్వేరు చేసేందుకు నానా అవస్థలు దుర్గందభరింతగా డంపింగ్ యార్డులు పట్టించుకోని అధికారులు, సిబ్బంది -
రోడ్డుపై వదిలేస్తున్నారు
మక్తల్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో చెత్త నిల్వలు అలాగే ఉండిపోతున్నాయి. ఆ ప్రాంతం మొత్తం దుర్గందభరితంగా మారుతున్నాయని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పైన చెత్త అలాగే వదిలేసి వెళ్తున్నారు. వెంటనే చెత్తను తొలగించాలి. – నాగప్ప, మక్తల్ దుర్వాసన భరించలేకున్నాం.. పట్టణంలో సేకరించిన చెత్తను మా పొలంల గుండా తీసుకెళ్లి ప్రభుత్వ భూమిలో డంప్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు లేకపోవడంతో చెత్త కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వస్తోంది. పొలాలకు వెళ్లాలంటేనే వాసనకు భరించలేక పోతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్ యార్డు నిర్మించి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. – నర్సిములు, సమీప పొలం రైతు, కోస్గి ● -
పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుదాం..
మక్తల్/మాగనూరు/ఊట్కూర్: మక్తల్ నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు.. ఊట్కూర్ పులిమామిడి గుట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా.. నేరడగంలో పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం సమీప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మంత్రి మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్ మండలాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు. ముందుగా జక్లేర్ గ్రామంలోని పురాతనమైన శివాలయాన్ని సందర్శించారు. శివరాత్రి సమయంలో శివస్వాములు మాలధారణ, సేద తీరేందుకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మంత్రి అన్నారు. ● మాగనూర్ మండలంలోని నేరడగం శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం బ్రహ్మోత్సవాల్లో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. సిద్ధలింగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అడుగంటిపోతున్న విలువలను పునరుద్ధరించడానికి ఈ మఠాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, మన సంస్కృతి, సనాతన ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించడం వీటి వల్లే సాధ్యమవుతుందని అన్నారు. రూ.50 లక్షలు అన్నదాన కార్యక్రమానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నిరంతరం నీరు ఉండే ఈ సంగంబండ ప్రాజెక్టుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో శ్రీమన్ మహారాజా నిరంజన జగద్గురు ఫకిర దింగాలెస్వర మహాస్వాములు, బిజ్వార్ ఆదిత్య పరాశ్రీ, నియోజక వర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గురుమిట్కల్ ఎంఎల్ఏ కందుకూరు శరణ్గౌడా, పంచమ సిద్ధలింగ మహాస్వామి తదితరులు పాల్గొన్నారు. ● ఊట్కూరు మండలంలోని పులిమామిడి గుట్టపై ఉన్న రామలింగేశ్వక ఆలయాన్ని మంత్రి, ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరుస్తానని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పులిమామిడి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం అందించారు. -
స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన
నారాయణపేట: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీష్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి సలీం మాట్లాడుతూ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం తగ్గలేదని, దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి మద్దతుగా వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. స్పీకర్కు క్షమాపణ చెప్పాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ మాజీ మంత్రిని, బీఆర్ఎస్ నాయకులను తిరగనియ్యకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కోట్ల మధుసూదన్రెడ్డి, మహేష్, సతీష్ గౌడ్, రమేష్,సూర్యకాంత్, రాజేష్, శరణప్ప, మహిముద్ ఖురేషి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దారిలో.. అవస్థల ప్రయాణం
కేంద్రానికి ప్రతిపాదించాం.. స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది. – మల్లు రవి, ఎంపీ, నాగర్కర్నూల్ -
మైనార్టీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు
స్టేషన్ మహబూబ్నగర్: మైనార్టీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 మైనార్టీ గురుకుల కళాశాలలు కొనసాగుతుండగా.. వీటిలో 10 బాలుర, 10 బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. కాగా.. మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025– 26 ప్రవేశాల కోసం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 వరకు ఆన్లైన్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లాలోని 20 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,600 సీట్లు ఉన్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రెండు ఒకేషనల్ మైనార్టీ బాలికల– 2 గురుకుల జూనియర్ కళాశాల (అడ్వాన్స్ అండ్ టాక్సేషన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ), బాలుర– 3 జూనియర్ కళాశాలలో (ఎంఎల్టీ, కంప్యూటర్ సైన్స్) 80 సీట్లు, మిగతా 18 జనరల్ మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో చెరో 80 సీట్లు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం.. ఒక్కో మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఒక్కో గ్రూప్లో 40 సీట్ల చొప్పున రెండు గ్రూప్ల్లో 80 సీట్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో మైనార్టీలకు 75 శాతం రిజర్వేషన్ల ప్రకారం 30, (ముస్లింలకు 26, క్రిస్టియన్లు 2, జైన్స్, పార్సిస్, బుద్దిస్ట్, సిక్కులకు 2 సీట్లు), ఇతరులకు 25 శాతం రిజర్వేషన్ల ప్రకారం 10 (ఎస్సీ 2, ఎస్టీ 2, బీసీ 5, ఓసీ 1) సీట్లు కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లాలో 20 కాలేజీలు.. 1,600 సీట్లు ఈ నెల 31 వరకు దరఖాస్తులకు అవకాశం నాణ్యమైన విద్య.. మైనార్టీ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపా టు మెరుగైన వసతి సౌకర్యాలు అందిస్తున్నాం. విద్యార్థులు కళా శాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రవేశాలకు సంబంధించి మిగతా సమాచారాన్ని సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలి. – ఖాజా బాహుద్దీన్, ఆర్ఎల్సీ, మహబూబ్నగర్ -
ఒత్తిడి అధిగమిస్తేనే విజయం
నారాయణపేటపదో తరగతి విద్యార్థులకు విషయ నిపుణుల సూచనలు సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025● దస్తూరిపై దృష్టి పెడితే అదనపు మార్కులు ● పంచ సూత్రాలు పాటిస్తే.. ఆందోళన అక్కర్లేదు ● 21 నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం నారాయణపేట రూరల్: ఈనెల 21 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్షల్లో విజయానికి ప్రణాళిక బద్ధంగా చదవడం సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయి ప్రతికూల ఆలోచనలతో ఆందోళన చెందుతుంటారు. దీంతో పరీక్షలు అంటే విద్యార్థులకు భయం ఏర్పడడం సహజం. ఇలాంటి సమయాల్లో ఎంతో నేర్పుగా ఉండి, ఆందోళనలను దూరం చేసుకుని స్వేచ్ఛగా పరీక్షలను రాస్తే విజయం సొంతం చేసుకోవచ్చు. ప్రణాళిక బద్ధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు వీలు కలుగుతుంది. పంచ సూత్రాలు పాటిద్దాం ఉపాధ్యాయులు ఇలా చేయాలి.. విద్యార్థులను జీపీఏ, ర్యాంకులు, మార్కుల పేరు తో ఒత్తిడి చేయరాదు. ఇంటి వద్ద పిల్లలు ఎలా చదువుతున్నారు అనే దానిపై తల్లిదండ్రులతో ఆరా తీయాలి. పరీక్షల నేపథ్యంలో ఆందోళన చెందకుండా తరచూ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడి ప్రోత్సహించాలి. విద్యార్థులతో చేయకూడనివి.. విద్యార్థులను ఇతరులతో పోల్చి వాళ్లలోని ఆత్మనున్యత భావాన్ని కలిగించరాదు. వారిని భోజనం చేయడానికి ఒంటరిగా వదలకుండా వారితో కలిసి కడుపునిండా భోజనం చేసేలా చూడాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ వాళ్ల అవసరాలు ఎప్పటికప్పుడు తీర్చాలి. వారిపై అత్యాశలు పెట్టుకొని వారిని చదవాలంటూ తరచూ ఒత్తిడికి గురిచేయొద్దు. తల్లిదండ్రులు, టీచర్లు వారి ఆశలను పిల్లలపై రుద్ది ఇబ్బందులకు గురి చేయరాదు. వైద్యులతో కౌన్సెలింగ్ పరీక్షలు అంటేనే భయానికి గురయ్యే విద్యార్థులకు ఒత్తిడి బారిన పడకుండా స్థానిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. విషయాల వారీగా ఎలా సిద్ధం కావాలని తెలియజేస్తూ ప్రశాంతంగా ఉండేందుకు సలహాలు సూచనలు చేయాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర కలిగి ఉండడం, యోగా ధ్యానం చేసే విధంగా ప్రోత్సహించాలి. టీవీ సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చదువుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలి. బట్టీ పట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ధోరణి: విద్యార్థులు మానసిక స్థితి బాగుండాలి. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఎలాంటి ఆందోళన గురికారాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సందేహాలను నివృత్తి చేసుకొని బృంద చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నమ్మకం: సబ్జెక్టుల వారీగా పట్టు సాధించేందుకు కృషి చేయాలి. ముందుగా తనపై తనకు నమ్మకం కలిగి ఏదైనా సాధించగలమనే దీమా పెంచుకోవాలి. లక్ష సాధనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవాలి. ఏకాగ్రత: పాఠ్యాంశాలను చదివే క్రమంలో పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి. చదివే సమయంలో ఆలోచనలు, చూపు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. నిత్యం ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ: పరీక్షల సమయంలో సామాజిక మాద్యమాలకు దూరంగా ఉండాలి. సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలపైనే దృష్టి పెట్టాలి. చదువును వదిలి పక్కదారి పట్టే విధంగా కాకుండా క్రమశిక్షణగా మెలగాలి. దృష్టి: విద్యార్థుల దృష్టి పూర్తిగా చదువుపై కేంద్రీకరించాలి. వ్యసనాలకు దూరంగా ఉండి పుస్తకాలతోనే గడపాలి. టీచర్లు, పేరెంట్స్ విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి కఠిన అంశాలపై పట్టు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. సులువైన వాటిని చివరకు చదివే విధంగా సూచనలు చేయాలి. అందమైన చేతి రాతతో.. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించేందుకు అందమైన చేతి రాత ఎంతో ఉపకరిస్తుంది. అక్షరాలను ఆకట్టుకునే విధంగా గుండ్రంగా రాస్తూ పదాలకు పదాలకు మధ్య సమదూరాన్ని పాటించాలి. అక్షరాలన్నీ ఒకే సైజులో ఉండేలా, అక్షర దోషాలు లేకుండా కొట్టివేతలకు తావుగకుండా చూసుకోవాలి. ఆటంకంగా నీటి ఊట ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్య లకు నీటి ఊట ఆటంకం మారుతోంది.వివరాలు 8లో u -
ఆవిష్కరణలకు గుర్తింపు
పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు ● ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్ హక్కులు ● డిజైన్ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి, పరిశీలనలలో మరొకటి ● గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్ రైట్స్ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్ రైట్ రావడంతో టీచర్స్ అసోసియేట్ షిప్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫెల్లోషిప్ అధ్యాపకులు చంద్రకిరణ్ ఎంపికయ్యారు. మ్యాథ్స్ విభాగంలో అధ్యాపకులు రిమోట్ కంట్రోల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తయారీ, రోలర్ స్టాంప్ తయారీకి డిజైన్ విభాగంలో పేటెంట్ రాగా.. స్ట్రెచింగ్ షీట్పై కాసన్ నానోఫ్లూయిడ్స్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్లైన్ ట్రేడింగ్ ప్రిడెక్టర్ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్స్, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్● రోలర్ స్టాంప్ పరికరాన్ని మ్యాథ్స్ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్ రైట్ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది. ● రసాయన శాస్త్రంలో కెమికల్స్ ప్రాసెసింగ్, ఏరో స్పేస్, బయో మెడికల్ ఇంజినీరింగ్ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్ షీట్పై కానస్ నానోఫ్లూయిడ్ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్ రైట్ పరిశీలనలో ఉన్నాయి. -
కీలకంగా పర్యావరణహిత రీ ఏజెంట్లు
రసాయన పరిశ్రమలు, ట్యాబ్లెట్లు, ఇతర పరిశ్రమల్లో కెమికల్స్ తయారు చేసేందుకు రీ ఏజెంట్లు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇందులో రీ ఏజెంట్లు మొదట తయారు చేసేందుకు పెద్ద పరిశ్రమలను స్థాపించడం, పెట్టుబడి, ఇతర పర్యావరణానికి నష్టం చేసే విధంగా ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. కానీ, పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చేసిన ప్రయోగాలు పూర్తిగా పర్యావరణ హితం కానున్నాయి. సాధారణ గది ఊష్టోగ్రతల వద్ద చిన్న గదుల్లో సైతం రీ ఏజెంట్లను శాసీ్త్రయ పద్ధతిలో తయారు చేసే విధానాన్ని కొనుగొనడంతో మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పేటెంట్ రైట్ ప్రకటించింది. ఇందులో అధ్యాపకులు చంద్రకిరణ్, సిద్ధరామగౌడ్, రీసెర్చి స్కాలర్ స్వాతి భాగస్వాములయ్యారు. వీటితోపా టు మరో 20 రీఏజెంట్లో పరిశోధనలో ఉన్నాయి. -
ప్రాధాన్యం ఇస్తున్నాం..
యూనివర్సిటీలో అధ్యాపకులు, ఇటు రీసెర్చ్ స్కాలర్ ఎంతో ఉత్సహంగా పరిశోధనలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కొన్ని పేటెంట్లు కూడా వచ్చాయి. దీని ద్వారా పీయూకు ప్రాజెక్టులు, రీసెర్చ్ పరమైన అంశాల్లో ముందంజ వేస్తున్నాం. నిర్మాణంలో రీసెర్చ్ ఫెసిలిటీ భవనం ఉంది. అది అందుబాటులోకి వస్తే పీయూ రీసెర్చ్ హబ్గా మారనుంది. అందులో పూర్తిస్థాయిలో ల్యాబ్లో అధునాతన ప్రయోగ పరికరాలు అందుబాటులోకి తీసుకువస్తాం. – శ్రీనివాస్, వైస్ చాన్స్లర్, పాలమూరు యూనివర్సిటీ ● -
హక్కులపై అవగాహన ఉండాలి
నారాయణపేట: వినియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పనిసరి అని, ఏదైనా ఒక వస్తువు కొని, ఆ వస్తువు నకిలీ లేదా నాసీరకం అయితే ఆ వస్తువుని అమ్మిన వ్యాపారి పై లేదా ఉత్పత్తిదారులపై వినియోగదారుల ఫోరంలో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చన్నారు. డీఏఓ జాన్ సుధాకర్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కుల చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు జరిగేలా చూడాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని అన్నారు. ఫోరం సభ్యుడు అశోక్, హజమ్మ మాట్లాడుతూ.. పుట్టిన పిల్లాడి నుంచి చనిపోయే వరకు అందరూ వినియోగదారులే అవుతారని, కల్తీ రహిత సమాజాన్ని నిర్మించాలంటే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బంగారం నుంచి మొదలుకొని పాలిథిన్ కవర్ వరకు ప్రతీ వస్తువుకు అది మంచిదా? లేక నకిలీదా అని తెలిపేందుకు హాల్ మార్క్, ఐఎస్ఐ లాంటి గుర్తులు ఉంటాయని, వాటిని చూసిన తర్వాతే మనం కొనుగోలు చేయాలని వారు సూచించారు. సమావేశంలో పలువురు ఫోరం సభ్యులు, రేషన్ డీలర్లు వినియోగదారుల హక్కుల చట్టం తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నిటిని కలెక్టర్కు నివేదించడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బాల్రాజ్ తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం మాసన్న, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి
నారాయణపేట రూరల్: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ గోవిందరాజు సూచించారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీచర్లు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించి, మధ్యాహ్న భోజన నిర్వహణపై వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి దశలో టెన్త్ గేమ్ చేజర్ అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒత్తిడికి గురికాకుండా యోగ, ధ్యానం చేయాలన్నారు. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ సరిపడా నిద్ర పోవాలన్నారు. సందేహాలను నివృత్తి చేసుకొని భయం లేకుండా పరీక్షలకు హాజరు కావాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను, ఇతర పరికరాలను కేంద్రంలోకి తీసుకొని వెళ్లరాదని సూచించారు. కార్యక్రమంలో హెచ్ ఎం భారతి, డీఎస్ఓ భాను ప్రకాష్, ఎండిఎం ఇంచార్జ్ యాదయ్య శెట్టి పాల్గొన్నారు. -
రిమోట్ కంట్రోల్తో ఆక్సిజన్..
పీయూ మ్యాథ్స్ విభాగంలో పేటెంట్ రైట్స్ దృష్టిసారించింది. ఇందులో డిజైన్ విభాగంలో శ్వాసకోశ రోగులకు ఆక్సిజన్ థెరపీ అందించేందుకు రిమోట్ కంట్రోలర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ రూపొందించారు. ఇందులో పేషెంట్ ఆరోగ్యం, పరిస్థితి తదితర అంశాలను కాన్సన్ట్రేటర్ పరిశీలించిన తర్వాత రోగికి ఆక్సిజన్ అందిస్తుంది. అయితే రోగికి మ్యానువల్ పద్ధతిలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉండే నేపథ్యంలో కేవలం రిమోట్ కంట్రోల్ ద్వారా ఆక్సిజన్ను అవసరం మేరకు అందిస్తే ఇబ్బందులు తప్పనున్నాయి. ఇందులో పలు యూనివర్సిటీలకు చెందిన అధ్యాపకులు శంకర్రావు, మధు, భారతి, సత్తమ్మ, లిపిక, అరుంధతి పాలుపంచుకున్నారు. -
ఒత్తిడి అధిగమిస్తేనే విజయం
కొత్తపల్లి: విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయాలని.. ఒత్తిడిని అధిగమిస్తేనే పరీక్షల్లో విజయం సాధించవచ్చునని.. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని నిడ్జింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదో తరగతి విద్యార్థుల గతేడాది ఫలితాలను హెచ్ఎంను అడిగి తెలుసుకొని.. ఈ ఏడాది మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని, ఈమేరకు విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో తీర్చిదిద్దాలని సూచించారు. ఆయా సబ్జెక్టుల్లో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మరికొద్ది రోజుల్లో జరగనున్న వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేలా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం అల్పాహరం సరైన సమయానికి అందుతుందా లేదా, నాణ్యత ఎలా ఉంది అంటూ విద్యార్థులను ఆరా తీశారు. నాణ్యత లేకుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థుల సబ్జెక్ట్ విషయాలపై పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ఆరా తీస్తూ.. విద్యార్థులతో ముఖాముఖి ప్రశ్నలను అడిగి సమాధానాలు రాబట్టారు. ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. ఆవరణలోని బయో పార్క్లో నాటిన మొక్కలు, వాటి పరిరక్షణ గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులు మమేకమై పూర్తి స్థాయిలో పార్కును సంసిద్దం చేయాలని, అందుకు తగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో పాఠశాలకు బోరు వేయించాలని ఉపాధ్యాయులు కలెక్టర్ను కోరగా.. ఎంపీడీఓ, గ్రామ కార్యదర్శిని తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణారావ్, తహసీల్దార్ జయరాములు, శ్రావణ్, గ్రామ కార్యదర్షి వెంకటేష్, హెచ్ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతపై గొంతు విప్పండి
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంమనిషి సమగ్ర వికాసానికి న్యాయ పరిజ్ఞానం అవసరం అవుతుంది. సమాజంలో ప్రజలు ఉత్తమ వినియోగదారులుగా ఉండాలంటే చట్టాలను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. మార్కెట్లో వ్యాపారులు చేసే మోసాలు గుర్తించి వాటిపై పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. లోపాలు ఉన్న వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వాటి వల్ల వినియోగదారుడు నష్టపోతే దానిని ప్రశ్నించడానికి ఉన్న చట్టాలు ఉపయోగించుకోవాలి. మనుషులు ఉపయోగించే ప్రతి వస్తువును పరీక్షించి నాణ్యత తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి వస్తువు అయినా సక్రమంగా లేకపోతే అలాంటి వస్తువు ఉత్పత్తి చేసిన కంపెనీపై పోరాటం చేసే అవకాశం వినియోగదారుడికి హక్కు ఉంది. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – మహబూబ్నగర్ క్రైం ● ప్రతి వస్తువు నాణ్యతను తెలుసుకోవాలి ● జిల్లాలో వినియోగదారుల హక్కుల కోసం ప్రత్యేక కోర్టు ● ఆశించిన స్థాయిలో ప్రచారం కల్పించని జిల్లా వినియోగదారుల కేంద్రం ఐదేళ్లుగా వినియోగదారుల ఫోరం కోర్టులో కేసుల వివరాలుఎలాంటి కేసులు వేయడానికి అవకాశం ఉంది వినియోగదారులు ఎయిర్లైన్స్, మెడికల్, రైల్వే, బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికాం, పోస్టల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇళ్ల నిర్మాణం, రవాణా, చిట్ఫండ్స్, వ్యవసాయం, కస్టమర్ గూడ్స్, కొరియర్ సర్వీస్, విద్యారంగం, నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వల్ల నష్టపోతే కేసులు వేయడానికి అవకాశం ఉంది. నమోదైన కేసులుపెండింగ్ పరిష్కరించినవి202085 84 12021227 226 1202296 90 62023 80 57 232024101 29 72● జిల్లా వినియోగదారుల హక్కుల ఫోరంలో వినియోగదారులు ఒక్క రూపాయి నుంచి రూ.50 లక్షల వరకు కేసులు వేయడానికి అవకాశం ఉంది. దీంట్లో రూపాయి నుంచి రూ.5 లక్షల వరకు ఉన్న కేసులు కోర్టులో ఉచితంగా వాదిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వరకు కోర్టు ఫీజు రూ.200, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఫీజు రూ.400 ఉంటుంది. రాష్ట్ర కమిషన్లో రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటే కోర్టు ఫీజు రూ.వెయ్యి, రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటే రూ.4వేలు ఉంటుంది. జాతీయ కమిషన్లో రూ.కోటికి పైగా ఉంటే ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ఇదీ నేపథ్యం వినియోగదారుల హక్కుల ఫోరం ఉమ్మడి జిల్లాలో 1988 అక్టోబర్లో ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యేక న్యాయమూర్తితో పాటు, ఒకరు సభ్యులు ఉన్నారు. పరిపాలన కోసం ప్రత్యేక విభాగంతో పాటు ఒక కోర్టు కూడా అందుబాటులో ఉంది. వచ్చిన విని యోగదారుల కేసుల నమో దు చేసుకోవడం కోసం ప్రత్యే క భవనం ఉంది. ● వినియోగదారులఫోరం కోర్టులో ఎలాంటి కేసు వేయాలి, వాటి వివరాలు తెలుసుకోవడానికి స్థానికంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా వినియోగదారుడు ఎలాంటి న్యాయవాది లేకుండా కోర్టులో కేసు వేయడానికి అవకాశం కల్పించారు. ● ఏదైనా ఒక వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత ఆ వస్తువు నాసిరకంగా ఉండటం లేదా మరమ్మతుకు గురైతే అప్పుడు సెక్షన్ 35 ప్రకారం వినియోగదారుల ఫోరం కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన 30 రోజుల వ్యవధిలో సదరు వ్యక్తి లేదా సంస్థకు నోటీస్ ఇవ్వగా 45 రోజుల వ్యవధిలో దీనికి సమాధానం చెప్పాలి. లేకపోతే కోర్టు ఎక్స్పార్టీ చేసి ఆర్డర్ వన్సైడ్ చేసి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇచ్చిన జడ్జిమెంట్పై ప్రతివాది 45 రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలి.. లేకపోతే అప్పీల్ వేసుకోవాలి. అవగాహనే అస్త్రంమారిన చట్టం.. 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో 2019 వినియోగదారుల కమిషన్గా మార్పు చేశారు. 1986 నాటి వినియోగదారుల రక్షణ చట్టంలో ఆన్లైన్లో లేని వస్తువులను లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా కొనుగోలు చేసిన వారికి హక్కులు వర్తించడం కోసం 2019 చట్టం పరిధిలో చేర్చారు. ఈ చట్ట ప్రకారం నాణ్యత లేని వస్తువులను ఉత్పత్తి చేసినందుకు, వాటిని విక్రయించడానికి ప్రకటనల్లో నటించే సెలబ్రెటీలకు సైతం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించే విధంగా రూపొందించారు. అలాగే ఆన్లైన్ ద్వారా విక్రయించే వస్తువులకు సంబంధించి పూర్తి వివరాలతో మార్కెట్లోకి విడుదల చేయాలి. నాణ్యత లేని వస్తువులు విక్రయిస్తే వస్తువులు ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మిన వ్యక్తులపై కేసులు వేయడానికి చట్టంలో సవరణ తెచ్చారు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి జిల్లాలో ప్రతిరోజు హక్కుల ఫోరానికి రెండు నుంచి మూడు వరకు కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, చిట్ఫండ్, ఫైనాన్స్లో నష్టపోయిన వాళ్లు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరూ రావడం లేదు. పట్టణ ప్రాంతాల నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే కేసులు వేయడానికి వస్తున్నారు. ఇంకా ప్రజల్లో దీనిపై చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన కేసులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వినియోగదారులు ఎలాంటి కేసులు వేయడానికి అవగాహన లేకుంటే 08542–245633 నంబర్కు ఫోన్ చేయాలి. – సృజన్కుమార్, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూపరింటెండెంట్ -
ఉపయోగకరంగా ఉంది..
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే డిజిటల్ నైపుణ్యాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధాను పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రాథమిక తరగతుల విద్యార్థులకు నేర్పించడం వల్ల చదువుతోపాటు, పఠనా సామర్థ్యాలు పెరుగుతున్నాయి. పిల్లల స్థాయిని బట్టి కంప్యూటర్ బోధన ఉండటంతో మరింత ఆసక్తిగా విద్యార్థులు పాల్గొంటున్నారు. గైర్హాజరు శాతం తగ్గేందుకు ఆస్కారం ఉంది. ప్రయోగాత్మకంగా జిల్లాలో 10 చోట్ల ప్రారంభించాం. విజయవంతం అయితే వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట సులభంగా ఉంది.. ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది. – మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట అర్థం అవుతున్నాయి.. మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి. – భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట ఈ విధానం బాగుంది.. కంప్యూటర్ ద్వారా బోధన ప్రారంభించిన తర్వాత తెలుగు, ఆంగ్లంలో పదాలను అర్థం చేసుకుని బాగా పలుకుతున్నాం. గణితంలోనూ కూడికలు, తీసివేతలు తదితర వాటిని చక్కగా చేయగలుగుతున్నాం. మొదట్లో టీచర్లు ఎంత చెప్పినా నెత్తికి ఎక్కేది కాదు. ప్రస్తుత విధానం బాగుంది. – విజయలక్ష్మి, 4వ తరగతి, కొల్లంపల్లి, నారాయణపేట -
ఇంటర్ పరీక్షలకు126 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా గురువారం ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 16 పరీక్ష కేంద్రాల్లో 3888 మంది విద్యార్థులకుగాను 3762 మంది పరీక్షకు హాజరయ్యారు. 126మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3290 మందికి 3187 మంది, ఒకేషనల్లో 598 మందికి 575 మంది హాజరయ్యారు. జిల్లా కన్వీనర్ పేటలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల నారాయణపేట ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైందని డీఈఓ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఇంటర్ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26వరకు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే, ఇంటర్ ప్రాక్టికల్స్ 26 నుంచి మే 3వ తేదీ వరకు ఉంటాయని, విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించాలని సూచించారు. జిల్లా జడ్జిపై రాష్ట్ర బార్ కౌన్సిల్ విచారణ నారాయణపేట: జిల్లా జడ్జి అబ్దుల్ రఫీపై చర్యలు తీసుకోవాలని పేట బార్ అసోసయేషన్ ఆధ్వర్యంలో గురువారం 6వ రోజు న్యాయవాదులు జిల్లా కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్పాల్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గురువారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గిరిధర్రావు, మధుసూదన్రావు జిల్లా కోర్టుకు వచ్చి విచారణ జరిపారు. జిల్లా జడ్జి న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ కించపరుస్తున్నారని, కోర్టు సిబ్బంది నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, కోర్టు సామగ్రి కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని తక్షణమే చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు వారికి స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది నాగురావు నామాజీ, బార్ అసోసియేషన్ అద్యక్షుడు దామోదర్ గౌడ్, చెన్నారెడ్డి, నందు నామాజీ, బీంరెడ్డి పాల్గొన్నారు. అలసందలు క్వింటాల్ రూ.7,072 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం అలసందలు క్వింటాల్కు గరిష్టం రూ.7,072, కనిష్టంగా రూ.6,982 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్ట, కనిష్టంగా రూ.5,680, వేరుశనగ గరిష్టం రూ.6,020, కనిష్టం రూ.4,110, జొన్నలు గరిష్టం రూ.4,640, కనిష్టం రూ.2,650, ఎర్ర కందులు గరిష్టం రూ.7,314, కనిష్టం రూ.6,339, తెల్ల కందులు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,650 ధరలు పలికాయి. వేరుశనగ క్వింటాల్ రూ.6,989 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262 ధరలు లభించాయి. -
భూసేకరణను వేగవంతం చేయాలి
నారాయణపేట: నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎత్తిపోతల పథకం భూసేకరణ, కోస్గి రోడ్డు విస్తరణ పనులపై రెవెన్యూ, నీటి పారుదల శాఖ, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజక వర్గాలలో భూసేకరణ ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ స్పందిస్తూ.. మొత్తం 556 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఇప్పటి వరకు 16 గ్రామాలలో భూసేకరణ గాను ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని, ఈ గ్రామాల్లో మొత్తం 379.07 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. మిగతా 5 గ్రామాలలో భూసేకరణ ప్రాసెస్ లో ఉందని ఆర్డీవో రాంచందర్ నాయక్ తెలిపారు. అంతకుముందు కోస్గి రోడ్డు విస్తరణ పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీస్తూ.. ఎలాంటి వివాదాలు లేకుండా అర్హతను బట్టి నష్ట పరిహారం చెల్లించి ముందుకు వెళ్లాలని, అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, అధికారులు రాములు, హీర్యా నాయక్, ఉదయ్ శంకర్, బ్రహ్మానందం, సతీష్, సురేష్ పాల్గొన్నారు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి వేసవి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు విధిగా పండ్ల రసాలు, ఇంట్లో తయారు చేసిన పానియాలు తాగాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో ఈమేరకు మాట్లాడుతూ.. కూలీలు పని ప్రదేశంలో చల్లని తాగునీటిని ఏర్పాటు చేసుకోవాలని, కార్మికులు ఎండలో పనిచేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు రాకూడదని అన్నారు. అనంతరం దీనికి సంబంధించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. -
హోలీని సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవాలి
● ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట: జిల్లాలోని ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో.. సంప్రదాయ పద్ధతులు, సహజ సిద్దమైన రంగులతో జరుపుకోవాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. హోళీ పండుగ సందర్భంగా జిల్లాలోని సీఐలతో ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. హోళీకి సంబంధించి రోడ్డు ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన భద్రతాపరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చట్టరీత్య నేరమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో, బాటసారులు, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడడని, గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని అక్కడ అవసరమైతే బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, రష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటివి యువత మానుకోవాలని సూచించారు. ప్రధాన చౌరస్తాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ప్రదేశాలలో ప్రాంతాలలో, ప్రధాన చౌరస్తాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రోడ్డు ప్రమాదాల ఎక్కువగా జరిగే ప్రదేశాలను హాట్ స్పాట్లుగా గుర్తించి ఆయా చోట్ల సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్స్, బారికేట్స్ ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిఐలు శివశంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు ఎస్బిఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక బాసట.. అతివలకు ఊరట
కోస్గి: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు అన్ని రంగాల్లో చైతన్య పర్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) లోకోస్ యాప్లో మహిళా సంఘాల సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహిళా సంఘాల సమగ్ర సమాచారం ఇకపై ఢిల్లీతో అనుసంధానం కానుంది. బీమా పథకాలపై ఆరా.. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న బీమా పథకాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తక్కువ ప్రీమియంతో ఈ పథకాల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ అనుకోని కష్టకాలంలో బీమా సొమ్ముతో అండగా నిలుస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాల్లో చేరిన మహిళల వివరాలను అధికారులు ప్రత్యేక యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. నేరుగా లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే.. కేంద్రం నిధులు నేరుగా లబ్ధిదారులకే అందించాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను జీపీల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. గతంలో నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే అక్కడి నుంచి పంచాయతీలకు సర్దుబాటు చేసేవారు. మూడేళ్ల క్రితం నుంచి ఈ విధానాన్ని నిలిపివేసి నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేస్తున్నారు. మహిళా సంఘాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతోనే లోకోస్ యాప్ ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాల సేకరణ అనంతరం కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీ నేరుగా మహిళా సంఘాల సభ్యులకే అందనుంది. ఇదిలాఉండగా, జిల్లాలోని 13 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 415 గ్రామ సమైక్య సంఘాలు, 10,324 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 1,13,168 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరందరి వివరాలను జిల్లా డీఆర్డీఏ అధికారులు ప్రత్యేక లోకోస్ యాప్లో నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాల నమోదు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా సంఘాల సమగ్ర వివరాలను క్షేత్రస్థాయి నుంచి నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఎన్ఆర్ఎల్ఎంకు చెందిన లోకోస్ యాప్లో పొదుపు సంఘాలకు సంబందించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. సంఘం ఏర్పాటైన సంవత్సరం, సభ్యుల సంఖ్య, పొదుపు, బ్యాంకు, సీ్త్రనిధి రుణాలు, వాయిదాల చెల్లింపులు తదితర అంశాలను నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ నమోదు ద్వారా సంఘాల క్షేత్రస్థాయి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తెలుసుకునేందుకు వీలవుతుంది. మహిళా సంఘాల వివరాలు సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లోకోస్ యాప్ ద్వారా సమగ్ర వివరాల నమోదు నేరుగా లబ్ధి చేకూర్చాలని లక్ష్యం జిల్లాలో 1.13 లక్షల మంది సభ్యులు -
విద్యార్థి కంటికి సురక్ష
జడ్చర్ల టౌన్: కంటి సమస్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం చూపును ప్రసాదిస్తోంది. ఆర్బీఎస్కే ద్వారా ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు నిర్వహించి సమస్యలున్న విద్యార్థులకు కంటి అద్దాలు మంజూరయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 2,355 మంది విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో విద్యార్థులకు కంటి సమస్యలు ఉన్నవారికి పరీక్షలు జరిపారు. ఫిబ్రవరి 28వ తేదీన మహబూబ్నగర్ జిల్లాలో 2,373 మందికి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,427 మంది విద్యార్థులు, రాష్ట్రవ్యాప్తంగా 89,105 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరంతా చూపు మందగించి చదవడానికి ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆర్బీఎస్కేకు చెందిన ఏడు బృందాలు 2,373 మందికి పరీక్షలు జరపగా.. వారిలో 2,355 మందికి అద్దాలు వచ్చాయి. వీరందరికి అద్దాల పంపిణీ చేస్తున్నారు. సమస్యలున్న వారికి అద్దాలు విద్యార్థులకు కంటి చూపు అందించే లక్ష్యంగా వైద్య పరీక్షలు నిర్వహించి సమస్యలున్న వారికి అద్దాలు పంపిణీ చేసినట్లు డీఐఓ డా.పద్మజ తెలిపారు. బుధవారం బాదేపల్లి జెడ్పీహెచ్ఎస్లో 14 మంది విద్యార్థులకు అద్దాలను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ మంజులాదేవి, ఆర్బీఎస్కే డాక్టర్లు సునీల్, లీల, కంటి వైద్యపరీక్ష నిపుణులు దత్తాత్రేయ రావు, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ మనుప్రియ, హెచ్ఎం చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ‘సమగ్ర కంటి పరీక్ష– ఉచిత కంటి అద్దాల పంపిణీ’లో పరీక్షలు ఉమ్మడి జిల్లాలో 9,427మంది విద్యార్థులకు కంటి సమస్యలు మహబూబ్నగర్ జిల్లాలో 2,355 మందికి అద్దాలు పంపిణీ 310 మందికి అద్దాలు.. జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో 310 మంది విద్యార్థులకు అద్దాలను పంపిణీ చేస్తున్నాం. ఫిబ్రవరి 28న హైస్కూళ్లు, గురుకులాల్లో చదవడానికి ఇబ్బంది పడే వారికి స్థానిక ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించాం. వీరందరికీ అద్దాలను అందజేస్తాం. – డా.సునీల్, ఆర్బీఎస్కే, జడ్చర్ల -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
కృష్ణా: పదో తరగతి విద్యార్థులతోపాటు ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. బుధవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు అనుసరించాల్సిన విషయాలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెనుక ఎంఈఓ నిజామూద్గీన్,ఎండీఎం యాదయ్యశెట్టి,జీసీడీఓ నర్మద, ఎస్ఓ షాలిని,సీఆర్పీ అమీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రెయినేజీలు నిర్మించాలి
ప్రఽదాన వీధులన్నీ మురికి కూపాలుగా మారాయి. కొత్తకాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మురుగు నిల్వ ఉండడంతో దోమల బెడద తీవ్రమైంది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించడంతోపాటు విధిగా డ్రైనేజీల్లో మురుగు తొలగించాలి. – రాజు, శ్రీనగర్ కాలనీ, కోస్గి మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే.. మక్తల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిదిలోని 8, 9 వార్డులో మురికికుంట ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇళ్ల మధ్య చెత్తచెదారం నిలిచి ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మా గోడు దేవుడికే తెలుస్తుంది. దోమకాటుతో టైఫాయిడ్, డెంగీ లాంటి రోగాల బారిన పడుతున్నాం. – బాబు, శబరికాలనీ, మక్తల్ ● -
బావాజీ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
కొత్తపల్లి: దక్షణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన లంబాడా జాతర.. గురులోకమా సంద్ బావాజీ జాతర అని, అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని తిమ్మారెడ్డిపల్లి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 11వ తేది నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు బుదవారం అన్ని శాఖల వారిగా నారాయణ పేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ (లోకల్ బాడి) సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి, స్నానాల గదులు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించాలని, ఇప్పటినుంచే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. అనంతరం ఇంతకుముందు నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు. -
నేత్రపర్వంగా కల్యాణోత్సవం
అడ్డాకుల: కందూర్ శ్రీరామలింగేశ్వర క్షేత్రంలో బుధవారం కల్యాణోత్సాన్ని కనులపండువగా నిర్వహించారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ఆలయంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా గ్రామంలో మహిళలు సిద్ధం చేసిన తలంబ్రాల బియ్యాన్ని ప్రత్యేక పల్లకిలో మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం పురోహితుల వేదమంత్రాల మధ్య ఉత్సవమూర్తులకు కల్యాణ వేడుకను నిర్వహించారు. కారెడ్డి నాగిరెడ్డి, తోకల దామోద్రెడ్డిరెడ్డిలు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి, శివలింగాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ● ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, కవిత దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామలింగేశ్వరాలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆలయ ఆవరణలో ఇటీవల పూర్తి చేసిన సీసీ రోడ్లు, మంచి నీటి కుళాయిలను ప్రారంభించారు. ఆలయం వద్ద బ్రహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు. బ్రహోత్సవాలను విజయవంతం చేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్ రావు, నాయకులు అరవింద్రెడ్డి, నాగిరెడ్డి, తోట శ్రీహరి, జగదీశ్వర్, నాగార్జున్రెడ్డి, విజయమోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భక్తులతో కిటకిటలాడిన రామలింగేశ్వరస్వామి ఆలయం -
రేపు టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక
మక్తల్: జిల్లా టెన్నికాయిట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మక్తల్లో 13వ తేదీన జిల్లా స్థాయి టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దీప తెలిపారు. పట్టణంలో సాయిజ్యోతి ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్కార్డు, బోనోపైడ్, మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని, ప్రతిభ కనబర్చిన వారిని ఈ నెల 15, 16 తేదీల్లో హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. జొన్నలు క్వింటాల్ రూ.4,565 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జొన్నలు క్వింటాల్కు గరిష్టంగా రూ.4,565, కనిష్టంగా రూ.4,320 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్టం రూ.5,720, కనిష్టం రూ.5,659, పెసర గరిష్టం రూ.6,818, కనిష్టం రూ.6,606, అలసందలు గరిష్టం, కనిష్టం రూ.6,933, ఎర్ర కందులు గరిష్టం రూ.7,411, కనిష్టం రూ.4,350, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,663, కనిష్టంగా రూ.6,759 ధరలు పలికాయి. పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. యువతతోనే దేశ ప్రగతి నాగర్కర్నూల్ క్రైం: యువతతోనే దేశప్రగతి ముడిపడి ఉందని, దేశ అభివృద్ధిలో యువత కీలకం అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ అన్నారు. కేంద్ర యువజన క్రీడా సర్వీసులు, మై భారత్, నెహ్రూ యువకేంద్ర సహకారంతో స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం యువ ఉత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్లో యువత పాత్ర ముఖ్యమైనదని, చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై సోషల్మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ నెలలో జరగనున్న జాతీయ యూత్ పార్లమెంట్ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం యువ ఉత్సవంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభచాటిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, స్వామివివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్, జిల్లా యువజన అధికారి కోటానాయక్, కల్యాణ్నాయక్, సుధాకర్, లక్ష్మీనర్సింహ, అజయ్ పాల్గొన్నారు. -
రోడ్లపైనే మార్కెట్లు..!
మక్తల్, మద్దూరులో రైతుబజార్లు లేక రోడ్లపైనే కూరగాయల విక్రయాలు ● పేట, కోస్గిలో మార్కెట్లు ఉన్నా..ప్రయోజనం సున్నా ● వ్యాపారులు పోటీపడి రోడ్లపైకి వచ్చికూరగాయలు, పండ్ల విక్రయాలు ● వినియోగదారులు, వాహనదారుల ఇక్కట్లు నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. నారాయణపేట, కోస్గిలో రైతుబజార్లు, షెడ్లు నిర్మించినా కూడా కూరగాయల వ్యాపారం మళ్లీ వీధికెక్కింది. నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లనే మార్కెట్లు చేసి వ్యాపారాలు నిర్వహిస్తూ అటు వినియోగదారులకు, ఇటు వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎంత తాజాగా ఉన్నా.. రోడ్లపైనే దుమ్మూ దూళి మధ్య విక్రయించడంతో ఎక్కడ అనారోగ్యం బారిన పడతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా.. జిల్లా కేంద్రమైన నారాయణపేట నడిబొడ్డున కూరగాయల మార్కెట్ ఉంది. కూరగాయల మార్కెట్ దుకాణాల సముదాయం ఉండగా 2018లో గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్ను రూ.68 లక్షలతో 16 దుకాణాలు, షెడ్లను నిర్మించారు. రైతులు పండించిన కూరగాయలను స్వయంగా విక్రయించుకుని లబ్ధి పొందేందుకు రైతు బజార్ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో రైతులు తెల్లవారు జామున 4గంటల నుంచి 7 వరకు విక్రయించుకొని వెళ్తుంటారు. ఆ తర్వాత రైతు బజార్ వెలవెలబోతుంది. కూరగాయల చిరు వ్యాపారులు ఆయా షెడ్లలో కూరగాయలను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో పోటీపడి ఒకరి తర్వాత ఒకరు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే జనం బేజారు అవుతున్నారు. అలాగే, కూరగాయల మార్కెట్కు వచ్చే వ్యాపారులతో పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.లక్షలు వెచ్చించి వాటర్ప్లాంట్ ఏర్పాటుచేశారు. కానీ, నిర్వహణ సరిగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. అసలే వేసవికాలం, ఎక్కడెక్కడి నుంచే రైతులు కూరగాయలు విక్రయించేందుకు, ప్రజలు కొనుగోలు చేస్తుందుకు వస్తుంటారు. మార్కెట్ అధికారులు స్పందించి మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు. -
‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉంది. రెండు వారాల్లో వాల్యూయేషన్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు 165 మంది గైర్హాజరు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షకు 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 4975 మంది విద్యార్థులకుగాను 4810 మంది హాజరయ్యారు. అందులో జనరల్ విద్యార్థులు 4,383 మందికిగాను 4239 మంది హాజరయ్యారు. 144 మంది గైర్వాజరయ్యారు. ఒకేషనల్లో 592 మందికిగాను 571 మంది హాజరయ్యారు. 21మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుదర్శన్రావు తెలిపారు. -
మద్దూరులో ఇరుకు రోడ్లపై అవస్థలు
మద్దూరులో కూరగాయల విక్రయాలు రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ రైతుబజార్, షెడ్లు కానీ నిర్మించలేదు. రోడ్లపై విక్రయాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులను రోడ్లపై నుంచి తొలగించడానికి పోలీసులు ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది. ఇరుకుగా ఉండే పాత బస్టాండ్ చౌరస్తాలో రోడ్లపైనే కూరగాయలు ఇతర ఇతర వస్తువుల విక్రయాలు చేస్తున్నారు. ప్రతి గురువారం జరిగే సంత నాడు వాహనదారులు, ప్రజలు చుక్కలు చూడాల్సిందే. మద్దూరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత వెంటనే వీధి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు రైతు బజారును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలివ్వండి
నారాయణపేట: ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో కన్వీనర్, లీడ్ బ్యాంకు మేనేజర్ వార్షిక ప్రణాళిక 2024–25 డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి రూ.1984.54 కోట్లతో త్రైమాసిక వృద్ధి అని, వార్షిక ప్రణాళికలో 60.62 శాతం అలాగే ఎస్ఎంఈ సెగ్మెంట్కు సంబంధించి రూ.123.06 కోట్లతో 48.80 శాతం ప్రగతి అని తెలిపారు. ప్రాధాన్యత రంగానికి 1678.14 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఆయా బ్యాంకుల ఏజీఎంలు శ్రీహరి, ప్రకాష్, శ్రావ్య, షణ్ముఖచారి, అనిల్కుమార్, జిల్లా అధికారులు పలు సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నాబార్డు వారిచే పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ 2025–26 గాను రూ.3,833.47 కోట్ల రుణ లక్ష్యంతో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ మొత్తం 2024–25 సంవత్సరం కంటే 25.23 శాతం అధికం కాగా, వ్యవసాయ రంగానికి రూ.3470.93 కోట్లు, ఎంఎస్ ఎంఈ రంగానికి రూ.310.30 కోట్ల లకా్ష్య్న్ని నిర్ధారించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యంగ్వార్, ట్రైని కలెక్టర్ గరిమా నరుల పాల్గొన్నారు. వరి పంట పరిశీలన ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో రైతు నర్సింహులు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేయగా.. నీరు అందక ఎండిపోయే దశకు చేరుకుంది. గతేడాది పంట సాగుకు ఎలాంటి సమస్య రాలేదని, ఈ ఏడాది భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్డు ఎండిపోయాయని, నీటి సమస్య తీవ్రమైందరి రైతు పేర్కొన్నాడు. స్పందించిన కలెక్టర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని డీఏఓ జాన్ సుధాకర్కు సూచించారు. -
ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
నారాయణపేట: నారాయణపేట జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. జిల్లా జడ్జి రఫీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ రహితంగా కై ్లంట్ లను, న్యాయవాదులను కించపరుస్తున్నారని అందుకు నిరసనగా బార్ అసోసియేషన్ అధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్,అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లా జడ్జి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోర్టు పోలియో జడ్జి మధుసూదన్కు,రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నాగు రావునామాజీ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, కార్యదర్శి బింరెడ్డి, న్యాయవాదులు రఘువీర్యాదవ్, సీతారామారావు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,అదనపు కలెక్టర్ రెవెన్యూ బెంషాలం ట్రైనీ కలెక్టర్ గరిమానరుల పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, అలాగే పోలీస్ స్టేషన్లకు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లేవారు మధ్యవర్తులను తీసుకువెళ్లరాదని, బాధితులు మాత్రమే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు తెలిపారు. శనగలు క్వింటాల్ రూ.5,719 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం శనగలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.5,719 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7 వేలు, వేరుశనగ గరిష్టంగా రూ.5,960, కనిష్టంగా రూ.4,330, జొన్నలు గరిష్టంగా రూ.4,559, కనిష్టంగా రూ.3,406, అలసందలు గరిష్టంగా రూ.7,012, కనిష్టంగా రూ.6,756, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.5,809, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,711, కనిష్టంగా రూ.6,829 ధర పలికాయి. నేటినుంచి కాచిగూడ డెమో రైలు పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే మహబూబ్నగర్, నారాయ ణపేట జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూ ర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులు సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నిర్ణయంతో ప్రభు త్వం చేపట్టే సర్వే చేయాలంటే మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
మౌంటెన్ సైక్లింగ్లో విద్యార్థుల ప్రతిభ
మక్తల్: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోహెడ అడవుల్లో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా విద్యార్థులు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. మొత్తం 242 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా, జిల్లా నుంచి అత్యధికంగా 37 మంది బాలబాలికలు 10 కి.మీ. మౌంటెన్ సైక్లింగ్ పోటీలో అసమాన ప్రతిభ కనబర్చారు. నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన కూలీ పని చేసే వెంకటయ్య, అంజమ్మల పెద్ద కూతురు టి.అనూష గోల్డ్ మెడల్ సాధించింది. అనూష ఈ నెల 28 నుంచి 31 వరకు హర్యానా రాష్ట్రం పంచకుల అడవులలో జరుగే మౌంటెన్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటుందని గోపాలం తెలిపారు. 16 ఏళ్లలోపు సైక్లింగ్ పోటీలలో త్రివేణి 4వ స్థానం, పల్లవి ఏడో స్థానం, రాఘవేందర్ 10వ స్థానం సాధించారు. వారితో పాటు 14 సంవత్సరాలలోపు సైక్లింగ్ పోటీలలో పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, విజయ్కాంతారావు, మ్యాక్సీన్వెల్, వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మరికల్/దామరగిద్ద: అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మరికల్, దామరగిద్ద మండలాల్లో పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసి, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పల్లెగడ్డలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. త్వరలోనే రేషన్కార్డులను కూడా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే 90 శాతం మందికి ఉచిత కరెంట్, సిలిండర్లు అందుతున్నాయని, పథకాలు అమలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి అర్హులకు ఆరు గ్యారంటీలను అందజేస్తామని హామీచ్చారు. మీ అభిమానం కూడా కాంగ్రెస్ పార్టీపై ఎప్పటికి ఉండాలని సూచించారు. మరికల్ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్కుమార్, ఎంపీడీఓ కొండన్న, ఎంపీఓ పావని, రేవతమ్మ, వీరన్న, సూర్యమోహన్రెడ్డి, తిమ్మరెడ్డి, పాల్గొన్నారు. దామరగిద్దలో 72 మదికి ఇళ్లు మంజూరు దామరగిద్ద మండలంలోని గత్ప గ్రామంలో అర్హులైన 72 మంది లభ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. విడతల వారీగా అందరికీ లబ్ధి చేకూర్చుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఎంపీడీఓ సాయిలక్ష్మి, విండో అద్యక్షుడు ఈదప్ప, మాజీ సర్పంచ్ రాములు హౌసింగ్ డీఈ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ కట్టడికి పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బహుళ సభ్య అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గర్భస్థ పూర్వము, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేదం చట్టం 1994 అమలుపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో లింగ నిష్పత్తి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఎస్పీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతూ లింగ నిర్ధారణ తెలిపే కేంద్రాలపై పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. అలాగే మొదటి, రెండు మాసాలలో జరిగే గర్భస్రావాలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 5 స్కానింగ్ కేంద్రాల అనుమతికి దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి పర్యవేక్షించి అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిలో ఒకటి ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఈ చట్టం, దాని విధి విధానాలు, వ్యతిరేకించే వారిపై విధించే శిక్షలు, జరిమానాలను డాక్టర్ శైలజ వివరించారు. సమావేశంలో సఖి కేంద్రం ఏవో క్రాంతి రేఖ,ఎంపీ హెచ్ ఈ ఓ గోవిందరాజు, శ్రీనివాసులు, వసంత పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి నారాయణపేట: జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) సమన్వయకర్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో సోమవారం కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కిషన్, వైద్య నిపుణులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మోహన్తో ఆస్పత్రిలో వైద్య సేవలు, సిబ్బంది, బడ్జెట్ తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈ వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వైద్యశాఖ పరంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఇక నుంచి మెడికల్ కళాశాలతో పాటు జిల్లా ఆస్పత్రి పర్యవేక్షణను చూసుకోవాలని ప్రిన్సిపల్కు ఆమె సూచించారు. ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అవసరమని, ఎవరినైనా డిప్యూట్ చేయించాలని రాంకిషన్ కలెక్టర్ను కోరారు. జిల్లా ఆసుపత్రి, చిన్న పిల్లల ఆసుపత్రిలో 20 మంది శానిటేషన్ వర్కర్లు పని చేస్తున్నారని, అదనంగా అవసరం అయితే తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఆస్పత్రి భవన ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే మహబూబ్నగర్, నారాయ ణపేట జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూ ర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులు సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నిర్ణయంతో ప్రభు త్వం చేపట్టే సర్వే చేయాలంటే మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
మిగిలింది 20 రోజులే..
నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కా రం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సి పాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేప ట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అ నేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారు లు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ. 1.94 కోట్లు వసూలు చేయా ల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశా రు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తుల కు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,అదనపు కలెక్టర్ రెవెన్యూ బెంషాలం ట్రైనీ కలెక్టర్ గరిమానరుల పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, అలాగే పోలీస్ స్టేషన్లకు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లేవారు మధ్యవర్తులను తీసుకువెళ్లరాదని, బాధితులు మాత్రమే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు తెలిపారు. శనగలు క్వింటాల్ రూ.5,719 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం శనగలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.5,719 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7 వేలు, వేరుశనగ గరిష్టంగా రూ.5,960, కనిష్టంగా రూ.4,330, జొన్నలు గరిష్టంగా రూ.4,559, కనిష్టంగా రూ.3,406, అలసందలు గరిష్టంగా రూ.7,012, కనిష్టంగా రూ.6,756, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.5,809, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,711, కనిష్టంగా రూ.6,829 ధర పలికాయి. నేటినుంచి కాచిగూడ డెమో రైలు పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి
నారాయణపేట రూరల్: స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలని ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. మండలంలోని కోటకొండలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్లు కావస్తున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల్లో పయనించకుండా సన్మార్గంలో వెళ్లాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రమశిక్షణ కలిగి లక్ష్యం, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో బాలస్వామి, శివరాములు, రవి, సిద్దు, కృష్ణయ్య, సురేందర్, జగదీష్, నరేష్, కిషోర్ పాల్గొన్నారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి నారాయణపేట టౌన్: మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులను అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రామ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో వారు మాట్లాడారు. మహిళలపై హింస, వేధింపులను ప్రతిఘటించాలని, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, మెప్మా, ఐకేపీ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిదిలో పనిచేస్తున్న మహిళలను ప్రభుత్వాలే శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, సమానత్వం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ముందు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాధిక, మమత, పార్వతి, నాంచారమ్మ, చంద్రకళ, భాగ్యమ్మ,అశ్విని,సుశీలమ్మ,పలువురు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి నారాయణపేట రూరల్: జిల్లా విద్యా శాఖలో నెలకొన్న సమస్యలపై నూతనంగా ఎన్నికై న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి స్థానిక పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు శాలువాతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు టీజిఎల్ఐ కార్యాలయ ఏర్పాటుకు కృషి చేయాలని, సరిహద్దు ప్రాంత పాఠశాలలో పనిచేస్తున్న కర్ణాటక ఉపాధ్యాయులకు మెడికల్ రియంబర్స్మెంట్ కల్పించాలని, డీఈఓ, ఎమ్మార్సీ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలన్నారు. యాదగిరి జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోపల 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమారు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు.. ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం. – మహమ్మద్ రషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు●వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది.. మేం మొత్తం 24 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది. – ఖలీల్ ఖరేషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు 24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
నారాయణపేట రూరల్: హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని ప్రాంత విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నరసింహమూర్తి అన్నారు. స్థానిక సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం నారాయణపేట జిల్లా, పట్టణ విశ్వహిందూ పరిషత్ పూర్తిస్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసింహమూర్తి మాట్లాడుతూ.. నిద్రావస్థలో ఉన్న హిందూ సమాజం మేల్కొనాలని, రాజకీయ లబ్ధి కోసం కులాల పేరుతో విభజిస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. పల్లె నుంచి పట్టణం వరకు జరుగుతున్న మతమార్పిడులను అరికట్టాలన్నారు. దేవాలయాల పరిరక్షణకు కృషి చేద్దామని, గోసంరక్షణ దేయంగా ముందుకు పోదామన్నారు. ఇతర మతస్తుల యాత్రకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వాలు హిందువుల పండుగల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం సరికాదని ముక్తకంఠంతో ఖండించాలన్నారు. హిందువుల పూర్తిస్థాయి చైతన్యంతోనే మార్పు జరుగుతుందన్నారు. హిందువులపై దాడులకు పాల్పడే సంఘవిద్రోహులను పారద్రోలేలా, హిందూ జాగృతికి, హిందూ ధార్మిక కార్యక్రమాల అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీల ఎన్నిక విశ్వహిందూ పరిషత్ నారాయణపేట నూతన జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్న శివకుమార్, విభాగ కార్యదర్శిగా నరేందర్, విభాగ్ సహ కార్యదర్శిగా లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా మురళీబట్టడ్, ప్రధాన కార్యదర్శి కడుదాస్ ప్రవీణ్, బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షుడిగా వడ్ల శ్రావణ్, సహా ప్రయోజక్ గా భీమేష్ తోపాటు మరి కొంతమంది సభ్యులతో జిల్లా పట్టణ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రాంత ఉపాధ్యక్షులు జగదీశ్వర్లు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పగుడాకుల బాలస్వామి, దుర్గవాణి మాతృమండలి సభ్యులు పవిత్ర, లలిత, భాస్కర్, వందన, వైష్ణవి లతోపాటు నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల, గ్రామాల విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లో మహిళల ముందంజ
నారాయణపేట: ఏ ఇంట్లో అయితే మహిళ బాగా చదివితే ఆ కుటుంబమంతా బాగుపడుతుందని, ప్రస్తుతం మహిళలు అటు ఇంట్లో పని చేస్తూ తమ విధి నిర్వహణలో రాణిస్తున్నారన్నారని, ఇక మహిళా పోలీసులు తమ విధి నిర్వహణలో గొప్పగా రాణిస్తూ ఆదర్శంగా నిలవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న మహిళా పోలీసులు, డీపీఓ స్టాప్, ఆఫీస్ స్టాఫ్తో శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళ పోలీసులచే కేక్ కట్ చేయించి ఎస్పీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలకు ఓర్పు, సహనం, పట్టుదల ఎక్కువ అని ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు. పురుషులతో పోటీపడి ఉద్యోగ అవకాశాల్లో విధుల్లో వారితో సమానంగా మహిళలు పనిచేయడం గొప్ప విషయమన్నారు. శాంతి భద్రతల విషయంలో జిల్లా పోలీస్ శాఖలో పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. మహిళా పోలీసులకు విధి నిర్వహణలో ఉన్నప్పుడు గాని పోలీస్ స్టేషన్లో గాని పని చేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా పరిధిలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ ఉందని, అందులో కంప్లైంట్ చేయవచ్చని మహిళా పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ లింగయ్య,ఆర్ఐ నరసింహ, మహిళ ఎస్సైలు స్వాతి, సునిత, రేవతి, గాయత్రి, మహిళ పోలీసులు పాల్గొన్నారు. -
రాజీమార్గమే రాజమార్గం
నారాయణపేట: రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో ఎలాంటి కేసులైనా పరిష్కరించుకోవచ్చని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి కం చైర్మన్ డీఎల్ఎస్ఎ మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో డీఎల్ఎస్ఎ కార్యదర్శి కం సీనియర్ సివిల్ జడ్జి వింద్యనాయక్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జకియా సుల్తానా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలప్ప, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె లక్ష్మీపతి గౌడ్ , నాగేశ్వరి, ఇతర న్యాయవాదులు కలిసి లోక్ అదాలత్కు వచ్చిన వివిధ రకాల కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం అన్నారు. ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని కోరారు. 9,825 కేసులు.. రూ.24 లక్షల ఆదాయం ఇదిలాఉండగా, శనివారం నాటి లోక్ అదాలత్ లో జిల్లా కోర్టు పరిధిలో 9825 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల (కోస్గి, నారాయణపేట) పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా రాజీ అయిన వ్యక్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కను అందజేసి అభినందించారు. కాగా మొత్తం కేసుల పరిష్కారానికి గాను రూ 24,08,020 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందన్నారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి , డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి వీంధ్య నాయక్ మాట్లాడుతూ.. ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ మంచి అవకాశమని, చిన్నచిన్న కేసులను క్షమించి రాజీ కావడం వల్ల వారికి ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందన్నారు. సివిల్ తదితర కేసులలో ఒకరికొకరు రాజీ కావడం వల్ల కేసులు పరిష్కారం అవుతాయని ఇద్దరూ గెలుస్తారని తెలిపారు తెలిపారు. అనంతరం రాజీ అయినవారికి మొక్క, అవార్డును న్యాయమూర్తులు అందజేశారు. పిపి బాలప్ప మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఆర్థిక స్తోమత లేని వారి కేసులను ఉచితంగా వాదించడానికి న్యాయవాదులను నియమిస్తుందని డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మిపతిగౌడ్ తెలిపారు. జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ జాతీయ లోక్అదాలత్లో 9,825 కేసుల పరిష్కారం -
మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
నారాయణపేట టౌన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, హింస, దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, ఈమేరకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మీ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేద్రంలో మహిళలు స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా మున్సిపల్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశంలో ఇంటా బయట మహిళలపై అత్యాచారాలు, దాడులు, వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పాలకులు నీరుగారుస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న గృహహింస, వరకట్న వేధింపుల చట్టాలను తిరిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సీ్త్రలు సమాజంలో ఎదురుకుంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. లింగభేదం లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి,సరళ,లక్ష్మి,సునిత,లక్ష్మి,అరుణ,అనిత.రాధిక.చంద్రకళ పలువురు పాల్గొన్నారు. చింతపండు క్వింటాల్ రూ.10,189 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం చింతపండు 52 క్వింటాళ్లు విక్రయానికి రాగా.. క్వింటా గరిష్టంగా రూ.10,186, కనిష్టంగా రూ.6 వేలు పలికింది. అలాగే, శనగలు 19 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,950, కనిష్టం రూ.5,811, ఎర్రకందులు 136 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,461, కనిష్టం 6,469, జొన్నలు 84 క్వింటాళ్లు రాగా గరిష్టం రూ.4,400, కనిష్టం రూ.3,629 ధర పలికింది. అదేవిధంగా, వేరుశనగ 41 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.5,420, కనిష్టం రూ.3,910, తెల్లకందులు 58 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,700, కనిష్టం రూ.6.870 ధర పలికింది. సీఎంను కలిసిన పీయూ వీసీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్లో వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలి వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్వేస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్త లు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, జీఎం ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ -
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం
చిరుతల సంచారం కొనసాగుతుందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తున్నా వాటిని పట్టుకోవడం కోసం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతేడాది చిరుత సంచరిస్తుందని గుర్తించిన అధికారులు మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ గ్రామ శివారులో బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతల కదలికల కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 10 రోజులు ఉంచి చిరుతలు చిక్కకపోవడంతో వాటిని తొలగించారు. ఆ తర్వాత తరచూ లేగదూడుల, మేకలు మృతి చెందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ మోమినాపూర్లో 15 రోజుల్లో చిరుత, లేగదూడలు మృతి చెందడంతో ఒక బోనును ఏర్పాటు చేశారు. పశువుల స్థానంలో మనుషుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలి
పాలమూరు: మహిళలు ఎందులో తక్కువ కాదని, మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళను గౌరవించే సంస్కృతి మన ఇంటి నుంచే మొదలుపెట్టాలన్నారు. సీ్త్ర శక్తిని దేనితో పోల్చలేమని, వారి పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. న్యాయమూర్తులు కళ్యాణ్ చక్రవర్తి, శారదా దేవి, శ్రీదేవి, రాజేశ్వరి, డి.ఇందిర, రాధిక, మమతారెడ్డి, రవిశంకర్, భావన, నిర్మల, మాధవి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
బాధితులకు ఆర్థిక సహాయం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా కేంద్రం నుంచి ఆరుగురు బాధితులకు శుక్రవారం ఎస్పీ డి.జానకి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. భరోసా కేంద్రం ఎస్ఐ సుజాత పాల్గొన్నారు. ● హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయంలో భాగంగా ఐదుగురు హోంగార్డ్స్కు ఎస్పీ జానకి చెక్కులు అందజేశారు. కవితకు రూ.15,000, శేఖరయ్య, వెంకట్రాములు, నాగమణి, శోభకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందించారు. -
గడ్డు పరిస్థితులు
సొరంగంలో అచ్చంపేట/అచ్చంపేట రూరల్/బల్మూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలకు నీటి ఊట అడ్డంకిగా మారింది. సొరంగంలో 14 రోజులుగా 12 విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయక చర్యలు, వనరులు సమకూరుస్తున్నారు. గురువారం కేరళలోని త్రిసూల్ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్ శుక్రవారం సొరంగంలోని ప్రమాద స్థలంలో సహాయక బృందాల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు టన్నెల్ లోపల పరిసరాలు పరిశీలించారు. అన్వి రోబోటిక్, హైదరాబాద్ బృందం ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకొని అవసరమైన సహకారం అందిస్తున్నారు. సొరంగంలో సహాయక బృందాలకు రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సఫారీ వాహనంలో సిస్మాలజీ బృందం.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం నల్లమలలో సర్వే చేస్తున్నారు. రెండు ప్రత్యేక సఫారీ వాహనాలను అటవీశాఖ అధికారులు కేటాయించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అధికారులు సిస్మాలజీ ప్రతినిధులకు లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ లొకేషన్ను పంపిస్తుండగా సర్వే చేపడుతున్నారు. సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది. సక్రమంగా పనిచేయని కన్వేయర్ బెల్ట్.. సొరంగంలో సింగరేణి కార్మికుల పనికి ప్రాధాన్యం ఉండటంతో అధికంగా తరలివస్తున్నారు. కాగా టీబీఎం వద్ద 7 కంటైనర్లు ఉండగా.. ఒక కంటైనర్ మాత్రం బయట పడిందని, మిగిలినవన్నీ మట్టితో కూరుకుపోయినట్లు సమాచారం. బయటపడ్డ కంటైనర్లో ఆక్సిజన్ సౌకర్యం ఉందని.. అందులో చిక్కుకున్న కార్మికులు ఉండి ఉంటే క్షేమంగా బయటపడేవారని సహాయక బృందాలు చెబుతున్నాయి. టీబీఎం విడిభాగాలను తొలగించడానికే అధిక సమయం పడుతుందని.. సరైన విద్యుత్ సౌకర్యం లేక కన్వేయర్ బెల్ట్ సక్రమంగా పని చేయకపోవడంతో మట్టి తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో కార్మికులు సుమారు ఆరు నుంచి 10 గంటలు పని చేస్తుండగా.. మొబైల్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల జాడ కనుగొనేందుకు రంగంలోకి కడావర్ డాగ్స్, రోబోటిక్ బృందం 14 రోజులైనా లభించని ఆచూకీ కొనసాగుతున్న సహాయక చర్యలు సహాయక చర్యలు ఇలా.. చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందం శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లింది. 15 ఫీట్ల లోపలున్న వారిని గుర్తించగలగటం ఈ శునకాల ప్రత్యేకత. సొరంగంలోని బురద, మట్టి, ఇతర శిథిలాలను తొలగించేందుకు 110 మంది ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు లోకో ట్రైన్లో వెళ్లారు. నలుగురు సభ్యుల అన్వి రోబోటిక్ నిపుణుల బృందం, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఉదయం 11.25కు మరోమారు సొరంగంలోకి వెళ్లారు. నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
ఆమె కోసం.. ఒకరోజు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం 2023, మార్చి 8న మహిళా క్లినిక్లను ప్రారంభించింది. జిల్లాలోని జనరల్ ఆస్పత్రులు, 24 గంటలు సేవలందించే పీహెచ్సీల్లో మహిళా క్లినిక్లు కొనసాగుతున్నాయి. ఈ క్లినిక్లలో ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తారు. ప్రతి వారం ఒక రకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తుండగా.. బుధవారం, శనివారం టీకాలు, శుక్రవారం డ్రై డే, గురువారం హెల్త్కేర్ క్లినిక్ వృద్ధుల కోసం చేస్తుండగా.. ఖాళీగా ఉన్న మంగళవారాన్ని మహిళలకు కేటాయించారు. ఇందులో 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ క్లినిక్స్లో పరీక్షలు చేసి 24 గంటల్లో రిపోర్టు అందజేస్తారు. ఈ మేరకు తెలంగాణ డయాగ్నోస్టిక్ పోర్టల్ ప్రత్యేక లింక్ రూపొందించింది. నమూనాల సేకరణ, కేంద్రాలకు తరలింపునకు వాహనాలు, స్టాప్ను నియమించారు. -
అతివకు అందలం
●మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ● కుటుంబ పోషణతో పాటు ఉద్యోగాల్లోనూ రాణించడం ఆమెకే సాధ్యం ● ప్రభుత్వం మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకువస్తే మహిళా సాధికారత ● ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ అవగాహన అవసరం.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా చాలామంది మహిళలకు బయటి ప్రపంచం గురించి తెలియని పరిస్థితి. అందుకే వంటిళ్లు కుటుంబమే జీవితంగా జీవిస్తున్నారు. అందుకోసం ప్రతి మహిళ తమ హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి సంస్థల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానీ, చాలా మంది అవగాహన లేనందుకు ప్రతి విషయానికి పురుషులపై ఆధారపడాల్సి వస్తోంది. – తనీష, ఎంపీసీ, ఫస్ట్ ఇయర్ కట్టుబాట్లు ప్రతిబంధకాలు.. మన సమాజంలో మహిళలు సాధికారత సాధించకపోవడానికి కట్టుబాట్లు, పద్ధతులు ఒక ప్రతిబంధకంగా మారాయి. ఉన్న ఒక్క జీవితానికి ప్రతి మహిళ తన లక్ష్యాన్ని, తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. చరిత్రలో ఎంతో మంది మహిళలు దేశ అస్తిత్వం కోసం పోరాటం చేశారు.. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని.. కొత్త చరిత్ర సృష్టించాలి. – వాహిని, ఎంపీసీఎస్, సెకండ్ ఇయర్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంఎంత కష్టాన్ని అయిన భరించేతత్వం ఒక్క మహిళకే ఉంటుంది. నేనూ ఒక మహిళ అయినందుకు గర్విస్తున్నా. నాకు అన్ని విష యాల్లో సహకరించే కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. మహిళ సాధికారత, సమానత్వం సాధించాలంటే తప్పకుండా కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వాలు, మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకురావాలి. – ఆలియా, ఎంజెడ్సీ, సెకండ్ ఇయర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆధునిక ప్రపంచంలో సమాజం ఎంతో అభివృద్ధి చెందినా మహిళలు తక్కువ, మగవారు ఎక్కువ అనే భావన తొలగిపోవడం లేదు. మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే ప్రతి మహిళ కూడా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేసినప్పుడే అన్నీ సాధ్యమవుతాయని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డిబేట్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో డిగ్రీ, పీజీ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళగా గర్విస్తున్నా.. సమాజంలో మహిళలు ఉద్యోగం చేసేవారు ఇటు కుటుంబాన్ని.. అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసే శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంత ఓర్పు మహిళలకు ఉన్నందుకు ఒక మహిళగా గర్విస్తున్నా. మహిళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమానత్వం సాధిస్తే సాధికారత సాధ్యపడుతుంది. – వసంత, ఎంజెడ్బీటీ, సెకండ్ ఇయర్ ఉన్నత విద్యతోనే.. మహిళా సాధికారత సాధించి, సమానత్వం రావాలంటే తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ప్రతి విద్యార్థిని కూడా అనవసర విషయాల జోలికి పోకుండా చదువులపై దృష్టి సారించినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయి. – భవాని, బీకాం, ఫస్ట్ ఇయర్ ఉద్యోగావకాశాలు కల్పించాలి.. మహిళా సాధికారత రావాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం చేసే విధంగా అవకాశాలు రావాలి. చదువులు ఉన్నప్పటికీ కొంత మంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అందిస్తే సులువుగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది. – నిహారిక, బీకాం, ఫస్ట్ ఇయర్ పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి వరకు బాలికలు చదువుతున్నప్పటికీ ఉన్నత విద్యకు వచ్చే సరికి వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు స్కిల్ డెవలప్మెంట్, మరిన్ని యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు చదువుకునేందుకు ఆస్కారం ఉంది. నాకు అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులు సహకరించడం వల్ల ప్రిన్సిపాల్ స్థాయి వచ్చా. మహిళలకు కుటుంబమే బలం. అలాంటి అవగాహన అందరిలో రావాలి. – పద్మావతి, ప్రిన్సిపాల్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల చైతన్యం అవసరం.. చాలామంది మహిళలు అవగాహన లేకకపోవడం, హక్కులు తెలియపోవడం వంటి విషయాల కారణం సాధికారత సాధ్యపడడం లేదు. అందుకోసం సామాజిక అంశాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళలో కూడా చైతన్యం వచ్చి రాజకీయ, సామాజిక, ఉద్యోగాల్లో వారి సంఖ్య పెరిగితే అప్పుడు మహిళలు పురుషులతో సమానంగా రాణించగలుగుతారు. – నీలిమ, బీబీఏ, సెకండ్ ఇయర్ తోటివారికి సహకరించాలి.. సమాజంలో మహిళలకు తోటివారే సహకరించాలి. పనిచేసే ప్రదేశం, ఇతర చోట్ల ఎక్కడైనా మహిళలు ఒకరికి ఒకరు సహరించుకుంటే ముందుకు సాగేందుకు ఆస్కారం ఉంటుంది. రెండు కొప్పులు ఒక దగ్గర కలవవు అనే నానుడి నుంచి బయటికి రావాలి. ప్రతి మహిళా సాధికారత సాధించాలంటే తప్పకుండా విద్యను ఒక ఆయుధంగా మలచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. – సుభాషిణి, ఎంవీఎస్ కళాశాల అధ్యాపకురాలు కుటుంబమే బలం.. -
రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
కొత్తకోట: పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్రెడ్డి అలియాస్ గొల్లబాబు (55) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతే డాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్రెడ్డి మరణంతో పట్టణంలో విషాదచాయలు అలు ముకున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రగాడ సానుభూతి తెలిపి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాలమూరు నుంచి 14 బస్సులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: హైదరాబాద్లో శనివారం జరిగే మహిళా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ఎస్హెచ్జీలు 800 మంది పాల్గొనాలని మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్కి చెందిన 700 మంది మహి ళల కోసం 14 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాల మైదానంలో అందు బాటులో ఉంచినట్లు ఆమె పేర్కాన్నారు. శనివా రం మధ్యాహ్నం 12 గంటల కల్లా ఆయా ప్రాంతాలకు తరలి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయాలి ● ఎస్బీఐ ఉద్యోగుల నిరసన స్టేషన్ మహబూబ్నగర్: బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఎస్బీఐ అవార్డు స్టాప్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి నరేష్కుమార్, ఆఫీసర్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి జగన్నాథ్రెడ్డి అన్నారు. తమ విధులు ముగించుకొని పట్టణంలో వివిధ ఎస్బీఐ బ్రాంచీల ఉద్యోగులు జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని ఎస్బీఐ ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో బ్రాంచీల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ ఏబీసీ ముసాయిదాను సీఎం రేవంత్రెడ్డి , మంత్రివర్గం ఆమోదించి చట్టం చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాకర్ అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ భవనం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినోద్కుమార్, సింగిరెడ్డి పరమేశ్వర్, రాయికంటి రాందాస్, మీసాల రాము పాల్గొన్నారు. రవాణాశాఖ మంత్రికి కృతజ్ఞతలు స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఒక గంట ముందు ఇంటికెళ్లే వెసులుబాటును అమలు చేయాల్సిందిగా ఆల్మేవా ఆధ్వర్యంలో ఇటీవలే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఎండీలకు వినతిపత్రాలు పంపించినట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫారుఖ్ హుస్సేన్, సయ్యద్ వహీద్షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్కు, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని మహబూబ్నగర్ జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కోరారు. ఈమేరకు శుక్రవారం కలెక్టర్ విజయేందర బోయికి వినతి పత్రం సమర్పించారు. -
బ్యాంకుల్లో సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ
నారాయణపేట: బ్యాంకుల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అన్ని బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు తరచూ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని,సెక్యూరిటీ అలారం వ్యవస్థ, సెక్యూరిటీ గార్డ్స్ నియమించుకోవాలని, అధిక మొత్తంలో బ్యాంకులకు నగదు తీసుకువస్తున్నా, తరలిస్తున్నా పోలీసుల భద్రత తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి జిల్లా పరిధిలో నిత్యం శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. -
పెళ్లికి అడ్డంకులు..
‘మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. కూలీపని చేసి, జీవనం గడిపేవాళ్లం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు (1985లో) జోగినిగా మార్చారు. అప్పుడు మా అమ్మానాన్నకు జోగిని వ్యవస్థ గురించి అసలే తెలియదు. తెలిస్తే అలా చేసేవారు కాదు. 1995లో ఊట్కూర్కు చెందిన లక్ష్మయ్యతో పెళ్లి నిశ్చయం కాగా.. చాలామంది గ్రామస్తులు, జోగినిలు వ్యతిరేకించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అడ్డుకున్నారు. ఊరోళ్లయితే పంచాయితీ పెట్టి.. జోగినికి పెళ్లి ఎలా చేస్తారని నిలదీశారు’ అని హాజమ్మ తన గాథను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను మూఢనమ్మకాలను పట్టించుకోనని స్పష్టం చేసినట్లు వివరించారు. తాను ఊరందరికీ భార్య అంటున్నారు కదా.. మరి మీ ఆస్తి రాసివ్వాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తాను జోగినిని కాదని సమాజానికి తెలియజేసేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. -
ఏడాది పాటు ప్రైవేట్ ఉద్యోగం చేశా..
మా సొంత రాష్ట్రం ఒడిశా అయినప్పటికీ తండ్రి ఉద్యోగరిత్యా ఎ.కె పట్నాయక్ ఇండియన్ అడిట్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తుండడంతో ఢిల్లీలో ఉంటున్నారు. తల్లి మంజుశ్రీ ఉపాధ్యాయురాలు. నా విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగింది. ఎం.ఏ.ఎకనామిక్స్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఏడాదిపాటు జాబ్ చేశాను. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ఒకవైపు జాబ్ చేస్తూనే సివిల్స్కు సిద్ధమవుతూ వచ్చా. అనంతరం కలెక్టర్ అయ్యాను. మా సోదరి అర్పిత పీహెచ్డీ ఎకనామిక్స్ చదివి యూఎస్లో ఉంటుంది. వివక్షను రూపుమాపుతాం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మహిళలు ఉద్యోగులుగా ఉండడంతో లింగ వివక్షతకు ఆస్కారం లేకుండా చేస్తున్నాం. ఉద్యోగులు విధులు నిర్వహించే కార్యాలయాల్లో గౌరవం కల్పిస్తున్నాం. లింగ వివక్షతపై ఎస్పీ యోగేష్ గౌతమ్తో సమీక్షలు జరుపుతున్నాం. ఐసీడీఎస్, సఖి, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. న్యాయపరంగా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాం. మహిళలు ఏదైనా సహాయం అడిగితే వెంటనే స్పందిస్తున్నాం. అలాగే, మహిళల్లో రక్తహీనత ఉన్నవారిని గుర్తించి వారికి కావాల్సిన మందులను అందజేస్తున్నాం. జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ మహిళా డాక్టర్లచే ప్రత్యేక క్యాంపులు నిర్వహించి మహిళల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నాం. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్
నారాయణపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళకు వ్యక్తిగత, కుటుంబ జీవితం ఉంటుందని, ఉద్యోగ పరంగా చాలామంది మహిళలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నారు. ఒక మహిళకు మరో మహిళే సపోర్ట్ చేయాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అమలు చేస్తోందని చెప్పారు.మహిళలందరికీ సోద రుడిలా అండగా ఉంటానని భరోసా ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
వనిత.. ప్రగతి బావుటా
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. ● వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్న ‘ఆమె’ ● ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళలు -
మహిళా సాధికారతే లక్ష్యం
నారాయణపేట: ‘మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి మహిళామణుల స్ఫూర్తితో మహిళా సాధికారత కోసం ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. మొదటిది.. లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండు.. మహిళలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మూడు.. మహిళలకు భద్రత, ఆరోగ్య సంరక్షణ పెంపొందించడం. నాలుగు.. మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించడం. ఐదు.. రాజకీయాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడం. ఈ లక్ష్యాలతో ముందుకు సాగాలని’.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ మా సొంత రాష్ట్రమైన ఒడిశాలో మహిళలు ఎక్కువశాతం నిరక్షరాస్యులే. వారిలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ఇక తెలంగాణలో మహిళలు ఎంతో ముందున్నారు. చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు రాణించాలి. చైతన్యం ఎక్కువే నారాయణపేటశనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025 -
No Headline
మహబూబ్నగర్ క్రీడలు: కోయిలకొండ మండలం కేశ్వాపూర్ పెద్దతండాకు చెందిన అక్కా, చెల్లెలు కె.జ్యోతి, కె.ప్రియాంక బాస్కెట్బాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అక్క జ్యోతి 12 సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2015లో పంజాబ్లో జరిగిన జూనియర్ నేషనల్, వరంగల్లో జరిగిన జాతీయ ఆర్జీకేఏ బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొంది. 2016లో కర్ణాటకలో జరిగిన యూత్, ఉత్తరప్రదేశ్లో జరిగిన జూనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ తరఫున ఆడిన జ్యోతి ఆ తర్వాత హైదరాబాద్, లుథియానా, ఢిల్లీ, చైన్నెలో జరిగి పలు జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ చూపారు. అలాగే 25కు పైగా రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాలమూరు జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పాల్గొని, తెలంగాణ జట్టు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. చెల్లి ప్రియాంక 2014లో ఖమ్మంలో తన తొలి రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు 25కుపైగా రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంది. అక్క జ్యోతితో కలిసి పలు సార్లు రాష్ట్రస్థాయి టోర్నీలో ఆడింది. మూడు సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంది. 2017 ఢిల్లీలో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి టోర్నీలో తొలిసారిగా తెలంగాణ తరఫున బరిలోకి దిగారు. అలాగే 2019 ఢిల్లీలో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీలో ఆడింది. అండర్–23 విభాగంలో నేషనల్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికై ంది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో వీరు హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. గిరిజన బిడ్డలు... బాస్కెట్బాల్లో దిట్టలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న అక్కాచెల్లెలుఅతివకు అందలం అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ -
వివక్ష లేదు.. వేధింపులు తగ్గలేదు
ఇంట్లో వివక్ష లేకున్నా... బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు కొంతమేర కొనసాగుతున్నాయి. బస్టాప్, కళాశాల, ఆఫీస్తో పాటు అసభ్యపద జాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. తెలియనివారితోనే ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వివక్ష తదితర అంశాలపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాక్షి సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ సాక్షి సర్వేలో మహిళల మనోగతం -
ఆయుధ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు పాల్గొన్నారు. వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ -
డిజిటల్ లెర్నింగ్పై అవగాహన అవసరం
నారాయణపేట రూరల్: విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులతో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ లెర్నింగ్పై శిక్షణ పొందిన విద్యార్థుల ప్రెసెంటేషన్ చూసి ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ.. గూగుల్ టూల్స్, ఈమెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం చాలా బాగుందని, గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని టాపికల్స్పై పిల్లలు మంచిగా నేర్చుకున్నారని పాజిటివ్ విషయాలకే వాడుకోవాలన్నారు. వ్యక్తిగతంగా, దేశానికి ఉపయోగపడే విధంగా కొత్త వాటిని రూపొందించాలని సూచించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన డిజిటల్ ఈక్వటీ సంస్థ ఓంకార్, స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, డీఎస్ఓ భాను ప్రకాష్, కళాశాల ప్రిన్సిపల్ పద్మ, జిహెచ్ఎం భారతి పాల్గొన్నారు. -
ఆత్మీయ భరోసాపై ఆశలు
మరికల్: వలసలను నిరోధించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. పారదర్శకంగా పథకం అమలుకు సంస్కరణలు చేపట్టారు. ఉపాధి పనుల్లో శ్రమించిన భూమి లేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆతీయ భరోసా కింద ఆర్థిక సాయం రూ.12వేల చొప్పున అందించేలా సంకల్పించింది. అయితే ఉపాధి హామీలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన కుటుంబాలను గుర్తిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కూలీలు ఆసక్తి చూపారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం అధికారులకు సూచించింది. ఇందుకు గాను జనవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు గ్రామా ల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలను ప్రజల ముందు ఉంచారు. పలు గ్రామాల్లో కూలీలు అభ్యంతరాలు తెలపడంతో పాటు కొత్తగా పథకానికి అర్హులమంటూ దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో మండల ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో మరోమారు పరిశీలించి పథకానికి అర్హుల జాబితాను పంపించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని మొదటి విడతగా భరోసా నిధులు సైతం జమయ్యాయి. కానీ మిగిత ఆర్హులకు ఆత్మీయ భరోసా కింద డబ్బులు జమ కాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 20 రోజులు పనిచేసిన కుటుంబాల గుర్తింపు జిల్లాలోని 13 మండలాల్లో 280 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 1,10,835 జాబ్కార్డులు ఉన్నాయి. 2,01,268 మంది కూలీలు ఉండగా 73 వేల మందికి ఉపాధి పనులు కల్పించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీలో కనీసం 20 రోజులకు పైగా పనిచేసి ఉండటంతో పాటు భూమిలేని కూలీలను ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం సహాయం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 20 రోజులు పని చేసిన 8,189 కుటుంబాలను గుర్తించారు. ఇందులో కూడా కేవలం 3,445 కూలీల కుటుంబాలే పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగతా కూలీల కుటుంబాలను మరోసారి పరిశీలించగా మరో 402 మంది కూలీలను అర్హులుగా ఎంపిక చేశారు. దీనికి తోడు గ్రామసభల్లోనూ పథకానికి తాము అర్హులమంటూ 2,239 మంది కుటుంబాలు దరఖాస్తులు అందజేశారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం 3,942 మంది అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. తప్పని ఎదురుచూపులు జిల్లాలో 13 మండల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 13 గ్రామలను ఎంపిక చేశారు. మొదటి విడతగా ఆయా గ్రామాల్లోని మొత్తం 197 మంది లబ్ధిదారులకు రూ.6 వేల చొప్పున ఆత్మీయ భరోసా నిధులు కూలీల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగితా 3,745 మంది భూమిలేని అర్హులైన కూలీలకు వారి ఖాతాలో ఆత్మీయ భరోసా నిధులు జమ కావాల్సి ఉంది. అయితే మరోపక్క ఈ పథకానికి సంబంధించి అర్జీలు చేసుకున్న కూలీల్లో అనర్హులే అధికంగా ఉన్నారు. గ్రామసభల్లో 2,239 మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 95 మందిని మాత్రమే అనర్హులుగా అధికారులు గుర్తించారు. మిగితా వారు ఉపాధి హామీలో పనిచేయని, జాబ్కార్డు లేని కూలీలే పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. జిల్లాలో 3,942 మంది పథకానికి ఎంపిక పైలెట్ గ్రామాల్లో 197 మంది ఖాతాల్లో డబ్బులు జమ మిగితా వారికి తప్పని ఎదురుచూపులుత్వరలో జమ చేస్తాం.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే మిగితా అర్హులైన కూలీల ఖాతాలో ఆత్మీయ భరోసా సాయం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ నెలాఖరు వరకు ఆత్మీయ భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంది. రాగానే వారి ఖాతాలో జమ చేస్తాం. – మొగులప్ప, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి -
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
మక్తల్: భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి రబీసీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం సంగంబండ రిజర్వాయర్ నుంచి లెప్ట్హైలెవల్ కెనాల్ నుంచి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామని, కాల్వ నుంచి పారే చెరువులన్నింటికి నీటిని వదులుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్గౌడ్, వెంకటేష్, రాయికోడ్ ఆనంద్, జయప్రకాస్రెడ్డి పాల్గొన్నారు. -
ఏమైపోయారో..
అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ గుర్తింపు కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు అరవింద్కుమార్ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు పడిగాపులు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్ డాగ్స్ ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
అన్ని హంగులతో గురుకుల పాఠశాల నిర్మించాలి
మద్దూరు: అన్ని హంగులతో కూడిన ఎస్సీ గురుకుల పాఠశాల భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏ. తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు పట్టణంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.30 కోట్లతో చేపట్టే గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు, అలాగే నర్సింహస్వామి ఆలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ భవన నిర్మాణం నమూనాను ఈఈ రాంచందర్ వారికి వివరించగా.. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలకు రూ.50వేలు గౌరవ వేతనం వచ్చేలా చూడాలని పలువురు వారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ విజయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్రెడ్డి, హన్మిరెడ్డి, మల్లీకార్జున్, రహీం, వెంకట్రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా అనుమతులు ఇవ్వాలి
నారాయణపేట: జిల్లా పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోపు అనుమతులు ఇవ్వాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్హల్ లో ఏర్పాటు చేసిన టీజీ ఐపాస్ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నెల నెలా క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశపు ఎజెండాలోని వివిధ అంశాలపై పరిశ్రమల శాఖ జీఎం భరత్రెడ్డి అదనపు కలెక్టర్కు వివరించారు. టీజీ ఐపాస్ కింద గత జనవరి నుంచి ఈ నెల 6 వరకు 19 పరిశ్రమలకు అనుమతుల కోసం సంబంధిత శాఖలలో దరఖాస్తు చేసుకోగా వాటిలో 8 అనుమతులు మంజూరయ్యాయని, మిగతా 11 ప్రాసెస్లోఉన్నాయన్నారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సి లకు చెందిన 17 దరఖాస్తుదారులకు సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు. అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో ఆర్టీఓ మేఘా గాంధీ, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, సబ్ రిజిస్టార్ రామ్ జీ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెహమాన్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అక్బర్ హబీబ్, కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, ప్రిన్సిపల్ మెర్సీ వసంత, చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురికి పదోన్నతి
మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు కేటాయించారు. ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం వి ద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహ న నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు. -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని జిల్లా సంక్షేమ అధికారి జయ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సహకారంతో మహిళా సాధికారిక కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల చదువు దేశానికి ఎంతో ఉపయోగమని.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలతో పాటు కంప్యూటర్ శిక్షణ సైతం ఎంతో అవసరం అన్నారు. అమ్మాయిలను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్ శ్రీలత, కో–ఆర్డినేటర్ నర్సింహులు, అనిత, నర్సింహ, నరేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
తొక్కు,చింత పులుసే తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనిమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనిమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
ఆస్తి పన్ను లక్ష్యం చేరుకోవాలి
నర్వ: గ్రామపంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీపీఓ కృష్ణ కోరారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. వేసవి ప్రారంభమవుతున్నందున గ్రామాల్లోని ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలని, జాబ్కార్డు లేనివారికి తక్షణమే అందజేయాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన పనులు గుర్తించి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పన్ను వసూళ్లను కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. తాగునీటి ఎద్దడి నివారణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని, కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ రాఘవేందర్, యాదవరాజు పాల్గొన్నారు. మట్టి నమూనా సేకరణను అడ్డుకున్న రైతులు మక్తల్: కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు పనులకుగాను ఇరిగేషన్ అధికారులు బుధవారం కాట్రేవుపల్లిలోని ఓ వ్యసాయ పొలంలో మట్టి నమూనా సేకరణకు డ్రిల్ యంత్రంలో వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామ రైతులు అక్కడకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, తహసీల్దార్ సతీష్కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఒప్పుకోలేదు. ప్రభుత్వం నష్టపరిహారం ఎంత చెల్లిస్తుందో చెప్పకుంట నమూనాలు ఎలా సేకరిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని పనులు చేస్తే మా మరణాలు చూస్తారని హెచ్చరించారు. పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి మట్టి నమూనాలు సేకరిస్తే సహించమన్నారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతులు రాజు, జిలానీ, కేశవులు, శ్రీనివాసులు, నర్సింహులు, శివరాజు, రాము, కృష్ణయ్య, శివకుమార్, రఘు, సోమాజీ పాల్గొన్నారు. పంట మార్పిడితోఅధిక దిగుబడులు మరికల్: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పంటల మార్పిడి చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఇన్చార్జ్ సునీత తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో పంటల సమగ్ర సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. సంస్థ ఆధ్వర్యంలో పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. యాసంగిలో సాగుచేసే వరి, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలకు వచ్చే కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే పంటలకు మేలుచేసే మిత్ర పురుగుల గురించి తెలిపారు. అనంతరం రైతులు సాగుచేసిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రోన్ సాయంతో మందులను ఎలా పిచిరాకీ చేయాలో వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వెంకట్రెడ్డి, ఉదయ్శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్, ఏఓ రహమాన్, ఏఈఓ పరశురాం తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ @ రూ.6,780 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.5,469 ధరలు లభించాయి. పెబ్బర్లు రూ.6,910, పత్తి గరిష్టంగా రూ.6,289, కనిష్టంగా రూ.5,469, కందులు గరిష్టంగా రూ.6,970, కనిష్టంగా రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,026, ఆముదాలు గరిష్టంగా రూ.6,077, కనిష్టంగా రూ.6,020 ధరలు లభించాయి. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. సిబ్బంది ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కేంద్రాల ఆవరణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటిరోజు బుధవారం 4,476 మంది విద్యార్థులకుగాను 4,336 మంది హాజరుకాగా 140 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్రావు తెలిపారు. జనరల్ విభాగంలో 3,888 మందికిగాను 3,767 హాజరుకాగా.. 121 మంది గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 588 మందికిగాను 569 మంది హాజరుకాగా 19 మంది రాలేదని వివరించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయని చెప్పారు. డీఈసీ కన్వీనర్ జిల్లాకేంద్రంలోని, డీఈసీ సభ్యులు ఉట్కూరు, మక్తల్, మాగనూర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్, డీఎస్పీ లింగయ్య జిల్లాకేంద్రంలోని శీ సాయి జూనియర్ కశాశాల పరీక్ష కేంద్రం తనిఖీ చేశారు. కేంద్రానికి 200 మీటర్ల వరకు ఇతరులు గుంపులుగా తిరగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. -
టెండర్ ప్రక్రియ నిర్వహించాలి
సరైన అడ్డా లేక వాణిజ్య సముదాయం ఎదుట చిన్న హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం సముదాయాన్ని ప్రారంభిస్తే ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నా. ప్రభుత్వం స్పందించి త్వరగా ప్రారంభించాలని కోరుతున్నా. – కె.రాణా, చిరు వ్యాపారి, నారాయణపేట దుకాణాలు కేటాయించాలి.. వాణిజ్య సముదాయం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకొనే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు త్వరగా ప్రారంభిస్తే మాలాంటి వారు వ్యాపారం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సరైన వ్యవస్థ లేక వేసవి, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కెంచె వెంకటేష్, దుస్తుల వ్యాపారి ● -
ఏడేళ్లుగా ఎదురుచూపులు
గత ప్రభుత్వ హయంలో రిజర్వేషన్ల ప్రాతిపదికన మార్కెట్ పాలకవర్గాలు కొలువుదీరాయి. బీసీ రిజర్వేషన్లో చైర్మన్ బండి వేణుగోపాల్ హయంలో దుకాణ సముదాయ నిర్మాణం పూర్తికాగా అప్పటి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. తర్వాత వచ్చిన చైర్మన్ సరాఫ్ నాగరాజు రెండేళ్ల పాటు కొనసాగారు. ఆయన పాలన అంతా ఎన్నికలు, కరోనా కాలంతో ముగిసింది. ఆ తర్వాత జనరల్ మహిళ రిజర్వేషన్లో చైర్పర్సన్గా వెంకట్రెడ్డి భాస్కరకుమారి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎస్సీ జనరల్ కేటగిరిలో ఎం.జ్యోతి చైర్పర్సన్ అయ్యారు. ఆమె పాలన ఏడాది పూర్తిగాకముందే ప్రభుత్వం మారడంతో పాలక వర్గాలు రద్దయ్యాయి. ప్రస్తుత మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి అయినా దృష్టిసారించాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా వాణిజ్య దుకాణ సముదాయం ● టెండర్లు నిర్వహించరూ.. దుకాణాలు కేటాయించరు ● మార్కెట్యార్డుకు సుమారు రూ.కోటి నష్టం ● రిజర్వేషన్లు ప్రతిపాదించినా..రిజర్వులోనే టెండర్లు నారాయణపేట: జిల్లాకేంద్రం నడిబొడ్డున వాణిజ్య దుకాణ సముదాయం ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ నిరుపయోగంగానే ఉంది. పాతబస్టాండ్ సమీపంలో రూ.1.56 కోట్లతో 28, రైతుబజార్ కాంప్లెక్స్లో రూ.38 లక్షలతో నిర్మించిన 16 దుకాణాలను 2018, ఫిబ్రవరి17న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో ఆర్టీసీ డిపోకు చెందిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు నిర్మించారు. అక్కడ అద్దెకు షెడ్లు వేసుకున్న వాటిని తొలగించడంతో వారు ఉపాధి కోల్పోతారని 2023లో రైతుబజార్లోని 16 దుకాణాలను అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో పలువురికి దుకాణాలను ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో కేటాయించారు. వాణిజ్య సముదాయంలోని దుకాణాలు టెండర్లకు నోచుకోక ఏడేళ్లు కావస్తుంది. కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టి సారించి దుకాణాలకు టెండర్లు పిలిచి కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు. రిజర్వేషన్లు ప్రతిపాదించినా.. వాణిజ్య సముదాయంలోని 28 దుకాణాల్లో 26 వాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. షెడ్యూల్ కులాల వారికి 4, షెడ్యుల్ తెగల వారికి 2, బలహీనవర్గాల వారికి (బీసీలకు) 6, దివ్యాంగులకు 1, జనరల్ కేటగిరికి 13 కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల వారీగా టెండర్ నిర్వహించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా జాప్యంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ● పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రహదారి విస్తరణ పూర్తయింది. ఇందులో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు వాణిజ్య సముదాయం ఎప్పుడు వినియోగంలోకి తీసుకువస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఏడేళ్ల కిందటే దుకాణాలకు టెండర్లు నిర్వహించి ఉంటే మార్కెట్యార్డుకు రూ.1.18 కోట్ల ఆదాయం వచ్చేదని చెబుతున్నారు. ఐదుగురు చైర్మన్లు మారినా.. -
ఆచూకీ లభించేనా..?
● ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం ● ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ● ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. అందుబాటులోకి కన్వేయర్ బెల్టు.. సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు
కొత్తకోట రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యమని.. నాబార్డ్ అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ మహబూబ్నగర్ క్లస్టర్ డీడీఎం మనోహర్రెడ్డి సూచించారు. మంగళవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక బలోపేతంతో గ్రామాలు గొప్పగా ఎదుగుతాయన్నారు. అనంతరం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని.. అన్నిరంగాల్లో రాణించే శక్తి వారి సొంతమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో విత్తనం పొలంలో నాటిన దగ్గర్నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్లో విక్రయించే వరకు మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయంలో రోజురోజుకు మహిళల ప్రాధాన్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అనంతరం ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ స్వయం సహాయక బృందాల మహిళలను విద్యార్థులు, ప్రొఫెసర్లు సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ భాస్కర్, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, కళాశాల ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ డా. ఆర్.పూర్ణిమా మిశ్రా, డా. విద్య, డా. గౌతమి, నవ్య, శ్వేత, ఏఈఓ రమేష్కుమార్, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. -
సీసీ నిఘాలో..
ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్తో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడి పట్టుబడితే విద్యార్థులు తమ విలువైన గమ్యాన్ని కోల్పోతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
రాయితీని సద్వినియోగం చేసుకోండి
నారాయణపేట టౌన్: అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకాన్ని ప్రకటించిందని, తాజాగా దీనిపై ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై పేట పుర పాలక సంఘం కార్యాలయంలో మంగళవారం డాక్యుమెంట్ రైటర్లకు, లైసెన్స్ ఇంజినీర్లు, సర్వేయర్లు, రియల్ ఎస్టేట్ వాపారులతో పుర కమిషనర్ భోగేశ్వర్లు అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపల్ పరిదిలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేసన్ జరిగితే మిగితా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయ దస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందన్నారు. సందేహాలకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాగా సమావేశంలో పలువురు రియల్ వ్యాపారులు సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కిరణ్కుమార్ నివృత్తి చేశారు. -
సర్వం సిద్ధం
నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు వివరాలు 8లో uనారాయణపేట రూరల్/నారాయణపేట ఎడ్యుకేషన్: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో మొత్తం 8,791 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3635, ఒకేషనల్లో 521మంది, ద్వితీయ సంవత్సరంలో 4049, ఒకేషనల్లో 586మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నారాయణపేటలో 4, మక్తల్లో 3, కోస్గి, ధన్వాడలలో రెండు, మిగితావి మద్దూర్, దామరగిద్ద, ఊట్కూర్, మాగనూర్, మరికల్లలో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు రెగ్యులర్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. వసతుల కల్పన.. విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించారు. విద్యార్థులందరూ 8.30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకొని, సెంటర్లో వారికి కేటాయించిన స్థానంలో 8.45 నిమిషాలకు కూర్చోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఎండ తాకిడి తట్టుకోవడానికి వీలుగా పరీక్ష కేంద్రాల ఆవరణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రతి పరీక్ష కేంద్రంలో ముగ్గురు చొప్పున ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ఇక పరీక్ష కేంద్రంలో డబుల్ డెస్క్ బెంచీలు.. వెలుతురు, గాలి వచ్చే గదుల్లోనే నెంబర్లు వేసేలా గైడ్ చేశారు. ప్యాన్లు ఏర్పాటు చేయాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. కేంద్రాల ఆవరణ పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే సమయాలలో అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి వేయనున్నారు. విద్యార్థులు ఎవరూ కూడా పరీక్ష కేంద్రాల లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని ఆదేశించారు. సిబ్బంది కేటాయింపు ఇలా.. పరీక్షల నిర్వహణకు 16 మంది సీఎస్లు, నలుగురు అడిషనల్ సీఎస్లు, 16 మంది డీఓలు, నలుగురు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్, మరొక సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను, 450 మంది ఇన్విజిలేటర్లు నియమించారు. 12 చోట్ల ప్రభుత్వ కళాశాలలు, మరో 4 ప్రైవేటు కళాశాలలు ఉండటంతో అక్కడ మాత్రం అడిషనల్ సీఎస్ల నియామకం చేశారు. ఇక ఇన్విజిలేటర్లుగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కళాశాల సిబ్బందిని తీసుకోగా, తక్కువ ఉన్నచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ప్రశ్నపత్రాలను 8 స్టాక్ పాయింట్లలో భద్రపరిచారు. పరీక్షల నిర్వహణకు రెండు రకాల కమిటీలు పని చేస్తున్నాయి. హై పవర్ కమిటీలో చైర్పర్సన్గా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కన్వీనర్గా డీఐఈఓ సుదర్శన్రావు కమిటీలో ఒక సీనియర్ ప్రిన్సిపల్ ప్రతాప్రెడ్డి, ఒక లెక్షరర్ అంబాజీ ఉన్నారు. స్ట్రాంగ్ రూం ఇన్చార్జ్గా విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు. ఇన్విజిలేటర్లు5 నిమిషాల గ్రేస్ టైమ్ గతంలో అమలు చేసిన ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేస్త్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత 5 నిమిషాల వరకు గ్రేస్ టైమ్ ఉంటుంది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షలకు సంబందించి విద్యార్థి హాల్టికేట్ పై సంబందిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరంలేదు. ఇంటర్ నెట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నేరుగా డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు వెళ్లే అవకాశం ఉంది. కళాశాల వెబ్సైట్లో సైతం హాల్టికెట్లు ఉండటంతో చాలా వరకు విద్యార్థులు కాలేజీకి వెళ్లి సైతం తీసుకున్నారు. ఫీజు బకాయిల విషయంలో కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం... జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మొత్తం 16 పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్టికెట్లు అందాయి. పరీక్షకు గంట ముందు కేంద్రానికి రావడంతో పాటు అన్ని రకాల పరీక్ష సామాగ్రి వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – సుదర్శన్, డీఐఈఓ జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 8,791మంది విద్యార్థులు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..పకడ్బందీ ఏర్పాట్లు నిమిషం నిబంధన ఎత్తివేత రెగ్యులర్ విద్యార్థులు 7,684ఒకేషనల్ విద్యార్థులు 1,107450 -
పనితీరులో మార్పు రావాలి
నారాయణపేట: నియోజకవర్గంలోని ఐకేపీ అధికారులు, సిబ్బంది పనితీరులో ఇక మార్పు రావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిల్కొండలోని ఐకేపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నందన్నారు. మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు పొందిన రుణ బకాయిలను సమయానికి కట్టించాలని.. వారికి మరింత రుణ సదుపాయం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. ఇలాంటి పథకాలను మరెన్నో రూపొందించి జిల్లాలోని అన్ని సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రొత్సహించాలన్నారు. బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఫలాలను అర్హులైన వారందరికి అందుతాయన్నారు. ఇది వరకు జరిగిన వాటిని తాను అడగదలచుకోలేనని..గతం గతహాః ..రాజకీయాలను పక్కనపెట్టి పార్టీల కతీతంగా మహిళా సంఘాల సభ్యులకు అన్ని విధాలుగా ప్రొత్సహించాలన్నారు. ఐకేపీలోని వీఏఓలు, ఏపీఎంలు, సీసీలు తమ పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తుంటామన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో ఇంచార్జీ డీపీఎం ఆనందం, సీసీలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ వైద్యం
ఆస్పత్రి ప్రధాన భవనం సీ–బ్లాక్ పాలమూరు: ఇకపై ప్రతి చిన్న రోగానికి హైదరా బాద్కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు. కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన అత్యాధునిక వైద్యసేవలు త్వరలో పాలమూరులోనే అందుబాటులోకి రానున్నాయి. అన్ని హంగులతో నిర్మించనున్న నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి జిల్లా పేదలకు ఆరోగ్య ప్రదాయినిగా మారనుంది. ప్రతి విభాగానికి చెందిన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరా లజీ వంటి ప్రధాన సమస్య తీరనుంది. పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్థలంలో 2022 జూన్లో రూ.200 కోట్ల వ్యయంతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ఐదు బ్లాక్లుగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏ, బీ, సీ, డీ బ్లాక్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వీటిలో పెయిటింగ్, కరెంట్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయి. అక్కడక్క డ వాటర్ సంపు, పోస్టుమార్టం విభాగం, ఆక్సిజన్ పైప్లైన్, విద్యుత్ పనులు, ఎస్టీపీ, డ్రెయినేజీ, గ్లాస్ వర్క్, గ్రిల్స్ ఏర్పాటు చేసే పనులు చేస్తున్నా రు. ప్రధాన వైద్యసేవలు సీ–బ్లాక్లో నిర్మించనున్నా రు. జూన్ చివరి నాటికి సివిల్ పనులతో పాటు మైనర్ పనులను సైతం పూర్తి చేసి అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రధాన ముఖ ద్వారం ఎల్లమ్మ గుడి వెనుక భాగంలో రావడంతో అక్కడి నుంచి రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రి చుట్టూ డివైడర్తో రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం జెడ్పీ గ్రౌండ్ స్థలంలో నిర్మిస్తున్నారు. ● ప్రస్తుతం నిర్మిస్తున్న ఆస్పత్రి ప్రధాన ముఖద్వారం నిర్మించే స్థలంలో ఫోరం భవనం ఉంది. ఫోరం కార్యకలాపాలు ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నాయి. ఫోరం కోసం పాత డీఈఓ కార్యాలయం లేదా పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. పాలమూరులో 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలో అందుబాటులోకి రానున్న అత్యాధునిక వైద్యసేవలు రూ.200 కోట్లతో ఐదు బ్లాక్ల నిర్మాణం నాలుగు విభాగాల పనులు దాదాపు పూర్తి, పెండింగ్లో ఈ–బ్లాక్ పనులు -
సొంతింటి కల నిజం చేస్తాం
ధన్వాడ: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని.. ఇల్లు లేని వారందరికీ సొంతింటి కల నిజం చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కంసాన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండలంలో మొదటి విడతలో ఎంపికై న కంసాన్పల్లి గ్రామంలో నిర్మాణ పనులు లబ్ధిదారులు మొదలు పెట్టారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలో దళితల కేటాయించిన భూమిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోరు పాయింట్లకు భూమి పూజలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు రైతులకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోర్లు మంజూరయ్యాయి. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. -
తుది దశలో నిర్మాణ పనులు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ–బ్లాక్ మాత్రం ఈవీఎం భవనం ఉండటం వల్ల పూర్తి కాలేదు. ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఈవీఎం భవనంపై స్పష్టత వస్తే ఈ–బ్లాక్ కూడా పనులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ నూతన ఆస్పత్రిని ఎప్పుడూ ప్రారంభం చేస్తుందనే అంశంపై స్పష్టత రాలేదు. – డాక్టర్ సంపత్కుమార్ సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కొనసాగుతున్న అన్వేషణ
అచ్చంపేట/మన్ననూర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు సోమవారం పదో రోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నాయి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తుంది. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. సహాయక చర్యలు వేగవంతం సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్టు పనులు వేగవంతం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద రెస్క్యూ బృందాల ఆపరేషన్లో పాల్గొన్న సహాయక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని తొలగించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. 12 సంస్థలకు సంబంధించిన బృందాలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని, సమస్యలు ఎదురువుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకుపోతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జాడ గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టామని, దీని కోసం ప్రత్యేక యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి, మైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. బురద, ఊట నీరే ప్రధాన సమస్య నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం -
బాధ్యతాయుతంగా పని చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలో డీపార్ట్మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండ్లకు 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ విధి విధానాలపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించగా.. కలెక్టర్ హాజరై మాట్లాడారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని, సీఎస్, డీఓలు, ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు తీసుకురావద్దని, విద్యార్థుల నుంచి కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మెత్తం 39 పరీక్ష కేంద్రాలు ఎంపిక చేయబడ్డాయని మొత్తం 7637 విద్యార్థులు రెగ్యులర్గా, 65 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, 39 చీఫ్ సూపరింటెండ్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఆరుగురు కస్టోడియన్లు, ముగ్గురు ప్లైయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్ఈఓలు కృష్ణారెడ్డి, బాలాజీ, ఏసీజీ ఆంజనేయులు, సీఎమ్ఓ రాజేంద్ర కుమార్, యాదయ్య శెట్టి, ఉపాద్యాయులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలి విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో నూతన ఉపాద్యాయులకు స్థానిక కెజీబీవీ పాఠశాలలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తూ జిల్లాను ఎస్ఎల్ఎన్ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. ఏ రకమైనా బోధన పద్దతి తరగతికి సరిపోతుందో అందుకు అనుగుణంగా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ అధికారి విద్యాసాగర్, కోర్సు కో ఆర్డినేటర్ కృష్ణా రెడ్డి, మద్దూర్ ఎమ్ఈఓ బాల కిష్టప్ప, ఎస్ఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
హైరిస్క్ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట: జిల్లాలో హైరిస్క్ గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేలా వైద్యులు, ఏఎన్ఎంలు చూడాలని, ఈమేరకు ప్రతి గర్భిణికి ముందస్తు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం స్కిల్ డెవలప్మెంట్ హాల్లో జిల్లాలోని ఏఎన్ఎంలకు హైరిస్క్ ప్రసవాలపై డీఎంహెచ్ఓ, డాక్టర్లు శైలజ,రోహిణి చెవని అర్మాన్ ఆర్గనైజేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు ఎల్ఎంపీ రిజిస్టర్ ఆధారంగా అర్హులైన గర్భిణులను నిశ్చయ్ కిట్ల ద్వారా పరిక్షిస్తూ నమోదు చేయాలన్నారు. ప్రతి ఏఎన్ఎం ఒక గర్భిణిని నమోదు చేసే ముందు కుటుంబానికి సంబందించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని, ఏవైనా ప్రమాద సంకేతాలు (కారణాలు) ఉన్నాయో లేదో తెలుసుకోవాలని, బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ట్రైమిస్టర్లలో వారాల ప్రతిపాదికన కాకుండా పర్ అబ్దమెన్ ద్వారా పరీక్షించాలన్నారు. అనీమియా (రక్తహీనత), అధిక రక్తపోటు, మధుమేహం, మూర్చ, గత సిజేరియన్ సెక్షన్ వివరాలు, గర్భదారణ సమయంలో హెచ్ఐవి మొదలగు వాటిపై తెలియజేస్తూ, విపులంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో గోవిందరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి నారాయణపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడు రాచమల్ల సిద్దేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రివ్యూ సమావేశం డీసీసీ అధ్యక్షుడే కె.ప్రశాంత్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న, జిల్లాలోని పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం
నారాయణపేట రూరల్: పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి విశ్వాసం, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత పునాదులపై విజయ సాధనాన్ని నిర్మించుకోవాలని, విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఉన్న కొద్ది సమయాన్ని పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలో గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్ విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి ఇలాంటి టాలెంట్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ శ్రద్ధ, ఏకాగ్రతను కలిగి పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్ పూర్తి కావడంతో రివిజన్పై దృష్టి సారించాలని, గ్రాండ్ టెస్ట్ లపై ఫోకస్ పెట్టాలని కోరారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని, మిత ఆహారాన్ని తీసుకోవాలని, యోగ, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా టాపర్లుగా నిలిచిన ముగ్గురు ప్రభుత్వ, మరో ముగ్గురు ప్రైవేటు విభాగాల్లోని విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించాలి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలో జిల్లాలోనూ విద్యారంగంలో బాలికలదే పై చేయిగా ఉందని అన్నారు. తల్లిదండ్రులు సైతం బాలిక విద్యను ప్రోత్సహించాలని, అన్ని విషయాల్లోనూ అమ్మాయిలకు తోడ్పాటున అందించాలని కోరారు. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం పూసల్ పహాడ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు సాంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలని, తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని, సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విషయాల వారీగా సీనియర్ సబ్జెక్ట్ టీచర్లు మెలకువలను తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, నిర్వాహకులు షేర్ పారిజాత, కృష్ణారెడ్డి, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి నాగార్జున్ రెడ్డి, ఏపీవో సురేష్, ఎంఈఓ బాలకిష్టప్ప, డీఎస్ఓ భాను ప్రకాష్, నరసింహ, రఘురామేశ్వర్, రాజేష్ కుమార్ పాల్గొన్నారు. పరీక్షల వేళ స్పష్టమైన లక్ష్యంతోవిద్యార్థులు ముందుకు సాగాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
పాలమూరు రుణం తీర్చుకుంటా
నారాయణపేటసోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. ● నాలుగు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు కక్షపూరిత డబ్బుతో కూడిన రాజకీయాలను ఏనాడు చేయలేదని.. ఐదేళ్ల క్రితం వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల నియోజకవర్గ రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం అన్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారి పేర్లను ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీటి ఎత్తిపోతల పథకాలకు పెడతామని... వేదికపైనే ఈ విషయం గురించి సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్రెడ్డి, శంకర్, వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. పాలమూరు వాసులుఅమాయకులేం కాదు.. దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్రెడ్డి పేర్కొన్నా రు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాలకేటాయింపుల్లో అన్యాయం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం పాలమూరు అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి -
పడకేసిన పల్లె పాలన
మరికల్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఏడాది క్రితం పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలతోపాటు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఏ గ్రామంలో చూసినా పారిశుద్ధ్య సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోడ్లపైనే మురుగు, చెత్తా చెదారం పారుతున్నాయి. వేసవి ఇంకా రాకముందే తాగునీటి సమస్య కొన్ని గ్రామాల్లో ఉత్పన్నమవుతోంది. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా గ్రామాల వైపు ప్రత్యేకాదికారులు కన్నెత్తయినా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులతో చిన్న చిన్న పనులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 16వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి ఆలస్యం అవుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులు వేతనాలు, ఇతర బిల్లులకు కూడా సరిపోవడం లేదు. పల్లెల్లో పన్నుల వసూలు అంతంత మాత్రమే కావడంతో మోటార్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, ట్రాక్టర్ డీజిల్, ఇతర ఖర్చులకు నిధులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక వేసవి కాలంలో నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారులపై పని ఒత్తిడి అత్యధిక గ్రామాల్లో ప్రత్యేక అధికారులు గ్రామ సభలు, తీర్మానాలు, వేతనాల చెల్లింపులతో పాటు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీలకు వచ్చేందుకు ప్రత్యేక అధికారులు ముఖం చాటేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ సభలు వేతనాలతో చెల్లింపులతో పాటు అభివృద్ధి పనుల బిల్లుల విషయంలో ప్రత్యేక అధికారులు సంతకాలు చేయడం లేదని వాపోతున్నారు. కొన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే సమయం తీరిక లేకపోవడంతో బిల్లు చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. నిధుల జాడేది..? గ్రామాల్లో పాలకవర్గాలు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక కమిషన్ (ఎస్ఎఫ్సీ) కేంద్ర ఆర్థిక కమిషన్(సీఎఫ్సీ) నిధులు వస్తాయి. పాలకవర్గాలకు గడువు ముగియడంతో ఏడాది కాలంగా నిధులు విడుదల కావడం లేదు. చిన్న పంచాయతీల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే అరకొర ఆదాయం ఖర్చులో 20–30 శాతానికి కూడా సరిపోవటం లేదు. విద్యుత్ దీపాల నిర్వహణ, పైపులైన్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, సామగ్రి కొనుగోలు, మల్టీపర్సన్ కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు భారంగా మారాయి. గ్రామాల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులు ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు మురుగు కూపాలను తలపిస్తున్న వీధులు ఏడాదిగా విడుదల కాని నిధులు అంతంతమాత్రంగానే పన్ను వసూళ్లు -
తాగునీటి సమస్య తీవ్రమవుతోంది
గ్రామంలో తాగునీటి సమస్య రోజు రోజుకు జఠిలంగా మారుతుంది. మిషన్ భగీరథ నీళ్లు సంక్రమంగా రాకపోవడంతో బోరు బావుల వద్ద నుంచి నీటిని తీసుకొస్తున్నాం. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీల కారణంగా నెలలో వారం రోజులు నీరు రావడం లేదు. గ్రామ శివారులోని పొలాల వద్దకు వెళ్లి బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. – లక్ష్మమ్మ, ఇబ్రహీంపట్నం అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ ఆర్నెళ్ల నుంచి కాలనీల్లో విద్యుత్ దీపాలు వెలగక చీకట్లో గడుపుతున్నాం. లైట్లు వేయాలని కార్యదర్శి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన లైట్లు రాలేదని సమాధానం చెప్పుతున్నారు. గ్రామంలో మురుగు రహదా రులపై పారుతుడంటంతో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. – తిరుపతయ్య, అప్పంపల్లి నిధులు మంజూరు కావాల్సి ఉంది గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పెండింగ్ బిల్లులతో పాటు విధి దీపాలు, డ్రైనేజీలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరిస్తాం. – కృష్ణ, డీపీఓ, నారాయణపేట ● -
ఆశలు వదులుకున్నా..
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
నారాయణపేట: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఎన్ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ, జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిరోధానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని నివారించాలని, డ్రగ్స్ విక్రయదారులు యువతనే లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు. మన పరిసరాలలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిస్తే సామాజిక బాధ్యతగా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే ఎలాంటి ప్రభావాలు చూపుతాయని, వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయని పీపీటీ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల సమాచారాన్ని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే సెల్ఫోన్ నంబర్ 8712671111 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్ కి సంబంధించిన అవగాహన వాల్పోస్టర్ ఆవిష్కరించి, విద్యార్థులు, లెక్చరర్స్తో ప్రతిజ్ఞ చేయించారు.ఎకై ్సజ్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సునిత, ఎకై ్సజ్ ఎస్సైలు పాల్గొన్నారు. చింతపండు క్వింటాల్ రూ. 8,040 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 19 క్వింటాళ్ల చింతపండు రాగా.. క్వింటాల్కు గరిష్టం రూ.8,040, కనిష్టం రూ.5,011 ధరలు పలికాయి. అలాగే, శనగలు 5 క్వింటాళ్లు రాగా.. గరిష్టం, కనిష్టం రూ.5,755, వేరుశనగ 104 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,160, కనిష్టం రూ.3,920, జొన్నలు 42 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.4,021, కనిష్టం రూ.3012, అలసందలు 10 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,671, కనిష్టం రూ.6,609, ఎర్ర కందులు 241 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,585, కనిష్టం రూ.5,329 ధర పలికాయి.