breaking news
Narayanpet District Latest News
-
దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత వాజ్పేయి
నారాయణపేట: దేశం గర్వించదగ్గ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం మాజీ ప్రధాని జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వాజ్ పాయ్ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. రాజకీయాల్లో విలువలు పెంచిన మహానాయకుడని.. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు నేటి యువత ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ, జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి సుజాత, సత్య రఘుపాల్, పోషల్ వినోద్, మిర్చి వెంకటయ్య, శ్యామ్ సుందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని చర్చిలలో గురువారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. నారాయణపేటలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. యాద్గిర్ రోడ్డులోని ప్రధాన చర్చి, సింగారంలోని చర్చిలో ఉదయం ప్రత్యేక ప్రార్థనలను, క్రీస్తూ బోధనలు, పలువురి నాటక ప్రదర్శన నిర్వమించారు. అలాగే, మహిళల గీతాలాపన, కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పాస్టర్లు అమృతం, నాగేష్ యేసయ్య పుట్టుక, చరిత్రతోపాటు ప్రవచనాలు వినిపించారు. సర్వోన్నతుడైన యేసుక్రీస్తూ మానవాళికి మార్గదర్శకుడని, అందరిని రక్షించడానికి వచ్చాడన్నారు. ఇదిలాఉండగా, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, యువతీ యువకులు గీతాలాపన, డ్రామా కార్యక్రమాలు అలరించాయి. చర్చి పాస్టర్లు, మత పెద్దలు, ఇతర రాజకీయ నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంతోపాటు మండలాల పరిధిలోని పలు చర్చిలలో పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సంఘం చైర్మెన్ వినోద్ కుమార్, కార్యదర్శి ఆనంద్, సంఘం పెద్ద రత్నయ్య, దేవిపుత్ర మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు. 2 టీఎంసీల నీరు.. కోయిల్సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వల యాసంగి సీజన్ పంటలకు సాగునీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. దేవరకద్ర మండలంలో ఎడమ కాల్వ పూర్తిస్థాయిలో ఉండగా.. కుడి కాల్వ కింద ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాలు ఉన్నాయి. అయితే పాత ఆయకట్టు ప్రకారం 12 వేల ఎకరాల మేర ఉండగా అందులో పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. వానాకాలంలో దాదాపు మూడు నెలలపాటు నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని దీనివల్ల దాదాపు 35 వేల ఎకరాల మేర సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి, మరో టీఎంసీ వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రణాళిక సిద్ధం చేశాం.. కోయిల్సాగర్లో ఉన్న నీటిని సద్వినియోగం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న రెండు టీఎంసీల నీటిలో సాగుకు ఒక టీఎంసీ, తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీని ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. యాసంగి సీజన్ పంటల కోసం రైతులు ఇప్పటికే వరినారు మడులు సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనివల్ల నేరుగా నాట్లు వేసుకోడానికి నీటిని వదిలేందుకు తేదీలను ఖరారు చేశాం. – ప్రతాప్సింగ్, ఈఈ, కోయిల్సాగర్ ప్రాజెక్టు కోయిల్సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు పాత ఆయకట్టు 12 వేల ఎకరాలకే అవకాశం జనవరి 5 నుంచి ఏప్రిల్ 14 వరకు అయిదు తడులు ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 32.2 అడుగులు -
పరిహారం.. పరిహాసం
జడ్చర్ల: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్అండ్ఆర్) పరిహారం పరిహాసంగా మారింది. గతంలో కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారాన్ని డిసెంబర్ 9లోగా అందిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సైతం పలుసార్లు ఇదేమాట చెప్పారు. దీంతో తమకు నిర్ణీత గడువులోగా పరిహారం అందుతుందని ఆశించిన నిర్వాసితులకు చివరికి నిరాశే మిగిలింది. ఎప్పడెప్పుడా అంటూ నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. కోడ్ అమలు నేపథ్యంలో.. ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన డిసెంబర్ 9 గడువు పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా అంతరాయం ఏర్పడింది. కోడ్ అమలు సమయంలో నిధులు విడుదలకు అవకాశం లేకపోయింది. అయితే ఎన్నికల కోడ్ ముగియడంతో త్వరితగతిన అవార్డు పాస్ చేసి పరిహారాన్ని విడుదల చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఏమైనా ఎన్నికలు వస్తే మరోసారి కోడ్ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని, ఆలోగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదండాపూర్ వాసులకు పెండింగ్ ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని వల్లూరు గ్రామంతోపాటు ఒంటిగుడిసె తండా, చిన్నగుట్టతండా, రేగడిపట్టతండా, తుమ్మలకుంటతండా, సామగడ్డతండా నిర్వాసితులకు దశల వారీగా రూ.250 కోట్ల ఆర్అండ్ఆర్ పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలలో ఇప్పటికే జమ చేశారు. అయితే ఉదండాపూర్ గ్రామానికి సంబంధించి మాత్రం ఆలస్యంగా సర్వే పూర్తి కావడంతో ఆర్అండ్ఆర్ పరిహారానికి సంబంధించి అవార్డు పాస్ కాలేకపోయింది. గతంలో నిర్వహించిన సర్వేలో బోగస్ కుటుంబాల నమోదు ఉన్నాయన్న ఆరోపణలు, ఫిర్యాదులపై అధికారులు రీసర్వే చేపట్టారు. ఫలితంగా అవార్డు పాస్ కాక నిధులు విడుదల కావడంలో జాప్యం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ ఉదండాపూర్ అవార్డు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవార్డు పాస్ అయితేనే ఆర్అండ్ఆర్ నిధులు విడుదల కానున్నాయి. పెంపుపై కసరత్తు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పెంపునకు కృషిచేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆర్అండ్ఆర్కు సంబంధించి గత ప్రభుత్వం రూ.16.30 లక్షల ప్యాకేజీని ప్రకటించగా.. దీనిని రూ.25 లక్షలకు పెంచుతామని ఎమ్మెల్యే చెప్పారు. అయితే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పెంపుతో ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు పాత ప్యాకేజీ ప్రకారంగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా.. ఇటీవల ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం పెంపు కోసం సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించగా.. ప్రభుత్వం అదనంగా రూ.146 కోట్ల విడుదల కు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు ఇదివరకే ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ ఆర్అండ్ఆర్ పరిహారం కేటాయింపులో వేర్వే రుగా ప్యాకేజీ ఖరారు చేశారు. తాజా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం తప్పని ఎదురుచూపులు ఈనెల 9లోగా అందిస్తామన్న సీఎం.. ముగిసిన గడువు పంచాయతీ ఎన్నికల కోడ్తో నిధుల విడుదలలో జాప్యం ఆందోళనలో ఉదండాపూర్ నిర్వాసితులు ఇప్పటికే ప్యాకేజీ పెంపు ప్రకటించిన ప్రభుత్వం రూ.18 లక్షలకు పెంపు..? ఉదండాపూర్ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం కింద ఒక్కో కుటుంబానికి రూ.16.30 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే 65 ఏళ్లు పైబడిన ఒంటరి వ్యక్తులను సైతం ఒక కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించనున్నట్లు సమాచారం. న్యాయం చేయాలి.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా ఇప్పటి వరకు ప్యాకేజీ అందలేదు. గతంలోనే ప్యాకేజీ ఇచ్చి ఉంటే అప్పట్లో తక్కువ ధరలకు ప్లాట్లు, ఇతరత్రావి కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెరిగిన ధరలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం దేనికీ సరిపోదు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చెప్పిన విధంగా ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచి న్యాయం చేయాలి. – హన్మంతు, నిర్వాసితుడు, ఉదండాపూర్ -
అడిషనల్ కలెక్టర్ బదిలీ
నారాయణపేట రూరల్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నారాయణపేట లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టరర్గా విధుల నిర్వర్తిస్తున్న సంచిత్ గంగ్వార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మల్కాజ్ గిరి విభాగం జోనల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న నారాయణ్ అమిత్ మలెంపాటిని నారాయణపేటకు కేటాయించారు. ప్రస్తుతం నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సైతం సెలవులో ఉండడంతో ఇన్చార్జి కలెక్టర్గా ఎఫ్ఎసీ బాధ్యతలను సంచిత్ గంగ్వార్ వ్యవహరిస్తున్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని మహబూబ్నగర్ గిరిజన సంక్షేమ అధికారి జనార్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 8వ తరగతి ఎస్సీ, ఎస్టీ బాలురకు రూ.వెయ్యి, బాలికలకు రూ.1500, రాజీవ్ విద్యా దీవెన కింద 9, 10వ తరగతి డే స్కాలర్ విద్యార్థులకు రూ.2250 అందజేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈపాస్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్థి ఫొటో, ఆదార్కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్బుక్కు, రేషన్కార్డు, కులం, ఆధాయ ధ్రువపత్రాలు అవసరమని తెలిపారు. అన్ని వివరాలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసి ఈ పాస్ ద్వారా పూర్తి చేసిన దరఖాస్తులను మంజూరు కొరకు మహబూబ్నగర్ కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈ నెల 31 లోపు అందజేయాలని తెలిపారు. పద్యాకృతుల ఆవిష్కరణ మహోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లాశాఖ ఆధ్వర్యంలో ప్రముఖ కవి రాచాలపల్లి బాబుదేవిదాస్రావు రచించిన ‘రామచంద్ర ప్రభో’, ‘చిత్రాంగద– సారంగధరుడు’ పద్యకృతుల ఆవిష్కరణ మహోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. జాతీ య సాహిత్య పరిషత్ జిల్లాశాఖ అధ్యక్షుడు ఇరివింటి వెంకటేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ సాహిత్యం జగద్వితం కోసం సృష్టించబడుతుందన్నారు. కవులు సమాజ హితాన్ని కోరుకుంటారని తెలిపారు. ముఖ్య అతిథి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రామచంద్ర ప్రభో కావ్యం సరళమైన, సుందరమైన సుమధుర తెలుగు భాషలో అందించినట్లు తెలిపారు. ఇందు లో ప్రాచీన కవుల గుంబనం, లలిత పదజాతం ఆకట్టుకుంటుందన్నారు. రామచంద్రప్రభో మకుటంతో ఆద్యంతం పద్యాలను ఎంతో శ్రావ్యంగా చదువుతూ బాబుదేవిదాసును అభినందిస్తూ సమీక్ష చేశారు. డాక్టర్ పొద్దుటూరు ఎల్లారెడ్డి రామచంద్రప్రభో మకుటం ఉన్న 131 పద్య కావ్యాన్ని, పద్యాలను చదువుతూ రామ కథను అసాంతం పరి చయం చేశారు. డాక్టర్ తంగెళ్లపల్లి శ్రీదేవి చిత్రాంగద–సారంగధరుడు కథను 126 ప్యదాల కృతిని సమీక్ష చేస్తూ చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రముఖ న్యాయవాది వి.మనోహర్రెడ్డి, అవధాని చుక్కాయపల్లి శ్రీదేవి, డాక్టర్ కె.బాలస్వామి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ పద్యకృతులపై ప్రసంగించారు. కార్యక్రమంలో పాలమూరు నగర అధ్యక్షులు జి,శాంతారెడ్డి, కవులు ప్రభులింగంశాస్త్రి, దేవదానం, రవీందర్రెడ్డి, ఖాజా మైనొద్దీన్, జగపతి రావు, గడ్డం వనజ, డాక్టర్ కృష్ణవేణి, జమున, ఈశ్వరమ్మ, గుముడాల చక్రవర్తి, శ్యాంప్రసాద్, అను రాధ, వీరేందర్గౌడ్, శ్రీరాములు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) పేరిట ఏటా అందజేసే యువ పురస్కార్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్తేజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ప్రముఖ రంగాల్లో విశేష కృషి చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల వివరాలతో దరఖాస్తుదారులు ఆదివారంలోగా sosabvptg@gmail.com కు పంపుకోవాలన్నారు. పూర్తి వివరాలకు పాలమూరు విభాగ్ ప్రముఖ్ రామచందర్ (సెల్ నం.9440981137)ను సంప్రదించాలని సూచించారు. -
వరి క్వింటా రూ.2,480
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా వరికి (హంస)గరిష్టంగా రూ.2480, కనిష్టంగా రూ.2030 ధర పలికింది. అలాగే, వరి (సోనా) గరిష్టంగా రూ.2,789, కనిష్టంగా రూ.2,200, ఎర్ర కందులకు గరిష్టంగా రూ.7,680, కనిష్టంగా 5,600, తెల్ల కందులకు గరిష్టంగా రూ.7,680, కనిష్టంగా రూ.6,200 ధరలు పలికాయి. 27న అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లా కేంద్రం సింహగిరిలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో ఈనెల 27న దూపదీప నైవేద్య అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ముఖాముఖి సమావేశం ఉంటుందని, 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంట వరకు అర్చకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల దూపదీప నైవేద్య అర్చకులు ఉదయం 11 గంటల్లోగా కల్యాణ మండపానికి చేరుకోవాలని కోరారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అర్చక చైతన్యయాత్ర ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ఉంటుందని తెలిపారు. ‘పోరాటాలకు సిద్ధం కావాలి’ వనపర్తిటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగగా.. ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ముఖ్యఅతిథులుగా హాజరై టీఎఫ్ఐ, టీఎస్టీయూఎఫ్ జెండాలను ఆవిష్కరించారు. జంగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే లా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సంఘం నాయకులు కె.జ్యోతి, బి.వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్గౌడ్, అరుణ, ఆర్.రామన్గౌడ్, మురళి, రాముడు, అగ్రిప్ప, రియాజ్, చెన్నకేశవులు, జి. కృష్ణ, అనసూయా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరేందర్ పాల్గొన్నారు. -
ఇదే స్ఫూర్తి కొనసాగించండి
నారాయణపేట: జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు విజయఢంకా మోగించారని, ఇదే స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులై కృషి చేయాలని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాలో బీజేపీ మద్దతుదారులుగా విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ముందుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్ర పటానికి నివాళులు ఎంపీ అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో పదేళ్లుగా పాలన అందించిన బీఆర్ఎస్పై ప్రజలు కోపం వచ్చి కాంగ్రెస్కు పట్టం కట్టారని.. సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, జీపీలకు కేంద్ర నిధులు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వల నుంచి పైసా రాలేదన్నారు. చేసిన పనులకు బకాయిలు రాక గత సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. డబ్బులు లేవని సీఎం స్వయంగా చెబుతున్నారన్నారు. రెండేళర్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామ గ్రామాన ఎండగట్టడంతో పాటు.. కేంద్ర పథకాలు వివరించాలన్నారు. బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ వర్క్ షాప్ త్వరలో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మరింత బలంగా పని చేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే పని చేయాలన్నారు. ఒక్కసారి తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తే దించే సత్తా ఏ పార్టీకి లేదని, ప్రజలే మళ్లీ గెలిపించుకుంటారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండు రెడ్డి, సత్య యాదవ్, పగడకుల శ్రీనివాసులు, కొండయ్య, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, డోకూరు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమష్టిగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
నర్వ: గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషిచేయాలని.. సర్పంచు అంటే నిరంతర ప్రజా సేవకుడు అని పశుసంవర్ధక, పాడి, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నర్వ సర్పంచు హన్మంతురెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రపతి సంతకం ఎంత ముఖ్యమో, గ్రామాభివృద్ధికి సర్పంచు సంతకం అంత ముఖ్యమని, ఎన్నికల వరకే పార్టీలు చూడాలని గ్రామాభివృద్ధిలో అందరు ఏకమై అభివృద్ధి సాదించుకోవాలన్నారు. గెలిచిన నాటి నుండే నర్వ మండలాన్ని దత్తత తీసుకున్నానని తన పదవి ముగిసే నాటికి మండలంలో బీటీ రోడ్లు లేని గ్రామాలు లేకుండా చేస్తానన్నారు. గ్రామంలో సీసీ రహదారులు, డ్రైనేజీల ఏర్పాటుకు రూ. 2 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని ఇందుకు పక్క ప్రణాళిక తయారు చేసుకొని కలవాలన్నారు. మండలంలోని ఎన్నో అపరిశ్కృత సమస్యల పరిష్కారానికి నా వంతు శక్తితో కృషిచేస్తానన్నారు. మండలంలో 300 ఇళ్ళు మంజూరు చేస్తే 120 మంది మాత్రమే కట్టారని మొత్తం పూర్తి చేస్తే వెయ్యి ఇళ్ళైన ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. నియోజకవర్గంలో 3600 ఇళ్లు ఇవ్వాలని సహచర మంత్రి పొంగులేటిని అడిగానన్నారు. రేపటి నుంచి మండల కేంద్రంలో పాడుబడ్డ ఇళ్లు, ముళ్ళపొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను జేసీబీ పెట్టి శుభ్రం చేయిస్తామని, మంత్రి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని నాయకుడు జలందర్రెడ్డి అన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, పోలీ స్ చంద్రశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, చెన్నయ్యసాగర్, జగధభిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శరణప్ప పాల్గొన్నారు. సోదరభావంతో పండుగలు జరుపుకోవాలి మక్తల్: ప్రజలంతా సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, ప్రభుత్వం క్రైస్తవుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవయే మాదవ సేవ అని.. పేదలకు సేవ చేస్తే ఎంతో మంచిదని, ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలని, ప్రేమ, విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు. ఆర్డీఓ రాంచదర్, నాయకులు లక్ష్మారెడ్డి. వెంకటేస్, శ్రీనివాసులు, పాస్టర్ జాన్సన్ గొల్లపల్లి నారాయణ, నాగేస్, రవికుమార్, గణేస్కుమార్, నారాయణ పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలకు సిద్ధం
● విద్యుద్దీపాలతో చర్చిల ముస్తాబు ● ఆకట్టుకున్న ముందస్తు వేడుకలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలను కిస్మస్ వేడుకలకు ముస్తాబు చేశారు. ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. నారాయణపేట పట్టణంలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని భైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాలలోని చర్చిలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. సింగారంలో ఉదయం యోసయ్యను స్మరిస్తూ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలను, క్రీస్తూ బోధనలు, డ్రామా కార్యక్రమం, మహిళలలచే గీతాలాపన, కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇదివరకే గ్రామంలో సెమి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రాకారంలో లైట్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా నారాయణపేటలోని బీసీ కాలనీలో ఉన్న చర్చిలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. యువతి యువకులు పాల్గొని గీతాలాపన, డ్రామాలతో అలరించారు. ● జిల్లా కేంద్రంలోని యాద్గిర్ రోడ్డు పక్కన ఉన్న ఎంబీ చర్చిను 1952 లో ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బిల్డింగ్ టన్ మత ప్రచారానికి వచ్చి చర్చ్ను ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు నడిచిన తర్వాత మోనోనైట్ బ్రదరాన్ అనే సంస్థవారికి అప్పజెప్పగా ఆ సంస్థ పేరు మీదనే దీనికి ఎంబీ చర్చి అనే పేరు వచ్చింది. తదనంతరం ఎంబీ సంస్థ స్థానికంగా ఉన్న రత్నయ్య అనే వ్యక్తి అప్పజెప్పగా 45 సంవత్సరాల నుండి ఆయననే చర్చి నిర్వహణ కొనసాగిస్తున్నారు. -
పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని కోస్గి పట్టణం ఓ ఫంక్షన్హాల్లో కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు. చదువుతోనే వెలుగులు ‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతిక్ జైన్, అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్రెడ్డి, వార్ల విజయ్కుమార్, రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్రెడ్డి, యూసూఫ్, శేఖర్, మద్దప్ప దేశ్ముఖ్, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తా ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే -
పోలీస్ సిబ్బందికి రివార్డులు
నారాయణపేట: పలు కేసులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదుచేయడం, కేసుల విచారణలో టెక్నాలజీ వినియోగం, ఉత్తమ సేవలు అందించిన జిల్లా పోలీసు సిబ్బందికి బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ శ్రీనివాసరావు రివార్డులు అందజేశారు. ఐటీ కోర్ టీమ్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, సభ్యులు మహేష్, మాగనూర్ టెక్ టీమ్ సభ్యుడు నీలయ్య గౌడ్, ధన్వాడ స్టేషన్ నుంచి వినయ్కుమార్లు రివార్డులు అందుకున్నారు. డిజిటల్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీస్ విభాగం చూపిస్తున్న కృషి ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని, టెక్నాలజీని సమర్థంగా వినియోగించినప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఈ రివార్డులు స్పష్టంగా చాటిచెబుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఎస్పీ వినీత్ రివార్డులు అందుకున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పీయూ అథ్లెటిక్స్ ఎంపికలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సౌత్జోన్, ఇంట ర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనే పాలమూ రు యూనివర్సిటీ అథ్లెటిక్స్ జట్లకు ఎంపికలు నిర్వహించారు. బుధవారం పీయూ పరిధిలో పోటీలను వీసీ శ్రీనివాస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్న వసతులను వినియోగించుకుని క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చన్నీళ్లే దిక్కు!
సంక్షేమ వసతిగృహాల్లో గీజర్లు, హీటర్లు కరువు నారాయణపేట/నారాయణపేట ఎడ్యుకేషన్/మక్తల్: రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలైనా మంచుదుప్పటి పర్చుకుని కనిపిస్తోంది. బయటికి రావాలంటే చలి చంపేస్తోందంటూ జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల్లో విద్యార్థుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలోని సంక్షేమ వసతిగృహాలను మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా పలు వసతిగృహాల్లో స్నానాల గదులు సరిగ్గా లేవు. సోలార్ ప్లాంట్లు మరమ్మతుకు గురయ్యాయి. గీజర్లు, హీటర్లు లేకపోవడంతో విద్యార్థులకు చన్నీళ్లే దిక్కవుతున్నాయి. కాలకృత్యాలతో మొదలుకొని స్నానాలు పూర్తయ్యే వరకు ప్రతి అవసరానికి చన్నీళ్లనే ఉపయోగించాల్సి వస్తోంది. తమ గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ కొందరు విద్యార్థులు క్రిస్మస్ పండుగ అంటూ ఇంటిబాట పడుతున్నారు. తగ్గుతున్న హాజరుశాతం.. జిల్లాలోని ఏ వసతిగృహాన్ని పరిశీలించినా విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు తగ్గుతూ వస్తుందని తెలిసింది. మొత్తం 13 ఎస్సీ వసతిగృహాల్లో 1,998 మంది విద్యార్థులు చేరాల్సి ఉండగా.. 1,758 మంది ఉన్నారు. అందులో 1,536 మంది వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్నారు. బీసీ వసతిగృహాలు 13 ఉండగా.. 1,688 సీట్లు ఉన్నాయి. వీటిలో 1,531 మంది ప్రవేశం పొందగా.. 1,053 మంది మాత్రమే హాస్టళ్లలో ఉంటున్నారు. విద్యార్థుల హాజరు తగ్గడంపై వసతిగృహ వార్డెన్లతో ఆరా తీస్తే.. క్రిస్మస్ సెలువులు ఉండటంతో స్వగ్రామాలకు వెళ్లారని చెప్పారు. అయితే చలి తీవ్రత అధికం కావడం.. వసతిగృహాల్లో వసతుల లేమితో అవస్థలు పడుతున్న విద్యార్థులు ఇంటిబాట పడుతున్నట్లు తెలుస్తోంది. చెడిపోయిన సోలార్ వాటర్ ప్లాంట్లు వణికించే చలిలోనే చన్నీటి స్నానాలు చేస్తున్న విద్యార్థులు కొన్ని హాస్టళ్లకు కిటికీలు, డోర్లు కూడా సరిగా లేని వైనం తగ్గుతున్న హాజరుశాతం -
మక్తల్ సమగ్రాభివృద్ధికి కృషి
మక్తల్: మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని 4, 5, 12 వార్డుల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా శ్మశానవాటిక లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని, తిర్మలయ్య చెరువును పునరుద్ధరించాలని, రూ. 2కోట్లతో ఖానాపురం రోడ్డు నుంచి ఏరుకలవాడ మీదుగా కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో ఇప్పటికే రూ. 1,035 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. రోడ్ల నిర్మాణం కోసం రూ. 70కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మక్తల్లో డిగ్రీ కళాశాల, 150 పడకల ఆస్పత్రి, రూ. 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అనంతరం 150 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, డైరెక్టర్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, కట్టా సురేశ్, హన్మంతు, తాయప్ప, నాగేశ్, శంషొద్దీన్, ఫయాజ్, శ్రీనివాసులు, సలాం తదితరులు పాల్గొన్నారు. -
నేడు కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లుసంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ డా.వినీత్తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్హల్తో పాటు సభాస్థలం, హెలిప్యాడ్ ఏర్పాటు, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను వారు పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతంగా పూర్తిచేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. అదనపు ఎస్పీలు, డీఎస్పీలను ఇన్చార్జీలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇద్దరు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలతో పాటు 93 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 600 మంది సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలతో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్ నాయక్, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్, డీఎస్పీ లింగయ్య, మహేశ్, సీఐ సైదులు తదితరులు ఉన్నారు. -
జీవాల్లో నట్టల నివారణ ముఖ్యం
నర్వ: జీవాల ఆరోగ్య సంరక్షణలో నట్టల నివారణ ముఖ్యమని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నర్వ మండలం పెద్దకడ్మూర్, పాథర్చేడ్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి.. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు రోజు రెండు గ్రామాల్లో నట్టల నివారణ మందు పంపిణీ చేస్తామని.. జీవాల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్లు సురేశ్, శ్రీలత పాల్గొన్నారు. పేదల హక్కులపై కేంద్రం కత్తి నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల హక్కులపై కత్తి నూరుతోందని ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సమాధి కట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా వీబీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఈ నల్ల చట్టాన్ని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాములు, సహాయ కార్యదర్శి హాజీ మాలంగ్ ఉన్నారు. ‘మీ సొమ్ము.. మీ హక్కు’పై అవగాహన నారాయణపేట: పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన బ్యాంకు డిపాజిట్లను తిరిగి పొందేందుకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించిందని ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ‘మీ సొమ్ము.. మీ హక్కు’పై అవగాహన సదస్సు నిర్వహించగా.. ఇన్చార్జి కలెక్టర్తో పాటు ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రెహమాన్, ఎస్బీఐ రీజనల్ ఆఫీసు నుంచి సీఎం సత్యప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్డీఎం విజయకుమార్ మాట్లాడుతూ... క్లెయిమ్ చేయని పొదుపు ఖాతాలను ఏ విధంగా తిరిగి స్వంత యజమానులు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సులో వివిధ బ్యాంకుల అధికారులు తమ బ్యాంకు స్టాళ్లను ఏర్పాటుచేసి సేవలను వివరించారు. అర్హులైన క్లెయిమ్ దారులకు సెటిల్మెంట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు షణ్ముఖచారి, జేమ్స్ డేవిడ్, ప్రదీప్, ప్రసన్నకుమార్, హిమాన్షు, సరుద్ధకర్ పాల్గొన్నారు. ఎర్ర కందులు క్వింటా రూ.7,811 నారాయణపేట: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డులో మంగళవారం ఎర్ర కందులు క్వింటా గరిష్టంగా రూ. 7,811, కనిష్టంగా రూ. 5 వేల ధర పలికింది. అదే విధంగా తెల్లకందులు గరిష్టంగా రూ. 7,725, కనిష్టంగా రూ. 6,200, నల్ల కందులు రూ. 6,329, వరి (సోనా) గరిష్టంగా రూ. 2,791, కనిష్టంగా రూ. 1,800, వరి (హంస) గరిష్టంగా రూ. 2,460, కనిష్టంగా రూ. 2,200 ధరలు వచ్చాయి. -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
నారాయణపేట: వేసవిలో గృహ, వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈ బాలస్వామి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీఎల్ఆర్ సెంటర్లో మంగళవారం విద్యుత్శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో వందశాతం విద్యుత్ బిల్లులు వసూలయ్యే విధంగా పనిచేయాలన్నారు. వేసవిలో వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమావేశంలో ఎస్ఈ డి.నవీన్కుమార్, డీఈ బీఎల్ నర్సింహారావు, డీఈటీ జితేందర్, ఏఈ మహేశ్గౌడ్ తదితరులు ఉన్నారు. -
గవర్నర్ దృష్టికి ప్రముఖుల సేవలు
జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్ దినకర్బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్, సెపక్తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్ క్రీడాకారుడు నున్సావత్ వెంకటేష్, పోచ రవీందర్రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్ గవర్నర్తో పరిచయం చేసుకున్నారు. దక్షిణకాశీలో ప్రత్యేక పూజలు దక్షిణకాశీ క్షేత్రానికి చేరుకున్న గవర్నర్కు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.హరీష్, ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంబ స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి, అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు జరిపించారు. అలాగే జోగుళాంబదేవిని దర్శించుకొని కుంకుమార్చన, విశేష పూజలు జరిపించారు. అంతకు ముందు అలంపూర్ చేరుకున్న గవర్నర్కు ఎంపీ మల్లురవి, కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విజయుడు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో గవర్నర్ సంయుక్త కార్యదర్శి భవానీశంకర్, ఏడీసీ మేజర్ అమన్ కుందూ, ఏడీసీ కాంతిలాల్ పటేల్, సీఎస్ఓ శ్రీనివాసరావు, వ్యక్తిగత కార్యదర్శి పవన్సింగ్, గద్వాల అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీఎస్పీ మొగలయ్య, పురావస్తు శాఖ ఇంజినీర్ కిశోర్కుమార్రెడ్డి, తహసీల్దార్ మంజుల పాల్గొన్నారు. చేనేత మగ్గం నేసి.. గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్ చేనేత స్టాల్ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్భవన్ను లోక్భవన్గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సంతోష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్ను జ్ఞాపికగా అందజేశారు. -
ట్యాంకు నీళ్లతో స్నానం చేస్తాం
ఎస్సీ వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ గ్రౌండ్ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతున్నా. హాస్టల్లో గీజర్ లేదు. బోరు నుంచి ట్యాంకుకు నీళ్లు ఎక్కిస్తారు. ఆ నీటితోనే స్నానం చేస్తాం. చలికాలం కావడంతో స్నానం చేసేందుకు వణికిపోతున్నాం. హాస్టల్లో గీజర్లు ఏర్పాటు చేయాలి. – నరేందర్, విద్యార్థి, ఎస్సీ వసతిగృహం, నారాయణపేట పైకప్పు పెచ్చులూడుతుంది.. మాది నారాయణపేట మండలంలోని అభంగాపూర్. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో ఉండి రవితేజ హైస్కూల్లో 9వ తరగ తి చదువుతున్నా. హాస్టల్ భవనం పాతది కావ డంతో పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడు కింద పడుతుందో అనే భయం ఉంది. చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. – రాజు, విద్యార్థి, ఎస్సీ వసతిగృహం, నారాయణపేట రోజు వణికిపోతున్నాం.. రోజు ఉదయాన్నే స్నానం చేయాలంటే వణికిపోతున్నాం. కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లి వచ్చాక స్నానాలు చేస్తున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం. ఆనంద నిలయంలో గీజర్లు లేదా హీటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వెంకటేశ్, విద్యార్థి, ఆనంద నిలయం, మక్తల్ ● -
వందశాతం లక్ష్యాలు సాధించాలి
నారాయణపేట: జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్లో వందశాతం లక్ష్యాలను సాధించాలని సెంట్రల్ ప్రభారీ అధికారి స్వప్నాదేవిరెడ్డి అన్నారు. నర్వ యాస్పరేషన్ బ్లాక్ ప్రాజెక్ట్ ప్రగతిపై కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి రంగాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెంట్రల్ ప్రభారీ అధికారిణి మాట్లాడుతూ.. నర్వ యాస్పరేషన్ బ్లాక్లో సూచికల ప్రకారం కొన్ని గణాంకాలు సరిగ్గా నమోదు కాలేదన్నారు. డాటా, సాఫ్ట్వేర్లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బ్లాక్లో నిర్దేశించిన అన్ని సూచికల్లో వందశాతం లక్ష్యాల సాధ న దిశగా ముందుకు సాగాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీను, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్సుధాకర్, డీపీఓ సుధాకర్రెడ్డి, డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, డీఈఓ గోవిందరాజులు, నోడల్ అధికారి హీర్యానాయక్, తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, యాస్పరేషన్ బ్లాక్ సమన్వయకర్త బాలాజీ ఉన్నారు. ● స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్రెడ్డి వీసీ నిర్వహించగా.. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలన్నారు. వారంలోగా పురోగతి కనిపించాలని.. లేనిచో సంబంధిత బీఎల్ఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా ఓటరు జాబితాలో బ్లర్గా ఉన్న ఫొటోలను పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించి.. ఫాం–8 ద్వారా ఫొటోలను బీఎల్ఓలతో అప్డేట్ చేయించే ప్రక్రియను కూడా పూర్తిచేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్ నాయక్ పాల్గొన్నారు. -
వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం
నారాయణపేట: కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీ సు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. లక్షలాది కార్మి కు లు, నిరుపేదల గొంతుకగా నిలిచిన మహోన్న త వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. ఒక సాధారణ కార్మికుడి స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. కార్మిక హక్కు ల కోసం ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని.. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ నర్సింహ, ఆర్ఎస్ఐలు శ్వేత, శిరీష, మద్దయ్య పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో జాగృతి గద్వాల టౌన్: ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా జాగృతి వైపు నుంచి మేం పోటీలో ఉంటాం.. పేరు అదే ఉంటదా.. ఇంకొకటి ఉంటదా.. అనేది సెకండరీ.. 2029లో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రోజుల జాగృతి జనంబాట కార్యక్రమం అనంతరం సోమవారం గద్వాల జిల్లాకేంద్రంలోని హరిత హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే తనకు, తన ఫ్యామిలీకి మధ్య అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయని వివరించారు. తన భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని, తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా పార్టీ నాయకులే నాపై కుట్ర చేసి ఎంపీగా ఓడించారని, వద్దంటే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని చెప్పారు. తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా.. లేకున్నా ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటామని చెప్పారు. ఎంపీగా ఉన్న సమయంలో ‘మన ఊరు– మన ఎంపీ’ పేరుతో అనేక కార్యక్రమాలు చేపట్టానని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం కోసం జాగృతి జనం బాట చేపట్టిందని వివరించారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,799 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,799, కనిష్టంగా రూ.1,869 ధరలు లభించాయి. హంస గరిష్టంగా రూ.1,862, కనిష్టంగా రూ.1,841, కందులు గరిష్టంగా రూ.6,831, కనిష్టంగా రూ.5,710, వేరుశనగ గరిష్టంగా రూ.8,260, కనిష్టంగా రూ.3,029, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,981, కనిష్టంగా రూ.1,669 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,705, కనిష్టంగా రూ.2,409గా ధరలు లభించాయి. -
రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా క్రాప్హాలిడేనా?
● చేతకాని పాలనకుఇదే నిదర్శనం ● మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు ఈసారి రికార్డు స్థాయిలో వరదలు వస్తే అవగాహన లేకుండా సముద్రంపాలు చేసి.. ఇప్పుడు క్రాప్హాలిడే ప్రకటించడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూర్లో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణానదికి వచ్చిన వరదను ప్రణాళికా బద్ధంగా వాడుకోకుండా యాసంగిలో క్రాప్హాలిడే ప్రకటించడం చేతకాని పాలనకు నిదర్శనమన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య 17.8 టీఎంసీల డిజైన్తో ప్రారంభించిన జూరాల ప్రాజెక్టును 11 టీఎంసీలకు కుదించారని.. ఆ తర్వాత 6.5 టీఎంసీలకే ప్రాజెక్టు పరిమితమైందన్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 33 ఏళ్ల సమయం పట్టిందన్నారు. ప్రస్తుత పాలకులు ఏకంగా క్రాప్హాలిడే ప్రకటించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేటాయించిన 15.9 టీఎంసీలు, జూరాలకు కేటాయించిన 17.8 టీఎంసీల నీటిని వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు. కొడంగల్–నారాయణపేటకు ఎత్తిపోతలకు పాలమూరు–రంగారెడ్డి నుంచే నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ ఖర్చుతో డిజైన్ చేస్తే.. ప్రస్తుతం ఎక్కువ ఖర్చుతో కొడంగల్–పేట ఎత్తిపోతల పథకం డిజైన్ మార్చడం సీఎం రేవంత్రెడ్డి అవగాహన రాహి త్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటని.. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నీరు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారని.. ఇందుకు సంబంధించి ఆధిత్యనాధ్ ఏపీ తరఫున, తెలంగాణ తరఫున ఎస్కే జ్యోషి చేసిన సంతకాల పత్రాలను చూయించారు. కేసీఆర్ మరణశాసనం చేశారని పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని.. ముఖ్యమంత్రి సలహదారుగా ఉన్న ఆధిత్యనాఽథ్ను సంతకం ఎందుకు చేశారో అడగాలని సవాల్ విసిరారు. షాపుల్లో యూరియా ఇవ్వలేని వారు యాప్ ద్వారా ఇస్తామని చెబుతున్నారని.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవియాదవ్ తదితరులు ఉన్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 24న కోస్గి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డా.వినీత్ అన్నారు. కోస్గిలో కొత్త సర్పంచుల సన్మాన సభ నిర్వహించే లక్ష్మీనర్సింహ ఫంక్షన్హాల్తో పాటు హెలిప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వీఐపీ పార్కింగ్ స్థలాలు, బారికేడ్లు తదితర భద్రతాపరమైన ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్లో ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పి లింగయ్య, సీఐ సైదులు, ఎస్ఐలు బాల్రాజ్, వినయ్కుమార్, నరేశ్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు. 52 కేసుల్లో రూ.25.58 లక్షల రికవరీ నారాయణపేట: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో సైబర్ నేరాల బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించిందని.. మొత్తం 52 కేసుల్లో రూ. 25.58లక్షలు రికవరీ చేసినట్లు ఎస్పీ డా.వినీత్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 12 పోలీస్స్టేషన్లలో 167 క్రైం కేసులు, డ్రంకెన్ డ్రైవ్ 364, ఈ పెట్టీ 1,513 కేసులతో కలిపి మొత్తం 2,044 కేసులను పరిష్కరించగా.. సుమారు రూ. 5లక్షల వరకు జరిమానా చెల్లించినట్లు పేర్కొన్నారు. అయితే సైబర్ మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ సూచించారు. అలా చేయడం వల్ల పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. సైబర్ నేరాల విచారణలో సమర్థవంతంగా పనిచేసి.. బాధితులకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
పల్లెసీమల్లో నవశకం
● గ్రామపంచాయతీల్లో కొలువుదీరిన పాలకవర్గాలు ● అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాలు ● గ్రామాల్లో పండుగ వాతావరణం నారాయణపేట: పల్లెసీమల్లో నవశకం ఆరంభమైంది. అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. పండుగ వాతావరణంలో సర్పంచులు, వార్డు సభ్యులతో పంచాయతీ కార్యదర్శులు ప్రమాణం చేయించారు. జిల్లావ్యాప్తంగా 272 మంది సర్పంచులుగా, 2,466 మంది వార్డు మెంబర్లుగా విజయం సాధించగా.. ఎన్నికల అధికారులు ధ్రువపత్రాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రమాణం చేయించారు. అనంతరం సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో 272 జీపీలు ఉండగా.. 271 జీపీల్లో తొలి గ్రామసభలు జరిగాయి. ధన్వాడ మండలంలోని మడిగెలములతండా సర్పంచ్ బంధువు ఒకరు మృతిచెందడంతో గ్రామసభ వాయిదా పడింది. మక్తల్ మండలం ముస్లాయిపల్లిలో ఒక్క ఓటుతో గెలుపొందిన సర్పంచ్ పవిత్రమ్మ, ఉపసర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు పోలీసు బందోబస్తు నడుమ ప్రమాణం చేశారు. కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకరోత్సవానికి గ్రామస్తులను సైతం కాస్త దూరంగానే ఉంచారు. ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఎన్నో ఆశలు, ఆశయాలతో కొలువుదీరిన పంచాయతీల పాలకవర్గాలకు నిధులలేమి అసలు సమస్యగా కనిపిస్తోంది. పంచాయతీలకు ఇంటి పన్నులు తప్ప.. ఇతర ఆదాయ వనరులు పెద్దగా ఉండవు. కార్మికుల జీతాలు, విద్యుత్ చార్జీలు, చెత్త సేకరణ ట్రాక్టర్లకు డీజిల్, నీటి వనరుల సంరక్షణ వంటి వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. గత ప్రభుత్వ హయాంలో రైతువేదికలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను నిర్మించారు. అవసరాలకు మూలం నిధులే కావడంతో ప్రభుత్వం సరిపడా నిధులు ఇవ్వాలని కొత్త పాలకవర్గాలు కోరుతున్నాయి. సన్మానాలు.. అభినందనలు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీల మద్దతుతో విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందనలతో ముంచెత్తారు. గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ డా.వినీత్ దిశానిర్దేశంతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విధులు.. బాధ్యతలు గ్రామ పంచాయతీల పరిపాలకులుగా సర్పంచులు వ్యవహరిస్తూ గ్రామసభలు నిర్వహించాలి. ఎన్నిక తర్వాత 15 రోజుల్లో తొలి గ్రామసభ జరపాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు రాబట్టుకునేలా చొరవ తీసుకోవాలి. బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, రోడ్డు, నీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, వీధి దీపాలు, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీ, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర, రాష్ట్ర పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపైనే ఉంటుంది. పంచాయతీ ఆర్థిక నిర్వహణ, లాభనష్టాల రిపోర్టులు సమర్పించాల్సి ఉంటుంది. పీఎం ఆవాస్ యోజన వంటి పథకాల్లో పారదర్శకత ఉండాలి. ఒకే కుటుంబంలో ముగ్గురు.. ధన్వాడ మండలం రామకిష్టాయిపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రమాణస్వీకారం చేశారు. సర్పంచ్గా కవిత, వార్డు సభ్యులుగా ఆమె భర్త తిరుపతి నాయక్, మరిది శంకర్నాయక్ బాధ్యతలు చేపట్టారు. -
కోటి ఆశలు..!
కొత్త పాలకవర్గంపై.. నేడు కొలువుదీరనున్న పల్లె పాలకవర్గాలు ఏడేళ్ల క్రితం సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. మళ్లీ ఈ సారి ప్రజలు పట్టం కట్టారు. ఈ ఐదేళ్లలో ముందుగా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. – శ్రీనివాస్, సర్పంచ్, బాపన్పల్లి, దామరగిద్ద మండలం రెండోసారి సర్పంచ్గా గెలిపించారు. సీఎం రేవంత్రెడ్డి ఆశీర్వాదంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా. మా గ్రామానికి కావాల్సిన నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. – హరిత కృష్ణయ్య, సర్పంచ్, గొర్లోనిబాయి, కొత్తపల్లి మండలం 20 ఏళ్లుగా జూనియర్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ కలను సాకారం చేస్తాం. ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటాం. 30 ఏళ్ల నుంచి గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లకు నోచుకోవడం లేదు. వాటికి టెండర్లు వేయిస్తాం. మరికల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. – చెన్నయ్య, సర్పంచ్, మరికల్ నారాయణపేట: దాదాపు రెండేళ్లుగా సీసీరోడ్లు.. డ్రైయినేజీలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోక.. నిధుల లేమితో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాయి పల్లెలు. అటు సమస్యలు పరిష్కరించేవారు లేక.. ప్రత్యేక అధికారులు అందుబాటులోకి రాక ఇన్నాళ్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంచాయతీ పగ్గాలు చేపట్టబోతున్న పాలకవర్గాలపైనే ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి వైపు నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం కోలువుదీరనున్నాయి. జిల్లావ్యాప్తంగా 272 గ్రామపంచాయతీలు, 2,466 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొంది సర్పంచ్లు, వార్డుమెంబర్లు ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను గ్రామ పంచాయతీ భవనాలకు నూతనంగా రంగులు దిద్దుతూ ముస్తాబు చేశారు. ఇక నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీల పరిపాలన కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మద్దతు దారులే ఉన్నారు. 272 స్థానాల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ మద్దతుదారులు 162..బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 53..బీజేపీ పార్టీ మద్దతుదారులు 32...ఇతరులు 25 మంది సర్పంచులు గెలుపొందారు. ఇదిలాఉండగా, కొత్తపాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేస్తున్న సోమవారం తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. చట్టప్రకారం నెలకోసారి పాలకవర్గాలు సమావేశాలు చేయాల్సి ఉంటుంది. గత సర్పంచ్ల పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారులపాలన కొనసాగింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎవరికి చెప్పు కోవాలో అర్థంకాక ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఒక్కో అధికారికి రెండు మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అటు వారి శాఖలకు సంబంధించిన విధి నిర్వహణలపై అధికారులు దృష్టి సారించడంతో పంచాయతీ పాలన పట్టు తప్పింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడే అపరిష్కృతంగా ఉన్నాయి. ఇదిలాఉండగా, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్లు, పాలకవర్గాలతో కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 272 మంది సర్పంచ్లు, 2,466 వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముస్తాబైన గ్రామ పంచాయతీలు దాదాపు రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే.. గ్రామాలకు నిధుల ఇక్కట్లు తీరేనా..? -
లోక్ అదాలత్లో 5,509 కేసుల పరిష్కారం
నారాయణపేట: జిల్లాలో ఆదివారం ఏర్పాటు చేసిన లోక్అదాలత్తో 5509 కేసులు పరిష్కరించారు. జాతీయ న్యాయ సేవాధికార ఆదేశాలతో జిల్లా న్యాయ సేవ సంస్థ లీగల్ సర్వీసెస్ ఆథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో 4 బెంచులను ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కం చైర్మన్ నారాయణపేట బోయ శ్రీనివాసులు, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ , జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే.అవినాష్ కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్లో అన్ని కోర్టు పరిధిలో 5509 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల (కోస్గి, నారాయణపేట) పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. కాగా మొత్తం కేసుల పరిష్కారానికిగాను రూ.26.90 లక్షల ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ కే. కురుమన్న గౌడ్ , కే. సత్యనారాయణగౌడ్, వినోద్ కుమార్, సురేంద్ర చారి , కక్షిదారులు, కోర్ట్ పోలీసులు పాల్గొన్నారు. ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని పీఆర్టీయూ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి సమక్షంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎల్.మనోహర్ప్రసాద్గౌడ్, జనరల్ సెక్రటరీగా వి.సంతోష్కుమార్తో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులతో కార్యవర్గన్ని నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని మనోమర్గౌడ్ పేర్కొన్నారు. అనంతరం కార్యవర్గాన్ని సన్మానించారు. సత్యనారాయణ, రాములు, సయ్యద్ మౌలనా, వెణుగౌడ్, రమేశ్బాబు, సుదర్శన్రెడ్డి, బాల్రాజ నర్సయ్య, క్రిష్ణరెడ్డి, అంబాజీ , వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరం మక్తల్: చదువుతోపాటు క్రీడలు అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య అన్నారు. ఆదివారం మక్తల్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.గోపాలం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీనియర్ షూటింగ్ బాల్ మెన్, ఉమెన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఎంపిక పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటాలన్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు వరంగల్ జిల్లా చెన్నారంలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్రెడ్డి, సోంశేఖర్గౌడ్, ఆడమ్స్, రాజు, సత్యఆంజనేయులు, రమేష్, ఝాన్సీ, అనిత తదితరులు పాల్గొన్నారు. ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి నాగర్కర్నూల్ రూరల్: ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్లో వచ్చే నెల 25 నుంచి 28 వరకు కొనసాగుతాయని.. పెద్దఎత్తున మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహాసభల్లో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటాలు చేపడుతామన్నారు. పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, అభద్రత భావం, నిరుద్యోగం పెరిగిందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట: రాష్ట్రంలో 2.45 లక్షల మంది పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి రాష్ట్ర పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఆదర్శ బీఈడీ కళాశాలలో నారాయణపేట జిల్లా పెన్షనర్ల సాధారణ సర్వసభ్య సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం లేకపోవడంతో గత రెండేళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 2.45 లక్షల మంది సభ్యత్వం కలిగిన పెద్ద సంఘం పెన్షనర్స్ సంఘం అన్నారు. గత పదేళ్లలో చాలా సమస్యలు పెండింగ్లో ఉండిపోయాయని, పెన్షనర్ల సంఘం రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హైదరాబాద్ హెడ్క్వాటర్లో లేకపోవడంతో సభ్యులు తీవ్ర నష్టానికి గురవుతున్నారన్నారని ఆందోళన వ్యక్తపరిచారు. పెన్షనర్స్ సంఘంలో మార్పు ఎంతైన అవసరమన్నారు. తెలంగాణ ఏర్పడి ప్రాతినిత్యం వహించేందుకు జేఏసీలో కీలక భూమిక పోషించేది పెన్షనర్స్ సంఘమన్నారు. ప్రధానంగా మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి, కిరణ్కుమార్రెడ్డి హయాంలో పెన్షనర్లకు హెల్త్కార్డులు వర్తింపజేశారన్నారు. కానీ ఇప్పుడు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని ఫైనాన్స్ మినిష్టర్స్కు తీసుకుపోవడంలో విఫలమైందన్నారు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ గత ప్రభుత్వం 5 శాతం తాత్కాలిక భృతి ఇచ్చిందన్నారు. కానీ ఈ ప్రభుత్వం నుంచి రెండేళ్ల నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉందన్నారు. రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ అందడంలేదన్నారు.ఈ నాలుగు ప్రధానమైన డిమాండ్లపై ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి సీఎంను ఆహ్వానించి సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు పెన్షనర్లను ఏకం చేస్తున్నామన్నారు. సమావేశంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర సంఘం నాయకులు మనోహర్గౌడ్, వకిల్ సంతోష్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్లో పంచాయితీ..!
పేలుతున్న నేతల మాటల తూటాలు ● వనపర్తిలో చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు ● మంత్రి వాకిటి ఇలాకాలోనూ మంటలు ● సామాజిక మాధ్యమాల్లోనూ ఇరువర్గాల పోరు ● వైరల్గా మారిన పలు పోస్టులు.. ● జిల్లాలో రసవత్తరంగా మారిన రాజకీయాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. అధికార కాంగ్రెస్లో సం‘గ్రామం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘రెబల్స్’తో రాజుకున్న సెగ దావానలంలా ఎగిసిపడుతోంది. గెలుపును ప్రభావితం చేసిన తిరుగుబాటుదారులు.. ఓడిపోయిన వర్గాల మధ్య పోరు ఆ పార్టీ ముఖ్య నేతలను రచ్చకీడుస్తోంది. మరోవైపు కీలక బాధ్యతల్లో ఉన్న పెద్దలు సంయమనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తుండడం.. స్వపక్షంలోని నాయకులపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తుండడం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ప్రధానంగా వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లతో పాటు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో పేలుతున్న మాటాల తూటాలు ఉమ్మడి పాలమూరులో హాట్ టాపిక్గా మారాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో గెలపొందిన కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా మాట్లాడుతూ చేపలు గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయిన పలు గ్రామాల ప్రజలను బాహాటంగా తూర్పారబట్టడం విమర్శలకు దారితీసింది. మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలోనే ఇదంతా జరగగా.. కనీసం ఆయన వారించకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఇటీవల పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. కొన్నిసార్లు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ క్రమంలో తన స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ మద్దతుదారు గెలుపొందడం.. సొంత మండలం రాజాపూర్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో ఆయనలో అసహనం.. ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు, వర్గాలు సామాజిక మాధ్యమాలు వేదికగా పోరు సాగిస్తుండడం హాట్టాపిక్గా మారింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య తొలి నుంచీ విభేదాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సైతం వారివారి వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ నియోజకవర్గంలో జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ సత్తా చాటింది. ఈ క్రమంలో ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేగా నాపై, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవిపై కోపం ఉంటే ప్రత్యక్షంగా చూసుకోవాలి. కాంగ్రెస్ విధేయులుగా, జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏమిటి?’ అని చిన్నారెడ్డిపై ప్రెస్మీట్లో పరోక్షంగా విమర్శలు చేయడం దుమారం రేపాయి. ప్రతిగా చిన్నారెడ్డి వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు వైరల్గా మారగా.. నియోజకవర్గం అట్టడుకుతోంది. వనపర్తి పంచాయతీ ఎన్నికల్లో అవకాశం ఉన్నా.. సర్పంచ్ స్థానాల్లో గెలవకపోవడంపై ఉమ్మడి పాలమూరులోని పలువురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య సమన్వయ లోపాన్ని సైతం వారికి ఎత్తిచూపినట్లు తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు వారి బంధువులు, అనుచరులకు పార్టీ తరఫున మద్దతిచ్చి నిలబెట్టడం ‘రెబల్స్’ బరిలో ఉండేందుకు ఆస్కారమిచ్చిందని.. దీంతో ఓట్లు చీలిపోయి ప్రతిపక్షానికి కలిసి వచ్చిందంటూ ఉదాహరణలతో వారిని ఎండగట్టినట్లు సమాచారం. వచ్చేవి పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు.. జాగ్రత్తగా వ్యవహరించాలని.. డీసీసీలు సైతం పక్కా కార్యాచరణతో విజయం సాధించేలా శ్రమించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం ఎవరెవరికి చీవాట్లు పెట్టారు.. ఇప్పటికై నా కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మార్పు వచ్చేనా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. -
‘ఉపాధి’లో గాంధీజీ పేరు తొలగించడం దారుణం
నారాయణపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు వంద రోజులు గ్యారంటీ ఉపాధి పనులు కల్పించాలని ఉద్దేశ్యంతో అప్పటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పాలించే అర్హత కోల్పోయి, చరిత్రను మార్చే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానేత మహాత్మా గాంధీ పేరు పథకాల నుంచి తొలగించడం అంటే గాంధీజీ సిద్ధాంతాలపై, రాజ్యాంగ విలువలపై నేరుగా దాడి చేయడమే అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గాంధీ పేరు తుడిచిపెట్టే ప్రయత్నాలు చేయడమే కాకుండా నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని అవమానించేలా రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు చరిత్రను వక్రీకరించే చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నదని ఆరోపించారు. గాంధీ పేరు లేకుండా అభివృద్ధి జరగదని, గాంధీ సిద్ధాంతాలు లేకుండా భారతదేశం ముందుకు సాగదని స్పష్టం చేస్తూ, ఈ తరహా నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గాంధీ ఆశయాలను రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శివారెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరఫ్ నాగరాజ్, పట్టణ అధ్యక్షులు ఎండి. సలీం, ఆర్టీఓ బోర్డ్ సభ్యుడు పోషల్ రాజేష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎండి. గౌస్, మార్కెట్ వైస్ చైర్మన్ హన్మంతుతోపాటు శరణప్ప, లిఖి రఘు, మహిమూద్ ఖురేషి, వినోద్ పాల్గొన్నారు. -
విలేకర్లపై కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమిస్తాం
నారాయణపేట: విలేకర్లపై ‘పేట’ ఆర్టీసీ డిపో డీఎం అక్రమ కేసులు నమోదు చేయించడం సరైందికాదని, వెంటనే ఎత్తివేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకాలంలో బస్సులు నడపాలంటూ విద్యార్థి సంఘాలు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపడుతుండగా.. వృత్తి ధర్మంగా న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకర్లపై డీఎం తప్పుడు ఫిర్యాదు చేయించి అక్రమ కేసులు బనాయించడం సరైందికాదన్నారు. దసరా, దీపావళి పండుగ సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల సమాచారం అడగగా.. డీఎం ఇవ్వలేదని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి విలేకర్లపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడాలని పూనుకున్నట్లు ఉందన్నారు. పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా అక్రమ కేసులు బనాయించడం ఆర్టీసీ అధికారులకు వత్తాసుపలకడమే అన్నారు. డిపోలో జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేపట్టి డీఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టేందుకు వెనుకడబోమని హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లాఅధ్యక్షులు సత్యయాదవ్ ఉన్నారు. -
24న కోసి్గకి సీఎం రాక
● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్లు కోస్గి: కొడంగల్ నియోజకవర్గంలోని నూతన సర్పంచ్లతో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ నెల 24న కోస్గికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నార ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ తెలిపారు. శనివారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్హాల్లో ఇరు జిల్లాల అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో 8 మండలాలకు చెందిన నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేపట్టాలని, 24న మధ్యాహ్నం 2 గంటల కు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కోస్గికి చేరుకుంటారన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు హాజరుకానున్నారని, వారికి వసతులు కల్పించాలన్నారు. సన్మానం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతోపాటు నూతన సర్పంచ్లు మధ్యాహ్న భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి వచ్చి.. వెళ్లే వరకు అన్ని బాధ్యతలను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అధికారులకు విధులు, బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టర్లు సన్మాన వేదిక, సీఎం వచ్చే మార్గం, వీఐపీ వాహనాల పార్కింగ్, భోజనం చేసే స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడతామని డీఎస్పీ లింగయ్య తెలిపారు. అనంతరం కలెక్టర్ కడా అభివృద్ధి నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రూ.800 కోట్లతో చేపడుతున్న విద్యాహబ్, మెడికల్ కళాశాల పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్నాయక్, వికారాబాద్ టైనీ కలెక్టర్ హర్షచౌదరి, ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీఆర్డీఓ మొగులప్ప, డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్, ఏడి జాన్సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతర్ల సందడి
పాలమూరులోని ప్రముఖ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు ● కార్తీక మాసంలో మొదలై.. ఉగాది పండుగ వరకు వేడుకలు ● తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచి మొక్కుల చెల్లింపు ● మట్టికుండలో భోజనం, పచ్చిపులుసుతో నైవేద్యం ● ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలకు తిరుమలతో సారూప్యత ● వివిధ రకాల వేలం పాటలు, హుండీ ద్వారా రూ.కోట్లలో ఆదాయం ఆర్జన కురుమూర్తి.. ఘన కీర్తి చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలో వెలసిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర దీపావళి అమావాస్యతో మొదలవుతుంది. రాష్ట్రంలోని మేడారం తర్వాత ఆ స్థాయిలో ఇక్కడికే జనాలు ఇక్కడికి తరలివస్తారు. అలాగే స్వామివారు తిరుపతి వేంకటేశ్వరస్వామి మాదిరిగానే ఏడుకొండల మధ్య కాంచనగుహలో కొలువుదీరారు. మరెక్కడా లేని విధంగా ఉద్దాల ఉత్సవం (పాదరక్షల ఊరేగింపు) ప్రధాన ఘట్టంగా నిలుస్తోంది. చిన్నవడ్డెమాన్లో మొదలయ్యే ఈ ఊరేగింపు అప్పంపల్లి, తిర్మలాపూర్ గ్రామాల మీదుగా కురుమూర్తికి చేరుకుంటుంది. జాతర దాదాపు నెలరోజులపాటు సాగినా.. భక్తుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రోజులు పొడిగించిన సందర్భాలు కోకొల్లలు. అలాగే ఇక్కడ లభించే కాల్చిన మాంసం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మాంసప్రియులు తరలివస్తారు. ప్రత్యేకం.. గంగాపూర్ ఆలయం గంగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం కోణార్క్ సూర్యదేవాలయం ఒకే విధంగా నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయం చతురస్త్రాకారంలో నిర్మితమై ఉండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అలాగే మెట్లు సైతం చతురస్త్రాకారంలో మెట్లు నిర్మించడం వల్ల ఎటు నుంచి చూసినా కోనేరు ఒకేలా కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా మాఘశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు కొనసాగుతాయి. ఇక్కడ స్వామివారి కల్యాణోత్సవం, పెద్ద తేరు (రథోత్సవం), చిన్న తేరు (పుష్పరథం), శకటోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆలయం పడమర ప్రాంతమైన కోయిలకొండ, కోస్గి, కొడంగల్, తాండూరు, నారాయణపేట నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు హాజరవుతారు. కాగా.. జనవరి 19 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. -
రాజీమార్గంతోనే కేసుల పరిష్కారం
నారాయణపేట: లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కారం చేసుకోవాలని.. రాజీ మార్గం ఎంతో మేలని జిల్లా జడ్జి బోయశ్రీనివాసులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులను పరిష్కరించాలని శనివారం జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆదివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులకు త్వరగా కేసులు పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందన్నారు. న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు ముందుగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలన్నారు. యాక్సిడెంట్, దాడి, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, దొంగతనం, కరోనా సమయంలోని పెండింగ్లో ఉన్న కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం ఎగ్జిక్యూషన్ పిటిషన్ , క్రిమినల్ కాంపౌండ్డబుల్ కేసులు, సివిల్ కేసులు, సైబర్ క్రైమ్ కేసులపై ఆరాతీశారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ వింధ్య నాయక్ పాల్గొన్నారు. -
నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు
కోస్గి రూరల్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత తమ నైపుణ్యాల ఆధారంగానే ఉపాధి అవకాశాలు వరిస్తాయని ఏస్ (ఏసీఈ) ఇంజినీరింగ్ అకాడమీ చైర్మన్ వి.గోపాలకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు భవిష్యత్ దృక్పథాలు, ఉపాధి అవకాశాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం, ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కోవడం, సాప్ట్స్కీల్స్, ఆన్లైన్, ఆప్లైన్ శిక్షణ వంటి అంశాలపై అవగాహన చేపట్టారు. లాటరల్ ఎంట్రీ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్శహించేందుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పలువురు విద్యార్థులు భవిష్యత్ కెరీర్కు సంబంధించిన ప్రశ్నలను అడిగి వివృత్తి చేసుకున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన దిశగా ముందుకు సాగలన్నారు. ప్రొఫెసర్ మూర్తి కళాశాల అభివృద్ధికి అవసరమైన నాలుగు డిజిటల్ బోర్డులు, ఆర్ఓ వాటర్ ప్లాంట్, 200 ఫైబర్ చైర్స్, సోలార్ లైటింగ్ సిస్టంలను విరాళంగా అందించారు. అంతకుముందు కళాశాల అవరణలో పూల మొక్కులను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హేమంత్, ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. -
నారాయణపేట
వెనకబాటు, వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు.. దేవుళ్లను కొలువడంలో మాత్రం ఘనమైన చరిత్రను లిఖించుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధాన దేవాలయాలతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నపాటి ఆలయాల వరకు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు, జాతర్లు కొనసాగుతాయి. ప్రతి జాతర సుమారు నెలరోజుల పాటు నిర్వహించడం ఇక్కడి విశేషం. వీటి కోసం పొట్ట చేతబట్టుకొని వలస వెళ్లిన పాలమూరు కూలీలంతా స్వగ్రామాలకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి దేవుడిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి.. మట్టి కుండలో అన్నం వండి.. పచ్చి పులుసుతో నైవేద్యం సమర్పిస్తారు. సమీప గ్రామాల ప్రజలు బంధుమిత్రులతో కలిసి ఎద్దుల బండ్లపై ఆయా ఆలయాలకు వెళ్లి రెండు రోజుల పాటు అక్కడే గడపడానికి ఇష్టపడతారు. ఇక ఆయా జాతర్ల నిర్వహణతో వివిధ రకాల సేవలు, హుండీ ద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆలయాల ప్రత్యేకతపై ‘సాక్షి’ కథనం.. – మహబూబ్నగర్ డెస్క్ ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు
మక్తల్: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మక్తల్ కమిషనర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. శనివారం పురపాలిక సంఘం అన్ని విభాగాలకు చెందిన అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, పన్ను వసూలు, ప్రజా సమస్యలపై చర్చించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా తగు చర్యలు చేపట్టాలని, ప్రజలు, దుకాణదారులకు ఈమేరకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమష్టిగా పనిచేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే, కాలనీల్లో నిత్యం అధికారులు పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని, పారిశుద్ధ్య పనులు విధిగా చేపట్టేలా చూడాలని, వీధులు శుభ్రంగా ఉంచేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కమిషనర్ శ్రీరాములు, ఏఈ నాగశివ తదితరులు పాల్గొన్నారు. -
పొగమంచుతోవాహనదారులు జాగ్రత్త
నారాయణపేట: వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగటంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయద్దని, అత్యవసరమైతే వాహనాలను నెమ్మదిగా, సురక్షితంగా నడిపి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ వినీత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గుర్తించడం, వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుందని తెలిపారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలను వేగంగా నడపొద్దని, వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలని, తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుదని తెలిపారు. హెడ్లైట్లను లో బీమ్లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు. ప్రయాణానికి ముందే ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ఆకస్మికంగా ఓవర్టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. పోలీసుల సూచనలతోపాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 23న ‘మీ డబ్బు,మీ హక్కు’పై ప్రత్యేక శిబిరం నారాయణపేట: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా ‘మీ డబ్బు మీ హక్కు’ అనే ఇతివృత్తంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులు (సొమ్ము) సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 23న కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని, క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ పొదుపులు, ఇన్ష్సూరెన్స్ ఖాతాలు, తదితరాలు వాటిని పరిష్కరించాలనే తలంపుతో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏ బ్యాంకులు ఉమ్మడి శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం 31 వరకు కొనసాగుతుందని, బ్యాంకుల్లో 10 సంవత్సరాలకుపైగా క్లెయిమ్ చేసుకొని డిపాజిట్ల వివరాలు (https://udham.rbi.org.in/uncaimed-deposits/#/login) ద్వారా పొందవచ్చని , క్లెయిమ్ చేసుకోని ఆర్థిక పరమైన ఆస్తులను వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు శిబిరంలో బ్యాంక్ శాఖ, బీమా సంస్థని సంప్రదించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు సబ్జెక్టులో పట్టు సాధించాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు ఇంజినీరింగ్ సబ్జెక్టులలో పట్టు సాధించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రస్తుతం ఇంజినీరింగ్ పరిధి చాలా పెరిగిందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు కూడా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ కాబట్టి బాధ్యతాయుతంగా నడుచుకుంటే భవిష్యత్లో వచ్చే విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటారని సూచించారు. ఎక్కువ సమయం చదువులకు కేటాయించాలని, ఇక్కడ ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, మహమ్మద్గౌడ్, రామరాజు, తేజవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
నాగరికతకు వ్యవసాయమే మూలం
నారాయణపేట రూరల్: మానవ నాగరికత అభివృద్ధికి వ్యవసాయమే పునాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ లష్మిపతి అన్నారు. మండలంలోని భైరంకొండలో న్యాయ విజ్ఞాన సదస్సుతో పాటు ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమిని వ్యవసాయానికి ఉపయోగించాలని, వ్యాపార నిమిత్తం మార్చరాదన్నారు. వ్యవసాయం అంటే ఆహారం, పశుగ్రాసం, నార, ఇంధనం కోసం మొక్కలను, జంతువులను పెంచాలన్నారు. ఆధునిక కాలంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలైన ఫసల్ బీమా యోజన, డ్రిప్ ఇరిగేషన్ వంటివి ఉపయోగించుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించిందని అన్నారు. ప్రజలు వాటిపై అవగాహన కలిగి ఉన్నప్పుడే తమ హక్కులను నిర్భయంగా పొందుతారని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్యారా పేదవారు 15100 నెంబర్ కి కాల్ చేసి ఉచిత న్యాయాన్ని పొందవచ్చు అన్నారు. వరకట్న వేధింపులు, సఖి సెంటర్, వోల్డీగే హోమ్, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ప్రయోజనాలపై అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, పర లీగల్ వాలంటరీస్, ప్రజలు పాల్గొన్నారు. -
పాఠశాలల సమయం మార్చండి
నారాయణపేట రూరల్: చలిగాలుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల సమయాన్ని మార్చాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ను జిల్లా పీఆర్టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. పాఠశాల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు మార్చాలని, టెన్త్ విద్యార్థుల ప్రత్యేక తరగతులు సైతం ఉదయం 8.30గంటలకు ప్రారంభించాలని కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. అధికారులకు సన్మానం మూడు విడుదల పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసినందుకు అడిషనల్ కలెక్టర్ తో పాటు, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఎక్కడ కూడా వాయిదా లేకుండా విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరించారని, ఎన్నిక రోజు తర్వాత ఓడీ సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీ 20 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక నారాయణపేట టౌన్: జిల్లాలోని స్థానిక మినీ స్టేడియంలో ఎండీసీఏ, విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో, హెచ్సీఏ ఆధ్వర్యంలో జి. వెంకటస్వామి కాక మెమోరియల్ టీ–20 క్రికెట్ లీగ్కు నారాయణపేట క్రికెట్ జట్టును గురువారం ఎంపిక చేసినట్లు జిల్లా క్రికెట్ ఇన్చార్జి పి.డీ రమణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ మహమ్మద్ రియాజ్ ఉల్హక్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్డీసీఏ గ్రౌండ్లో ఈ నెల 22 నుండి జరిగే కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్లో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ టోర్నమెంట్కు జిల్లా నుండి 15 మందిని ఎంపిక చేసినట్లు క్రికెట్ ఇన్చార్జి రమణ తెలిపారు. ఈ పోటీలలో మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లా జట్లు పాల్గొంటాయన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేష్ శెట్టి, చిన్నారెడ్డి, లక్ష్మీనారాయణ, నారాయణపేట క్రికెట్ కోచ్ అజయ్, ప్రవీణ్, అశోక్ రెడ్డి, జనార్థన్, అక్తర్ ఫాషా, నాగేష్, రెహమన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి కలెక్టర్గాసంచిత్ గంగ్వార్
నారాయణపేట: జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా సంచిత్ గంగ్వార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 11 వరకు లాంగ్ లీవ్ పెట్టడంతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్కు అప్పగిస్తూ సీఎస్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సమయానికి మధ్యాహ్న భోజనం అందించాలి నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సమయం ప్రకారం అందించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మార్కెట్ లైన్ పాఠశాలలో గురువారం ఆలస్యంగా భోజనం అందించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను, వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. చాలామంది విద్యార్థులు ఉదయం తినకుండా పాఠశాలలకు వస్తుంటారని, మధ్యాహ్న భోజనం ఆలస్యం కావడంతో వారికి మరింత ఇబ్బంది కలుగుతుందన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేయడం లేదని, వెంటనే డిపో మేనేజర్ తన తీరు మార్చుకొని పాఠశాలల సమయానికి అనుకూలంగా బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.2,819 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో గురువారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,819, కనిష్టంగా రూ.2,291 ధరలు లభించాయి. అదేవిధంగా హంస గరిష్టంగా రూ.1,916, కనిష్టంగా రూ.1,911, కందులు రూ.6,221, వేరుశనగ గరిష్టంగా రూ.8,118, కనిష్టంగా రూ.7,141, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,914, కనిష్టంగా రూ.1,810, పత్తి గరిష్టంగా రూ.6,601, కనిష్టంగా రూ.5,570 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,609, కనిష్టంగా రూ.2,426గా ధరలు లభించాయి. -
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులే కీలకం
మక్తల్: తాజా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహ అన్నారు. గురువారం మక్తల్లో ఏర్పాటుచేసిన అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన సర్పంచ్లు, ఉపసర్పంచ్లను మంత్రి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని అన్నారు. దేశంలో ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టే డబ్బుకు సంతకం చేసేది ఒకరు గవర్నర్, మరొకరు సర్పంచ్ అని, అభివృద్ధిలో సర్పంచులు పాత్ర కీలకమన్నారు. గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలుగా తన వంతు సహకారం అందిస్తానని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ రాధమ్మ, మణెమ్మ గణేష్కుమార్, వెంకటేష్, విష్ణువర్ధన్రెడ్డి, సురేష్, శ్రీనివాస్రెడ్డి, షంషుద్దీన్, ఫయాజ్ పాల్గొన్నారు. -
కోవర్ట్స్.. రెబల్స్!
నారాయణపేట నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా పరిధి కోయిల్కొండ మండలంలో పేరు చివర నగర్ ఉన్న గ్రామానికి రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తి ఓటమి పాలయ్యాడు. ఈయన ఓటమి వెనుక స్థానిక ‘హస్తం’ నాయకులే ఉండడం గమనార్హం. లోపాయికారిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఇది గ్రహించక అంతా ఖర్చు చేసిన సదరు అభ్యర్థి తలపట్టుకుంటున్నాడు. ‘నా పనేందో నేను చేసుకుంటున్నా. హైదరాబాద్కు వచ్చి నన్ను ఒప్పించి వారే సర్పంచ్గా నిలబెట్టారు. వారే ఖర్చు చేయించారు. చివరకు వారే ఓడించారు. నా కొంప ఆర్సిండురోయ్.’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇదే మండలంలో మరో గ్రామంలో సైతం ఇలాగే జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లె రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. స్థానిక పరిస్థితులు ప్రభావం చూపించే ఈ ఎన్నికలు ఎప్పటికై నా ఆసక్తికరమే. పార్టీ గుర్తులపై కాకుండా జరిగే సంగ్రామమైనప్పటికీ.. వాటి ప్రభావం ఊరి ప్రజలపై చెరగని ముద్ర వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందనే దానికి గతంలో వెలువడిన ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ సైతం పల్లె పోరులో పైచేయి సాధించింది. కానీ వరుసగా అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సత్తా చాటడం హస్తం నేతలను బెంబేలెత్తిస్తోంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం వారిని కుంగదీస్తోంది. దీనికంతటికీ పార్టీలోని కోవర్టులు, రెబల్స్ కారణం కాగా.. ఎవరు గెలిచినా తమ వారే అన్నట్లు వ్యవహరించడం కూడా ఫలితాలపై ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో పాటు ‘అధికార’ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కోవర్టులు, రెబల్స్ ప్రభావం చూపిన తీరుపై ‘సాక్షి’ కథనం.. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు, వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, వీపనగండ్ల, పాన్గల్ మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 137 జీపీలు ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. 69 మంది హస్తం మద్దతుదారులు గెలుపొందగా.. 44 మంది కారు, ఆరు చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అధిక జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకరికొకరు మద్దతు తెలుపుకోగా.. మొత్తంగా 50 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రులు పది మంది విజయం సాధించగా.. వీరిలో ఎక్కువగా ఉమ్మడి (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) అభ్యర్థులే ఉన్నారు. వీరికి అధికార పార్టీలోని గ్రామ, మండలస్థాయి ముఖ్యులు లోపాయికారిగా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్లో రెబల్స్తో పాటు ముఖ్య నాయకుల మధ్య వర్గపోరు సైతం గెలుపు ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అంటే.. నారాయణపేట నియోజకవర్గంలో 95 జీపీలు ఉన్నాయి. ఇందులో 43 చోట్ల కాంగ్రెస్, 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. హస్తం ఆధిక్యతను సాధించినా.. ఇక్కడ రెబల్స్ ఐదుగురు, ఉమ్మడి అభ్యర్థులు తొమ్మిది మంది విజయం సాధించారు. గెలుపొందిన ఉమ్మడి అభ్యర్థుల్లో అధిక శాతం మందికి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు సహకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఇతర పార్టీల సర్పంచ్ అభ్యర్థులతో ముందుగానే లోపాయికారీ ఒప్పందం చేసుకుని.. సొంత పార్టీ అభ్యర్థులకు వెనున్నపోటు పొడిచినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కోయిల్కొండ మండల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యేకు, నియోజకవర్గ ముఖ్యనేతకు సంబంధించి మండలాల వారీగా షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న వారి నిర్వాకం వల్ల పలు జీపీలు చేజారిపోయినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 172 గ్రామపంచాయతీలు ఉండగా.. శంకరాయపల్లి తండి మినహా అన్నింటిలో ఎన్నికలు జరిగాయి. 83 జీపీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా.. ఆ పార్టీ ఆధిక్యతను కనబరిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగా.. 72 స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు సర్పంచ్లుగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేకు షాడో నేతగా వ్యవహరిస్తున్న ఒకరి నిర్వాకం.. పాత కాంగ్రెస్ నాయకులకు దక్కని ప్రాధాన్యం, నియోజకవర్గంలో ఒంటెద్ద్దుపోకడలు ఫలితాలపై ప్రభావం చూపించినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు షాడో నేతలుగా వ్యవహరిస్తున్న వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో షాక్ తగిలింది. గోపాల్పేట మండలంలోని ఓ నాయకుడి స్వగ్రామం, పెబ్బేరు మండలంలోని మరో గ్రామం, ఖిల్లాఘనపురం మండలంలోని ఓ పల్లెలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఆయా ప్రాంతాల్లో అధికార నేతకు షాడో నాయకులుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలతో పాటు కాంగ్రెస్ అభిమానులు సైతం కారు బలపరిచిన అభ్యర్థులను గెలిపించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో మొత్తంగా కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. అయితే పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వర్గాలకు చెందిన వారే సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇందులో బండ్ల వర్గం సత్తా చాటినట్లు తెలుస్తోంది. నారాయణపేట మండలం ఓ జీపీ సర్పంచ్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. పాత కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేశారు. కొత్త కాంగ్రెస్ నుంచి ఓ నాయకుడు తన భార్యతో నామినేషన్ వేయించి.. ఒత్తిళ్లతో విరమించుకున్నాడు. తాను 8వ వార్డులో బరిలో నిలిచాడు. తన వార్డు వరకే ఆ నాయకుడు పరిమితం కాగా.. అక్కడ గెలుపొందాడు. కాంగ్రెస్ సర్పంచ్ మద్దతుదారు ఓడిపోగా.. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. నా కొంప ఆర్సిండురోయ్..! కొల్లాపూర్: రెబల్స్, వర్గ పోరుతో.. మక్తల్: ‘వాకిట’ మెజార్టీపై ఎఫెక్ట్.. మక్తల్ నియోజకవర్గంలో నారాయణపేట జిల్లాలో మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు.. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 138 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 70, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. హస్తం ఆధిక్యం సాధించినా.. పది స్థానాల్లో అదే పార్టీకి చెందిన రెబల్స్ విజయం సాధించారు. రెబల్స్ ప్రభావానికి ఇది నిదర్శనం కాగా.. ఐదారు స్థానాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ రెబల్స్ మధ్య పోటీతో బీజేపీ, బీఆర్ఎస్కు లాభించింది. అంతేకాకుండా పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులే.. ఆ పార్టీ బలపరిచిన వారికి కాకుండా లోపాయికారిగా కారు, కమలం బలపరిచిన వారికి సహకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ను దెబ్బతీసింది వీరే.. పలు చోట్ల షాడోల తీరు సైతం.. నారాయణపేట, వనపర్తి, జడ్చర్లలో అధిక ప్రభావం మంత్రి జూపల్లి ఇలాకా కొల్లాపూర్లో అత్తెసరు ఫలితాలే.. మరో అమాత్యుడి సెగ్మెంట్ మక్తల్లో మెజార్టీపై ఎఫెక్ట్ గద్వాల నియోజకవర్గంలో విభిన్నం.. స్వపక్షంలోని వర్గాలదే విజయం -
సజావుగా ఎన్నికల ప్రక్రియ
నారాయణపేట: జిల్లాలో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా పూర్తిచేశామని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం మక్తల్, కృష్ణా, మాగనూరు, నర్వ, ఊట్కూర్ మండలాల్లో నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సరళితో పాటు కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ శ్రీను, డిప్యూటీ కలెక్టర్లు శ్రీరామ్ ప్రణీత్, ఫణికుమార్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, నోడల్ అధికారి సాయిబాబా, డీపీఆర్ఓ రషీద్ ఉన్నారు. ● జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన ఊట్కూర్, మల్లేపల్లి, చిన్నపొర్ల, కాచ్వార్, జక్లేర్, మంతన్గోడ్, కాట్రేవుపల్లి, భూత్పూర్ తదితర పోలింగ్ కేంద్రాలను ఎస్పీ డా.వినీత్ సందర్శించి.. పోలింగ్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి ఆయన సూచించారు. -
కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్రాథోడ్ సర్పంచ్గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్ -
తాతదే జయకేతనం
మూసాపేట మండలం చక్రాపూర్ సర్పంచ్ ఎన్నికల్లో మనువడిపై తాత గెలుపొందాడు. ఈ గ్రామంలో 1285 ఓట్లకు 1175 పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ మద్దతుదారుడు గంటెల రఘురాములుకు 639 ఓట్లు, కాంగ్రెస్ మద్దతుదారుడు లక్ష్మినారాయణకు 484 ఓట్లు వచ్చాయి. దీంతో 155 ఓట్ల మెజార్టీతో మనువడిపై తాత నెగ్గాడు. రఘురాములుకు ముగ్గురు సంతానం ఉండటంతో గతంలో ఆయన పోటీ చేసే అవకాశం లేకపోవడంతో ఆయన తన తల్లిని పోటీ చేయించి రెండు సార్లు సర్పంచ్గా విజయం సాధించాడు. తాజాగా ప్రభుత్వం ముగ్గురు పిల్లలు ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో స్వయంగా రఘురాములు పోటీలో నిలిచి తొలిసారి విజయం సాధించాడు. – అడ్డాకుల -
అన్నపై తమ్ముడి పై‘చేయి’
అడ్డాకుల మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్నపై తమ్ముడు విజయం సాధించారు. బీఆర్ఎస్ తరఫున బొక్కలపల్లి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అతడి తమ్ముడు దశరథ్రెడ్డి పోటీపడ్డారు. హోరాహోరీ పోరులో తిరుపతిరెడ్డి 758 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా.. దశరథ్రెడ్డి 888 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి అయిన స్వతంత్ర అభ్యర్థి ఖాజామైనొద్దీన్ (840)పై 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గ్రామంలో 3,142 ఓట్లకు గాను 2,829 ఓట్లు పోలయ్యాయి. – అడ్డాకుల -
అక్కడక్కడ..
● వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాళ్లూరు గ్రామంలో ఆరో వార్డులో ఒక్క ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో ఫలితాలు తారుమారు చేస్తున్నారని రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. పోలీస్లు అక్కడకు చేరుకుని వారిని సముదాయించారు. చివరకు బీఆర్ఎస్ మద్దతుదారు గెలవడంతో వారు ఆందోళనను విరమించారు. ● నారాయణపేట జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు మెట్ల తిరుపతమ్మ గెలుపొందారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బ్రహ్మం అనే వ్యక్తిపై ‘కారు’ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. అక్కడున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. -
ముగిసిన ఒలింపియాడ్ పరీక్ష
నారాయణపేట రూరల్: పట్టణంలోని శ్రీసాయి పాఠశాలలో మంగళవారం సుచరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీ రామన్ ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి వరకు మొత్తం 93 మంది విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్ పోటీ పరీక్షలో పాల్గొన్నారు. పరీక్షలో పాల్గొనడంతో గురుకుల, ఎంసెట్, నీట్ తదితర పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో ముందస్తుగా పాఠశాల స్థాయిలోనే తెలుస్తుందని పాఠశాల కరస్పాండెంట్ సాయిలీల తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు యాంగ్ జీనియస్ అవార్డ్స్ హైదరాబాద్లో అందజేస్తారని చెప్పారు. పరీక్షలను ప్రిన్సిపాల్ బాలప్ప, అమీనా, నర్సింహ, శివ అమర్, మనీల, వనిత పర్యవేక్షించారు. ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సాదత్ఖాన్, బాల్రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్అలీ, ఎండీ ఉస్మాన్ పాల్గొన్నారు. నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో వెలసిన శ్రీయోగా నరసింహస్వామి ఆలయంలో బుధవారం నుంచి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దీప్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా రోజు ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు తిరుప్పావై పఠనం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనాలు, విష్ణు సహస్త్రనామార్చన, కుంకుమార్చన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 14న శ్రీ భూనీలా సమేత యోగా నరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక గోపాల్పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని స్వరూప ఎస్జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల పీడీ సురేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి 22 వరకు ఝార్ఖండ్లోని రాంచీలో జరిగే ఫుట్బాల్ పోటీల్లో పాల్గొననునట్లు చెప్పారు. నవంబర్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్కీపర్గా అత్యంత ప్రతిభ కనబర్చినందుకుగాను ఎంపిక చేసినట్లు వివరించారు. గతంలో ఎస్జీఎఫ్ క్రీడల్లో మూడుసార్లు పాల్గొని ప్రతిభ కనబర్చిందని, కల్వకుర్తిలో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీ, మధ్యప్రదేశ్లో జరిగిన సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్కీపర్గా అవార్డు సాధించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
మాగనూర్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలను బుధవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని.. ఏవైనా సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆర్డీఓ రాంచందర్, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సురేశ్కుమార్ పాల్గొన్నారు. రామన్పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: రామన్పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికిపైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఎన్టీఆర్ కాల్వ కు 848 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
ఎన్నికల నిర్వహణకు గట్టి బందోబస్తు
మక్తల్: మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయని.. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులు, సిబ్బందిపై ఉందని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మక్తల్, మాగనూర్, నర్వ, ఊట్కూర్, కృష్ణా మండలాల్లో ఎన్నికల జరగనుండగా.. 800 మంది అధికారులు, సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐదు మండలాలను 29 రూట్లుగా విభజించి భద్రత కల్పిస్తున్నామని.. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు 5 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని తెలిపారు. విధుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో బీఎన్ఎస్ 163 చట్టం అమలులో ఉంటుందని.. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల వరకు అనవసర రాకపోకలకు అనుమతించొద్దని కోరారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇంకు సీసాలు, ఇతర హనికర వస్తువులు తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏమై నా సమస్య తలెత్తితే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్, డీఎస్పీలు లింగయ్య, మహేష్, రఘునాథ్ పాల్గొన్నారు. -
జూపల్లి ఇలాకాలో ఉత్కంఠ..
● ఆయన స్వగ్రామం పెద్ద దగడ ఫలితంపై సర్వత్రా ఆసక్తి ● కొల్లాపూర్లోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్లో తుదివిడత ఎన్నికలు ● ఆయా మండలాల్లో పొడిచిన పొత్తులతో రసవత్తరంగా పోరు ● ఒక్క ‘చిన్నంబావి’లోనే 12 జీపీల్లో కారుకు కమలం మద్దతు.. ● మిగిలిన 4 పంచాయతీల్లో బీజేపీకి బీఆర్ఎస్ తోడ్పాటు ● మిగతా మండలాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటివరకు రెండు విడతలు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్కు చెందిన ఆయా ఎమ్మెల్యేల సొంతూళ్లలో విపక్ష పార్టీల మద్దతుదారులు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుది విడతలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంపై అందరూ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం చిన్నంబావి మండలంలోని పెద్ద దగడ గ్రామానికి బుధవారం పోలింగ్ జరగనుండగా.. ఫలితం ఏ విధంగా ఉంటుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దదగడ గ్రామ సర్పంచ్ అన్రిజర్వ్డ్ స్థానం కాగా.. ప్రధానంగా కాంగ్రెస్ బలపరిచిన ఉడుతల భాస్కర్, బీఆర్ఎస్ మద్దతుదారు గొంది నిరంజన్రెడ్డి తలపడుతున్నారు. ఎవరికి వారు తమదే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గ పరిధిలో చివరి దఫాలో ఎన్నికలు జరిగే మండలాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. చిత్రవిచిత్ర పొత్తులే ఇందుకు కారణం. వేర్వేరుగానే.. కానీ ఒక్కటై.. తాజాగా మూడో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాల పరిధిలో మొత్తంగా 56 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ స్థానాల్లో వేర్వేరుగానే.. కానీ ఒక్కటై అన్నట్లు బీఆర్ఎస్, బీజేపీ ఒక అవగాహనతో ఉమ్మడి అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. గ్రామాల్లో బలాబలాల ప్రకారం సర్పంచ్ సీట్లు విభజన చేసుకుని.. ఆయా చోట్ల ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ముందుకుసాగారు. ఇందుకు చిన్నంబావి మండలమే ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో బస్వాపురం జీపీ ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అయ్యాడు. గూడెం, బెక్కం, మియాపూర్, లక్ష్మీపల్లిలో సర్పంచ్లుగా బీజేపీకి చెందిన వారు.. మిగతా 12 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. పాన్గల్ మండలంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుతో రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్ పంచాయతీల్లో ఆయా అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు చిత్తవుతుందా.. ఆ పొత్తు కాంగ్రెస్ను చిత్తు చేస్తుందా అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా స్వగ్రామమైన ఉండవెల్లి మండలం పుల్లూరులో కూడా చివరి విడతలో ఎన్నికలు జరనున్నాయి. అక్కడ ‘కారు’ దూసుకెళ్తుందా.. ‘హస్తం’ గాలి వీస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. 2వ విడతలో నువ్వా.. నేనా.. రెండో విడతలో కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో 71 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పైచేయి సాధించినా.. బీఆర్ఎస్ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను సాధించింది. హస్తం బలపరిచిన అభ్యర్థులు 36 మంది.. బీఆర్ఎస్ మద్దతుదారులు 29 మంది సర్పంచ్లుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన ఇద్దరు.. స్వతంత్రులు మరో నలుగురు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఇందులో మండల కేంద్రాలైన పెద్దకొత్తపల్లి, పెంటవెల్లి జీపీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందగా.. కోడేరులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పోలింగ్ జరుగుతున్న రోజు ఆ స్వతంత్ర అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. -
‘తుది’ పోరుకు సై..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తుది విడత సంగ్రామం క్లైమాక్స్కు చేరింది. ఉమ్మడి పాలమూరులోని 27 మండలాల పరిధిలో బుధవారం చివరి దశ పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఐదు జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సెంటర్లలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఆయా మండల కేంద్రాల్లో శనివారం ఏర్పాటు చేసిన సెంటర్లలో పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. రెండు విడతల్లో పలు చోట్ల ఓట్ల లెక్కింపు ఆలస్యం అయిన నేపథ్యంలో చివరి దఫాలో ఎక్కడా జాప్యం జరగకుండా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికార యంత్రాంగానికి ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు పలు సూచనలు చేశారు. ఏకగ్రీవం పోనూ 504 జీపీల్లో పోలింగ్.. షెడ్యూల్ ప్రకారం మూడో విడతలో ఉమ్మడి జిల్లాలో 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. మరో ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. 7 సర్పంచ్.. 58 వార్డులు ఖాళీ.. ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో మూడో విడతలో ఏడు సర్పంచ్, 58 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎస్టీ రిజర్వ్ కాగా.. అక్కడ ఆ సామాజిక వర్గం లేకపోవడంతో నామినేషన్ దాఖలు కాలేదు. నాగర్కర్నూల్ జిల్లాలో అమ్రాబాద్ మండలంలోని లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్నగర్, చారగొండ మండలంలోని ఎర్రతండా సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఆయా జీపీల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎవరూ లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఏడు, నాగర్కర్నూల్ జిల్లాలో 48, జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్నగర్ 5(అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్, జడ్చర్ల, బాలానగర్) జో.గద్వాల 5(అలంపూర్, ఎర్రవెల్లి, ఇటిక్యాల, ఉండవెల్లి, మానవపాడు) (వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్)వనపర్తి 5అక్కడక్కడ ‘విధుల’ లొల్లి.. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బందికి ఇదివరకే బాధ్యతలు కేటాయించిన విషయం తెలిసిందే. మెడికల్ లీవ్లో ఉన్న వారికి సైతం విధులు కేటాయించడంతో ఆయా జిల్లా ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల సామగ్రి పంపిణీ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పలువురు మహిళా ఉద్యోగులు తమ చంటి పాపలను ఎత్తుకుని వచ్చి.. విధుల నుంచి మినహాయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒక్కో ఉద్యోగికి మూడు దఫాలు విధులు కేటాయించడం.. కొందరికి అసలే కేటాయించకపోవడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు జోగుళాంబ గద్వాల జిల్లా ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పీఓలు, ఏపీఓలు జోనల్ అధికారితో వాగ్వాదానికి దిగారు. బస్సుల రూట్ మ్యాప్ సరిగా ఇవ్వలేదని.. ఏ బస్సు కేటాయించారనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లాలు, మండలాల వారీగా వివరాలునేడు చివరి విడత సం‘గ్రామం’ 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాల్లో ఎన్నికలు ఏకగ్రీవం పోనూ 504 సర్పంచ్, 4,016 వార్డుల్లో పోలింగ్ 5 జిల్లాలు, 27 మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం -
సమర్థవంతంగా తుదిదశ పోలింగ్
మక్తల్: జిల్లాలో బుధవారం జరిగే చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మక్తల్, మాగనూర్, కృష్ణా, నర్వలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె తనిఖీ చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో తొలి, రెండోవిడత ఎన్నికలు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగించిన అధికారులు, పోలింగ్ సిబ్బంది కృషి అభినందనీయమని కొనియాడారు. ఇటీవల జరిగిన రెండు విడతల పోలింగ్ కేంద్రాల కంటే మూడో విడతలో అధికంగా ఉన్నాయని.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పీఓలు, ఓపీఓలు బ్యాలెట్ పత్రాలు, చెక్లిస్ట్లోని సామగ్రిని సరి చూసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణకుగాను మొత్తం 2,586 మంది సిబ్బందిని నియమించామని, 32 మంది జోనల్ అధికారులు, 29 మంది రూట్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 52 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, 1,083 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు వివరించారు. సమావేశాంలో అధికారులు జాన్ సుధాకర్, గోవిందరాజ్, రమేశ్కుమార్, సతీశ్కుమార్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల విధుల్లో అలసత్వం వహించొద్దు
మక్తల్: మూడో విడత జరిగే పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని.. ఎన్నికల విధుల్లో ఎవరూ అలసత్వం వహించొద్దని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రెయినీ కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సామగ్రి పంపిణీలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఒకటికి రెండు సార్లు పోలింగ్ సామగ్రిని సరిచూసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని అన్నారు. కాగా, మక్తల్ మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్.. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్, తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీఓ రమేశ్ ఉన్నారు. -
మంత్రికి సవాల్గా సం‘గ్రామం’
● పల్లెల్లో పట్టుకు ప్రధాన పార్టీల ప్రయత్నాలు ● గ్రామాల్లో జోరుగా సాగిన ఎన్నికల ప్రచారం నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో మూడో విడత జరిగే పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరికి సవాల్గా మారాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 67 స్థానాలకు గాను 50 స్థానాల వరకు విజయం సాధించారు. మలి విడత నారాయణపేట నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి నేతృత్వంలో 52 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో 110 సర్పంచ్ స్థానాలకు గాను 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 17న 100 స్థానాలకు జరిగే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకోవడం మంత్రికి సవాల్గా మారిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల మక్తల్లో జరిగిన సీఎం సభకు జనం రాకపోవడంతో అసంతృప్తికి గురైన మంత్రి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతారని నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోటాపోటీగా వ్యూహాలు.. జిల్లాలోని మక్తల్, ఊట్కూర్, నర్వ, మాగనూర్, కృష్ణా మండలాల్లో అభ్యర్థులు ఏదో ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. తొలి, మలి విడత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా నిలిచింది. మూడో విడతలోనూ మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్ నియోజకవర్గంలో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు.. పల్లెలో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ కార్యకర్తలు, నాయకులతో వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఎంపీ డీకే అరుణ సైతం బీజేపీ మద్దతుదారుల తరఫున ముమ్మర ప్రచారం చేశారు. పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ముందుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం 7నుంచి సాయత్రం 5 గంటల వరకు అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు తమ ప్రచారంతో హోరెత్తించారు. చిన్న పంచాయతీలో పోటీపడే వారు సైతం ప్రచార రథాలతో వాడవాడలా ప్రచారం చేయడం గమనార్హం. -
స్వేచ్ఛగా ఓటు హక్కువినియోగించుకోవాలి
ఊట్కూరు: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. మద్యం, డబ్బులకు ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని డీఎస్పీ లింగయ్య సూచించారు. సోమవారం ఊట్కూరు మండల కేంద్రంలో సాయుధ బలగాలతో కలిసి స్థానిక పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుశాఖ లక్ష్యమన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించినా.. ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఎస్ఐ రమేశ్ పాల్గొన్నారు. 18న టీ–20 క్రికెట్ జట్టు ఎంపిక నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా టీ–20 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ ఇన్చార్జి పీడీ రమణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎండీసీఏ, విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్సీఏ ఆధ్వర్యంలో నిర్వహించే జి.వెంకటస్వామి మెమోరియల్ టీ–20 క్రికెట్ లీగ్కు జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు, రెండు ఫొటోలతో మినీ స్టేడియానికి రావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 91007 53683 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. నేడు ఎస్జీఎఫ్బ్యాడ్మింటన్ ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నేడు (మంగళవారం) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్సీ ఒరిజినల్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్తో ఉదయం 9 గంటలకు పీడీ సాదత్ఖాన్కు రిపోర్టు చేయాలని, మిగతా వివరాల కోసం 89198 71829 నంబర్ను సంప్రదించాలని ఆమె సూచించారు. ఆర్ఎన్ఆర్ @ రూ.2,822 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం ధాన్యం ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,822, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి. హంస గరిష్టంగా రూ.1,781, కనిష్టంగా రూ.1,736, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,029, కనిష్టంగా రూ.1,820, కందులు రూ.6,341, వేరుశనగ రూ.7,411, జొన్నలు రూ.1,810 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,669, కనిష్టంగా రూ.2,401గా ధరలు లభించాయి. ప్రాతఃకాల మంగళహారతి వేళలు మార్పు అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్ర ఆలయాల్లో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసం ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 14 న ముగుస్తుందని, దీంతో ధనుర్మాసంలో ప్రాతఃకాల మహా మంగళ హారతి వేళలు మార్పు చేస్తునట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ప్రాతః కాల మహా మంగళ హారతి ఉదయం 6.30 గంటలకు ఉందని.. ఆ సమయాన్ని 5.30 గంటలకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీబాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలోనూ ప్రాతఃకాల మహా మంగళహారతిని ఉదయం 6 గంటల నుంచి 5.45గా మార్పు చేసినట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి
నారాయణపేట టౌన్: బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని.. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వింద్యానాయక్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో చేపట్టిన బాల్యవివాహ రహిత భారత్ 100 రోజుల కార్యాచరణ అమలులో భాగంగా సోమవా రం జిల్లా కోర్టు ఆవరణలో లీగల్ వలంటీర్స్, అంగన్వాడీ టీచర్లు, అశావర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణకు అందరూ పాటుపడాలన్నారు. బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాలను అరికట్టడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్జడ్జి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి అవినాష్, లక్ష్మీపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టర్ చాంబర్లో మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. మూడో విడతలో 920 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 20 శాతం అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచే ప్రచార కార్యక్రమాలు నిషేధమని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎవరూ కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. -
ప్రలోభాల పర్వం షురూ
● ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం ● మద్యం, నగదు పంపిణీకి యత్నాలు నారాయణపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుండగా.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా, మాగనూర్, మక్తల్, నర్వ, ఊట్కూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తూ వచ్చిన కొందరు.. అందిన కాడికి దండుకొనేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. తమ వాళ్లు ఐదుగురు హైదరాబాద్ నుంచి రావాలని.. బస్సులో వస్తే మధ్యాహ్నం 1గంట దాటుతుందని.. వారు కారు తీసుకొని వస్తారని.. కారు కిరాయి, టీ, టిఫిన్, భోజనం, డ్రైవర్ బత్తా కలిసి రూ. 10వేల వరకు అవుతుందని.. వారిని రమ్మంటావా.. వద్దంటావా అని అభ్యర్థులకు చెబుతుండటంతో పరేషాన్లో పడుతున్నారు. ఎవరూ ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే.. కొందరు ముంబాయి, హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఉన్నారని చెబుతుండటంతో ఖంగుతింటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే ప్రతి ఓటు కీలకం కావడంతో అభ్యర్థుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ● మూడో విడత ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో పల్లెల్లో ప్రలోభాల పర్వం మొదలైంది. అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా మండలాల్లో బ్యాంకులు, ఏటీఎంలలో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు వీలులేకుండా పోయింది. మద్యం దుకాణాలు శనివారం సాయంత్రం నుంచే మూతపడ్డాయి. అయితే అభ్యర్థులు ముందుగానే మద్యం నిల్వ చేసుకున్నారు. ● పోలింగ్కు 48 గంటల ముందుగానే ప్రచార కార్యక్రమాల నిషేధం అమలులోకి వచ్చింది. సభలు, సమావేశాల నిర్వహణ, స్పీకర్ల వినియోగం, ప్రచారం, ర్యాలీలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఐదుగురు వ్యక్తులు లేదా గుంపులుగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు. -
చెయ్యెత్తిన పల్లెలు..
మహబూబ్నగర్: 98 కాంగ్రెస్.. 39 బీఆర్ఎస్ జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్ జరిగింది. మహబూబ్నగర్ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్.. నారాయణపేటలోని కోయిల్కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్ పీఠాలను కై వసం చేసుకున్నారు. నారాయణపేట : కాంగ్రెస్దే పైచేయి.. జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్ఎస్, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. -
84.33 శాతం పోలింగ్
నారాయణపేట: జిల్లాలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో రెండో విడత జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదైంది. మొత్తం 1,50,318 ఓట్లకు గాను 1,26,769 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ మందకొడిగా కొనసాగగా.. 11 నుంచి 12 గంటల వరకు 45 శాతం నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. 1గంట వరకు 72.34 శాతం ఓటింగ్ నమోదు కాగా.. అప్పటికే క్యూలో నిల్చున్న ఓటర్లు పూర్తయ్యే వరకు 84.33 శాతం పోలింగ్ నమోదైంది. 76,642 మంది మహిళా ఓటర్లకు గాను 64,065 మంది, 73,674 మంది పురుష ఓటర్లకు గాను 62,703 మంది ఓటు వేశారు. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 85.21 శాతం.. అత్యల్పంగా ధన్వాడలో 82.14 శాతం పోలింగ్ నమోదైంది. -
గ్రామాలు పోటెత్తాయి..
● 2వ విడతలోనూ భారీగా పోలింగ్ ● 87.08 ఓటింగ్ శాతంతో మళ్లీ గద్వాల జిల్లానే టాప్ ● అత్యల్పంగా నాగర్కర్నూల్లో 84 శాతం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పల్లె పోరులోనూ ఓటర్లు పోటెత్తారు. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 26 మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం పోనూ మిగిలిన జీపీలకు నిర్వహించిన పోలింగ్లో మొత్తంగా 85.80 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చలి నేపథ్యంలో నామమాత్రంగానే ఓటర్లు వచ్చారు. రెండు గంటల తర్వాత ఓటర్ల రాక ఊపందుకుంది. 11.30 గంటల తర్వాత ఒకేసారి భారీ ఎత్తున ఓటర్లు రావడంతో పోలింగ్ కేంద్రాలు కిక్కిరిశాయి. కొన్ని చోట్ల ఒంటి గంట దాటినా పోలింగ్ కొనసాగింది. నిర్ణీత సమయంలోపు కేంద్రాలకు వచ్చి క్యూలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 84 శాతం.. ఆపైనే.. ఉమ్మడి జిల్లాలో 2వ విడతకు సంబంధించి సగటున 85.80 శాతం పోలింగ్ నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలో పోలింగ్ శాతం 84 కాగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోనే అంతకు పైగానే నమోదైంది. తొలి విడతలోటాప్ స్థానంలో నిలిచిన జోగులాంబ గద్వాల 87.08 శాతంతో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వనపర్తి 87, మహబూబ్నగర్ 86.62, నారాయణపేట జిల్లాలో 84.33 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే అన్ని జిల్లాల్లోనూ మహిళల ఓటింగ్ శాతం తక్కువగా ఉంది. -
700 మంది పోలీసులతో భారీ బందోబస్తు
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్దఅదనపు బలగాలు : ఎస్పీ డా. వినీత్ నారాయణపేట: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ డా. వినీత్ కోరారు. ఆదివారం నారాయణపేట, దామరిగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో రెండోవిడత పోలింగ్ జరగనుండగా.. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎస్పీ భద్రతాపరమైన సూచనలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు 700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు మండలాల్లో మొత్తం 28 రూట్లు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు 5 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. పోలింగ్రోజు, కేంద్రాల దగ్గర పాటించాల్సిన నియమాలను వివరించారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పని చేయాలని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర 163 (బీఎన్ఎస్స్)యాక్ట్ అమలులో ఉంటుందని, 200 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించవద్దని, కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇంక్ బాటిల్స్, ఇతర హానికర వస్తువులు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ఊరేగింపు, ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, రఘునాథ్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పోలింగ్ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలి
● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ. మరికల్ మండలాల పరిధిలో ఆదివారం జరిగే రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం ఆమె ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్లో విధులు నిర్వహించిన వారిలో కొందరు రెండోవిడత నియమింపబడ్డారని, విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల సామగ్రిని చెక్లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ను పర్యవేక్షించే అవకాశం ఉందని, పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలను ఎవరూ నిలిపివేయరాదని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు ప్రవేశం లేదని, కేంద్రాల ఆవరణలోనే బందోబస్తు చేయాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడటంతో పాటు ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫారం 9 ప్రకారం సిబ్బంది తప్పనిసరిగా బ్యాలెట్ బాక్స్ చెక్ చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తుందని, మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అబ్జర్వర్ ఆదేశాల అనంతరమే ఫలితాలు వెల్లడించాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందించిన సామగ్రిని జాగ్రత్తగా సీల్చేసి డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు. కాగా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను దామరగిద్ద, మరికల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. -
రెండో పోరుకు రెడీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రెండో విడత పంచాయతీ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో 26 మండలాల పరిధిలో 565 గ్రామ పంచాయతీలు, 5,212 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 45 జీపీలు ఏకగ్రీవం పోనూ 520 సర్పంచ్.. 1,004 ఏకగ్రీవం పోనూ 4,202 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రభుత్వ సిబ్బందికి శనివారం పోలింగ్ సామగ్రిని అందజేశారు. 520 సర్పంచ్లకు 1,709 మంది పోటీ.. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ జరగనున్న 520 జీపీల్లో 1,709 మంది అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీపడుతున్నారు. సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. అదేవిధంగా 4,202 వార్డు స్థానాలకు 10,826 మంది బరిలో నిలిచారు. ఈ లెక్కన ఒక్కో స్థానానికి సగటున అటుఇటుగా ముగ్గురు పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. సర్పంచ్ పదవులకు సంబంధించి ప్రధానంగా గద్వాల, మహబూబ్నగర్, వనపర్తిలో ఇద్దరికి మించి అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లు ప్రచారంలో దూకుడుగా వ్యవహరించగా.. ఆయా జిల్లాల్లో పలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండో విడతలో ఇలా.. జిల్లా జీపీలు ఏకగ్రీవ పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్లు స్థానాలు ఉంది.. స్థానాలు ఉంది.. మహబూబ్గర్ 151 9 142 474 1,334 267 1,065 2,811 నాగర్కర్నూల్ 151 4 147 473 1,412 143 1,269 3,228 నారాయణపేట 95 10 85 268 900 224 672 1,755 వనపర్తి 94 5 89 294 850 148 702 1,769 జో. గద్వాల 74 17 57 200 716 222 494 1,263 మొత్తం 565 45 520 1,709 5,212 1,004 4,202 10,826 2వ విడతలో ఎన్నికల్లో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు.. 2వ విడతలో జిల్లాలు, మండలాల వారీగా ఇలా.. జిల్లా పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మహబూబ్నగర్ 94,975 96,998 4 1,91,977 నాగర్కర్నూల్ 1,27,142 1,26,602 5 2,53,749 జో.గద్వాల 55,710 57,094 3 1,12,807 వనపర్తి 61,553 62,726 2 1,24,281 నారాయణపేట 73,674 76,642 2 1,50,318 మహబూబ్గర్: 6 (చిన్నచింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల, మిడ్జిల్, హన్వాడ, కోయిల్కొండ) నాగర్కర్నూల్: 7 (బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట)జోగుళాంబ గద్వాల: 4 (మల్దకల్, అయిజ, వడ్డేపల్లి, రాజోలి) నారాయణపేట: 4 (దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్) వనపర్తి: 5 (వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత) నేడు 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఈ జీపీలో పది వార్డులు ఉండగా.. రెండు, ఆరు, తొమ్మిది, పదో వార్డు స్థానాలు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అయితే గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడంతో ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పుల్పోనిపల్లి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. నాలుగు, ఆరో వార్డుకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా అభ్యర్థులకు వయసు అడ్డంకిగా మారడంతో స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా వార్డులకు పోలింగ్ నిర్వహించడం లేదు. ఉమ్మడి జిల్లాలో 45 మంది సర్పంచ్లు, 1,004 వార్డు స్థానాలు ఏకగ్రీవం 520 జీపీలు.. 4,202 వార్డులకు పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉదయం 7 గంటలకు షురూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ముందుగా వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ను ఎన్నుకునేలా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 8,33,132 మంది ఓటర్లు.. రెండో విడతలో పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తంగా 8,33,132 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 4,13,054 మంది కాగా.. మహిళలు 4,20,062, ఇతరులు 16 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు 7,008 మంది అధికంగా ఉండగా.. వారి ఓట్లు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. -
నిర్భయంగా ఓటు వేయాలి: ఎస్పీ
నారాయణపేట రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ వినీత్ అన్నారు. ఎన్నికల దృష్టా ప్రజల్లో భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మండలంలోని జాజాపూర్లో శుక్రవారం రాత్రి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సున్నితమైన, అతి సున్నితమైన గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, ముఖ్యంగా క్రిటికల్ గ్రామాల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరిగినా, ఇతరులను భయపెట్టేందుకు ప్రయత్నించినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అంతకుముందు నిర్భయంగా ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. ఓటు మన హక్కు.. అనే నినాదాలతో ర్యాలీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్ఐలు రాముడు, వెంకటేశ్వర్లు, నరేష్, రాజు, శివశంకర్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
‘రెండో విడత’ పకడ్బందీగా నిర్వహించాలి
నారాయణపేట: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులు కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్లో రెండో విడతలో ఎన్నికలు జరుగనున్న నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల పోలింగ్ సిబ్బంది మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలకి్ష్మ్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. రెండో విడతలో 828 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనుండగా 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ జరిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
జనరల్లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలోని 24 మండలాల్లో తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దఫాకు సంబంధించి 237 అన్రిజర్వ్డ్ (జనరల్, మహిళ కలిపి) సర్పంచ్ స్థానాల్లో 116 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో పాటు 114 బీసీ రిజర్వ్ (బీసీ జనరల్, బీసీ మహిళ కలిపి) స్థానాల్లో ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా 550 సర్పంచ్లకు గాను 230 మంది (41.82 శాతం) బీసీలు ఎన్నికయ్యారు. తొలివిడతలోసర్పంచ్లుగా విజయం 237 అన్రిజర్వ్డ్ స్థానాల్లో 116 మంది జయకేతనం మొత్తంగా 550 పంచాయతీల్లో 230 మంది గెలుపు బీసీలు పోటీలో ఉన్న జనరల్ స్థానాలపై సంఘాల ప్రత్యేక నజర్ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం -
నోట్లు మీకు.. ఓట్లు మాకు!
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల పాట్లు నారాయణపేట: నోట్లు మీకు.. ఓట్లు మాకు అంటూ అభ్యర్థులు ఓటర్లకు గప్చుప్గా ఎరవేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నాటికి రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో డబ్బు, దావత్లు, చికెన్ పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో 85 గ్రామ పంచాయతీలు, 672 వార్డుల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. మద్యం, డబ్బుల పంపిణీ కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నిస్తున్నారు. లెక్కించనున్నారు. ఒక్క చాన్స్ ఇవ్వండి రెండో విడత గ్రామ పంచాయతీల్లో ప్రచారం చివరి రోజు హోరెత్తించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు మించి ఎన్నికల ప్రచారం హోరాహోరీగా చేపట్టారు. సర్పంచులు, వార్డు సభ్యులు తమ గెలుపు కోసం ఓటర్ల మద్దతు కోసం ఇంటింటికీ వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకే ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐఎంఎల్ మాస్లైన్ పార్టీలు బలపరిన సర్పంచ్ అభ్యర్థులే కాకుండా కాంగ్రెస్ రెబల్, స్వతంత్రంగా బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రలోభాల కట్టడి సాధ్యమేనా.. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా అభ్యర్థులు పెడచెవిన పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన డబ్బు, మద్యం పట్టుకుంటే పోలీసు శాఖలో తమకు స్థాన చలనం అవుతాయనే భయంతో అధికారులు వెనకడుగు వేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని అధికారులకు సమాచారం ఇస్తే వారి పేర్లు ఎక్కడ బయటపెడుతారనే భయంతో ఎవరూ చెప్పేందుకు ముందుకు రావడం లేదు. తూతూమంత్రంగా వాహన తనిఖీలు చేస్తారే తప్పా.. డబ్బు, మద్యం పంపిణీపై ఎలాంటి దృష్టి సారించరనేది బహిరంగ రహస్యమేనంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓటరు.. క్వాటర్! ఎన్నికలకు రెండు రోజుల ముందే బార్లు, వైన్స్లు బంద్ చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించడంతో దుకాణాలు బంద్ అయ్యాయి. మద్యం ప్రియుల అలవాటును ఆసరా చేసుకొని మద్యాన్ని ఓటర్లకు పంచేందుకు అభ్యర్థులు ఇప్పటికే తమ బంధువులు, నమ్మకస్తులు, స్నేహితుల ఇళ్లలో కాటన్లకు కాటన్లు డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పలువురు అభ్యర్థులు తమకు వచ్చిన ఎన్నికల గుర్తుల స్లీప్లతో క్వాటర్లను పంచేందుకు సిద్ధపడుతున్నారు. రెండో విడత పోలింగ్కు మిగిలింది ఒక్కరోజే కూర్చున్న కాడికే మందు, ఫ్రైలు కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ.500,రూ.వెయ్యిపైనే.. తూతూమంత్రంగానే అధికారులు తనిఖీలు -
మద్యం, డబ్బులు లేకుండా ఎన్నికలు జరగాలి
నారాయణపేట రూరల్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్పులు చేసి డబ్బులు ధారపోసి ఆగం కావద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో పంచాయతీలో ఓటుకు వెయ్యి నుంచి రూ.6 వేల వరకు ఖర్చుపెడుతున్నారని, అలాగే ఏకగ్రీవ ఎన్నికల కోసం రూ.లక్షలు ధారపోస్తున్నారని ఆందోళన చెందారు. ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి చేసే వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కానీ ఇంతవరకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు నాగురావు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా మాజీ అధ్యక్షుడు పడకుల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, బలరాంరెడ్డి, వెంకట్రాములు, రఘురామయ్య గౌడ్, సుజాత, గోపాల్, సత్యరఘుపాల్, వెంకటయ్య, వినోద్, కృష్ణ, కిరణ్ పాల్గొన్నారు. -
120 సీట్లు.. 7,115 విద్యారు్థలు
గద్వాలటౌన్: నవోదయ విద్యాయాల్లో ప్రవేశం కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. తల్లిదండ్రులు సైతం ఆ దిశగా పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. గ్రామీణ, పట్టణం తేడా లేకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని నవోదయలో చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఉమ్మడి మహబుబ్నగర్ జిల్లా (రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కొన్ని మండలాలు)లో నవోదయ ప్రవేశాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 29 కేంద్రాలలో 7,115 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారు. అంటే 120 సీట్లకు అంత మంది పోటీ పడాల్సి వస్తోంది. డిసెంబర్ 13న నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అరగంట ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రెండు విద్యాలయాలలో.. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో కొత్త నవోదయ విద్యాలయాలు వస్తే పోటీ తగ్గి ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం వస్తుందని అనేకమంది ఎదురుచూశారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో కొత్త నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం మహబూబ్నగర్ శివారులో స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి తరగతులు కొనసాగిస్తున్నా రు. అందులో 40సీట్లను భర్తీ చేశారు. వట్టెం జవహ ర్ నవోదయ విద్యాలయంలో 80సీట్లు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 120సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. నాణ్యమైన విద్య.. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల మోత.. అర్హులైన అధ్యాపకుల లేమి.. తదితర సమస్యలు పూర్తిస్థాయి లో నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ప్ర వేశాలకు నిర్వహించే అర్హత పరీక్షలో ఒకసారి ప్రవే శం లభిస్తే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూ ర్తయ్యే వరకు అందులోనే నాణ్యమైన విద్య అందు తుంది. క్రీడలకూ ఇక్కడ ప్రాధాన్యం ఇస్తారు. వస తి, భోజనం, పుస్తకాలు, స్టేషనరీ, ఏకరూప దుస్తు లు తదితర అన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. నడిగడ్డలో ఏర్పాటుకు కృషి చేయాలి రాష్ట్రంలో పూర్వం 10 జిల్లాలు ఉండగా.. వీటిలో అర్బన్ జిల్లాకు నవోదయ విద్యాలయాలు ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 9 జిల్లాల పరిధిలో తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రతి విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరికొన్ని నవోదయ విద్యాలయాలను మంజూరు చేస్తూ.. రాబోవు కాలంలో మరిన్ని మంజూరు చేస్తామని ప్రకటించింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడి జోగుళాంబ గద్వాల జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైతే ఇక్కడి విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అక్షరాస్యతలో ఈ జిల్లా ఎంతో వెనుకబడి ఉంది. ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే అక్షరాస్యత పెంపుతో పాటు విద్యాభివృద్ధికి బాటలు వేసినట్లవుతుంది. ఆ దిశగా పాలకులు నడిగడ్డలో కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నవోదయలోప్రవేశాలకు డిమాండ్ ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నేడే ప్రవేశ పరీక్ష -
ఓటెత్తారు..
– గట్టుసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్లో వెనుకపడ్డారు. జాధరావ్పల్లిలో తండ్రిని మోసుకెళ్తున్న కుమారుడు -
ప్రశాంతంగా తొలివిడత పోలింగ్
కోస్గి: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం జిల్లాలోని కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లె పోరు ప్రశాంతం కావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొదటి విడతలో 67 పంచాయతీలకుగాను 14 పంచాయతీలు, 572 వార్డులకుగాను 210 వార్డులు ఏకగ్రీవం కాగా.. 53 పంచాయతీలకు, 361 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 66,689 మంది ఓటర్లకు 56,403 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా 86.70 శాతం ఓటింగ్ కోస్గి మండలంలో, అత్యల్పంగా 83.06 శాతం ఓటింగ్ గుండుమాల్ మండలంలో నమోదైంది. కొత్తపల్లి మండలంలోని దుప్పటిగట్ పంచాయతీలో అత్యధికంగా 94 శాతం, అత్యల్పంగా అదే మండలంలోని భూనిడ్ పంచాయతీలో 77 శాతం ఓటింగ్ నమోదైంది. తగ్గుతూ.. పెరుగుతూ.. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. అధికారులు ఓటింగ్ సరళిని మూడు దశలుగా విభజించి ఓటింగ్ శాతాన్ని నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి దశలో కేవలం 21.13 శాతం నమోదైంది. 9 నుంచి 11 గంటల వరకు 36.58 శాతం, 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 24 శాతం నమోదైంది. సర్జఖాన్పేట్ను సందర్శించిన ఎస్పీ కోస్గి రూరల్: మండలంలోని సమస్యాత్మక గ్రామమైన సర్జఖాన్పేట్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ వినీత్ గురువారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అధికార పార్టీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోగా.. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి చక్కదిద్దేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈక్రమంలో పోలీసులు ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు అర్ధరాత్రి ధర్నా చేపట్టారు. దీంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకొని మరోసారి లాఠీచార్జ్ చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈక్రమంలో ఎస్పీ గ్రామాన్ని సందర్శించారు. -
‘18 గుర్తింపు కార్డుల్లో దేనినైనా తీసుకెళ్లొచ్చు’
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లే సమయంలో 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని తమ వెంట తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్, ఆధార్ కార్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్టాఫీస్/ బ్యాంక్ పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డ్, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్పుస్తకం, రేషన్ కార్డు, ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్స్ పత్రం, ఫ్రీడం ఫైటర్ ఐడీ కార్డు, ఆర్టీఐ ద్వారా జారీ చేయబడిన ఎన్పీఆర్ స్మార్ట్ కార్డులో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చని కలెక్టర్ సూచించారు. నిర్ణీత సమయంలో పోలింగ్ ప్రారంభించాలి కోస్గి: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిర్ణీత సమయంలో ప్రారంభించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, మద్దూరు, గుండుమాల్, కోస్గి మండలాల్లోని ఎన్నికల అధికారులు సామగ్రిని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు, అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. గుండుమాల్ మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్, కొత్తపల్లి శ్రీను సందర్శించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీఆర్డీఓ మొగులప్ప, తహసీల్దార్లు శ్రీనివాసులు, భాస్కరస్వామి, ఎంపీడీఓలు శ్రీధర్, వేణుగోపాలస్వామి ఉన్నారు. -
వెబ్ కాస్టింగ్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
నారాయణపేట: రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మొదటి విడత పోలింగ్లో భాగంగా వెబ్ కాస్టింగ్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్గంగ్వార్ అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్/మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ నిర్వహణను జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి విడతలో జిల్లాలో గుర్తించిన 34 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, నోడల్ అధికారి సాయిబాబా, డీపీఆర్ఓ రషీద్ పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్కు ‘ఫెసిలిటేషన్’ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తోందని.. ఈ మేరకు సంబంధిత మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడత ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారన్నారు. గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు దానిని వినియోగించుకునేందుకు ఈ నెల 12, 13 తేదీల్లో అవకాశం కల్పించారని, ఇందుకోసం మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న మక్తల్, కృష్ణా, మాగనూర్, ఊట్కూర్, నర్వ మండ లాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు, సిబ్బంది ఓటరు జాబితాలో తమ పేరు కలిగి ఉండాలని, అలాగే ఎన్నికల విధులు నిర్వహించే ఆర్డర్ కాపీని చూపించాలన్నారు. అధికారులు ఇచ్చిన బ్యాలెట్ పేపరులో తమకు ఇష్టమైన అభ్యర్థికి పెన్నుతో టిక్ మార్కు చేసి, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. తర్వాత అక్కడే ఉన్న బ్యాలెట్ బాక్స్లో వేయాలని సూచించారు. పోస్టల్ నోడల్ అధికారిగా డీఏఓ జాన్సుధాకర్ను నియమించామన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలిమద్దూరు/కోస్గి రూరల్: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. బుధవారం పట్టణలోని పంచాక్షరి ఫంక్షన్హల్లో గుండుమాల్, కోస్గి మండలంలో ఎన్నికల నిర్వహణ, బందోబస్తుపై సమీక్ష చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి, మద్దూర్, కోస్గి, గుండుమాల్ మండలాలకు 650 మంది పోలీసు ఫోర్స్, 2 టీఎస్ఎస్పీ బెటాలియన్లు, సీఐడీ ఫోర్స్తో భారీ భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నాలుగు మండలాల్లోని 67 గ్రామపంచాయతీలు ఉండగా, 14 ఏకగ్రీవం కాగా.. మిగతా 53 పంచాయతీలకు పోలింగ్ నిర్వహణ చేపట్టామన్నారు. 13 సమస్యాత్మక గ్రామ పంచాయతీల్లో 27 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించామని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తపల్లి, మద్దూరు మండలాలను 18 రూట్లు గాను, కోస్గి, గుండుమాల్ మండలంలో 15 రూట్లుగాను విభజించి బందోబస్తు చేపడుతున్నామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, డబ్బులు పంపిణీ, రాజకీయ పార్టీల ప్రచారం చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు గుంపులుగా ఉండకూడదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు లింగయ్య, మహేష్, సీఐ సైదులు, ఎస్ఐలు విజయ్కుమార్, బాల్రాజు తదితరులు ఉన్నారు. ఎన్నికల కోసం 135 స్కూల్ బస్సులు పాలమూరు: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలకు సామగ్రిని తరలించేందుకు ఆర్టీఏ శాఖ 135 ప్రైవేట్ స్కూల్ బస్సులు, 34 వాహనాలను ఏర్పాటు చేశారు.ఆర్టీఓ రఘుకుమార్ బస్సుల కేటాయింపుతో పాటు రూట్ విధానాలపై పర్యవేక్షించారు. ఒక్కో బస్సుకు ఒక రూట్ కేటాయించి ఆ మార్గాల్లో బస్సులను పంపించారు. -
కేంద్ర నిధులతోనే ప్రగతి బాటలో పల్లెలు
నారాయణపేట రూరల్: గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే జరుగుతుందని, పల్లెలు మరింత అభివృద్ధి చెందాలంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నాగురావునామాజీ కోరారు. బుధవారం నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కే.రతంగపాండురెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు సత్యయాదవ్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రోడ్లు, బాలిక సంరక్షణ, రైతు, కార్మిక సంక్షేమం, పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో అమలు అవుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్రానికి మద్దతుగా నిలబడాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. రూపాయి కూడా గ్రామాలకు ఇవ్వలేదని విమర్శించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న బీజేపీ మద్దతుదారులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులు, మీడియా ఇన్చార్జి కిరణ్డగే తదితరులు పాల్గొన్నారు. -
1,650
సర్పంచ్ స్థానాలు పోటీలో ఉన్నవారు ● ఉమ్మడి జిల్లాలో ‘తొలి’ పోరు ఇలా.. ● వార్డులు 3,691.. బరిలో నిలిచిన వారు 9,127 ● మొత్తంగా 58 సర్పంచ్, 1,147 వార్డులు ఏకగ్రీవం ● 2 వార్డు స్థానాల్లో దాఖలు కాని నామినేషన్లు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. తొలి విడత షెడ్యూల్ ప్రకారం 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 58 జీపీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 492 సర్పంచ్ పదవులకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు 1,650 మంది బరిలో నిలిచారు. అదేవిధంగా మొదటి విడతలో పోలింగ్ జరగనున్న వార్డు స్థానాల్లో 1,147 ఏకగ్రీవమయ్యాయి. ఇవి పోనూ 3,691 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 9,127 మంది పోటీలో నిలిచారు. గద్వాల, వనపర్తిలో పోటాపోటీ.. తొలి దశ జీపీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ముగ్గురు పోటీపడుతున్నారు. పాలమూరులోని ఐదు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండగా.. ప్రధానంగా గద్వాల, వనపర్తిలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు రెబల్స్గా బరిలో ఉన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన బలమైన నాయకులు సైతం పోటీలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ● తొలి విడత ఎన్నికలకు సంబంధించి నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో వాల్యానాయక్ తండాలో ఆరో వార్డుకు ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఆ అభ్యర్థి సర్పంచ్ స్థానానికి కూడా నామినేషన్ వేశారు. ఆయన సర్పంచ్గా ఏకగ్రీవం కాగా.. ఆరో వార్డు కు వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అదేవిధంగా వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో ఏడో వార్డుకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. తొలి విడతలో ఎన్నికల వివరాలు.. జిల్లా జీపీలు ఏకగ్రీవం పోలింగ్ బరిలో వార్డులు ఏకగ్రీవం పోలింగ్ బరిలో సర్పంచ్ జరిగేవి ఉన్నవారు జరిగేవి ఉన్నవారు మహబూబ్నగర్ 139 10 129 425 1,188 264 924 2,195 నాగర్కర్నూల్ 151 14 137 447 1,326 208 1,118 2,774 జోగుళాంబ గద్వాల 106 15 91 321 974 361 613 1,425 నారాయణపేట 67 14 53 170 572 210 361 1,017 వనపర్తి 87 05 82 287 780 104 675 1,716 మొత్తం 550 58 492 1,650 4,840 1,147 3,691 9,127 -
పల్లె తీర్పు నేడే..
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ● గ్రామ ప్రథమ పౌరులను తేల్చనున్న ఓటర్లు ● 53 పంచాయతీలు, 374 వార్డులకు ఎన్నికలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● పర్యవేక్షిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ మద్దూరు/కోస్గి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచులు ఎవరనేది ఓటర్లు గురువారం తేల్చనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రమే అధికారులు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసు బలగాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఇదిలా ఉండగా సర్పంచ్గా పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. అప్పటి నుంచి ప్రలోభాల పర్వం మొదలుపెట్టారు. అభ్యర్థులు నేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి నగదు, మద్యం, బహుమతులు ఇచ్చి ఓటు తమకే వేయాలని ప్రమాణాలు చేయించుకున్నారని ఓటర్లు చర్చించుకుంటున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో.. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని కోస్గి, మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో మొత్తం 67 గ్రామ పంచాయతీలుండగా 14 పంచాయతీలు, 572 వార్డుల్లో 198 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 53 పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా 169 మంది సర్పంచ్ అభ్యర్థులు, 374 వార్డులకు 807 మంది వార్డు సభ్యులుగా పోటీ పడుతున్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి మొత్తం 572 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక్కో పీఓ, ఏపీఓలతో పాటు అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాలు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 572 పోలింగ్ స్టేషన్లకు 686 మంది పీఓలను, 785 మంది ఏపీఓలను, స్టేజ్–1 ఆఫీసర్లుగా 352, స్టేజ్–2 ఆఫీసర్లు 81 మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 200 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 32 వెబ్ కెమెరాలు బిగించినట్లు అధికారులు తెలిపారు. వీరితో పాటు 162 మంది మైక్రో పరిశీలకులు వారికి కేటాయించిన రూట్లలో పని చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 25 ఓట్లను ఒక బెండల్గా వేరు చేసి మొదట వార్డుల వారీగా ఓట్లు లెక్కింపు మొదలు పెడతారు. గ్రామంలో మొదటి వార్డు మొదలు కొని చివరి వార్డు వరకు ఫలితాలు వెల్లడిస్తారు. తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని చోట్ల పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. -
పటిష్ట బందోబస్తు..
నారాయణపేట: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని గ్రామాభివృద్ధికి పాటుపాడాలని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇచ్చే డబ్బులు, బహుమతులు, మద్యం తీసుకొని ఓటును అమ్ముకోవద్దని హితువు పలికారు. ఇలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని 13 మండలాల్లోని 272 గ్రామ పంచాయతీలు, 2,466 వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ జీపీ ఎన్నికల బందోబస్తు వివరాలను వెల్లడించారు. జిల్లాలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమాల్లో ఈ నెల 11న మొదటి విడతలో, డిసెంబర్ 14న రెండో విడత నారాయణపేట నియోజకవర్గంలోని ధన్వాడ, మరికల్, నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో, 17న మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్, నర్వ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు విడతల్లో జరిగే ఎన్నికలు, కౌంటింగ్కు భద్రత కల్పించడంతో పాటు ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. 650 మందితో బందోబస్తు జిల్లా పోలీసు యంత్రాంగంలోని డీఎస్పీలు ఐదుగురు, సీఐలు 10 మంది, ఎస్ఐలు 45 మంది, ఏఎస్ఐ, హెచ్సీలు 135, పీసీలు 350, హోంగార్డులు 120 మందితో పాటు డీసీఆర్బీ, ఏఆర్, సీఐడీ, ఇతర విభాగాల సిబ్బందిని ఎన్నికల విధులను నిర్వర్తిస్తారన్నారు. సాధారణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు వేర్వేరుగా బందోబస్తు నిర్వహించేలా ఇది వరకే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో ఎవరైనా ఒత్తిడి, ఇబ్బందులకు గురి చేసినా, అక్రమాలకు, నేరాలకు పాల్పడినా వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా.. జిల్లాలో 272 జీపీలు ఉండగా.. అందులో 60 జీపీలు, 632 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు పోలీసుశాఖ గుర్తించిందన్నారు. మొదటి విడతలో 67 జీపీల్లో 21 జీపీలు.. 200 పోలింగ్ కేంద్రాలు, రెండో విడతలో 95 జీపీల్లో 18 జీపీలు.. 200 పోలింగ్ కేంద్రాలు, మూడో విడతలో 110 జీపీలకు గాను 21 జీపీలు.. 232 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాతనేరస్తుల జాబితాలోని 820 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎస్ఐల పర్యవేక్షణలో ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు, మరికొందరు హోంగార్డులతో సమస్యత్మక పీఎస్ల వద్ద బందోబస్తు నిర్వహిస్తారన్నారు. సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద ఒక్కొక్కరు గస్తీ నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆరు చెక్పోస్టులు ఏర్పాట్లు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు జిల్లాకు సరిహద్దులోని కర్ణాటక, తెలంగాణ బార్డర్లో కానుకుర్తి, కృష్ణా, టై రోడ్, చేగుంట, సమస్తపూర్, జలాల్పూర్, ఎక్లాస్పూర్లో ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. ఓటర్లను బలవంతంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినా, భయబ్రాంతులకు గురిచేసినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 820 మంది బైండోవర్ సమస్యాత్మక గ్రామాలు 60.. పోలింగ్ కేంద్రాలు 632 ర్యాలీలు, మీటింగ్కు అనుమతి తప్పనిసరి ‘సాక్షి’తో ఎస్పీ డాక్టర్ వినీత్ -
ఇన్చార్జి విద్యుత్ ఏఈ
ఏసీబీ వలలో ● ఇంటి మీటరు బిగించడానికి రూ.20 వేల లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటూ చిక్కిన వైనం వెల్దండ: ఇంటికి విద్యుత్ మీటరు బిగించడానికి లంచం తీసుకుంటూ విద్యుత్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మహబూబ్నగర్ ఇన్చార్జి డీఎస్పీ జగదీష్చందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.60 వేలు డీడీ చెల్లించారు. కాంట్రాక్టర్లు ట్రాన్స్ఫార్మర్ బిగించగా.. అక్కడ నిర్మించిన ఓ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించాలని బాధితుడు ఇన్చార్జి ఏఈ వెంకటేశ్వర్లుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మీటర్ బిగించడానికి ఏఈ రూ.20 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.15 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 5న బాధితుడు ఆన్లైన్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మంగళవారం వ్యవసాయ పొలంలోని ఇంటి వద్ద బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా విద్యుత్ ఏఈను పట్టుకున్నట్లు అధికారులు వివరించారు. అనంతరం ఏఈని వెల్దండ విద్యుత్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇదే సమయంలో జడ్చర్లలోని విద్యుత్ ఏఈ ఇంట్లో మరో బృందం తనిఖీలు చేపట్టింది. విద్యుత్ ఏఈని బుధవారం హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరస్తామని వివరించారు. దాడుల్లో మహబూబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. జడ్చర్ల: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఏఈ వెంకటేశ్వర్లు అద్దె ఇంటిలో సైతం ఏసీబీ అధికారుల బృందం మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు ఫైళ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
బెల్ట్ షాపులపై దాడులు
మహబూబ్నగర్ క్రైం: ‘కోడ్ ఉన్నా బెల్ట్ జోరు’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పించారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కృష్ణా మండల పరిధిలోని హిందూపూర్లో నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణంపై దాడులు చేసి సిద్దప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 7.72 లీటర్ల మద్యం సీజ్ చేయగా బస్వరాజ్ అనే వ్యక్తి ఇంట్లో ఆరు లీటర్ల మద్యం సీజ్ చేయడంతో పాటు ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ అనంతయ్య వెల్లడించారు. నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో ఊట్కూర్ మండలం పులిమామిడిలో సోదాలు చేసి 2.52 లీటర్ల మద్యం సీజ్ చేశారు. జడ్చర్ల సర్కిల్ పరిధిలో రాజాపూర్లో 7.8 లీటర్ల బీరు, 0.550 లీటర్ల మద్యం, కావేరమ్మపేటలో లిక్కర్ 24.050 లీటర్లు, బీర్ 14.345 లీటర్లు పట్టుకున్నారు. గెగ్యా తండాలో రెండు లీటర్ల నాటుసారా సైతం సీజ్ చేశారు. నాలుగు మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు నారాయణపేట: ఈ నెల 11వ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారులకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే కోస్గి, కొత్తపల్లి, గుండుమల్, మద్దూరు నాలుగు మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేపట్టరాదన్నారు. అలాగే, బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. ఎన్నికల సజావుగా నిర్వహణకు ఇప్పటికే నాలుగు మండలాల్లో నిషేధాజ్ఞలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి అమలులోకి వస్తాయని, ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం అన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించబడుతుందని చెప్పారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు,ఫలితాల వెల్లడి జరుగుతుందని ఆమె తెలిపారు. క్వింటా ఆర్ఎన్ఆర్ రూ.2,839 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 6 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. 5,700 క్వింటాళ్ల ధాన్యం రాగా.. ఆర్ఎన్ఆర్ క్వింటాలు గరిష్టంగా రూ.2,829, కనిష్టంగా రూ.1,674 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,866, కనిష్టంగా రూ.1,625, చిట్టి ముత్యాలు రూ.3,016, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,972, కనిష్టంగా రూ.1,950 ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,659, కనిష్టంగా రూ.2,309 ధర వచ్చింది. కాగా.. బుధవారం ఉదయం మార్కెట్లో ఉల్లిపాయల బహిరంగవేలం నిర్వహించనున్నారు. కనులపండువగా కల్పవృక్ష వాహనసేవ మక్తల్: పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆలయంలో కల్పవృక్ష వాహనసేవా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి విగ్రహాలను పూలతో అలంకరించిన రథంపై ఉంచి.. హనుమాన్ నామస్మరణల నడుమ భక్తులు ఆలయం చుట్టూ రథాన్ని లాగారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రణేష్కుమార్, ఈఓ కవిత, పూజరి ప్రాణేష్చారి, అరవింద్ పాల్గొన్నారు. -
మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
నారాయణపేట: జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జరగనున్న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సిక్తాపట్నాయక్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి వీసీలో ఎన్నికల కమిషనర్కు వివరించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మొదటి దశ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. ఈమేరకు జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్, సాధారణ పరిశీలకులు వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసినట్లు తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేలా సూచించామన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోనేలా పోలీసు శాఖ సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్డిసీ రాజేందర్గౌడ్, డీఎస్పీ లింగయ్య, డీఆర్డీఓ మొగు లప్ప, డి పిఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా సెంటర్ పరిశీలన కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్రూం పనితీరును కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధికారులకు అందించాలని ఆదేశిస్తూ.. కంట్రోల్ రూమ్ కి వచ్చిన రెండు ఫిర్యాదులపై ఆరా తీశారు. ఎన్నికల నేపథ్యంలో మూడవ ర్యాండమైజేషన్ ప్రక్రియ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలకీ్ష్మ్ సమక్షంలో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ చాంబర్లో ర్యాండమైజేషన్ కొనసాగింది. జిల్లాలోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఏకగ్రీవమైన వార్డులు, గ్రామ పంచాయతీలను మినహాయించి జిల్లాలోని 53 గ్రామ పంచాయతీల సర్పంచ్, 361వార్డుల స్థానాలకు, 480 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకొని ప్రిసైడింగ్ అధికారులతో పాటు, ఓ.పీ.ఓల ర్యాండమైజేషన్ జరిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీపీఓ సుధాకర్ రెడ్డి, డీపీఆర్ఓ రషీద్ పాల్గొన్నారు. -
ప్రలోభాల పర్వం
ముగిసిన తొలి విడత ఎన్నికల ప్రచారం సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికలలో భాగంగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలి విడతలో మొత్తం 550 సర్పంచ్, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారమే తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో పెద్దఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మద్యంతోపాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిన్న గ్రామాల్లోనూ భారీగానే.. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. వెయ్యిలోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.2–3 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లలో అధిక సంఖ్యలో ఉన్న మహిళలపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యలపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు. ‘నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేవలం 1,200 లోపు ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం రూ.15 లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. నామినేషన్ రోజునే ఒకరు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయగా.. నిత్యం ప్రచారంలో భాగంగా ఇప్పటికే రూ.8 లక్షలు దాటింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం కూడా ముగియడంతో అభ్యర్థులు నేరుగా మద్యం, డబ్బులతో ప్రలోభాలకు దిగుతున్నారు.’ ‘నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఇద్దరు అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. ఇక్కడ సర్పంచ్ స్థానం కోసం అభ్యర్థులు రూ.30 లక్షల దాక ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకో మందు సీసాతో పాటు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల దాక ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.’ గ్రామాల్లో జోరుగా మద్యం, డబ్బుల పంపిణీ ఒక్కో వార్డుకు రూ.లక్ష, కుల సంఘాలకు రూ.2 లక్షలు చిన్న పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు రేపే ఉమ్మడి జిల్లాలోని 550 గ్రామాల్లో తొలి విడత ఎన్నికలు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఓటర్లకు మద్యం పంపిణీ యథేచ్ఛగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలు మూసివేయగా.. అంతకు ముందే అభ్యర్థులు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి నిల్వ చేశారు. ఓటరుకో క్వార్టర్ చొప్పున పంపిణీ చేస్తుండగా.. కొన్నిచోట్ల మద్యంతోపాటు డబ్బుల పంపిణీ సైతం కొనసాగుతోంది. చాలా గ్రామాల్లో పోటీని బట్టి ఓటరుకు క్వార్టర్తోపాటు రూ.వెయ్యి వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. -
పెట్టుబడులు.. ఆరు గ్యారంటీలుగా కావొద్దు
నారాయణపేట: క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో కోట్ల ధనంతో గ్లోబల్ ప్రచార ఆర్భాటం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ఆ ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష నవంబర్ 29న 2009న ప్రారంభమై, దీక్ష విరమణ డిసెంబర్ 9వ తేదితో ముగియడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలో విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టబడులు రావడం అభినందనీయమైనా.. అవి కేవలం ప్రకటనలకు, ఒప్పందాలకే పరిమితమా లేక ఆచరణలో సాధ్యం చేసి చూపిస్తారనేది వారిపై నమ్మశక్యంగా కనిపించడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత రెండేళ్లుగా రాష్ట్రానికి తీసుకువచ్చిన పెట్టుబడులపై ముందుగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 11 రోజుల పాటు సాగిన కేసీఆర్ దీక్ష సకల తెలంగాణను ఏకం చేసిందన్నారు. ఈ దీక్ష సబ్బండ వర్గాల్లో పోరాట స్ఫూర్తి నింపిందన్నారు. తెలంగాణను కష్టపడి పది సంవత్సరాల పాటు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపింది మన కేసీఆర్ మన పార్టీ ప్రభుత్వమన్నారు. ఇలాంటి తెలంగాణను రెండు సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, అవినీతి, అరాచకత్వం అన్న తీరుగా కాంగ్రెస్ పరిపాలన చేస్తోందన్నారు. అసలు ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది అని సంబరాలు చేసుకుంటుందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నారు. మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్లు కన్నాజగదీశ్, చెన్నారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్రెడ్డి, విజయ్సాగర్, ప్రతాప్రెడ్డి, స్టాంరాంరెడ్డి, బుల్లెట్రాజు, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేట – కొడంగల్ ప్రాజెక్టులో అవినీతిపరులు నారాయణపేట – మక్తల్ – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో చేపడుతున్న భూ సేకరణలో అధికార యంత్రాంగం.. అధికార పార్టీ మంత్రాంగంతో నకిలీ పట్టా పాసుపస్తకాలను సృష్టించి అక్రమంగా రూ.కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారని మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట మండలంలో పేరపళ్ల జాయమ్మ చెరువు కింద వాస్తవంగా కోల్పోతున్న భూములు ఎన్ని, దొంగ పట్టా పాసుపుస్తకాలను సృష్టించి భూ పరిహారాన్ని ఎకరానికి రూ. 20 లక్షల చొప్పున కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కానుకుర్తి రిజర్వాయర్లో సైతం ఇదే పద్ధతిలో రూ.కోట్ల స్వాహా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. నకిలీ పట్టా పాసుపుస్తకాల సృష్టిలో ఎవరెవరు ఉన్నారనేది విజిలెన్స్ అధికారులు తేలుస్తారని.. లోకాయుక్తలో భూ పరిహారంపై కేసు వేస్తే అసలు దొంగలు బయటపడతారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీలు అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, నర్సప్ప నాయకులు విజయ్సాగర్, సుదర్శన్రెడ్డి, చెన్నారెడ్డి, బాపన్పల్లి తిప్పణ్ణ తదితరులు ఉన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రతి పౌరుడు, ప్రతి అభ్యర్థి బాధ్యతతో వ్యవహరించాలని ఎస్పీ వినీత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రివేళ గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు దిగడం, ఓటర్లను బెదిరించడం, డబ్బు లేదా బహుమతులతో ప్రభావితం చేయడం వంటి చర్యలు తీవ్ర నేరాలుగా పరిగణించి కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏవైనా అనుమానాస్పద కదలికలు, బెదిరింపులు వస్తే వెంటనే డయల్ 100 నెంబర్ లేదా జిల్లా కంట్రోల్ రూమ్ 8712670399 కు కాల్ చేయాలని తెలిపారు. ఎన్నికల కాలంలో నమోదైన ఏదైనా క్రిమినల్ కేసులు భవిష్యత్లో ఉద్యోగాలు, పాస్పోర్ట్, విదేశీ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్న నేపథ్యంలో కోస్గి, గుండుమల్, కొత్తపల్లి, మద్దూర్ మండలాల్లో డిసెంబర్ 9న సాయంత్రం 5 గంటల నుండి ఫలితాలు ప్రకటించే వరకు సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్. యాక్ట్ అమల్లో ఉంటుందని, నలుగురికి మించి గుంపుగా చేరడం పూర్తిగా నిషేధమని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు డిసెంబర్ 9న సాయంత్రం 5 గంటల నుండి ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే వరకు ఆయా మండలాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఎస్పీ తెలిపారు. -
తొలి పరీక్ష..!
డీసీసీ చీఫ్లకు ‘పంచాయతీ’ సవాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీచేసిన వారి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. రెబల్గా వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తున్నాం. విడతల వారీగా కొనసాగుతున్న ఎన్నికల్లో కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. – కె.ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట జిల్లాలోని మూడు నియోజకవర్గాల నేతలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచార పోరు కొనసాగిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. మెజార్టీ పంచాయతీల్లో సర్పంచ్ వార్డు స్థానాలను కై వసం చేసుకుంటామనే నమ్మకం ఉంది. – సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు, మహబూబ్నగర్ ● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్ ● నేతల మధ్య సమన్వయమే ప్రధాన సమస్య ● పలు నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా అసంతృప్త నేతలు ● పట్టించుకోని అధిష్టానం తీరుతో అలక ● అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ సత్తా చాటుతామంటున్న నూతన అధ్యక్షుల ధీమా సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడిగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ సరిత భర్త తిరుపతయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్రెడ్డి, నల్లారెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి ఆశించారు. అధిష్టానం రాజీవ్రెడ్డికి అవకాశం కల్పించింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పలు గ్రామాల్లో పార్టీ మద్దతుదారులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గద్వాల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఇదివరకే డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపాటుకి గురైన సరిత వర్గం.. తాజాగా ఎమ్మెల్యేతో కలిసి రాజీవ్రెడ్డి ప్రచారంలో పాల్గొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ జిల్లాలో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులకు అటు సరిత, ఇటు బండ్ల వర్గానికి చెందిన మద్దతుదారుల మధ్యే పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాజీవ్రెడ్డి.. ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేయడంపై సరిత వర్గం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. నాగర్కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి. ప్రధానంగా వనపర్తి, గద్వాలలో చేతులు కలవని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. డీసీసీ పీఠం ఆశించి భంగపడడం ఒకవైపు కాగా.. భర్తీ తరువాత అధిష్టానం కనీసం సంప్రదింపులు చేయకపోవడం, బుజ్జగించకపోవడం అసంతృప్త నేతలను మరింత నారాజ్లోకి నెట్టినట్లు సమాచారం. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పునర్నియామకమైన కె.ప్రశాంత్రెడ్డి కూడా జీపీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆ జిల్లా పరిధిలోని నారాయణపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి.. మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి అన్నీ తామై తమ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం రూపొందించిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్గా బరిలో నిలిచిన వారిని పోటీ నుంచి విరమింపజేసేలా ప్రశాంత్కుమార్రెడ్డి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన సంజీవ్ ముదిరాజ్ పంచాయితీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన దేవరకద్ర, మహబూబ్నగర్, జడ్చర్ల ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నుంచి డీసీసీ పీఠాన్ని అధిరోహించాలని ఆశలతో ఉన్న వారిని సైతం కలుసుకొని సహకరించాలని కోరారు. ఆ వెంటనే జీపీ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ మహబూబ్నగర్ రూరల్ మండల పరిధిలో రెండు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పో ర్ట్స్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు. -
డయల్ యువర్ ఎస్పీకి అనూహ్య స్పందన
నారాయణపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది ఫోన్ ద్వారా ఎస్పీ డా.వినీత్ను నేరుగా సంప్రదించి.. తమ సమస్యలను తెలియజేశారు. అందులో ఎక్కువగా భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. అదే విధంగా జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ కమాన్ వైపు వెళ్లే రూట్లో ట్రాఫిక్ సిగ్నల్స్ సమయం పెంచాలని, గూడ్స్ వాహనాలను రోడ్లపై ఎక్కువగా నిలుపుతున్నారని, పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని భయపెడుతున్నారని.. పోలీసు రక్షణ కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే మార్గంలో లైటింగ్ లేదని, ప్రాపర్టీ దొంగతనం కేసులో రికవరీ చేయలేదని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ.. చట్టప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులు పూర్తి దర్యాప్తు చేపట్టి.. పరిష్కారానికి చేపట్టిన చర్యలపై ఎస్పీ కార్యాలయానికి రిపోర్టు పంపించాలని ఆదేశించారు. డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థ మరింత చేరువయ్యే అవకాశం కలగడంతో పాటు ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని ఎస్పీ తెలిపారు. -
చివరి వరకు అందించాలి..
యాసంగి సీజన్లోనూ వరిపంట పండించేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలి. కేవలం మొక్కజొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలకే నీరందిస్తే మేం తీవ్రంగా నష్టపోతాం. కాల్వల వెంట నీరు వృథా కాకుండా మరమ్మతు చేపట్టాలి. చివరి దశలో పంటలు ఎండిపోకుండా ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలి. – ఆలేటి మారయ్య, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం రిజర్వాయర్లు నింపుతాం.. కేఎల్ఐ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం సాగునీరు సరఫరా చేస్తాం. ఇందుకోసం ముందుగా జిల్లాలోని ప్రధానమైన సాగునీటి రిజర్వాయర్లను నింపుతాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ యాసంగి పంటలకు నీటి సరఫరా చేపడతాం. – శ్రీనివాస్రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ ● -
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
నారాయణపేట: జిల్లాలో మూడో విడత జరిగే మక్త ల్, ఊట్కూర్, నర్వ, మాగనూరు, కృష్ణా మండలా ల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ జారీ, వినియోగం తదితర అంశాలపై సోమవారం కలెక్టరేట్లో పోస్టల్ బ్యాలె ట్ నోడల్ అధికారులు, స్టేజ్–1, స్టేజ్–2 రిటర్నింగ్, జోనల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నా యక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్రమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందన్నారు. అత్యంత శ్ర ద్ధతో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. మూడో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను మంగళవారం మధ్యా హ్నం 3 గంటలలోగా పూర్తిచేయాలని ఆదేశించా రు. ఇప్పటికే సింగిల్ నామినేషన్ దాఖలైన సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలను జిల్లా ఎన్నికల అధి కారి ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత ప్రకటించాలని సూ చించారు. అదే విధంగా నామినేషన్ల ఉపసంహరణ తర్వాత కూడా ఒకే సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉంటే.. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులతో డిక్లరేషన్ తీసుకొని ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఏకగ్రీవమైనట్లు ప్రకటించాలన్నారు.ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తిచేసి తహ సీల్దార్లకు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్కు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. రక్షణ దళాల్లో పనిచేస్తున్న సర్వీ స్ ఓటర్ల పోస్టల్ బ్యాలెట్లు తప్పనిసరిగా పంపించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ప్రీవెంటివ్ డిటెన్షన్ ఓటరు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేందుకు ఫారం–14ద్వారా ముందస్తు న మోదు తప్పనిసరి అని ఆయన స్పష్టంచేశారు. ఫా రం–14 సమర్పించిన వారికే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ జారీ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా పనిచేయాలని.. ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల అ ధికారులు డీఆర్డీఓ మొగులప్ప, డీఏఓ జాన్ సుధాకర్, డీపీఓ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి ఏదీ
సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం పంపిణీ చేయడానికి టోకెన్ల విధానం వాడుతుంటారు. ఈ ఎన్నికల్లో టోకెన్ల విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి మద్యం దుకాణంపై నిఘా ఏర్పాటు చేసి ఎవరైనా ఈ విధానం అమలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు బాల్క్గా సేల్స్ ఉండరాదు. ఇళ్లలో, పాత భవనాలలో మద్యం నిల్వలు ఉంటే తనిఖీలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో వీటిపై ఆశించినస్థాయిలో నిఘా కానీ సోదాలు కనిపించడం లేదు. గ్రామాల్లో చిన్నచిన్న కిరాణ దుకాణాలు బార్లను తలపిస్తున్నాయి. అన్ని పార్టీలు బహిరంగంగానే మద్యం తరలిస్తున్నా.. మద్యం అమ్మకాలు భారీస్థాయిలో జరగాలనే ఉద్దేశంతో సదరుశాఖ అధికారులు నామమాత్రపు చర్యలకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. -
ఆరుతడికే సాగునీరు
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఈసారి యాసంగి సీజన్లో ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. వారాబందీ పద్ధతిలో నీటి సరఫరా చేపట్టనుండగా.. కనీసం 15 రోజులకు ఒకసారి విడుదల చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద అత్యధికంగా 2,81,754 ఎకరాలకు ప్రస్తుత సీజన్లో సాగునీటిని అందించనున్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పెండింగ్ పనుల కారణంగా ఈసారి ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు అధికారులు క్రాప్ హాలిడే (పంట విరామం) ప్రకటించారు. 15 రోజుల వ్యవధిలో.. యాసంగి సీజన్కు సాగునీటి వనరులను పకడ్బందీగా వినియోగించడంపై నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలకే సాగునీరు అందించనున్నారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి పంటకు ఈ సీజన్లో నీటి సరఫరా ఉండదు. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని పరిమిత స్థాయిలో సరఫరా చేస్తారు. ప్రధానంగా తాగునీటి అవసరాల మేరకు తగినంత నిల్వ ఉంచుతూనే వారాబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే కనీసం 15 రోజుల వ్యవధిలో ఒకసారి ఆరుతడి పంటలకు నీటి సరఫరా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా కేఎల్ఐ.. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుతం 3,70,469 ఎకరాలు ఉండగా.. యాసంగి సీజన్లో 2,81,754 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందులో 2,01,317 ఎకరాల మేర ఆరుతడి పంటలతోపాటు మరో 80,437 ఎకరాలకు వరి సాగుకు నీటిని అందిస్తారు. అలాగే కోయిల్సాగర్ కింద 35,600 ఎకరాల ఆయకట్టు ఉంటే ఆరుతడి పంటలకు 7,700 ఎకరాలకే పరిమితం చేశారు. భీమా లిఫ్ట్–1 కింద 82,523 ఎకరాలు ఉండగా కేవలం ఆరుతడికి 21,690 ఎకరాల్లో నీరందిస్తారు. భీమా లిఫ్ట్–2 సైతం 92 వేల ఎకరాల ఆయకట్టుకు గాను 5,350 ఎకరాల్లో ఆరుతడి, 4,650 ఎకరాల్లో వరి పంటకు నీరందించనున్నారు. జూరాల ప్రాజెక్టు కింద మొత్తం 1,09,296 ఎకరాలకు గాను ఆరుతడి కింద 20,014 ఎకరాలకు, వరి 6,910 ఎకరాలకు సాగు నీరందించనున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1.42 లక్షల ఎకరాలకు గాను ఆరుతడికి 22,800 ఎకరాల మేరకు సాగునీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు రైతులు పంటలను సాగుచేసేలా అవగాహన కల్పించనున్నారు. మరమ్మతుల నేపథ్యంలో.. ఆర్డీఎస్ కింద ఆయకట్టు రైతులకు క్రాప్ హాలిడే శాపంగా మారింది. ఆర్డీఎస్ హెడ్వర్క్స్ పెండింగ్ పనులు, మరమ్మతు కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించలేమని అధికారులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో 83,998 ఎకరాల ఆయకట్టు నీటి సరఫరా నోచుకోవడం లేదు. కనీసం వేరుశనగ, మొక్కజొన్న, కంది తదితర ఆరుతడి పంటలను సైతం సాగుచేసుకునే అవకాశం ఉండటం లేదు. యాసంగి పంటలకు సాగునీటి ప్రణాళిక ఖరారు వారబందీ పద్ధతిలో విడుదలకు నిర్ణయం కనీసం 15 రోజులకు ఒకసారి వదిలేలా చర్యలు ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కేఎల్ఐ కింద 2.81 లక్షల ఎకరాలకు.. ఆర్డీఎస్ కింద పరిధిలో పంట విరామం ప్రకటన -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
నారాయణపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో మూడో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండ వ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధి కారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి సమక్షంలో చేపట్టారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరి స్తూ చేపట్టిన ర్యాండమైజేషన్ ప్రక్రియను వారు నిశితంగా ప రిశీలించారు. జిల్లాలోని మండలాల వారీగా గ్రామ పంచాయ తీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధులకు ఎంపిక చేశారు. మొత్తం 110 గ్రామ పంచాయతీల సర్పంచ్, 994 వార్డుల స్థానాల్లో 994 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 20శాతం రిజర్వు స్టాఫ్తో కలుపుకొని ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఓపీఓల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీవో మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, డీపీఆర్ఓ రషీద్ పాల్గొన్నారు. -
ఒడిశా సీఎంను కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్: ఒడిశా సీఎం మోహన్చరణ్ మజ్హిని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం కలిశారు. 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరుకావాల్సిందిగా ఆయనను కలిసి ఆహ్వానించారు. ఈమేరకు శనివారం భువనేశ్వర్లో ఒడిశా సీఎంను మంత్రి కలిశారు. రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం నారాయణపేట: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన పోలీస్ అధికారుల సమావేశంలో జడ్జి మాట్లాడారు. ఈ నెల 13న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ 21కి వాయిదా పడిందని తెలిపారు. జిల్లాలోని 14 పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఈ పెట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర కేసుల గురించి ఆరా తీశారు. మొత్తం 5వేల కేసులను ఈ లోక్అదాలత్లో క్లియర్ చేయాలని, అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలని, కార్యక్రమాన్ని కక్షిదారులు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. హై కోర్ట్ జడ్జి ఆదేశానుసారం ముందుగా పెండింగ్ కేసులను పరిష్కారం చెయ్యాలని పోలీస్ అధికారులకు తెలిపారు. ప్రిన్సిపల్ జూ.సివిల్ జడ్జి బి మనోజ్, జూ.సివిల్ జడ్జి అవినాష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సురేష్కుమార్ పాల్గొన్నారు. -
నామినేషన్ల ఘట్టం.. పరిసమాప్తం
నారాయణపేట: జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నారాయణపేట నియోజకవర్గంలో అభ్యర్థులు ఖరారయ్యారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోరులో నిలిచే అభ్యర్థుల జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించారు. సర్పంచ్ పదవులకు 257 మంది, వార్డులకు 1589 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నాలుగు మండలాల్లో గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లోని 85 గ్రామపంచాయతీలు, 681 వార్డులకు ఈనెల 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారులు గుర్తులను కేటాయించారు. ఈ గుర్తులతోనే అభ్యర్థులు ఆదివారం నుంచి ప్రచారానికి వెళ్లనున్నారు. 10 జీపీలు ఏకగ్రీవం నారాయణపేట నియోజకవర్గంలో మలివిడతలో 10 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. నారాయణపేట మండలంలో ఊటకుంటతండా, లింగంపల్లి, పిల్లిగుండ్ల తండా, దామరగిద్ద మండలంలో బాపన్పల్లి, దామరగిద్ద తండా, ఆశన్పల్లి, పిడెంపల్లి సర్పంచ్ స్థానాలు ఏకగీవ్రమయ్యారు. అలాగే, ధన్వాడ మండలంలో మందిపల్లితండా, దుడుగుతండా, బుడ్డమారితండాలు ఏకగ్రీవమయ్యాయి. నేటి నుంచి మలివిడత ప్రచారం మలి విడత ఎన్నికలు జరిగే 85 గ్రామపంచాయతీల్లో ఆదివారం నుంచి ప్రచారం జోరందుకోనుంది. ఆయా పార్టీల మద్దతు ఇవ్వగా, గుర్తులతో కూడిన పత్రాలను ముద్రించి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించనున్నారు. వలసవెళ్లిన ఓటర్లకు సైతం ఇప్పటికే ఫోన్ల ద్వారా అభ్యర్థులు సంప్రదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మూడో విడతలో సర్పంచ్లకు 771, వార్డులకు 2,294 నామినేషన్లు రెండో విడతలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ సర్పంచ్ బరిలో 257,వార్డుల్లో 1589 మంది 10 జీపీలు ఏకగ్రీవం.. జోరందుకోనున్న ప్రచారం -
ఓటులోనూ నారీ శక్తి!
సాక్షి, నాగర్కర్నూల్: పంచాయతీ ఎన్నికల్లో మహిళలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో మహిళలే అధిక సంఖ్యలో పోటీలో ఉండగా.. ఓటర్లుగానూ పురుషుల కన్నా మహిళల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఫలితంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేసేలా మహిళాశక్తి పనిచేయనుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లోనూ పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. వీరి ఓట్లను గంపగుత్తగా దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్.. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం సర్పంచ్, వార్డు స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండగా, ఈ మేరకు స్థానాలన్నింటిలో మహిళలే అభ్యర్థులుగా బరిలో ఉంటున్నారు. వీటితోపాటు జనరల్ స్థానాల్లోనూ కొన్నిచోట్ల మహిళలు పోటీలో ఉంటున్నారు. గతంలో మహిళ రిజర్వేషన్ ఉన్నచోట్ల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు ఈసారి రిజర్వ్ కాకపోయినా పోటీలో ఉంటున్నారు. అలాగే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు జనరల్ స్థానాల్లోనూ తమ సతీమణులను బరిలో దింపుతున్నారు. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కారణంగా 50 శాతం స్థానాలతోపాటు మిగతా రిజర్వ్ కాని చోటా మహిళలు పోటీచేస్తుండటంతో 50 శాతానికి మించి మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానున్నారు. సంఘాలతో సంప్రదింపులు.. గ్రామాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా మహిళా ఓటర్లు ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా మహిళల సమస్యలపై దృష్టిసారించి హామీలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో త్వరితగతిన పరిష్కారానికి వీలున్న వాటిని పూర్తిచేసేందుకు సైతం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభావిత వర్గంగా మహిళా శక్తి ఎన్నికల బరిలో 50 శాతంపైగా వారిదే హవా జనరల్ స్థానాల్లోనూ పోటాపోటీ ఇటు ఓటర్లు గానూ మెజార్టీ స్థాయిలో.. -
పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..
సాయి ఈశ్వరాచారి మృతి బాధించింది. పాలకుల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం. దశల వారీ పోరాటాలకు సిద్ధం. పూలే, పండుగ సాయన్న బాటలో ముందుకు సాగుతాం. బీసీలు అడగకముందే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పి.. మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకుందామే తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈశ్వర్ చారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. – బెక్కం జనార్దన్, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఇప్పటికై నా మేల్కోవాలి.. బీసీలకు రాజ్యాధికారం రావడం కష్టమని భా వించి సాయి ఈశ్వరా చారి బలిదానం కావ డం బాధేస్తోంది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోసం చేసింది. 17 శాతానికే పరిమితం చేయడం దారుణం. బీసీలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికై నా మేల్కోవాలి. లేకుంటే పోరు బాట తప్పదు. మాకు ఉద్యమం కొత్త కాదు.. బీసీలందరం ఏకమై సత్తా ఏంటో చూపిస్తాం. – శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ● -
నేరాల నియంత్రణలో హోంగార్డులది కీలక పాత్ర
నారాయణపేట: నేరాల నివారణలో, కమ్యూనిటీ పోలీసింగ్లో, అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర అపారమైందని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డుల రైజింగ్డేను పురస్కరించుకొని శనివారం హోంగార్డులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ వంటి కీలక రంగాల్లో హోంగార్డులు నిబద్ధతతో సేవలు అందిస్తున్నారన్నారు. వారి సేవలకు పోలీస్ శాఖ తరపున పూర్తి మద్దతు ఉంటుందని, బాగా పని చేసిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పోలీసులతోపాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతతో పనిచేయాలన్నాపారు. హోం గార్డుల ఆరోగ్యం, ఫిట్నెస్, టీమ్ స్పిరిట్ పెంపునకుగాను వాలీబాల్, కబడ్డీ, పరుగు తదితర క్రీడా పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి ఎస్పీ మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, హోం గార్డ్స్ ఇన్చార్జి మద్దయ్య, ఆర్ఎస్ఐ శ్వేత పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల మాక్ డ్రిల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన నేపథ్యంలో పోలీసులకు మాక్డ్రిల్ నిర్వహించినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ప్రత్యేక సాయుధ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించగా.. ఎస్పీ పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బంది అనుసరించాల్సిన విధానాలు, కార్యాచరణ ప్రణాళికలు, గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం, ప్రజల ప్రాణ రక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందన్నారు. ఇలాంటి మాక్ డ్రిల్లు క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా సిబ్బంది స్పందనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఎన్నికల జనరల్ అబ్జర్వర్ను కలిసిన ఎస్పీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సీత లక్ష్మీని కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ వినీత్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఎన్నికల భద్రతా ఏర్పా ట్లు, బందోబస్తు ప్రణాళిక, సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన చర్యలపై ఎస్పీ వివరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా తీసుకుంటున్న చర్యలను అబ్జర్వర్కి వివరించారు. -
పోరుబాట ద్వారానే రిజర్వేషన్లు సాధ్యం..
సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలి. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. పోరు బాట ద్వారానే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం. పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు కూడా సర్పంచ్, వార్డులకు సంబంధించి జనరల్ స్థానాల్లో ఎంత మంది బీసీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారో జాబితా వెల్లడించాలి. – రాచాల యుగంధర్ గౌడ్, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ -
అంజన్నకుచక్రతీర్థ స్నానం
మక్తల్: పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి ఆలయంలో అశ్వవాహన సేవ, చక్రతీర్థస్నానం కనులపండువగా నిర్వహించారు. ఉదయం స్వామివారి కి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని అశ్వవాహనం ఉంచి ఆల యం చుట్టూ ఊరేగించారు. జిల్లా నలుమూల ల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో చైర్మన్ ప్రణేష్కుమార్, ఈఓ కవిత తదితరులు పాల్గొన్నారు. శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నారాయణపేట రూరల్: శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. జిల్లా కేంద్రం సమీపంలోని శబరి పీఠంలో శనివారం అయ్యప్ప మాలదారులతో ఆమె మాట్లాడారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమని, మాలధారులకు ప్రత్యేక ప్యాకేజీలతో శబరిమలకు బస్సులు నడుపుతున్నట్లు, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రంగారెడ్డి ట్రైనీ కలెక్టర్ వీణ ఆధ్వర్యంలో 200 మంది మాలధారులకు అన్నదానం నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డిపో సూపరింటెండెంట్ నరేందర్, ఏడీసీలు శ్రీనివాస్, ఆంజనేయు లు, గురు స్వాములు అప్పి, కాకర్ల భీమయ్య, వెంకటేష్, శంకర్ రెడ్డి, బాబు పాల్గొన్నారు. ఘనంగా శ్రీనివాసుడి కల్యాణం దేవరకద్ర: చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి దేవాలయ ప్రాంగణంలో శ్రీనివాసుడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఉత్సవాల్లో భాగంగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న వేడుకను వేలాదిమంది భక్తులు తిలకించారు. ఉదయం ఆంజన్నకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పరిశోధనలకు పెద్దపీట వేయాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పరిశోధనలకు పెద్దపీట వేయాలని వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఐపీఆర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పరిశోధన వాతావరణం నెలకొల్పాలని, ఐపీఆర్ హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. కీనోట్ స్పీకర్ కేఆర్ పౌల్ మాట్లాడుతూ.. ఐపీఆర్ అనేవి వ్యక్తులు తమ ఆలోచనలను ఉపయోగించి, వస్తువులు ఇతర పరికరాలు తయారుచేస్తే వాటిని హక్కు లు కల్పిచేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. వివిధ రకాల పేటెంట్లకు విదేశాల్లో చట్టపరమైన భద్రత ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్బాబు, మధుసూదన్రెడ్డి కుమారస్వామి, రాజశేఖర్ పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ క్వింటాల్ రూ.2,739 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 15వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. అత్యధికంగా 13,376 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,739, కనిష్టంగా రూ.1,689 ధరలు పలికాయి. హంస గరిష్టంగా రూ.1,821, కనిష్టంగా రూ.1,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,951, కనిష్టంగా రూ.1701, పత్తి గరిష్టంగా రూ.6,177, కనిష్టంగా రూ.4,379, వేరుశనగ రూ.7,777 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్కు గరిష్టంగా రూ.2,671, కనిష్టంగా రూ.2,359, సోనామసూరి గరిష్టంగా రూ.2,353, కనిష్టంగా రూ.2,129గా ధరలు పలికాయి. -
మళ్లీ.. బీసీ లొల్లి!
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్పై మళ్లీ లొల్లి మొదలైంది. హైదరాబాద్లో సాయి ఈశ్వరాచారి మృతితో బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆయా సంఘాలకు చెందిన పలువురు నేతలు ఆయనది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే అని ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వగా.. వేడి రాజుకుంది. పంచాయతీ పోరు మొదటి విడతలో ప్రచారం హోరెత్తుతుండగా.. రెండో దశకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తి కాగా.. నేటి నుంచి ప్రచారం మొదలు కానుంది. చివరి దఫాకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇలా పంచాయతీ సంగ్రామం కీలక ఘట్టానికి చేరుకున్న క్రమంలో మళ్లీ బీసీ లొల్లి రాజుకోవడం రాజకీయ పార్టీలను కలవరానికి గురి స్తోంది. 42 శాతం ఏమైంది.. స్థానిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తొలుత బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లగా.. హైకోర్టులో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. నోటిఫికేషన్ వెలువడే రోజు రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటొద్దనే సుప్రీంకోర్టు సూచనలతో ప్రక్రియ నిలిచిపోయింది. ఈ క్రమంలో బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రం చేసే దిశగా అడుగులు వేశాయి. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని.. ప్రస్తుతం చట్టపరంగా ముందుకెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఈ మేరకు పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తూ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మూడు దశల పల్లె పోరు కీలక ఘట్టానికి చేరుకోగా.. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు ఎంతవరకు వచ్చిందంటూ బీసీ సంఘాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. సంఘటితంగా పోరు బాట.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా బీసీ సంఘాలు, వెనుకబడిన తరగతులకు చెందిన కులసంఘాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి. ప్రధానంగా బీసీ సంక్షేమ, బీసీ సమాజ్, బీసీ పొలిటికల్ జేఏసీ, మున్నూరు కాపు, ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ, బీసీ లెక్చరర్ల ఫోరం, విశ్వకర్మ, బీసీ మేధావులు, యాదవ, నాయీబ్రాహ్మణ, రజక తదితర సంఘాలు ఏకమై బీసీ ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడ్డాయి. రెండు దశలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ.. చివరి దశలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయిస్తామన్న అధికార కాంగ్రెస్ నేతల హామీ ఏమైంది అంటూ బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు మద్దతు ప్రకటించడం వరకు మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ పరిమితమా అని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ఈశ్వరాచారి ఆత్మహత్యకు యత్నించడం.. చికిత్సపొందుతూ ఆయన మృతి చెందడం వెనుకబడిన వర్గాల్లో విషాదం అలుముకుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆదివారం కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపునివ్వడంతో మళ్లీ సెగ రాజుకున్నట్లు తెలుస్తోంది. మా ఓటు బీసీలకే42 శాతం రిజర్వేషన్పైసంఘాల పోరు ఇప్పటికే బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు హైదరాబాద్లో సాయి ఈశ్వర్చారి మృతితో కదలిక నేడు కొవ్వొత్తుల ప్రదర్శనకు పిలుపు ఉమ్మడిగా దశల వారీ ఉద్యమబాటకు సన్నాహాలు సం‘గ్రామం’ వేళ మారుతున్న పరిణామాలతో రాజకీయ పార్టీల్లో కలవరం -
రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో మూడో స్థానం
నారాయణపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 బాలుర క్రికెట్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా జట్టుకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్లో మరింతగా రాణించి ప్రథమ స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని సూచించారు. జట్టు ఎంపిక, రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచేందుకు తనవంతు కృషిచేసిన డీవైఎస్ఓ శెట్టి వెంకటేశ్ను కలెక్టర్ అభినందించారు. -
అంతా అయోమయం!
● తాము కాంగ్రెస్ అంటే తాము కాంగ్రెస్ అంటూ ప్రచారం ● అంతర్మథనంలో పార్టీ పెద్దలు ● ప్రచారం కోసం ఎవరి వెంట తిరగని వైనం నారాయణపేట: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అంటూ టికెట్ల కేటాయింపు నుంచి విత్డ్రా వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలతో మండల పార్టీ నాయకులతో పాటు నియోజకవర్గ నేతలు తలపట్టుకుంటున్నారు. తమకే పార్టీ మద్దతు ఇవ్వాలంటూ మంకుపట్టు పట్టిన ఆశావహులు.. తామంటే తాము కాంగ్రెస్ పార్టీ అంటూ రంగంలోకి దిగారు. నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల్లో రెండో విడత గ్రామ సంగ్రామం ఆదివారం నుంచి మొదలైంది. తాము అధికార పార్టీకి చెందిన వారిమేనంటూ ఎవరి దారిలో వారు ప్రచారాన్ని జోరుగా చేపట్టారు. పార్టీ అధిష్టానం అండదండలతో కొంతమంది రంగంలోకి దిగితే.. మరికొంత మంది తమ సత్తా ఏంటో గెలిచి చూపిస్తామంటూ అధికార పార్టీ పెద్దలకు సవాల్ విసిరి పోరులోకి దిగారు. మండలాల్లో ఇదీ పరిస్థితి.. దామరగిద్ద మండల కేంద్రంలో అధికార పార్టీ నుంచి కన్కిరెడ్డి, రేబల్గా కౌడ్లి శరణప్ప పోటీపడుతున్నారు. కానుకుర్తిలో ఉద్యోగానికి రాజీనామా చేసిన నారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తుండగా.. అదే పార్టీకి చెందిన సుదర్శన్రెడ్డి, భీంరెడ్డి రెబల్స్గా రంగంలోకి దిగారు. గట్టిరెడ్డిపల్లిలో సైతం కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు పోటీపడుతున్నారు. క్యాతన్పల్లిలో కొత్త కాంగ్రెస్ అంటూ శరత్, రేణుక, పాత కాంగ్రెస్ అంటూ వెంకటప్ప రంగంలోకి దిగారు. గత్పలో పాత కాంగ్రెస్ అంటూ సునీత, కొత్త కాంగ్రెస్ నుంచి మల్లమ్మ పోటీపడుతున్నారు. ధన్వాడ మండలం గోటూర్లో నాగేశ్వర్రెడ్డి, నాగిరెడ్డిల వర్గపోరుతో తమ అనుచరులను రంగంలోకి దించారు. నాగేశ్వర్రెడ్డి తరఫున నాగమణి, నాగిరెడ్డి వర్గానికి చెందిన జయమ్మ పోటీపడుతున్నారు. అయితే నాగిరెడ్డి వర్గానికి బీఆర్ఎస్ సైతం మద్దతుగా నిలవడంతో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. ఎంనోనిపల్లిలో కాంగ్రెస్ నేత కాశీనాథ్రెడ్డి తన సతీమణి దీపికను రంగంలోకి దింపగా.. అదే పార్టీకి చెందిన బోయ నాగేశ్వర్ను పార్టీ మండల అధ్యక్షుడు నరహరి పోరులోకి దించారు. రాంకిష్టయ్యపల్లిలో అధికార పార్టీ తరఫున సీనియర్ నాయకుడు తిరుపతి సతీమణి కవిత పోటీ చేస్తుండగా.. అదే పార్టీకి చెందిన రాఘవేందర్ తన సతీమణి శిరీషను రంగంలోకి దింపారు. నారాయణపేట మండలంలోని జాజాపూర్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ఉమ్మడి అభ్యర్థిగా బొంబాయి రాములు కుమార్తె సంగీతను రంగంలోకి దింపారు. అయితే అధికార పార్టీలో కొంతకాలంగా అంటిముట్టనట్లు ఉన్న కోట్ల జగన్మోహన్రెడ్డి తన అనుచరుడు అద్దాల వెంకటప్ప కోడలు అనితను పోటీలో దింపారు. ఈ గ్రామంలో ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరిగినా కోట్ల జగన్మోహన్రెడ్డి అనుచరగణం ఓవైపు.. అన్ని పార్టీలు మరోవైపు పోటీ చేస్తుంటాయి. ఇక్కడ టార్గెట్ పార్టీలు కాదు.. జగన్మోహన్రెడ్డి అనే చర్చ సాగుతోంది. మరికల్ మండలం ఇబ్రహీంపట్నంలో సర్పంచ్గా పోటీచేస్తున్న అభ్యర్థులు రాధిక, చెన్నమ్మ ఇద్దరూ అధికార పార్టీకి చెందిన మద్దతుదారులంటూ ప్రచారానికి తెరలేపారు. దీంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒకరిద్దరు రెబెల్స్గా పోటీచేసే వాళ్లను చూశాం. కానీ నారాయణపేట మండలం చిన్నజట్రంలో నలుగురు అధికార పార్టీకి చెందిన వారే సర్పంచ్ అభ్యర్థులుగా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. అంత్వార్లో ఇద్దరు, బొమ్మన్పాడులో ఇద్దరు, అమ్మిరెడ్డిపల్లిలో ఇద్దరు అధికార పార్టీ నుంచి పోటీపడుతున్నారు. అధికార పార్టీ మద్దతుదారులమంటూ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు మొహం చాటేస్తున్నారు. ఇడవమంటే పాముకు కోపం.. కొరకమంటే కప్పకు కోపమొస్తుందన్న చందంగా తమ పరిస్థితి మారిందంటూ అధికార పార్టీ నాయకులు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం సైతం ఎవరికి ఏం చెప్పాలో తెలియని అంతర్మథనంలో పడిందని చెబుతున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా కాంగ్రెస్ మద్దతుదారులే కదా అంటూ నిమ్మకుండిపోతున్నారు. -
రుజువైతే జైలుశిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట.. ఉపసంహరించుకున్న వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నాం. జిల్లాస్థాయి ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చాకే ఏకగ్రీవంపై ముందుకెళ్తాం. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు. – గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ● -
మక్తల్ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం
మక్తల్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రి నివాసంలో మక్తల్ మండలం గొల్లపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగా ఇటీవల రూ.వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించి.. గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, నాయకులు కావాలి తాయప్ప, వేణు, సర్పంచ్ అభ్యర్థి సూర్యకుమార్, కె.బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమించొద్దు
నారాయణపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. ఎన్నికల విధు లు నిర్వర్తిస్తున్న నారాయణపేట సర్కిల్ పోలీసులకు ఆదివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించడంలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమన్నారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ఎన్నికల కమిషన్ ఆదేశాలు, ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉంటూ.. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టపరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తుల సంచారం.. ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ.. బెదిరింపులు వంటి ఘటనలను గమనిస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు పూర్తి రక్షణ, భద్రత కల్పించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు లోనుకావొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచాలని.. గొడవలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను గమనించిన వెంటనే కేసులు నమోదు చేయాలని.. పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ప్రచార నిషేధమని.. గుంపులు గుంపులుగా ఎవరూ ఉండకుండా చూడాలన్నారు. సీఐలు శివశంకర్, రాజేందర్రెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
సైక్లింగ్లో సత్తా చాటాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ బి.గోపాలం అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం నుంచి వెంకటాంపల్లి వరకు బాలికలకు 5 కిలోమీటర్లు, బాలురకు 8 కిలోమీటర్ల జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో బాలికల విభాగంలో శశి, ప్రియ, మీనాక్షి, ఇందు, చందన, ప్రవస్తి, జ్యోతి, సంజన, పూజ, సంగీత, బాలుర విభాగంలో రాము, ఉదయ్, రక్షిత, యశ్వంత్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యా రు. విజేతలకు గోపాలం పతకాలు అందించి సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీలు దేవేందర్, చిట్టి, పాఠశాల ఏఎన్ఎం వెంకటమ్మ, సహాయకులు రజిత, నవీన్ పాల్గొన్నారు. -
చోరీ చేసిన ఫోన్లతో నేర కార్యకలాపాలు
నారాయణపేట: జిల్లావ్యాప్తంగా మూడు నెలల కాలంలో దొంగిలించబడిన, పోయిన మొబైల్ ఫోన్ల ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వాటిని ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలపా రు. ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో స్వాధీనం చేసుకున్న 106 ఫోన్లను శుక్రవారం తిరిగి బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో గాని, దగ్గరలోని పోలీస్స్టేషన్లో గాని వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దొంగిలించిన ఫోన్లతో నిందితులు నేర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న సమయంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనరాదన్నారు. ప్రజలు వ్యక్తిగత మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. జిల్లాలోని ఐటీ కోర్ పోలీసులు ఆధునాతన టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్ల ట్రేస్ చేసి స్వాధీనం చేసుకోవడంలో ప్రత్యేక చొరువ చూపారని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్హక్, డీఎస్పీలు ఎన్.లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, రాజేందర్రెడ్డి, రామ్లాల్, సైదులు, ఐటీ కోర్ ఎస్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీని కలిసిన ఆర్టీఓ అధికారులు నారాయణపేట: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డాక్టర్ వినీత్ను జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు మెగా గాంధీ, సాయితేజ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ అవగాహన కార్యక్రమాలపై ఎస్పీ, ఆర్టీఓ అధికారులు చర్చించుకున్నారు. భవిష్యత్లో పోలీస్ ట్రాన్స్పోర్ట్ శాఖ కలిసి జిల్లాలో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే చర్యలను చేపట్టాలని అధికారులు అభిప్రాయపడ్డారు. క్రీడలు వ్యక్తిత్వాన్నిపెంపొందిస్తాయి నారాయణపేట: క్రీడలు మనిషిలో క్రమశిక్షణ, ఓర్పు, సహనం, నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెండ్లీ మెగా క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఉత్సాహభరితంగా ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం విజేత మక్తల్ జట్టుకు, రన్నర్ టీమ్ మరికల్ జట్టుకు నగదు బహుమతితో పాటు షీల్డ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి యువకుడు యూనిఫాం లేని పోలీస్ అని, సమాజ శ్రేయస్సు కోసం యువత పాటుపడాలని సూచించారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.10 వేలు సునంద హస్పిటల్స్ డాక్టర్ ప్రసాద్శెట్టి, రన్నర్స్కు రూ.5 వేలు, షీల్డ్ కిడ్స్ హాస్పిటల్ డా. మధుసూదన్రెడ్డి స్పాన్సర్ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, డాక్టర్లు ప్రసాద్శెట్టి, మధుసూదన్రెడ్డి, సీఐలు శివశంకర్, రాంలాల్, రాజేందర్రెడ్డి, సైదులు, ఎస్ఐ రమణ, క్రీడా కారులు పాల్గొన్నారు. -
జోరుగా మూడో విడత నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. మక్త ల్, ఊట్కూర్, కృష్ణా, మాగనూర్, నర్వ మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 110 సర్పంచ్ స్థానాలకు గాను తొలిరోజు 60, రెండో రోజు 219, మూడో రోజు 432 మంది అభ్యర్థులు నామనేషన్లు వేయగా.. మొత్తంగా 771 మందికి చేరుకున్నాయి. 994 వార్డులకు గాను తొలిరోజు 66, రెండో రోజు 588, మూడో రోజు 1,021 మంది అభ్యర్థులు కలిపి 1,675 నామినేషన్లు దాఖలయ్యాయి. మక్తల్, నర్వ మండలాల్లో అర్ధరాత్రి వరకు నామినేషన్లు వేస్తున్నారు. -
రెండేళ్లలో జీపీలకు పైసా ఇచ్చింది లేదు
పాలమూరు: హిల్ట్ పేరిట రూ.లక్షల కోట్ల అవినీతి కుంభకోణానికి కాంగ్రెస్ తెర తీసిందని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చుకున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్లే సర్పంచ్ అని.. నలుగురు పెద్దమనుషులు నిర్ణయం చేస్తున్నారన్నారు. ప్రజలు అందరూ ఓటు హక్కు వినియోగించుకోని సర్పంచ్లను ఎన్నుకోవాలి తప్పా.. కోటి, అర కోటి రూపాయలకు వేలం పాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో బిల్లులు రాక సర్పంచ్లు అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకం చూశామన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జీపీలకు నయా పైసా రాలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఇప్పటికీ రాలేదన్నారు. ఎన్నికల కమిషన్ బలవంతపు ఏకగ్రీవంపై సుమోటోగా కేసులు నమోదు చేయాలన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సీఎం చెబుతున్నారు. అభివృద్ధి జరిగింది కేంద్రం ఇచ్చిన నిధులతోనే అనే విషయం ఓటర్లు గమనించాలన్నారు. బీజేపీ పక్షాన నిలబడి అధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాల గెలుపునకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో వేధింపులకు గురిచేసి అధికార పార్టీ కండువా కపుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం సీఎం రేవంత్రెడ్డి హడావుడి చేస్తున్నాడని, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ సంబరాలు చేసు కుంటుందన్నారు. హిందూ దేవతలను రేవంత్రెడ్డి అవమానించాడని, దేవుళ్లపై ఒట్టుపెట్టి అధికారంలోకి వచ్చిన విషయం మరిచిపోయారన్నారు. -
హోంగార్డుల సామర్థ్యాలు పెంపునకు క్రీడా పోటీలు
నారాయణపేట: హోంగార్డ్స్ రైజింగ్ డే (డిసెంబర్ 6 ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో హోంగార్డులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పోటీలను అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్ పర్యవేక్షించారు. జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు. హోంగార్డుల మధ్య వాలీబాల్, కబడ్డీ, 100 మీటర్ల రన్నింగ్, 200 మీటర్ల రన్నింగ్ వంటి పలు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతి విభాగంలో పాల్గొన్న హోంగార్డులు తమ శారీరక సామార్థ్యాన్ని, క్రమశిక్షణను, జట్టు స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రదర్శన ఇచ్చారు. క్రీడలు హోంగార్డుల ఆరోగ్య పరిరక్షణ, స్ట్రెస్ తగ్గింపు, విధి నిర్వహణ సామర్థ్యాల పెరుగుదలకు ఎంతగానో దోహదం చేస్తాయని అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్ పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ప్రతి హోంగార్డ్ పాత్ర ఎంతో కీలకమని, రైజింగ్ డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వారి సేవలను గుర్తించడమే అన్నారు. ప్రతి విభాగంలో గెలుపొందిన విజేతలకు రైజింగ్ డే రోజు ఎస్పీ చేతుల మీదుగ బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు శివశంకర్, మద్దయ్య, హోంగార్డులు పాల్గొన్నారు. -
పొత్తుల రాజకీయం!
నారాయణపేటశుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మహబూబ్నగర్: బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ● గండేడ్ మండలం చిన్నవార్వాల్, రుసుంపల్లి, పెద్ద వార్వాల్, లింగాయపల్లి, వెన్నచేడ్, కొండాపూర్ గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి. అంచన్పల్లి, మన్సూర్పల్లి గ్రామాల్లో ఏకగ్రీవం కావడానికి మూడు పార్టీల మద్దతుదారులు అంగీకరించారు. ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్కు చెందిన వారు సర్పంచ్లుగా ఏకగ్రీవమయ్యారు. ● మహమ్మదాబాద్ మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తోంది. కంచన్పల్లిలో కాంగ్రెస్కు చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండగా.. అందులో ఒకరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. మంగంపేటలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నంచర్ల, గాదిర్యాల్లో సర్పంచ్లుగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతుదారులకు బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. పల్లె పోరులో చిత్రవిచిత్రాలు గెలుపే లక్ష్యంగా ఊహించని ‘మద్దతులు’ కొన్ని జీపీల్లో బీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్.. మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ? వీపనగండ్లలో బీఆర్ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం.. -
అక్రమాలపై విచారణ ఏది..?
నారాయణపేట రూరల్: జిల్లాలోని కేజీబీవీలలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు (ఎస్ఓ) అక్రమాలకు పాల్పడుతున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వస్తున్నా.. వారిపై విచారణ జరిపించడంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత నెల 26న ‘సాక్షి’లో ‘కస్తూర్బాలు.. అక్రమాలకు నిలయాలు’ అనే శీర్షికతో వచ్చిన కథనంపై ధన్వాడ ఎస్ఓను మాత్రం విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకొన్నారు. ఇదే క్రమంలో కోస్గి, కృష్ణా కేజీబీవీలో సైతం జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టలేదు. నామమాత్రంగా కమిటీ వేసి కాగితాలకే పరిమితం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ రికార్డులలో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు సరి చేసుకునేందుకే కాలయాపన జరుగుతున్నట్లు విద్యాశాఖలో చర్చించుకుంటున్నారు. ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు, రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కోస్గి కేజీబీవీలో.. పారదర్శత కోసం పాఠశాలలో ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్ విధానం జిల్లాలో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల తర్వాత అధికారికంగా అమలు అయ్యింది. అయితే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోని కోస్గి కేజీబీవీలో మాత్రం మెనూ ప్రకారం భోజనం పెట్టడం కల అనే చెప్పాలి. ఎఫ్ఆర్ఎస్ రాక ముందు అక్కడ వాస్తవంగా చదువుతున్న విద్యార్థుల కంటే 70 మంది వరకు ఎక్కువ ఎన్రోల్మెంట్ చూపి డైట్ బిల్ అధికంగా నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెండు నెలలపాటు అలాగే కొనసాగించినట్లు తెలిసింది. పరిశీలనకు వెళ్లిన అధికారులకు మాత్రం లాంగ్ ఆబ్సెంట్ అంటూ దాటవే స్తూ కప్పిపుచ్చుకున్నారు. కానీ, గట్టిగా ప్రశ్నిస్తే కొందరికి టీసీలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నా యి. కాగా ఆ 70 మంది వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నట్లు తెలుస్తుంది. గత విద్యా సంవత్సరం (2024– 25) మార్చిలో వచ్చిన నిధులు సైతం ఇష్టారీతిగా ఖర్చుల లెక్కలు రాసి బిల్లులు సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. రూ.10 వేల బిల్లులను రూ.30 వేలు రాశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మెనూ పాటించకుండా నాణ్యతలేని భోజనం వడ్డించడం రోజు వారి దినచర్య. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులు భోజనం నాణ్యతపై ప్రశ్నిస్తే వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడగా, ఆయన డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత కోపో ద్రిక్తులైన ఎస్ఓ ఆయనకు ఫోన్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తూ.. కేజీబీవీకి వచ్చి అమ్మాయిల విషయంలో అనుచితంగా ప్రవర్తించావని, రివర్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. మెనూ ప్రకారం ఏ ఒక్క రోజు భోజనం, స్నాక్స్ ఇవ్వరని ఆరోపణలున్నాయి. నిబంధనల కు విరుద్ధంగా పత్రిక ప్రకటన లేకుండా, లోపాయికారిగా పీఈటీని నియమించుకోగా.. ఎస్ఓ ప్రవర్తన నచ్చక రెండు నెలలకే మానేసినట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న సీఆర్టీలతోనూ సఖ్యతగా ఉండటం లేదని, ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా అధికారు లు తనిఖీకి వస్తే సామాజిక వర్గం పేరుతో బెదిరించడం, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు సమాచారం కోరితే రాజకీ య నాయకులతో ఫోన్ చేసి తనపై పత్రికల్లో కథ నాలు రాకుండా అడ్డుకుంటున్నట్లు తెలిసింది. విచారణ జరిపిస్తాం.. జిల్లాలోని కేజీబీవీలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిస్తున్నాం. ఇప్పటికే ధన్వాడ ఎస్ఓను టెర్మినెట్ చేశాం. కోస్గి, కృష్ణ కేజీబీవీలలో విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశాం. స్థానిక ఎంఈఓతోనూ కలిసి విచారణ చేసి రిపోర్ట్ ఇస్తారు. తర్వాత కలెక్టర్కు నివేదించి తప్పు అని తేలితే చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజులు, డీఈఓ కృష్ణా కేజీబీవీలో.. మంత్రి వాకిటి శ్రీహరి నియోజకవర్గంలోని కృష్ణా మండల కేజీబీవీలో డైట్ బిల్లుల అక్రమాలు బయటపడరాదని ఉద్దేశంతో అక్కడి ఎస్ఓ నిరంతరం వంటవారిని మారుస్తున్నట్లు సమాచారం. రాజీనామా లెటర్ లేకుండానే ఏడాదిలో ముగ్గురిని తొలగించి తనకు అనుకూలంగా ఉన్న కొత్తవారిని తీసుకున్నట్లు తెలిసింది. ఎందుకు తొలగించారో సమాధానం లేదని, వంట వారు కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అధికారులు న్యాయం చేయలేదని బాధితులు వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, త్రిమెన్ కమిటీ ప్రమేయం లేకుండానే కొత్త వారి ఎంపిక చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ టార్చర్ భరించలేక ఓ విద్యార్థిని రాత్రి గోడ దూకి పారిపోగా గ్రామస్తులు తీసుకొచ్చి పాఠశాలలో అప్పజెప్పగా ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. మార్చి నెలలో రూ.3.50 లక్షల నిధులు వస్తే ఇష్టానుసారంగా ఆదరాబాదరగా ఏప్రిల్లో బిల్లులు సబ్మిట్ చేసినట్లు తెలుస్తోంది. అక్రమాలకు సంబంధించి అధికారులు విచారణకు వస్తే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజువారి ప్రార్థన విషయంలోనూ ఆరోపణలు లేకపోలేదు. కమిటీ పేరుతో కాలయాపనంటూ విమర్శలు ఒత్తిళ్లకు తలొగ్గే వెనకడుగు అనేఅనుమానాలు సీఎం, మంత్రి నియోజకవర్గాల్లోని కేజీబీవీలపై ఆరోపణలు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందని ద్రాక్షే.. -
పడమట.. కిటకిట
పడమటి ఆంజనేయస్వామి మూలవిగ్రహం పడమటి ఆంజనేయస్వామి రథాన్ని లాగుతున్న భక్తులు మక్తల్: పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన స్వామివారి రథోత్సవం కనుల పండువగా జరిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రథానికి ప్రత్యేక పూజలు చేసి.. బాలాంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. అత్యంత వైభవంగా కొనసాగిన రథోత్సవానికి ఉమ్మడి పాలమూరు నుంచే కాకుండా.. హైదరాబాద్, కర్ణాటక, పుణె, షోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా వేలాదిగా తరలివచ్చి తిలకించారు. ఈ సందర్భంగా భక్తుల అంజన్న నామస్మరణతో రాంలీలా మైదానం, మక్తల్ పట్టణం మార్మోగింది. పొర్లుదండాలు పెట్టి.. మొక్కులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు పొర్లుదండాలు పెడుతూ.. జ్యోతులు వెలిగించి, తలనీలాలు సమర్పించుకొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు కార్యాలయం నుంచి ఊరేగింపుగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి, బీకేఆర్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ రాధ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణంలో రాంలీలా మైదానం భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేష్కుమార్, ఈఓ కవిత, పూజారి ప్రాణేష్చారి, ఆయా పార్టీల నాయకులు రామారావు, ఆశిరెడ్డి, సిద్ధార్థరెడ్డి, బాల్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టువస్త్రాలు తీసుకువస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీరాములుఆంజనేయస్వామి సన్నిధిలోమాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి కనులపండువగా పండువగా ఆంజనేయస్వామి రథోత్సవం స్వామివారిని దర్శించుకున్న మంత్రి వాకిటి శ్రీహరి అశేషంగా తరలివచ్చిన భక్తజనం -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
కోస్గి: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, చట్టబద్ధంగా, శాంతియుత, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని డీఎస్పీ లింగయ్య, డీిసీఆర్బీ డీఎస్పీ మహేష్ అన్నారు. గురువారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పోలీస్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల కమిషన్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. రాజకీయ పార్టీలతో పక్షపాతం లేని విధంగా వ్యవహరించాలని, పోలింగ్ కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు అక్రమంగా డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ చేపడితే చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటింగ్ ప్రదేశాల్లో 144 సెక్షన్ అమలు, సీసీ కెమెరాల నిఘా, గొడవలు జరిగితే అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ చుట్టూ 200 మీటర్ల దూరం వరకు ప్రచారం నిషేధం అని, గుంపులుగా ఉండకుండా చూడా లని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ సైదులు ఎస్ఐలు బాలరాజు, విజయ్కుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
నారాయణపేట: పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని నిర్వహించిన వీసీలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్లపై వచ్చే ఫిర్యాదులు తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పనిసరిగా అర్హులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని, ప్రతి గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేలా చూడాలన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఓటు హక్కు ఉండి ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బంది ఈ నెల 8న, రెండో విడత వారికి 12, మూడో విడత వారికి 15న పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పర్యవేక్షణ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన సామగ్రి పంపిణీని కార్యక్రమాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. జిల్లాకేంద్రానికి సమీపంలోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. రెండు, మూడో విడత ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న బ్యాలెట్ బాక్సులతోపాటు ఇంకా ఏమైనా అవసరమైతే తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. -
కనులపండువగా ప్రభోత్సవం
● పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తజనం మక్తల్: మక్తల్ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రభోత్సవ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన ప్రభోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానం కిటకిటలాడింది. ముందుగా ఆలయ చైర్మన్ ప్రాణేష్కుమార్ తదితరులు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ప్రతిష్టించి పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉన్న గోధా ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భజన బృందాల నడుమ పల్లకీ యాత్ర నిర్వహించారు. భక్తులు, ప్రముఖులు ప్రభోత్సవానికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టారు. ప్రభోత్సవాన్ని పడమర దిక్కున ఉన్న చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు లాగారు. అక్కడ విశేష పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయం వద్దకు ప్రభోత్సవాన్ని తీసుకువచ్చారు. భక్తిశ్రద్ధలతో పవమాన హోమం ఉత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం ఆలయంలో పవమాన హోమాన్ని వేదపండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆలయ చైర్మన్ ప్రాణేష్కుమార్ పవమాన హోమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ కవిత వేదపండితులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల సాధికారతే లక్ష్యం
నారాయణపేట: దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా పనిచేయాలని.. వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం అభివృద్ధికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని రంగాల అభివృద్ధికై పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఇక నుంచి ప్రతినెలా చివరి శనివారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో దివ్యాంగుల సమస్యలపై వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు తమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడంతో దరఖాస్తు చేసుకోవడం లేదన్నారు. యూడీఐడీ కార్డులకు గాను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగుల స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతో వడ్డీలేని రుణాలు వస్తాయన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రత రంగాల్లో సేవలు అందించేందుకు అంకితభావంతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప అన్నారు. క్రీడాపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ర్యక్రమంలో డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, సీడీపీఓ జయ తదితరులు పాల్గొన్నారు. -
చెక్పోస్టుల వద్దఅప్రమత్తంగా ఉండాలి
నారాయణపేట: సరిహద్దు చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వినీత్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట మండలంలోని జలాల్పూర్ చెక్పోస్ట్ (కర్ణాటక బోర్డర్), దామరగిద్ద సమీపంలోని కానుకుర్తి బోర్డర్ చెక్పోస్ట్లను బుధవారం ఎస్పీ సందర్శించారు.అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎస్ఎస్టీ టీంలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంలో అక్రమ రవాణా, మద్యం, డబ్బు, ఇతర విలువైన వస్తువుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరమైతే వీడియో రికార్డింగ్తో తనిఖీలు కొనసాగించాలన్నారు. జిల్లాలో పరిధిలో 6 బోర్డర్ చెక్పోస్టులు, 5 ఎస్ఎస్టి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడానికి పోలీసు శాఖ పూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి 17 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఇందులో 15,750 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,709, కనిష్టంగా రూ.1,619 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,611, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,901, కనిష్టంగా రూ.1,624, పత్తి గరిష్టంగా రూ.6,681, కనిష్టంగా రూ.5,060 చొప్పున పలికాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,702, కనిష్టంగా రూ.2,059 చొప్పున ధరలు లభించాయి. కాగా.. దేవరకద్రలో ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల కోసం గురువారం, చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కెట్కు సెలవు ఇచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. నేడు మహబూబ్నగర్ స్థాపన దినోత్సవం స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలోని మీర్ మహెబూబియా హాల్లో గురువారం ఉదయం 10 గంటలకు మహబూబ్నగర్ స్థాపన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆరో నిజాం మీర్ మహెబూబ్అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్ 135వ స్థాపన వేడుకలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రిటైర్డ్ ఆర్మీ పాండురంగారెడ్డి, తామీరే మిల్లత్ అధ్యక్షులు మహ్మద్ జియావుద్దీన్ నాయర్ తదితరులు పాల్గొంటారన్నారు. వేడుకల్లో మహబూబ్నగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ‘దేశంలో 40 కోట్ల దొంగ ఓట్లు’ వనపర్తి రూరల్: దేశంలో 130 కోట్ల జనాభా ఉండగా.. దాదాపుగా 40 కోట్ల దొంగ ఓట్లు ఉన్నాయని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆరోపించారు. ఏఐసీసీ పిలుపు మేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఓట్ చోరీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారని వివరించారు. భారత రాజ్యాంగం వర్దిల్లాలంటే ఓటు ఎంతో విలువైందని.. దొంగ ఓట్లతో కేంద్రంలో బీజేపీ గద్దెనెక్కిందని దుయ్యబట్టారు. జిల్లాలో పార్టీ మద్దతుదారులను సర్పంచ్లుగా గెలిపించుకునే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అఽధ్యక్షురాలు, పీసీసీ ప్రధానకార్యదర్శి యాదయ్య, నందిమళ్ల చంద్రమౌళి, మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
వేడెక్కిన రాజకీయం
వాతావరణం ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. వాతావరణం మధ్యాహ్నం వేడిగా, రాత్రి చలి ప్రభావం పెరుగుతుంది. నారాయణపేట/కోస్గి: ఈ నెల 11న జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలతో తుది జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు మండలాలు కోస్గి, గుండుమాల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలోని మొత్తం 67 పంచాయతీలకుగాను 14 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 53 పంచాయతీలకు 169 మంది అభ్యర్థులు సర్పంచ్లుగాను, 572 వార్డుల్లో 198 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 374 వార్డులకుగాను 807 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగాను పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నవారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించడంతో ఇప్పటికే పల్లెల్లో వేడెక్కిన రాజకీయాలకుతోడు ప్రచార హోరు మొదలు కానుంది. కుదరని ఏకగ్రీవ ‘పంచాయతీ’ సీఎం రేవంత్రెడ్డి ఇలాఖాలో ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి ఏకగ్రీవం కోసం నాయకులు గట్టిగా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రత్యేక నిధులతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అధికార పక్ష నాయకులు పల్లెల్లో ప్రచారం చేసి ఏకగ్రీవాల కోసం నడిపిన పంచాయతీలు కుదరకపోవడంతో పలు గ్రామాల్లో అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు విముఖత వ్యక్తం చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం తమ సత్తా చాటాలని ఎన్నికల బరిలోకి దిగారు. కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థుల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఒక్కరికంటే ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. అధికార ప్రతిపక్షాలను లెక్క చేయకుండా కొన్నిచోట్ల యువకులు సైతం పోటీలో ఉన్నారు. యువతకు అవకాశం ఇస్తే గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. పల్లెల్లో తమ సత్తా చాటేందుకు అధికార పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోగా మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని ప్రచారంలోకి దింపి ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ ఓ వైపు, అధికార కాంగ్రెస్ మరోవైపు తమ సత్తా చాటాలని పల్లెపోరుకు సిద్ధం కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి జోరందుకోనుంది. మూడో విడత తొలిరోజు 575 నామినేషన్లు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల పర్వం బుధవారం అరంభమైంది. జిల్లాలో ని మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూ ర్, నర్వ మండలాల్లో మూడో విడతలో తొలిరోజు 110 సర్పంచు స్థానాలకుగాను 60, వార్డులు 994 స్థానాలకు 66 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు కొనసాగిన రెండో విడత నామినేషన్ల పర్వం మంగళవారం ఆర్థరాత్రి వరకు ముగిసింది. ఈ విడతలో నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్ మండలాల్లో 95 జీపీలకు గాను 575 మంది సర్పంచు అభ్యర్థులుగా, 900 వార్డులకు గాను 2022 మంది నామినేషన్లు వేశారు. రేపటి నుంచి కబడ్డీ టోర్నీ మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నుంచి 51వ రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ ప్రారంభం కానుంది. –8లో uముగిసిన నామినేషన్ల ఉపసంహరణ అభ్యర్థుల తుది జాబితా విడుదల 14 జీపీలు.. 198 వార్డులు ఏకగ్రీవం 53 పంచాయతీలకు 169 మంది, 374 వార్డులకు 807 మంది పోటీ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు -
కార్యకర్తలకు అండగా ఉంటా
మక్తల్: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని.. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్లో ఆయన నివాసంలో మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన దాదాపు 100 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరగా.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. నాయకులు లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేష్, తాయప్ప, వేణు తదితరులు పాల్గొన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అండర్– 14 విభాగం బాలుర క్రికెట్ జట్టు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగే ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడలకు తరలివెళ్తుండగా వారిని అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చాలని అన్నారు. వెంకటేష్శెట్టి, నారాయణ, విష్ణు పాల్గొన్నారు. -
‘రెబల్స్’ గాయబ్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలిదశ పల్లె పోరు కీలక ఘట్టానికి చేరింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా.. సాయంత్రం ఐదు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటించనున్నారు. అనంతరం వెంటనే ఆయా అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. అయితే అధికార కాంగ్రెస్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక మొత్తం గ్రామపంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నేడు ఉపసంహరణకు తుది గడువు కావడంతో ముఖ్యనేతలు తమను తప్పించే ప్రయత్నాలు చేస్తారని గ్రహించిన పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. వారి ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా దొరక్కపోవడంతో నేతలు తల పట్టుకుంటున్నారు. పలుచోట్ల ఇదివరకే బుజ్జగింపు ప్రయత్నాలు చేయగా.. వారు ఉపసంహరణకు ససేమిరా అన్నట్లు సమాచారం. తాజాగా వారు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుండడంతో పోటీలో నిలబడడం ఖాయంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు ‘హస్తం’ ముఖ్య నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చేసేదేమీ లేక ఆయా గ్రామాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలని దానిపై వారు కాంగ్రెస్ స్థానిక శ్రేణులకు అంతర్గతంగా సూచనలు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆసక్తికరంగా పోరు.. ప్రస్తుతం తొలి విడత ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. రెండో విడతలో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. బుధవారం స్కూట్నీ కార్యక్రమం జరగనుంది. దీంతో పాటు చివరిదశలో జరిగే జీపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో పోటీకి సై అంటే సై అంటుండడం ఆ పార్టీ ముఖ్య నేతలను బెంబేలెత్తిస్తోంది. స్వయంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బుజ్జగింపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పలు ప్రాంతాల్లో ఇన్చార్జిలను నియమించి పరిస్థితి చక్కబెట్టేలా ముందుకు సాగుతున్నారు. అయినా ఉపసంహరణ సమయంలో రెబల్ అభ్యర్థులు తప్పించుకుని తిరుగుతుండడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అజ్ఞాతంలోకి పలువురు పోటీదారులు బరిలోనుంచి తప్పుకోవాలనే ఒత్తిళ్లు తప్పవని అండర్ గ్రౌండ్లోకి.. తొలివిడత నామినేషన్ల ఉపసంహరణకు నేడే తుది గడువు తల పట్టుకుంటున్న ముఖ్య నేతలు ఆసక్తికరంగా పల్లె పోరు -
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త: ఎస్పీ
నారాయణపేట: సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డా.వినీత్ సూచించారు. సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్’ పోస్టర్ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించడం, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపు కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘ఫ్రాడ్ కో ఫుల్ స్టాప్’ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త పంథాలో జరుగుతున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంక్, పోలీస్, ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చే స్కామ్ కాల్స్కు స్పందించొద్దన్నారు. ఎవరూ ఓటీపీ, పిన్ నంబర్, బ్యాంక్ వివరాలు అడగరని.. ఇలాంటి వాటిని అడిగితే వెంటనే 1930 నంబర్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మహేశ్, ఐటీ కోర్ ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు. -
రెండో విడత ముగిసిన నామినేషన్ల పర్వం
● అర్ధరాత్రి వరకు కొనసాగిన స్వీకరణ ● సర్పంచ్కు 609, వార్డు స్థానాలకు 2,063 నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలకు నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. చివరి రోజు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలిరావడంతో ఆర్ధరాత్రి వరకు స్వీకరణ కొనసాగింది. దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నారాయణపేట మండలాల్లో మొత్తం 95 సర్పంచ్ స్థానాలకు గాను 348 మంది, 900 వార్డు స్థానాలకు 1,550 మంది నామినేషన్లు వేశారు. మొత్తం ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 609, వార్డులకు 2,063 నామినేషన్లు వచ్చాయి. రాత్రి 11 గంటల వరకు దామరగిద్ద మండలంలోని లోకుర్తి క్లస్టర్, ధన్వాడ మండలంలోని చర్లపల్లి క్లస్టర్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఇంకా నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎక్కడ ఎన్ని నామినేషన్లు అందాయో జిల్లా పంచాయతీ అధికారికి సమాచారం సరిగ్గా అందకపోవడం గమనార్హం. అయితే సమాచారం నిమిత్తం డీపీఆర్వోకు ఫోన్ చేయగా 11:23 నిమిషాలకు జిల్లాలోని నామినేషన్ల వివరాలను డీపీఆర్ఓ గ్రూప్లో పోస్టు చేశారు. దీన్ని బట్టి ఎన్నికల నిర్వహణలో అధికారుల పనితీరు ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. -
చెక్కులు ఇస్తామని.. చేయిచ్చారు!
నారాయణపేట: మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు నిరాశే మిగిలింది. రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరానికి రూ. 20లక్షల చొప్పున పెంచిన నష్టపరిహారం చెక్కులను అందిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు భూ నిర్వాసితులను మక్తల్లో సోమవారం జరిగిన సీఎం సభకు తరలించారు. అయితే సభ ముగిసినా భూ నిర్వాసితులకు చెక్కుల మాట ఎత్తకపోవడంతో నిరాశకు గురయ్యారు. తమ భూములను స్వచ్ఛందంగా ప్రాజెక్టు కోసం రాసిస్తే.. ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించేందుకు రోజులు గడుపుతోందని వాపోతున్నారు. సీఎం సభలో చెక్కులు ఇస్తామని చెప్పి చెయ్యిచ్చారంటూ భూ నిర్వాసితులు బహిరంగంగా విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా మక్తల్, ఆత్మకూర్ పట్టణాల్లో రూ.వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు లేని ఎన్నికల కోడ్.. మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెక్కుల పంపిణీకి అడ్డొచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతేడాదే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. ఇప్పటికే పలువురు రైతులకు ఎకరా రూ. 14లక్షల చొప్పున పరిహారం అందించారని గుర్తు చేస్తున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఎకరాకు పెంచిన రూ. 20లక్షల నష్టపరిహారం ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ను సాకుగా చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు. మంత్రి ఇద్దామన్నా.. భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించేందుకు మంత్రి వాకిటి శ్రీహరితో పాటు స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి ప్రత్యేక చొరవతో అధికారులతో నివేదికలను తయారు చేయించారు. సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేయాలని అనుకున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఒక అడుగు ముందుకేసి.. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్కు సూచించారు. కానీ గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారికంగా రైతులకు నష్టపరిహారం అందించలేమని కలెక్టర్ మంత్రికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీఎం సభలో నష్టపరిహారం చెక్కుల కోసం భూ నిర్వాసితుల నిరీక్షణ చివరకు చెక్కుల పంపిణీ మాటెత్తని అధికారులు, పాలకులు ఆశతో వచ్చి.. నిరాశతో వెనుదిరిగిన వైనం ‘మక్తల్–పేట–కొడంగల్’ భూ నిర్వాసితులకు చేదు అనుభవం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తే తమ భూములను స్వచ్ఛందంగా ఇస్తామని రాసిచ్చారు. అయితే గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ఉండటంతో పరిహారం చెక్కులను పంపిణీ చేయలేకపోయాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల తర్వాత నష్టపరిహారం అందే అవకాశం ఉంది. – రామచందర్ నాయక్, ఆర్డీఓ, నారాయణపేట -
పడమటి అంజన్నఉత్సవాలకు అంకురార్పణ
మక్తల్: పట్టణంలో శ్రీపడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉత్తరాది మఠం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తిని పల్లకీలో ఆంజనేయస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి.. ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం, అలంకారోత్సవం నిర్వహించారు. పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రాణేశ్ ఆచారి, ఈఓ కవిత తదితరులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్ మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్లోని చిట్టెం నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం డిజైన్ ఆరు నెలలకోసారి మారుస్తున్నారని.. ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి తెర లేపుతున్నారని ఆరోపించారు. సంగంబండ బ్యాక్వాటర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టు అంచనాలు పెంచేలా డిజైన్ మార్చారన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంగతి ఏమో కానీ.. మక్తల్లో ఉన్న ఆరు గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చిట్టెం సుచరిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, శ్రీనివాస్ గుప్త, చిన్న హన్మంతు, అన్వర్ పాల్గొన్నారు. నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నారాయణపేట: జిల్లా కేంద్రంలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో బుధవారం మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశా ఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థలు, దివ్యాంగ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
పోస్టల్ బ్యాలెట్లో పొరపాట్లకు తావివ్వొద్దు
నారాయణపేట/మరికల్: పోస్టల్ బ్యాలెట్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎన్నికల అధికారులకు పోస్టల్ బ్యాలెట్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారుల పోస్టల్ బ్యాలెట్ వినియోగం, లెక్కింపు తదితర అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. అధికారులకు అప్పగించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ పాల్గొన్నారు. ● మరికల్లోని నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించారు. కేంద్రంలోకి ముగ్గురి కంటే ఎక్కువ మందిని అనుమతించొద్దని అధికారులకు సూచించారు. సర్పంచ్, వార్డు స్థానా లకు వచ్చిన నామినేషన్ల వివరాలను తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ పృథ్వీరాజ్, పంచాయ తీ కార్యదర్శి శ్యామ్సుందర్రెడ్డి ఉన్నారు. -
వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా
ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం ● దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు ● మక్తల్, అత్మకూర్ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం మక్తల్లో అభివాదం చేస్తున్న సీఎంరేవంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నారాయణపేట/ మక్తల్: ‘పాలమూరు జిల్లాకు వేలకోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉ మ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి న తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్ల కు సరిపడా అభివృద్ధి చేసుకుందాం.’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటల కు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న సీఎంకు అక్కడ భారీ స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు హెలికాప్టర్లో మక్తల్కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ. 1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు. సాగుతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత ‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్నగర్ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు. -
సన్నబియ్యం పక్కదారి
నర్వ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొని రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరఫరా అవుతున్న సన్నం బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సన్యం బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న దళారులు సరిహద్దులోని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు కిలోకు రూ.15 చొప్పున చెల్లిస్తూ.. కొంత లాభం తీసుకొని దళారులకు విక్రయిస్తున్నారు. వాటినే ప్రాసెస్ చేసి అక్రమార్కులు బహిరంగ మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటిపై నిఘా ఉంచాల్సిన సివిల్సప్లై అధికారులు చోద్యం చూస్తున్నారు. పక్క రాష్ట్రాలకు తరలింపు.. జిల్లాలో కొన్ని రోజులుగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేయడంతో పాటు స్థానిక పోలీసులు చేపట్టిన పెట్రోలింగ్లో రేషన్బియ్యం పట్టుబడుతూనే ఉంది. అయినా కొందరు దళారులు పోలీసుల కళ్లు కప్పి జిల్లాలోని ఆయా మండలాల నుంచి, నారాయణపేట మీదుగా, మక్తల్ మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్, గుర్మిట్కల్, బెంగళూర్, మహారాష్ట్రలోని ముంబాయి, తమిళనాడు రాష్ట్రం చైన్నెకి ఈ బియ్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా మార్కెటింగ్ చేపట్టిన మిల్లర్లు రూ.కోట్లల్లో ఆర్జిస్తున్నారు. దీనికి తోడు రైస్మిల్లర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, వాటినే పాలిష్ చేసి లేవీ కింద ప్రభుత్వానికి, ఇటు వ్యాపారస్థులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మిల్లర్లు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా కేవలం ప్రభుత్వం అందించే వడ్లను బియ్యంగా మార్చి, వీటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ.. ప్రభుత్వానికి ప్రాసెస్ చేసిన రేషన్ బియ్యాన్నే తిరిగి సీఎమ్మార్గా అందిస్తున్నారు. కొన్ని ఘటనలు ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల బొలెరో వాహనంలో తరలిస్తున్న 15.60 క్వింటాళ్ల రేషన్బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నర్వ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన సన్నబియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని పంచనామ నిర్వహించి నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ బియ్యాన్ని మిల్లుల్లో మరోసారి మర ఆడించి 25 నుంచి 50 కిలోల సంచుల్లో నింపి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దామరగిద్ద మండలంలోని మొగుల్మడ్కలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని, కేసు నమోదు చేశారు. ధన్వాడ మండంలోని కొండాపూర్లో 5.2 క్వింటాళ్లు, మరికల్ పట్టణ కేంద్రంలో 5.50 క్వింటాళ్లు, నర్వ మండలంలో 10 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని పోలీసులు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు కిలో రూ.15 కి కొనుగోలు చేస్తున్న దళారులు 37 కేసులు, 586 క్వింటాళ్ల బియ్యం పట్టివేత చర్యలు తీసుకోవలంటున్న ప్రజలు దాడులు ముమ్మరం జిల్లా సరిహద్దుల మీదుగా కర్ణాటకకు అక్రమ రేషన్బియ్యం తరలిస్తున్నట్లు దాడు ల్లో పట్టుబడిన వ్యక్తులను విచారించగా తెలిసింది. దీంతో జిల్లాలోని సరిహద్దు ప్రాంతా ల్లో ఎప్పటికప్పడు పోలీస్శాఖ సహకారంతో దాడులు ముమ్మరం చేశాం. లబ్ధిదారులు రే షన్ బియ్యాన్ని అమ్ముకున్నట్లు తేలితే రేషన్ కార్డులు రద్దు చేస్తాం. అక్రమ దళారులపై కే సులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం. – వంగాల బాల్రాజు డీఎస్ఓ, నారాయణపేట -
పకడ్బందీగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
నారాయణపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సీతాలక్ష్మి తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమెతోపాటు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ, ఎంసీసీ, ఎన్నికల వ్యయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నామినేషన్ల పరిశీలన కూడా నిర్వహించడం జరిగిందన్నారు. కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో ఎన్నికల నిర్వహణలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఎన్నికల నిర్వహణకు రాండమైజేషన్ ద్వారా ఎన్నికల సిబ్బందిని, అవసరమైన బ్యాలెట్ బాక్సులను కేటాయించామన్నారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం సమకూరుస్తున్నట్లు తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు, మైక్రో అబ్జర్వర్ లను నియమించనున్నట్లు తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్రూం, మీడియా సెంటర్ పరిశీలన కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను సోమవారం పరిశీలకురాలు సీతాలకీ్ష్మ్ సందర్శించారు. సంబంధిత సిబ్బందితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధికారులకు అందించాలన్నారు. ప్రతిరోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలను పరిశీలించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు సంబంధించిన వార్తలను గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. -
ఊపందుకున్న నామినేషన్లు
● రెండోరోజు సర్పంచ్ స్థానాలకు 202 నామినేషన్లు దాఖలు నారాయణపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు సర్పంచ్కు 59, వార్డులకు 59 నామినేషన్లు రాగా రెండోరోజు పెరిగాయి. ఆశావహులు తమ మండలంలోని క్లస్టర్ కేంద్రాలకు చేరుకుని రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. సర్పంచ్ స్థానాలకు సోమవారం 202 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 454 దాఖలైనట్లుగా జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి తెలిపారు. మంగళవారంతో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. -
మరింత చేరువగా దూరవిద్య
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వం అక్షరాస్యతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో అడ్మిషన్లు పెంచడంతోపాటు చదువు మధ్యలో మానేసి చదువుకు దూరంగా ఉన్న విద్యార్థులు చదువుకునేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. అందులో భాగంగా ఓపెన్ స్కూల్ ద్వారా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున అడ్మిషన్లు ఇస్తుంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 4,600 అడ్మిషన్లు ఇవ్వగా.. ఈసారి ఏకంగా 8,641 అడ్మిషన్లు ఇవ్వడం గమనార్హం. పాఠశాలకు వెళ్లలేని వారు.. చాలామంది ఆర్థిక కారణాలు, ఇతర సమస్యల వల్ల మధ్యలో చదువు మానివేసి ఉంటారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ పూర్తిచేయడంతో పాటు ఇంటర్లో బైపీసీ ఇతర ఆర్ట్స్ కోర్సులు కూడా చదువుకునేందుకు అధికారులు వెసులుబాటు కల్పిస్తున్నారు. వారం మొత్తం పనులు చేసుకుని వారంలో చివరిరోజు అయిన ఆదివారం మాత్రం తమకు దగ్గరలో ఉన్న స్టడీ సెంటర్లో తరగతులు వినేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం సిలబస్లో 30 తరగతులు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ఫీజులు చెల్లించిన వాటితోనే స్టడీ పుస్తకాలు కూడా అధికారులు అందజేస్తున్నారు. రెగ్యులర్ వారితో సమానంగా.. ఓపెన్ స్కూల్ ద్వారా చదివితే రెగ్యులర్ సర్టిఫికెట్కు ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక్కడ తీసుకున్న సర్టిఫికెట్ను అదే స్థాయిలో గుర్తిస్తారు. ఓపెన్లో ఎస్సెస్సీ పూర్తి చేసి ఇంటర్ రెగ్యులర్గా చదువుకోవచ్చు. ఇక ఓపెన్లో ఇంటర్ చదివితే ఐఐటీ, నీట్తోపాటు ఇంటర్స్థాయిలో ఉండే అన్ని ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వీరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్కువ అడ్మిషన్లు కావడానికి ప్రధాన కారణం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని స్వయం సహాయక సంఘాల సభ్యులు చదువులు మధ్యలో మానివేసిన వారితో అధికారులు ఎక్కువగా అడ్మిషన్లు చేయించారు. వీటితో పాటు వివిధ సమీకృత కంపెనీలు, సంస్థల్లో కూడా మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి అడ్మిషన్లు చేయించారు. ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఓపెన్ స్కూల్ సేవలు గతం కంటే ఎక్కువ అడ్మిషన్లు కల్పించిన అధికారులు చదువు మధ్యలో మానేసిన ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులకు సదావకాశం పనిచేసుకుంటూనే చదువు కొనసాగించే వెసులుబాటు 2,823 అడ్మిషన్లతో మహబూబ్నగర్ రాష్ట్రంలోనే అగ్రస్థానం -
రెండో విడత తొలి రోజు 59 నామినేషన్లు
నారాయణపేట: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచు, వార్డు సభ్యులకు జరుగుతున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఆదివారం ఆయా కేంద్రాల వద్ద అధికారులు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, మరికల్ మండలాల్లోని 35 క్లస్టర్లలో 95 గ్రామ పంచాయతీలకు గాను సర్పంచుకు 59 మంది, 900 వార్డులకు గాను 59 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇలా సరిసమానంగా నామినేషన్లు దాఖలు కావడం గమనార్హం. తొలి రోజు నామినేషన్లు మందకొడిగా కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. మరో రెండు రోజుల్లో నామినేషన్లు ఊపందుకోనున్నాయి. సీఎం ఇలాఖాలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో నారాయణపేట నియోజకవర్గంలో సైతం ఏకగ్రీవం చేయించేందుకు ఎమ్మెల్యే వ్యూహరచన చేస్తున్నారు. అధికార పార్టీ ఏకగ్రీవం చేసేందుకు పావులు కదుపుతుండడంతో ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపి సత్తాచాటేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాలో తొలిరోజు నామినేషన్ల వివరాలిలా.. మండలం సర్పంచు వార్డు దామరగిద్ద 17 20 ధన్వాడ 14 12 నారాయణపేట 15 7 మరికల్ 13 20 -
రూ.558 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
● నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు ● మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు నారాయణపేట/మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మక్తల్లో పర్యటించనున్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయిన తర్వాత సీఎం మక్తల్కు రావడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈమేరకు రూ.558 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. జూరాల కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణా నదిపై రూ.123 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో 25 ఎకరాల భూమిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, మక్తల్ – నారాయణపేట నుంచి నాలుగు లైన్ల రోడ్డు పనులు రూ. 210 కోట్లతో, మక్తల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూ.25 కోట్లతో ప్రారంభించనున్నారు. ఎప్పుడెప్పుడా అని మక్తల్ – నారాయణపేట – కొడంగల్ పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షల చొప్పున ఇస్తామని చెప్పిన పరిహారం చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేసేందుకు మంత్రి ఏర్పాట్లు చేయించారు. అనంతరం బీసీ బాలుర గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన సీఎం మక్తల్ పర్యటన నేపథ్యంలో సభావేదిక వద్ద ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరిశీలించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. -
వారిదే పైచేయి..
ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్విల్తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు దుకాణాలు (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 54 1,634 49.02 నాగర్కర్నూల్ 67 1,518 45.54 నారాయణపేట 36 853 25.59 జోగుళాంబ గద్వాల 34 774 23.22 వనపర్తి 36 757 22.71 -
ఏకగ్రీవమే..!
నారాయణపేటఆ జీపీలుకాటేస్తున్న ఎయిడ్స్ భూతం ఉమ్మడి జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు ఏటేటా పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో మొదటి దశలో 550 జీపీల సర్పంచ్లు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. నామినేషన్ల గడువు ముగిసే నాటికి 14 గ్రామాలు ఏకగ్రీవం దిశగా అడుగులు వేశాయి. ఆయా ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్కటి చొప్పునే నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రకటించడం లాంచనమేనని తెలుస్తోంది. మరోవైపు పలు జీపీల్లోని అన్ని వార్డుల్లో ఒక్కొక్కరు చొప్పునే నామినేషన్లు వేయగా.. సర్పంచ్లుగా మాత్రం ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. వారు ఉపసంహరించుకునేలా పెద్దలు రాజీ ప్ర యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తోంది. -
నామినేషన్ పత్రాలను నిశితంగా పరిశీలించాలి
కోస్గి రూరల్: స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్ధులు వేసే ప్రతి నామినేషన్ను నిశితంగా పరీశీలించాలని జిల్లా ఎన్నికల పరిశీలకులు సీతాలక్ష్మి అధికారులకు ఆదేశించారు. శనివారం గుండుమాల్ మండలంలోని గుండుమాల్, బోగారం, కొమ్మూర్ క్లస్టర్లలో ఎన్నికల ప్రక్రియను పరీశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ అభ్యర్థులు నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల గురించి వారికి వివరించాలన్నారు. నామినేషన్ పత్రాలను సరి చూసి తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని అధికారులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
సర్పంచ్లకు 391.. వార్డులకు 1,224
కోస్గి/మద్దూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గడువు శనివారంతో ముగిసింది. కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని 67 పంచాయతీలకు 391 నామినేషన్లు, 572 వార్డులకు సంబంధించి 1,224 నామినేషన్లు దాఖలయ్యాయి. కోస్గి మండలంలో 14 సర్పంచ్ స్థానాలకు మొత్తం 97 నామినేషన్లు, 122 వార్డులకుగాను 324 నామినేషన్లు దాఖలయ్యాయి. మద్దూర్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు 127 నామినేషన్లు, 206 వార్డులకు 411 నామినేషన్లు దాఖలయ్యాయి. కొత్తపల్లి మండలంలో 16 సర్పంచ్ స్థానాలకు 78 నామినేషన్లు, 130 వార్డులకు 276 నామినేషన్లు దాఖలయ్యాయి. గుండుమాల్ మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు 89 నామినేషన్లు, 114 వార్డులకు 213 నామినేషన్ దాఖలైనట్లు ఆయా మండలాల అధికారులు తెలిపారు. మొదటి రోజు మొత్తం సర్పంచ్ స్థానాలకు 69 నామినేషన్లు, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మిల్లర్ల దోపిడీపై రైతుల ఆందోళన
మరికల్: ధన్వాడ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అక్రమాలను నిరసిస్తూ రైతులు శనివారం అప్పంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర లారీలను ఆపి ఆందోళన చేశారు. ఈ నెల 25న అప్పంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర 7 మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని తూకం వేయగా 796 బస్తాల ధాన్యం కాగా, 318.40 క్వింటాళ్లు వచ్చింది. అయితే లారీ డ్రైవర్ కోస్గి మహాలక్ష్మి రైస్ మిల్లుకు తీసుకెళ్లి అక్కడ వే బ్రిడ్జి తూకం వేయగా 796 బస్తాలకు బదులు 786 బస్తాల ధాన్యం వచ్చినట్లు ట్రాక్సిట్ తెచ్చి రైతులకు ఇచ్చాడు. తూకంలో 10 బస్తాల ధాన్యం తక్కువ రావడంపై ఆగ్రహించిన రైతులు మిల్లు యాజమానిని నిలదీయగా దురుసుగా మాట్లాడాడు. కష్టపడి పండించిన ధాన్యంను మిల్లర్లు దోచుకుంటున్నారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన సివిల్ సప్లయ్ డీఎం సైదులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మక్తల్: పట్టణ కేంద్రంలో డిసెంబర్ 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడల యువజన పాడిపరిశ్రమల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. స్థానిక బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో సీఎం సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ప్రాంతాలను శనివారం వారు పరిశీలించారు. మున్సిపల్, ఇతర శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రాఫిక్, అత్యవసర సేవలు, ఫైర్ సేఫ్టీ లాంటివి అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సభా వేదిక సమీపంలో భారీకేడ్లు ఉంచి, సీఎం మీటింగ్కు అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, కమిషనర్ శ్రీరామ్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు. -
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ స్థానం సుస్థిరం
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టమని, ఆరు దశాబ్దాల కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోషించిన పాత్ర తిరుగులేనిదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారు శనివారం బీఆర్ఎస్ దీక్షా దివస్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ 2001లో ఉద్యమాన్ని పునర్నిర్మించడం నుంచి 2014లో రాష్ట్రాన్ని సాధించే వరకు కేసీఆర్ అసమాన పోరాటం చేశారని కొనియాడారు. అనంతరం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జిల్లా నాయకులు, ఉద్యమకారులతో కలిసి అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛం సమర్పించి, అమరులకు నివాళులర్పించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ దీక్ష దివాస్కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు విఠల్రావు ఆర్య, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, నాయకులు విజయ్సాగర్, భీమయ్యగౌడ్, కన్నాజగదీశ్, వేపూరిరాములు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగంలో అందించిన సేవలే గుర్తుంటాయి’
నారాయణపేట: ప్రతి ఉద్యోగికి విరమణ అనేది తప్పనిసరి అని, కానీ వృత్తి రీత్యా చేసిన సేవలే గుర్తుండి పోతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీపీఓ యోగానంద్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడాది పాటు నుంచి సీపీఓతో కలిసి తాను పని చేశానని, పేట లాంటి రిమోట్ జిల్లాలో పని చేసేందుకు చాలా మంది అధికారులు కొంత సంశయిస్తుంటారని తెలిపారు. కానీ ఎంతో ఒత్తిడితో కూడిన ముఖ్య ప్రణాళిక శాఖలో సీపీఓగా యోగానంద్ పాజిటివ్ మైండ్ సెట్తో పని చేశారని గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సీపీఓ యోగానంద్ దంపతులను శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మొగులప్ప, డీపీఆర్ఓ రషీద్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ఖలీల్, ఏఓ శ్రీధర్, జయసుధ, డిప్యూటీ సీపీఓ శ్రీదేవి, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఆరు ఏకగ్రీవాలు
సాక్షి, నెట్వర్క్: సర్పంచ్కు ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల పర్వం శనివారంతో ముగిసింది. సర్పంచ్ స్థానానికి ఒకటే నామినేషన్ వచ్చిన అభ్యర్థి ఎన్నికను లాంఛనప్రాయమే అయినా.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. ● గుండుమాల్ మండలంలోని అప్పాయపల్లితండా, పెద్దతండా గ్రామ పంచాయతీలను ఆయా గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ.10 లక్షల నజరాన ప్రకటించడంతో గ్రామస్థుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అప్పాయపల్లితండా సర్పంచ్గా రాజేందర్నాయక్, ఉప సర్పంచ్గా వెంకట్రాములు నాయక్ను, పెద్దతండా సర్పంచ్గా శ్రీకృష్ణ, ఉప సర్పంచ్గా రవీందర్నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండు పంచాయతీల్లో ఉన్న 8 వార్డులకు ఒక్కొక్క నామినేషన్లే దాఖలయ్యాయి. ● మద్దూరు మండలంలోని నాలుగు పంచాయతీలకు సర్పంచ్లకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెదిరిపాడ్ ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో కోతులగుట్టతండాకు చెందిన అనుసూయ తారాసింగ్ ఒక నామినేషన్ దాఖాలు చేశారు. పర్సపూర్ ఎస్సీ జనరల్ కావడంతో సర్పంచ్గా అభ్యర్థిగా మ్యాతరి అంజిలమ్మ, వార్డులకు ఒకటే నామినేషన్ దాఖలు చేశారు. అప్పిరెడ్డిపల్లి సర్పంచ్గా మల్లీశ్వరీ ఒక్కరే నామినేషన్ వేశారు. దామ్లతండాలో కూడా సర్పంచ్, వార్డు సభ్యులకు ఒకే నామినేషన్ దాఖలు చేశారు. -
పల్లె నుంచేప్రస్థానం..
గ్రామ తొలి పౌరుడిగా రాజకీయ ఆరంగేట్రం.. ● జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజా సేవలో.. ● తమదైన ముద్ర వేసుకున్న ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డలు సర్పంచ్.. రాజకీయ ఆరంగేట్రానికి తొలిమెట్టు. ఎందరెందరో పల్లె పెద్దగా తొలి అడుగు వేసి.. క్రమక్రమంగా చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ప్రజాసేవలో తమదైన ముద్ర వేసుకున్నారు. గ్రామ మొదటి పౌరుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత పదవులను అధిరోహించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలపై ‘సాక్షి’ సండే స్పెషల్.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ నారాయణపేట జిల్లా మక్తల్ మేజర్గ్రామ పంచాయతీకి చెందిన మంత్రి వాకిటి శ్రీహరి 2001లో సర్పంచ్గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో మక్తల్ జెడ్పీటీసీగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జెడ్పీ ఫ్లోర్లీడర్గా ఎన్నికయ్యారు. 2022లో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనతి కాలంలోనే రాష్ట్ర కేబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కింది. ప్రస్తుతం వాకిటి రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య సహకార, పాడి పరిశ్రమలు, క్రీడలు, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీఎన్ గౌడ్: సర్పంచ్.. ఎమ్మెల్యే.. జెడ్పీచైర్మన్ నాగర్కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన వంగా నారాయణగౌడ్ అలియాస్ వీఎన్ గౌడ్ 1953లో గ్రామసర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1954లో నాగర్కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా.. 1956 నుంచి 1967 వరకు బిజినేపల్లి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి 1972 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కాగా.. 1981లో జెడ్పీటీసీగా ఎన్నికై ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గగన్చంద్ర ప్రతిభ గర్వకారణం జాతీయస్థాయిలో యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్న గగన్చంద్ర ప్రతిభ గర్వకారణమని కలెక్టర్ సంతోష్ అన్నారు. –8లో uఎల్లారెడ్డి వార్డు సభ్యుడి నుంచి మంత్రి.. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ గ్రామానికి చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డి 1965లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1971లో సర్పంచ్గా, 1982లో సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో శాసన సభ్యుడిగా ఎన్నికై 1997లో టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో నూతనంగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. వాకిటి: సర్పంచ్.. జెడ్పీ ఫ్లోర్ లీడర్.. మంత్రి -
సీనియర్ సిటిజన్లసంక్షేమానికి కృషి
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని బారంబావి సమీపంలో ఉన్న వృద్ధాశ్రమం, బాలసదనం హోమ్స్ను శనివారం ప్రిన్సిపాల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి బి.సాయిమనోజ్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వారి ఆరోగ్య సమస్యలు గురించి ఆరా తీశారు. సిబ్బందితో మాట్లాడుతూ.. వృద్ధులకు, చిన్నారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారికి వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. నిత్యవసర వస్తువులు, ఆహార ధాన్యాల నాణ్యత, తాగునీరు, పరిశుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ, సీసీ పుటేజీలను, మూమెంట్ రిజస్టర్, ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం అడ్మిషన్ తీసుకుంటున్నారా అని వివరాలు సేకరించారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణి రద్దు నారాయణపేట: ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు, 2025 నిర్వహిస్తున్నందున డిసెంబర్ 1, సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి కొనసాగిస్తామని, వివరాలను పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. మక్తల్ ‘నో ఫ్లయింగ్ జోన్’ నారాయణపేట: మక్తల్ పట్టణాన్ని రెండు రోజులు పాటు నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మక్తల్కు డిసెంబర్ 1న వీవీఐపీలు, వీఐపీలు రానుండడంతో భద్రతా కారణాల వల్ల ఆదివారం నుంచి సోమవారం వరకు మక్తల్ పరిధిలో డ్రోన్లు, యూఏఐలు, రిమోట్ కంట్రోల్ ఫ్లయింగ్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయింది మక్తల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య అన్నారు. శనివారం మండలంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మరిచిపోయి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోంశేఖర్గౌడ్, లక్ష్మణ్, శేఖర్గౌడ్, ప్రతాప్రెడ్డి, అశోక్గౌడ్, కృష్ణయ్య, బ్యాటరి రాజు, రాజుగౌడ్, కుర్వలింగం, నరేశ్, సూరి, ఉసేనప్ప పాల్గొన్నారు. -
ప్రజాపాలన వారోత్సవాలకు సీఎం రేవంత్రెడ్డి
● డిసెంబర్ 1న మక్తల్లో బహిరంగ సభ ● ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట/మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిసెంబర్ 1న మక్తల్ పట్టణానికి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన వారోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మక్తల్ మండలంలో నిర్వహించాల్సిన సభను మక్తల్ పట్టణంలోని బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల మైదానానికి మార్పు చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎస్పీ డా.వినీత్ పరిశీలించారు. సభా వేదిక, హెలీప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజల భద్రత, ట్రాపిక్ నియంత్రణ, అత్యవసర సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట డీఎస్పీ లింగయ్య, సీఐ రాంలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్, ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. -
యంత్రాంగం సిద్ధం
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 13 మండలాల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకంతో పాటు ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు పూర్తయింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా జరిగే ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతోంది. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్ బృందాల ఏర్పాటు.. జిల్లాలోని 272 జీపీల్లో జరిగే ఎన్నికల పరిశీలన, ఆకస్మిక తనిఖీల కోసం 26 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 10 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను కలెక్టర్ నియమించారు. ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రెండు చొప్పున ఏర్పాటుచేయగా.. కర్ణాటక సరిహద్దులో వాహనాల తనిఖీలు చేపట్టేందుకు గాను 10 ఎస్ఎస్ బృందాలను ఏర్పాటుచేశారు. అందులో నారాయణపేట, దామరగిద్ద, మాగనూర్, ఊట్కూర్, కృష్ణా మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో తనిఖీల నిమిత్తం ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులను నియమించారు. ఎంసీపీ అధికారులుగా తహసీల్దార్లు.. అన్ని మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేసేందుకు గాను తహసీల్దార్లను ఎంసీసీ అధికారులగా నియమించారు. వీరు గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరును పక్కాగా పర్యవేక్షిస్తారు. దామరగిద్దకు తిరుపతయ్య, ధన్వాడకు సింధూజ, గుండుమాల్కు భాస్కర్గౌడ్, కోస్గికి శ్రీను, కృష్ణాకు శ్రీనివాస్, కొత్తపల్లికి జయరాములు, మక్తల్కు సతీశ్, మరికల్కు రాంకోటి, మాగనూరుకు సురేశ్, మద్దూరుకు మహేశ్గౌడ్, నారాయణపేటకు అమరేందర్ కృష్ణ, నర్వకు మల్లారెడ్డి, ఊట్కూర్కు రవిని నియమించారు. అదే విధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న 77మందిని జోనల్ అధికారులుగా నియమించారు. వీరు తమ పరిధిలోని పోలింగ్ ప్రాంతాన్ని కనీసం రెండుసార్లు సందర్శిస్తారు. పోలింగ్ ప్రక్రియ, ఓటింగ్ శాతంపై సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు వివిధ స్థాయిల్లో అధికారుల నియామకం నిఘా బృందాల ఏర్పాటు కలెక్టర్ దిశానిర్దేశంతో ముందుకు.. -
కాంగిరేసులో రెబెల్స్!
సర్పంచ్ పదవికి ‘హస్తం’లో ఫుల్ గిరాకీ ● తొలి విడతకు సంబంధించి పోటాపోటీగా నామినేషన్లు ● పలు జీపీల్లో ఇప్పటివరకు ఇద్దరు నుంచి ఏడుగురి వరకు దాఖలు ● నేటితో ముగియనున్న గడువు.. పోటీదారులు మరింత పెరిగే అవకాశం ● వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో జటిలంగా మారిన వర్గ పోరు ● రాజుకుంటున్న పాత, కొత్త పంచాయితీ.. తలపట్టుకుంటున్న ముఖ్య నేతలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పల్లెపోరు రసవత్తరంగా మారింది. పార్టీ గుర్తులతో జరిగేవి కాకున్నా.. గ్రామాల్లో పట్టు సాధించాలనే లక్ష్యంతో ప్రధాన పార్టీలు తగిన ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే పలు గ్రామ పంచాయతీల్లో రెబల్స్ బెడద అధికార పార్టీ కాంగ్రెస్ను వేధిస్తోంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం రెండోరోజుకు చేరుకోగా.. ఒక్క చోట సర్పంచ్ పదవికి ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు ‘హస్తం’ కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల గడువు శనివారంతో ముగియనుండగా.. ఆయా ప్రాంతాల్లో పోటీదారులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతల్లో గుబులు నెలకొన్నట్లు తెలుస్తోంది. మారిన అధికారం.. ఉప ఎన్నిక గెలుపుతో.. 2019 పంచాయతీ ఎన్నికల సమయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే (కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేని కలుపుకొని) ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక జీపీలను కై వసం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. పరిస్థితుల ప్రభావంతో చాలా ఏళ్లుగా గ్రామస్థాయిలో పదవులకు దూరంగా ఉండి రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ బరిలో నిలిచేందుకు వెనుకాడేది లేదని సంకేతాలిస్తూనే.. నామినేషన్లు దాఖలు చేస్తున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. బుజ్జగింపులు.. బేరసారాలు కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు గ్రామ పంచాయతీల వారీగా కసరత్తు చేశారు. ఈ క్రమంలో పలు జీపీల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవంపై దృష్టి పెట్టి.. అందుకనుగుణంగా కార్యాచరణ చేపట్టినట్లు సమాచారం. దీంతోపాటు ఆశావహుల చరిష్మా, గ్రామానికి, పార్టీకి చేసిన సేవలతో పాటు ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని గెలుపొందే అభ్యర్థుల చిట్టా తయారు చేసినట్లు వినికిడి. అయితే పలు జీపీల్లో అనుకున్నదాని కంటే పార్టీ ఆశావహులు పోటీపడుతుండడం నేతలకు తలనొప్పిగా మారింది. ఏదేమైనా రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకునేలా.. ఆయా గ్రామాల్లో రాజుకుంటున్న కొత్త, పాత పంచాయితీతో నష్టం వాటిల్లకుండా తగిన చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆశావహులు ఎక్కువ ఉన్న పలు గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇప్పటికే బుజ్జగింపులతో పాటు బేరసారాలు నడుస్తున్నట్ల్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
మందకొడిగా నామినేషన్లు
భూమి కబ్జా చేశారని.. కోర్టు ఆదేశించినా.. తమ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ కుటుంబం పెట్రోల్ సీసాతో నిరసన తెలిపింది. ● రెండో రోజు సర్పంచ్కు 57, వార్డు స్థానాలకు 114 దాఖలు వాతావరణం అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. రాత్రిళ్లు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మంచు కురుస్తుంది.–8లో uమద్దూరు: జిల్లాలోని మద్దూరు, కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాల్లో రెండో రోజు శుక్రవారం కూడా నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. మొదటి విడతగా ఎన్నికలు నిర్వహిస్తున్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 67 సర్పంచ్, 572 వార్డు స్థానాలకు గాను రెండో రోజు సర్పంచ్కు 57, వార్డు స్థానాలకు 114 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేడే చివరి రోజు.. గ్రామపంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అధికంగా ఉండటంతో.. వారిని బుజ్జగించే పనిలో రాజకీయ పార్టీల నాయకులు పడ్డారు. దీంతోనే గురు, శుక్రవారాల్లో నామినేషన్లు ఊపందుకోలేదని తెలుస్తోంది. చాలా గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆయా పార్టీల మద్దతుదారులకు రెబల్ బెడదను తప్పించడానికి గ్రామ పెద్దల సమక్షంలో మంతనాలు, బుజ్జగింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన శనివారం నామినేషన్లు పెద్దఎత్తున దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ● మద్దూరు మండలం దోరేపల్లి పంచాయతీలో నామినేషన్ల ప్రక్రియను డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ ఫణిరాజ్ పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్ఓలకు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు పునరావాసం కల్పించాలి
నారాయణపేట: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్తో కలిసి ‘మాతృత్వం ఒక వరం – అందుకు దత్తత మరో మార్గం‘ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం నవంబర్ను దత్తత తీసుకునే నెలగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. చట్టప్రకారం పిల్లలను దత్తత తీసుకునే విధానంపై అందరికీ సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పుట్టిన తర్వాత వద్దు అనుకునే వారు మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంస్థాగత పునరావాసం అనే థీమ్తో ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడంతో పాటు దత్తతపై ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించాలని వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.జయచంద్రమోహన్, డీసీపీ కరిష్మా, ఆరోగ్యశాఖ అధికారి బిక్షపతి పాల్గొన్నారు. -
నామినేషన్లు షురూ
నారాయణపేట/కోస్గి/మద్దూరు: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కీలక ఘట్టం ప్రారంభమైంది. మొదటి విడతగా డిసెంబర్ 11న జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి చేపట్టారు. కోస్గి, మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలో 67 సర్పంచ్, 572 వార్డు స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 69, వార్డులకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. కోస్గి మండలంలో 14 జీపీలకు గాను 5 క్లస్టర్లు ఏర్పాటుచేయగా.. మొదటి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే దాఖలయ్యాయి. చెన్నారం, నాచారం, పీసీ తండా పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోనూ పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదు. జి ల్లావ్యాప్తంగా నామినేషన్ల పర్వం సాఫీగా సాగింది. పటిష్ట బందోబస్తు.. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తపల్లి, గుండు మాల్, మద్దూర్, కోస్గి మండలాల్లోని పలు నామినేషన్ కేంద్రాలను సీఐ సైదులు, ఎస్ఐ బాల్రాజ్ సందర్శించి.. పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా భద్రతా చర్యల ను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పల్లెల్లో కోలాహలం.. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు మొదటి విడతగా ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో నామినేషన్ల దాఖలకు అతి తక్కువ సమయం ఉండటంతో అందరితో ముమ్మర చర్చలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి రోజు నామినేషన్ దాఖలుపై పెద్దగా దృష్టిసారించలేదని తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ఊపందుకునే అవకాశం ఉంది. 29వ తేదీ వరకు గడువు అందరి మద్దతు కూడగడుతున్న ఆశావహులు సజావుగా ఎన్నికల ప్రక్రియ.. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎ.సీతాలక్ష్మి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్కు వచ్చిన పరిశీలకురాలికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూంను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లి మండలం నిడ్జింత, మద్దూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసే క్రమంలో కావాల్సిన ధ్రువపత్రాలను సమర్పించడం లాంటి విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని సూచించారు. నామినేషన్ ఫారాలను స్పష్టంగా చూసి.. వాటిలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునే విధంగా సహకరించాలని తెలిపారు. ఆమె వెంట ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, డీవైఎస్ఓ శెట్టి వెంకటేశ్ ఉన్నారు. -
ఇబ్బందులు లేకుండా వరిధాన్యం సేకరణ
నారాయణపేట టౌన్:రైతులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా వరిధాన్యం కొనుగో లు ప్రక్రియ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో మె ప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేర కు ధాన్యం సేకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. నాణ్యతా ప్రమాణాలకులోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయడంలో అలసత్వం వహించొద్దని నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని తెలిపా రు. కమిషనర్ వెంట మెప్మా డీఎంసీ శివకుమార్ తదితరులు ఉన్నారు.


