breaking news
Narayanpet District News
-
ఆదర్శప్రాయుడు వాల్మీకి మహర్షి
నారాయణపేట: వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా ప ట్నాయక్ అన్నారు. రామాయణం రచించిన వాల్మీ కి జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రత్నాకరుడి నుంచి మహర్షి వా ల్మీకిగా ఆయన పరివర్తన, వ్యక్తిగతవృద్ధి, విముక్తిని సూచిస్తుందని, ఆయన రామాయణాన్ని సృష్టించిన గొప్ప రుషి అని కొనియాడారు. వాల్మీకి సంసృత సాహిత్యంలో పేరెన్నికగల కవి అన్నారు. రామాయణాన్ని రాసిన ఆయనను సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్గంగ్వార్, శ్రీను, ఎస్డీ రాజేందర్గౌడ్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖలీల్, డీపీఆర్ఓ రషీద్, సీపీఓ యోగానంద్, వసతి గృహా వార్డెన్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అధికారులను అడిగినా..
నేను నాలుగు నెలల క్రితం ఎకరా భూమిని కొనుగోలు చేసి, తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. కానీ ఇంత వరకు పాసుబుక్కు రాలేదు. ప్రతి రోజు పోస్టుమెన్ను అడిగి తెలుసుకుంటున్నాను. తహసీల్దార్ను అడిగినా సమాధానం రావడం లేదు. ప్రభుత్వ అధికారులు స్పందించి పాసు పుస్తకాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. – గౌస్, మద్దూరు రైతు ఇంటికే వస్తుంది.. నాలుగు నెలల నుంచి భూమి రిజిస్ట్రేషన్, భూదానాలు, విరాసత్, భాగపరిష్కారాలు చేసుకున్న రైతులకు పాసుబుక్కులు రాకపోవడం నిజమే. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే పాసు పుస్తకానికి సంబంధించిన డబ్బులు ఆన్లైన్లోనే చెల్లిస్తారు. పాసుబుక్కు సైతం పట్టదారు నమోదు చేసుకున్న అడ్రస్కే పోస్టులో వస్తుంది. ఎక్కడ జాప్యం జరుగుతుందో ఉన్నతాధికారులతో మాట్లాడి, రైతుల సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – జయరాములు, తహసీల్దార్, కొత్తపల్లి ● -
విజయానికి సృజనాత్మకత తప్పనిసరి
కోస్గి రూరల్: జీవితంలో అవకాశాలు ఎల్లప్పు డు వస్తుంటాయని, వాటిని గుర్తించి క్రమశిక్షణ, నిజాయితీ, సృజానాత్మకతతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టిన డిప్లొమా విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల త్యాగం, గురువుల మార్గదర్శనానికి విద్యార్థుల కృషి తోడైతే లక్ష్యాలు చేరుకుంటారన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, హెచ్ఓడీలు వసంతకుమారి, మీన, వెంకటాద్రి, వెంకట్రెడ్డి, విద్యా ర్థుల తల్లిదండ్రలు తదితరులు ఉన్నారు.మద్దూరు ఘటనపై విచారణ చేయించాలినారాయణపేట రూరల్: మద్దూరు మండలంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల అరాచకాలను భరించలేక ఒక గిరిజన యువకుడు రమేష్ ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించి సమగ్ర విచారణ జరపాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్నాయక్ డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావు నామాజీతో కలిసి మంగళవారం నారాయణపేట ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మద్దూరులో ఇస్లామిక్ వాదులు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకు తాజోద్దీన్, యాసిన్ వ్యాపారం నిర్వహిస్తూ అప్పులు ఇస్తామని ఎరవేస్తూ.. డబ్బులు ఇవ్వకుండానే అప్పు ఇచ్చినట్లు సంతకాలు చేయించుకుని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బంగారు నాణేల పేరుతో నకిలీ ఇచ్చి డబ్బుల దండుకుంటున్నారన్నారు. మతం మారితే రూ.2 లక్షలు ఇస్తామని, పాకిస్థాన్కు ఏజెంట్గా వ్యవహరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇది వరకే రాంచంద్రప్ప వారి ఒత్తిడితో మృతి చెందాడన్నారు. రాంచంద్రప్ప, తాజొద్దీన్ ఫోన్లను సీజ్ చేసి పరిశీలిస్తే వాస్తవాలు బయట పడతాయని సూసైడ్ నోట్లో తెలిపాడన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీగౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.బాధిత కుటుంబానికి పరామర్శమద్దూరు: సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయిన రమేష్నాయక్ కుటుంబాన్ని మంగళవారం బీజేపీ నాయకులు పరామర్శించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బోడమరిగుట్టతండాలో ఆయన తల్లిదండ్రులు తారాబాయి, దమ్లానాయక్ ను కలిసి ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, దౌల్తాబాద్ అధ్యక్షుడు అశోక్, మద్దూర్ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.మన్యంకొండలో వైభవంగా కల్యాణోత్సవంమహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెలా పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ వేడుకను నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన శేషవాహనంలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను మళ్లీ పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే..
అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగులు సమష్టి కృషి అంకితభావంతో పనిచేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియోలో 104 శాతం సాధించి రాష్ట్రంలోనే మహబూబ్నగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలవడం సంతోషంగా ఉంది. దసరా పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. ఆర్టీసీ పట్ల ఆదరణ చూపించిన ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – పి.సంతోష్కుమార్, రీజినల్ మేనేజర్ ● -
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● పాసు పుస్తకాల కోసం తహసీల్దార్కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ● రుణాలు ఇవ్వని బ్యాంకర్లు ● ఇబ్బందులకు గురవుతున్న రైతులు నారాయణపేట: జిల్లాలో చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లో సీఎం నివాసంలో ఆమె సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన సీఎం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, పీసీసీ సభ్యుడు చిట్టెం అభిజయ్రెడ్డి ఉన్నారు. నాలుగు నెలలుగా ఎదురుచూపులుకొత్తపల్లి: కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగు మండలాల పరిధిలో భూ రిజిస్ట్రేషన్లు, విరాసత్లు, భూ దానాలు తదితర విక్రయాలు జరిగినా జూన్ మాసం నుంచి ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు రైతులకు పాసు పుస్తకాలు అందించడంలో జాప్యం చేస్తున్నారు. కోస్గి మండలంలో 810, మద్దూరులో 704, కొత్తపల్లిలో 283, గుండుమాల్ మండలంలో 372మంది రైతులకు పాసుపుస్తకాలు రావాల్సి ఉంది. భూమి హక్కులు ఉన్నా.. భూమిపై సంబంధిత రైతులకు హక్కులు ఉన్నా.. పాసుపుస్తకం లేని కారణంగా వారికి రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపడం లేదు. భూమి రిజిస్టేషన్ చేసుకున్న సమయంలోనే వాటికి సంబంధించిన ప్రొసీడింగ్, తహసీల్దార్ డిజిటల్ సంతకంతో కూడిన పత్రం ఇచ్చి పంపిస్తున్నారు. ఈ పత్రం తీసుకొని ఆయా బ్యాంకుల చుట్టు తిరిగినా రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీకి ‘పండుగే’!
దసరా నేపథ్యంలో మహబూబ్నగర్ రీజియన్కు రూ.33.64 కోట్ల ఆదాయం ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. జీవనోపాధి కోసం పట్టణానికి వెళ్లిన వేలాది కుటుంబాలు పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు చేరుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు నిర్వహించుకొని తిరిగి వెళ్లిపోయారు.ఈక్రమంలో వారికి ఏ ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేక అదనపు సర్వీసులు నడిపింది. ఉత్తమ సర్వీసులతో ప్రయాణికుల మన్ననలు పొందడంతో పాటు.. రూ.కోట్లలో ఆదాయం ఆర్జించింది మహబూబ్నగర్ రీజియన్. ఆక్యుపెన్సీ రేషియోలోనూ రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. – స్టేషన్ మహబూబ్నగర్ దసరా పండుగ రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను నడిపారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు అధిక ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు రూ.33కోట్ల 64లక్షల 90వేల ఆదాయం సమకూరింది. 53,07,651 కిలోమీటర్లు బస్సులు తిరగగా 63,19,755 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. గతేడాది కంటే ఈ ఏడాది బస్సులు 8 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరిగి రూ.4 కోట్ల అధిక ఆదాయాన్ని పొందింది. ఆయా రోజుల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్నగర్ రీజియన్ 104 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల రాఖీ పండుగ రోజుల్లో కూడా మహబూబ్నగర్ రీజియన్లో ఓఆర్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆక్యుపెన్సీ రేషియోలో రాష్ట్రంలోనే మొదటిస్థానం పండుగ రోజుల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేక అదనపు సర్వీసులు 63 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన వైనం -
టన్ను చెరుకుకు రూ.6వేల ధర ఇవ్వాలి
అమరచింత: కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7వేల మద్దతు ధర ఇచ్చినట్లుగానే టన్ను చెరుకుకు రూ.6 వేల మద్దతు ధర ప్రకటించాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. దీంతో పాటు ఈ సంవత్సరం చెరుకు రైతులకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ ఇస్తున్న సబ్సిడీలను వచ్చే ఏడాది కూడా వర్తింపచేయాలని కోరారు. చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం రైతులతో కలిసి ఫ్యాక్టరీ జీఎం వీపీ రామరాజుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫ్యాక్టరీ సిబ్బందితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ సంఘం వినతి మేరకు కృష్ణవేణి చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం గతేడాది నుంచి చెరుకు రైతులకు పంటలపై సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీలను 2026–2027 సీజన్లో కూడా వర్తింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. పెరిగిన ధరల ప్రకారం కంపెనీ ఇస్తున్న బోనస్తో కలిపి టన్ను చెరుకుకు రూ.ఆరు వేల మద్దతు ధరను ఇవ్వాలన్నారు. చెరుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికులను ముందస్తుగా రప్పించి, పంట కోతలు పూర్తి చేసి వెంటనే డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, సబ్సిడీలను వచ్చే సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఫ్యాక్టరీ జీఎం హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు వాసారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, నారాయణ, రాజశేఖర్, చంద్రసేనారెడ్డి, రంగారెడ్డి, శాలిమియా, మహేంద్రచారి, వీరన్న, రవి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి
నారాయణపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీఎస్పీ లింగయ్య పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు అర్జీదారులతో డీఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకోవాలని డీఎస్పీ ఆదేశించారు. ప్రజలకు పోలీసుశాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు భరోసా కల్పించాలని తెలిపారు. సీజేఐపై దాడి హేయనీయం నారాయణపేట టౌన్: దేశంలో మతోన్మాద విద్వేష భావాజాలం పెరగడంతోనే సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ న్యాయవాది దాడికి పాల్పడటం హేయమైన చర్యన్నారు. దేశంలో పతనమవుతున్న సామాజిక విలువలకు ఈ దాడి పరాకాష్టగా మారిందన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. -
గెలుపు గుర్రాల వేట!
● అభ్యర్థుల ఎంపికపై పార్టీల సర్వేలు ● ఆశావహులతో దరఖాస్తుల స్వీకరణ ● పార్టీ నేతలతో సమాలోచనలు ● స్థానిక ఎన్నికలను సవాల్గా తీసుకున్న ప్రధాన పార్టీలు నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పల్లెల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల వేటలో ప్రధాన పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. స్థానిక ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో రిజర్వేషన్లు.. ఆయా సామాజిక వర్గాల బలాబలాలకు అనుగుణంగా గెలుపు గుర్రాల ఎంపికపై పార్టీల నేతలు అందరితో సమాలోచనలు.. వ్యూహరచనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నారాయణపేట కావడం.. మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి నియోజకవర్గం మక్తల్ కావడంతో పాటు స్థానిక ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టిసారించారు. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలో దించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముందుకెళ్తున్నారు. అదే విధంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ దిశానిర్ధేశంతో ఆ పార్టీ నాయకులు కొండయ్య, నాగూరావు నామాజీ, రతంగ్ పాండురెడ్డి, సత్యయాదవ్ సైతం గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా.. రిజర్వేషన్ల ఆధారంగా ఎవరెవరు పోటీలో ఉంటారనే దానిపై ఆశావహుల పేర్లను ఆయా పార్టీల మండల అధ్యక్షులు సేకరించి.. ముఖ్య నేతలతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులకు పంపిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికతో సహా ఓటర్ల వద్దకు ఎలా వెళ్లాలనే అంశాలపై పార్టీల ముఖ్య నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను వీలైనంత త్వరగా ఎంపికచేసే పనిలో ఉన్నారు. అందరి నోట కోస్గి ఎంపీపీ స్థానం మాట.. సీఎం ఇలాకాలోని కోస్గి ఎంపీపీ స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. ఈ మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వీటిల్లో ఎస్సీ మహిళలకు కేటాయించింది ఒక్కటీ లేదు. ఒక్క స్థానాన్ని మాత్రమే ఎస్సీ జనరల్కు కేటాయించారు. అక్కడ మహిళకు బదులు పురుష అభ్యర్థి విజయం సాధిస్తే.. ఎంపీపీ పీఠం ఖాళీగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రిజర్వేషన్లు ప్రకటించే సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే మరో రెండు జనరల్ స్థానాలు చంద్రవాంచ (జనరల్ మహిళ), సర్జఖాన్పేట (జనరల్) స్థానాల్లో సైతం ఎస్సీ మహిళను నిలబెట్టుకోవచ్చని చెప్పడంతో.. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. మిర్జాపూర్, ముశ్రిఫా బీసీ జనరల్, తొగాపూర్ బీసీ మహిళకు రిజర్వు అయ్యాయి. అయితే లేక లేక జనరల్ స్థానం తమకు వస్తే తామేలా వదులుకుంటామంటూ ప్రధాన పార్టీల్లోని ఆశావహులు పేర్కొంటూ.. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని పార్టీ అధిష్టానాలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జల్లెడ.. ప్రఽదానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అభ్యర్థులను సర్వే ప్రాతిపదికన ఎంపిక చేస్తామని చెబుతున్నారు. ముందుగా ఆశావహులతో దరఖాస్తులు స్వీకరించి.. సమగ్ర సర్వే, అందరి సమాలోచనలతో అభ్యర్థులను జల్లెడ పట్టే పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలకే టికెట్లు అనే సంకేతాలు ఇస్తున్నారు. గట్టి పోటీ ఉన్న స్థానాల్లో ఆచితూచి అడుగు వేయక తప్పడం లేదంటూ ఆశావహులకు బహిరంగంగానే చెబుతున్నారు. రిజర్వేషన్లు ఉన్న స్థానాలతో పోలిస్తే జనరల్ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో గెలుపు కోసం తాము పడిన కష్టాన్ని గుర్తుచేస్తూ.. రిజర్వేషన్ తమకు అనుకూలమని, ఈ సారి తమకు తప్పకుండా అవకాశం ఇవ్వాలని కొందరు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తే ఓ పంచాయితీ.. ఇవ్వకపోతే మరో పంచాయితీ వస్తుందంటూ పార్టీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. -
కాంగ్రెస్లోకి మాస్ లీడర్..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపుతో పాటు దూరదృష్టితో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా జిల్లా పరిషత్తో పాటు మండల పరిషత్, పంచాయతీ.. ఆ తర్వాత రానున్న కార్పొరేషన్/మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరులో అత్యధిక ఓటర్లు ఉన్న బీసీ సామాజిక వర్గంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో బీసీల్లో బలమైన వర్గానికి చెందిన ఓ కీలక నేత త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రేపు హైకోర్టులో విచారణ జరగనుండగా.. స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. అయినప్పటికీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటుండడంతో జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర రాజధానిలో మంతనాలు.. బీసీల్లో బలమైన వర్గానికి చెందిన ఆ కీలక నేతకు సీఎం రేవంత్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆ ఇద్దరూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో సదరు నేత బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2020 జూలైలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల లేదా నారాయణపేట నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురుకాగా.. మనస్థాపంతో కారెక్కారు. కానీ ఇప్పటివరకు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. సీఎం రేవంత్రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉండగా.. ఆయన తో టచ్లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన పలువురు ఇటీవల హైదరాబాద్లో సదరు బీసీ నేతతో మంతనాలు జరిపినట్లు ఆయన సామాజిక వర్గంలో ప్రచారం జరుగుతోంది. మిడ్జిల్ మండలం.. లేదంటే.. గతంలో సదరు కీలక నేత జడ్చర్ల నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడం.. బీసీల్లో బలమైన సామాజిక వర్గా నికి చెందిన ఆయనకు మాస్ లీడర్గా గుర్తింపు ఉండడం పార్టీకి కలిసి వస్తుందనే ఆలో చనతో కాంగ్రెస్లోని సీఎం వర్గీయులు పావులు కదిపినట్లు సమాచారం. మహబూబ్నగర్ జిల్లా పరిషత్ పీఠం ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే.. సదరు నేత భార్యకు జిల్లా పరిషత్ పీఠం కట్టబెట్టే ఆలోచనతో ఆ పార్టీ పెద్దలు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు గతంలో జెడ్పీటీసీ సభ్యుడిగా సీఎం రేవంత్రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రా రంభించిన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టు తీర్పు మేరకు రిజర్వేషన్లలో మార్పులు ఏమైనా ఉంటే.. సదరు నేతకే రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి కేటాయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒకే దెబ్బకు 2 పిట్టలు..?! మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు మహబూబ్నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన నాయకులకే నామినేటెడ్ పదవులు దక్కాయని.. జడ్చర్ల సెగ్మెంట్ను విస్మరించారనే ప్రచారం ఆ పార్టీలో జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా పరిషత్ పీఠం తమకే కేటాయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు సదరు నియోజకవర్గ ముఖ్య నేత వ్యవహార శైలి ప్రభుత్వానికి, పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోందని.. కొరకరాని కొయ్యగా మారకముందే ఫుల్స్టాప్ పెట్టాలని భావించిన అధిష్టానం సీఎం నిర్ణయం మేరకు బీసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన సదరు నేత వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. ‘స్థానికం’లో గెలుపే లక్ష్యంగా పావులు దూరదృష్టితో పార్టీ బలోపేతం దిశగా అడుగులు హైదరాబాద్లో కీలక నేతల మంతనాలు మహబూబ్నగర్ జిల్లాలో రసవత్తరంగా రాజకీయాలు -
అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ
దామరగిద్ద: జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ బరిలో నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. సోమవారం దామరగిద్దలో బీజేపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ నాయకులు పోటీ చేసేందుకు సిద్ధం కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు కావలి వెంకటప్ప, సత్యనారాయణ, అబ్దుల్ నబీ, గోపాల్రావు, వెంకటయ్య తదితరులు ఉన్నారు.స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాందామరగిద్ద: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్రామారెడ్డి కోరారు. సోమవా రం మండలంలోని క్యాతన్పల్లిలో నిర్వహించిన పార్టీ ముఖ్యకార్యర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ప్రజల మద్దతుతో స్థానిక సమరానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలన్నారు. అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు కృషిచేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు గోపాల్, అంజిలయ్యగౌడ్ శివకుమార్, అరుణ్, నర్సింహులు, మహేశ్కుమార్గౌడ్, జోషి, రామకృష్ణ, మహమూద్ తదితరులు ఉన్నారు.నేడు ఫుట్బాల్ జట్టు ఎంపికజడ్చర్ల టౌన్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్–19 బాలికల ఫుట్బాల్ జట్టు ఎంపికలను మంగళవారం జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి డా.శారదాబాయి తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్, బోనఫైడ్ జిరాక్స్లతో రావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు మిని స్టేడియంలో రిపోర్టు చేయాలని, ఇతర వివరాలకు 9985375737 నంబర్ను సంప్రదించాలని కోరారు.రేపు ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపికలుమహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ స్టేడియంలో బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 బాలబాలికల కబడ్డీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు నాలుగు ఎలిజిబిలిటి ఫారాలతో ఉదయం 9 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్కు రిపోర్టు చేయాలని ఆమె సూచించారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిఅమరచింత: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం.నాగరాజ్గౌడ్ అన్నారు. మండలంలోని ఈర్లదిన్నె, నాగల్కడ్మూర్, పాంరెడ్డిపల్లె, మస్తీపురం గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించి ఇంటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిర్ణయించేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమని, అక్కడి నుంచి అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, నాయకులు చుక్క ఆశిరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ సాగునీటి సంఘాలు
మరికల్: సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మళ్లీ నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో మిషన్ కాకతీయ అధికారులకు పనిభారం తగ్గడమే కాకుండా.. నీటివనరుల పర్యవేక్షణ మెరుగుపడనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా నీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి. ఆయా చెరువులు, ప్రాజెక్టులను వీరే పర్యవేక్షించే వారు. వాటి పరిధిలో ఏం జరిగినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సత్వర పరిష్కారానికి కృషి చేసేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. చెరువులు, ప్రాజెక్టుల వద్ద ఏ పని జరిగినా అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. ఫలితంగా నీటి వసరుల సమస్యలు గుర్తించడంలో జాప్యం జరిగి నష్టం వాటిల్లుతోంది. అంతే కాకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కాల్వల్లో ఆశించిన స్థాయిలో సాగునీరు రావడం లేదు. అదే సంఘాలు ఉండి ఉంటే.. సభ్యులుగా ఉండే రైతులే అధికారుల సమన్వయంతో ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఉండేది. 2008 నుంచి ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వం.. జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు, అంతకంటే ఎక్కువగా ఉన్న చెరువులు 124 ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా వంద ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలను ఏర్పాటుచేశారు. వాటి పదవీ కాలం 2008తో ముగిసింది. అప్పటి నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా నీటి సంఘాల ఎన్నికల ఊసెత్తలేదు. గత ప్రభుత్వ హయాంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. కానీ నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు తుతూ మాత్రంగా పనులు చేపట్టి చేతులెత్తేశారు. ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సాగునీటి సంఘాల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. గతంలో ఇలా.. ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగానే వంద ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంట పొలాలకు విడుదల చేసుకొని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయ పర్చుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించే వారు. కానీ గత 15ఏళ్ల నుంచి సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించక పోవడంతో చెరువుల నిర్వహణ కొరవడింది. 15 ఏళ్లుగా జరగని ఎన్నికలు నీటివనరులపై కొరవడిన పర్యవేక్షణ చివరి ఆయకట్టుకు సాగునీరందక రైతుల అవస్థలు సత్వర పరిష్కారానికి నోచుకోని సమస్యలు సంఘాల ఏర్పాటుతోనే చెరువుల అభివృద్ధి -
సాగునీరు వృథా కాదు..
నీటి సంఘాలతోనే చెరువులు అభివృద్ధి చెందుతాయి. గతంలో నీటి సంఘాలు ఉండటం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుండా వారి పర్యవేక్షణ కూడా పకడ్బందీగా ఉండేది. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించినా అక్కడక్కడ పనులు నాణ్యతగా జరగలేదు. కాంట్రాక్టర్లపై నీటి సంఘాలు ఉంటే పనులు పూర్తిగా జరిగి ఉండేవి. ఇప్పటికై నా నీటి సంఘాలను ఎన్నుకొని చెరువులను అభివృద్ధిపర్చాలి. – రఘు, రైతు, మరికల్ పర్యవేక్షణ పెరుగుతుంది.. చెరువుల పర్యవేక్షణ కోసం నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గతంలో చెరువుల అభివృద్ధి పనులు నీటి సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు చూసుకునే వారు. ప్రస్తుతం వారు లేకపోవడంతో ఆ బాధ్యతలు మేమే చూస్తున్నాం. ప్రభుత్వం నీటి సంఘాలను ఎన్నుకుంటే తమపై పనిభారం తగ్గుతుంది. – కిరణ్కుమార్, డీఈఈ, ఇరిగేషన్శాఖ ● -
‘కాంగ్రెస్ నేతలకు ఎన్నికల గుబులు’
కోస్గి రూరల్: కాంగ్రెస్ నేతలకు ఎన్నికల గుబులు పట్టుకుందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో కోస్గి, గుండుమాల్ మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్లు, బిల్లు, ఆర్డినెన్స్ ఇలా అన్నీ తెచ్చినా.. కోర్టు అపుతుందంటూ జిమ్మిక్కులు చేస్తున్నాడని అన్నారు. సీఎం అంటూ గెలిపించారని రెండు సంవత్సరాలు గడుస్తున్నా నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం ఇంత వరకు మట్టి కూడా తీయలేదన్నారు. సోదరుడి కమీషన్ల కోసమే డబుల్ రోడ్లు, బ్రిడ్జిలు వేస్తున్నారని ఆరోపించారు. ఓటు వేసి గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకై నా ఇంతవరకు వంద శాతం రుణమాఫీ కాలేదని, రైతు బంధు ఓట్లప్పుడే గుర్తుకు వస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే 46 తండాలను గ్రామపంచాయతీలుగా మార్చామని, రూ.100 కోట్లతో కోస్గి మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని, భారత్మాళాలో భాగంగా భూత్పూర్–చించోలి వరకు డబుల్రోడ్లు వేయించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి వెళ్లి చూయించాలని అన్నారు. రెండు మండలాల్లోని ముఖ్య నాయకులందరు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 8 లోగా ఆభ్యర్థుల జాబితా ఇవ్వాలని కోరారు. రెండు మండలాలకు అధ్యక్షులు లేనందున ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో శ్యాసం రామకృష్ణ, వెంకట్నర్సింలు, జనార్దన్, సాయిలు , కోనేరు సాయిలు, పోశప్ప, ఉసేనప్ప,ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ
నారాయణపేట: పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నింపే విధంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. జిల్లాలో నేరాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ డా.వినీత్ సూ చించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్బీ, డీసీఆర్బీ, ఐటీ కోర్, ఎంటీ, ఆర్ఐ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. ప్రతి విభాగం పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, విధి విధానాలపై సంబంధిత అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. పోలీసు హెడ్ క్వార్టర్స్, కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాలను ఆయన పరిశీలించి.. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా మానిటరింగ్ చేయాలన్నారు. జిల్లాలోని అన్ని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్లో వీక్షించే విధంగా చూడాలని తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని ఎస్పీ సూచించారు. ప్రజా సేవలో క్రమశిక్షణ, పారదర్శకత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భవిష్యత్లో జిల్లా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ రియాజ్ హూల్ హాక్, ఆర్ఐ నర్సింహ, ఎస్ఐలు నరేశ్, సునీత, పురుషోత్తం, సురేశ్ ఉన్నారు.ప్రజావాణి రద్దునారాయణపేట: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని.. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.మొక్కజొన్న క్వింటాల్ రూ.2,067జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,067, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.5,770, వేరుశనగ గరిష్టంగా రూ.5,112, కనిష్టంగా రూ.3,151 చొప్పున పలికాయి.● దేవరకద్ర మార్కెట్ యార్డులో శనివారం జరిగిన టెండర్లలో హంస ధాన్యం ధర క్వింటాల్ రూ.1,719 ఒకే ధర లభించింది. ప్రస్తుతం సీజన్ లేకపోవడంతో కేవలం హంస ధాన్యం మాత్రమే అమ్మకానికి వచ్చింది. మార్కెట్కు వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత శనివారం తిరిగి లావాదేవీలు ప్రారంభించారు.ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ‘చలో హైదరాబాద్’స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల హయ్యర్ పెన్షన్ సమస్యల పరిష్కారానికి సోమవారం హైదరాబాద్లోని భర్కత్పుర పీఎఫ్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు, ఉపాధ్యక్షులు జీబీ పాల్, భగవంతు తెలిపారు. శనివారం స్థానిక ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీఎఫ్ కార్యాలయం నుంచి వచ్చిన డిమాండ్ లేఖలపై అనేక మంది విశ్రాంత ఉద్యోగులు గతేడాది నుంచి హయ్యర్ పెన్షన్ మంజూరుకు రూ.లక్షలు డీడీల రూపంలో చెల్లించినా ఇంత వరకు పెన్షన్ మంజూరు చేయలేదన్నారు. అనేక మంది విశ్రాంత ఉద్యోగులకు ఇంత వరకు డిమాండ్ లేఖలను కూడా పంపలేదని, ఇంకొందరికి హయ్యర్ పెన్షన్ ఏరియర్స్ చెల్లించలేదని ఆరోపించారు. పెన్షనర్ల సమస్యల పట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నారాయణ, నాగాంజనేయులు, అంజన్న, నర్సింహులు, బీహెచ్ కుమార్, సలీం, రియాజొద్దీన్, డేవిడ్, లలితమ్మ, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు ముమ్మరం
నారాయణపేట: రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఈ నెల 23, 27 తేదీల్లో.. సర్పంచ్, వార్డు స్థానాలకు మూడు విడతలుగా ఈ నెల 31, నవంబర్ 4, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జెడ్పీ సీఈఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి నేతృత్వంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ‘ప్రాదేశిక’ ఎన్నికలు ఇలా.. జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీ సీఈఓ మొగులప్ప పర్యవేక్షణలో ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. మొదటి విడతలో కొడంగల్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో జెడ్పీటీసీలు, 27 ఎంపీటీసీ స్థానాలకు, నారాయణపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో జెడ్పీటీసీలు, 55 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో మక్తల్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జెడ్పీటీసీలు, 54 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్రూంల్లోనే కౌంటింగ్.. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్రూంలను ఏర్పాటుచేశారు. అక్క డే నవంబర్ 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు నియోజకవర్గాలకు చెందిన బ్యాలెట్ బాక్సులన్నీ జిల్లా కేంద్రం సమీపంలోని గురుదత్త బీఈడీ కళాశాలలో భద్రపరిచారు. కానీ ఈ సారి ఏ నియోజకవర్గం బ్యాలెట్ బాక్సులను అక్కడే భద్రపరిచి.. కౌంటింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో కొడంగల్ సెగ్మెంట్ లోని కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లో జరిగే జెడ్పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను కోస్గి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాల లో భద్రపరిచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. నారాయణపేట సెగ్మెంట్కు సంబంధించిన బ్యాలె ట్ బాక్సులను యాద్గీర్ రోడ్డులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో భద్రపర్చనున్నారు. మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి బ్యాటెట్ బాక్సులను మక్తల్లోని ఇండోర్ స్టేడియంలో భద్ర పరిచేందుకు అధికారులు ఏర్పాటుచేశారు. ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం నిమగ్నం రెండు విడతల్లో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు మూడు విడతల్లో 272 సర్పంచు, 2,466 వార్డు స్థానాలకు.. నియోజకవర్గ కేంద్రాల్లో స్ట్రాంగ్రూంల ఏర్పాటు -
శోభాయమానంగా..
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్రోడ్డు, అంబేడ్కర్ చౌరస్తా తదితర కాలనీల్లో దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం చేపట్టిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. ఊరేగింపులో మహిళలు, చిన్నారులు నృత్యాలతో సందడి చేశారు. సుభాష్రోడ్డు దుర్గామాత ఊరేగింపులో మహారాష్ట్రకు చెందిన బ్యాండ్ బృందం తమ విన్యాసాలతో అందరినీ ఆకట్టుకున్నారు. – నారాయణపేట -
కష్టపడిన వారికే మొదటి ప్రాధాన్యం
● స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూకీలకంగా వ్యవహరించాలి ● ఉమ్మడి జిల్లా నేతలతో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, పర్ణికారెడ్డి, రాజేశ్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని ప్రజలకు నిజాలు తెలియజేసే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, పార్టీ నాయకుల మధ్య సమన్వయలోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా చూడాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని మంత్రి సూచించారు. -
దసరా సంబురం..!
నారాయణపేట/మక్తల్: జిల్లా వ్యాప్తంగా విజయదశమి వేడుకలను గురువారం ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆయుధపూజ, జమ్మి ఇచ్చి పుచ్చుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటిల్లిపాది ఒక్కచోటకు చేరి పిండివంటల ఘుమఘుమలతో ప్రతి ఇంట్లో పండగ శోభకొట్టొచ్చింది. జిల్లా కేంద్రంలోని బారంబావి దగ్గర ఆర్యసమాజ్, ఆర్ ఎస్ఎస్, భజరంగ్ దళ్, నగర ఉత్సవ సమితి, విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. అలాగే, ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. పట్టణంలోని శ్రీరాఘవేంద్ర స్వామి, శ్రీ బాలాజీ మందిర్, అంబభవానీ, మర్గమ్మ మందిర్, చౌడేశ్వరి, శ్రీ పాండురంగస్వామి, శక్తిపీఠం ఆలయాలతో పాటు పట్టణ శివారులోని ఎక్లాస్పూర్ బాలాజీ, లోకాయపల్లి లక్ష్మమ్మ, కర్ణాటక రాష్ట్రంలోని యానగుంది మాణిక్యగిరిలో కోలువుదీరినా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్య సమాజం మందిరంలో ఆర్య సమాజ్ అధ్యక్షుడు విజయ్కుమార్ సర్వోదేమంత్రి కుమారి నాగమ్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి దేవదత్త సర్వదే పాల్గొని ధ్వజహారణ కార్యక్రమాన్ని బీకేఎస్ రాష్ట్ర జోనల్ కార్యదర్శివెంకోబచే ఓంకార ధ్వజ పతావిష్కరణ చేశారు. ఆ తర్వాత ధ్వజారోహణను బీకేఎస్ నాయకులు వెంకోభకు ఓంకారం జెండాను బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ అందించగా.. పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. జమ్మి కొమ్మలను తీసుకువచ్చి బారంబావి దగ్గర ప్రత్యేక పూజలుచేశారు. ఆ తర్వాత రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతం ఒకరికొకరు జమ్మిని పంచు కుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. షమీ వృక్షానికి ప్రత్యేక పూజలు పట్టణం, మండలంలోని కోటకొండ, కొల్లంపల్లి, జాజాపూర్ తదితర గ్రామాల్లోని వివిధ ఆలయాల్లో కొలువైన జమ్మి వృక్షానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. విజయదశిమిని పురస్కరించుకుని షమీ వృక్షా నికి పూజలు చేసి జమ్మి ఆకులను ఇంటికి తీసుకువెళ్లి సాయంత్రం వేళలో ఒకరికొకరు పం చుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. సకలజనులంతా సుభిక్షంగా ఉండాలి ఏ పండుగైనా సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా ఉండాలని... సకలజనులంతా సుభిక్షంగా ఉండాలని, అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆరోగ్యంగా ఉండేటట్లు రైతు కుటుంబాల్లో ఆర్థికంగా స్వలంబన పుష్కలమైన పంటలు పండాలన్నాని వక్తలు ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని బారంబావి దగ్గరలోని రాంలీలా మైదానం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వక్తలు పాల్గొని హైందవ సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు దసరా విశిష్టతను వివరించారు. ఓంకార నినాదాలతో శ్రీ దయానంద సరస్వతి మార్గ సూత్రాలను పాటించియాగ యజ్ఞాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారి అడుగుజాడల్లో ముందుకు తీసుకుపోయే మార్గాలను వారు సందేశాన్నిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఉత్సవాలు జరుపుకొంటున్నమన్నారు. నాటి కాలంలో చత్రపతి శివాజీ కాలుమోపిన నేల నారాయణపేట అన్నారు. ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్పాండురెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రతంగ్పాండురెడ్డి, ఆర్ఎస్ఎస్, గణేశ్, దసరా ఉత్సవ నాయకులు పాల్గొన్నారు. ఆలయాల్లో, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు మక్తల్లో మంత్రి ఆధ్వర్యంలో అట్టహాసంగా వేడుకలు పేట ఆర్యసమాజ్, వీహెచ్పీ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు రాంలీల మైదానంలో సభ, రావణ దహనం -
మక్తల్లో అంబరాన్నంటిన సంబరాలు..
మక్తల్లో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యసహకార, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా పడమటి ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో, జమ్మిచెట్టు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇదిలాఉండగా, తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారిని భారీ ఏర్పాట్ల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రత్యేక బ్యాండ్ బృందం, వివిధ వేషధారణల కళాకారుల ఆకట్టుకున్నారు. పట్టణంలోని నల్లజానమ్మ ఆలయం నుంచి పాతబజారు, నేతాజీనగర్, వాకిటి వీధి మారుతినగర్, యాదవనగర్, గోపాలస్వామి గుడి మీదుగా రాంలీలా మైదానానికి శోభాయాత్ర చేరుకుంది. అక్కడే మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేశారు. సాయంత్రం మైదానంలో రావణాసురిడి కటౌట్ను బాణాసంచా పేలుళ్ల నడుమ దహనం చేశారు. ఇదిలాఉండగా, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్రెడ్డి సైతం పూజల్లో పాల్గొన్నారు. మక్తల్లోని ఆలయంలో పూజలు చేస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి, కుటుంబసభ్యులు మక్తల్లో వివిధ వేషధారణల్లో కళాకారులు.. -
ఆధ్యాత్మిక ఆనందం.. యాత్ర దానం
నారాయణపేట రూరల్: ప్రతి మనిషికి పుణ్యక్షేత్రాలు సందర్శించాలనేది ఓ కల.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతోమంది పరితపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఇష్టదైవాలను దర్శించుకుని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటారు. అయితే పేదరికం ఎంతోమందికి ఈ కల నెరవేరకుండా అడ్డుపడుతుంది. ఫలితంగా జీవితకాలంలో సైతం తమ ఇష్టదైవాలను దర్శించుకోలేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర మనోవేదనకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో యాత్ర దానం పేరిట దాతల సహకారంతో అనాథలు, పేదలు పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఆర్టీసీకి సైతం ఇది ఒక ఆదాయ వనరుగా మారనుంది. పథకం అమలు ఇలా.. ఎంతోమంది తమ పుట్టినరోజు వేడుకలు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనే వారు డబ్బులను వృథా చేయకుండా పేదలకు యాత్ర దానం కల్పించి ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. ప్రజాప్రతినిధులు, కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరైనా ఆర్టీసీకి విరాళాలు అందిస్తే అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రకు తీసుకువెళ్తారు. ● దాతలు ప్రత్యేకంగా ఏ పుణ్యక్షేత్రానికి, పర్యాటక ప్రాంతానికి యాత్ర దానం చేయాలనుకున్నారో ముందుగా సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్లను సంప్రదించాలి. అధికారులు యాత్రకు సంబంధించిన దూరాన్ని లెక్కించి కిలోమీటర్ల ఆధారంగా డబ్బులు, ఇతర వివరాలు తెలియజేస్తారు. ● యాత్రకు సంబంధించిన ప్యాకేజీ డబ్బులను దాతలు ఒక్కరే భరించవచ్చు. లేదా మిత్రుల భాగస్వామ్యంతోనైనా చెల్లించవచ్చు. అందించిన డబ్బుల ఆధారంగా అధికారులు అవసరమైన బస్సు ఏర్పాటు చేస్తారు. దాత వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లోనూ నమోదు చేయాలి. దాతలు యాత్రకు వెళ్లే వారి పేర్లను సైతం సూచించవచ్చు. లేదా ఆర్టీసీనే నిరుపేదలు, వృద్ధులు, విద్యార్థులను ఎంపిక చేసి తీసుకువెళ్తుంది. డిపో డీఎం సెల్ నంబర్ మహబూబ్నగర్ సుజాత 99592 26286 షాద్నగర్ ఉష 99592 26287 నాగర్కర్నూల్ యాదయ్య 99592 26288 వనపర్తి దేవేందర్గౌడ్ 99592 26289 గద్వాల సునీత 99592 26290 అచ్చంపేట ప్రసాద్ 99592 26291 కల్వకుర్తి సుహాసిని 99592 26292 నారాయణపేట లావణ్య 99592 26293 కొల్లాపూర్ ఉమాశంకర్గౌడ్ 90004 05878 వినూత్న సేవా కార్యక్రమానికి ఆర్టీసీ శ్రీకారం పేదలు, అనాథలు పుణ్యక్షేత్రాల దర్శనానికి అవకాశం దాతలు ముందుకు వస్తే బస్సుల కేటాయింపు విభిన్న మార్గాల్లో సంస్థకూసమకూరనున్న ఆదాయం -
గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం
● నూతన ఎస్పీ డాక్టర్ వినీత్ నారాయణపేట/కృష్ణా: జాతిపిత మహాత్మా గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని నూతన ఎస్పీ వినీత్ అన్నారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎస్పీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటీష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధుడు గాంధీజీ అన్నారు. నేటి యువతరం గాంధీజీ జీవన మార్గాన్ని అనుసరించాలన్నారు. దేశంలో అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉండాలని సంకల్పించిన గొప్ప మానవతావాది గాంధీజీ అని, అలాంటి గొప్ప నాయకుని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని, కష్టపడే తత్వం అలవర్చుకోవాలన్నారు. పోలీసులు ప్రజలకు మంచి సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరసింహ, ఆర్ఎస్ఐ శ్వేత, పోలీసు సిబ్బంది తది తరులు పాల్గొన్నారు. సరిహద్దులో అక్రమ రవాణాను అరికట్టాలి కృష్ణా: సరిహద్దులో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టు వద్ద పటిష్ట నిఘా ఉంచాలని ఎస్పీ వినిత్ ఆదేశించారు. శుక్రవారం సరిహద్దులోని చెక్పోస్టుతోపాటు కృష్ణా పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈమేరకు సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి రోజు వాహనాలను తనిఖీ చేయడంతో పాటూ అక్రమ రవాణా, నిషేధిత పదార్థాల సరఫరా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. మక్తల్ సీఐ రాంలాల్,ఎస్ఐ ఎండీ నవీద్,ఏఎస్ఐ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీగా బాధ్యతల స్వీకరణ జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ వినీత్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమేరకు ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఇదివరకు కొత్తగూడెం ఎస్పీగా, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వర్తించి బదిలీపై నారాయణపేట జిల్లా ఎస్పీగా వచ్చారు. 2017 (బ్యాచ్) సంవత్సరంలో ఎస్పీగా నియమితులయ్యారు. డీఎస్పి నల్లపు లింగయ్య జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీకి పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, కొండల్రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు. స్వగ్రామంలో సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రజలు భారీగా తరలివచ్చిన అభిమానులు -
జమ్మిని బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి
నారాయణపేట: జమ్మి ఆకును బంగారంగా స్వీకరించే గొప్ప సంస్కృతి మనదని, పాలపిట్ట, జమ్మి చెట్టును రాష్ట్ర చిహ్నాలుగా గుర్తించిన ఘనత రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ప్రజలందరికీ అన్నారు. గురువారం కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్లో విజయదశమి పర్వదినం సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకును బంగారంగా నియోజకవర్గ ప్రజలకు స్వీకరించి.. అందరిలో చెడు తొలిగి మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో తగ్గిన నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో శుక్రవారం సముద్ర మట్టానికిపైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయానికి జూరాల ఎడమ కాల్వ నుంచి 730 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 50 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు. నియోజకవర్గ ఏర్పాటుకు సహకరించండి అమరచింత: కోల్పోయిన అమరచింత నియోజకవర్గాన్ని తిరిగి సాధించుకునేందుకు తోడ్పాటునందించాని నియోజకవర్గ సాధన సమితి సభ్యులు బీజేపీ పంజాబ్, చండీఘడ్ రాష్ట్రాల సంస్థగత కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ను కోరారు. దసరా పండుగకు స్వగ్రామం అమరచింతకు వచ్చిన మంత్రి శ్రీనివాస్ను గురువారం వారు కలిసి మాట్లాడారు. అమరచింత నియోజకవర్గ ఏర్పాటుకుగాను అన్ని రాజకీయ పార్టీల నేతల మద్దతుతో ముందుకెళ్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాకు మంజైరైన కేంద్రీయ విద్యాలయాన్ని అమరచింతలో ఏర్పాటు చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక పంపిస్తే కేంద్ర మానవ వనరులశాఖ మంత్రిని కలిసి విద్యాలయం ఏర్పాటుకు తనవంతు ప్రయ త్నం చేస్తానని కేశం నాగరాజ్గౌడ్కు సూ చించారు. నియోజకవర్గ సాధనలో పట్టణ పౌరుడిగా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
రైతు సమస్యల పరిష్కారానికి కృషి
కృష్ణా: సన్న రకం ధాన్యానికి అందించే బోనస్ అంశం ఒక్క కృష్ణా, మాగనూర్ మండలంలోనే కాదు ఇది రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సమస్య అని, ఈ విషయంపై శనివారం జరగబోయే క్యాబినెట్ సమావేశంలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ త్వరగా అందించాలని శుక్రవారం మంత్రిని ఆయన స్వగృహంలో రైతులు కలిసి విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఉమ్మడి మాగనూర్,కృష్ణా మండలాలకు చెందిన రైతులు గురువారం దసరా రోజు టైరోడ్డులో సమావేశమై.. తమ సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించారు. ఈ విషయంపై శుక్రవారం రైతులు మంత్రిని కలిశారు. ఈమేరకు మంత్రి మాట్లాడుతూ.. రైతులు ఇలా సమావేశం కావడం, సమస్యలపై ప్రశ్నించడం రైతుల్లో వచ్చిన ఈ చైతన్యం, మార్పు అభినందనీయమన్నారు. ఇక మీదట ప్రతి నెల మార్కెట్ చైర్మన్ అధ్యక్షతనలో మక్తల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ అధికారులు, మక్తల్, మాగనూర్,కృష్ణా మండలాలకు చెందిన రైతులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించబోతున్నామని అన్నారు. రైతుల సమస్యలు ఏవైన అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. త్వరలోనే కృష్ణా మండలంలోని భీమా నదిపై చెక్డ్యాంలు నిర్మిస్తామని, అలాగే ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేయిస్తానని అన్నారు. అనంతరం మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, రాజప్పగౌడ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కొంకల్ వెంకటేష్, నాగేశ్వర్రావ్, చెవిటోళ్ల వెంకటేష్,మురహర్దోడ్డి శ్రీను,శంక్రప్ప పాల్గొన్నారు. -
బతుకమ్మ సంబురం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్తో పాటు జిల్లా యంత్రాంగం రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒకచోట చేర్చి గౌరీమాతను స్తుతిస్తూ ప్రదక్షిణలు చేస్తూ మహిళలు ఆలపించిన పాటలు బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. అధికారులు, సిబ్బంది తేడా లేకుండా మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని వేడుకకు వన్నెలద్దారు. గౌరీమాతకు కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. దాండియా, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో సందడి వాతావరణం కనిపించింది. వేడుకలను విజయవంతం చేసిన మహిళలకు జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. – నారాయణపేట -
పకడ్బందీగా స్థానిక సంస్థల ఎన్నికలు
● ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్కుమార్తో కలిసి నోడల్ అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తగా, సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగదు, మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని, నగదు, వస్తువులను సీజ్ చేసిన సమయంలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. చెక్పోస్టుల్లో వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. నోడల్ అధికారులు ప్రతిరోజు నివేదికలను నిర్ణీత ఫార్మాట్లో సమర్పిచాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని.. ప్రకటన విడుదలైన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నియమావళిలోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని, పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని, అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి విభాగానికి నోడల్ అధికారులను నియమించామని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. శాంతియుత, స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్డీసీ రాజేందర్గౌడ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, జెడ్పీ సీఈఓ మొగులప్ప, సీపీఓ యోగానంద్, నోడల్ అధికారులు ఎంఏ రషీద్, రహమాన్, వెంకటేష్, సైదులు పాల్గొన్నారు. -
ఐక్యతతోనే దేశం సురక్షితం
కోస్గి: హిందువుల ఐకమత్యంతోనే దేశం సురక్షితంగా ఉంటుందని హిందూవాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రాంలీలా మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత వసంత విజయదశమి ఉత్సవాలను కోస్గి మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలని, వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలని, స్వదేశీ వస్తువులను వినియోగించాలని సూచించారు. దేశంలోని రుగ్మతలను పారద్రోలి పంచభూతాలను కాపాడాలని, హిందువుల ఐక్యతతో రామమందిర నిర్మాణం జరిగిందని, కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయిందని గుర్తు చేశారు. సేవ, అంకితభావం, వ్యవస్థీకరణ, సాటిలేని క్రమశిక్షణ ఆర్ఎస్ఎస్తోనే సాధ్యమన్నారు. అంతకుముందు పట్టణంలోని వివేకానందకాలనీ నుంచి పురవీధుల్లో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ ప్రముఖ్ నాగరాజు, సహ ఉత్సవ ప్రముఖ్ భరత్గౌడ్, విశ్వహిందూ పరిషత్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు.. మద్దూరు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా జరుపుకొన్నారు. ముఖ్యఅతిథిగా హిందూవాహిని రాష్ట్ర సంఘటన మంత్రి యాదిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి నేటికి వందేళ్లు పూర్తి చేసుకుందని.. క్రమశిక్షణ, సేవ, అంకితభావం, వ్యవస్థీకరణ సంఘానికే సాధ్యమని పేర్కొన్నారు. దేశం కోసం ఎలాంటి సమయంలోనైనా స్వయం సేవకులు పనిచేస్తారని తెలిపారు. కటకం కృష్ణయ్య, సూర్యప్రకాశ్, సత్యనారాయణడ్డి, విజయ్, ప్రశాంత్, రఘు తదితరులతో పాటు 57 మంది సంపూర్ణ గణవేశ్లు పాల్గొన్నారు. -
1,259 ఎకరాలవరిపంటకు నష్టం
కృష్ణా: కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లో వరదల కారణంగా మండలంలో 1,259 ఎకరాల వరిపంటకు నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్ తెలిపారు. మంగళవారం మండల వ్యవసాయ అధికారి సుదర్శన్గౌడ్, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంటలను పరిశీలించి మాట్లాడారు. మండలంలో వరితో పాటు పత్తి పంట కూడా దెబ్బతిందని.. రెండు పంటల నష్టం వివరాల పూర్తి నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. అన్ని గ్రామాల్లో ఇప్పటికే తమ సిబ్బంది పర్యటించి వివరాలు నమోదు చేసినట్లు తెలిపారు. ‘మద్దూరు ఘటనపైవిచారణ చేపట్టాలి’ నారాయణపేట రూరల్: మద్దూరు మండలంలో ఓ వర్గం అరాచకాలకు గిరిజన యువకుడు ఆత్మహత్య చేసుకొని సూసైడ్ నోట్ రాశారని.. పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావునామాజీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ప్రధానకార్యదర్శి లక్ష్మీగౌడ్, మాజీ ఉపాధ్యక్షుడు మదన్, చంద్రశేఖర్రెడ్డితో కలిసి మాట్లాడారు. ఆ వర్గ వ్యాపారులు అప్పులు ఇస్తామని అమాయకులను వలలో వేసుకొని ఇవ్వకుండానే సంతకాలు చేయించుకుని డబ్బుల కోసం వేధిస్తున్నారన్నారు. ఇదివరకు రామచంద్రప్ప వత్తిడితో మృతి చెందాడని పేర్కొన్నారు. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న ఇలాంటి దారుణాలను పోలీసులు అరికట్టాలని కోరారు. షోకాజ్ నోటీసు నారాయణపేట: జిల్లాలో నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీల జాబితాలో ఉన్న ఇండియన్ రక్షక నాయకుడు పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనందున తగిన నిరూపణకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 8లోగా ఆ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు హాజరై వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. మద్యం టెండర్ల ‘ఖాతా’ ప్రారంభం మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 227 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా మంగళవారం నాగర్కర్నూల్ ఈఎస్ పరిధిలో మూడు టెండర్లు దాఖలయ్యాయి. నాగర్కర్నూల్లో సర్కిల్ పరిధిలో ఉన్న రెండు దుకాణాలకు, కల్వకుర్తిలో ఒక దుకాణానికి టెండర్లు వచ్చాయి. అయితే ఈనెల 26 నుంచి ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటి వరకు మూడు మాత్రమే వచ్చాయి. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో ఇంకా ఖాతా ఒపెన్ కాలేదు. ఈనెల 18 వరకు టెండర్ల స్వీకరణకు గడువు ఉన్న క్రమంలో మద్యం వ్యాపారులు ఆలస్యం చేస్తున్నారు. చివరి వారం రోజుల్లో టెండర్ల వేగం పుంజుకుంటుంది. రెండేళ్ల కాలపరిమితిలో వచ్చే మద్యం వ్యాపారులకు స్థానిక ఎన్నికలతో పాటు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నాయి. దీంతో గతం కంటే ఈసారి టెండర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
అయ్యో.. అయ్యయ్యో!
‘స్థానిక’ రిజర్వేషన్లలో పంచాయితీ ● ఎస్టీలు లేని చోట ఎస్టీకి.. ఎస్సీలు లేని చోట ఎస్సీకి.. ● పలు గ్రామాల్లో కిరికిరి.. కొన్ని చోట్ల అనివార్యంగా పదవులు ● నాగర్కర్నూల్ జిల్లాలో ఆ 4 గ్రామాల్లో ‘ప్రత్యేక’ పరిస్థితి ● ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానాలు ఆ వర్గానికే రిజర్వ్డ్ ● 2019లో జరగని ఎన్నికలు.. ఈ సారీ స్వయం పాలనకు దూరమేనా..? ఎస్సీలు లేని చోట ఎస్సీలకు.. ఎస్టీలు లేని చోట ఎస్టీలకు.. ఇలా ‘స్థానిక’ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు పదవులకు కేటాయించిన రిజర్వేషన్లలో ఆ వర్గానికి చెందిన ఓటర్లే లేకపోవడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు కొన్ని పల్లెల్లో ఒకరు, ఒకట్రెండు కుటుంబాలు ఉన్న సామాజిక వర్గాలకు అనివార్యంగా పదవులు దక్కనున్నాయి. ఇదేక్రమంలో ఎన్నో ఆశలతో బరిలో నిలిచేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వివిధ పార్టీల్లోని ముఖ్య నేతల అనుచరులకు భంగపాటే ఎదురైంది. తారుమారైన రిజర్వేషన్లు దేవరకద్రతో పాటు అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నాయకుల ఆశలపై నీళ్లు చల్లగా.. వారిలో నైరాశ్యం అలుముకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ -
బీజేపీ విధానాలతోనే సాగు సంక్షోభం
● ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్ నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో దేశంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని ఏఐయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ప్రభాకర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఆగస్టు 15న ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జండా ఎగురవేస్తూ తానెప్పుడూ రైతుల వైపే ఉంటానని మాట ఇచ్చి మరుసటి రోజే పత్తిపై ఉన్న 11 శాతం సుంకాన్ని ఎత్తివేశారన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత్లో పర్యటించి వెళ్లిన పది రోజుల తర్వాత వంటనూనెలపై పది శాతం ఉన్న సుంకాన్ని మోదీ ఎత్తివేశారని తెలిపారు. అమెరికాకు తలొగ్గి అన్ని వస్తువులపై సుంకం ఎత్తివేస్తే ఇక్కడి మిల్లర్లు అమెరికా పత్తి, వంటనూనెలను దిగుమతి చేసుకోవడంతో రైతులు చాలా నష్టపోతారని వివరించారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఎలా తిప్పికొట్టామో ఇప్పుడు సుంకం ఎత్తివేతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మోదీని, ఆయన విధానాలను వ్యతిరేకిస్తూ ఎస్కేఎం ఆధ్వర్యంలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రాము, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, కార్మిక, ప్రజా, రైతు సంఘాల నాయకులు భగవంతు, అంజలయ్య. యాదగిరి, గోపాల్, కాశీనాథ్, ఆంజనేయులు, సలీం, ప్రశాంత్, కిరణ్, బలరాం, రాము, మహేశ్గౌడ్ తదిరతరులు పాల్గొన్నారు. -
‘పేట’లో చాలా నేర్చుకున్నా
● ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట: ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వసాధారణమని.. ఎక్కడ, ఎలాంటి విధులు నిర్వర్తించినా కష్టపడి పని చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లాలో సుమారు రెండేళ్లపాటు ఎస్పీగా పని చేసిన యోగేష్ గౌతమ్ బదిలీపై రాజేంద్రనగర్కు వెళ్తున్నందున మంగళవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బదిలీ సన్మాన సభ నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్, అదనపు ఎస్పీ రియాజ్, డీఎస్పీ నల్లపు లింగయ్య, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని శాలువా, పూలమాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు యోగేష్ గౌతమ్ చాలా తోడ్పాటునందించారని, పోలీసుల సంక్షేమానికి ప్రతి అంశాన్ని చర్చించడంతో పాటు అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుపై చర్చించేవారని వివరించారు. జిల్లాకు సేవలందించి బదిలీపై వెళ్తున్నందున అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ విధులు నిర్వర్తించినా ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైందని, జిల్లా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. జిల్లాలో విధులు నిర్వర్తించడంతో ప్రజలతో అవినాభావ సంబంధం ఏర్పడిందని వివరించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అధునాతన పోలీస్స్టేషన్లు, ఎస్పీ కార్యాలయంలో అదనపు గదులు, ట్రాఫిక్ సిగ్నల్స్, భరోసా కేంద్రం, వెహికల్స్ వాషింగ్ మెషీన్, డా గ్స్కు గదులు నిర్మించామన్నారు. సీఐలు శివశంకర్, రాంలాల్, రాజేందర్రెడ్డి, సైదులు పాల్గొన్నారు. -
నదీ పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటాం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కృష్ణా: వరదల కారణంగా కృష్ణా, భీమానది పరీవాహక ప్రాంతాల్లోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లిందని.. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వాసూనగర్, తంగిడి, కుసుమర్తి, సూకూర్ లింగంపల్లిలో పర్యటించి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందొద్దని, నష్టపోయిన రైతులను తాము అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఇప్పటికే అధిక వర్షాలతో పత్తి రైతులకు నష్టం వాటిల్లిందని, ఇప్పుడు వరదలతో వరి పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రెవెన్యూ అధికారులు పంటనష్టంతో పాటు ఇతరాత్ర నష్టం వివరాలను పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. తంగిడి, కుసుమర్తిలో తాగునీటి అవసరాలకు చేతిపంపులు మంజూరు చేశారు. కృష్ణాలో రోడ్డు నిర్మాణ పనులను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. నాయకులు సంతోష్ పాటిల్, సర్ఫరాజ్ఖాన్, విజప్పగౌడ, వీరేంద్రపాటిల్, నాగప్ప, మహదేవ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు. -
మోగిన నగారా..
● 2 విడతల్లో ప్రాదేశిక.. 3 దఫాల్లో పంచాయతీ సమరం ● అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ ● ఉమ్మడి జిల్లాలో 77 జెడ్పీటీసీ.. 800 ఎంపీటీసీ స్థానాలు ● 1,678 గ్రామ పంచాయతీలు.. 15,068 వార్డులకు ఎన్నికలు ● గ్రామాల్లో రాజకీయ సందడి మొదలు..గెలుపే లక్ష్యంగా పార్టీల కసరత్తు ఆశావహుల జోరు.. నేతల బేజారు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ సందడి మొదలైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఆ వర్గానికి చెందిన నాయకులు ఉత్సాహంలో ఉన్నారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన మండలాలు, గ్రామాల్లోని మిగతా వర్గాలకు సంబంధించిన ఆశావహులు ఎక్కువ సంఖ్యలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వారికి సర్దిచెప్పలేక ముఖ్య నేతలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో రిజర్వేషన్ల తారుమారుతో భంగపడిన ఆశావహులది మరో సమస్యగా మారినట్లు తెలుస్తోంది. చాలా మండలాల్లో పాత, కొత్త నాయకుల పంచాయితీలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్లో ఈ పరిస్థితి నెలకొనగా.. ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు గ్రామాల్లో విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది. పల్లె పోరుకు సై.. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
మక్తల్: తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య సహకార, పాడిపరిశ్రమల, క్రీడా శాఖమంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రాంలీలా మైదానంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా.. మంత్రితోపాటు ఆయన సతీమణి వాకిటి లలిత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల మహిళలు బతుకమ్మలతో రాంలీలా మైదానానికి చేరుకున్నారు. మంత్రి సతీమణి సైతం బతుకమ్మతో అక్కడికి వచ్చి మంత్రితో కలిసి బతుకమ్మలకు పూజలు చేశారు. బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అందరు ఐక్యత, అటపాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో అనందంగా ఉందని అన్నారు. రాష్ట వ్యాప్తంగా తొమ్మిదిరోజులపాటు బతుకమ్మ పూజలు చేస్తారని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఓ పక్క భారీ వర్షం కురుస్తున్న బతుకమ్మలతో రావడంపై మహిళలను అభినందించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, రాదమ్మ, గణేష్కుమార్, రవికుమార్, రాజేందర్, గోవర్ధన్, కట్ట వెంకటేస్, కట్ట సురేష్ పాల్గొన్నారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం కృష్ణా: మండలంలోని కృష్ణా, భీమా నదులు ఉప్పొంగడంతో నదీతీర ప్రాంతాల్లోని వరి పంటల్లోకి నీరు చేరి తీవ్ర నష్టం వాటిల్లగా.. విషయం తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం తంగిడిలో సంఘమక్షేత్రాన్ని పరిశీలించారు.అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి దిగువకు అత్యధికంగా 5.60 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో ఈ ప్రాంతంలోని రైతుల పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోందని, పంటలు నీటమునిగాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండడంతోపాటు వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. వరద విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎరుపెక్కిన తెల్లబంగారం
ఈ చిత్రంలో ఎరుపెక్కిన పత్తిపంట చూపుతున్న రైతు పేరు విజయ్. పల్లెగడ్డకు చెందిన ఈయన 5 ఎకరాల్లో పత్తి సాగు చేయగా వర్షాలకు దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. వర్షాల కారణంగా పొలంలో నీటిశాతం అధికం కావడంతో ఒక్కసారి కూడా పత్తితీయక ముందే పంటకు ఎరుపు తెగుళ్లు సోకింది. ఎకరాకు రూ.30వేల పెట్టుబడి పెడితే మూడు క్వింటాళ్ల పత్తి వచ్చే పరిస్థితి లేదని రైతు వాపోతున్నాడు. ఇప్పటి వరకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టాడు. మార్కెట్లో క్వింటాల్ పత్తికి కేవలం రూ.5వేల నుంచి రూ.6 వేల మధ్య ఉంది. కానీ రూ.లక్ష వరకు కూడా ఆదాయం రాని పరిస్థితి ఉందని బాధిత రైతు ఆవేదన చెందుతున్నాడు. మరికల్: జిల్లాలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు పత్తి పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. నేల తడి ఆరకముందే వానలు కురుస్తుండటం ఎండలు లేక మబ్బులు ఆవరిస్తుండటంతో పూత రాలిపోతోంది. ఆకులు ఎర్రబారుతున్నాయి. కాయలు నల్లగా మారి రాలిపోతున్నాయి. పచ్చని ఆకులు, తెల్లని పత్తితో కళకళలాడాల్సిన పొలాలు పూత, కాత లేకుండా ఎండిపోయి కనిపిస్తుండటంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు పచ్చగా ఉన్న పంట రైతుల కళ్లెదుటే పత్తి పంట అమాంతం ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముసురు వర్షాలతో పొలాల్లోనే గింజలకు మొలకలు వస్తున్నాయి. పంట చేతికి వచ్చే తరుణంలో మొలకలు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో 1.68 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి సాగు చేస్తారు. జిల్లాలో ఈ ఏడాది 1.68 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మొదట కురిసిన వర్షాలకు మొక్కలు ఏపుగా పెరిగాయి. పూత, కాయ బాగుండడంతో ఆశించిన దిగుబడి వస్తుందని రైతులు ఆనంద పడ్డారు. వరుసగా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను నిండా ముంచాయి. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జిల్లాలో భిన్నమైన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది సాగు చేసిన పత్తిలో ఎకరానికి కనీసం రెండు నుంచి మూడు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. ఎకరాకు మూడు క్వింటాళ్లే.. రోజుల తరబడి కురుస్తున్న ముసురు వర్షాలతో పంటలకు సూర్యరశ్మి తగలక పత్తి మొక్కల్లో నీటిశాతం పెరిగి వాడిపోతున్నాయి. ఎండల్లేక కాయలు పగలటం లేదు. దీనికితోడు పొలాలు బురదగా మారడంతో కూలీలు పత్తితీత పనులకు రావడంలేదు. తడిసిన పత్తి నల్లగా మారుతుండటంతో మద్దతు ధర దక్కడం కష్టంగా మారింది. పోషకాలు అందక ఆకులు పసుపు ఎరుపు రంగుల్లోకి మారి ఎండిపోతున్నాయి. ఒక్కో రైతు మూడు నుంచి ఐదుసార్లు పత్తి ఏరుతుంటారు. కానీ, పూత లేకపోవటంతో ఒక్కసారికే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఎకరాకు పది క్వింటాళ్లు వచ్చే దిగుబడి ఇప్పుడు మూడు, నాలుగు క్వింటాళ్లకే పరిమితమవుతోందని రైతులు వాపోతున్నారు. నీటి శాతం పెరగడం వల్లే తెగుళ్లు అధిక వర్షాల వల్ల పంట వేర్లకు పోషకాలు అందక పత్తి కాయలు నల్లగా, ఆకులు ఎర్రగా మారి చివరకు చెట్టు ఎండిపోతుంది. దీంతో పంట దిగుబడులు కూడా తగ్గాయి. పంటకు పైన పిచికారీతో పోషకాలు అందించాలి. 3 గ్రాముల ఫంగీసైస్ కాఫర్ ఆక్సీక్లోరైడ్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి 5 గ్రాముల యూరియా లేదా 15.15.15, లేదా 19.19.19 చల్లాలి. అప్పుడు పంటలో తెగుళ్ల శాతం తగ్గే అవకాశం ఉంది. – జాన్సుధాకర్, ఏడీఏ ఎడతెరిపి లేని వర్షాలతోపత్తి పంటకు తెగుళ్ల బెడద తడిఆరని పొలం.. అమాంతం పడిపోయిన దిగుబడి పెట్టుబడి ఆశలు సైతం ఆవిరి -
మూడు దశల్లో ‘పంచాయతీ’
గ్రామ పంచాయతీకి సంబంధించి తొలి విడతలో అక్టోబర్ 17 నుంచి 31 వరకు 16 మండలాల పరిధిలోని 410 జీపీలతోపాటు 3,514 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు 28 మండలాల్లోని 611 జీపీలతోపాటు 5,546 వార్డులకు.. చివరి దశలో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు 33 మండలాల పరిధిలోని 657 జీపీలతోపాటు 6,008 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో మాత్రం తొలి విడతలో పోలింగ్ నిర్వహించడం లేదు. రెండు, మూడో విడతల్లోనే ఆ రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడుతారు. కాగా.. పంచాయతీ ఎన్నికలకు గాను 2,363 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. -
విధుల్లో మినహాయింపు ఇవ్వాలి
నారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఇబ్బంది ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని పీఆర్టీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్కు వినతిపత్రం అందించారు. సోమవారం ఆమె ఛాంబర్లో కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వివరించారు. గర్భిణులు, చంటి పిల్లలు ఉన్నవారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బందులు పడుతున్న టీచర్లు, ఆరు నెలల్లో పదవీ విరమణ పొందే ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు కేటాయించకుండా చూడాలని కోరారు. శిక్షణ సైతం దసరా పండుగ తర్వాత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, రఘువీర్ పాల్గొన్నారు. పంట కొనుగోలుకు కపాస్ కిసాన్ యాప్ మహబూబ్నగర్ (వ్యవసాయం): రైతులు పండించిన పంట కొనుగోలు కోసం ప్రభుత్వం కొత్తగా కపాస్ కిసాన్ యాప్ తీసుకువచ్చిందని మార్కెటింగ్ శాఖ రీజినల్ డైరెక్టర్ మల్లేశం అన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం చాలా సులువైన పద్ధతిని అమలులోకి తెచ్చిందన్నారు. పత్తి అమ్ముకోవాలనుకునే రైతులు మూడు రోజుల ముందు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అందులో అనుకూలమైన తేదీ, సమయంతో యాప్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని, దాని ప్రకారం పత్తి కొనుగోలు కేంద్రానికి సరుకు తెచ్చి అమ్ముకోవచ్చన్నారు. దీంతో రైతులు తక్కువ సమయంతోపాటు సులువైన పద్ధతిలో పత్తిని అమ్ముకోవచ్చని చెప్పారు. ఈ విధానంపై ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ మార్కెట్ యార్డు కార్యదర్శి జయలక్ష్మి, వ్యవసాయ శాఖ ఉమ్మడి జిల్లా అధికారులు, మార్కెటింగ్ శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ జట్టుకుఅభినందన మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జనగాంలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 ఫుట్బాల్ పోటీలలో రెండో స్థానం సాధించిన మహబూబ్నగర్ జిల్లా బాలుర జట్టును సోమవారం కలెక్టరేట్ వద్ద డీవైఎస్ఓ శ్రీనివాస్, డీఐఈఓ కౌసర్జహాన్ అభినందించారు. వీరితోపాటు ఎస్జీఎఫ్ అండర్–19 ఇన్చార్జ్ కార్యదర్శి శారదాబాయి, పెటా టీఎస్ అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, సీనియర్ పీఈటీ వేణుగోపాల్ జట్టులోని క్రీడాకారులను అభినందించారు. -
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు
● రాజకీయ పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించాలి ● కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేట: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో తక్షణమే స్థానిక సంస్థల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి )అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరమంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని అందువల్ల తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, కొత్త మంజూరులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపడానికి వీలు లేదన్నారు. అధికారులు నాల్గవ తరగతి ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు పొరుగుసేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే పనిచేస్తారని, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులతో కలిసి, పార్టీ ర్యాలీలో పాల్గొనడం, మరే ఇతర రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందని, అలాంటి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కోడ్ అమల్లో వచ్చిన ప్రాంతాల్లో వెంటనే రాజకీయ ప్రచారాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, గోడ రాతలు తొలగించాలని ఆదేశించారు. ఈ రోజు నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ శ్రీను, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఆరోగ్య కేంద్రం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ( పట్టణ ఆరోగ్య కేంద్రం) ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెంటర్ లోని అన్ని గదులను పరిశీలించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా.. లేదా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెంటర్కు వచ్చిన పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను చూసి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఆస్పత్రి లోని అన్ని గదుల కిటికీలకు దోమలు రాకుండా జాలి ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హెల్త్ సెంటర్లో రక్త పరీక్ష చేయించుకున్నారు.కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, హెల్త్ సెంటర్ వైద్య అధికారి డాక్టర్ నరసింహారావు సగరీ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలి నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె పరిశీలించారు. అప్పక్పల్లిలో ఓ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచడంతో లబ్ధిదారురాలిని అభినందించారు. అప్పక్పల్లికి మొత్తం 50 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 16 ఇళ్ల నిర్మాణాలు రూఫ్ లెవల్, స్లాబ్, లెంటల్ లెవల్ లో కొనసాగుతున్నాయని హౌసింగ్ పీడీ శంకర్నాయక్ కలెక్టర్కు వివరించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో నారాయణపేట మండలం పురోగతిలో ఉండటంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుదర్శన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పకడ్బందీగాస్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీలకుగాను రెండు విడతల్లో ఎన్నికలు, అలాగే జిల్లాలోని 272 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో 67 , రెండో విడతలో 95, మూడో విడతలో 110 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివరించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రాణికుముదిని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇస్తామని, బ్యాలెట్ బాక్స్లు, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. బోర్డర్ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టేలా పోలీసుశాఖ ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు. అదనపు కలెక్టర్ శ్రీను, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్, ఆర్డీఓ రామచంద్రనాయక్, జెడ్పీ సీఈఓ మొగులప్ప, డీపీఓ సుధాకర్రెడ్డి, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముంపు ముప్పు
● కృష్ణా, భీమా నదుల్లో పెరిగిన వరద ఉధృతి ● భయం గుప్పిల్లో నదీ తీర గ్రామాల ప్రజలు ● వాసునగర్ను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారుల సూచన మక్తల్/కృష్ణా: రెండు రోజులుగా కృష్ణా, భీమా నదుల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. నదీ తీర గ్రామాల సమీపాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే నదీ పరీవాహకంలోని వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. కృష్ణా మండలంలో కృష్ణానది ఒడ్డున ఉన్న వాసునగర్, మారుతీనగర్ గ్రామాలతో పాటు భీమా నదీ తీరంలోని హిందూపూర్ గ్రామంలోకి వరద నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నదీ తీర ప్రాంతాల్లోని గ్రామాలను తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ ఎండీ నవీద్ పరిశీలించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. వాసునగర్, మారుతీనగర్ గ్రామాల ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అదే విధంగా భీమా నది నుంచి హిందూపూర్లోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కాలనీవాసులు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే, 2009లో అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, భయానక పరిస్థితులు ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు. మరోసారి వరద ముంపు ముప్పు భయం నదీ తీర గ్రామాల ప్రజలను వెంటాడుతోంది. రెండు రోజులుగా భీమా, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చాలా చోట్ల వ్యవసాయ పొలాలు నీటమునగడంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. మండల వ్యవసాయాధికారి సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి మునకకు గురైన పంటలను పరిశీలించారు. కృష్ణా మండలంలో 185 మంది రైతులకు చెందిన 785 ఎకరాల వరిపంట నీటమునిగి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. అదే విధంగా భీమా నది పరీవాహక ప్రాంతంలోని సూకూర్లింగంపల్లి, కుసుమర్తి, తంగిడి గ్రామాల్లో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా మక్తల్ మండలం పస్పుల ఘాట్ వద్ద ఉన్న దత్తక్షేత్రంలోకి వరద చేరింది. కృష్ణానదిపై ఉన్న నారాయణపూర్, భీమానదిపై ఉన్న గూడూరు బ్రిడ్జి కం బ్యారేజీ నుంచి 5.20లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగిందని అధికారులు తెలిపారు. నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దులోని భీమా నదిపై ఉన్న గూడూర్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి మక్తల్ మండలం పస్పుల దత్తక్షేత్రం వద్ద ఇలా.. -
కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు
నారాయణపేట రూరల్: ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్ను పట్టిపీడిస్తున్న కులవివక్ష నిర్మూలనకు పోరాటమే సరైన మార్గమని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి.రాము అన్నారు. జిల్లాకేంద్రంలోని భగత్సింగ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని కులవ్యవస్థ భారత దేశంలో ఉందని.. రాజకీయ ప్రజాస్వామ్య విలువలకు ఆటంకంగా మారిందన్నారు. కులవివక్ష నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ సభలు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనుషులంతా సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువలు, సమసమాజ నిర్మాణం కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు కాశీనాథ్, నర్సింహులు, జయ, ప్రశాంత్, శారద, సౌజన్య, లక్ష్మి, భాగ్యలక్ష్మి, రాధిక, అనిత తదితరులు ఉన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి నారాయణపేట రూరల్: బీజేపీ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ పిలుపునిచ్చారు. ఆదివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు పోశల్ వినోద్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తిరుపతిరెడ్డి, లక్ష్మీగౌడ్, బలరాంరెడ్డితో పాటు జిల్లా మాజీ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాసులును శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా నాగురావు నామాజీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మదన్, లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ, ప్రభంజాన్, మొగులప్ప, కిరణ్, సూర్యకాంత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ బకాయి కార్డు ఉద్యమం
● అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీమంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు మనోహర్, శ్రీకాంత్భీమ, నర్సింహగౌడ్, రమేష్రావు పాల్గొన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యం వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య క్రమంలో విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు, 74 ట్రామా, 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామని.., క్యాన్సర్ నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కోసం ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 65 సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర యువతకు నైపుణ్యమైన విద్యనందించి ప్రపంచంతో పోటీపడే విధంగా తీర్చిదిద్దేందుకు ఒక్కో ఏటీసీ సెంటర్కు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామంపై మమకారంతో అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడిపరిశ్రమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రతి జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కొండారెడ్డిపల్లిలో రూ.2.50 కోట్లతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం వల్ల రోజుకు 30వేల లీటర్ల పాలను నిల్వ చేయవచ్చని తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని ఆలయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూలైన్లు ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ చెల్లించకుండా రేవంత్రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్– బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని, హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటారా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. మాట తప్పిన రేవంత్రెడ్డిని ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సర్కార్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉద్యోగావకాశాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్ నివారణకు ప్రత్యేక చర్యలు ప్రతి జిల్లాకు పాలశీతలీకరణ కేంద్రాలు మంజూరు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి వెల్లడి -
పెంపుడు జంతువులకు టీకాలు తప్పనిసరి
నారాయణపేట రూరల్: పెంపుడు జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని జిల్లా వెటర్నరీ అధికారి డా.ఈశ్వర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఆదివారం ప్రపంచ యాంటీ రేబిస్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లలకు మూడు నెలల వయసు రాగానే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. నెల రోజుల తర్వా త మరోమారు బూస్టర్ టీకా వేయించాల్సి ఉంటుందన్నారు. మనుషులకు పిల్లి, కుక్క, కోతులు కరిచినప్పుడు వరుసగా 3, 7, 14, 28వ రోజు టీకాలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కుక్క కాటు వల్ల రేబిస్ వ్యాధి సంక్రమిస్తుందని.. కుక్కల లాలాజలం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు. జంతువులు కాటు వేసినప్పుడు నిర్లక్ష్యం చేయరాదన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యం తీసుకోవాలన్నారు. రేబిస్ డే సందర్భంగా జిల్లావ్యాప్తంగా 197 పెంపుడు జంతువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి అనిరుధ్ ఆచార్య, సిబ్బంది పాల్గొన్నారు. నేడు సామూహిక అక్షరాభ్యాసం ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని జ్ఞానసరస్వతి ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా సోమవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉమ్మడి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
అవగాహనతోనే మాదకద్రవ్యాల కట్టడి
నారాయణపేట: మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించి, జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎవరైనా రైతు తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు రుజువు అయితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా లబ్ది చేకూరే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం జరుగుతుందన్నారు. అన్ని కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. మక్తల్, ఊట్కూర్ లో గంజాయి పట్టుకుని కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో జరిగే ప్రతీ కార్యక్రమంలో మాదకద్రవ్య నిషేధ అంశాన్ని ఒక సబ్జెక్టుగా పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ సుదర్శన్, వైద్య శాఖ అధికారి బిక్షపతి, అఖిల ప్రసన్న పాల్గొన్నారు. -
హోంగార్డుల సంక్షేమానికి చర్యలు
నారాయణపేట: జిల్లాలోని హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హోంగార్డ్స్కు డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్ కోట్స్, స్వెటర్స్ను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హాక్ అందజేసి మాట్లాడారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. నిరంతరం రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి వర్షాకాలంలో అత్యవసర సమయాలలో రెయిన్ కోట్స్, స్వెటర్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో సీఐ నరసింహ, హోమ్ హార్డ్స్ ఇంచార్జి ఆర్ఎస్ఐ మద్దయ్య, శిరీష, కృష్ణ చైతన్య సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా కోసం వర్షంలోనూ బారులు..
నారాయణపేట టౌన్: జిల్లాలో యూరియా కష్టాలు ఇప్పట్లో తీరిలే కనిపించడం లేదు. రైతులు ఒక్క బస్తా యూరియా కోసం టోకన్లు తీసుకొని ఎండలో నిలబడే దుస్థితి ఏర్పడింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక యాదగిరి రోడ్డు దగ్గర ఉన్న అగ్రోస్ రైతు సేవా కేంద్రం– 2 దగ్గర రైతులు యూరియా కోసం ఉదయం నుంచి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగుల సాయంతో క్యూ లైన్లో నిలిచి ఉన్నారు. ఈక్రమంలో తోపులాట చోటుచేసుకోగా పోలీసులు అదుపుచేశారు. అనంతరం యూరియా సరఫరా చేశారు. కాగా క్యూ లైన్లో నిలబడ్డ కూడా కొందరి రైతులకు యూరియా లభించక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. -
జీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
నారాయణపేట: గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉండడం వలన తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం జారిచేసిన జీఓ నెం 51 వలన మల్టీ పర్పస్ విధానంతో కార్మికులు ప్రమాద బారిన పడుతున్నారన్నారు. మురికి కాలువ శుభ్రం చేసే కార్మికులతో కరెంటు స్తంభాలు ఎక్కి విద్యుత్ బల్బులు అమర్చే క్రమంలో కార్మికులు ప్రమాదానికి గురవుతున్నారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి ఇన్సూరెన్స్ కల్పించలేదని, రూ. 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతిపత్రం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ శ్రీను అందశారు. శివకుమార్, అశోక్, లక్ష్మణ్ బాలయ్య ,రాజు, హన్మంతు,తిప్పమ్మ, మరెమ్మ సంగమ్మ, సద్దాం నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదాం
నారాయణపేట టౌన్: జిల్లాకేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని పుర కమిషనర్ నర్సయ్య కోరారు. స్థానిక వివేకానంద పార్కులో గురువారం ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాథ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను వాకర్స్తో కలిసి శుభ్రం చేశారు. అనంతరం కమిషనర్ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ ప్రజలు సంవత్సరానికి 100 గంటలు లేదా రోజుకు రెండు గంటలు స్వచ్ఛందంగా పరిసరాల శుభ్రకు ముందుకురావాలని కోరారు. కార్యక్రమంలో యూనియాన్ బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
● కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ● గౌరీదేవి, బతుకమ్మకు ప్రత్యేక పూజలు ● జిల్లా కేంద్రంలో అట్టహాసంగా సంబరాలు నారాయణపేట రూరల్: బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని, సీ్త్రల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బారంబావి దగ్గర బుధవారం రాత్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోన్న బతుకమ్మ వేడుకలు ఈ నెల 21 నుంచి 30 వరకు రోజు ఒక్కో ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయని, బుధవారం పురపాలిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చక్కగా చేశారని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. మహిళలంతా కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. ఈ నెల 30న సద్దుల బతుకమ్మ వేడుకలను ఇదే బారం బావి ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని చెప్పారు. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మను తలపై పెట్టుకుని వస్తున్నకలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి -
చిరు వ్యాపారులకు చేయూత
కోస్గి: మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ప్రైవేట్గా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటున్న వీధి వ్యాపారులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా పీఎం స్వనిధి పథకం అమలు చేసి వడ్డీలేని రుణాలు అందించింది. వ్యాపారులకు దశల వారీగా రుణాల పరిమితిని పెంచుతూ అమలు చేసిన పీఎం స్వనిధి పథకం నిలిచిపోయింది. ఈ పథకం స్థానంలో తాజాగా ‘లోక్ కల్యాణ్’ పేరుతో కొత్త పథకం అమలు చేయనుంది. గతంలో రుణాలు పొందని వీధి వ్యాపారులకు కొత్త పథకం ద్వారా రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు లోక్ కల్యాణ్ మేళాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2లోగా ఆసక్తి ఉన్న చిరు వ్యాపారుల నుంచి మెప్మా సిబ్బంది దరఖాస్తులు స్వీకరించి రుణాల మంజూరు కోసం బ్యాంకర్లకు అందజేయనున్నారు. నిలిచిన పీఎం స్వనిధి పథకం ఐదేళ్ల క్రితం కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో వీధి వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము నమ్ముకున్న వ్యాపారాలు మూత పడటంతో వారి బతుకులు నడవడం కష్టతరమైంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు ఆర్దిక చేయూత అందించేందుకు పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించి అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. మొదటి విడతగా రూ.10 వేలు, రెండో విడత కింద రూ.20 వేలు బ్యాంకు రుణాలు అందించారు. రెండు విడతల్లో రుణం తీసుకొని సక్రమంగా చెల్లించిన వారికి మూడో విడతగా రూ.50 వేలు అందించారు. ఈ పథకం నిలిచిపోవడంతో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న కొందరికి ఎలాంటి రుణాలు అందలేదు. దీనికితోడు వీధి వ్యాపారుల సంఖ్య పెరడగంతోపాటు రుణాల కోసం దరఖాస్తుదారులు సైతం పెరిగారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా వీధి వ్యాపారులకు ఆర్దిక చేయుతనివ్వడం కోసం లోక్ కళ్యాణ్ పేరుతో కొత్త పథకం అమల్లోకి తెచ్చింది. కొత్త పథకంలో రుణ పరిమితి పెంపు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన వీధి వ్యాపారులను గుర్తించి వారందరికి గుర్తింపు కార్డులు అందజేశారు. జిల్లాలో మద్దూర్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడటంతో అక్కడ వీధి వ్యాపారుల గుర్తింపు చేపట్టలేదు. మిగిలిన మూడు నారాయణపేట, కోస్గి, మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 5,664 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు అధికారులు ప్రత్యేక సర్వే ద్వారా గుర్తించారు. అర్హులైన వ్యాపారులందరికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మెప్మా, బ్యాంకు అధికారులు మున్సిపాలిటీల వారిగా వ్యాపారులతో లోక్ కల్యాణ్ మేళాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. కొత్త పథకంలో మొదటి విడత రుణం రూ.15వేలు, రెండో విడతలో రూ.25 వేలు, మూడో విడతలో రూ.50 వేలు మంజూరు చేయనున్నారు. గతంలో పీఎం స్వనిధి పథకంలో రుణాలు తీసుకోని వ్యాపారులు, కొత్తగా నమోదైన వ్యాపారులు లోక్ కళ్యాణ్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మెప్మా అధికారులు సూచిస్తున్నారు. పీఎం స్వనిధి స్థానంలో‘లోక్ కల్యాణ్’ రుణాలు మున్సిపాలిటీల్లో అర్హులను గుర్తించే పనిలో అధికారులు నూతన పథకంపై అవగాహన కల్పిస్తున్న వైనం జిల్లాలో 5,664 మంది వీధి వ్యాపారులు -
ఉద్యోగ అవకాశాలు కల్పించేస్థాయికి ఎదగాలి
వనపర్తిటౌన్: ఇంజినీరింగ్ విద్యార్థులు ఉద్యోగం కోసం వెదుక్కోకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని స్థానిక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వీఎస్ రాజు ఆకాంక్షించారు. బుధవారం కళాశాలలో డీసీ–ఎంఎస్ఎంఈ, న్యూఢిల్లీ సహకారంతో ఎంట్రప్రెన్యూర్షిప్పై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఆలోచన ఉంటే సరిపోదని.. కృషి, పట్టుదల, నమ్మకం ఉండాలని, అన్ని ఉంటేనే జీవితంలో, సమాజంలో రాణించగలమన్నారు. ఎస్ఐసీ –టీఎస్సీ డిప్యూటీ మేనేజర్ అబ్దుల్ ఖాదర్ ఎంట్రప్రెన్యూర్షిప్, స్టార్టప్లపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ బీవీ రాంనరేష్ పాల్గొన్నారు. -
వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమం, బాలసదనాన్ని బుధవారం సీనియర్ సివిల్ జడ్జి వింధ్యానాయక్ తనిఖీ చేశారు. వృద్ధుల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధులకి, చిన్నారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సంబంధిత అధికారికి వెంటనే తెలియజేయాలని, మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. అనంతరం బియ్యం, కూరగాయలు, వస్తువుల నాణ్యతను పరిశీలించారు. వృద్ధులకు అందించే మాత్రలకు సంబంధించి ఎప్పటికప్పుడు గడువు ముగిసిన తేదీలను చూడాలని, మూత్రశాలలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులతో మాట్లాడారు. వారికి పండ్లు అందజేశారు. వర్షాకాలం నేపథ్యంలో అన్ని సమయాల్లో చిన్నారులకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, సొంత వారిలా చూసుకోవాలని సూచించారు. -
పాలమూరు చుట్టే రాజకీయం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సెగ రాజేసింది.. తెలంగాణ మలి దశ పోరులో రణనినాదమై నిలిచింది పాలమూరే. తలాపున కృష్ణమ్మ ఉన్నా.. సాగు, తాగునీరు లేక వలసలతో తండ్లాడిన ఇక్కడి ప్రజల దీనగాధ, వెనుకబాటుతనమే ప్రతి ఒక్కరి గళమైంది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరిలూదింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ‘పాలమూరు’దే కీలక భూమిక. అలాంటి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015లో ఈ ఎత్తిపోతలకు అడుగులు పడగా.. అప్పుడు, ఇప్పుడూ దీని చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతలకు పాలమూరు ప్రచారాస్త్రంగా మారగా.. రైతాంగానికి మాత్రం సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. పీఆర్ఎల్ఐ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’ పాలక, ప్రతిపక్షాల పోటాపోటీ విమర్శలు 90 శాతం పనుల పూర్తి.. మిగిలిన 10% పూర్తి చేయాలి.. ఇదే డిమాండ్తో పోరుబాటకు బీఆర్ఎస్ సన్నాహాలు దీటుగా స్పందించేలా కాంగ్రెస్ కార్యాచరణ ‘స్థానిక’ ఎన్నికల వేళ రాజుకున్న వేడి -
ఎస్పీని కలిసిన పోక్సో కోర్టు పీపీ
నారాయణపేట: జిల్లా పోక్సో ప్రత్యేక కోర్టుకు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన బి.ప్రభాకర్ బుధవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. భవిష్యత్తులో జిల్లాలోని పోక్సో కేసుల విచారణలో పోలీసులు ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వేగవంతమైన న్యాయం అందించేందుకు అవసరమైన సహకారం అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు.బీసీ రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలినారాయణపేట: బీసీలకు రిజర్వేషన్ 42 శాతం అమలుచేసి స్థానిక ఎన్నికలు జరపాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారిందని.. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడంతో ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గాడి తప్పిందన్నారు. ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కార్మికులకు వేతనాల్లేవన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు లక్షల కొద్ది వారి జీతాలను చెల్లించి గ్రామ అభివృద్ధిలో పాటుపడుతున్నరని, ఇంతవరకు వారి బిల్లులు రావడం లేదన్నారు. వర్షాలతో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయని, వీధుల్లో, మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోయినా వాటిని శుభ్రం చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవటంతో వారు విధులపై దృష్టి పెట్టడం లేదన్నారు. ప్రభు త్వం నుంచి నిధులు రానందున కార్యదర్శులు సైతం చేతులెత్తేశారన్నారు. ట్రాక్టర్లు నడవడానికి డీజిల్ సైతం లేనందున ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. త్వరితగతిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి గ్రామా పాలనకు శ్రీకారం చుట్టాలన్నారు.26న ఉద్యోగమేళాకందనూలు: జిల్లా కేంద్రంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో 26న ఉద్యోగమేళా నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధి కారి రాఘవేందర్సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా 50 ఉద్యోగాల భర్తీకి మేళా కొనసాగుతుందన్నారు. పదో తరగతి ఆర్హత కలిగి 25 నుంచి 32 ఏళ్ల వయస్సు కలిగిన అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 95051 86201, 96669 74704 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి
నారాయణపేట: రోజుల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ యోగేష్గౌతమ్ ఆదేశించారు. బుధవారం పోలీస్ అధికారులతో ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కేసు నమోదైన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణపై తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వహించాలన్నారు. దొంగతనాల నివారణ, ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రాత్రి సమయాల్లో బ్లూ కోర్డ్స్, పెట్రో కార్ అధికారులు, సిబ్బంది నిరంతరంగా విధులు నిర్వహించాలని, డయల్ 100 కాల్స్పై అలసత్వం వహించవద్దన్నారు. డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్తోపాటు శివశంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు పాల్గొన్నారు. -
బోనస్ బకాయిలు రూ.70.44 కోట్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మాగనూర్ మండలం నేరడుగాం గ్రామానికి చెందిన రైతు లియాకత్ అలీ. యాసంగిలో సొంత పొలం పది ఎకరాలు, కౌలుకు తీసుకొని 40 ఎకరాల్లో సన్నరకం ధాన్యం పండించారు. మొత్తం 1,300 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. క్వింటాకు రూ.2,320 చొప్పున మద్దతు ధర డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయి. బోనస్ రూ.6.50 లక్షలు ఇంతవరకు రాలేదు. సకాలంలో చేతికంది ఉంటే పంట పెట్టుబడికి ఉపయోగపడేవని చెబుతున్నారు. నారాయణపేట: యాసంగి సీజన్ సన్నరకం వరి ధాన్యం బోనస్ కోసం రైతులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరున ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై జూన్ మొదటి వారం వరకు కొనసాగాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. అందులో 1,40,983 ఎంటీఎస్ సన్నరకం, 57,299 ఎంటీఎస్ దొడ్డు రకం ఉంది. క్వింటాకు రూ.500 చొప్పున.. యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంది. కొనుగోళ్లు ముగిసి మూడు నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేక బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్నది బహిరంగ రహస్యమే. మరో 15 రోజుల్లో వానాకాలం సీజన్ పంట కొనుగోళ్లు ప్రారంభం కానుండటం.. ఇప్పటి వరకు యాసంగి బోనస్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి పౌరసరఫరాల సంస్థ వారి ఖాతాల్లో రూ.460,01,65,600 జమ చేసింది. కానీ సన్నరకం ధాన్యం బోనస్ డబ్బులు 1,40,983 ఎంటీఎస్కుగాను రూ.70.44 కోట్లు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు ఒక్క రూపాయి అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం కొనుగోళ్లకు ప్రణాళికలు.. రాష్ట్రంలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. నెలాఖరునే పంట కోతలు ప్రారంభం కానుండటంతో అక్టోబర్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియ అక్టోబర్ నుంచి 2026, జనవరి వరకు కొనసాగనుంది. సన్నాల సాగుకే మొగ్గు.. ఈసారి వానాకాలంలో జిల్లా రైతులు సన్నాల సాగుకే మక్కువ చూపారు. దొడ్డురకం 14,981 హెక్టార్లు, సన్నరకం 56,082 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 96,249 ఎంటీఎస్ దొడ్డురకం, 3.32 లక్షల మె.ట. సన్నరకం దిగుబడి వచ్చే అవకాశం ఉండటంతో 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది కొత్తపల్లి తండాకు చెందిన రైతు పాండునాయక్. ఈ ఏడాది యాసంగిలో మూడు ఎకరాల పొలంలో సన్నరకం వరి ధాన్యం పండించగా 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించగా రూ.1,03,500 బ్యాంకు ఖాతాలో జమైంది. బోనస్ రూ.22,500 మూడు నెలలవుతున్నా ఇంతవరకు జమ కాలేదు. యాసంగి డబ్బుల కోసంరైతన్నల ఎదురుచూపు 1.40 లక్షల ఎంటీఎస్ కొనుగోలు వానాకాలం వరి కొనేందుకుప్రణాళికలు సిద్ధం అన్నదాతల ఆందోళన -
నల్లబ్యాడ్జీలతో నిరసన
నారాయణపేట: మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ బోధన వైద్యుల సంఘం (టీటీజీడీఏ), నారాయణపేట యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రి ఎదుట వైద్యులు, వైద్యసిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ.. 65 ఏళ్ల రోగికి వైద్యం చేసి బతికించడానికి ప్రయత్నించినందుకు వారి బంధువులు దాడులు చేయడం హేయమైన చర్యని, ఖండిస్తున్నామన్నారు. వైద్యుడు తనకు తెలిసిన వైద్య విజ్ఞానంతో ఉన్న సౌకర్యాలు వినియోగించుకొని నాణ్యమైన వైద్యం అందించడానికి చూస్తారని వారు వివరించారు. నేడు డయల్ యువర్ డీఎం నారాయణపేట టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తున్నట్లు నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట, కోస్గి పరిసర ప్రాంతాల ప్రయాణికులు నిర్దేశిత సమయంలో సెల్నంబర్ 73828 26293 తమ సమస్యలు, విలువైన సలహాలు, సూచనలు తెలియజేయాలని పేర్కొన్నారు. ముగిసిన మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నారాయణపేట: భగవాన్ శ్రీ ధన్వంతరి జయంతి, 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేంద్రంలోని పాత ఆస్పత్రి ఆవరణలో ఉచిత ఆయుర్వేద మెగా వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, జిల్లా ఉప వైద్యాధికారి డా. శైలజ శిబిరాన్ని ప్రారంభించారు. 229 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రక్తపోటు, మధుమేహం, కీళ్ల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సీనియర్ విశ్రాంత వైద్యాధికారులు డా. శౌర్య, డా. నారాయణ, డా. శివచందర్గౌడ్, యోగా శిక్షకుడు సురేష్, జిల్లా ఆయుష్ ప్రోగ్రామ్ అధికారి డా. రఘుకుమార్ ప్రాచీన ఆయుర్వేదం విశిష్టతను వివరించారు. ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని.. వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయుష్ వైద్యాధికారులు డా. హరీష్ చక్ర, డా. కె.తిరుపతి, డా. నాగజ్యోతి, డా. సుధారాణి, ఆయుష్ ఫార్మాసిస్టులు సాక సాయిబాబా, అనిత, ఎస్ఎన్ఓఆర్ సంతోష్కుమార్, అరుణ, యోగా శిక్షకులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
కోస్గి రూరల్: స్థానిక పురపాలికను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కడా చైర్మన్ వెంకట్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం పురపాలికలో రూ.1.32 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ, పలు కార్యాలయాల ప్రారంభోత్సవాలు నిర్వహించి మాట్లాడారు. అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.350 కోట్లు కేటాయించామని.. పనులు సైతం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాల తరగతులు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయని.. ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు మంచి అవకాశమని వివరించారు. రూ.40 లక్షలు కడా నిధులతో ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, రూ.30 లక్షలతో విద్యుత్ సబ్డివిజన్ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్సెంటర్లో రూ.35 లక్షలతో మార్చురీ గది, రూ.12 లక్షలతో ఆస్పత్రికి ప్రహరీ, రూ.15 లక్షలతో రోగుల నిరీక్షణకు హాల్ నిర్మాణానికి భూమిపూజ చేపట్టారు. అనంతరం ఆస్పత్రిలో పర్యటించి రోగులతో మాట్లాడారు. రోగులకు నిరంతరం వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, డిప్యూటీ ఈఈ విలోక్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, మండల విద్యాధికారి శంకర్నాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్, పుర అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాసులు, పీఏసీఎస్ అధ్యక్షుడు భీంరెడ్డి, వైద్యులు అనుదీప్, నాగులపల్లి నరేందర్, అన్నకిష్టప్ప, మాస్టర్ శ్రీనివాస్, బాలేష్, భానునాయక్ తదితరులు ఉన్నారు. -
బోనస్ రాలేదు..
యాసంగిలో 68 కింటాళ్ల సన్నరకం వరి ధాన్నాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ఇప్పటి వరకు బోనస్ పడలేదు. వానాకాలం పంట కోతలు కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వెంటనే బోనస్ చెల్లించాలి.. లేని పక్షంలో నిరసన బాట పడతాం. – మధుసూదన్రెడ్డి, రైతు, కొత్తపల్లి ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది యాసంగిలో వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో పంట డబ్బులు జమ చేశాం. బోనస్ డబ్బులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. వచ్చిన వెంటనే జమ చేస్తాం. వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. – సైదులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ● -
పువ్వులను పూజించడం గొప్ప సంస్కృతి
● ఎస్పీ యోగేష్ గౌతమ్ ● జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ సంబరాలు నారాయణపేట: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని.. ఎక్కడైనా దేవుళ్లకు పూలతో కొలుస్తామని, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉందని.. ఇది గొప్ప సంస్కృతని ఎస్పీ యోగేష్ గౌతమ్ కొనియాడారు. మంగళవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు కోలాటలు, బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల కుటుంబ సభ్యులను కలిసినందుకు, వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మ అని.. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. బతుకమ్మ పాటలు వినసొంపుగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్ హూల్హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, సీఐ నర్సింహ, మహిళా ఎస్ఐలు సునీత, గాయత్రి, శ్వేత, శిరీష, మహిళ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి
నర్వ/మక్తల్/మాగనూర్: పోలీసు సిబ్బంది గ్రామాల్లో ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన నర్వ, మక్తల్, మాగనూర్ పోలీస్స్టేషన్లను ఆయన సందర్శించారు. ఆయా ఠాణాల అధికారులు స్వాగతం పలుకగా.. సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్స్టేషన్ల ఆవరణల్లో మొక్కలు నాటి ఆవరణలు, రికార్డులను తనిఖీ చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల పరిష్కారం, క్రైమ్ ప్రివెన్షన్ చర్యలపై పలు సూచనలు చేశారు. సిబ్బంది విధుల గురించి అడిగి తెలుసుకొని సమయపాలన పాటించాలని సూచించారు. డయల్ 100 సేవలపై వేగవంతంగా స్పందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీపీఓలు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించాలన్నారు. క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు సేవలు అందించాలని.. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత అధికారులతో కలిసి భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాలనీలు, గ్రామాలో్ల్ గస్తీ నిర్వహిస్తూ పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, దొంగతనాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డీఎస్పీ లింగయ్య, సీఐలు రాంలాల్, రాజేందర్రెడ్డి, ఆయా ఠాణాల ఎస్ఐలు అశోక్బాబు, భాగ్యలక్ష్మిరెడ్డి, పబ్బతి రమేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డయల్ 100 ఫిర్యాదుకు సత్వరం స్పందించాలి ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి జోగుళాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ -
నిధులు విడుదల చేశాం
2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి క్యాంపుల నిర్వహణ ప్రారంభమైంది. మొత్తం పీయూ పరిధిలో 100 యూనిట్లు ఉండగా వాటిలో మొదటి దశలో ఎంపిక చేసి 51 యూనిట్లకు రూ.17.75 లక్షలను విడుదల చేశాం. మరో 49 యూనిట్లకు వచ్చే నెల నిధులు కేటాయిస్తాం. ఈ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సామాజిక అవగాహన పెరడంతో పాటు ప్రజలకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రవీణ, పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విద్యార్థులకు ప్రయోజనం ఎన్ఎన్ఎస్లో భాగంగా ఇప్పటికి అనేక కార్యక్రమాలు నిర్వహించాం. వాటిలో భాగంగా ప్రజలకు స్వచ్ఛబారత్, నషా ముక్త్భారత్ వంటి వాటిపై అవగాహన కల్పించారు. వీటి ద్వారా అనేక అంశాలను ఒక విద్యార్థిగా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఎన్ఎస్ఎస్ సర్టిఫికెట్ బవిష్యత్తులో ఎంతో ఉపయోగడపతుంది. – సరిత, ఎన్ఎస్ఎస్ వలంటీర్ అవగాహన పెంపు విద్యార్థులకు యూజీ, పీజీ స్థాయిలో ఎన్ఎస్ఎస్ క్యాంపులు నిర్వహిచడం వల్ల వారికి సామాజిక అంశాలపట్ల అవగాహన పెరుగుతుంది. క్యాంపులో భాగంగా వారం రోజుల పాటు విద్యార్థులు అక్కడే ఉండి ఉదయం వేలల్లో పరిశుభ్రత, స్వచ్ఛత కార్యక్రమాలు, రాత్రి వేళల్లో పలు అంశాలపై నాటికలు, కథల రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. – గాలెన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగాం అధికారి -
పరిసరాలు శుభ్రంగాఉంచుకోవాలి
నారాయణపేట టౌన్: పట్టణంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కురిసిన అకాల వర్షాలకు మురికి కాలువల ద్వారా చెత్తా, ప్లాస్టిక్ రోడ్డుపై పేరుకుపోయినా ఇసుకను మున్సిపల్ కార్మికులతో తీయించారు. అదే విధంగా బతుకమ్మ సంబరాల కోసం స్థానిక బారం బావి దగ్గర శుభ్రం చేయించి వేడుకలకు సిద్ధం చేశారు. హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుపైకి వాలిన కొమ్మలను దగ్గరుండి తొలగింప చేయించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూనే ఆరోగ్యంగా ఉంటామని కావునా పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలతో పాటు చుట్టుపక్కల చెత్త చెదారం పేరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియపూర్తిచేయండి నారాయణపేట: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులకు అవసరమైన భూ సేకరణపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ భూ సేకరణ ప్రక్రియపై జాప్యం చేయొద్దని సూచించారు. వీసీలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను, ఆర్డీఓ రామచందర్ తదితరులు పాల్గొన్నారు. అక్రమ అరెస్టులు సరికాదు నారాయణపేట రూరల్: తమ సమస్యలు పరిష్కరించాలని న్యాయబద్ధంగా పోరాటం చేస్తు న్న వారిని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చే యించడం సరికాదని సీపీఐ(ఎం.ఎల్)మాస్లైన్ కార్యదర్శి కాశీనాథ్ విమర్శించారు. ప్రగతి శీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ కార్మికుల డిమాండ్ల సాధనకు సోమవారం ‘చలో హైదరాబాద్’ ఎస్పీడీ కార్యాలయం ముట్టడి చేపట్టగా పలువురు నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంపై విమర్శలు గుప్పించారు. కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేయాలనీ, కుక్, స్వీపర్, స్కావెంజర్, వాచ్ ఉమెన్ పోస్టులకు 10వ తరగతి విద్యార్హత నిబంధన తొలగించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ కల్పించాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఇవ్వాలనే తదితర డిమాండ్లపై శాంతియుతంగా తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేయడం దారుణమన్నారు. అధికారానికి రాక ముందు ఒకలా మాట్లాడి ఇపుడు అప్రజాస్వామికంగా కార్మిక గొంతులు నొక్కాలని చూడడం అత్యంత హే యమైన చర్య అని మండిపడ్డారు. కార్యక్రమంలో సరిత, నర్సింలు, లక్ష్మి పాల్గొన్నారు. -
స్థానిక పోరుకు సన్నద్ధం
సాక్షి, నాగర్కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియపై కీలకమైన బాధ్యతలను కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓ స్థాయి అధికారులకు అప్పగించింది. రిజర్వేషన్ల ప్రక్రియపై మార్గదర్శకాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ కోలాహలం నెలకొంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో 77 జెడ్పీటీసీ, 802 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1,705 గ్రామ పంచాయతీలు, 15,322 వార్డు స్థానాలు ఉన్నాయి. ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారుల కసరత్తు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల కీలకంగా మారనున్న కేటాయింపు ప్రక్రియ కలెక్టర్, ఆర్డీఓ, ఎంపీడీఓలకు బాధ్యతల అప్పగింత -
ఈత వనాలెక్కడ..?
మరికల్: కల్తీ కల్లును పూర్తిగా నివారించేందుకు గత ప్రభుత్వం హరితహారం (వన మహోత్సవం)లో ఈత వనాలను నాటించింది. అవి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఉన్న మొక్కలు కూడా ఎదుగుదల లేక గిడుగుబారి పోతున్నాయి. ప్రభుత్వం వివిధ రకాల మొక్కలను ప్రత్యేకంగా తెప్పించి నాటించినా నిర్వహణ కొరవడుతోంది. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లాలో ఈత వనాల విస్తీర్ణం తక్కువ. ఈ నేపథ్యంలో ఏటా ఈత మొక్కలు నాటించే కార్యక్రమం చేపడుతున్నారు. మూడేళ్ల కాలంలో 1,15,900 మొక్కలు నాటారు. అందులో 10శాతం కూడా కనిపించడం లేదు. వాగులు, వంకల పక్కనున్న ఈతచెట్లను కొందరు క్రమేణా తొలగించి సాగు భూములుగా మార్చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్తగా నాటిన మొక్కలను సైతం తొలగిస్తున్నట్లు తెలిసింది. అయితే మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిదన్నది కూడా తెలియని దుస్థితి నెలకొంది. సమన్వయ లోపం.. ఈత మొక్కలు నాటే కార్యక్రమం ఎకై ్సజ్శాఖ పర్యవేక్షణలో కొనసాగుతోంది. వారు నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత డీఆర్డీడీఏ పరిధిలో గ్రామపంచాయతీలు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తమ శాఖ పరిధిలో విధించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటడం మాత్రమే తమవంతు అని.. సంరక్షించే బాధ్యత పంచాయతీల వంతు అనే విధంగా అధికారుల వ్యవహార తీరు కనిపిస్తోంది. ఫలితంగా మొక్కల దశలోనే ఈత వనాలు కనిపించకుండా పోతున్నాయి. ఉన్న మొక్కలు సైతం సంరక్షణకు నోచుకోవడం లేదు. కల్తీ కల్లే దిక్కు.. ఈత వనాలు విరివిగా పెంచి నీరా దుకాణాలు తెరిపిస్తామని అప్పటి ఆబ్కారీశాఖ మంత్రి ప్రకటించా రు. అయితే జిల్లావ్యాప్తంగా ఉన్న నీరా దుకాణాల ను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడ చూసినా కల్తీ కల్లు దుకాణాలే కనిపిస్తున్నాయి. సీహెచ్, డైజోఫాం, అల్ఫ్రాజోలం లాంటి మత్తు పదార్థాలతో కల్లు తయారీ చేసి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో కల్తీ కల్లు తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కల్తీ కల్లు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొన్ని వెలుగు చూడ టం లేదు. వీటిని ఈత వనాల పెంపుతోనే అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. పరిరక్షణకు చర్యలు.. జిల్లాలో నాటిన ఈత వనాలను పరిశీలించి పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. ఇందుకు డీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖల సహకారం తీసుకుంటాం. ప్రభుత్వం ఆదేశిస్తే మళ్లీ ఈత మొక్కలు నాటేందుకు అవసరమైన భూములను గుర్తిస్తాం. – అనంతయ్య, ఎకై ్సజ్ సీఐ, నారాయణపేట నిర్వహణ లేక మొక్కలు కనుమరుగు జిల్లాలో 1.15లక్షల ఈత మొక్కలు నాటిన ఆబ్కారీశాఖ క్షేత్రస్థాయిలో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్న వైనం నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం -
బీసీ కులగణన ఆధారంగా..
ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నారు. ఫలితంగా గత ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలతోపాటు అదనంగా మరికొన్ని స్థానాలు పెరగనున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎప్పటిలాగే కొనసాగుతాయి. ఈ క్రమంలో జనరల్ కేటగిరి స్థానాలు తగ్గే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే రిజర్వేషన్ స్థానాల్లో 50 శాతం స్థానాలను మహిళలకు దక్కనున్నాయి. షెడ్యూల్డ్, ఏజెన్సీ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎస్టీ జనాభాలో 50 శాతం తగ్గకుండా చూస్తారు. అలాగే ఎస్టీ నోటిఫైడ్ గ్రామాల్లో సర్పంచులు, వార్డుమెంబర్ పదవులను పూర్తిగా వారికే కేటాయించనున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల నిర్వహణపై ఆశలు నెలకొన్నాయి. ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల ని ర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. గ్రామ పంచాయతీలు, వా ర్డుల వారీగా తుది ఓటరు జాబితా పూర్తయ్యింది. ఎన్ని కల సంఘం ఎప్పు డు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే కసరత్తు పూర్తయ్యింది. ఓటరు జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్ పూర్తి కాగా.. బ్యాలెట్ బాక్సులతోపాటు బ్యాలెట్ పేపర్ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. -
రైతులకు తప్పని యూరియా కష్టాలు
నారాయణపేట టౌన్/మరికల్/కొత్తపల్లి: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఒక్క బస్తా యూరియా కోసం నిత్యం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం–2కు వివిధ గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి బారులు తీరారు. కొందరు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. చివరకు చాలా మంది రైతు లకు యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ● మరికల్లో టోకెన్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 700 బస్తాల యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ కట్టారు. అయితే రైతువేదిక వద్ద టోకెన్లు ఇస్తున్నారని సిబ్బంది చెప్పడంతో అక్కడికి పరుగులు పెట్టారు. కానీ అక్కడ టోకెన్లు ఇవ్వడం లేదని తెలుసుకొని ఏఓ రహ్మన్ను నిలదీశారు. వెంటనే తమకు టోకన్లు ఇచ్చి యూరియా అందించాలని ఆందోళనకు దిగారు. అయితే వారం రోజుల క్రితం టోకెన్లు పొందిన వారికి యూరియా పంపిణీ చేస్తున్నామని.. మిగతా వారికి రెండు రోజుల్లో అందజేస్తామని ఏఓ నచ్చజెప్పారు. ● కొత్తపల్లి మండల కేంద్రంలోని హాకా ఎరువుల దుకాణం వద్ద రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. దుకాణం తెరిచిన తర్వాత టోకెన్ల పంపిణీ చేపట్టగా.. రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను క్యూలో నిలబెట్టారు. ఏఓ రమేశ్, సిబ్బందితో కలిసి మొత్తం 300 బస్తాల యురియాను ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. చాలా మంది రైతులకు యూరియా లభించలేదు. వారికి టోకెన్లు అందజేశారు. మంగళవారం మరో లారీ యూరియా వస్తుందని.. రైతులందరికీ అందజేస్తామని ఏఓ తెలిపారు. -
పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు
నారాయణపేట: జిల్లాలో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో వ్యవసాయ, మార్కెటింగ్, హార్టికల్చర్ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో క్రాప్ బుకింగ్ను వందశాతం పూర్తిచేసి.. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మిల్లుల వద్ద పత్తి రైతులు నిరీక్షించే పరిస్థితి ఉండదని అన్నారు. గతంలో మిల్లర్లు ఎల్–1, ఎల్–2 ప్రకారం పత్తిని కొనుగోలుచేసే వారని.. ఈ సారి ఆ విధానాన్ని రద్దుచేసి అన్ని మిల్లుల్లో పత్తి కొనుగోలు చేయడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సారి కౌలు రైతులు కూడా విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదే విధంగా ఆయిల్పాం సాగుతో కలిగే లాభాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించి.. జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్పాం సాగు లక్ష్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్ల విషయంలో గతేడాది జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డీఏఓ జాన్సుధాకర్, సీపీఓ యోగానంద్, జిల్లా మార్కెటింగ్శాఖ అధికారిణి బాలమణి, ఆర్టీఓ మేఘాగాంధీ, డీఎస్ఓ బాల్రాజ్, సీసీఐ స్టేట్ జనరల్ మేనేజర్ ప్రజక్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ఉన్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాలి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశమై బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలన్నారు. ముఖ్యకూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో హోర్డింగ్స్, బతుకమ్మ నమూనాల ఏర్పాటుతో పాటు జిల్లా కేంద్రంలోని బారంబావి, కొండారెడ్డి చెరువు వద్ద లైటింగ్స్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ నర్సయ్యను కలెక్టర్ ఆదేశించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువులు, నీటివనరుల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగే బతుకమ్మ ఉత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలన్నారు. 30న సద్దుల బతుకమ్మ వేడుకలను పెద్దఎత్తున నిర్వహించాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, ఏఓ జయసుధ ఉన్నారు. జిల్లాలో క్రాప్ బుకింగ్ను వందశాతం పూర్తిచేయాలి కపాస్ కిసాన్ యాప్పై రైతులకుఅవగాహన కల్పించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
మోదీతోనే దేశ సమగ్రాభివృద్ధి
నారాయణపేట రూరల్: 11 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో భారతదేశం సమగ్ర అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన సేవా పక్వాడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, బీజేపీ జెండాను ఆవిష్కరించి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి వార్డులో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు జరుగుతున్న సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా శుభ్రతపై సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 25న పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మేధావుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కోటకొండలో వైద్య శిబిరం కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన స్వస్థ నారీ శక్తిశాలి కుటుంబం గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, ఈ ప్రాంత మహిళలకు కోటకొండలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నారని, ప్రజలు పార్టీలకు అతీతంగా కలిసి గ్రామీణాభివృద్ధి, జాతీయ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరుమల దేవునిపల్లిలో స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణంలోని వేంకటేశ్వర స్వామి రజత విగ్రహం శోభాయాత్రలో ఎంపీ డీకే అరుణ పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండురెడ్డి, నాయకులు పడుకుల శ్రీనివాసులు, కెంచె శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు జ్యోతి, సాయిబన్న, లక్ష్మి, ప్రవీణ్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు. -
తెల్ల బంగారందిగుబడి పెరిగేనా
● జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో సాగు ● దిగుబడి అంచనా 20.14 లక్షల క్వింటాళ్లు ● సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు 7 సీసీఐ కొనుగోలు కేంద్రాలు జిల్లాలోని మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉన్న 7 కాటన్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. కాగా అక్టోబర్ 1 వరకు నారాయణపేట, మక్తల్లో ఒక్కొక్క కేంద్రాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. మద్దతు ధర రూ.8,110 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలుకు సంబంధించి నియమాలను కఠినతరం చేసింది. ఈ సారి పత్తిలో తేమ 12 కన్నా ఎక్కువ శాతం ఉంటే కొనుగోళ్లకు అనుమతించబోమని, తేమ శాతం 8 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రోత్సాహకాలు అందిస్తామని సీసీఐ చెప్పుకొచ్చింది. అలానే తేమ శాతం 8–12 మధ్య ఉంటే ధర నిష్పత్తి ప్రకారం తగ్గుతుందని తెలిపింది. పొడవాటి దూదికి క్వింటాలుకు రూ.8,110, మధ్యస్థ దూదికి రూ.7,710 గా సీసీఐ మద్దతు ధర ప్రకటించింది. నారాయణపేట: ఈ ఏడాది వానాకాలంలో సాగు చేసిన పత్తిపంట అధిక వర్షాలతో దెబ్బతినడంతో దిగుబడిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. 20.14 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి జిల్లాలోని పలు ప్రైవేట్ కాటన్మిల్లులో పత్తి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కాగా ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేసేందుకు జిల్లా మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తుంది. మరో వైపు అధికార యంత్రాంగం కాటన్ దిగుబడి ఎంత వస్తుందో అంచనా వేసేందుకు నేరుగా రైతులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వర్షాలతో దెబ్బతింటున్న పత్తి పంట.. ఆందోళనలో రైతులు -
మౌలిక వసతులపై సర్వే
పక్కా ప్రణాళిక.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే చేపట్టాం. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇంకా చేపట్టాల్సిన పనులు, అందులో అత్యంత ఆవశ్యకత కలిగిన వాటిని నమోదు చేస్తున్నాం. ఈ సర్వే ద్వారా గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు ఏర్పాటు అవసరం ఉందో తక్షణం తెలియనుంది. అన్ని గ్రామాల్లో వసతులు మెరుగుపడనున్నాయి. – సుధాకర్రెడ్డి, ఇన్చార్జి డీపీఓ నర్వ: గ్రామపంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. అందులో భాగంగా గ్రామాల్లో ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా జీపీ మానిటరింగ్ యాప్ను నవీకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 270 గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు రెండు రోజుల క్రితం సర్వే ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనంతో సహా ప్రభుత్వ ఆస్తుల వివరాలతో పాటు ప్రజలకు కల్పించాల్సిన వసతుల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరు వరకు సర్వేను పూర్తిచేయాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు. 21 అంశాలతో ప్లానింగ్.. ఈ సర్వేలో 21 అంశాలకు సంబంధించిన సమగ్ర మౌలిక వసతుల వివరాలను సేకరిస్తున్నారు. ఇదివరకే పంచాయతీ కార్యదర్శులు వినియోగిస్తున్న జీపీ మానిటరింగ్ యాప్ను నవీకరించి సర్వేకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు. కార్యదర్శులు గ్రామపంచాయతీ భవనంతో సహా అంగన్వాడీ కేంద్రం, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, ప్రభుత్వ పాఠశాల, వైకుంఠధామం, సామాజిక ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఆరోగ్య కేంద్రాలు, పల్లె ప్రకృతివనం, సీసీ రహదారులు, అనుబంధ గ్రామాల రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, వరద, మురుగు కాల్వలు, తాగునీరు, వీధి దీపాలు, పశువుల నీటితొట్లు, గ్రంథాలయాల తదితర వాటిని పరిశీలించి.. అందులో ఉన్న వసతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వేతో పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్లో ఎలాంటి వసతులున్నాయి.. సమస్యలు ఏంటి.. ప్రజల అవసరాలు. కల్పించాల్సిన వసతులు ఏంటనే లెక్క తేలుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జీపీ మానిటరింగ్ యాప్లో వివరాల నమోదు 21 అంశాలతో పనుల గుర్తింపు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్న సర్వే ప్లానింగ్ గ్రామాల్లో వసతుల మెరుగుకు ఎంతో ప్రయోజనమంటున్న అధికారులు జీపీఐడీపీ యాప్ ప్రత్యేకత.. గ్రామాల్లో మౌలిక వసతులను తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది. జీపీఐడీపీ (గ్రామపంచాయతీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్) యాప్లో పంచాయతీ కార్యదర్శులు తమ డీఎస్ఆర్ (డెయిలీ శానిటేషన్ రిపోర్టు)తో పాటు ఈ యాప్లో పొందుపరిచిన 21 అంశాల్లో మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాలి. అయితే మౌలిక వసతులు కల్పించే సంవత్సరం, కావాల్సిన నిధులు, ఎక్కడి నుంచి నిధులు తీసుకోవాలనే వివరాలు యాప్లోనే ఉంటాయి. నమోదు చేయగానే ఆ వివరాలు క్యాప్చర్ అవుతాయి. ఇలాంటి ప్రత్యేక యాప్ ద్వారా పక్కా ప్రణాళిక రూపొందించనున్నారు. -
ఉత్సాహంగా సెపక్తక్రా పోటీలు
వనపర్తి: వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 11వ అంతర్ జిల్లా సీనియర్ మెన్స్ అండ్ ఉమెన్స్ సెపక్తక్రా రాష్ట్రస్థాయి చాంపియన్షిప్ క్రీడా పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల వారీగా ఒక్కో జిల్లా నుంచి మెన్స్, ఉమెన్స్ రెండు జట్ల చొప్పున మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రతిభకనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా అన్నివిధాలా ప్రోత్సాహం అందిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా రాణించాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రూ.800 కోట్లు క్రీడలకు కేటాయించిందన్నారు. క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లేందుకు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సెపక్తక్రా క్రీడలకు సంబంధించి బాల్స్ కొనుగోలు చేసేందుకు కొంత ఇబ్బందులు ఉన్నట్లు తెలిసిందని ఇందుకు సంబంధించి అట్టి క్రీడకు సంబంధించిన అసోసియేషన్ వారు తమకు నివేదిక ఇస్తే మలేషియా నుంచి బంతుల్ని తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి మెడల్స్ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీలో మైదానాలను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇక జిల్లాకు రూ.57 కోట్లతో స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందని, వచ్చే ఏడాదికి వనపర్తిలో ఇండోర్ స్టేడియం అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. యువత లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించేవరకు కష్టపడాలని, గత ఏడాది తెలంగాణ నుంచి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జీవాంజిని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పాల్గొన్న 20 జట్లు -
పేట ఎత్తిపోతల పథకానికి భూ సర్వే
ఊట్కూరు: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆదివారం నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో భూ సర్వే చేపట్టడంతో రైతులు అయోమయానికి గురయ్యారు. నెల రోజుల క్రితం సర్వే చేపట్టి రైతులకు నోటీసులు ఇచ్చారు. దీంతో తమ భూములు పోలేదని చాలా మంది రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆదివారం ఉదయం మరోసారి అధికారులు రైతులు సమాచారం ఇవ్వకుండా దంతన్పల్లి శివారులో రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం సర్వే చేపట్టారు. దీంతో రైతులు అధికారులను నిలదీశారు. గతంలో సర్వే పూర్తి చేశామని అధికారులు తెలిపారని, మళ్లీ సర్వే చేపట్టడం వల్ల భూములు కోల్పోవాల్సి వస్తుందని రైతులు అనిల్, వీరేష్గౌడ్, నరేష్గౌడ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సర్వేకు సంబంధించి ముంపునకు గురవుతున్న భూమి వివరాలను రైతులకు తెలుపకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు ఎత్తిపోతల పథకంపై పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. -
‘ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీల పెంపు సరికాదు’
నారాయణపేట రూరల్: హిందూ పండుగలు, జాతరల సమయంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీలను పెంచి ప్రయాణికులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధానకార్యదర్శి కన్న శివకుమార్ అన్నారు. ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీ వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం వీహెచ్సీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం డీఎం లావణ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ, దసరా, దీపావళి ఇతర పండుగల సమయంలో చాలామంది ప్రయాణికులు స్వస్థలాలకు వస్తుంటారని.. అలాంటి సమయంలో ప్రత్యేక బస్సుల పేరుతో చార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు రవికుమార్గౌడ్, ప్రవీణ్, వడ్ల శ్రావణ్, కృష్ణ, నర్సింహ, చక్రి, శివకుమార్, రవి, శ్రీను, వెంకటేశ్, ఆకాశ్ పాల్గొన్నారు. తిలతైలాభిషేకం బిజినేపల్లి: నందివడ్డెమాన్లోని జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనిదోష నివారణ కోసం తిలతైలాభీషేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం కొత్తగా వచ్చే భక్తుల కోసం ఆలయ సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశారస్త్రి తెలిపారు. అనంతరం భక్తులు బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకోగా.. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
దసరాకు ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్నగర్ రీజియన్లో 641 ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులు తిరగనున్నాయి. రీజియన్లోని పది డిపోల నుంచి ఈ అదనపు బస్సులు శనివారం ప్రారంభం కాగా.. వచ్చే నెల 2వ తేదీ వరకు నడపనున్నారు. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మహబూబ్నగర్ రీజియన్లోని డిపోల నుంచి అదనపు సర్వీసులు నడపనున్నారు. రీజియన్ వ్యాప్తంగా.. దసరా పండుగను పురస్కరించుకొని మహబూబ్నగర్ రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు నడవనున్నాయి. హైదరాబాద్ రూట్లో ఎక్కువ అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. ఈ రూట్లోనే ఆర్టీసీకి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కర్నూలు రూట్లోనూ అదనపు బస్సులు నడవనున్నాయి. మహబూబ్నగర్ డిపో నుంచి అధికంగా 93 అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా, వారి సౌకర్యార్థం అదనపు వలంటీర్లను అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా తాగునీటి వసతి, షెల్టర్లు, కూర్చోవడానికి కుర్చీలు, బస్సుల వివరాలు, సూచనలను ఎప్పటికప్పుడూ ప్రయాణికులకు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఆదివారం నుంచి పాఠశాలలకు సెలవులు ఉండడంతో శనివారం బస్టాండ్లలో రద్దీ కొంతమేర కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. పెరగనున్న ఆదాయం.. దసరా పండుగ సందర్భంగా సాధారణ రోజుల కంటే మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్కు కొద్దిమేర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పండుగ ప్రారంభ మూడు రోజులు, ముగింపు అనంతరం రెండు రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. కొల్లాపూర్ 50 సద్వినియోగం చేసుకోవాలి దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ తరపున అదనపు బస్సులు నడపనున్నాం. బస్సు సౌకర్యాన్ని ప్రయాణికుల సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఆర్టీసీని ఆదరించి బస్సుల్లో ప్రయాణించాలి. – సంతోష్కుమార్, ఆర్ఎం, మహబూబ్నగర్ రీజియన్ వ్యాప్తంగా 641 అదనపు సర్వీసులు వచ్చేనెల 2 వరకు నడపనున్న ఆర్టీసీ హైదరాబాద్ రూట్లో ఎక్కువ స్థాయిలో రాకపోకలు -
వేతన వ్యథ..
అతిథి అధ్యాపకులకు 8 నెలలుగా అందని జీతాలు ● గత డిసెంబర్ నుంచి పెండింగ్ ● నెలల తరబడి వేతనాలు అందక అవస్థలు ● జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 22మంది మాత్రమే రెన్యువల్ ● మరో 22మంది పరిస్థితి అయోమయం ●కుటుంబ పోషణ భారంగా మారింది.. ప్రభుత్వం కొన్ని నెలలుగా వేతనాలు అందించకపోవడంతో అవస్థలు పడుతున్నాం. కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. – బాల్రాజ్, అతిథి అధ్యాపకుడు, గుండుమాల్ ఉద్యోగ భద్రత కల్పించాలి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొన్నేళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నాం. తమకు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలి. – మధుసూదన్రెడ్డి, అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర కోశాధికారి ప్రొసీడింగ్ విడుదల.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, గెస్ట్ లెక్చలర్స్, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 970 మంది వేతనాలపై ప్రభుత్వం ప్రొసీడింగ్ విడుదల చేసింది. అందులో దాదాపు 398 మంది అతిథి అధ్యాపకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ బోర్డు పరిశీలనలో ఉంది. త్వరలోనే అతిథి అధ్యాపకులకు వేతనాలు అందే అవకాశం ఉంది. – సుదర్శన్రావు, డీఐఈఓ మద్దూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఎనిమిది నెలలుగా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఓవైపు వారిని పూర్తిస్థాయిలో రెన్యువల్ చేయకపోవడం.. మరోవైపు నెలల తరబడి వేతనాలు అందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 8–10 ఏళ్లుగా పనిచేస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషిచేసిన ఎంతో మంది అతిథి అధ్యాపకులను ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమించడంతోనే అతిథి అధ్యాపకుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని పలువురు వాపోతున్నారు. భూనీడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాభోదన చేస్తున్న అతిథి అధ్యాపకుడు -
పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు
● విద్యార్థుల తల్లిదండ్రులకుపలు సూచనలు ● నేటి నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు నారాయణపేట రూరల్: దసరా సెలవుల నేపథ్యంలో శనివారం ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు. తల్లిదండ్రులు విధిగా సమావేశాలకు హాజరయ్యేలా ముందస్తు చర్యలు చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారుల ఆదేశాల మేరకు ‘సంతోషకరమైన, సురక్షితమైన దసరా సెలవులు’ అంశంపై అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశమై పలు సూచనలు చేశారు. జిల్లాలోని 337 ప్రాథమిక, 86 యూపీఎస్, 75 ఉన్నత పాఠశాలలు, 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, రెండు మోడల్ స్కూళ్లలో పీటీఎం సమావేశాలను విజయవంతంగా పూర్తిచేశారు. సమావేశాల నిర్వహణ తీరును ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు పర్యవేక్షించారు. ప్రోత్సాహం అందించాలి.. పీటీఎం సమావేశాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు బాల్యంలో దసరా పండుగ ఎలా నిర్వహించుకున్నారు.. ఆ రోజుల్లో వారు చేసిన సాహసాలు, అనుభవాలను తెలుసుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో పిల్లలను భాగస్వాములను చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. దసరా సెలవులను ఆనందంగా గడిపేలా ప్రోత్సహించాలని తెలిపారు. సెలవుల తర్వాత వచ్చే పరీక్షలకు కూడా సన్నద్ధమయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాగుల వద్దకు పిల్లలు ఒంటరిగా వెళ్లనివ్వొద్దని తెలిపారు. రోజుకో గంటపాటు చదివేలా చూడాలన్నారు. పర్యావరణహితంగా దసరా పండుగ నిర్వహించుకునేలా మార్గదర్శనం చేయాలని కోరారు. అదే విధంగా పిల్లల బేస్లైన్ పరీక్ష, నిర్మాణాత్మక పరీక్షలు, ప్రిమీడ్ లైన్ పరీక్షల ఫలితాలను తెలియజేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి.. గైర్హాజరుతో కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థుల ఇంటిబాట రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల పాఠశాలల విద్యార్థులు దాదాపు 13 రోజులపాటు ఇంటి వద్దే ఉండనున్నారు. వచ్చే నెల 4వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వసతిగృహాల్లో ఉండే చిన్నారులు శనివారం మధ్యాహ్నం నుంచే స్వగ్రామాలకు బయలుదేరారు. పిల్లలను ఒంటరిగా వదలొద్దు.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహించి.. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేశారు. సెలవుల సందర్భంగా సూచనలు అందించారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ఇచ్చినందున విద్యార్థులు ఇళ్ల వద్దే ఉంటారు. వారు రోజు గంటపాటు చదువుకునేలా చూడాలి. ఒంటరిగా పొలాలు, చెరువుల వద్దకు పంపరాదు. – గోవిందరాజు, డీఈఓ -
రూ.6.50 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
అమరచింత: నియోజకవర్గంలో అతిపెద్ద ఎత్తిపోతల చంద్రగఢ్కు మహర్దశ రానుంది. ఏళ్ల కిందట మరమ్మతుకు గురై ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించకుండా ఉన్న ఎత్తిపోతల మరమ్మతుపై మంత్రి వాకిటి శ్రీహరి దృష్టి సారించారు. మక్తల్ పర్యటనకు వచ్చిన భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సమస్యను విన్నవించి నిధులు మంజూరు చేయాలని కోరడం.. రెండు నెలల కిందట ఆయకట్టు రైతులతో కలిసి మరోమారు సంబంధిత శాఖ మంత్రిని కలవగా మరమ్మతుకు వెంటనే రూ.6.50 కోట్లు మంజూరు చేసి ఇందుకు సంబంధించిన జీఓ పత్రాలను సైతం ఇరిగేషన్ అధికారులకు అందించారు. ప్రస్తుతం రూ.4 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని.. త్వరలో మరో రూ.2.50 కోట్లు రావచ్చని వెల్లడిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జూరాల జలాశయం నిల్వనీటి ఆధారంగా చంద్రగఢ్, బెక్కర్పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి 2005లో అప్పటి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో ఎత్తిపోతల కింద 5 వేల ఎకరాల ఆయకట్టును రూపొందించి సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టారు. కాని పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతలను రైతులకు అప్పగించా రు. నాణ్యత లేని పైపులు వినియోగించడంతో ఎక్కడికక్కడే పగిలి నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ప్రతి ఏటా పైపులు పగిలి పంటలు నష్టపోయిన సందర్భా లు ఎన్నో ఉన్నాయి. గత ప్రభుత్వ హయంలో పైపుల మార్పునకు నిధులు మంజూరు చేయాలని పలుమా ర్లు ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా కూడా విడుద ల చేయలేదు. ప్రస్తుతం చంద్రగఢ్, బెక్కర్పల్లి ఎత్తిపో తల కింద 2,800 ఎకరాలు మాత్రమే సాగవుతుంది. ● నాగిరెడ్డిపల్లి, చంద్రగఢ్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్యానల్ బోర్డులు కాలిపోవడంతో వీటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంది. అదేవిధంగా ఎత్తిపోతల నీటిని ఆయకట్టు రైతులకు అందించేందుకుగాను అంతర్గత పైప్లైన్లు వేయాల్సి ఉంది. పైపులు పగిలిపోవడం, లీకేజీలు ఏర్పడటంతో మంజూరైన నిధులతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలి. వీటితోపాటు అనేక చిన్న చిన్న మరమ్మతులు, విద్యుత్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లను బిగించాల్సి ఉందని ఆయకట్టు రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త ప్యానల్ బోర్డులు, పైపులైన్ల ఏర్పాటుకు చర్యలు టెండర్ ప్రక్రియలో ఆలస్యం వినియోగంలోకి రానున్న నాగిరెడ్డిపల్లి, బెక్కర్పల్లి ఎత్తిపోతలు ఉమ్మడి లిఫ్ట్ ఆయకట్టు 15 వేల ఎకరాలు నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కెనాల్, పైప్లైన్ మార్చాల్సి ఉండగా.. చిన్న సంపుహౌజ్లు నిర్మించాల్సి ఉంది. కొత్త ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో వీటికోసం రూ.2.85 కోట్లు ప్రతిపాదించారు. చంద్రగఢ్ ఎత్తిపోతల పథకంలో ప్యానల్ బోర్డు, పైపులైన్ మార్చేందుకు రూ.1.93 కోట్లు ప్రతిపాదించారు. బెక్కర్పల్లి ఎత్తిపోతల పనులకు సంబంధించి రూ.2.13 కోట్లు అవసరమంటూ అప్పట్లోనే నీటిపారుదలశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు అందించారు. తాజాగా మంత్రి వాకిటి శ్రీహరికి కూడా ఇవ్వడంతో నిధులు మంజూరయ్యాయి. -
పకడ్బందీగా ఓటరు జాబితా
నారాయణపేట: 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ వివరించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు – కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాల మధ్య విశ్లేషణ, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా పరిశీలనను వ్యవస్థీకృతంగా నిర్వహించేందుకు కేటగిరీలుగా విభజించి నిర్దేశాలు ఇచ్చారు. ఈ నెల 24వ తేదీన నివేదికలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా నివేదికలు రూపొందించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శీను, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వర్, ఆర్డీఓ రామచంద్రనాయక్, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని అమలు చేయాలి కోస్గి రూరల్: న్యాయవాదులపై దాడుల నేపథ్యంలో న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోస్గి కోర్టు బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓంప్రకాష్ అన్నారు. దాడులకు నిరసనగా శుక్రవారం న్యాయవాద విధులను బహిష్కరించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. నాంపల్లి కోర్టులో సిఓపి న్యాయవాదులు విధులు నిర్వహిస్తున్న అనిల్కుమార్, హనుమాన్నాయక్లపై దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయవాదులపై దాడి జరగడం అంటే న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, కోర్టు అధికారంపై దారుణమైన సవాలుగా భావిస్తున్నామన్నారు. వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు విఎన్ గౌడ్, రాజలింగం, సంతోష్ , తాజ్ఖాన్, రాజురెడ్డి ,మురళి , మల్లేష్ , భీమేష్ పాల్గొన్నారు. నూనె గింజల ఉత్పత్తి పెంచడమే లక్ష్యం కోస్గి రూరల్: నూనె గింజల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వదేశంలోనే ఉత్పత్తులను గణనీయంగా పెంచచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని జిల్లా వ్యవసాయాధికారి జాన్సుధాకర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్యార్డు ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ అన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద బంగినపల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘంలోని రైతులకు మాత్రమే వంద శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘంలోని 800 మంది రైతులకు సంబంధించి 1000 ఎకరాలలో వేరుశనగ సాగు కోసం విత్తనాలు పంపిణీ చేశామన్నారు. జీజేజీ–32 రకం వేరుశనగ విత్తనాలు రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అత్యంత అనువైనవని అన్నారు. వర్షాధార పంటలకు అనుకూలమని, పెద్ద గింజలతో కూడిన విత్తనాలని, ఎక్కడ నూనె శాతం, వ్యాధుల నిరోధకత ఎక్కువగా ఉంటుందన్నారు. దిగుమతులను తగ్గించి దేశీయంగా నూనె గింజలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. -
డబ్బులు సరిపోవడం లేదు
ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోగా మాకు ఇల్లు మంజూరైంది. అయితే ప్రభుత్వం నుంచి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఇక్కడ రేట్లు పెరగడంతో ఇల్లు కట్టుకోలేక పోతున్నాం. ఇసుక, సిమెంట్, సీకుల ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం మార్కెట్ రేటు ప్రకారం ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పెంచాలి. – హోటల్ పార్వతమ్మ, ఇర్కిచేడు, కేటీదొడ్డి మండలం, గద్వాల జిల్లా ధరలు పెరిగాయి.. భారంగా మారింది... ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణానికి అయ్యే ఖర్చులో కొంతభాగం ప్రభుత్వం అందించడం చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ వరకు పూర్తి చేస్తే రూ.లక్ష బిల్లు వచ్చింది. కానీ ఇసుక, సిమెంట్, ఇటుక, కంకర, స్టీల్ ధరలు బాగా పెరగడంతో నిర్మాణం భారంగా మారింది. ఇసుక ఉచితంగా, స్టీల్, సిమెంట్, కంకర, ఇటుక తక్కువ ధరకు అందిస్తే బాగుంటుంది. – చింతకాల గౌతమి, కడుకుంట్ల (వనపర్తి) నాలుగు నెలలైనాబిల్లు రాలేదు.. ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి బేస్మెంట్ వరకు నిర్మించుకున్నాం. అధికారులు ఫొటో, వివరాలు తీసుకొని మూడు నెలలు అయింది. ఇప్పటివరకు బేస్మెంట్ బిల్లు రూ.లక్ష రాలేదు. చేతిలో చిల్లి గవ్వలేక ఇంటి నిర్మాణాన్ని ఆపేశాం. – ఆలేటి ఎల్లమ్మ, గట్టురాయిపాకుల, నాగర్కర్నూల్ జిల్లా ఆధార్కార్డుల్లో తప్పులతో ఇబ్బంది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాం. జిల్లాలో ఇప్పటివరకు 4,103 మంది లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.42.84 కోట్లు జమ చేశాం. ఆధార్కార్డుల్లో తప్పులతో పలువురికి సమస్యలు తలెత్తగా.. పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జీఎస్టీ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటివరకు దూరంగా ఉన్న లబ్ధిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. – వైద్యం భాస్కర్, గృహనిర్మాణశాఖ పీడీ, మహబూబ్నగర్ ● -
నిర్లక్ష్యం తగదు
విద్యారంగంపై నారాయణపేట రూరల్: విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి సరికాదని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. స్థానిక గురుకుల పాఠశాలలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ నిర్వహించిన టీఎల్ఎం మేళాకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఉపాధ్యాయుల ప్రదర్శనలు తిలకించి రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టు టీచర్లకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యాబోధన జరగాలంటే విద్యార్థులకు తగినట్లు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలన్నారు. సరిపడా టీచర్లు లేక గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సమీపంలోని పట్టణాలకు వెళ్లి ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను, వసతులను కల్పించాలని డిమా ండ్ చేశారు. అన్ని రకాల గురుకుల పాఠశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులువైన పద్ధతిలో బోధన చేపట్టాలని ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ దగ్గర ఉన్న జ్ఞానాన్ని విద్యార్థులకు పంచాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక తెలుగు విభాగంలో అరుణ (మొగల్ మడ్కా), జాన్సీరాణి (కొత్తపల్లి), ఇంగ్లీష్ లో సంధ్య (సహనాపూర్), శ్రావణి (విఠలపూర్), గణితంలో వెంకటేష్ (పేరపళ్ళ), నరేష్ (గడిముంకంపల్లీ), ఈవీఎస్ విభాగంలో సత్యపాల్ (వల్లంపల్లి), లక్ష్మీదేవి (పోతిరెడ్డి పల్లి), ఉర్దూ మీడియంలో ఉస్మాన్ (ముద్రిఫా)లు ఎంపికయ్యారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతి కార్య క్రమాలు అలరించాయి. డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, సీఎంఓ రాజేంద్ర కుమార్, డీఎస్ఓ భాను ప్రకాష్, సెక్టోరియల్ అధికారులు నాగార్జునరెడ్డి, యాదయ్యశెట్టి పాల్గొన్నారు. ప్రోటోకాల్ రగడ ఇదిలాఉండగా, జిల్లా స్థాయి టీఎల్ఎం మేళా ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఆమె పేరు రాయడంతో పాటు, కార్యక్రమానికి ఎంపీని పిలిచి ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదంటూ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రోటోకాల్ ప్రకారం పలువురు ప్రజాప్రతినిధుల ఫొటోలను ఫ్లెక్సీలో ఏర్పాటుచేసి గ్రంథాలయ చైర్మన్ ను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఈమేరకు స్టేజీపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించి, ఉపాధ్యాయులను హాల్ నుంచి బయటికి పంపి గేట్ కి తాళం వేశారు. డీఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్న డీఈఓ గోవిందరాజు తో వాగ్వాదానికి దిగి, శాఖ తరపున జరిగిన తప్పిదానికి ఎమ్మెల్యేకు క్షమాపణలు చెప్పించారు. సలీం, వెంకటేష్, మల్లేష్ పాల్గొన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం ఊట్కూరు: మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుందని.. ఎంపీ డీకే అరుణ అన్నారు. స్వస్త్నారి–స్వశక్తిపరివార్ కార్యక్రమంలో భాగంగా పులిమామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. -
రైతులకు పింఛన్
ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకంతో అన్నదాతలకు పింఛన్ ●ప్రతి నెల చెల్లించేది వయస్సు ప్రీమియం (రూ.లో) 18–20 55 21–24 61 25–29 80 30–39 150 40 200 కోస్గి: వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు అందిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం పింఛన్ పథకం అమల్లోకి తెచ్చింది. ఏళ్ల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకు వృద్ధాప్యంలో ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన’ పథకం అమలు చేస్తూ అర్హులైన రైతులకు నెలనెల పింఛన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐదెకరాల లోపు.. కొత్త పింఛన్ పథకంలో నమోదు చేసుకోవడానికి 18 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండి ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులను అర్హులుగా నిర్ణయించారు. భూ రికార్డుల్లో భూమి పట్టాదారులుగా పేర్లు నమోదై ఉండి నిర్ణీత వయస్సు ఉన్న రైతులు కేంద్రం నిర్దేశించిన ప్రీమియం చెల్లించి పింఛన్ పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్), ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. వ్యవసాయ భూములున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, ఆర్థికంగా ఉన్నవారు, సామాజిక భద్రత పథకాలు పొందుతున్న వారికి ఈ పింఛన్ పథకం వర్తించదు. కోస్గి శివారులో వరినాట్లు వేస్తున్న మహిళా కూలీలు(ఫైల్) 18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న రైతులు అర్హులు నామమాత్రపు ప్రీమియంతో.. అవగాహన కల్పిస్తే ఎంతో మంది రైతులకు ప్రయోజనం జిల్లాలో 1.92 లక్షల మంది రైతులు నూతన పథకానికి దరఖాస్తు చేసుకున్న రైతులు తమ వయస్సు ఆధారంగా రూ.55 నుంచి రూ.200 వరకు నామమాత్రపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు చెల్లించే ప్రీమియం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమాన మొత్తంలో నిధులు జమ చేస్తుంది. రైతులు 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతినెల రూ. 3 వేల చొప్పున జీవితాంతం రైతుకు పింఛన్ అందుతుంది. రైతు మరణిస్తే అతడి భార్య లేదా నామినీకి ప్రతినెల రూ.1,500 అందజేస్తారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకానికి అన్ని రకాలుగా అర్హతలున్న రైతులు ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి పీఎం కిసాన్ కేఎంవై పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రైతు పూర్తి వివరాలు, ఆధార్, నామినీ వివరాలు, రైతు సంతకంతో పాటు రైతు బ్యాంకు వివరాలు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాగానే పింఛన్ కార్డు వస్తుంది. పథకంలో నమోదు చేసిన బ్యాంకు ఖాతా నుంచి నెలనెల పింఛన్కు సంబంధించిన ప్రీమియం డబ్బులు నేరుగా ఖాతా నుంచి తీసుకోబడతాయి. -
రైతులకు సరిపడా యూరియా అందజేయాలి
మద్దూరు: రైతులకు సరిపడా యూరియా ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిలభారత ఐక్య రైతు సంఘం అధ్వర్యంలో మద్దూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఽసంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు యూరియాను సరఫరా చేయడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రానికి కేంద్రం సరఫరా చేయాల్సిన యూరియా 9.91 లక్షల మెట్రిక్ టన్నులైతే ఇప్పటి వరకు సరఫరా చేసినా యూరియా 7 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అన్నారు. మోదీ ప్రభుత్వం యూరియా సరఫరాల రాజకీయ డ్రామాలు ఆడుతుందన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా కోసం కేంద్రపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని, రైతుకు అవసరమైనప్పుడు యూరియా సరఫరా చేయకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. వెంటనే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైన మేర యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం నాయకులు కొండ నర్సిములు, శ్రీహరి, అంజి, రాములు, కృష్న, వెంకటప్ప, హన్మప్ప, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
మా కూలీ మాకివ్వాలి
● ‘ఉపాధి’ అవకతవకలపై విచారణకు వచ్చిన అధికారులను కూలీల అడ్డగింత ● పోలీసుల రంగ ప్రవేశం.. ఖానాపూర్లో ఉద్రిక్తత మక్తల్: ఉపాధి హామీ పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ మరికొందరు అవినీతికి పాల్పడ్డారని, వారిని సస్పెండ్ చేయడంతోపాటు మా కూలీ మాకివ్వాలంటూ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్తల్ మండలం ఖానపూర్ గ్రామంలో గురువారం ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగాయని కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించేందుకు అధికారులు వెళ్లగా కూలీలు వారిని అడ్డుకొని వారిని తిప్పి పంపారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కార్యదర్శి, బీపీఎం, ఫీల్డ్ అసిస్టెంట్ ముగ్గురు కలిసి అవకతవకలు చేశారని గత నెల 30న మక్తల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూలీలు ధర్నా చేశారు. ఈ నెల 1న కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయగా.. నర్వ, మక్తల్ ఎంపీడీఓలు శ్రీనివాసులు, రమేష్కుమార్ను విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో గురువారం వారితోపాటు ఏపీఓ సత్యప్రకాస్, ఈసి శ్రీనివాసులు గ్రామానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కూలీలంతా ఏకమై వారిని అడ్డుకున్నారు. మా కూలీ డబ్బులు మాకివ్వాలని, చే యని వారికి డబ్బులు ఇచ్చారని, అవినీతికి పాల్పడిన వారిని విధుల్లో తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అప్పటివరకు విచారణ చేసేదిలేదంటూ వెనక్కి వెళ్లాలంటూ గ్రామపంచాయతీ ఎదుట ధర్నా నిర్వహించారు. కూలీలు అధికంగా తరలిరావడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఖానాపూర్లో విచారణకు వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగగా.. కూలీలకు సర్దిచెబుతున్న ఎస్ఐ -
వేతనాల్లో కోత విధించడం తగదు
నారాయణపేట రూరల్: ముందస్తు సమాచారం లేకుండా గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాల్లో కోత విధిస్తూ జీవో విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీ, జేఎల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి సమయాన్ని పాఠశాలకు కేటాయించి విద్యనందిస్తున్న అధ్యాపకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ఉన్న వేతనాలను భారీగా కోత విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే గతంలో చెల్లించిన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. -
కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
● ఇనాం భూమి ఓఆర్సీ కోసంరూ.40 వేలు లంచం డిమాండ్ ● ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్నుఅదుపులోకి తీసుకున్న అధికారులు కొత్తకోట రూరల్: రోజూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారులకు ప్రభుత్వ అధికారులు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా గురువారం వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని నిర్వేన్కు చెందిన ఓ రైతు తన ఇనాం భూమి ఓఆర్సీ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ విచారణకు ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్రెడ్డిని ఆదేశించారు. వీరిద్దరు భూమి చూడటానికి రూ.40 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. వీరిని శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే హెల్ప్లైన్ నంబర్ 1064కు లేదా ఏసీబీ వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు లింగస్వామి, ఎస్కే జిలాని, కిషన్నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇబ్బందిగా ఉంది
మా బాబుకు ఒంట్లో ఆరోగ్యం సరిగా లేక వారం రోజులుగా జనరల్ ఆసుపత్రి చిన్నపిల్లల వార్డులో వైద్యం తీసుకుంటున్నాం. బాబుకు విరోచనాలు అవుతుండడంతో నీటి సదుపాయం లేక తాళం వేసి ఉండడంతో ఆసుపత్రి దిగువ భాగానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నాం. తాగడానికి నీటి సదుపాయం లేదు.. వాడుకోవడానికి నీరు లేకపోవడంతో బయట నుండి నీటిని కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. – ఆనంద, నర్సపూర్, దామరగిద్ద మండలం ఆస్పత్రికి ఏర్పాటు చేసిన వాటర్ సంపులో మోటార్ చేడిపోవడంతో నీటి ఇబ్బందులు తలెత్తాయి. గురువారం మోటార్ మరమ్మతు చేయించి బిగించాం. నీటి ఇబ్బంది రాకుండా చూస్తాం. – ఆదిత్య గౌడ్, జిల్లా ఆస్పత్రి వైద్యాధికారి ● -
యాంటీ డ్రగ్ సోల్జర్స్గా మారాలి
నారాయణపేట: నేటి యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల వాడకాన్ని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు బంగారు బాటలు వేసేందుకు యాంటీ డ్రగ్స్ సోల్జర్స్గా పనిచేయాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్ పిలుపునిచ్చారు. గురువారం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థి సేన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విద్యార్థులతో విద్యార్థి మహా ర్యాలీ నిర్వహించారు. వారు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడితే భవిష్యత్ అంధకారమవుతుందని, యువత భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా పోరాడాలని పోలీస్ విభాగం మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడిన, రవాణా చేస్తున్న, అమ్మిన అట్టి వ్యక్తుల సమాచారం లోకల్ పోలీసులకు లేదా డయల్ 100 కి లేదా 1908 టోల్ ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై కఠినంగా పనిచేస్తుందని, చట్టపరమైన చర్యలతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించడమే ముఖ్య లక్ష్యం అని, ఇలాంటి విద్యార్థి ర్యాలీలు సమాజంలో మార్పు తీసుకొస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కొరకు అందరు పాటుపడాలని ఎమ్మెల్యే కోరారు. ఈమేరకు విద్యార్థులు పోస్టర్లు ప్లకార్డులు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. సిఐ శివ శంకర్,ఎస్ఐ రాముడు, ఎకై ్సజ్ సీఐ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ ఆశయాలను కొనసాగించాలి నారాయణపేట టౌన్: మహాత్మాగాంధీ ఆశయాలు కొనసాగించాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సూచించారు. గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ స్వర్ణోత్సవాలలో భాగంగా లక్ష గాంధీజీ విగ్రహాల ప్రతిష్టాపన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. గాంధీ విగ్రహాలు గ్రామీణ, పట్టణాల ప్రాంతాలలో ప్రతిష్టించబడి శాంతి, సామరస్య చిహ్నాలుగా నిలిచి గాంధీవాద ఆదర్శాలైనా అంహిస, సత్యం , స్వదేశీలను ప్రజలలోకి ప్రవేశ పెట్టడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్ధేశమని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బండి వేణుగోపాల్, నరసింహారావు సగరి, యశ్వంత్ లాండ్గే పాల్గొన్నారు. -
రాకపోకలకు తప్పని తిప్పలు
ఇదిలాఉండగా, జిల్లా ఆస్పత్రి నారాయణపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురుచూపులు తప్పడంలేదు. జనరల్ ఆస్పత్రి నుంచి నారాయణపేటకు వెళ్లాలంటే ఆటోలో ఒక్కరికి రూ.20 చెల్లించాల్సిందే. లేదంటే బస్సు వచ్చేంత వరకు ఆగాల్సిందే. అసలే ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వారి వెంబడి వచ్చే వారికి సమయానికి బస్సులు రాకపోవడంతో ఆటోలో వెళ్లక తప్పడం లేదు. గురువారం సైతం గంట తర్వాత రెండు బస్సులు ఒకేసారి జనరల్ ఆస్పత్రి ముందుకు వచ్చాయి. అవి రెండు సైతం మహబూబ్నగర్ నుంచి నారాయణపేటకు వేళ్లే బస్సులు. గంటసేపు తర్వాత బస్సు రావడం, బస్సు అప్పటికే నిండి ఉండడంతో ఆస్పత్రి వద్ద ప్రజలు ఇక్కేందుకు ఇబ్బందులు పడ్డారు. నారాయణపేట మండలం అప్పక్పల్లి గ్రామ సమీపంలోని జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ, జనరల్ వార్డు, చిన్నపిల్లల వార్డు దగ్గర బాత్రూమ్లలో నీరు లేకపోవడంతో తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి కోసం మిషన్ భగీరథ వాటర్ సంప్ను నింపి ఆస్పత్రి భవనంపై నిర్మించిన ట్యాంకులకు ఎక్కించి టాయిటెట్లు వాటికి నీటిని సరఫరా చేసేవారు. అయితే మోటార్ కాలిపోవడంతో నీటి సమస్య తలెత్తిందంటూ ఆస్పత్రి వర్గాలు ఓ వైపు చెబుతున్నాయి. మరో బోరు లేకపోవడంతో సమస్య జఠిలమైంది. గత వారం రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులను ప్రజా, కార్మిక సంఘాలు జిల్లా వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మోటార్ మరమ్మతు చేయించి గురువారం వినియోగంలోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఒంటికి.. రెంటికీ బయటికే.. ఆస్పత్రిలోని రోగులు, సహాయకులు మంచినీటి బాటిళ్లు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. చివరికి వాడుకునేందుకు సైతం నీరు లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒంటికి, రెంటికీ బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అర్ధరాత్రి వేళల్లో బహిర్భూమికి వెళ్లేందుకు మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు అనుపత్రి వర్గాలు పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రతరమైందని అక్కడివారు వాపోతున్నారు. వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసి తాగునీటికి ఇతర అవసరాలకు వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు, సింకుల వద్ద పరిశుభ్రత లోపించడం, చెత్త డబ్బాలు మూలకు చేరాయని, వీటితో ఆదనపు రోగాలు వచ్చే అవకాశం ఉందంటూ రోగులు ఆందోళన చెందుతున్నారు. సహాయకురాలు వెంకటమ్మ సాయంతో కాలకృత్యాలకు వెళ్లి వస్తున్న వృద్ధురాలు నీలమ్మ గంట తర్వాత ఆస్పత్రి వద్దకు బస్సు రావడంతో జనం రద్దీ ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట మండలం పేరపళ్ల గ్రామానికి చెందిన నీలమ్మ. విరేచనాలతో జిల్లా ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం అడ్మిట్ అయ్యింది. ఆమెకు సహాయకురాలిగా వెంకటమ్మ ఉంటుంది. అయితే, ఆస్పత్రిలో మరుగుదొడ్లకు తాళం వేయడంతో నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కాలకృత్యాల కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి సరఫరా చేసి ఆసుపత్రిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా లేక.. తాగునీరు రాక.. అత్యవసర సమయంలో డాక్టర్లు స్పందించక తీవ్ర దుస్థితిలో ఆస్పత్రి కొట్టుమిట్టాడుతుందని, పట్టించుకొనే నాథుడే కరువయ్యారంటూ రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు సమస్యలు వస్తుండడంతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడం, సమస్యలపై శ్రద్ద చూపకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా, మద్దూర్ మండలం రేనివట్లకు చెందిన రాజు తన కుమారుడుకి జ్వరం రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే రాసిచ్చిన మందుల్లో రెండు ఉన్నాయని మరొకటి లేదని, బయట తెచ్చుకోవాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. జిల్లా ఆస్పత్రిలో సరిపడా మందులు అందుబాటులో లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
పాలమూరు: పేద రోగులకు సంజీవనిగా పనిచేసే ఆరోగ్యశ్రీ సేవల్లో అంతరాయం ఏర్పడటంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఓపీ సేవలతోపాటు ఖరీదైన సర్జరీలను పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకు రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో ఈ సేవలను కొనసాగించడానికి యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. దీంతో సాధారణ, మధ్య తరగతి రోగుల జేబులకు చిల్లుపడే పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రుల వద్ద బ్యానర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగింది. పాలమూరు పట్టణంలో చాలా ఆస్పత్రులకు రోగులు రాగా సేవలు బంద్ చేసినట్లు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. అన్ని ఆస్పత్రుల ముఖద్వారాల దగ్గర ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఉన్నట్లు నోటీస్ బోర్డులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేస్తున్న ఆరోగ్యశ్రీ కేసులకు సంబంధించిన నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కో ఆస్పత్రికి రూ.కోట్లలో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించడం భారంగా మారినట్లు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. చివరగా గతేడాది మార్చి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆస్పత్రులకు బడ్జెట్ విడుదల కావడం లేదు. దీంతో ఈ విభాగం కింద కేసులను అడ్మిట్ చేసుకోవడంతోపాటు ఓపీ సేవలు అందించడం సవాల్గా మారింది. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఉన్నాయి. ఒక్కో ఆస్పత్రికి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేసిన సర్జరీలు, ఎస్టిమేషన్ వివరాలు జిల్లా చేసిన బకాయిలు సర్జరీలు (రూ.లలో..) గద్వాల 527 1,02,78,990 మహబూబ్నగర్ 19,032 46,95,71,170 నాగర్కర్నూల్ 133 34,03,362 నారాయణపేట 275 1,02,52,882 వనపర్తి 603 1,94,18,046 సేవలు అందుబాటులో లేకపోతే పేదలకు ఆర్థిక ఇబ్బందులే.. మొదటి రోజు ఆస్పత్రులకు వచ్చి తిరిగి వెళ్లిన రోగులు? -
స్వచ్ఛతా హీ సేవా వాల్పోస్టర్ విడుదల
నారాయణపేట: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాలు–2025 కు సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఎంపీడబ్ల్యూ వర్కర్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 25న ఉదయం 8 గంటలకు ఏక్ దిన్ ఏ ఘంటా ఏక్ సాత్ కార్యక్రమంలో భాగంగా యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు జాతీయ స్థాయి శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 తో స్వచ్ఛభారత్ దివస్తో ముగుస్తుందని, ఈ సమాచారం మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛతహీ సేవాలో భాగంగా కలెక్టర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మొగులప్ప, స్వచ్ఛభారత్ మిషన్ జిల్లా మేనేజర్ మాలిక్ పాషా, భార్గవ్, సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనోతృత్తి సాధించాలి
ధన్వాడ: ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలయం సమష్టిగా కార్యచరణ రూపొందిస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత డా.జేడీ సరిత అన్నారు. ‘ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం వ్యవసాయ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు కంసాన్పల్లి, మందిపల్లి, పాతతండా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం ద్వారానే అధిక దిగుబడులను సాధించడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించుకోవచ్చన్నారు. విత్తనోత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఏఓ నవీన్కుమార్, ఏఈఓ సైమన్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ స్టేట్పై పోలీసు చర్య విద్రోహమే
నారాయణపేట: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన సాయుధ రైతాంగ పోరాటాన్ని నెహ్రూ యూనియన్ సైన్యాలు, రజాకార్ పోలీసులు, దొరలు, జమీందారులు కుమ్మకై ్క అణగదొక్కారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి. రాము విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ అధ్యక్షతన సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాటానికి జరిగిన విద్రోహ దినంగా అభివర్ణిస్తూ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత యూనియన్ సైన్యాలు చర్య వలన ప్రజలు విముక్తి చెందకపోగా భూస్వామ్య దోపిడీ ఆధిపత్యాలకు బానిసలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ సైన్యాలు సంస్థానాల్లోకి ప్రవేశించాక ప్రజలకు కొన్ని హక్కులు, భూ పంపకం, దోపిడీదారుల నుంచి రక్షణ లభిస్తుందని భావించినా.. అవేవి జరగ లేదని ఆరోపించారు. యూనియన్ సైన్యాలు ప్రజలపై సాగించిన హత్యాకాండ, అకృత్యాలను విమర్శిస్తూ ప్రజాసాహిత్యం వెలుగులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బి.యాదగిరి, బి.రాము, కిరణ్, చెన్నారెడ్డి, కొండ నర్సింలు పాల్గొన్నారు. -
స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి
నారాయణపేట టౌన్: రైతులు పండిస్తున్న పంటలకు కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా ఎమ్మెస్పీ నిర్ణయించాలని అఖిల భారత ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని భగత్సింగ్ భవన్లో ఏఐయూకేఎస్ డివిజన్ అధ్యక్షుడి సమక్షంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ రైతులు పెట్టిన పెట్టుబడిపై 50 శాతం కలిపి ధాన్యానికి ధర నిర్ణయించాలన్నారు. రైతులు పంట వేసినప్పటి నుంచి అతివృష్టి, అనావృష్టి, చీడపీడలకు, అడవి జంతువుల తాకిడి నుంచి కాపాడి తీర మార్కెట్కు అమ్మడానికి పోతే అడవి.. కొనడానికి పోతే కొరవి అనే పరిస్థితి నెలకొందన్నారు. పత్తి క్వింటాల్కు రూ.10,075 ధర నిర్ణయించి కాటన్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయలన్నారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి కొండ నర్సిములు, ఉపాధ్యక్షుడు నారాయణ, సహాయ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రెడ్క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా శంకరాచారి
నారాయణపేట: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచీ కార్యవర్గ పదవీకాలం ముగియడంతో బుధవారం కలెక్టర్ సిక్తాపట్నాయక్ నారాయణపేట జిల్లా సహకార అధికారి జి. శంకరాచారిని ఎన్నికల అధికారిగా నియమించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి, ఐఆర్సీఎస్ అడహక్ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఐఆర్సీఎస్ మహాజన సమావేశాన్ని కనీసం 21 రోజుల ముందస్తు నోటీసుతో అక్టోబర్ 14, 2025 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించడానికి నిర్ణయించారు. మహాజన సమావేశం 15 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక, ఆఫీసు బేరర్లు అయిన వారిని చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, రాష్ట్ర కార్యదర్శి, నామినీల ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఐఆర్సీఎస్లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలికోస్గి రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల్లోని సభ్యులు తమ పొదుపులను పెంచుకొని ఆర్థికంగా చైతన్యవంతులుగా ఎదగాలని ఆర్బీఐ ఎల్డీఓ గోమతి, ఎల్డీఓ విజయ్కుమార్ అన్నారు. బుధవారం గుండుమాల్ మండల కేంద్రంలో మండల మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక ఆక్షరాస్యత, కేంద్ర ఫ్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్, జీవనోపాధి, సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా ఆవశ్యకత గురించి వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ శీల, ఎంపీడీఓ వేణుగోపాల్, బ్యాంకు మేనేజర్ హరినామశర్శ, సీసీ నర్సిములు తదితరులు ఉన్నారు.బీజేపీ జిల్లా కార్యవర్గం నియామకంనారాయణపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ అన్నారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆయన అధ్యక్షతన జిల్లా కమిటీని నియమించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కర్ని స్వామి (మక్తల్), ఎస్.ఉమేష్ (ధన్వాడ), కెంచె శ్రీనివాసులు (కోటకొండ), కొండ్రు నర్సింహులు (కొడంగల్), మేర్వ రాజు (అమరచింత), పి.చెన్నారెడ్డి (కోయిల్కొండ), ప్రధాన కార్యదర్శులుగా జి.బలరాంరెడ్డి (మక్తల్), లక్ష్మిగౌడ్ (నారాయణపేట), డి.తిరుపతిరెడ్డి (మరికల్), కార్యదర్శులు సుజాత (నారాయణపేట), హన్మంతు (మక్తల్), విజయభాస్కర్రెడ్డి (మద్దూరు), గోపాల్రావు (దామరగిద్ద), రవీంద్ర నాయక్ (కొడంగల్), కనకరాజు (మాగనుర్), కోశాధికారిగా సిద్ధి వెంకట్రాములు (నారాయణపేట), కార్యాలయ కార్యదర్శి సాయిబన్న (భైరంకొండ), సోషల్ మీడియా ఇన్చార్జి రమేష్యాదవ్ (కొడంగల్), మీడియా కన్వీనర్ కిరణ్ డగే (నారాయణపేట), ఐటీ ఇన్చార్జి బి.అనూష (నారాయణపేట)లను నియమించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు పి.శ్రీనివాసులు, మండల మాజీ అధ్యక్షుడు సాయిబన్న పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ భగవాన్ వేడుకలు
మక్తల్: విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతిని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని స్థానిక నల్లజానమ్మ ఆలయం నుంచి శ్రీమోనేశ్వరస్వామి ఆలయం వరకు విశ్వకర్మ పల్లకీసేవను భజనలతో ఊరేగించారు. ఆలయం వద్ద హోమం నిర్వహించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు పాలాభిషేకం చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. చిన్నారులు చేసిన దాండియా నృత్యాలు, భజనలు పలువురిని ఆకట్టుకున్నాయి. సాయిజ్యోతి పాఠశాల తరఫున 2024– 2025 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విశ్వకర్మ విద్యార్థులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు పోర్ల విశ్వనాథ్, పోర్ల రాఘవేందర్, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రాఘవేంద్రచారీ, ప్రధాన కార్యదర్శి గట్టురవి ఆచారీ, కోశాధికారులు కడ్మూర్ రాజు, వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
సస్యశ్యామలం చేద్దాం
● పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ ● రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ ● కొత్తగా 23,411 రేషన్ కార్డుల మంజూరు ● సన్న వడ్లకు రూ.70.44 కోట్ల బోనస్ చెల్లింపు నారాయణపేట/మక్తల్: తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కీలకమైన రోజు అని, హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమై నేటికి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ వసంతంలోకి అడుపెడుతున్నందున రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టరేట్తో పాటు జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కలెక్టరేట్లో, మక్తల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పాటు అందించి అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తున్నామన్నారు. ప్రజాపాలనకు అంకురార్పణ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేర్చుతున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా నారాయణపేటలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారని, ఇప్పటి వరకు వారికి రూ.15.02 లక్షల లాభం వచ్చిందన్నారు. స్వయం సహాయక బృందాలకు జిల్లాలో 4 కొత్త బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో 1.87 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోగా.. వారికి రూ. 88.14 కోట్లు ఆదా అయ్యాయని పేర్కొన్నారు. 69,808 మంది లబ్ధిదారులకు 1.84 లక్షల సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వడంతో రూ.4.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఏప్రిల్ నుంచి రేషన్ షాపుల ద్వారా జిల్లాలో 1,61,719 ఆహార భద్రత కార్డు లబ్ధిదారులకు 3,808 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు 23,411 మంజూరు చేయగా.. 50,938 మందిని రేషన్ కార్డులో చేర్చారన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 80,795 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలో 19,146 మంది పేదలు చికిత్స తీసుకోగా రూ.51.89 కోట్లు చెల్లించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.16.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీరు నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు రూ.4,350 కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీ యోగేష్గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, శ్రీను, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్నాయక్, మక్తల్ సీఐ రాంలాల్, తహసీల్దార్ సతీష్కుమార్, కమిషనర్ నర్సిములు, ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తదితరులు జిల్లా కేంద్రంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి జిల్లాలో 65,631 మంది రైతులకు రూ.574 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా కింద 1,79,154 మంది రైతులకు రూ.260.56 కోట్లు చెల్లించామని తెలిపారు. 1,40,894 టన్నుల సన్న వడ్లు సేకరించి బోనస్ రూ.70.44 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. -
అయిజలో లెవి సహాయ నిరాకరణోద్యమం
అయిజ: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాల పురిటిగడ్డగా అయిజ నిలిచింది. ఇక్కడే లెవి సహాయ నిరాకరణోద్యమానికి బీజం పడింది. 1947 డిసెంబర్ 12న నిజాం నవాబు ప్రవేశపెట్టిన లెవి పన్నుకు వ్యతిరేకంగా అయిజ గ్రామ రైతులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ పోరాటాన్ని అణచివేసేందుకు నిజాం నవాబులు జరిపిన కాల్పుల్లో రైతులు నాయకి చిన్న తిమ్మప్ప, కల్లె బీచుగాడు, కొండాపురం నర్పప్ప, పాగుంట వెకటయ్య, బలిజ నాగయ్య వీరమరణం పొందారు. నిజాం నవాబుల దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఎంతో మంది పోరాటయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. స్మరించుకోని పాలకులు.. నైజాం నవాబుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను నేటి పాలకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆనాటి అమరవీరులకు గుర్తుగా 1955లో అయిజలో స్తూపాన్ని నిర్మించారు. 1999లో ఆ స్తూపాన్ని ఆధునికీకరించి.. గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించే సమయాల్లోనూ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను స్మరించుకోకపోవడం శోచనీయం. -
మహిళా ఆరోగ్యానికి రక్ష
● రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్యశిబిరాలు ● ప్రతి రోజు మూడు మండలాల్లో స్పెషలిస్టులతో పరీక్షలు నర్వ: నిత్యం ఇంటా బయట పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళల ఆరోగ్యానికి మరింత భరోసా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా ప్రతి మహిళకు అన్నిరకాల వైద్యపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్యశిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ మా కార్యక్రమానికి అనుసంధానంగా మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహించి.. అనారోగ్య సమస్యలను గుర్తించనున్నారు. వారికి అవసరమైన మందులు అందించడంతో పాటు మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు పంపించనున్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వహించే పరీక్షలు.. వైద్య కళాశాలల్లో పనిచేసే గైనకాలజీ, కంటి, చెవి, ముక్కు గొంతు, చర్మ, మానసిక, దంత వైద్యనిపుణులు పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), క్యాన్సర్ స్క్రీనింగ్ (ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్), టీబీ పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళలకు రక్తహీనత సమస్య ఉంటున్నందున.. దీనిపై యుక్త వయసులోని అమ్మాయిలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. గిరిజన తండాల్లో సికిల్ సెల్, ఎనీమియా పరీక్షలు చేసి, తగిన జాగ్రత్తలు వివరిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లాలో 15 రోజులపాటు మహిళల ఆరోగ్య సంరక్షణకు నిర్వహించే వైద్యశిబిరాల ను సద్వినియోగం చేసుకోవాలి. శిబిరాల్లో టీబీ, బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్, తలసేమియా, సికిల్ సెల్, ఎనీమియా వంటి పరీక్షలు నిర్వహించి.. తగిన మందులు ఇస్తారు. మెరుగైన చికిత్స అవసరమైన వారిని ఉన్నత శ్రేణి ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. దీంతో పాటు రక్తదాన శిబిరాలు, టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాల ద్వారా దాతలచే పౌష్టికాహారం అందిస్తారు. – జయచంద్రమోహన్, డీఎంహెచ్ఓ -
ప్రజాపాలన వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నారాయణపేట/నారాయణపేట రూరల్: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని తెలిపారు. వేడుకల నిర్వహణలో భాగంగా అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏఓ జయసుధ, ఆర్డీఓ రామచందర్ నాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య తదితరులు ఉన్నారు.● ఇటీవల శ్రీహరి కోట (ఇస్రో)ను సందర్శించిన ఉపాధ్యాయులు అక్కడి విషయాలను తమ పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా సైన్స్ ఫోరం సభ్యులు కలెక్టర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెన్స్ ఫోరం మరింత సమర్థవంతంగా పనిచేయాలని.. శాస్త్ర సాంకేతిక నైపుణ్యలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరిగేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సైన్స్ ఫోరం సభ్యులు వార్ల మల్లేశం, రాములు, యాదయ్యశెట్టి పాల్గొన్నారు.‘విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవద్దు’నారాయణపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తో ఆడుకుంటోందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. స్థానిక భగత్సింగ్ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకానికి ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు అజయ్, వెంకటేశ్, సురేశ్, రాజు, గణేశ్, అనూష, పౌర్ణమి, అనురాధ, శివకుమారి, సుధాకర్ ఉన్నారు.వేరుశనగ @ రూ.4,110గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 159 క్వింటాళ్ల విక్రయానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ. 4,110, కనిష్టంగా రూ. 2,719 ధరలు లభించాయి. అదే విధంగా 56 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రాగా.. గరిష్టంగా రూ. 6,059, కనిష్టంగా రూ. 5,539, సరాసరి రూ. 6059 ధరలు వచ్చాయి. -
ఉద్యమానికి ఊపిరి..
ఆత్మకూర్ పల్లెల్లో రాజుకున్న చైతన్యం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 1947 అక్టోబర్ 7న భారీ ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు మహబూబ్నగర్ నుంచి అదనపు పోలీసు బలగాలను అప్పంపల్లికి తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, బలరాంగౌడ్, తంగెడి నాగిరెడ్డి, తెలుగు ఆశన్నలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏక్షణంలోనైనా తమ నేతలను అరెస్టు చేస్తారని భావించిన అప్పంపల్లి గ్రామస్తులు రావిచెట్టు కింద గుమిగూడి చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు భాష్పావాయువు ప్రయోగించారు. విడిది చేసిన ఇంటి కిటికీలో నుంచి ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 11 మంది చాకలి కుర్మయ్య, ఈశ్వరయ్య, తంగేటి రాంరెడ్డి, నన్నేమ్మ, హరిజన్ కిష్టన్న, హరిజన్ తిమ్మన్న, లక్ష్మారెడ్డి, పెండేం సాయన్న, గజ్జలన్న, బాల్రెడ్డి, వడ్డేమాన్ నర్సయ్య అక్కడికక్కడే నేలకొరగగా.. భీంరెడ్డి, మాల కిష్టన్న, ఈడిగి తిమ్మక్క, పెండెం కుర్మన్న, కె.రామచంద్రయ్య, వాగుల గంగన్నతోపాటు మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 29 మందిపై పోలీసులు చార్జీషీట్ వేసి జైలులో నిర్బంధించారు. -
యూరియా కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు
● టోకెన్లకు సైతం ఇబ్బందులుతప్పడం లేదని ఆందోళన ● పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ నారాయణపేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. యూరియా దొరక్క కొందరు, టోకెన్లు లభించక మరికొందరు రైతులు మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా – బస్టాండ్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కోసం నిత్యం అవస్థలు పడుతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. యూరియా, టోకెన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసినా దొరకడం లేదని వాపోయారు. వానాకాలంలో వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన పంటలకు యూరియా వేయకపోవడంతో ఎదగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రాములు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అరకొర పంపిణీపై ఆగ్రహం నారాయణపేట రూరల్: మండలంలోని సింగారం రైతువేదికలో అరకొరగా యూరియా టోకెన్లు పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవానికి వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజామునే నారాయణపేటలోని పీఏసీఎస్ కార్యాలయానికి యూరియా కోసం వెళ్లారు. అయితే తమ క్లస్టర్ పరిధిలోని రైతువేదికల్లోనే టోకెన్లు ఇస్తారని అధికారులు చెప్పడంతో సింగారం రైతువేదిక వద్దకు చేరుకొని బారులు తీరారు. ఈ క్రమంలో ఏఈఓ అనిల్కుమార్ కేవలం 50 టోకెన్లు ఇచ్చి వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఏఓ దినకర్ స్పందిస్తూ.. యూరియా స్టాక్ మేరకు రైతులకు టోకెన్లు అందిస్తున్నట్లు తెలిపారు. -
సాయుధ పోరాటంలో.. పాలమూరు మట్టిబిడ్డలు
చిన్నచింతకుంట: ఆ ఊరి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో బాధపెడుతుంది.. పల్లెలోకి పాదం మోపగానే ఉద్వేగ క్షణాలేవో తట్టిలేపుతాయి.. ఆ గ్రామం పేరు చూడగానే అమరుల త్యాగాలు యాదికొస్తవి. నేటికీ సాక్ష్యంగా మిగిలిన రావి చెట్టు, నాటి ఘటనను గుర్తు చేసి మనసును కకాలవికలం చేస్తుంది.. ఆ కిటికీ నుంచి కాల్పుల శబ్దాలు వినిపించినట్లుగానే ఉంటుంది.. రజాకార్ల రాక్షస క్రీడ గుర్తుకొచ్చి రక్తం సలసలా మరుగుతుంది.. వారి బూటు కాళ్ల చప్పుళ్లు.. పోరాట ఘట్టాలు కథలు కథలుగా వినిపిస్తాయి. చిందిన అమరుల రక్తం.. స్తూపమై మొలిచి వారి త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ పతాకాన్ని చేతబట్టి ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది.. తొలుస్తున్న గాయాని దిగమింగుకుని.. వీరులను గుర్తించని వైనాన్ని తలుచుకుని.. ధుఃఖిస్తోంది అప్పంపల్లి గ్రామం.. రజాకార్లపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి ప్రాణాలు కోల్పోయిన అప్పంపల్లి అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తింపునకు నోచుకోలేకపోయారు. స్వాతంత్య్ర పోరాటం.. నిజాం వ్యతిరేక పోరాటం వేర్వేరు అని భావించిన ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకుంటూ.. మరోవైపు నిజాం పోలీసు మూకలు సాగించిన అరాచకాలను ఎదురించి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు గుర్తించాలి. దుర్భర స్థితిలో ఉన్న అప్పంపల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవానికి నిజమైన సార్థకత లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తల్లడిల్లిన అప్పంపల్లి అమరవీరులకు గుర్తింపేది? -
పేట–కొడంగల్ భూసేకరణ ప్రక్రియ వేగవంతం
● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసినట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి రాంలీలా మైదానంలో చేపట్టిన కోనేరు ఆధునికీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి రూ.4,500 కోట్లతో పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ పథకం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లో 1.25లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ. 20లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. మక్తల్ సెగ్మెంట్లో 800 ఎకరాలకు గాను 600 ఎకరాలకు రైతులు ఒప్పంద పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. మిగతా రైతుల నుంచి ఒప్పంద పత్రాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా పథకం పనులు ప్రారంభిస్తామన్నారు. కాగా, మక్తల్లో పడమటి ఆంజనేయస్వామి జాతరలోగా కోనేరు ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు. అతి పురాతనమైన కోనేరును సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ప్రాణేశ్కుమార్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, కావలి తాయప్ప, రవికుమార్, ఈఓ శ్యాంసుందర్ ఆచారి, రవికుమార్, కట్ట సురేశ్, నాగశివ, హేమసుందర్, అరవిందు, డీవీ చారి పాల్గొన్నారు. -
నాయకత్వం వహించాడు..
మా తండ్రి బెల్లం నాగన్న తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహించి నిజాం పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నిజాం పాలనకు ఎదురుతిరిగాడు. అందుకు మా తండ్రిని పట్టుకోవడానికి గ్రామానికి వచ్చి గ్రామస్తులపై కాల్పులకు పాల్పడటంతో 11 మంది వీరమరణం పొందారు. ఉద్యమ సమయంలో మాకున్న వంద ఎకరాల భూమిని మా తండ్రి అమ్మేశాడు. – అంజన్న, ఉద్యమకారుని కుమారుడు, అప్పంపల్లి పోరాటంలో ఎంతో పాత్ర.. తెలంగాణ పోరాటంలో గ్రామ నాయకుల పాత్ర ఎంతో ఉంది. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన వీరులు బెల్లం నాగన్న, ఈడిగి బలరాంగౌడ్, తెలుగు ఆశన్న, దాసర్పల్లి బుచ్చారెడ్డి, ఆత్మకూర్ సంస్థానంపై జాతీయ జెండా ఎగరవేశారు. దీంతో ఉద్యమకారులను పట్టుకోవడానికి పోలీసులు మా ఊరికి వచ్చారు. సాయంత్రం సమయంలో చూస్తుండగానే రావి చెట్టు కింద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పులకు గాయాలై అర్ధనాదాలు చేశారు. – సాయిలు, రిటైర్డ్ టీచర్, అప్పంపల్లి -
నా జీవితం ప్రజా సేవకు పునరంకితం
నారాయణపేట: తన జీవితం ప్రజా సేవకే పునరంకితమని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి అన్నారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని లింగయ్య, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొని శివకుమార్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అందించే పరిహారాన్ని రూ. 20లక్షలకు పెంచిన సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం శివకుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత బిడ్డ రేవంత్రెడ్డి సీఎం కావడంతోనే భూ నిర్వాసితులకు ఎకరానికి రూ. 20లక్షలకు పరిహారం పెంచడంతో పాటు మరో రూ. 300కోట్ల ప్రాజెక్టుకు ఎక్కువ అయినా సాధించడం జరిగిందన్నారు. అదే విధంగా వికారాబాద్–కృష్ణా రైల్వేలైన్ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి దృఢ సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేయించినట్లు చెప్పారు. జాయమ్మ చెరువుకు సాగునీరు తీసుకురావడం సీఎన్ఆర్ కల అని.. నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కృషి చేస్తున్నారన్నారు. పర్ణికారెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించి స్పీకర్ సీటులో కూర్చొబెట్టడమే తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.శివారెడ్డి, వైస్చైర్మన్ కొనంగేరి హన్మంతు, మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్రెడ్డి, మాజీ అధ్యక్షుడు కోట్ల రవీందర్రెడ్డి, నాయకులు రాజీరె డ్డి, రఘుబాబు, ఎండీ సలీం పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
మక్తల్: అంగన్వాడీ సమస్యల పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సోమ వారం ముట్టడించారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, అయాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్తోపాటు విద్యను నిర్వీర్యం చేస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని తెచ్చిందని అన్నా రు. ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య పేరుతో ఐదేళ్లలోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీప్రైమరీ పీఎం శ్రీవిద్య నడపాలని డిమాండ్ చేశారు. అలాగే, 24 రోజులు సమ్మె వేతనం వెంటనే చెల్లించాలని, పెంచిన రిటైర్మెంట్ బెన్ఫిట్ 2024 జూలై 1 నుంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యలపై క్యాబినెట్లో చర్చిస్తానని, వినతిపత్రంలో పేర్కొన్న అంశాలపై సీఎంతో చర్చిస్తానన్నారు. ఇంటి ముట్టడి కార్యక్ర మం వద్దని, మీరు మీ తమ్ముడు, మీ అన్న ఇంటికి వచ్చారని, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అందరికీ అందేలా చూస్తానన్నారు.నాయకులు ఆంజనేయులు, గోవిందురాజు, రమే ష్, మంజుల, విజయలక్ష్మి, రాధిక, గిరిజ పాల్గొన్నారు. -
హే కృష్ణా.. ఇకనైనా!
నారాయణపేటమంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని రైతుల రోదన అరణ్య రోదనగా మిగులుతోంది. వేల సంఖ్యలో కృష్ణ్ణ జింకలు పంటలను నాశనం చేస్తుండడం ఏటేటా నిత్యకృత్యంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. ఫలితం లేకపోవడంతో బాధిత రైతుల్లో ఆందోళన నెలకొంది. కృష్ణ జింకలను పట్టుకుని అడవులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా.. రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉంది. అధికారుల్లో కొరవడిన ప్రణాళిక, పలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లేమి వెరసీ రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం స్పందించినా.. కృష్ణాతీరంలో కృష్ణ జింకల బెడద నుంచి పంటలను కాపాడాలని రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జింకలను పట్టి నల్లమల, కవ్వాల్ అడవులకు తరలించాలని ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే నిర్ణయించి.. రూ.2.70 కోట్ల నిధులు సైతం కేటాయించింది. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా మండలం ముడుమాల్ వద్ద అందుబాటులో ఉన్న భూమిని అధికారులు పరిశీలించారు. సర్వే నం.192లోని 18.29 ఎకరాలు, సర్వే నం.194లోని 55.21 ఎకరాలు మొత్తం కలిపి 74.10 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కానీ, ఇందులో తొలుత ఎనిమిది ఎకరాలు, ఆ తర్వాత సుమారు 30 ఎకరాల్లో చెరువు ఉండడం, రెవెన్యూ శాఖ తిరకాస్తు వంటి సమస్యలతో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ముందడుగు.. కృష్ణ జింకల రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు దిశగా ముడుమాల్ వద్ద 74.10 ఎకరాల భూమి హద్దులను రెవెన్యూ అధికారులు గుర్తించి మార్కింగ్ చేశారు. ఇటీవల ఆ భూమిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. దీంతో అటవీ శాఖ ఎట్టకేలకు రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు పనుల కోసం టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోంది. చెరువు పరిధిలోకి రాని సుమారు 44 ఎకరాల్లో శాశ్వత, చెరువు పరిధిలోకి వచ్చే 30 ఎకరాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికై నా ఎలాంటి జాప్యం లేకుండా చూసి.. జింకల సమస్య తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. కృష్ణజింకలతో పంట పొలాలు నాశనం కృష్ణానది పరివాహకంలో అన్నదాతల అగచాట్లు విజ్ఞప్తులు.. ప్రతిపాదనలు.. ఆదేశాలకే పరిమితం రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటులో జాప్యం నష్టంతోపాటు నిత్యం కాపలాతోరైతాంగానికి తప్పని తిప్పలు సుమారు 12 వేల జింకలు.. కృష్ణానది పరివాహకమైన మాగనూరు, కృష్ణా, నర్వ, మరికల్, మక్తల్ మండలాల పరిధిలో ప్రధానంగా వరి, పత్తి, కంది సాగవుతోంది. సుమారు 10, 12 ఏళ్ల క్రితం ఆయా ప్రాంతాల్లో వందలలోపే ఉన్న కృష్ణ జింకల సంతతి క్రమక్రమంగా పెరిగింది. ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేల వరకు కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ అంచనా. అవి ఆహారం కోసం మూకుమ్మడిగా పంట చేలల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
‘ప్రజావాణి’కి 44 ఫిర్యాదులు
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 44 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎస్ శ్రీను,ట్రైనీ కలెక్టర్ ప్రణయ్కుమార్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. చట్ట ప్రకారం పరిష్కరించాలి పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులను చట్ట ప్రకారం వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు రాగా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచరాదని ఫోన్లో ఎస్పీ సూచించారు. -
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది. వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్) -
అద్భుతం.. ఆ కట్టడాలు
నారాయణపేటసరళమైన కోయిల్సాగర్ ● ‘ఇంజినీర్’ నైపుణ్యతకు నిదర్శనంగా నిలుస్తున్న రెండు ప్రాజెక్టులు ● ఆసియా ఖండంలోనే మొదటిగా పేరుగాంచిన ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ● అప్పట్లోనే సాంకేతికతను పరిచయం చేసిన వనపర్తి సంస్థానాధీశులు ● అతి తక్కువ వ్యయంతో కోయిల్సాగర్ నిర్మాణం ● ఉమ్మడి పాలమూరుకు తలమానికంగా నిలిచిన జలాశయాలు సోమవారం శ్రీ 15 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
చేపపిల్లలు చెరువుకు చేరేనా?
● మూడుసార్లు గడువు పెంచినా ముందుకురాని వ్యాపారులు ● ఆందోళనలో మత్స్యకారులు ● టెండరుదారుడి చేపపిల్లల విత్తనోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించనున్న కమిటీ నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో వందశాతం సబ్సిడీపై చేపపిల్లల పంపిణీకి చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా మత్స్యశాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మొదటగా గతనెల 18నుంచి 30వ తేదీ వరకు సంబంధిత వ్యాపారుల నుంచి టెండర్లు ఆహ్వానించారు. అయితే ఒక్క టెండరు కూడా దాఖలు కాకపోవడంతో.. మరోసారి ఈ నెల 1నుంచి 8వ తేదీ వరకు పొడిగించారు. రెండో దఫా కేవలం ఒకే ఒక టెండరు దాఖలైంది. ఈ నేపథ్యంలో 12వ తేదీ వరకు మళ్లీ అవకాశం కల్పించగా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ ఒక్క దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని చేపపిల్లలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతేడాది సెప్టెంబర్ చివరి వారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో 50శాతం మాత్రమే చేప పిల్లలను సరఫరాచేసి మమ అనిపించుకున్నారు. ఈ ఏడాది సైతం చేపపిల్లల టెండర్ల ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ సారి కూడా వందశాతం చేపపిల్లల పంపిణీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ పర్యవేక్షణలో.. జిల్లాలోని మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీకి సంబంధించి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్గా జిల్లా మత్స్యశాఖ అధికారి రహిమాన్, సభ్యులుగా జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతికుమార్, పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ పర్యవేక్షణలోనే చేపపిల్లల పంపిణీ చేపట్టనున్నారు. టెండరుదారుడి విత్తనోత్పత్తి కేంద్రాలను కమిటీ పరిశీలించిన తర్వాత ఆమోదించనున్నారు. -
కోయిల్సాగర్ @ రూ.84 లక్షలు
పాలమూరు జిల్లా వరప్రదాయిని కోయిల్సాగర్ ప్రాజెక్టు ప్రారంభమై నేటికి 71 ఏళ్లు పూర్తయింది. 1947లో తెలంగాణ ప్రాంతానికి ఇంకా స్వాతంత్య్ర రాక ముందు ఆనాటి నైజాం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు. 1.20 టీఎంసీల సామర్థ్యంతో 26.6 అడుగుల ఎత్తు అలుగు ఉండే విధంగా ప్రాజెక్టుకు అప్పటి ఇంజినీర్లు రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారంభించి 1954లో పూర్తిచేశారు. కేవలం రూ.84 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నుంచి మొదటిసారి 9 వేల ఎకరాలకు సాగునీరు అందించారు. 1984లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.91 లక్ష వ్యయంతో 6 అడుగుల మేర కట్టను బలోపేతం చేసి ఎత్తును పెంచి అలుగుపై 13 గేట్లు నిర్మించారు. ఆనాటి ఎమ్మెల్యే వీరారెడ్డి కృషి ఫలితంగానే గేట్ల నిర్మాణం జరిగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. 2.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆయకట్టు కుడి కాలువ కింద 9 వేల ఎకరాలు, ఎడమ కాల్వ కింద 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా రూ.359 కోట్ల అంచనాతో కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకానికి 2006లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచుతూ జూరాల నుంచి కృష్ణా జలాలను కోయిల్సాగర్కు తరలించేలా రూపకల్పన చేశారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి పరుగులు పెడుతున్న నీరు (ఫైల్)ఉమ్మడి పాలమూరు విభజన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఏకై క ప్రాజెక్టు కోయిల్సాగర్. గతంలో చిన్ననీటి తరహా ప్రాజెక్టుగా ఉండగా ఎత్తిపోతల పథకం ప్రారంభం తర్వాత భారీ నీటి పారుదల శాఖ కిందకు మార్చారు. సాగునీటితోపాటు పాలమూరు పట్టణానికి తాగునీటిని అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే నారాయణపేట జిల్లా, కొడంగల్ ప్రాంతానికి తాగునీటి వనరుగా ఉపయోగిస్తున్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర నియోజకవర్గంలోని దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాలు ఉండగా.. నారాయణపేట నియోజకవర్గంలోని మరికల్, ధన్వాడ మండలాలకు సాగునీరు అందిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, అమరచింత మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందుతుంది. అలాగే ప్రాజెక్టు కాల్వ ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపుతున్నారు. నైజాం ప్రభుత్వ హయాంలో 1947– 54 మధ్య నిర్మించిన కోయిల్సాగర్ ప్రాజెక్టు నేటికీ చెక్కు చెదరలేదు. కోయిలకొండ కోట సమీపంలో ఉండడం వల్ల ప్రాజెక్టుకు కోయిల్సాగర్ అని పేరు పెట్టారు. రెండు గుట్టల మధ్య ప్రాజెక్టును పటిష్టంగా సున్నం, గచ్చు ఉపయోగించి నిర్మించారు. కట్టకు రెండు వైపులా రాతి గోడ నిర్మించి.. బయటి నుంచి మట్టితో నింపారు. ఇక అలుగును సైతం సున్నం గచ్చు ఉపయోగించి నిర్మించారు. ఆనాడు ఉపయోగించిన పరికరాలు నేటికీ ప్రాజెక్టు సమీపంలోనే పడి ఉన్నాయి. ఇక ప్రాజెక్టు నమూనాను ముందుగా తయారు చేసి నిర్మాణం తర్వాత ప్రారంభించారు. ఆనాడు చేసిన నమూనా నేటికి ప్రాజెక్టు సమీపంలోనే కనిపిస్తుంది. ప్రాజెక్టును 10 జూలై 1954లో అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేఎం ఖార్జు ప్రారంభించి ఆయకట్టుకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల చిన్నబొల్లారం, పెద్ద బొల్లారంతోపాటు మరో రెండు చిన్న గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే బాధితులకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకోవడంతో కొత్తగా బొల్లారం పేరుతో గ్రామం ఏర్పడింది. కొనసాగుతున్న ప్రాజెక్టు నిర్మాణం పనులు (ఫైల్) కట్టను నిర్మిస్తున్న ఆనాటి కూలీలు (ఫైల్) -
లక్ష ఎకరాలకు
● సీఎం రేవంత్రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ● ఎకరాకు రూ. 20లక్షల పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం ● విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సాగునీరు అందించడమే లక్ష్యం భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. భూ పరిహారం పెంచిన ప్రభుత్వానికి భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మశ్చందర్ ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు. అనంతరం సీవీఆర్ భవన్కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బండి వేణుగోపాల్, సరాఫ్ నాగరాజు, జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు కాంతికుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం పాల్గొన్నారు. నారాయణపేట: పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఎన్ఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు. 62 రోజుల్లోనే పరిహారం పెంపు.. రాష్ట్రంలో ఎక్కడైనా భూ పరిహారం పెంపు నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం కూడా అంత త్వరగా తీసుకోలేదని.. కానీ జిల్లావాసి సీఎం రేవంత్రెడ్డి కావడంతోనే కేవలం 62 రోజుల్లోనే ఎకరాకు రూ. 20లక్షలకు పరిహారం పెంచడం అందరి అదృష్టంగా భావించాలని మంత్రి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడగాం, భూత్పూర్, సంగబండ, అనుగొండ, జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు తెలుసన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. సాగు, తాగునీరు లేక గోస.. ఈ ప్రాంతంలో ఏళ్లుగా సాగు, తాగునీరు లేక జనం గోస పడుతున్నారన్నారు. శ్రీశైలం బ్యాక్వాటర్ను ఎల్లూరు నుంచి మహబూబ్నగర్, దేవరకద్ర, మన్యంకొండ మీదుగా మరికల్ వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి మక్తల్, నారాయణపేటకు తాగునీరు అందిస్తున్నారన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలతో తాగు, సాగునీటి గోస తీరుతుందన్నారు. అంతకుముందు డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి మాట్లాడారు. భూ నిర్వాసితులు తమకు రూ. 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 62 రోజులుగా చేపట్టిన ఉద్యమానికి తెర పడిందన్నారు. సీఎం రేవంత్రెడ్డిని మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి వెళ్లి ఒప్పించడం జరిగిందన్నారు. రైతులకు ఎకరానికి రూ. 20లక్షల పరిహారం ఇచ్చేందుకు సీఎం ఒప్పుకోవడం సంతోషంగా ఉందన్నారు. -
జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్కు జిల్లా వైద్యులు
నారాయణపేట రూరల్: విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ ఆయుర్వేద కాన్ఫరెన్స్లో ఎనిమిది మంది జిల్లా వైద్యులు పాల్గొన్నారు. వ్యాప్ కాన్ –2025 సదస్సులో భాగంగా యూసఫ్గూడలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నిమ్స్ మే లో రెండు రోజుల పాటు వర్క్ షాష్లో ఆయుర్వేద వైద్యంపై విసృత అవగాహన కల్పించారు. యోగా, న్యాచురోపతి ద్వారా వైద్య సేవలు అందించే విధానంపై శిక్షణ ఇచ్చారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి వేల ఏళ్ల క్రితం నాటి గ్రంథాల ఉపయోగాలను వివరించారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆస్పత్రుల నిర్మాణం జరగనుందని తెలిపారు. సెమినార్లో జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్ విరోజ, మల్లికార్జున్, వినోద్, అనురాధ, భవాని, సుమన, చందన, శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
జాతి పునర్నిర్మాణంలో విద్యార్థులే కీలకం
నారాయణపేట రూరల్: జాతి పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని బిజ్వార్ పీఠం స్వామీజీ ఆదిత్య పరాశ్రీ అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ పాలమూరు విభాగ్ నిర్వహించిన అభ్యాసవర్గకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు విద్యాసంస్థలతో పాటు ఏబీవీపీ కృషి చేస్తోందన్నారు. విద్యా విధానంలో సంస్కృతాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. విదేశీయుల దండయాత్రతో దేశ సంస్కృతి ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషను నేర్చుకోవడంతో పాటు మాతృభాషను విస్మరించరాదని.. కంప్యూటర్, ఖగోళశాస్త్రంపై దృష్టి సారించాలని సూచించారు. ఉన్నత చదువుల తర్వాత ఇతర దేశాలకు వెళ్లకుండా సొంత ప్రాంతానికి సేవ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం తెలంగాణ ప్రాంత సహ సంఘటన మంత్రి విష్ణువర్ధన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరుణాకర్, సంయుక్త కార్యదర్శి నరేష్తేజ్, నరేంద్ర, పృథ్వి, జిల్లా కన్వీనర్ నరేష్, మహిళా ఇన్చార్జ్ రేణుక, సంఘం నాయకులు పాల్గొన్నారు. -
పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం
● ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపినమంత్రి, ఎమ్మెల్యే నారాయణపేట: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లింపునకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో శనివా రం మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మె ల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వారికి న్యాయం జరిగేలా పరిహారం పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుంటుందన్నారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతలతో సస్యశ్యామలంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అర్హత..
8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడోతరగతి పరీక్షలో 55 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులుంటే సరిపోతుంది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 ఫీజు చెల్లించాలి. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను ధ్రువీకరిస్తూ బోనఫైడ్ ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలి. -
ప్రతిభకు ప్రోత్సాహం
జిల్లాలో ఇలా.. 8వ తరగతి విద్యార్థులు 5,153ఉన్నతపాఠశాలలు 75ప్రాథమికోన్నత పాఠశాలలు 86ఏడాది వారీగా ఎంపికై న విద్యార్థులు 2022–23 472023–24 462024–25 46నారాయణపేట రూరల్: పేద విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపివేయకుండా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అర్హత పరీక్ష ప్రకటనను ఇటీవల విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబర్ 6 వరకు అవకాశం కల్పించింది. నవంబర్ 23న జిల్లాకేంద్రంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఇందులో ఎంపికై తే తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు విద్యార్థుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. పరీక్ష విధానం.. మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి. మెంటలెబిలిటీ (ఎంఏటీ), లాస్టిక్ ఎబిలిటీ (ఎస్ఏటీ), ఏడు, ఎనిమిదో తరగతికి సంబంధించిన గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పూర్తి వివరాలకు బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్ను పరిశీలించాలి. ప్రణాళికతో చదివితే.. మొత్తం 180 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. ప్రశ్నాపత్రం రెండు విభాగాలుగా ఉంటుంది. పార్ట్–ఏలో మానసిక సామర్థ్య పరీక్ష 90 మార్కులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, సంఖ్యాశాస్త్రం, పదాల భిన్న పరీక్ష, నంబర్ అనాలజీ, ఆల్ఫాబెట్ అనాలజీ, కోడింగ్, డీ కోడింగ్, లాజికల్ ప్రశ్నలు, వెన్ చిత్రాలు, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్కు సంబంధించిన అంశాలు ఉంటాయి. పార్ట్–బిలో ఏడు, 8వ తరగతికి సంబంధించి 90 ప్రశ్నలకు 90 మార్కులు కేటాయించారు. వాటిలో గణితం 20, సామాన్య శాస్త్రం 35, సాంఘిక శాస్త్రం 35 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రణాళికతో చదివి పరీక్షకు హాజరవుతే తప్పక విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. నవంబర్ 23న ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఎంపికై తే ఏటా రూ.12 వేల ఉపకార వేతనం ప్రతిభ చాటితే నాలుగేళ్ల పాటు అందజేత దరఖాస్తునకు అక్టోబర్ 6 వరకు అవకాశం -
పంటల దిగుబడికి శాసీ్త్రయ సర్వే
జిల్లాలోని 13 మండలాల్లో 51 గ్రామాలు ఎంపిక నర్వ: జిల్లాలో వానాకాలం సాగు.. పంట దిగుబడి అంచనాలను పక్కాగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండలాల వారీగా ఎంపిక చేసిన గ్రామాలు, సర్వేనంబర్ల వివరాలను జిల్లా అధికారులకు పంపించారు. పంట కోత ప్రయోగాలు పకడ్బందీగా చేపట్టేందుకు సిబ్బందికి శిక్షణనిచ్చారు. కొత్తగా రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా వ్యవసాయ, ప్రణాళికాశాఖ సిబ్బంది సంయుక్తంగా ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 76 క్లస్టర్లలో 51 గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల వారీగా శాసీ్త్రయంగా దిగుబడులను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది వానాకాలంలో సాధారణ సాగు 4.20 లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటికే 4 లక్షలు సాగు చేశారు. వివరాల నమోదు ఇలా.. గ్రామాల వారీగా కేటాయించిన పంట పొలానికి అధికారులు వెళ్లాలి. పంటకోత ప్రయోగాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్తగా రూపొందించిన యాప్లో వివరాలు నమోదు చేయాలి. నిర్దేశించిన పంటతో పాటు దిగుబడులను ఫొటోతో అప్లోడ్ చేయాలి. మండల సాగు విస్తీర్ణం మేరకు 3 నుంచి 5 గ్రామాలను పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేశారు. రైతు పొలంలో నైరుతి భాగాన్ని ఎంపిక చేసి అక్కడి పంటను విడిగా కోసి తూకం వేస్తారు. పంట కోత ఫొటోతో పాటు తూకం ఫొటోను అప్లోడ్ చేయాలి. సాగుకయ్యే పెట్టుబడి, వినియోగించిన ఎరువులు, పురుగు మందులు, ఆశించిన తెగులు తదితర వివరాలు నమోదు చేయాలి. మండలాల వారీగా ఎంపికై న గ్రామాలు.. మండలం గ్రామాలు దామరగిద్ద మొగుల్మడ్క, ఉల్లిగండం, అయ్యవారిపల్లి, పిడెంపల్లి నారాయణపేట ఎక్లాస్పూర్, కవరంపల్లి, అప్పక్పల్లి, కోటకొండ ఊట్కూర్ పెద్దజట్రం, ఊట్కూర్, సమస్తాపూర్, పగిడిమర్రి మాగనూర్ నేరెడుగాం, పెగడబండ, పుంజనూర్, మందిపల్లి కృష్ణా కున్సి, కృష్ణా, హిందూపూర్, ఐనాపూర్ మక్తల్ పస్పుల, చిన్నగోప్లాపూర్, సోమశ్వేరబండ, జక్లేర్ నర్వ రాజుపల్లి, యాంకి, కల్వాల్, ఎల్లంపల్లి మరికల్ రాకొండ, మరికల్, పూసల్పహాడ్, మాద్వార్ ధన్వాడ గోటూర్, ధన్వాడ, పాతపల్లి, కిష్టాపూర్ మద్దూర్ పల్లెర్ల, చింతలదిన్నె, మోమిన్పూర్, లక్కపల్లి గుండుమాల్ సారంగరావుపల్లి, గుండుమాల్, బోగారం, బలభద్రాయపల్లి కోస్గి లోదీపల్లి, సర్జఖాన్పేట, మీర్జాపూర్ కొత్తపల్లి నందిగాం, కొత్తపల్లి, మన్నాపూర్ సర్వే చేపట్టనున్న పంటలు.. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, మిరప, పత్తి వ్యవసాయ, ప్రణాళిక శాఖ సంయుక్తంగా.. కొత్తగా రూపొందించిన యాప్లో వివరాల నమోదు శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు జిల్లాలో వానాకాలం పంటల దిగుబడి అంచనా వేసేందుకు పంటకోత ప్రయోగ సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే ఎలా నిర్వహించాలనే అంశాలపై సిబ్బందికి శిక్షణనిచ్చాం. సర్వేలో సేకరించిన వివరాలను యాప్లో ఎలా నమోదు చేయాలో వివరించాం. సర్వే ఆధారంగా ధరల నియంత్రణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకునేందుకు దోహదపడనుంది. – సింగ్ యోగానంద్, చీఫ్ ప్లానింగ్ అధికారి, నారాయణపేట డిజిటల్ క్రాప్ సర్వేకు వచ్చే ఏఈఓలు, మండల ప్రణాళిక అధికారులకు రైతులు సహకరించాలి. ఎంపిక చేసిన గ్రామాల్లో పంటల దిగుబడిని అంచనా వేసేందుకు పంటకోత సమయంలో ప్రయోగాలు చేపట్టి వివరాలను యాప్లో నమోదు చేయాలి. – నగేష్కుమార్, ఏడీఏ -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కోస్గి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజేపి పార్టీ నాయకులు సత్తాచాటాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టి కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రతినిలధులతో ప్రత్యేక సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తోడ్పాటునందించాలని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగలన్నారు. కలిసికట్టుగా పని చేస్తే విజయం మనదేనని అన్నారు. ఆనంతరం పలు మండలాల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా శాంతికుమార్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధన్ , నారాయణ , వెంకటేష్ , ప్రశాంత్ చ బద్రినాథ్ తదితరులు ఉన్నారు. హక్కుల సాధనకు పోరాడిన నాయకుడు.. నారాయణపేట టౌన్: పేదల హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరి అని, కార్మిక సమసమాజ స్థాపన చేయడమే ఆయనకు అందించే నిజమైనా నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో సీతారాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మనీయమన్నారు. దేశపార్లమెంట్ను ప్రజాసమస్యల చర్చవేదికగా మార్చిన మహోన్నత పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారాం ఏచూరి అని కొనియాడారు. విద్యార్థి దశనుంచే పోరాటాలు నిర్వహించి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్, బలరాం, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలి
నారాయణపేట: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకొని కొందరు బ్లాక్ మెయిల్ పర్వాన్ని నడుపుతున్నారని, ఇది తగదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని అంటూ డబ్బులు ఇవ్వాలని డాక్టర్లను బెదిరిస్తున్నారన్నారన్నారు. ఇటువంటి చర్యలు సమాజంలో విలువలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్నాయన్నారు. బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఒ జయచంద్రమోహన్, డా.కార్తీక్ గందే, డా. గీతా,డా. విశ్వనాధ్, డా. రంజిత్, డా. ప్రసాద్ శెట్టి,పద్మకళ, డా. మధుసూదన్ రెడ్డి ఉన్నారు. నేడు గద్వాలకు కేటీఆర్ రాక గద్వాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం గద్వాలకు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటకు గద్వాలకు చేరుకుని పట్టణంలో భారీ ర్యాలీ తీసి.. అనంతరం 4 గంటలకు తేరుమైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. -
దొడ్డు బియ్యం.. పురుగులపాలు
మద్దూరు: రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్దిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డు బియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉన్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు( చిట్టెం) కడుతున్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్ల నుంచి ఖాళీ చేయకుండానే సన్నబియ్యం స్టాక్ పెట్టింది. దీంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి. పేరుకుపోయిన బియ్యం నిల్వలు జిల్లాలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, గోదాముల్లో 1,255 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యాన్ని పంపిణీ చేసే క్రమంలో రేషన్ షాపుల నుంచి మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం సేకరించలేదు. దీంతో డీలర్లు రేషన్ షాపులోనే ఓ మూలన పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ బియ్యం పురుగులు, తుట్టెలు పట్టి పనికి రాకుండా పోతుంది. జిల్లాలో 301 రేషన్ షాపులు జిల్లాలో 301 రేషన్ షాపులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీకి ముందు ఆయా రేషన్ షాపుల్లో మొత్తం 59.6695 మొట్రిక్ టన్నుల పైచిలుకు దొడ్డు బియ్యం ఉన్నట్లు అంచనా. అయితే బియ్యం కేటాయింపు నిల్వలంతా రాష్ట్రస్థాయి నుంచే ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. సన్నబియ్యం పంపిణీ సందర్బంలో దొడ్డు బియ్యం నిల్వకు సంబంధించిన ఆన్లైన్ నిలిపివేసి.. సన్న బియ్యానికి సంబంధించిన ఆన్లైన్ విధానం అమలు చేశారు. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధకారుల వద్ద ఏ రేషన్ షాపుల్లో ఎంత దొడ్డు బియ్యం ఉన్నాయనే సమాచారాన్ని సంబంధిత డీలర్ల నుంచి అధికారులు సేకరించారు. దొడ్డు బియ్యంపై పట్టింపేది? జిల్లాలోని గోదాములు, ఎంఎల్ఎస్ పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 1,255 మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏమి చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. వేలం ద్వార అమ్మడమా.. లేక ఇతర ప్రాంతాలకు తరలించడమా చేయాలని కోరుతున్నారు. మూడు ఎంఎల్ఎస్ పాయింట్లలోజిల్లాలో బియ్యం నిల్వలు ఇలా.. (మెట్రిక్ టన్నుల్లో) 171.022 రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం ఐదు నెలలుగా ఏ నిర్ణయం తీసుకోని అధికారులు సన్న బియ్యానికి చేరుతున్న పురుగులు ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లు రేషన్ షాపుల్లో 59.6695 బఫర్ గోదాములో 1024.833 -
ఇస్రోను సందర్శించిన ఉపాధ్యాయులు
నారాయణపేట రూరల్: దేశంలోనే ఎంతో ప్రత్యేకత కల్గిన శ్రీహరికోట సతీశ్ ధావన్ ఉపగ్రహ రాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని శుక్రవారం నారాయణపేట జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు సందర్శించారు. సీవీ రామన్ సైన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో 90 మంది ఉపాధ్యాయులు ఉపగ్రహ శాస్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అనేక విషయాలపై అవగాహన పొందారు. ఇప్పటివరకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఉపగ్రహాలు పొందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్లో చేయబోతున్న ప్రయోగాల వివరాలు అక్కడి శాస్త్రవేత్తలు వివరించారు. ఇస్రోలోని రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ను, ప్రయోగ పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, సీఎంఓ రాజేంద్ర కుమార్, ఏఎంఓ విద్యాసాగర్, డి.ఎస్.ఓ భానుప్రకాష్, సెక్టోరియల్ అధికారులు నాగార్జునరెడ్డి, శ్రీనివాస్, యాదయ్యశెట్టి, ఫోరం సబ్యులు రాములు, శశికుమార్, వివిధ సంఘ బాధ్యులు షేర్ కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చిక్కులు సరిచేస్తేనే భూములిస్తాం
పరిహారం పెంపుతోపాటు సర్వే చేసి ఎవరి భూమి ఎంత పోతుందో తెలిపిన తర్వాతే భూములిస్తామంటూ మక్తల్ మండలంలోని కాట్రేవ్పల్లి గ్రామానికి చెందిన రైతులు తేల్చిచెప్పారు. అదే మండలంలోని మంతన్గోడ్, టెకులపల్లి, ఎంనాగన్పల్లి రైతులు మాత్రం సమ్మతి పత్రాలను అధికారులకు అందజేశారు. మిగతా గ్రామాల రైతులు ముందుకు వస్తున్నారు. ఇదిలాఉండగా, పరిహారం పెంచాలనే డిమాండ్తో కానుకుర్తిలో చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారం నాటికి 37వ రోజుకు, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 60వ రోజుకు చేరుకున్నాయి. -
బియ్యం తరలించాలి
ఏప్రిల్ నుంచి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. మా వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని ఇప్పటి వరకు తీసుకోలేదు. రేషన్షాపులో స్థలం లేక ఇబ్బంది కలుగుతోంది. దానికితోడు దొడ్డు బియ్యానికి పురుగు వస్తుంది. అది సన్న బియ్యానికి కూడా పట్టే ప్రమాదం ఉంది. వెంటనే దొడ్డు బియ్యం నిల్వలను తరలించాలి. – సంజీవరెడ్డి, రేషన్ డీలర్, మద్దూరు ప్రభుత్వానికి నివేదించాం బఫర్ గోదాం, ఎంఎల్ఎస్, రేషన్షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యం నిల్వలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. ప్రభుత్వం నుంచి అదేశాల మేరకు వాటిని తరలించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని తరలించడానికి అదేశాలు రాలేదు. – సైదులు, డీఎం ● -
లక్ష ఎకరాలకు సాగునీరుఅందించడమే లక్ష్యంగా..
సీఎం రేవంత్రెడ్డి నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ ప్రాంతానికి లక్షా ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంతో రూ.2950 కోట్లతో శ్రీకారం చుట్టారు. కాగా ప్రాజెక్టులో మరిన్ని చెరువులకు సాగునీరు అందించాలని అంచాన వ్యయాన్ని రూ.4,500 కోట్లకు పెంచారు. 2024 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టులో భూ నిర్వాసితులు చేపడుతున్న ఆందోళనలతో సీఎంను ఒకింత కలవరానికి గురిచేస్తుండగా మరో వైపు పరిహారం పెంచకపోతే ప్రాజెక్టు పూర్తి అయ్యే పరిస్థితి కానరావడం లేదనేది సీఎం దృష్టికి వెళ్లడంతో ఏది ఏమైనా ఈ రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో సీఎం ఎకరానికి రూ. 20లక్షల పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సమ్మతి పత్రాలు స్వీకరిస్తున్నాం పేట– కొడంగల్ ప్రాజెక్టులో భాగంగా ఎకరాకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతున్న భూ నిర్వాసితుల నుంచి సమ్మతి పత్రాలు స్వీకరిస్తున్నాం. ఆ పత్రాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తాం. రూ.20లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. – ఎస్.శ్రీను, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ● -
పదవీ గండం?
కొత్త నిబంధనలతో పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన కోస్గి: వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లకు సంబంధించిన పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 14తో ముగిసింది. పాలకవర్గాల పదవీ కాలాన్ని రెండోసారి ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లోనూ, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 6 నెలలపాటు పొడిగించిన పీఏసీఎస్ల పదవీ కాలం సైతం ఆగస్టు 14తో ముగియడంతో ప్రభుత్వం పీసీసీఎస్లతోపాటు డీసీసీబీ పాలకమండళ్ల పదవీ కాలన్ని సైతం పొడిగిస్తూ జీఓ 386 ను విడుదల చేసింది. సర్వత్రా ఆందోళన పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల్లో ఎవరైన పీఏసీఎస్ చైర్మన్ గాని, డైరెక్టర్ గాని రుణాలు తీసుకొని చెల్లించని పక్షంలో, నిధుల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న పాలకవర్గ ప్రతినిధులు, డైరెర్టర్లను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కొన్ని పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. జిల్లా అధికారులు బకాయిలు ఉన్న డైరెక్టర్లు, నిధుల దుర్వినియోగం చేసిన వారికి ముందస్తుగా నోటీసులు జారీ చేయడంతోపాటు సంబంధిత వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కాగా ఇప్పటికే నోటీసులు అందుకున్న డైరెక్టర్లు తమ బకాయిలను చెల్లించి పదవి గండం నుంచి తప్పించుకున్నారు. జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఇద్దరు చైర్మన్లతోపాటు ఓ పీఏసీఎస్ కార్యదర్శిపై విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఏదేని సొసైటీకి పాలకవర్గం రద్దయితే ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. పొంతన లేకుండా డీసీఓ సమాధానాలు పాలకవర్గాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఉత్తర్వుల విషయమై ఇన్చార్జ్ డీసీఓ శంకరాచారిని అడగగా.. ఉత్తర్వులు వచ్చిన మాట వాస్తవమేనని, జిల్లాలో అలాంటి కేసులు లేవని, నోటీసులు ఇచ్చి తీసుకున్న రుణాలు వసూలు చేశామని, ఎమ్మెల్యేలు, కడా అధికారి చెప్పడంతో వారిని కొనసాగిస్తున్నామంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారు. నిధుల దుర్వినియోగంతోపాటు బకాయిలు ఉన్న డైరెక్టర్ల సమగ్ర వివరాలు అడగగా అలాంటిదేమి లేదు అంతా ఓకే ఉంది, ఇంకేమి అడగొద్దు అంటూ ఫోన్ పెట్టేశారు. జిల్లాలో 10 పీఏసీఎస్లు.. 130 మంది డైరెక్టర్లు జిల్లాలో 13 మండలాలు, 276 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తానికి ఒక డీసీసీబీ, ఒక డీసీఎంఎస్తోపాటు నారాయణపేట జిల్లాలో 10 పీఏసీఎస్లు ఉండగా మొత్తం 130 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు చైర్మన్లు, ఓ కార్యదర్శి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలతో పాలకవర్గాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత ఉన్న సంఘాల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించే పనిలో ఉన్నారు. రుణాలు చెల్లించని, నిధుల దుర్వినియోగం కేసులున్న వారి పదవులకు ఎసరు పదవీ కాలం పొడగిస్తూనే నిబంధనలతో ప్రభుత్వం మరో జీఓ విడుదల జిల్లాలోని 10 పీఏసీఎస్ల్లో ఇద్దరు చైర్మన్లకు పదవీ గండం..? -
కలానికి సంకెళ్లుఅప్రజాస్వామికం
ఏపీలో ‘సాక్షి’ దినపత్రికపై కొనసాగుతున్న కేసులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో పత్రికలపై అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాలనుకోవడం సిగ్గుమాలిన చర్య. 30 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా నిలిచి.. ప్రజాగొంతుకను వినిపించే పత్రికలపై దాడులు చేస్తూ, అక్రమ కేసులు బనాయించడం కలానికి సంకెళ్లు వేయడమే. దీనిని ప్రతిఒక్క ప్రజాస్వామికవాది ఖండించాలి. ఇప్పటికై నా చంద్రబాబు కక్షసాధింపు చర్యలు మానుకుని పత్రికా స్వేచ్ఛనుకాపాడాలి. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
సమన్వయంతో మెలగాలి..
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడం, జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామిక చర్య. భావ ప్రకటనను ఎవరై నా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ప్రభు త్వాలు కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడకుండా.. సమన్వయంతో మెలిగేందుకు ప్రయత్నించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పత్రికలు, జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం తగదు. – ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, దేవరకద్ర తీవ్రంగా ఖండిస్తున్నాం.. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని మహబూబ్నగర్ ప్రెస్ క్లబ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అభిప్రాయాలను పంచుకునేందుకు, ప్రభుత్వానికి ప్రజల వాణిని వినిపించడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికలపై, సంపాదకులపై పనిగట్టుకొని కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేయడం సరికాదు. పత్రికలు తమ పని తాము స్వేచ్ఛగా చేసినప్పుడే సమాజంలోని అన్నివర్గాల అభిప్రాయాలు ప్రజలకు చేరువవుతాయి. – వి.నరేందర్చారి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు, మహబూబ్నగర్ ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. జర్నలిస్టులు ఎక్కడైనా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏపీ లో ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు, కేసు లు నమోదు చేయడం వంటివి పత్రికా స్వేచ్ఛను హరించడమే. ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ ఎడిషన్ సెంటర్లపై దాడులు, ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చ ర్య. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత నెరవేర్చకుంటే కచ్చితంగా జర్నలిస్టులు ప్రజల తరఫున ప్రశ్నించడం సహజం. జర్నలిస్టుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల పేరుతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. – చంద్రశేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు, టీయూడబ్ల్యూజే (హెచ్–143), నాగర్కర్నూల్ -
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి..
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడం ఎవరికీ సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలు మాట్లాడలేనప్పుడు కూడా ప్రజల సమస్యలు, ఇబ్బందులను పాలకుల దృష్టికి తీసుకొస్తాయి. అలాంటి పత్రికలు, మీడియాపై అణచివేతకు పాల్పడేలా దాడులకు దిగడం.. కేసులు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఇప్పుడు ఒకరు అనైతిక చర్యలకు దిగారంటే.. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ పోతే అభివృద్ధి కుంటుపడడమే కాకుండా రాష్ట్రం రావణకాష్టగా మారుతుంది. రాజకీయాల మాటున కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇప్పటికై నా పత్రికా స్వేచ్ఛను హరించే చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. – శ్రీనివాస్గౌడ్, మాజీ మంత్రి, మహబూబ్నగర్ -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
నారాయణపేట/నారాయణపేట క్రైం/కోస్గి రూరల్/మద్దూరు: ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెంచాలని వైద్యులకు, అసుపత్రికి సిబ్బందికి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం కోస్గి, మద్దూరు సీహెచ్సీలను తనిఖీ చేశారు. కోస్గి ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన సదుపాయాల నివేదికను అందించాలని డీసీహెచ్ఎస్ మళ్లికార్జున్ అదేశించారు. మద్దూరులో ఎక్స్రే సేవలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, మంజూరైన రూ.30 లక్షల జనరేటర్ను వినియోగంలోకి తీసుకురావాలని అదేశించారు. అసుపత్రి ప్రహారి నిర్మాణం కోసం కడా నుంచి మంజూరైన రూ.25లక్షల పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలని అదేశించారు. అంతకుముందు అసుపత్రిలోని చిన్నపిల్లవ వార్డు, జనరల్ వార్డును పరిశీలించి అక్కడి రోగులతో మాట్లాడారు. అందుతును వైద్య సేవలను రోగులను అగిడి తెలుసుకున్నారు. ఔట్పేషెంట్, ఇన్ పెషెంట్ల వివరాలను అడిగి తెలసుకున్నారు. ఆర్ఎంఓ పావని, తహసీల్దార్ మహేష్గౌడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మల్లీకార్జున్, తదితరులున్నారు. అటవీ భూములను సంరక్షించాలి అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని లెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టర్ చాంబర్లో అటవీ శాఖపై సమీక్షించారు. జిల్లాలో అటవీ భూములు లింగంపల్లి, చిన్న జట్రం, బోయిన్పల్లి, కోటకొండ, అమ్మిరెడ్డిపల్లి, తిరుమలపూర్, అభంగాపూర్, ఎక్లాస్పూర్, బైరంకొండ, ధన్వాడ మండలంలోని కొండాపూర్ కిష్టాపూర్ , గోటూర్, మద్దూరు పల్లెర్ల తదితర గ్రామాలలో ఉన్నాయని, పీఓబీ భూభారతి కింద కొన్ని సరిపోలడం లేదని అధికారులు తెలిపారు. అసైన్మెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ను తహసీల్దార్లు సర్వే నెంబర్ ద్వారా రికార్డులు పరిశీలించాలని, వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ● దసరాలోగా హ్యాండ్లూమ్ ఎక్సలెన్స్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ సెంటర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఎక్స్లెన్స్ను సందర్శించారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీజీఎంఎస్ ఐడీసీ ఈఈ రతన్కుమార్, టెస్కో ఓఎస్డి శ్రీలత, డి. బాబు పాల్గొన్నారు. ● ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టులు, స్కూల్ భవనాలు, వసతి గృహాలు, త్రాగునీటి సరఫరా పైప్లైన్ల్కు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వరద నష్టంపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. -
యూరియా.. ఏదయా?
● తెల్లవారుజామున నుంచే క్యూలైన్లోనే రైతులు ఎదురుచూపులు ● కొందరికే టోకెన్లు దక్కడంతో నిరాశతో వెనుదిరిగిన వైనం నారాయణపేట రూరల్/నారాయణపేట టౌన్/ నర్వ/దామరగిద్ద: యూరియా కొరత రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. గ్రామాల్లోని రైతు వేదికలో యూరియా బస్తాలు అందిస్తామని ప్రకటించడంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే అన్నదాతలు వరుస కట్టారు. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామంలో వరసలో నిలబడిన రైతులు కలిసి పాస్ పుస్తకాలను వరుసలో పెట్టి పక్కకు వెళ్లి సేదతీరారు. లోడ్ 300 బస్తాలు మాత్రమే రాగా రైతులు మాత్రం పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. యూరియా రానివారు నిరాశతో వెనుదిరిగారు. మరో లోడు తెప్పించి రెండు రోజుల్లో అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ● నారాయణపేట మినీ స్టేడియంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి వర్షంలోనే తడుస్తూ రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి నిలబడి ఒకరికి ఒక టోకెన్, బక బస్తా యూరియా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని పలువురు రైతులు ప్రశ్నించారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను సముదాయించి జిల్లా కేంద్రంలో నాలుగు క్లస్టర్లుగా పలు గ్రామాల వారికి ఏర్పాటు చేసి యూరియా అందజేశారు. ● నర్వ పీఏసీఎస్తో పాటు మన గ్రోమర్, నర్వలోని రెండు ప్రైవేటు, రాయికోడ్లోని ఓ ప్రైవేటు క్రిమిసంహారక దుకాణాలకు యూరియా రాగా.. రైతులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఈ సందర్భంగా పోలీస్లు అక్కడికి చేరుకోని రైతులకు క్రమ పద్దతిలో యూరియా అందేలా చర్యలు చేపట్టారు. రైతులు ఎలాంటి అధైర్యపడాల్సిన పనిలేదని, సరిపడా యూరియా ప్రభుత్వం అందిస్తుందనిఏఓ అఖిలారెడ్డి పేర్కొన్నారు. ● దామరగిద్దలో తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఏఓ మణిచందర్ సమక్షంలో రెండు రోజుల క్రితం టోకన్ అందుకున్న రైతులకు యూరియా అందజేశారు. కాగా మిగిలిన రైతులకు టోకన్లను అందజేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రాజు సమక్షంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జర్నలిజంపై దాడి సరికాదు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. – అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల -
ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం
నారాయణపేట/మక్తల్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మక్తల్లోని మంత్రి కార్యాలయంలో ఆమె చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సంఘసేవకురాలిగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాటపటిమతో వీరవనితగా చరిత్రలో నిలిచి ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధపోరాటంలో దొరలు, రజాకార్ల దురాగాతాలను ఎదిరించిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధరైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి మహిళాశక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్పవీరవనిత అన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, గణేష్కుమార్, విష్ణువర్ధన్రెడ్డి, ఫయాజ్, రంజిత్కుమార్రెడ్డి, కోళ్ల వెంకటేష్, కట్టసురేస్, కట్టవెంకటేష్ పాల్గొన్నారు. ఆదర్శప్రాయురాలు.. తమ హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆశయ సాధనకు కృషిచేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేందర్ గౌడ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణి సమావేశపు మందిరంలో బుధవారం చాకలి ఐలమ్మ చిత్ర పటానికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారులు, ఉద్యోగులు, రజక సంఘం జిల్లా నాయకులు,వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
10 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం..
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం సీజన్కు సంబంధించి 2014లో 8.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ప్రస్తుతం 18.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ లెక్కన 11 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వసతి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. విస్తారంగా వర్షాలు కురవడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ వంటి చర్యలు ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాగు పెరిగింది..పంట మార్పిడి చేయాలి పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఏటేటా వరి, పత్తినే అధికంగా పండిస్తున్నారు. ప్రతిసారి ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి చౌడు పొలంగా మారుతుంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సీజన్లో మొక్కజొన్న సాగు పెరిగింది. పంట మార్పిడి చేసి కందులు, జొన్న, ఆముదం, ఇతర పంటలు కూడా సాగు చేస్తే.. భూసారం దెబ్బ తినదు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్నగర్ ● -
నాడు బీళ్లు.. నేడు సిరులు
పదేళ్ల క్రితం ఎటు చూసినా ఎండిన పంటలు.. బీళ్లుగా మారిన భూములు. ఫలితంగా ఉపాధి కోసం కుటుంబాలతో సహా తట్ట, బుట్ట, పార పట్టుకుని ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు బస్సుల్లో కిక్కిరిసి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలా వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరు జిల్లా హరితవనంగా మారింది. సాగునీరు లేక నెర్రెలు బారిన వ్యవసాయ భూముల్లో సిరుల పంట పండుతోంది. ఏటేటా సాగు గణనీయంగా పెరుగుతుండగా.. భూమికి పచ్చని రంగు వేసినట్లు కొత్త శోభను సంతరించుకుంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్మూడేళ్లుగా 18 లక్షల ఎకరాలపైనేఉమ్మడి పాలమూరు జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి మొత్తంగా అన్ని పంటలు కలిపి 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యాయి. మూడేళ్లుగా కొంత అటు ఇటుగా స్వల్పంగా లెక్కలు మారుతూ వస్తున్నాయి. 2023లో 18,24,268 ఎకరాలు కాగా.. 2024లో 18,11,953 ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సాగు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 18,07,052 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. అదును దాటే సమయానికి అంటే వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలో మరో 50 వేల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లాలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఏటేటా వీటి సాగు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. వరి 2023 ఖరీఫ్ సీజన్లో 7,76,311 ఎకరాలు, గతేడాదిలో 8,09,784 ఎకరాల్లో సాగు కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 7,90,515 ఎకరాల్లో సాగైంది. మరో 50 వేల ఎకరాల్లో వరి సాగు కానుండగా.. 8.40 లక్షల ఎకరాలకు చేరుకోనుంది.ఉమ్మడి పాలమూరులో 2023లో 6,67,824 ఎకరాల్లో, 2024లో 6,04,004 ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈ ఏడాది 7,05,739 ఎకరాల్లో రైతులు తెల్లబంగారం పంట వేశారు. గతేడాదితో పోలిస్తే 1,01,735 ఎకరాల్లో పత్తి సాగు పెరిగినట్లు తెలుస్తోంది.ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2023 వానాకాలంలో 1,00,816 ఎకరాల్లో, 2024లో 85,476 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది ఇదే సీజన్లో 1,09,708 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. గతేడాదితో పోలిస్తే 24,232 ఎకరాల్లో మొక్కజొన్న సాగు పెరిగినట్లు స్పష్టమవుతోంది.గతేడాదితో పోలిస్తే నాగర్కర్నూల్ జిల్లాలో 28,634 ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో 2,693 ఎకరాల్లో, నారాయణపేట జిల్లాలో 10,256 ఎకరాల్లో అధికంగా పంటలు సాగయ్యాయి. అదే వనపర్తిలో 28,216 ఎకరాల్లో, జోగుళాంబ గద్వాల జిల్లాలో 18,268 ఎకరాల్లో పంటల సాగు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి.గతేడాదితో పోలిస్తే మహబూబ్నగర్ జిల్లాలో పత్తి సాగు స్వల్పంగా తగ్గింది. నాగర్కర్నూల్ జిల్లాలో 40 వేలకు పైగా, గద్వాల జిల్లాలో 50 వేలకు పైగా ఎకరాల్లో అధికంగా రైతులు సాగు చేశారు. మొక్కజొన్నకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో గతేడాది కంటే 14 వేల ఎకరాల్లో, నాగర్కర్నూల్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో అధికంగా సాగైంది. -
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
నారాయణపేట రూరల్: మానవ అక్రమ రవాణా నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఈఓ గోవిందరాజు అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక కేజీబీవీ పాఠశాలలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఈఓ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తుందని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్యను అడ్డుకునేందుకు చైతన్యం పెరగాలన్నారు. పేద, మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురి అవుతున్నారని, సమాజంలో ప్రజలతో, విద్యార్థులతో సన్నిహితంగా ఉండి గమనించి వారికి అవగాహన కల్పించాలని, పేరెంట్స్ మీటింగ్స్ చర్చించి సూచనలు చేయాలన్నారు. చిన్నతనం నుంచి ఫోన్ ఉపయోగించడం తగ్గించాలని, యాప్ ల ద్వారా పర్సనల్ ఫొటోస్ వీడియోస్ పంపడం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం సైబర్ ఆధారిత అక్రమ రవాణా చట్టాలు, సఖి భరోసా కేంద్రాలు, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిసిడిఓ నర్మద, సంఘం కోఆర్డినేటర్ అంబర్ సింగ్, సిబ్బంది కృష్ణవేణి, నవనీత పాల్గొన్నారు. -
యూరియా కోసం రాస్తారోకో
ధన్వాడ: యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం 6 గంటలకే రైతులు రాస్తారోకో చేశారు. ధన్వాడలోని నారాయణపేట – హైద్రాబాద్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ధన్వాడ ప్రాథమిక వ్యవసాయ సహకర సంఘం అధికారులు మూడు రోజులకు సరిపడా టోకెన్లు అందజేయగా.. రెండు రోజులుగా యూరియా సంచులు రాలేదని పంపిణీ చేయడం లేదు. దీంతో నిత్యం యూరియా కోసం కార్యాలయానికి తిరుగుతున్నా యూరియా అందించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇచ్చే రెండు సంచులు కూడా ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని యూరియా వచ్చిన తరువాత సమాచారం అందజేస్తామని రైతులకు నచ్చజెప్పి పంపించి వేశారు. యూరియా కోసం ఎగబడిన రైతులు కొత్తపల్లి: మండల కేంద్రంలోని హాకా సెంటర్కు యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు ఎగబడ్డారు. బుధవారం హాకా సెంటర్కు 300 బస్తాల యూరియా లారీ రావడం.. విషయం సమీప గ్రామాల రైతులకు కూడా సమాచారం చేరడంతో ఒక్కసారిగా కొత్తపల్లి గ్రామానికి రైతులు చేరుకున్నారు. ఆధార్, పట్టదార్ పాసుపుస్తకాలు భారీగా చేరుకున్నారు. అయితే, గంటలోపే యూరియా బస్తాలు అయిపోయాయి. ఆలస్యంగా వచ్చిన రైతులు యూరియా దొరకలేదు. ఒక్కో వ్యక్తికి రెండు బస్తాల యూరియాను సరఫరా చేశారు. -
సర్దుబాటు సమంజసమేనా..?
నారాయణపేట రూరల్: ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు సర్కారు బడులకు తమ పిల్లలను పంపిస్తే బోధనా సిబ్బంది లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఉపాధ్యాయుల కొరత మరింత ఎక్కువైంది. దీంతో పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపు లేక కనీసం వలంటీర్ల నియామకం చేపట్టక చాలా చోట్ల పాఠ్యాంశాల బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. క్రమబద్దీకరణ పేరుతో తక్కువ విద్యార్థుల అరకొర పాఠశాలల్లో ఉపాధ్యాయులను తొలగించి ఇతర పాఠశాలలకు పంపిన విద్యాశాఖ ఎక్కువ మొత్తంలో విద్యార్థులు కల్గిన పాఠశాలల్లో అందుకు తగిన నిష్పత్తిలో టీచర్ల నియామకం చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల సర్దుబాటు పేరుతో కొందరు టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటేషన్పై కేటాయించగా, కొన్ని చోట్ల విధుల్లో చేరారు. మరికొన్ని చోట్ల రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో డీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. జిల్లాలో ఇటీవల ఒక సారి బదిలీలు, రెండుసార్లు పదోన్నతులు కల్పించడంతో ప్రాథమిక పాఠశాలలు, మారుమూల గ్రామీణ బడుల్లో టీచర్ల కొరత తీవ్రమైంది. దీనికితోడు చాలా చోట్ల పదవీవిరమణ పొందిన, మృతిచెందిన టీచర్ల స్థానంలో కొత్త వారు చేరలేదు. దీంతో జిల్లాలో వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమస్య ఉన్న చోట నుంచే సర్దుబాటు వాస్తవానికి జిల్లాలో విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి పరిశీలిస్తే ఇతర జిల్లాల కంటే చాలా ఎక్కువ ఉంది. టీచర్ల కొరత తీర్చేందుకు ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిలో సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దాదాపు 90శాతంపైగా స్కూళ్లలో ఉపాధ్యాయులు అవసరం ఉంది. అయితే వాటి నుంచి టీచర్లను ఎంపిక చేసి మరో పాఠశాలకు డిప్యూటేషన్ ఇస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి చేసి డీఈఓ కార్యాలయంలో అందించారు. ఇక ఆయా గ్రామాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో పాటు వినతిపత్రాలు, రాజకీయ నాయకుల ఒత్తిడులు వస్తున్నాయి. టీచర్లకు స్థానచలనం కల్పి ంచకుండా వలంటీర్లను ఇవ్వాలని కోరుతున్నారు. మచ్చుకు కొన్ని.. ● ఊట్కూరు మండలం చిన్నపొర్ల ప్రాథమిక పాఠశాలలో 180 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న హెచ్ఎం రిటైర్డ్ కాగా, మరో ఇద్దరు పదోన్నతిపై వెళ్లారు. ఒకరు స్పౌస్ బదిలీ చేసుకోగా మరొకరు ఎడ్యుకేషన్ లీవ్లో వెళ్లారు. చివరికి ఒకే ఉపాధ్యాయురాలు విద్యాబోధన చేస్తున్నారు. ● మరికల్ మండలం అప్పంపలిలో 40 మంది విద్యార్థులకుగాను ముగ్గురు ఎస్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరిని సర్దుబాటు చేయాల్సి ఉన్నా ఒకరితోనే సరిపెట్టారు. ● మరికల్ మండలం పెద్దచింతకుంట ప్రాథమిక పాఠశాలలో 54 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారు. అయితే ఇక్కడ ఒక పీఎస్ హెచ్ఎంతో పాటు నాలుగు ఎస్జీటీలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడి నుంచి ఏ ఒక్కరిని కూడా డిప్యూటేషన్ ఇవ్వలేదు. ● మాగనూర్ మండలం కొత్తపల్లి యూపీఎస్ స్కూల్లో 282మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 12 పోస్టులు మంజూరు కాగా ఆరుగురు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ స్కూల్లో ప్రాథమిక తరగతుల్లో 190 మంది విద్యార్థులు ఉంటే వారికి 7మంది ఎస్జీటీలు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో ఒకరిని డిప్యూటేషన్ ఇచ్చారు. ● మక్తల్ మండలం తిర్మలాపూర్ పీఎస్లో 51మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. ఒకరిని చందాపూర్కు పంపించారు. ఒకే టీచర్ ఐదు తరగతులకు బోధించడం కష్టంగా ఉంది. ● నారాయణపేట మండలం బొమ్మన్పాడు పీఎస్లో బడిబాటలో 53మంది చేరారు. 173మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. టీచర్లను కేటాయించాలి మా పాఠశాలలో ఇటీవల పదోన్నతితో ఇద్దరు టీచర్లు ఇతర పాఠశాలలకు వెళ్లారు. ఎనిమిది తరగతులకు ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారు. దీంతో చదువు చెప్పడానికి ఉపాధ్యాయులకు ఇబ్బందిగా మారింది. వెంటనే ఇద్దరు రెగ్యూలర్ టీచర్లతో పాటు మరో ఇద్దరు వలంటీర్లను కేటాయించాలి. – భానుతేజ, విద్యార్థి, మద్దెల్బీడ్. అవసరం మేరకు సర్దుబాటు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థులను బేరీజు వేసుకుని అత్యవసరమైన చోటికి టీచర్లను డిప్యూటేషన్పై పంపించాం. త్వరలో ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్టక్టర్లను నియమించనుంది. జిల్లాలో 284మందికి ప్రతిపాదనలు పంపించాం. తప్పకుండా అవసరమైన చోట ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. బదిలీలపై ఇచ్చిన ఆదేశాల ప్రకారం టీచర్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలి. లేకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. – గోవిందరాజు, డీఈఓ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య ప్రాథమిక పాఠశాలల్లో అరకొరఉపాధ్యాయులతో సమస్య తీవ్రం మూడు నెలలైన వలంటీర్లనియామకం లేని వైనం వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో టీచర్ల డిప్యూటేషన్లో తడబాటు -
కాళోజీ జీవితం.. స్ఫూర్తిదాయకం
మక్తల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్లోని మంత్రి కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమసమాజ నిర్మాణానికి కాళోజీ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ఆయన.. తెలుగుభాష, ప్రజల అవసరాల కోసం తన జీవితాన్నే త్యాగం చేశారన్నారు. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. కాళోజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమతుల్లా, వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, సూర్యకుమార్, రవికుమార్, రాజేందర్, గోవర్ధన్, దండు రాము పాల్గొన్నారు. -
‘పాలమూరు’ను జిల్లా బిడ్డే ఎండబెడుతున్నారు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి 21 నెలల పాలనలో ఎక్కడ మాట్లాడినా.. నేను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డను అని చెప్పుకుంటారని.. కానీ ఆయనే పాలమూరును ఎండబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఆవంచ గ్రామానికి వచ్చారు. శ్వేతారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆ తర్వాత వారు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మారెడ్డి ఇంట్లో భోజనం చేశారు. హరీశ్రావు తిరిగి హైదరాబాద్కు పయనమైన అనంతరం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలమూరు వెనుకబాటుతనానికి టీడీపీ, కాంగ్రెస్ కారణమని ఆయన టీడీపీలో ఉన్నప్పుడే చెప్పారన్నారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని.. ఆరు గ్యారంటీలు 100 రోజుల్లో అమలవుతాయనే ఆశతో ఇక్కడి ప్రజలు 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. 21 నెలలుగా పడావు పెట్టారు.. బీఆర్ఎస్ హయాంలో పాలమూరులో వివిధ ప్రాజెక్ట్లను పూర్తి చేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు పారించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పాలమూరును కోనసీమగా మార్చాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని.. కానీ పాలమూరుకు చెందిన సీఎం 21 నెలలు గడిచినా పనులు పూర్తిచేయడం లేదన్నారు. మిగతా పది శాతం పనులు పూర్తి చేసి.. నీళ్లు పారిస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే భయంతో పాలమూరును పడావు పెట్టారని మండిపడ్డారు. పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్ట్కు వారి మామ జైపాల్రెడ్డి పేరు పెట్టుకోవడంపై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. దురాలోచనతో కొడంగల్కు శ్రీకారం.. పాలమూరు ఎత్తిపోతల్లో భాగంగా ఉమ్మడి పాలమూరు, కొడంగల్ నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేసి.. ప్రాజెక్ట్ను 90 శాతం పూర్తి చేశామని తెలిపారు. అయితే హడావుడిగా కొడంగల్, రంగారెడ్డికి నీరందించే సోర్స్ను శ్రీశైలం నుంచి జూరాలకు మార్చి రూ.4 వేల కోట్లతో సీఎం రేవంత్రెడ్డి టెండర్లు పూర్తి చేశారన్నారు. మనసులో ఏదో దురాలోచనతో పర్యావరణ అనుమతుల్లేకుండా టెండర్లు పూర్తి చేయడంతో రైతులు ఎన్జీటీని ఆశ్రయించగా.. స్టే ఇచ్చిందన్నారు. కొడంగల్ ఎత్తిపోతల కింద రైతులు కూడా పరిహారం కోసం రోడ్డెక్కుతున్నారన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ వాళ్లు వేధింపులకు గురి చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దేవరకద్రలో మండల పార్టీ అధ్యక్షుడిపై లేని కేసు పెట్టి జైలుకు పంపించారని.. కాంగ్రెస్లో చేరితే కేసు తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు, క్రషర్ నిర్వాహకులపై జీఎస్టీ, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పార్టీ నాయకులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను చైతన్యవంతం చేసేలా ఆలోచన చేసి ముందుకు సాగుతామన్నారు. ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, రావుల చంద్రశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చెప్పుకోలేనిదురావస్థలో ఉన్నారు.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు కదా అంటూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కృష్ణమోహన్రెడ్డి సమక్షంలోనే కేసీఆర్పై మంత్రులు పొంగులేటి, జూపల్లి ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఆయన ఎందుకు మౌనం వహించారు.. కాంగ్రెస్లో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దురావస్థలో ఉన్నారు’ అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పనులు పూర్తి మిగిలిన 10 శాతం పనులు ఎందుకు పూర్తి చేయడం లేదు కేసీఆర్కు పేరు వస్తుందనే పడావు పెట్టారు సీఎం రేవంత్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం -
కళా ఉత్సవ్తో సృజనాత్మకత వెలికితీత
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు, కనుమరుగవుతున్న కళలకు జీవం పోసేందుకు ప్రభుత్వం కళా ఉత్సవ్ నిర్వహిస్తుందని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో స్థానిక బాలకేంద్రంలో జిల్లాస్థాయి కళా ఉత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాంశాల్లో పాల్గొని ప్రతిభకనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, వివిధ విభాగాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి కళా ఉత్సవ్లో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఒకల్ మ్యూజిక్లో చంద్రలేఖ (టీజీఎంఎస్జేసీ, ధన్వాడ), ఒకల్ మ్యూజి క్ గ్రూప్లో పూజ (టీజీడబ్ల్యూఆర్ఎస్, ఊట్కూర్), ఇను్టృమెంటల్ మ్యూజిక్ సోలోలో సంజన (టీఎస్బ్ల్యూఆర్ఎస్ ఊట్కూర్), ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గ్రూప్లో హిమజ (టీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఊట్కూర్), డాన్స్ సోలో క్లాసికల్లో చంద్రలేఖ (టీజీఎంఎస్జేసీ ధన్వాడ), డాన్స్ గ్రూప్ జానపదంలో మేఘన గ్రూప్ (శ్రీసాయి స్కూల్ నారాయణపేట), థియేటర్ గ్రూప్లో సవిత (టీఎస్డబ్ల్యూఆర్ఎస్జేసీ), విజువల్ ఆర్ట్స్ టు డీ సోలోలో సావి త్రి (జెడ్పీహెచ్ఎస్, పల్లెర్ల), విజువల్ ఆర్ సోలో 3–డీలో నాగవేణి (జెడ్పీహెచ్ఎస్, బిజ్వార్), విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 3–డీలో కార్తీక (టీజీడబ్ల్యూఆర్ఎస్జేసీ ఊట్కూర్), ట్రెడిషనల్ స్టోరీ టెల్లింగ్లో స్వా తి (పీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ ఊట్కూర్) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో బాలకేంద్రం సుపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, సంగ నర్సింహులు, జ్ఞానామృత, వసంత్ కుమార్, పర్వీన్, శ్రీకాంత్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో వేగం పెంచండి
● అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మాగనూర్, మదనాపురం, కృష్ణా, నర్వ, మక్తల్, అమరచింత, ఆత్మకూర్, ఊట్కూర్ మండలాల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వెనకబడ్డామని.. ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్ల పూర్తిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా లబ్ధిదారులకు ఇసుక సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఇళ్ల పురోగతిని తెలుసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,080 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 1,334 ఇళ్ల పనులను ప్రారంభించినట్లు వివరించారు. వీటిలో 13 ఇళ్లు పూర్తి కాగా.. మరో 8 ఇళ్లు చివరి దశలో ఉన్నాయన్నారు. అనంతరం మక్తల్ మండలం బోందల్కుంట, అంకెన్పల్లి, గుడిగండ్ల, రుద్రసముద్రం తదితర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి తన నివాసంలో పంపిణీ చేశారు. నర్వ మండలం ఉందేకోడ్, నాగిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ● టీజీఎస్పీడీసీఎల్ ఎమర్జేన్సీ వాహనాన్ని మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్లో ప్రారంభించారు. ప్రజలకు వేగవంతంగా విద్యుత్ సేవలు అందించేందుకు ఎమర్జేన్సీ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమాల్లో ఏడీఈ జగన్మోహన్రావు, హౌసింగ్ పీడీ శంకర్, డీఈ హరికృష్ణ, బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతు, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఏఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, కట్ట సురేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో అవినీతి అధికారి
● రైతు నుంచి రూ. 5వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన మద్దూరు ఆర్ఐ మద్దూరు: మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల మేరకు.. మద్దూరు మండలం రెనివట్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని అప్పిరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు తన 5 గుంటల భూమి డీఎస్ పెండింగ్ సమస్యను పరిష్కరించాలని ఆర్ఐ కె.అమర్నాథ్ను సంప్రదించగా.. రూ. 5వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. రైతు నుంచి ఆర్ఐ డబ్బులు తీసుకొని మహబూబ్నగర్కు కారులో వెళ్తున్న క్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పట్టుకొని తనిఖీ చేశామన్నారు. రైతు నుంచి తీసుకున్న లంచం డబ్బులను రికవరీ చేసి ఆర్ఐని అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు లింగస్వామి, సయ్యద్ అబ్దుల్ జిలానీ పాల్గొన్నారు. -
పాలమూరుకు మరో మణిహారం!
జడ్చర్ల: పాలమూరు జిల్లాకు మరో మణిహారం దక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డు తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో చేపట్టనున్న ఆర్ఆర్ఆర్ (రీజినల్ రింగ్రోడ్డు) పరిధిలోకి ఉమ్మడి జిల్లా గ్రామాలు కూడా వెళ్లనున్నాయి. బాలానగర్ మీదుగా ట్రిపుల్ ఆర్ రోడ్డు విస్తరణ పనులు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నోటిఫికేషన్ను హెచ్ఎండీఏ ఇప్పటికే జారీ.. ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువిచ్చింది. రీజనల్ రింగ్రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్మెంట్ కోసం మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాలో పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కలుపుతూ హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అలైన్మెంట్కు సంబంధించి ఇప్పటికే డిజిటల్ మ్యాప్లతో పాటు సర్వే నంబర్లు తదితర పూర్తి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో ప్రజలకు అందబాటులో ఉంచారు. ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను రాత పూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్ఎండీఏ తుది నోటిఫికేషన్ను విడుదలచేయనుంది. ● ఉమ్మడి మహబూబ్నగర్లోని ఆమన్గల్, మాడ్గుల, కేశంపేట, తలకొండపల్లి, ఫరూఖ్నగర్, కొందుర్గు మండలాల్లో ఆర్ఆర్ఆర్ విస్తరించనుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మహబూబ్నగర్ జిల్లా బాలాగనర్ మండలంలోని అప్పాజీపల్లి, బోడజానంపేట, చిన్నరేవల్లి, గౌతాపూర్, గుండేడు, మాచారం, పెద్దరేవల్లి, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్, వనమోనిగూడలు ట్రిపుల్ ఆర్ పరిధిలోకి వెళ్లనున్నాయి. గతంలో ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామం వరకే ట్రిపుల్ ఆర్ను పరిమితం చేశారు. డిజైన్ మార్పుతో బాలానగర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి పెద్దాయపల్లి క్రాస్ రోడ్ వద్ద 44 వ నంబర్ జాతీయ రహదారి వరకు ఇది విస్తరించనుంది. దీని నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రహదారి నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లను హెచ్ఎండీఏ విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన పడుతున్నారు. పెద్దాయపల్లి క్రాస్రోడ్డు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి ఏర్పాటయిన వెంచర్లు కూడా ట్రిపుల్ ఆర్ పరిధిలోకి రావడంతో ఆయా వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారంగా పరిహారం అందించే పరిస్థితి ఉండడంతో తాము నష్టపోతామని వాపోతున్నారు. కాగా.. ఆర్ఆర్ఆర్ను అనుసరించి ఉన్న భూముల విలువలు అమాంతంగా మూడు–నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి బాలానగర్ మండలం గుండా ట్రిపుల్ ఆర్ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల రాకతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆర్ఆర్ఆర్ చుట్టూ మాల్స్, వాణిజ్య భవనాలు ఏర్పాటవుతాయి. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాకు లాభం చేకూరుతుంది. – జనంపల్లి అనిరుధ్రెడ్డి, ఎమ్మెల్యేల, జడ్చర్ల ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ ఈ నెల 15 వరకు అభ్యంతరాలకు గడువు డిజైన్ మార్పుతో ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గ్రామాలకు విస్తరణ జంక్షన్గా మారనున్న పెద్దాయపల్లి క్రాస్రోడ్ -
రేపు తుది ఓటరు జాబితా విడుదల
నారాయణపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు అదనపు కలెక్టర్ ఎస్.శ్రీను తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాల మేరకు అవసరమైన మార్పులు, చేర్పులు జరిపి తుది ఓటరు జాబితాను వెలువరిస్తామన్నారు. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సలీం, బీజేపీ మండల అధ్యక్షుడు సాయిబన్న, బీఆర్ఎస్, సీపీఎం, బీఎస్పీ నాయకులు సుదర్శన్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
యూరియా కోసం తప్పని పాట్లు
ధన్వాడ/నర్వ: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. రెండు బస్తాల యూరియా కోసం తెల్లవారుజామునే పీఏసీఎస్ల వద్దకు చేరుకొని గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ధన్వాడ పీఏసీఎస్కు యూరియా రాకపోవడంతో నాలుగు రోజులుగా పంపిణీ చేయలేదు. సోమవారం యూరియా వస్తుందని తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు వేకువజామున 5 గంటలకే పీఏసీఎస్కు చేరుకొని చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టారు. పీఏసీఎస్ గేటు ఎప్పుడు తెరుస్తారా అని గంటల తరబడి ఎదురుచూశారు. ఎట్టకేలకు పోలీసుల బందోబస్తు నడుమ పీఏసీఎస్ గేటు తీయగా.. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చారు. రైతులను నిలువరించే క్రమంలో పోలీసులు కిందపడ్డారు. రైతులను క్యూలో నిలబెట్టేందుకు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 580 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశారు. ● నర్వ పీఏసీఎస్కు రైతులు పోటెత్తారు. యూరియా కోసం గంటల తరబడి క్యూ కట్టారు. గంటల వ్యవధిలోనే యూరియా స్టాక్ ఖాళీ కావడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఒక్క బస్తా యూరియా కోసం నిత్యం అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. -
జీపీఓలు వచ్చేశారు..
● అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ సమక్షంలో కౌన్సెలింగ్ ● సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నియామకం ● సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పెరగనున్న పర్యవేక్షణ ● గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టం నేడు విధుల్లో చేరనున్న గ్రామ పాలన అధికారులు నారాయణపేట: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు న్న గ్రామ పాలన అధికారులు మంగళవారం నుంచి విధుల్లో చేరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,016 మంది జీపీఓలను శుక్రవారం నియమించగా.. జిల్లాకు 124 మందిని కేటాయించారు. సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో అడిషనల్ కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రాంచందర్నాయక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటుచేసిన క్లస్టర్ల వారీగా జీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు. ఇకపై ప్రతి గ్రామ పాలన పకడ్బందీగా సాగనుంది. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసే సంక్షేమ పథకా లు నేరుగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయడంలో జీపీఓలు కీలకపాత్ర పోషించనున్నారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా మారనుంది. 252 రెవెన్యూ గ్రామాలు.. 124 క్లస్టర్లు జిల్లాలోని 13 మండలాల్లో 252 రెవెన్యూ గ్రామా లను 124 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్లో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్కు ఒక్కొక్క జీపీఓను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 124 రెవెన్యూ క్లస్టర్లకు కేటాయించిన జీపీఓలు తహసీల్దార్ల పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్నారు. పక్కాగా కౌన్సెలింగ్.. కొత్తగా నియమితులైన జీపీఓలు తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా ఇతర నియోజకవర్గాల్లోని మండలాల్లో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు పక్కాగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు అడిషనల్ కలెక్టర్ శ్రీను తెలిపారు. ముందుగా 16మందికి స్పౌజ్, వికలాంగులు, సింగిల్ ఉమెన్, మెడికల్ సమస్యలు ఉన్నవారికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత 108 మందికి వారు రాసిన జీపీఓ పరీక్షలో వచ్చిన ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ చేపట్టారు. జీపీఓల విధులు ఇలా.. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ప్రభుత్వం నియమించిన జీపీఓలు 11 రకాల జాబ్చార్ట్ అనుసరిస్తారు. భూ భారతి చట్టంలో భాగంగా భవిష్యత్లో ప్రతి రిజిస్ట్రేషన్ – మ్యుటేషన్కు గ్రామ పటం జోడించడంలో జీపీఓల పాత్ర కీలకంగా మారనుంది. గ్రామస్థాయిలో భూ ఖాతా (విలేజ్ అకౌంట్) నిర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృదస్త్రం నిర్వహణ, లావుణి, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ, నీటివనరుల కింద భూముల పరిరక్షణ, భూమి ఖాతాల నిర్వహణ, మార్పు, చేర్పుల నమోదు, భూ సర్వేకు దరఖాస్తు చేసుకుంటే సేవలు, ప్రకృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా, గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణ, జనన, మరణాల విచారణ, ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తదితర విధులు నిర్వర్తించనున్నారు. సుస్థిర పాలన అందిస్తాం.. వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో నారాయణపేట మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్గా పనిచేశా. ప్రభుత్వం జీపీఓలను నియమించడంతో తిరిగి తమ శాఖాలోకి వచ్చినట్లయింది. తమకు కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో సుస్థిర పాలన అందించేందుకు కృషిచేస్తాం. – జ్యోతి, జీపీఓ, బోయిన్పల్లి భూ సమస్యల పరిష్కారానికి కృషి.. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. రైతులు, అధికారులకు సరైన సమాచారాన్ని అందించి పూర్తిస్థాయిలో సహకరిస్తాం. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు అయ్యేందుకు కృషిచేస్తాం. – శ్రీనివాస్, జీపీఓ, శేర్నపల్లి ఆనందంగా ఉంది.. వీఆర్ఏగా 2012లో ఊట్కూర్ మండలం నిడుగుర్తిలో విధుల్లో చేరా. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో వీఆర్ఏ పోస్టులను రద్దు చేయడంతో నారాయణపేట మున్సిపాటీటిలో వార్డు అధికారిగా 2023 ఆగస్టు 8న పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వీఆర్ఏలు, వీఆర్ఓలు మళ్లీ సొంత శాఖకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. – ఆంజనేయులుగౌడ్, జీపీఓ, కొల్లంపల్లి మండలం రెవెన్యూ క్లస్టర్లు గ్రామాలు కోస్గి 17 7 గుండుమాల్ 10 4 మద్దూర్ 17 9 కొత్తపల్లి 11 5 దామరగిద్ద 27 13 నారాయణపేట 24 15 మాగనూర్ 20 9 కృష్ణా 14 8 ధన్వాడ 10 7 మరికల్ 14 7 మక్తల్ 39 20 ఊట్కూర్ 27 11 నర్వ 20 9 మండలాల వారీగా క్లస్టర్ల వివరాలిలా.. -
918 టీఎంసీలు
వంద రోజుల్లోన్యూస్రీల్మతసామరస్యాన్ని చాటాలి : ఎస్పీ నారాయణపేట క్రైం: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలో చేపట్టే ర్యాలీని శాంతియుతంగా నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీ సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకొని మతసామరస్యాన్ని చాటాల ని కోరారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే, అనుచిత పోస్టులు పెడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కృష్ణా బ్రిడ్జిపై స్తంభించిన ట్రాఫిక్ కృష్ణా: మండలంలోని కృష్ణా బ్రిడ్జిపై ఆదివారం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శక్తినగర్, రాయచూర్ పట్టణాల నుంచి గణేశ్ విగ్రహాలను ఒక్కసారిగా కృష్ణా బ్రిడ్జిపైకి అధిక సంఖ్యలో తీసుకురావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఇటు టైరోడ్డు వరకు, అటు శక్తినగర్ వరకు దాదాపు 5 కి.మీ. మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ కావడానికి 3గంటల సమయం పట్టింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కర్ణాటక పోలీసులు తగు ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తేవి కావని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం మద్దూరు: రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.వెంకట్రాంరెడ్డి విమర్శించారు. ఆదివారం మద్దూరులో సీపీఎం ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యయప్రయాసాలకోర్చి సాగుచేసిన వరిపంటకు అవసరమైన యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మద్దూరు ఏరియా కార్యదర్శిగా గోపాల్ను ఎన్నుకున్నారు. సమావేశంలో నాయకులు అశోక్, అంజిలయ్య, అలీ, జోషి, శివకుమార్, హన్మంతు, రామకృష్ణ, లాలప్ప, అరుణ్, వెంకట్ ఉన్నారు. రామన్పాడులో పూర్తిస్థాయి నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో ఆదివారం సముద్ర మట్టానికి పైన 1,021 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 920 క్యూసెక్కుల వరద జ లాశయానికి చేరుతుండగా.. సమాంతర కాల్వ లో నీటి సరఫరా లేదన్నారు. ఇదిలా ఉండగా జ లాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875, కుడి, ఎడమ కాల్వలకు 55, ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. కోయిల్సాగర్లో 32.3 అడుగుల నీటిమట్టం దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 32.3 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా, మరో 0.3 అడుగుల మేర నీరు చేరితే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టు గేట్లను గతవారం నుంచి మూసివేశారు. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండడంతో సందర్శకుల సందడి కనిపించింది. జిల్లాకేంద్రం నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గద్వాల: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న కృష్ణానదిపై నిర్మించిన తొలి ప్రాజెక్టు జూరాలకు జలకళ సంతరించుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తూ దానికిందున్న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఈసారి జూరాలకు ముందస్తుగానే మే నెలలో 29వ తేదీన వరద మొదలవగా సెప్టెంబర్ 6వ తేదీ వరకు 918 టీఎంసీల వరద వచ్చింది. ● గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వానాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణాబేసిన్కు భారీగా వరదనీటితో నిండిపోయింది. కృష్ణాబేసిన్లో ఉన్న మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీ వరదనీరు వచ్చి చేరుతుండడంతో నీటిని దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో కృష్ణాబేసిన్లో తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల పాజెక్టుకు మే 29వ తేదీన మొదటిసారిగా వరద మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రాజెక్టుకు గరిష్టంగా 4.18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరగా, ప్రాజెక్టులోని 44 గేట్లు ఎత్తి దిగువనున్న శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. జూరాలకు వరద మొదలైనప్పటి నుంచి ప్రాజెక్టుకు మొత్తం 918 టీఎంసీల నీరు వచ్చింది. జూన్, జూలైలో మాసాల్లో వర్షాలు లేకపోవడంతో చాలా రోజులు జూరాలకు వరద పూర్తిగా తగ్గిపోయింది. తిరిగి జూలై చివరి వారంలో వరద ప్రారంభం కావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి, నీటిని విడుదల చేశారు. జూరాలకు భారీ వరద రావడంతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో చేపపిల్లల పంపిణీకి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్ల కమిటీ చైర్మన్గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్గా జిల్లా మత్య్సశాఖ అధికారి, సభ్యులుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో చేపపిల్లల టెండర్లు, మత్య్సకారులకు పంపిణీ, చెరువుల్లో వదిలేంత వరకు వారి పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుంది. న్యాయమైన పరిహారం కోసమే ఆందోళన నారాయణపేట: తాము పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకం కాదని.. భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని భూ నిర్వాసితుల సంఘం సలహాదారులు బండమీది బలరాం, కృష్ణ మడివాల్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి 55వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వలసలు, కరువుకు నెలవుగా మారిన నారాయణపేట ప్రాంతానికి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు అవసరమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూ నిర్వాసితులు ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని.. న్యాయమైన పరిహారం కోసమే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరాకు రూ. 35లక్షలు ఇవ్వాలని కోరారు. రీలే దీక్షలు చేపట్టిన వారిలో అంజప్ప, నర్సింహులు, కాశప్ప, శివ, గోవర్ధన్, సుదర్శన్, భాస్కర్ ఉన్నారు. జాతీయస్థాయి శిక్షణకు జిల్లా ఉపాధ్యాయుడు నారాయణపేట రూరల్: కృష్ణా మండలం కున్సీ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న కుందేటి నర్సింహ జాతీయస్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. సీసీఆర్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10నుంచి 24వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే శిక్షణకు ఆయన హాజరు కానున్నారు. జూన్లో రాష్ట్రస్థాయిలో జరిగిన శిక్షణ శిబిరానికి ఆయన హాజరై ప్రతిభ చాటడంతో జాతీయస్థాయికి ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం–2020 అంశంపై 15 రోజుల పాటు శిక్షణ కొనసాగనుంది. కాగా, హెచ్ఎం కుందేటి నర్సింహ ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ మేరకు నర్సింహను డీఈఓ గోవిందరాజులు, ఎంఈఓ నిజాముద్దీన్ అభినందించారు. ఆత్మకూర్: జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యాన్ని అధికారులు చేరుకున్నారు. ప్రాజెక్టు చరిత్రలో మొదటిసారి సెప్టెంబర్ మొదటి వారంలోనే లక్ష్యానికి చేరుకొని రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో కురిసిన ముందస్తు వర్షాలకు విద్యుదుత్పత్తి ప్రారంభించగా.. ఆదివారం 613 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించారు. కాగా ఈ ఏడాది విద్యుదుత్పత్తి లక్ష్యం 610 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో వరద జలాశయానికి చేరడంతో ముందస్తు విద్యుదుత్పత్తి సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ● జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రంలోని మూడో యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తగా రెండేళ్లుగా చైనా నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు మరమ్మతు చేపట్టారు. ఈ ఏడాది ఆగస్టు మూడో వారంలో సమస్య పరిష్కారమై వినియోగంలోకి రావడంతో విద్యుదుత్పత్తి మరింత పెరిగింది. ఈ యూనిట్ ముందు నుంచి వినియోగంలో ఉంటే ఆగస్టులోనే లక్ష్యాన్ని చేరుకునే వారమని అధికారులు చెబుతున్నారు. ● దిగువ జూరాలలో ఆరు యూనిట్లు ఉండగా ఒక్కొక్క యూనిట్లో 40 మెగావాట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. 24 గంటల పాటు 40 మెగావాట్ల ఉత్పత్తి చేపడితే 9,600 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. 100 ఓల్టేజీ గల పది బల్బులు ఒక గంటసేపు వాడితే ఒక్క యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది. 10 లక్షల యూనిట్లకు ఒక మిలియన్ యూనిట్ అవుతుంది. ఒక మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తికి 0.78 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో మే 30న ఉత్పత్తి ప్రారంభించి సెప్టెంబర్ 7వ నాటికే 613 మి.యూ. ఉత్పత్తి సాధించి ప్రాజెక్టు చరిత్రలోనే మొదటిసారి అతి త్వరగా లక్ష్యాన్ని చేరుకున్నాం. ముందస్తు వరదలు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో విద్యుదుత్పత్తి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. – శ్రీధర్, ఎస్ఈ, జెన్కో, జూరాల ● 675 టీఎంసీలు నదిలోకి.. ఎత్తిపోతల పథకాల కోసం 17.2 టీఎంసీలు విడుదల సెప్టెంబర్ మొదటి వారంలోనే విద్యుదుత్పత్తి లక్ష్యం పూర్తి వానాకాలంలో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చిచేరుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. జూరాల నుంచి 17.2 టీఎంసీలు సాగునీటి ప్రాజెక్టులకు వినియోగించుకుని మిగతా 675 టీఎంసీల నీటిని నదిలోకి వదిలేశారు. ఇందులో నెట్టెంపాడు ప్రాజెక్టుకు (4.3 టీఎంసీలు), భీమా–1 (2.6 టీఎంసీలు), భీమా–2, (2.9 టీఎంసీలు) కోయిల్సాగర్కు (1.9 టీఎంసీలు), కల్వకుర్తి ఎత్తిపోతలకు (4 టీఎంసీలు), జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలకు (1.50 టీఎంసీలు) ఎత్తిపోయగా.. మిగిలిన 659టీఎంసీలను నదిలోకి వదిలేశారు.