Top Stories
ప్రధాన వార్తలు

తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
తిరుపతి, సాక్షి: తిరుమల ప్రతిష్టతను దెబ్బ తీయడమే కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్న ఆయన.. గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతిని బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది. కానీ, ఇవాళ జరుగుతోంది ఏంటి?. టీటీడీ గోశాల(TTD Goshala)లో అమ్మకంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తారు. కానీ, తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి. మూగజీవాలు దిక్కుమొక్కు లేకుండా మరణిస్తున్నాయి. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు... మా పాలనలో 500 గోవులను దాతల నుంచి సేకరించి సంరక్షించాం. గతంలో వందే గో మాతరం అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో చేపట్టాం. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై విషం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. గోవుల పట్ల కూటమి సర్కార్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలను పట్టించుకునేవాడు లేడు. చెత్తకు వేసినట్లుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఎలాంటి సంబంధం లేకపోయినా గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి గోశాలకు ఓ డైరెక్టర్ అంటూ లేడు. డీఎఫ్వో స్థాయి అధికారిని గోశాలకు ఇన్చార్జిగా నియమించారు. సాహివాల్ ఆవు గోశాలనుంచి బయటకు వెళ్లి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని చెప్పేందుకు చెవులు కట్ చేశారు. గోశాల.. గోవధశాలగా మారింది.. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ పరిస్థితి ఎదురైంది. ఈ మహా పాపం కూటమి సర్కార్, టీటీడీ అధికారులదే. ఇంత జరుగుతున్నా.. పవనానంద స్వామి(Pawan Kalyan) ఎక్కడ? ఏం చేస్తున్నారు?. గోవుల మృతి విషయాన్ని కూటమి ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందన్న భూమన.. గోవుల మృతిపై విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలని కోరారాయన.

భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది.ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే(LeT) ఉగ్రవాదులకు నిషాన్ ఏ హైదర్(పాక్లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్ మైండ్ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్ఈటీ కదలికల గురించి, ముంబై దాడుల గురించి వీరిరువురూ చర్చించారు.అప్పటికే చికాగోలో ఇమ్మిగ్రేషన్ వ్యాపారంలో ఉన్న రాణా ముంబైలోనూ ఓ కార్యాలయం తెరవాలని చూశాడు. దానికి ఎలాంటి అనుభవం లేకపోయినా హెడ్లీని మేనేజర్ను చేయాలనుకున్నాడు. అలాగే ముంబై దాడుల అనంతరమూ ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో జరిగిన నష్టం గురించి హెడ్లీ ప్రస్తావించగా.. భారతీయులకు ఇలా జరగాల్సిందేనంటూ రాణా బదులిచ్చాడు. అంతేకాదు హెడ్లీ ప్రయాణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను కూడా రాణానే సృష్టించేవాడు. ముంబై దాడుల్లో భాగస్వాములుడేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), తహవూర్ హుసేన్ రాణా.. ఈ ఇద్దరూ 2008 ముంబై ఉగ్రదాడుల కేసుల్లో ప్రధాన నిందితులుగానే ఉన్నారు. డేవిడ్ హెడ్లీ ప్రధాన సూత్రధారి కాగా.. రాణా అతనికి సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. రెక్కీ నిర్వహించడంతో దాడులకు బ్లూప్రింట్ రూపకల్పన తదితర అంశాలను రాణానే దగ్గరుండి చూసుకున్నట్లు నేరారోపణలు ఉన్నాయి. ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో 2009 అక్టోబర్లో తొలుత హెడ్లీ, ఆపై రాణా అరెస్టయ్యారు. డేవిడ్ హెడ్లీకి అక్కడి కోర్టులు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించగా.. అప్రూవర్గా మారిపోయి అమెరికా న్యాయ విభాగంతో జరుపుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని భారత్కు అప్పగించే అవకాశం లేకుండా పోయింది. ఇక.. 2013లో తహవూర్ రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్ కోర్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత.. 2020లో తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల తర్వాత.. సెంట్రల్ డిసస్టట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనుమతించింది. అప్పటి నుంచి అన్నిరకాల కోర్టుల్లో ఊరట కోసం రాణా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు అగ్రరాజ్య సుప్రీం కోర్టులోనూ దారులు మూసుకుపోవడంతో.. ఎట్టకేలకు అమెరికా భారత్కు అప్పగించింది.

ట్రంప్ పన్నులపై చైనా జిన్పింగ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు. చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్పింగ్ చర్చలు జరపనున్నారు.Latest UY | WorldXi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025జిన్పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్పింగ్కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు.

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
టైటిల్ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్,రోహిణి, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థలు: మాంక్స్ అండ్ మంకీస్నిర్మాత: మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ఎడిటింగ్: కొడాటి పవన్ కల్యాణ్దర్శకత్వం, స్క్రీన్ప్లే: నితిన్–భరత్కథ, డైలాగ్స్: సందీప్ బొల్లాసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్రెడ్డివిడుదల: ఏప్రిల్ 11, 2025‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్ 11న విడుదలైంది. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్–భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.కథేంటి..?కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్ సుందర్) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్రూమ్లు నిర్మించాలని సర్పంచ్ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్ అయిన కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..? ఫైనల్గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే దర్శకులు నితిన్–భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్ (సత్య) కూడా కారు డ్రైవర్గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్లో పని (గెటప్ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్ అవుతుంది. పల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమలో పడటం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్లు, టర్న్లతో ఫీల్గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. కథాపరంగా సినిమాలో కొత్తదనం లేకపోయినా గెటప్ శ్రీను, సత్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. వారు స్క్రీన్పై కనిపించే ప్రతిసీన్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుతారు. వారి పంచ్లు, ప్రాసలు గట్టిగానే పేలాయి.రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్లో ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్ డైలాగ్స్, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్లో ఉన్న బలం సెకండాఫ్లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్ సీన్ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.ఎవరెలా చేశారంటే..గెటప్ శ్రీను, సత్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్ దీపిక తన పాత్రలో బాగా సెట్ అయిపోయింది. తను యాంకర్గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్రదీప్కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత తడబాటుకు లోనయ్యాడని చెప్పవచ్చు. ప్రదీప్ తల్లిదండ్రులుగా మురళీధర్ గౌడ్,రోహిణి తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సంగీతం, కెమెరామెన్ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్, దీపిక, గెటప్ శ్రీను, సత్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు..

CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి నాయకుడిగా వ్యవహరించనున్నాడు.కోల్కతా నైట్ రైడర్స్తో శుక్రవారం జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని సీఎస్కే తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సొంత మైదానం చెపాక్లో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్లో తలమునకలయ్యారు. ఇక ధోని సైతం నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు.ఆ సమయంలో కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా అతడికి ఎదురువెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ద్రోహి వచ్చేశాడు చూడండిఇంతలో నెట్స్లో ఉన్న ధోని మాత్రం.. బ్రావోను చూసి.. ‘‘ఇదిగో.. ద్రోహి వచ్చేశాడు చూడండి’’ అంటూ తనదైన శైలిలో స్వాగతం పలికాడు. ఇందుకు.. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది’’ అని బ్రావో బదులిచ్చాడు. నవ్వుతూ వెళ్లి ధోని హగ్ చేసుకున్నాడు. ఆ వైబ్ను మిస్సవుతున్నాంఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎంఎస్- డీజే.. ఆ వైబ్ను మిస్సవుతున్నాం’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ వీడియోను చూసి సీఎస్కే అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. బ్రావో చెన్నై ఫ్రాంఛైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.సీఎస్కేతో సుదీర్ఘ బంధంకాగా వెస్టిండీస్కు చెందిన డ్వేన్ బ్రావో 2011- 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2018- 2022 మధ్య కాలంలో ఈ కరేబియన్ ఆల్రౌండర్ సీఎస్కేకు ఆడాడు. 2011, 2018, 2021, 2022లో ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.అంతేకాదు.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రావో 2023లో బౌలింగ్ కోచ్గా చెన్నై జట్టుకు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో చెన్నై ముఖచిత్రం, కర్త, కర్మ, క్రియ అయిన ధోనితో బ్రావోకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, 2025 సీజన్ ఆరంభానికి ముందు పరిస్థితులు మారిపోయాయి.గౌతం గంభీర్ స్థానంలోసీఎస్కేను వీడిన తర్వాత బ్రావో.. కేకేఆర్ ఫ్రాంఛైజీతో జట్టుకట్టాడు. గౌతం గంభీర్ స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ మెంటార్గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సీఎస్కే- కేకేఆర్ మధ్య శుక్రవారం మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను కలవగా ధోని ఇలా సరదాగా స్పందించడం విశేషం.కాగా 41 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ బ్రావో ఐపీఎల్లో 161 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 1560 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే గెలిచింది. మరోవైపు.. సీఎస్కే ఆడిన ఐదింట.. గత నాలుగు మ్యాచ్లలోనూ ఓటమిపాలైంది.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!MS🫂DJ : MISS THIS VIBE! 💛✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/IlSd876zes— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025

గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్.. పదివేల కోట్ల కుంభకోణం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాదాపు రూ.10వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందన్నారు. అటవీ భూమిని అమ్మే అధికారం ప్రభుత్వానికి లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఆర్థిక నేరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. గచ్చిబౌలి భూముల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కాం చేస్తున్నారు. వాల్టా, ఫారెస్ట్ యాక్ట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించింది. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త గోల్మాల్కు తెర తీసింది.15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 3D మంత్రాను పెట్టుకున్నారు. HCUలో పర్యావరణ విధ్వంసం, హననం జరుగుతోంది. ఐఎంజీ కుంభకోణంపై ఆనాడు 2014 వరకు ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ కొట్లాడింది. ఈ భూముల వెనుక రూ.10వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. HCU చుట్టూ ఉన్న 400 ఎకరాలు అటవీ భూమి ఉంది. అది అటవీ భూమి అని సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు.. అన్ని రాష్ట్రాల హై కోర్టులకు ఇచ్చింది. 1980 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అటవీ భూమి తాకట్టు పెట్టడానికి అమ్మేందుకు ప్రభుత్వానికి హక్కు ఉండదు.పోడు యాక్ట్ ప్రకారం ఆది అటవీ భూమి అని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు. భూమిని అమ్మడానికి ముఖ్యమంత్రి దగ్గరికి బీజేపీ ఎంపీ ఒక ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ బ్రోకర్ను తెచ్చారు. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్త ద్వారా చట్టాలను, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారు. మ్యుటేషన్ కాలేదని ప్రభుత్వమే అంటుంది. TGIIC 400 ఎకరాలకు యజమాని కాదు. కేవలం ఒక GO ఆధారంగా TGIIC యజమాని అని ప్రభుత్వం చెబుతోంది. తనది కానీ భూమిని TGIIC తాకట్టు పెట్టే కుట్ర చేసింది.బ్రోకర్ ద్వారా కుమ్మకై లోన్..400 ఎకరాలకు యాజమాన్య పత్రాలు లేవు.. రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు. 26.6.2024 GO-54 ఒక్కటే ఉంది.. తప్ప ఏమీలేదు. 400 ఎకరాలకు కమిషన్ టైటిల్ కూడా లేదు. కంచెలో గజం విలువ 26900 వందలు ఉంది.. 400 ఎకరాలకు 5239 కోట్ల విలువ మాత్రమే. అక్కడ ఎకరాకు 75 కోట్లకు అమ్మడానికి రెవెన్యూ శాఖ GO విడుదల చేసింది. రూ.5239 కోట్ల విలువైన భూమిని 30,000 వేల కోట్లుగా చిత్రీకరించారు. ప్రభుత్వం.. బ్రోకర్ ద్వారా కుమ్మకై బ్యాంకులో లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. రూ.75 కోట్లు అని బ్యాంకుల దగ్గరకు పోయి.. 15కోట్లకు అమ్మే కుట్ర చేశారు. రూ.169 కోట్లు బ్రోకర్కు కమీషన్ ఇచ్చారు. కోకాపేటలో భూములను చూపించి 75 కోట్లు ఎకరా అని ప్రభుత్వమే ధర చూపించారు. ఐదు నెలల్లో వ్యాల్యువేషన్ రివైజ్ చేసి 52 కోట్లకు తగ్గించారు. మళ్ళీ మూడోసారి 42 కోట్లకు కుదించారు. రూ.30వేల కోట్లు అని మొదట చెప్పి 16వేల కోట్లకు తగ్గించారు. ఢిల్లీ బ్రోకర్కు తనకా పెట్టే ప్రయత్నం చేశారు’ అని విమర్శలు చేశారు.బీకర్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సంస్థను ఏ బేసిస్ ప్రకారం ఎంపిక చేశారు?. బీజేపీ ఎంపీ చెప్పారని వడ్డీకి పావుచెరుగా అమ్మే కుట్ర చేశారు. నేను ఉరికే ఆరోపణలు చెయ్యడం లేదు.. దీన్ని వదిలిపెట్టను. RBI గవర్నర్, సెబీ, SFIO, సెంట్రల్ విజిలెన్స్, CBI, మా పార్టీ తరపున ఫిర్యాదు చేయబోతున్నాం. బీజేపీ ఎంపీ పేరు తర్వాత ఎపిసోడ్లో బయటపెడతాం. 10 వేల కోట్లకు ప్రభుత్వానిది కానీ భూమిపై ICICI బ్యాంకు లోన్ ఇచ్చారు.కేంద్రం స్పందించాలి..భూమిని ఫీల్డ్ పై చూడకుండా ICICI బ్యాంక్ ఇచ్చింది. 10వేల కోట్లు ఎక్కడికి పోయాయో ఎవరికి తెలియదు. రైతుభరోసా అన్నారు అది ఇవ్వలేదు. నేను రాసిన లేఖలపై కేంద్రం స్పందించకపోతే ఊరుకోం. ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియకుండా జరిగింది అనుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే విచారణ మొదలు పెట్టాలి. సెబీ, సెంట్రల్ విజిలెన్స్, CBI విచారణ మొదలు పెట్టాలి. భూమిని చూడకుండా 10వేల కోట్లు లోన్ బ్యాంకు ఎలా ఇస్తుంది. HMDA భూములు 60వేల కోట్లు అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం. అవసరం అయితే ప్రధాని కలుస్తాం.. లోక్ సభలో లేవనెత్తుతాం’ అని కామెంట్స్ చేశారు.

టీడీపీ, జనసేన మధ్య ఏం నడుస్తోంది?
ఆంధ్రప్రదేశ్ కూటమి భాగస్వాములు టీడీపీ, జనసేనల మధ్య అంతా బాగానే ఉందా? లేక ఎవరికి వారు తమదైన రాజకీయ క్రీడలు ఆడేస్తున్నారా? ఈ అనుమానం ఎందుకొస్తోందంటే.. ఒకపక్క సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేశ్.. పవన్ కళ్యాణ్ను అతిగా పొగిడేస్తూంటే.. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తేస్తూండటం!. ఇదే సమయంలో చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడంటూ పలు కార్యక్రమాల్లో ప్రశంసిస్తూండటం.. ఏదో తేడా కొడుతున్నట్టుగానే ఉంది రాజకీయ విశ్లేషకులకు! ఇప్పటికిప్పుడు ఇరు పార్టీల్లో పెద్ద విభేదాలేవీ స్పష్టం కాకపోయినప్పటికీ పిఠాపురం వ్యవహారం మాత్రం వివాదాల్లోనే ఉంటోంది.జనసేన గెలిచిన ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ స్థానిక నేతలు తాము చెప్పిన వారికే పనులు చేయాలని ఏకంగా లేఖలు రాస్తుండటం కూడా ఇరు పార్టీల మధ్య సయోధ్యపై ప్రశ్నలు విసురుతోంది!. అక్కడ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా పవన్ టీడీపీపై ఒత్తిడి చేయగలిగారని అంటారు. అంతేకాక తన బదులు నాగబాబును నియోజకవర్గంలో తిప్పుతూ ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మకు అసలు విలువ ఇవ్వడం లేదు. దాంతో రెండు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్నారు. నాగబాబుకు అసాధారణ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం కూడా ఆసక్తికరమైన విషయమే. రెండు వర్గాల మధ్య ఏదైనా గొడవ చెలరేగితే వచ్చే ఇబ్బందుల రీత్యా ఇలా చేసి ఉండవచ్చు.నెల్లిమర్ల నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేత తాము చెప్పినవారికే పనులు చేయాలని అధికారులకు ఉత్తరం రాయడం విశేషం. ఇక్కడే కాదు. ఆయా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా, పెత్తనం టీడీపీ వారే చేస్తున్నారన్నది జనసేన కేడర్లో బాధగా ఉంది. తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే, సమస్య ఏమిటో తెలుసుకోకుండా జనసేన అధిష్టానం తన పార్టీ నేతనే మందలించిందన్న వార్తలు వచ్చాయి. రాజకీయాలలో ఇవన్ని సాధారణంగా జరిగేవే. అయినా ఒక్కొక్కటిగా గొడవలు పెరుగుతూ, ఆ తర్వాత రోజులలో అవే పెద్దవిగా మారుతుంటాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేశ్ల మధ్య స్నేహం పెరిగిన మాట నిజమైనా.. ఎన్నికల తరువాత మాత్రం వీరిద్దరూ అంటీ అంటనట్టుగానే ఉన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత లోకేశ్ ఒకరకంగా పవన్ కళ్యాణ్ను అవమానించేలా వ్యాఖ్యానించారు కూడా. టీటీడీ అధికారులు, ఛైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే, అది ఆయన పార్టీ అభిప్రాయం అని లోకేశ్ తీసిపారేశారు. చైర్మన్తో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పించారు తప్పితే పవన్ కోరినట్లు అధికారులపై ముఖ్యమంత్రి చర్య తీసుకోలేదు. క్షమాపణలు కూడా చెప్పించ లేదు. పవన్ కళ్యాణ్ వద్ద పనిచేసే అధికారుల నియామకం విషయంలో కూడా లోకేశ్ జోక్యం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దానిపై పవన్ ఢిల్లీలో కూడా నిరసన చెప్పారని కథనాలు వ్యాపించాయి.అటవీ శాఖకు చెందిన భూమిలో ఉందన్న సాకుతో కాశీనాయన ఆశ్రమంలో భవనాలు కూల్చిన ఘటనపై పవన్ మాట్లాడ లేదు కానీ, లోకేశ్ క్షమాపణ చెప్పడం విశేషం. నిజానికి లోకేశ్కు జనసేనతో పొత్తు అంత ఇష్టం లేదని ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. దానికి తగినట్లే పవన్కు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఉండదని, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం పాలిట్బ్యూరో నిర్ణయమని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయినా పవన్ సర్దుకుపోయారు. బీజేపీ వారు ఏభై సీట్లు డిమాండ్ చేయమని సూచించినా, పవన్ పట్టుబట్టలేదు. పైగా టీడీపీకి చెందిన వారికే కొందరికి తన పార్టీ టిక్కెట్లు ఇచ్చి చంద్రబాబు ఏం చెబితే అది చేశారని అంటారు.2017 ప్రాంతంలో లోకేశ్పై పవన్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలే చేసినా 2020 నాటికి రాజీపడిపోయి చంద్రబాబుతో చేతులు కలిపారు. 2024లో అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ల కన్నా లోకేశ్ పవర్ఫుల్ అయ్యారన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. తాను కూడా అలాగే ఇతర శాఖలలో జోక్యం చేసుకోవాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ, పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ‘సీజ్ ద షిప్’ అని అధికారులను ఆదేశించి పవన్ నవ్వులపాలయ్యారు. చంద్రబాబు, పవన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు ఇంతవరకు కనిపించలేదు కానీ.. లోకేశ్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అంశంలో పవన్ అభ్యంతరం చెప్పారని రెండు పార్టీలలో గుసగుసలు వినిపించాయి. అందువల్లే లోకేశ్ కోరిక తీరలేదని అంటారు. ఇప్పటికే లోకేశ్ను సీఎంను చేయాలని చంద్రబాబుపై కుటుంబపరంగా ఒత్తిడి ఉందని చెబుతారు. అయినా పవన్ కళ్యాణ్ నుంచి సమస్య వస్తుందని చంద్రబాబు సర్ది చెబుతుండవచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం.ఇక, ఇది నిజమా? కాదా? అన్నది చెప్పలేం కానీ.. పవన్ కళ్యాణ్ ఆయా సభలలో చంద్రబాబు పదిహేనేళ్లు సీఎంగా ఉండాలని, ఆయన సమర్థుడని, అనుభవజ్ఞుడని పనికట్టుకుని పొగుడుతున్న తీరు లోకేశ్ అనుచరులకు మింగుడుపడటం లేదనిపిస్తుంది. కేవలం లోకేశ్ను సీఎం కానివ్వకుండా, లేదా డిప్యూటీ సీఎం ప్రమోషన్ రానివ్వకుండా చూడడానికి పవన్ ప్రకటనలు ఉపయోగపడుతున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ వ్యూహం మార్చి తన ప్రమోషన్కు పవన్ కళ్యాణ్ నుంచి ఆటంకం లేకుండా ఉండడానికి ప్రయత్నాలు ఆరంభించారా అన్న సందేహం కలుగుతుంది. కొన్నాళ్లుగా లోకేశ్ తనకు సంబంధం లేని శాఖలలో కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. ఆ సభలలో ఒకటికి రెండుసార్లు 'పవనన్న, పవనన్న’ అని ప్రస్తావిస్తూండటం.. ‘పవనన్న పట్టుబడితే సాధించి తీరుతారని, కేంద్రం నుంచి కూడా నిధులు తెస్తున్నారని’ పొగడ్తలు కురిపిస్తున్నారు.గతంలో ఇలాంటి ప్రోగ్రాంలను చంద్రబాబు వదలి పెట్టేవారు కారు. ఇప్పుడు తన కుమారుడి ఆధిపత్యానికి ఆయన అడ్డు చెప్పడం లేదు. దాంతో టీడీపీ మంత్రులు లోకేశ్ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రకాశం, అనకాపల్లి జిల్లాలలో లోకేశ్ పర్యటనలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు తర్వాత పెత్తనం ఎటూ లోకేశ్దే కనుక ఇందులో పెద్దగా ఆక్షేపించవలసింది ఉండకపోవచ్చు. పార్టీ పరంగా అయితే ఏమైనా చేసుకోవచ్చు కాని, ప్రభుత్వ పరంగా లోకేశ్ ఇలా పెత్తనం చెలాయించడం కరెక్టేనా అన్న చర్చ వస్తుంది.మరోవైపు, పవన్ కళ్యాణ్ మాత్రం సభలలో చంద్రబాబునే పొగుడుతూ, లోకేశ్ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అయినప్పటికీ లోకేశ్ బుజ్జగించి పవన్ను తన దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చన్నది పలువురి భావన. పదిహేనేళ్లు కలిసి ఉండాలని అనుకుంటున్నప్పుడు మరీ తేడా ఏదైనా వస్తే తప్ప భవిష్యత్తులో లోకేశ్కు కూడా విధేయత ప్రదర్శించక తప్పని స్థితి పవన్కు వస్తుందని అంటున్నారు. చంద్రబాబుకు ఇప్పటికే 74 ఏళ్లు వచ్చినందున భవిష్యత్తులో ఆ పరిణామం జరగవచ్చు. లోకేశ్ మరో మాట కూడా చెబుతున్నారు.టీడీపీ, జనసేనల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కూర్చుని పరిష్కరించుకుంటాము తప్ప వేరు పడబోమని అన్నారు. ఇది కూడా గమనించవలసిన అంశమే. రాజకీయాలలో పైకి ఒకటి చెబుతారు. లోపల జరిగేవి వేరుగా ఉంటుంటాయి. అలాగే పవన్ కళ్యాణ్, లోకేశ్లు ఎవరి వ్యూహాలతో వారు ముందుకు వెళుతూ, కలిసి ఉన్నట్లు కనిపిస్తూనే ఎవరికి వారు పైచేయి తెచ్చుకునేందుకు యత్నించినా ఆశ్చర్యం ఉండదు. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.కొత్త టైమింగ్ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అనే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.IRCTC వెబ్సైట్ & మొబైల్ యాప్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..➤ IRCTC అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వండి➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్ను ఎంటర్ చేయండి➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండికొత్త మార్పులు➤ సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.➤ యాప్ లేదా వెబ్సైట్ రెండింటికీ ఒకేవిధమైన లాగిన్ సిస్టమ్➤ ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.ఇదీ చదవండి: రూ. లక్షకు చేరువలో బంగారం: ఇక గోల్డ్ కొనడం కష్టమే?

రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుసేన్ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్ ప్రకటించారు.2009 అక్టోబర్లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్ చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్ రాణాను అక్టోబర్ 18వ తేదీన ఎఫ్బీఐ అరెస్ట్ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్కు అప్పగించే విషయంపై ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10వ తేదీన భారత్లో దిగగానే తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

'మనసున్న మారాజు'.. చూపులేకపోతేనేం.. సమాజానికి వెలుగు పంచుతున్నాడు..!
మనసు లేని వాళ్లు చూపు ఉన్నప్పటికీ...సమాజాన్ని చూడలేరు. మనసు ఉన్న వాళ్లు చూపు లేకపోయినప్పటికీ సమాజాన్ని చూస్తారు. సమాజానికి తమ వంతుగా తోడ్పడతారు. అలాంటి ఒక యువకుడు పంచగుడి మహేశ్... తన కళ్లే తనకు సహకరించవు. అడుగు దూరం దాటి ఏమీ చూపించవు. రెండో అడుగు నుంచి అంతా చిమ్మచీకటే. అయినా...ఏదో ‘వెలుగు’ను చేరుకోవాలన్న తపన తనను నడిపిస్తోంది. ‘నాకు చూపొక్కటే సమస్య అన్నా..’ అని సింపుల్గా తన అంధత్వాన్ని కొట్టిపారేస్తాడు. ‘సమస్య లేని మనిషి ఉంటడా..!’ అంటూ తన సమస్యను లైట్గా తీసుకోమంటాడు మహేశ్.మనసుతో చూస్తాడు!మహేశ్కు కంటిచూపు లేదు. అందుకే ఆయన మనసుతో చూస్తున్నాడు. నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి మహేశ్ తాను నెలకొల్పిన ‘దివ్యాంగశక్తి ఫౌండేషన్ ద్వారా సమాజసేవ చేస్తున్నాడు. ఇటీవల దివ్యాంగులైన ఇద్దరు పిల్లలు ఉన్న ఓ వితంతువుకు రెండుగదుల ఇంటిని నిర్మించి ఇచ్చాడు.వాలేగాం టు నాందేడ్వాలేగాం గ్రామానికి చెందిన పంచగుడి అనూషబాయి, లక్ష్మణ్ దంపతులకు మహేశ్, శ్రీకాంత్ కుమారులు, భాగ్యశ్రీ కుమార్తె. పెద్దకొడుకైన మహేశ్కు అడుగు దూరం వరకు అది కూడా ఒక కన్ను ఐదు శాతమే కనిపిస్తుంది. రెండో కుమారుడు శ్రీకాంత్కు ఐదేళ్ల వయసులో వచ్చిన అనారోగ్య సమస్యతో రెండు కళ్లూ దెబ్బతినడంతో పూర్తిగా అంధుడయ్యాడు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అనూష–లక్ష్మణ్ దంపతులు తమ కొడుకులను బాగా చదివించాలనుకున్నారు. మహేశ్ మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకాలోని బొదిడి అంధుల పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. ఇంటర్, బీకామ్ డిగ్రీ నాందేడ్ జిల్లాలోనే పూర్తిచేశాడు. నాందేడ్లో ఉన్నప్పుడే దివ్యాంగుల కోసం ఏర్పాటైన ‘సక్షమ్’ సంస్థలో చురుకుగా పనిచేశాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు.దివ్యాంగిశక్తి ఎంటర్ప్రైజెస్నాందేడ్ నుంచి వచ్చిన మహేశ్ నిర్మల్ జిల్లాలో ‘సక్షమ్’ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాడు. మిత్రుల సూచన మేరకు బెంగళూరులో ఒకేషనల్ ట్రైనింగ్కు వెళ్లాడు. 2016లో తన ఇంట్లోనే ఫ్లోర్ క్లీనర్ తయారు చేశాడు. తెలిసినవాళ్లకు విక్రయించాడు. మంచి స్పందన రావడంతో 2017లో ‘దివ్యాంగశక్తి ఎంటర్ప్రైజెస్’ పేరిట భైంసా మండలం మాటేగాం గ్రామంలో చిన్న యూనిట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇందుకు పీఎంఈజీపీ నుంచి రూ.15 లక్షల ఆర్థికసాయం అందడం తోడైంది. ఈ యూనిట్లో ‘దివ్యాంగశక్తి’ పేరిట ఫ్లోర్క్లీనర్ నుంచి గ్లాస్ క్లీనర్స్ వరకు ఎన్నో తయారు చేస్తున్నాడు. వీటితో పాటు బయోడిగ్రేడబుల్ కవర్స్ విక్రయిస్తున్నాడు. నిర్మల్ జిల్లాతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో తన ప్రొడక్ట్స్ను మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ యూనిట్ ద్వారా తాను ఉపాధి పొందడంతోపాటు మరో ఆరుగురికి ఉపాధి అందిస్తున్నాడు. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్, ఫొటోలు: బాతూరి కైలాష్దివ్యాంగ శక్తి... తన వ్యాపారసంస్థ ‘దివ్యాంగశక్తి’ పేరిటనే 2021లో ఫౌండేషన్ ప్రారంభించాడు మహేష్. సమాజానికి తన వంతుగా కొంత ఇవ్వాలి అనేది అతడి విధానం. తన ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, అనాథలు, వృద్ధులకు సేవలు అందిస్తున్నాడు. మూడేళ్లుగా పది, ఇంటర్ పాసైన దివ్యాంగులకు సహకారం అందిస్తున్నాడు. వారి కోసం పరీక్షలు రాసిచ్చే వారిని సన్మానిస్తున్నాడు. సర్కారు బడి పిల్లలకు ఉచితంగా బ్యాగులు అందిస్తున్నాడు. ఇటీవల చుచుంద్ గ్రామంలో రూ.30వేలు ఖర్చుచేసి వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేశాడు.(చదవండి: సమ్మర్లో సులభంగా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లండిలా..!)
పవన్ సినిమా.. చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా?
‘ఏపీలో పూలే ఆశయాలతో కాదు.. రెడ్బుక్తో పాలన’
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
మరో ఐటం సాంగ్లో మెరిసిన తమన్నా..
అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!
‘చేబ్రోలు కిరణ్ కుమార్ను పెంచి పోషించింది ఐటీడీపీనే’
'మనసున్న మారాజు'.. చూపులేకపోతేనేం.. సమాజానికి వెలుగు పంచుతున్నాడు..!
జ్యోతిరావు పూలే జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
2035 కల్లా భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
హైదరాబాద్లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
మేం ఉద్యోగం చేయలేం
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
భద్రతలో డొల్లతనం బట్టబయలు
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
జగన్ అద్భుత నాయకుడు
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
తెలంగాణ పంటల విధానం మారాలి!
AP: రియల్.. ఢమాల్
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోని..
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
నేడు, రేపు వానలు
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
న్యూయార్క్లో హెలికాప్టర్ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్పై మరోసారి టారిఫ్ విధింపు
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
టార్గెట్ చైనా ఎందుకంటే..!
టారిఫ్ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్చరణ్.. వీడియో వైరల్
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
అమెరికా వీసా, గ్రీన్కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్లోకి..
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తున్న పూరీ
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్ జగన్ ట్వీట్
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్లో టీసీఎస్..
RCB Vs DC: రాహుల్ గెలిపించాడు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
పవన్ సినిమా.. చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా?
‘ఏపీలో పూలే ఆశయాలతో కాదు.. రెడ్బుక్తో పాలన’
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
మరో ఐటం సాంగ్లో మెరిసిన తమన్నా..
అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!
‘చేబ్రోలు కిరణ్ కుమార్ను పెంచి పోషించింది ఐటీడీపీనే’
'మనసున్న మారాజు'.. చూపులేకపోతేనేం.. సమాజానికి వెలుగు పంచుతున్నాడు..!
జ్యోతిరావు పూలే జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. మా ఓటమికి ప్రధాన కారణం అదే: పాటిదార్
పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?
2035 కల్లా భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.. అదనపు రాబడి
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ఇన్స్టా లవర్తో వివాహిత పెళ్లి
అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్ మాస్టర్
మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
నేడు ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్
ఆర్సీబీ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్!
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!
RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!
ఇంత కాలం పని చేయకున్నా వైదొలగమనలేదు.. ఇప్పుడే ఎందుకంటున్నారని అడుగుతున్నారు సార్!
వివాహమైనా కుమార్తె అర్హురాలే..
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
తనకెంతో గుండె ధైర్యం ఉందట! ఆపరేషన్ చేయించుకునే వారికే గుండె ధైర్యం లేక పోతున్నారట సార్!
హైదరాబాద్లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
మేం ఉద్యోగం చేయలేం
బోణీ కొట్టిన బంగ్లాదేశ్.. కెప్టెన్ విధ్వంసకర శతకం
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా.. గుర్తు పట్టగలరా?
హైకోర్టన్నా లెక్కలేదా? ఇది ధిక్కారమే
ఎవరైనా అతడికి కాస్త మర్యాద నేర్పండి: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్
korameenu కొరమీను.. కేరాఫ్ కరీంనగర్
చైనాకు చేయందించిన బంగ్లా.. షిప్మెంట్ రద్దుతో భారత్ ప్రతీకారం?
IPL 2025: ముదురుతున్న 'ఈడెన్' పిచ్ వివాదం
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్కు 10 కోట్లా, వీడియో వైరల్
విడాకులు.. అయినా తనను వదలను: ప్రభుదేవా మాజీ భార్య
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
భద్రతలో డొల్లతనం బట్టబయలు
ప్లాట్ఫామ్స్ మూత.. రైళ్లు మళ్లింపు
తిరుమలలో మహా పాపం.. పవనానంద స్వామి ఎక్కడ?: భూమన
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
కూటమిపై తిరుగుబాటు మొదలైంది!
జగన్ అద్భుత నాయకుడు
ఓటీటీలో 'ఛావా' సినిమా.. సడెన్ సర్ప్రైజ్
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
తెలంగాణ పంటల విధానం మారాలి!
AP: రియల్.. ఢమాల్
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ఎంఎస్ ధోని..
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
నేడు, రేపు వానలు
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
న్యూయార్క్లో హెలికాప్టర్ ప్రమాదం.. ప్రముఖ కంపెనీ సీఈవో ఫ్యామిలీ మృతి
#Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి..
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
WTC Final: సౌతాఫ్రికాకు ఊహించని షాక్!
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
మనవడి కోసం ఏడుపదుల వయసులో వ్యాపారం..! తట్టుకోలేనన్ని కష్టాలు చివరికి..
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్పై మరోసారి టారిఫ్ విధింపు
క్రెడిట్ కార్డ్ బిల్లుల భారం.. ఉందిగా ఉపాయం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వ్యాపారాలు విస్తరిస్తారు
'జాట్' ట్విటర్ రివ్యూ.. గోపీచంద్ మలినేని హిట్ కొట్టాడా..?
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
విదేశీ విద్యార్థులను బయటకు పంపేయాలనే కక్షతో మనమే చాలా ఉల్లంఘనలు చేస్తున్నాం సార్
'ఆ పిల్ల నీకు వదిన అవుద్దిరా'.. ఆసక్తిగా సంపూర్ణేశ్ బాబు సోదరా ట్రైలర్
టార్గెట్ చైనా ఎందుకంటే..!
టారిఫ్ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
విశాఖలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
తండ్రి వైద్యం కోసం ఇళ్ల పనికి వెళ్తున్న కుమార్తె..
మావోల సంచలన లేఖ.. ములుగు ఎస్పీ రియాక్షన్
కమెడియన్ సత్య కాళ్లు మొక్కిన రామ్చరణ్.. వీడియో వైరల్
పెళ్లింట విషాదం.. పెళ్లైన 22 రోజులకే నవ వధువు..
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
వారెవ్వా.. పోలీసు అఫీసర్... తమన్నాను మించి క్రేజ్
ఎండల్లో... కొబ్బరి నీళ్లతో గేమ్స్ వద్దు!
అమెరికా వీసా, గ్రీన్కార్డులపై మరో మెలిక.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్!
పాక్ జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే! అక్కడెమో ఏకంగా వైస్ కెప్టెన్
సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!
భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
ద్రౌపది చేసిన వంటకమే పానీపూరి.. నేడు లక్షలకోట్ల బిజినెస్..
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్లోకి..
అమ్మా.. కాసేపు పడుకుంటా! అని శాశ్వత నిద్రలోకి..
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తున్న పూరీ
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్ జగన్ ట్వీట్
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్లో టీసీఎస్..
RCB Vs DC: రాహుల్ గెలిపించాడు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం
కొబ్బరి కాయ చెప్పింది..పైపు లైన్ పగిలింది..
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
సినిమా

మరో ఐటం సాంగ్లో మెరిసిన తమన్నా..
మిల్కీ బ్యూటీకి డ్యాన్స్ చేయడమంటే మహా ఇష్టం. అందుకే ఐటం సాంగ్స్ ఆఫర్ వచ్చినప్పుడు డ్యాన్స్కు స్కోప్ ఉంటోందని వెంటనే ఓకే చెప్పేస్తోంది. అలా జైలర్లో నువ్వు కావాలయ్యా.., స్త్రీ 2లో ఆజ్ కా రాత్.. పాటతో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. తాజాగా రైడ్ 2లోని నషా పాటకు చిందేసింది. రైడ్ 2లో తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఐటం సాంగ్ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని ఫోటోలు లీకయ్యాయి.మరో ఐటం సాంగ్..దీంతో చిత్రయూనిట్ ఎలాంటి సస్పెన్స్లు లేకుండా నషా పాటను విడుదల చేసింది. ఎప్పటిలాగే తమన్నా తన ఎక్స్ప్రెషన్స్తో, స్టెప్పులతో అదరగొట్టేసింది. ఆజ్ కీ రాత్ సాంగ్కు కొరియోగ్రఫీ చేసిన విజయ్ గంగూలీయే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. రైడ్ 2 విషయానికి వస్తే.. 2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రైడ్కు సీక్వెల్గా తెరకెక్కుతోంది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవ్గణ్ కథానాయకుడిగా, వాణీ కపూర్ హీరోయిన్గా నటించారు. రితేశ్ దేశ్ముఖ్ విలన్గా యాక్ట్ చేశారు. మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. చదవండి: ఆస్కార్లో కొత్త విభాగం.. ఆర్ఆర్ఆర్ విజువల్తో అనౌన్స్మెంట్

విశ్వంభర.. రామరామ సాంగ్ ప్రోమో చూశారా?
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రామ రామ పాట ప్రోమో విడుదలైంది. చిరంజీవి నోటి నుంచి వచ్చిన జై శ్రీరామ్ నినాదంతో పాట మొదలవుతుంది. ఇందులో బాల హనుమాన్లు ముందు నడుచుకుంటూ వస్తుంటే అందులో ఒకరిని చిరు తన భుజాలపై ఎత్తుకుని నడుస్తున్నాడు. ప్రోమో అయితే అదిరిపోయింది. పూర్తి పాటను హనుమాన్ జయంతి (ఏప్రిల్ 12) రోజు ఉదయం 11.12 గంటలకు విడుదల చేయనున్నారు.అప్పుడే ఫుల్ సాంగ్ రిలీజ్..కీరవాణి సంగీతం అందించిన ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. శంకర్ మహదేవన్, లిప్సిక ఆలపించారు. ఫుల్ సాంగ్ వినాలంటే రేపటివరకు ఆగాల్సిందే! విశ్వంభర విషయానికి వస్తే.. ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. వాసుదేవ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ మూవీని జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చదవండి:

ఆస్కార్లో కొత్త విభాగం.. ఆర్ఆర్ఆర్ విజువల్తో అనౌన్స్మెంట్
సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల వేదిక (Academy Awards) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్కార్ (Oscar)లో కొత్తగా స్టంట్ డిజైన్ విభాగాన్ని చేర్చుతున్నట్లు ప్రకటించింది. 2028 నుంచి ఈ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. 2027లో విడుదలయ్యే సినిమాలు ఈ విభాగంలో పోటీపడవచ్చని తెలిపింది. ఈ మేరకు అకాడమీ గురువారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.100వ వేడుకలో..సినిమాలో స్టంట్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడవి ఆస్కార్లోనూ భాగమయ్యాయి. స్టంట్ డిజైన్ విభాగంలో ఆస్కార్ పురస్కారాలు ఇవ్వనున్నాం. 2028లో జరగబోయే 100వ ఆస్కార్ వేడుకలో వీటిని ప్రదానం చేయనున్నాం అని ప్రకటించింది. ఈ మేరకు స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ ఓ పోస్టర్ వదిలింది. ఈ పోస్టర్లో ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie)లోని సీన్ ఫోటోను ఉపయోగించారు.పోస్టర్లో ఆర్ఆర్ఆర్ విజువల్స్ఇది చూసిన రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. వందేళ్ల నిరీక్షణకు ముగింపు.. 2027లో రిలీజయ్యే చిత్రాలకు స్టంట్ డిజైన్ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. ఈ నిర్ణయానికి కారకులైన డేవిడ్ లెయిచ్, క్రిస్ ఓ హర, అకాడమీ సీఈవో బిల్ క్రామర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్, అలాగే స్టంట్ నిపుణులకు ప్రత్యేక కృతజ్ఞతలు. స్టంట్ డిజైన్ ఆస్కార్ అంటూ మీరు రిలీజ్ చేసిన పోస్టర్లో ఆర్ఆర్ఆర్ విజువల్ చూసి థ్రిల్లయ్యాను అని ట్వీట్ చేశాడు. At last!!After a 100 year wait !!! Ecstatic for the new Oscars stunt design category for the films releasing in 2027! Huge thanks to David Leitch, Chris O’Hara, and the stunt community for making this historic recognition possible, and to @TheAcademy, CEO Bill Kramer, and… https://t.co/QWrUjuYU2I— rajamouli ss (@ssrajamouli) April 11, 2025 చదవండి: సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!

సంపూను రోడ్డు మీదకు వదిలేశాడా? సాయి రాజేశ్ ఆన్సరిదే!
సంపూర్ణేశ్బాబును హీరో చేసిన డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh). హృదయ కాలేయం చిత్రంతో సంపూ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ మూవీ విజయం సాధించడంతో అతడు వరుస సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇతడు సోదరా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.ఏ హీరో ఒప్పుకోలేదుగురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు సాయి రాజేశ్ అతిథిగా విచ్చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను, సంపూర్ణేశ్ (Sampoornesh Babu) ఒక షార్ట్ ఫిలిం చూడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్కు వచ్చాం. ఆ సమయంలో నేను బాధలో ఉన్నాను. 'యార్క్ యార్' అనే తమిళ సినిమా చూసి ఓ పిచ్చి మూవీ తీయాలనుకున్నాను. దానిచుట్టూ కామెడీ క్రియేట్ చేయాలనుకున్నాను. ఈ కాన్సెప్ట్ను అప్పుడే ఎదుగుతున్న పలువురు హీరోలకు చెప్పాను. ఎవరూ ఒప్పుకోలేదు. నా బతుకు అయిపోయిందనుకున్నాను. హీరో దొరికేశాడుఈ ప్రసాద్ ల్యాబ్లో షార్ట్ ఫిలిం చూసి బయట చెట్టు కింద నిల్చున్నప్పుడు సంపూ రంగురంగుల చొక్కాతో కనిపించాడు. అతడిని చూసి నాకు హీరో దొరికేశాడు అనుకున్నాను. ఇది జరిగి 13 ఏళ్లవుతోంది. ఇదంతా కలలా ఉంది. అప్పుడు నాకు రూ.60 వేలదాకా అప్పు ఉంది. కథ డిస్కషన్ కోసం సంపూ సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వచ్చేవాడు. ఏదో ఒక పార్క్లో కూర్చుని కథ గురించి మాట్లాడుకుని సాయంత్రానికి బస్స్టాప్లో దింపేసేవాడిని. ఇంటికి తిరిగెళ్లడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? అని అడిగితే లేవన్నాడు.గిల్టీగా ఫీలయ్యాదాంతో నా దగ్గరున్న రూ.500లలో రెండు వందలు అతడికి ఇచ్చేవాడిని. ఒకసారి ఏమైందంటే నేనేదో పనిలో పడిపోయి అతడి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. అప్పుడు సంపూ కృష్ణానగర్లో మడత మంచం అద్దెకు తీసుకుని రోజంతా అక్కడే ఉన్నాడు. నాకు మళ్లీ ఫోన్ చేసి.. అన్నా, నేను వచ్చేశాను అని చెప్పాడు. నాకు చాలా గిల్టీగా అనిపించింది. సినిమా పిచ్చితో నేను చెడిపోయిందే కాక మరొకరిని చెడగొడుతున్నానా? డబ్బులు లేకుండా సినిమా తీయగలనా? ఇలా రకరకాలుగా అనుకున్నాను.లక్షల్లో రెమ్యునరేషన్చివరకు ఎలాగోలా సినిమా తీశాం. తను హీరో అయ్యాడు, నేను డైరెక్టర్ అయ్యాను. హృదయకాలేయం (Hrudaya Kaleyam Movie) సూపర్ హిట్ అయ్యాక సంపూర్ణేశ్కు లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చేవారు. నేను సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ఫామ్లో ఉండేవాడిని. సంపూ సిద్దిపేటలో నాలుగంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను ఈఎమ్ఐలో నానో కారు కొనుక్కుంటే మనోడు ఫోర్డ్ కొన్నాడు. కొబ్బరిమట్ట సినిమా సమయంలో నేను ఆర్థికంగా చితికిపోయానని సంపూ గ్రహించాడు. రూ.6 లక్షలు పెట్టి హోండా కారు కొనిచ్చాడు. ఇల్లు కొనుగోలు..మణికొండలో ఒక అపార్ట్మెంట్ కోసం రూ.12 లక్షలు కట్టి.. మిగతా రూ.13 లక్షలు నువ్వు ఎలాగైనా కట్టుకో అన్నాడు. ఆ ఇంటి విలువ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగిపోయింది. తను సంపాదించిన డబ్బు.. నాకోసం, తన చుట్టూ ఉండేవాళ్లకోసం, సమాజం కోసం ఖర్చుపెడతాడు. ఓ వ్యక్తి నేను సంపూను రోడ్డు మీద వదిలేశాను అని కామెంట్ చేశాడు. రోడ్డు మీద వదిలేయడం ఏంట్రా? ఏ రోజుకైనా సంపూ కోసం నేనుంటా.. నాకోసం సంపూ ఉంటాడంతే! అని సాయి రాజేశ్ ఎమోషనలయ్యాడు.చదవండి: సూర్య కొత్త సినిమాలో హీరోయిన్ 'అనఘా రవి'కి ఛాన్స్
న్యూస్ పాడ్కాస్ట్

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం
క్రీడలు

ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై రాత మారిపోదు!
మహేంద్ర సింగ్ ధోని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గ్వైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మ్యాచ్లకు దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. గువాహాటిలో గత నెల 30న రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా రుతురాజ్ మోచేతికి గాయమైంది. అయితే దానికి చికిత్స కొనసాగిస్తూ అతడు మరో రెండు మ్యాచ్లు ఆడాడు. కానీ.. నొప్పి తీవ్రం కావడంతో పరీక్షలు చేయగా మోచేతికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది.కేకేఆర్తో మ్యాచ్లోఫలితంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ ధోని (MS Dhoni) కెప్టెన్గా పగ్గాలు చేపట్టనున్నాడు. సొంత మైదానం చెపాక్లో జరిగే శుక్రవారం కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా ధోని విధుల్లో చేరనున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ఒకప్పటి సీఎస్కే స్టార్ రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని కెప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు.మీరెలా ముందుకు వెళ్లగలరు?‘‘జట్టులో ఎన్నో లోపాలు ఉన్నాయి. ముందుగా వాటిని సరిచేయాలి. అంతేగానీ ధోనిని తిరిగి కెప్టెన్గా చేసినందు వల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవు. రుతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో మీరు భర్తీ చేస్తారు? ఈ లోటును ఎలా పూడ్చుకుంటారు?.. ఫామ్లో ఉన్న బ్యాటర్ను ఎక్కడి నుంచి తెస్తారు?డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు 69 పరుగులు చేశాడు. ఇక రచిన్ ఆరంభం నుంచే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయంలో రుతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా మీరెలా ముందుకు వెళ్లగలరు?’’ అని రాబిన్ ఊతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో సీఎస్కే యాజమాన్యాన్ని ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా గతేడాది సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న ధోని.. తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ను ప్రకటించాడు. అయితే, అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతోంది. ఐపీఎల్-2024లో రుతు సేన పద్నాలుగు మ్యాచ్లకు ఏడు గెలిచింది. అయితే, ఆర్సీబీతో కీలక మ్యాచ్లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి బాటపట్టింది.తొమ్మిదో స్థానంలోఇక ఐపీఎల్-2025లోనూ ఆరంభ మ్యాచ్లో ముంబై గెలిచిన చెన్నై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఐదు మ్యాచ్లలో ఒక్కటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. సీఎస్కే టీమ్కు కర్త, కర్మ, క్రియగా ఉన్న ధోని 2008–2023 మధ్య 235 మ్యాచ్లలో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ‘తలా’ నాయకత్వంలో 5 సార్లు జట్టు ఐపీఎల్ చాంపియన్గా నిలిచింది. 2022లో ధోని స్థానంలో రవీంద్ర జడేజాను చెన్నై యాజమాన్యం కెప్టెన్గా ఎంపిక చేసింది. అయితే టోర్నీ మధ్యలో అతడు 8 మ్యాచ్ల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనియే బాధ్యతలు తీసుకున్నాడు. 2024 సీజన్ నుంచి జట్టు సారథ్య బాధ్యతలు రుతురాజ్కు అప్పగించారు. అతడి కెప్టెన్సీలో టీమ్ 19 మ్యాచ్లు ఆడింది. వీటిలో 8 గెలిచి, 11 ఓడింది. చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!?

RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్పై కోహ్లి ఫైర్?!.. అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!
ఐపీఎల్-2025 (IPL 2025)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు మరో పరాజయం ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో పాటిదార్ సేన ఆరు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. సమిష్టి వైఫల్యంతో సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో చేదు అనుభవం ఎదుర్కొంది.వారంతా విఫలంటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి శుభారంభమే లభించింది. పవర్ ప్లేలో మెరుగైన స్కోరు సాధించినా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం దెబ్బకొట్టింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37), విరాట్ కోహ్లి (14 బంతుల్లో 22), కెప్టెన్ రజత్ పాటిదార్ (25) ఫర్వాలేదనిపించగా.. దేవదత్ పడిక్కల్ (1), లియామ్ లివింగ్స్టోన్ (4), జితేశ్ శర్మ (3) పూర్తిగా విఫలమయ్యారు.ఆఖర్లో టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్) కాస్త వేగంగా ఆడటంతో.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ లక్ష్య ఛేదనను 17.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది.చెత్త బౌలింగ్సొంతమైదానంలో కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ (53 బంతుల్లో 93 నాటౌట్)తో ఢిల్లీకి విజయం అందించాడు. మిగతా వాళ్లలో ట్రిస్టన్ స్టబ్స్ (23 బంతుల్లో 38 నాటౌట్) రాణించాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/26), సూయశ్ శర్మ (1/25) ఫర్వాలేదనిపించగా.. జోష్ హాజిల్వుడ్, యశ్ దయాళ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హాజిల్వుడ్ మూడు ఓవర్లలో 40 పరుగులు ఇవ్వగా.. దయాళ్ 3.5 ఓవర్ల బౌలింగ్లో 45 రన్స్ ఇచ్చేశాడు.ఇదేం కెప్టెన్సీ?.. విరాట్ కోహ్లి ఆగ్రహంఈ నేపథ్యంలో ఢిల్లీ టాపార్డర్ ఫాఫ్ డుప్లెసిస్ (2), జేక్ ఫ్రేజర్ మెగర్క్(7), అభిషేక్ పోరెల్ (7)లను త్వరత్వరగా పెవిలియన్కు పంపినా.. ఆర్సీబీకి ప్రయోజనం లేకుండా పోయింది. మధ్య, ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్ల వైఫల్యం వల్ల మ్యాచ్ చేజారింది. ఈ క్రమంలో ఆర్సీబీ సూపర్స్టార్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఢిల్లీ ఇన్నింగ్స్లో 15వ ఓవర్లో జోష్ హాజిల్వుడ్ ఏకంగా 22 (4,4,2,2,4,6) పరుగులు ఇచ్చిన వేళ.. బౌండరీ లైన్ వద్ద కోహ్లి.. తమ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వద్ద అసంతృప్తి వెళ్లగక్కాడు. తమ ఆటగాళ్ల వైపు చేయి చూపిస్తూ.. బౌలర్లు, ఫీల్డింగ్ సెట్ చేసిన విధానం సరిగా లేదన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు.అతడు కెప్టెన్తో మాట్లాడాల్సింది!ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ నిర్ణయంపై అసంతృప్తితోనే కోహ్లి ఇలా చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఘటన సమయంలో హిందీ కామెంట్రీ చేస్తున్న భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. ‘‘దినేశ్ కార్తిక్తో అతడు తీవ్రంగా చర్చిస్తున్నాడు.నిజానికి కెప్టెన్ రజత్ పాటిదార్తో మాట్లాడాల్సింది. రజత్ ఈ జట్టుకు కెప్టెన్. కాబట్టి విరాట్ కోహ్లి దినేశ్ కార్తిక్తో మాట్లాడేకంటే కూడా.. రజత్తో మాట్లాడితేనే బాగుండేది’’ అని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. వీరేందర్ సెహ్వాగ్.. ‘‘జోష్ హాజిల్వుడ్ 22 పరుగులు ఇచ్చినందుకే విరాట్ కోహ్లి కోచ్తో ఇలా చర్చించి ఉంటాడు’’ అని పేర్కొన్నాడు. Unbeaten. Unstoppable. Unmatched 🫡History for #DC as they win the first 4⃣ games on the trot for the maiden time ever in #TATAIPL history 💙Scorecard ▶ https://t.co/h5Vb7spAOE#TATAIPL | #RCBvDC | @DelhiCapitals pic.twitter.com/wj9VIrgzVK— IndianPremierLeague (@IPL) April 10, 2025చదవండి: IPL 2025: పృథ్వీ షాకు బంపరాఫర్.. ధోని టీమ్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ!? Discussions with an experienced man amidst a crisis!Virat x DK COME ON RCB ❤️ ❤️ ❤️ #RCBvsGT #IPL2025 pic.twitter.com/oUgnB3fqOk— Dinesh Karthik Fan Club (@DKFANFOREVER) April 10, 2025🚨 VIRAT KOHLI UNLEASHES THE BEAST MODE! 🦁🏏 RCB vs DC just got SPICY! 🌶️💥 Kohli to Patidar: "CAPTAIN WHO?! अभी दिखाता हूं तेरेको, coach ko Jake chugali karta hu😂!"🕺 Dinesh Karthik: "मैं तो बस अपनी रोटी का जुगाड़ कर रहा हूं’—don’t drag me into this fire!"⚡ Is Rajat… pic.twitter.com/OgdGc8I07i— CRICKET 18 LOVER (@Cricket_18_love) April 11, 2025

సింధు ఇంటికి...
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ వ్యక్తిగత చాంపియన్షిప్ సింగిల్స్ విభాగం నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్వన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి చవిచూశారు. గతంలో రెండుసార్లు ఈ టోర్నీలో కాంస్య పతకాలు సాధించిన సింధు ఈసారి మాత్రం నిరాశపరిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 12–21, 21–16, 16–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, తన చిరకాల ప్రత్యర్థి అకానె యామగుచి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్ కోల్పోయినా, వెంటనే తేరుకొని రెండో గేమ్లో నెగ్గి మ్యాచ్లో నిలిచింది. గతంలో 14 సార్లు అకానె యామగుచిపై నెగ్గిన సింధుకు నిర్ణాయక మూడో గేమ్లో గట్టిపోటీ లభించింది. కీలకదశలో యామగుచి పైచేయి సాధించి సింధుపై 12వ సారి విజయాన్ని అందుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రియాన్షు 14–21, 17–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో, కిరణ్ జార్జి 21–19, 13–21, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యారు. క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ పతకానికి విజయం దూరంలో నిలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ కపిల జంట 12–21, 21–16, 21–18తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెస్ చాన్ (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. ఐదో సీడ్ చున్ మాన్ టాంగ్–యింగ్ సుయెట్ సె (హాంకాంగ్) జోడీతో నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ గెలిస్తే సెమీఫైనల్కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంటారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో అశిత్ సూర్య–అమృత (భారత్) జంట 11–21, 14–21తో టాప్ సీడ్ జియాంగ్ జెన్ బాంగ్–వె యా జిన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రూబన్ కుమార్–హరిహరన్ (భారత్) జంట 15–21, 14–21తో ఆరోన్ చియా–వుయ్ యిక్ సో (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

రష్మిక ‘హ్యాట్రిక్’
పుణే: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టోర్నీలో అదరగొడుతోంది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా గురువారం హాంకాంగ్తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 2–1తో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్కిది రెండో విజయం. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత్ సింగిల్స్లో ఒక మార్పు చేసింది. న్యూజిలాండ్, థాయ్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ల్లో బరిలోకి దిగిన హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి స్థానంలో గుజరాత్కు చెందిన వైదేహి చౌధరీకి అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్లో పోటీపడ్డ వైదేహి 2 గంటల 3 నిమిషాల్లో 7–6 (10/8), 6–1తో హో చింగ్ వుపై గెలిచి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన శ్రీవల్లి రష్మిక 7–6 (8/6), 2–6, 6–3తో హాంగ్ యి కొడీ వోంగ్ను ఓడించి భారత్కు 2–0తో విజయాన్ని ఖరారు చేసింది. 2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక ఎనిమిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వ్లో 43 పాయింట్లు సాధించిన రష్మిక రెండో సర్వ్లో 14 పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్ను నాలుగుసార్లు కోల్పోయిన రష్మిక, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో, థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా రష్మిక సింగిల్స్లో విజయం అందుకుంది. ఫలితం తేలిపోవడంతో నామమాత్రమైన మూడో మ్యాచ్లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ పోరాడినా చివరకు విజయానికి దూరమైంది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన డబుల్స్ మ్యాచ్లో అంకిత–ప్రార్థన ద్వయం 7–6 (7/2), 3–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో యుడైస్ చోంగ్–హాంగ్ యి కొడీ వోంగ్ జంట చేతిలో ఓడిపోయింది.
బిజినెస్

మైక్రోసాఫ్ట్లో మరోమారు లేఆఫ్స్!.. ఎఫెక్ట్ వారిపైనే..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. మే నెలలో ఈ లేఆప్స్ ఉండే అవకాశం ఉంది. ఎయితే ఈ ఎఫెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపుతుందని విషయం అధికారికంగా వెల్లడికాలేదు.అమెజాన్, గూగుల్ కంపెనీల మాదిరిగానే.. మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆప్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.మైక్రోసాఫ్ట్ గతంలో కూడా.. తక్కువ పనితీరు కనపరచిన 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగుల మీదనే పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.ఏఐలో శిక్షణభవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ సీఈఓ సత్యనాదెళ్ళ గతంలోనే వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: వ్యభిచార గృహాలతో సంబంధాలు:.. అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్

టారిఫ్ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రక్షణాత్మక పెట్టుబడి సాధనం బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది. కామెక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 100 డాలర్లు (3.5%) పైగా పెరిగి 3,180 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లలో దూకుడు కారణంగా దేశీయంగా నేడు స్పాట్ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టే వీలుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ ధర గురువారం రాత్రి రూ. 2,356 ఎగసి రూ.92,160 వద్ద కదలాడుతోంది.

మిల్లెట్స్ ఉత్పత్తుల్లోకి తెనాలి డబుల్ హార్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశించింది. మిల్లెట్ మార్వెల్స్ పేరిట రూపొందించిన ఉత్పత్తులను అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జేఎండీ సంగీత రెడ్డి చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ. 95–120 వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల తర్వాత దేశవ్యాప్తంగా, అమెరికా తదితర దేశాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే మూడేళ్లలో గ్రూప్ ఆదాయంలో 5% ఈ విభాగం నుంచి సమకూర్చుకోనున్నట్లు చెప్పారు. 2024–25లో కంపెనీ ఆదాయం రూ. 535 కోట్లుగా ఉండగా ఈసారి 15% వరకు వృద్ధి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు ప్రసాద్ వివరించారు. రాబోయే రెండేళ్లలో వ్యాపార విస్తరణపై రూ.10–25 కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు.

రుణ రేట్లను తగ్గించిన బీవోబీ
న్యూఢిల్లీ: ఆర్బీఐ రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించగా, దీన్ని తన కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ అనుసంధానిత రిటైల్, ఎంఎస్ఎంఈ రుణ రేట్లను 0.25 శాతం తగ్గించినట్టు తెలిపింది. అదే సమయంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను బీవోబీ ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం. ఆటో, వ్యక్తిగత రుణాలు సహా అధిక శాతం రుణాలకు ప్రామాణికమైన ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటును మార్చకుండా 9 శాతం వద్దే కొనసాగించింది.
ఫ్యామిలీ

ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట రామాలయం..
ఆంధ్రా అయోధ్యగా... అపర భద్రాద్రిగా గుర్తింపు పొందిన వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని గర్భగుడిలో మనకు ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపిస్తాయి తప్ప హనుమంతుడి విగ్రహం ఉండదు. ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే కథ ప్రచారంలో ఉంది. అయితే ఆలయానికి అభిముఖంగా సంజీవరాయస్వామి పేరుతో ఒంటిమిట్ట క్షేత్రపాలకుడుగా ఆంజనేయస్వామి ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలో స్వామివారు సీతారామలక్ష్మణులకు ఎదురుగా నిలబడి అంజలి ఘటిస్తున్నట్లుగా ఎత్తైన విగ్రహంతో నిలచి, భక్తులను కాపాడుతూ ఉంటారు. స్థలపురాణం...ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఈ అరణ్యంలోనూ కొంతకాలం గడిపాడట. ఆ సమయంలో మృకండు, శృంగి అనే మహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉండేదట. వాళ్లు చేసే యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట. అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ... అయితే ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను అందులో ప్రతిష్ఠించాడనీ అంటారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతంలో ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట. బోయవాళ్లైన వీళ్లు ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షించేవారు. ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని అడగగా, ఇక్కడ రామాలయం కట్టించమని కోరారట. రాజు ఈ ప్రదేశాన్ని పరిశీలించి గుడి కట్టేందుకు అవసరమైన నిధుల్ని అందించి ఆ బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లి΄ోయాడు. వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట. వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందని అంటారు. ఆ తరువాత ఉదయగిరి రాజు సోదరుడైన బుక్కరాయలు తన దగ్గరున్న నాలుగు సీతారామలక్ష్మణ ఏకశిల విగ్రహాల్లో ఒకదాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటు చేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు. ఎందరో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినా... ఆంధ్రావాల్మీకిగా గుర్తింపు పొందిన వావిలికొలను సుబ్బారావు అనే రామభక్తుడు ఈ రామాలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామికి విలువైన ఆభరణాలను సమకూర్చేందుకు ఆ భక్తుడు టెంకాయ చిప్పను పట్టుకుని భిక్షాటన చేసి సుమారు పది లక్షల రూపాయలు సేకరించాడట.విశేష పూజలు...మూడు గోపుర ద్వారాలున్న ఈ ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుంటుంది. శేషాచల పర్వత పంక్తిలో ఆదిశేషుని తలభాగంగా తిరుమల క్షేత్రం మధ్యభాగంగా దేవుని గడప (కడప), ఒంటిమిట్ట, అహోబిలం తోకభాగంగా శ్రీశైల క్షేత్రాలను అభివర్ణిస్తారు. దేవుని కడప క్షేత్రాన్ని సందర్శించి తిరుమలకు వెళ్లే భక్తులు ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించి వెళ్లడం అనాదిగా జరుగుతోంది. ఎత్తైన గోపురాలు, విశాలమైన ఆలయ ప్రాంగణం, సుందరమైన మండపాలు, విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలిపే రమణీయ శిల్పసంపద ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంది.ఈ ఆలయాన్ని అద్భుత ధామంగా తీర్చిదిద్డడంలో చోళరాజులు, విజయనగర పాలకులు ఇతోధికమైన కృషి చేశారు. దేవాలయ ముఖమండపంలో రామాయణ, భారత, భాగవతాలలోని వివిధ ఘట్టాలను కనులకు కట్టే శిల్పాలున్నాయి. సీతాదేవికి అంగుళీయకాన్ని చూపిస్తున్న హనుమంతుడు, లంకకు వారధిని నిర్మించే వానరులు, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తే దృశ్యం, వటపత్రశాయి, శ్రీ కృష్ణుని కాళీయ మర్ధనం, నర్తకీమణుల బొమ్మలు ఉన్నాయి. అలాగే ముఖద్వారంపై దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసే దృశ్యం, ఒక బొమ్మలో ఏనుగు– ఆవు కనిపించేలా చెక్కిన సుందర శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయ ద్వారపాలకులుగా అంజలి ముద్రతో శోభిల్లే జయవిజయుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రంఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడంతోపాటూ శ్రీరామనవమి సమయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలను చేస్తారు. చతుర్దశి నాడు కల్యాణం, పౌర్ణమిరోజు రథోత్సవం నిర్వహిస్తారు. బమ్మెర పోతనామాత్యుడు ఒంటిమిట్ట కేంద్రంగా భాగవత రచన చేసి, ఆ కావ్యాన్ని ఒంటిమిట్ట కోదండ రామునికే అంకితం ఇచ్చారట. అందుకే ఒంటిమిట్ట ఆలయంలో పోతన విగ్రహం కూడా ఉంది. – డి.వి.ఆర్. (చదవండి: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు..! ఏకంగా 108 మంది రాణులు..)

ఆ యూనిఫాం నచ్చి చెఫ్గా మారా.. ఏకంగా 72 పోటీల్లో 94 పతకాలు!
పాఠశాలలో విద్యాభ్యాసం పొందుతున్న సమయంలో ఓ చెఫ్ వీడియోకు, అతని డ్రెస్ కోడ్కు ఆకర్షితురాలైన ఆ విద్యార్థిని చెఫ్గా మారాలని సంకల్పించుకుంది. అంతటితో ఆగకుండా ఆ దిశగా అడుగులు వేస్తూ మాస్టర్ చెఫ్గా పలువురి మన్ననలు పొందుతోంది. అనేక వంటల పోటీల్లో పతకాలను సొంతం చేసుకుంటూ తనదైన ముద్ర వేసుకుని బేకరీ విభాగంలో రాణిస్తోంది. ఆమే మేడ్చల్కు చెందిన మహిళా చెఫ్ (Woman Chef) దివ్యసారిక. తాను చెఫ్గా మారి స్థిరపడడం సరికాదని భావించి పాకశాస్త్ర ప్రావీణ్యంతో అద్యాపకురాలిగా తనలాంటి ఎంతో మందిని చెఫ్స్గా మలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా (Guntur District) ప్రత్తిపాడు మండలం కొత్త మల్లయ్యపాలేనికి చెందిన దివ్యసారిక (Divya Sarika) ఇంటర్ వరకూ అక్కడే చదువుకుంది. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కార్యక్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం పలు రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారి వీడియోలను ప్రదర్శించింది. అందులో భాగంగా ఆ్రస్టేలియాకు చెందిన ఫేమస్ చెఫ్ థామస్ వీడియో, అతని యూనీఫాంకు ఆకర్షితురాలైంది దివ్యసారిక. అప్పుడే చెఫ్గా మారాలని నిర్ణయించుకుంది. మొదట ఇంట్లో వంటలు చేయడం ప్రారంభించింది. ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయాలనే ఆలోచనను తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తనకు ఇష్టమైన రంగంలో వెళ్తానంటూ పట్టుబట్టి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ మూడేళ్ల పాటు బ్యాచిలర్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ కోర్సు పూర్తిచేసింది. చివరి సంవత్సరంలో హోటల్ హెచ్ఐసీసీలో అప్రెంటీస్లో చేరి అనంతరం అక్కడే చెఫ్గా చేరింది. తదనంతరం నోవోటెల్లో రెండున్నరేళ్ల పాటు చెఫ్గా చేసింది. 72 పోటీల్లో.. 94 పతకాలు.. బేకరీ విభాగంలో చెఫ్గా రాణిస్తున్న దివ్యసారిక ఇప్పటి వరకూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో 72 పోటీల్లో పాల్గొంది. మొదట విద్యార్థి దశలో 2013లో ఆంధ్రా కలినరీ చెఫ్ పోటీల్లో పాల్గొనేందుకు రూ.42 వేలు ఖర్చు చేసి పొటీలో పాల్గొంది. నిర్భయ గర్ల్చైల్డ్, మథర్ థీమ్తో చెఫ్గా తనదైన ముద్రతో మొదటి గొల్డ్మెడల్ సాధించింది. దీంతో పతకం రుచి చూసిన చెఫ్ దివ్య అంతర్జాతీయ స్థాయిలో మలేషియా, మారీషియస్, మాల్దీవులు వంటి దేశాలతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొని 4 గొల్డ్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది. 32 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్, 41 బ్రాంజ్ మెడల్స్తో పాటు నగదు పురస్కారాలు, అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నట్లు దివ్యసారిక తెలిపింది. లక్షల జీతం వదిలి.. మహిళా చెఫ్గా రాణిస్తున్న దివ్య ప్రముఖ హోటళ్లలో, విదేశాల్లో చెఫ్గా విధులు నిర్వహిస్తే రూ.లక్షల్లో వేతనం పొందే అవకాశం ఉన్నా.. తాను నేర్చుకున్నది నలుగురికీ బోధించాలనే ఉద్దేశంతో హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తుంది. గతంలో తెలంగాణ టూరిజంలో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. ఇప్పటి వరకూ 300 మంది విద్యార్థులను చెఫ్లుగా తీర్చిదిద్దానని, వారిలో కొందరు విదేశాల్లో చెఫ్స్గా స్థిరపడ్డారని తెలిపారు. రుచికరమైన ఆహారం అందించేందుకు.. చెఫ్స్గా మహిళలు రాణించాలనేదే నా కోరిక.. నా ప్రేరణతో మరికొందరు ఈ రంగంలో స్థిరపడాలి. ప్రజలకు నాణ్యామైన రుచికరమైన ఆహారం అందించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా ద్వారా ఈ రంగంలో స్థిరపడిన వారు చిరకాలం నన్ను గుర్తుంచుకుంటారు.. అదే నాకు ఆనందాన్నిస్తుంది.(చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!)

ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీటి ధర రూ. 65 లక్షలా..!
ప్రతి మనిషికీ ప్రాణవాయువు తరువాత అత్యంత ప్రామాణికమైనది నీరు. మనిషి దేహంలో సుమారు 60 నుంచి 70 శాతం నీరు ఉంటుంది. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకగలమేమో కానీ, నీరు అందకుంటే మాత్రం ప్రాణాపాయమే. అయితే ఇంతటి ప్రామాణికమైన నీరు ప్రస్తుతం వ్యాపారంగా మారిన విషయం విదితమే. నీటిని కూడా లీటర్ల చొప్పున అమ్మడం, మనం కొనడం సాధరణమైపోయింది. అయితే ఇటీవల నగరంలో జరిగిన సినిమా వేడుకలో ప్రముఖ టాలీవుడ్ సినీ హీరో ఓ వాటర్ బాటిల్తో నీరు తాగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే సుమారు 330 మిల్లీలీటర్లు ఉండే ఈ వాటర్ బాటిల్ ధర అక్షరాలా 130 నుంచి 160 రూపాయలట. అంటే ఆ బ్రాండ్ ఒక లీటర్ నీరు సుమారు రూ.500. నిజంగా హైదరాబాద్లో వందలు, వేలు ఖర్చు చేసి ఒక లీటర్ నీటిని కొంటున్నారా.. అంటే? ఔననే సమాధానం వస్తుంది. వందలు వేలు కాదు.. కొందరు ప్రముఖులు ఏకంగా లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిళ్లు కొని మరీ తాగుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగరంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20లు. ఫ్లేవర్డ్ వాటర్ బాటిల్ లేదా స్పార్లి్కంగ్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.30 నుంచి 50 వరకూ ఉంటుంది. ప్రీమియం నేచురల్ మినరల్ వాటర్ బాటిల్ ధర రూ.40 నుంచి 100 వరకూ ఉంటుంది. వాటర్ బాటిళ్ల అమ్మకం ఐఎస్ఐ మార్క్, బ్రాండింగ్, ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాల పై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి సహజ వనరైన నీటిని ఇంత ధరల్లో అమ్మడం కూడా అనైతికమని పలు సంస్థలు, సామాజిక వేత్తలు నినదిస్తున్నారు. కానీ హైదరాబాద్ వంటి మహానగరంలో నీటిని వేలకు వేలు పెట్టి మరీ తాగున్నారనే విషయం ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వస్తోంది. సాధారణంగా కొన్ని రెస్టారెంట్లకు వెళితే బయట 20 రూపాయలకు లభించే లీటర్ వాటర్బాటిల్ ధర 40 నుంచి 80 ఉంటుంది. దీనికి సొంత బ్రాండింగ్, నీటి స్వచ్ఛత, మినరల్స్ మిక్సింగ్ వంటి అంశాలను వెల్లడిస్తారు. దీనికి మించి నగరంలోని కొన్ని స్టార్ హోటళ్లలో 250 నుంచి 300 మి.లీ వాటర్బాటిల్ ధర సుమారు 200 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. నేచురల్ మినరల్ వాటర్ అని, నేచురల్లీ ఆల్కలైన్ వాటర్ అనీ విభిన్న పద్ధతుల్లో ఈ నీటిని అందిస్తున్నారు. ఎన్విరాన్మెంటల్లీ సర్టిఫైడ్ బ్రాండ్స్ అంటూ లీటర్కు సుమారు వెయ్యిరూపాయల వరకూ ధర నిర్ణయిస్తున్నారు. నగరంలోని 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో జరిగే బిజినెస్ మీటింగ్స్, ఫంక్షన్స్లో ఈ తరహా వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అంతే కాదు.. సాధారణంగా లంచ్ లేదా డిన్నర్ కోసం వెళ్లిన నగరవాసులు సైతం ఈ నీటిని సేవిస్తుండటం విశేషం. నార్వేలోని భూగర్భ జలాల నుండి సేకరించిన వోస్ ఆర్టేసియన్ వాటర్ (12 బాటిళ్ల ప్యాక్ సుమారుగా 6,600), ఆరావల్లి పర్వత శ్రేణి నుంచి సేకరించిన ఆవా సహజ అల్కలైన్ వాటర్, క్రికెటర్ కోహ్లీ తాగే ఎమియన్ వంటి ఖరీదైన బ్రాండ్స్ నగరంలో లభిస్తుండటం విశేషం. వజ్రాల బాటిల్స్లో తాగే నీరు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీరుగా బెవర్లీ హిల్స్ 90 ఏ20 డైమండ్ ఎడిషన్ గుర్తింపు పొందింది. ఈ బ్రాండ్ లగ్జరీ కలెక్షన్ డైమండ్ ఎడిషన్ బాటిల్ ధర రూ.65 లక్షల వరకూ ఉంది. ఈ బాటిల్లో 600 జీ/వీఎస్ తెల్ల వజ్రాలు, 250కు పైగా నల్ల వజ్రాలతో అలంకరించిన బంగారు టోపీ సెట్ ఉంటుంది. ఆక్వా డీ క్రిస్టల్లో ట్రిబ్యూటో మోడిగ్లియాని అనే బ్రాండ్ వాటర్ బాటిల్ ధర రూ.44 లక్షలకు పైమాటే. ఈ బాటిల్ 2010లో అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును దక్కించుకుంది. ఫిజియన్, ఫ్రెంచ్ స్ప్రింగ్స్–ఐస్లాండ్ హిమ నదీ నుంచి సేకరించిన ఈ నీటిని 750 మి.లీ పరిమాణంలో 24–క్యారెట్ల బంగారు బాటిల్లో అందిస్తారు. దక్షిణ కాలిఫోరి్నయాలోని పలోమర్ పర్వతం నుంచి సేకరించే బ్లింగ్ హెచ్20 ధర 2 లక్షల వరకూ ఉంది. నెవాస్ గ్లో–ఇన్–ది–డార్క్ బాటిల్ వాటర్ మాగ్నమ్ ధర దాదాపు రూ.1.32 లక్షలు. వంద శాతం సహజమట..! వందలు వేలు కాదు.. ప్రపంచవ్యాప్తంగా తాగే నీటిని లక్షల విలువ చేసే బాటిళ్లలో అమ్మడం కూడా మొదలైంది. ఇంతటి ఖరీదైన వాటర్ బాటిళ్లు మన దేశంలో కూడా కొని తాగుతున్నారు కొందరు ధనవంతులు, సెలబ్రిటీలు. ప్రముఖ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకునే ఏవియన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ మాత్రమే తాగుతాడు. ఈ నీరు వంద శాతం సహజ నీరు, ఫ్రాన్స్లోని ఏవియన్–లెస్–బెయిన్స్ సమీపంలోని సహజ వనరుల నుంచి సేకరించినవి. ఈ స్వచ్ఛమైన నీటిలో సహజ ఖనిజాలంటాయని, అంతేకాకుండా ఎలాంటి రసాయనాలతో కలుషితం కాదని నిర్థారించినవి. విరాట్ కోహ్లీ ప్రతి యేటా సుమారు రూ.4.3 లక్షల వరకూ ఈ నీటి కోసం వెచ్చిస్తాడని సమాచారం. (చదవండి: 'అపూర్వ బంధం'.. తోబుట్టువుల ప్రేమ..అనుబంధాలకు ప్రతీక..!)

ఏసీ లేకున్నా ఎంత హాయి!
వేసవి వచ్చిందంటే చాలు... ఫ్యాన్ నాన్ స్టాప్గా తిరగాల్సిందే. ఏసీ ఎప్పుడూ పని చేయాల్సిందే. కరెంట్ బిల్లు భారం సంగతి ఎలా ఉన్నా... ఏసీల అధిక వినియోగం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బెంగళూరుకు చెందిన వారణాసి సత్యప్రకాష్ ‘వారణాసి హౌజ్’ను సృష్టించాడు. ఏసీ అవసరం లేకుండానే ఈ ఇల్లు చల్లగా ఉంటుంది. ఇంటి నిర్మాణం విషయానికి వస్తే... హీట్ ట్రాపింగ్ సిమెంట్ గోడలకు బదులుగా బోలు మట్టి బ్లాకులను ఎంచుకున్నాడు. ఇవి ఉష్ణోగ్రతను సహజంగా నియంత్రిస్తాయి. వేసవిలో ఇంటిని చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి. ఫ్రెంచ్ కిటికీల వల్ల తగినంత వెంటిలేషన్ ఉంటుంది. ఇంటి రూపకల్పనలో ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, భూగర్భ జలాలను రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేపల కొలను, నీటి ప్రవాహాలు, బావి ఉన్నాయి. కారు షెడ్కు దగ్గరలో అందమైన పూలతోట... వర్షపు నీటిని భద్రపరిచే ఏర్పాటు కూడా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ కూలింగ్ అవసరం లేకుండా రెడ్ ఆక్సైడ్ ఫ్లోర్స్, పైన్ వుడ్ ఇంటీరియర్స్, నేచురల్ చిమ్నీ... మొదలైనవి కనిపిస్తాయి.‘క్రాస్ వెంటిలేషన్, డిస్ప్లేస్మెంట్ వెంటిలేషన్ సూత్రాలను మిళితం చేసి ఇంటికి రూపకల్పన చేశాం’ అంటున్నాడు సత్యప్రకాష్. (చదవండి: మామయ్య ప్రవర్తనతో నరకం కనిపిస్తోంది!)
ఫొటోలు


వైట్ గౌన్ లో అందాలు ఆరబోస్తున్న నేహా శెట్టి (ఫోటోలు)


సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


‘కృష్ణ లీల’ మోషన్పోస్టర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధం (ఫొటోలు)


రిచెస్ట్ ప్లేయర్గా పీవీ సింధు.. ఏడాది సంపాదన ఇన్ని కోట్లా?( ఫోటోలు)


స్నేహితురాలితో సాయిపల్లవి హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)


అంబానీ ఇల్లు ‘అంటిలియా’.. అబ్బురపరిచే లోపలి ఫొటోలు


అందంతో అభిమానుల మనసు కొల్లగొట్టేస్తున్న దివ్యభారతి (ఫోటోలు)


Arjun S/O Vyjayanthi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయశాంతి, హీరో కళ్యాణ్ రామ్ (ఫొటోలు)


హనుమాన్ పూజలో కేటీఆర్.. స్వాములతో కలిసి భోజనం (ఫొటోలు)
అంతర్జాతీయం

అమెరికాపై ప్రతీకార సుంకాలు 90 రోజులు వాయిదా
బ్రస్సెల్స్: అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ కమిషన్ గురువారం వెల్లడించింది. తమ ఉత్పత్తులపై విధించిన టారిఫ్లను 90 రోజులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము సైతం ఆయన బాటలో నడవనున్నట్లు ప్రకటించింది. టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 23.25 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అమెరికాలో చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. చర్చలు సంతృప్తికరంగా సాగకపోతే అమెరికాపై ప్రతీకార సుంకాలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. ఈయూ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ తొలుత 25 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని 90 రోజులపాటు ఆయన నిలిపివేశారు.

మా తలుపులు తెరిచే ఉన్నాయి
బీజింగ్/వాషింగ్టన్: టారిఫ్ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హీ యోంగ్కియాన్ గురువారం చెప్పారు. తాము ఘర్షణ కోరుకోవడం లేదని అన్నారు. చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అమెరికాతో చర్చలు పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన జరగాలని ఆకాంక్షించారు. కానీ, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్మెయిలింగ్కు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. చైనాతో డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. ఒకవేళ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా మరింత ముందుకు తీసుకెళ్తే తాము చివరి వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు. జిన్పింగ్ తెలివైన నాయకుడు: ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చాలా తెలివైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడేం చేయాలో జిన్పింగ్కు బాగా తెలుసని అన్నారు. టారిఫ్ల విషయంలో చైనా పాలకులు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చించడానికి జిన్పింగ్ నుంచి త్వరలోనే తనకు ఫోన్కాల్ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. చైనాలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు. చైనాపై 145 శాతం బాదుడు చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, మరో 20 శాతం సుంకాలను కూడా దీనికి జతచేసినట్లు శ్వేతసౌధం తాజాగా స్పష్టంచేసింది. చైనా నుంచి ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి గతంలో విధించిన 20 శాతం సుంకాలకు ఈ 125 శాతం సుంకాలు అదనమని తెలియజేసింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరుకున్నట్లు నిర్ధారించింది. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై చైనాలో సుంకాలు 84 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.ఇండియాపై 26 శాతం అదనపు టారిఫ్ జూలై 9 దాకా రద్దు ఇండియాపై విధించిన 26 శాతం అదనపు టారిఫ్ను 90 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఏడాది జూలై 9 దాకా ఈ అదనపు సుంకాలు అమల్లో ఉండవని పేర్కొంది.

టార్గెట్ చైనా ఎందుకంటే..!
కాళ్లబేరానికి వచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచదేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే అన్ని దేశాలపై పెరిగిన టారిఫ్లు అమల్లోకి రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ట్రంప్ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు నిజంగానే ట్రంప్ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్పై కత్తిగట్టారా? అనే చర్చ ఇప్పుడు వాణిజ్యవర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని తెలుస్తోంది. తొలి దఫా పగ్గాలు చేపట్టినప్పుడేదాదాపు 13 ఏళ్ల క్రితంనాటి సంగతి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తూత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపర్చుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్చలు జరిపింది. చవగ్గా సరుకుల సరఫరాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన కార్మికుల కష్టంతో పురుడుపోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచదేశాల కీలక వ్యాపారసంస్థలన్నీ చైనాకే క్యూకట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్ రాయిస్, జనరల్ మోటార్స్, ఫోక్స్వ్యాగన్ సంస్థల ఉత్పత్తులూ చైనాలో తయారవడం మొదలైంది. దీంతో దశాబ్దాల చరిత్ర కల్గిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామికరంగానికి పూర్వవైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ట్రంప్ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ నాలుగేళ్లలో అనుకున్న వ్యూహాలను అమలుచేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండోదఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదునుపెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ టారిఫ్ల పరంపర. ఎగుమతులు పెరిగాక చైనాలో ఏం జరిగింది? ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ది సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏక పార్టీ, నియంతృత్వపాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైనా దృష్టిసారించింది. 2015లో బహిర్గతమైన ‘‘మేడిన్ చైనా 2025’ బ్లూప్రింట్ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించింది. గుండుసూది నుంచి గగనతల రక్షణ వ్యవస్థలదాకా, విద్యుత్వాహనాలు మొదలు అధునాతన యుద్ధవిహంగాల దాకా ప్రతిరంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకుసాగి ఆ పనిలో సఫలీకృతమైంది. ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్ రాజకీయ రంగప్రవేశంచేసి చైనా ఎగుమతి మార్కెట్ ఎదుగుదలకు అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనే అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్ వాహనాల తయారీలో 60 శాతం వాటాను ఒడిసిపట్టింది. ఈ 60 శాతంలోకూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే కావడం విశేషం. ఇక బ్యాటరీల్లోనూ 80 శాతం అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్ టారిఫ్ల కొరడాను ఝుళిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ నిర్ణయం యావత్ ప్రపంచ వాణిజ్యవ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. ఇప్పుడేం జరగొచ్చు? అతి టారిఫ్ల భారాన్ని అమెరికా తమపై మోపిన నేపథ్యంలో చైనా ముంగిట ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతుంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్లనుంచో చైనా కలలుకంటోంది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తూ దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తినిపుణులుగా మార్చేసింది. ఆట»ొమ్మలు మొదలు ఫోన్లదాకా అన్ని వస్తువులు కుటీరపరిశ్రమల్లా ఇళ్లలోనే తయారవుతాయి. చైనాలో ఏం జరుగుతోందనే వివరాలు బయటకు పొక్కకుండా మీడియాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవరినీ ఎదగనీయదు. ఈ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్

చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్పై మరోసారి టారిఫ్ విధింపు
వాషింగ్టన్: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్హౌస్ అధికారి అమెరికన్ మీడియా సంస్థ సీఎన్బీసీకి ధృవీకరించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్ డ్రాగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్లైన్ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది. JUST IN: 🇺🇸🇨🇳 White House says total US tariffs on China are now 145% pic.twitter.com/67oyICPVNb— Mastering Crypto 🇺🇲 (@MasteringCrypt) April 10, 2025పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు.
జాతీయం

‘వక్ఫ్’ పిటిషన్లపై 16న సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)చట్టం–2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా దాఖలు చేసిన 10 వరకు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉంటారు. ఒవైసీతోపాటు ఆప్ నేత అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అర్షద్ మదానీ, సమస్త కేరళ జమియతుల్ ఉలెమా, అంజుమ్ కదారి, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజలుర్రహీమ్, ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పిటిషన్లు వేశారు. ఈ చట్టంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ముందుగా తమ వాదనను వినాలంటూ ఈ నెల 8న కేంద్రం సుప్రీంకోర్టులో కెవియెట్ దాఖలు చేయడం తెల్సిందే. పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో వక్ఫ్(సవరణ) చట్టం–2025ను గురువారం నోటిఫై చేసింది. తీవ్ర వ్యతిరేకత నడుమ పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో తమిళనాడులోని 50 లక్షల మందితోపాటు దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింల హక్కులకు భంగం వాటిల్లనుందని పిటిషనర్లలో ఒకటైన డీఎంకే అంటోంది. ఈ చట్టంలోని అంశాలు ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) అంటోంది.

ఎన్ఐఏ అదుపులో రాణా
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. అతడిని ఎప్పుడు తీసుకొస్తారు? ఎలా తీసుకొస్తారు? అన్నదానిపై ఉత్కంఠకు తెరపడింది. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఎదుట హాజరుపర్చారు. ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్దేవా వాదనలు వినిపించారు. పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, న్యాయమూర్తి తన ఉత్తర్వును రిజర్వ్ చేశారు. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. అతిపెద్ద దౌత్య విజయం భారత్కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది. 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది. ముంబైలో ఆ రోజు ఏం జరిగింది? 2008 నవంబర్ 26న పాకిస్తాన్కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా.. నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెరి్మనస్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు. ముంబైలో ఉగ్రవాద దాడులకు రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో నిర్బంధించింది. ఎవరీ రాణా? పాకిస్తాన్లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు. అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. హెడ్లీ సూచన మేరకు రాణా ముంబైలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. 2006 నుంచి 2008 దాకా హెడ్లీ ఈ ఆఫీసుకు ఐదుసార్లు వచ్చి వెళ్లాడు. ముంబైలో ఎక్కడెక్కడ దాడులు చేయాలో నిర్ణయించుకున్నాడు. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు. రాణాను బహిరంగంగాఉరి తీయాలి: ఏక్నాథ్ ఓంబలే ఉగ్రవాది తహవ్వుర్ రాణాను బహిరంగంగా ఉరి తీయాలని ఏక్నాథ్ ఓంబలే డిమాండ్ చేశాడు. వందల మంది ప్రాణాలను బలిగొన్న ముష్కరుడికి బతికే హక్కు లేదని అన్నాడు. భారత్పై దాడులు చేయాలన్న ఆలోచన వస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలియాలంటే రాణాను జనం సమక్షంలో ఉరికంభం ఎక్కించాల్సిందేనని తేల్చిచెప్పాడు. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల్లో ఏక్నాథ్ ఓంబలే సోదరుడు, అసిస్టెంట్ ఎస్ఐ తుకారాం ఓంబలే కన్నుమూశాడు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ను బంధించే ప్రయత్నంలో మృతిచెందాడు. ఆ సమయంలో తుకారాం వద్ద లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేదు. ఆయినప్పటికీ కసబ్ను ధైర్యంగా అడ్డుకున్నాడు. కోపోద్రిక్తుడైన కసబ్ కాల్పులు జరపడంతో తుకారాం నేలకొరిగాడు. కసబ్ను చాలాసేపు నిలువరించడం వల్లే చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు. తుకారాంకు ప్రభుత్వం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. దాడులకు ముందు తాజ్మహల్ సందర్శన ఉగ్రవాది తహవ్వుర్ రాణా ముంబై దాడుల కంటే ముందు భార్యతో కలిసి ఆగ్రాలోని తాజ్మహల్తోపాటు కొచ్చీ, ముంబై నగరాల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించాడు. 2008 నవంబర్ 26న దాడులు జరిగాయి. నవంబర్ 13 నుంచి 21 దాకా రాణా ఇండియాలోనే ఉన్నాడు. అతడు దేశం వదిలివెళ్లిపోయిన ఐదు రోజుల తర్వాత 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. భార్య డాక్టర్ సమ్రజ్ అక్త్తర్తో కలిసి రాణా నవంబర్ 13న ఢిల్లీకి చేరుకున్నాడు. తర్వాత వారు మీరట్, ఘజియాబాద్లోని సమ్రజ్ బంధువుల ఇళ్లకు వెళ్లారు. తర్వాత వేగన్ఆర్ కారులో ఆగ్రాకు చేరుకొని ఓ హోటల్లో బసచేశారు. మరుసటి రోజు తాజ్మహల్ను సందర్శించారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగివెళ్లారు. కొచ్చిలో రెండు రోజులు ఉన్నారు. తర్వాత ముంబైలో పోవై హోటల్లో, జలవాయు విహార్ హౌసింగ్ కాంప్లెక్స్లో బస చేశారు. జలవాయు విహార్లో 1971 నాటి యుద్ధ వీరులు నివసిస్తుంటారు. ఈ యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కాంప్లెక్స్ను పేల్చివేయాలని రాణా భావించాడు. కానీ, అక్కడ దాడులకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. నవంబర్ 21న ఇండియా నుంచి వెళ్లిపోయాడు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరేందర్ మాన్న్యూఢిల్లీ: ముంబై ఉగ్రవాద దాడుల కేసులో తహవ్వుర్ రాణాపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ అడ్వొకేట్ నరేంద్ర మాన్ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకం రాబోయే మూడేళ్లపాటు లేదా కేసు విచారణ పూర్తయ్యేదాకా అమల్లో ఉంటుంది. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేత కోర్టులతోపాటు అప్పిలేట్ కోర్టులో నరేంద్ర మాన్ వాదిస్తారు. దయాన్ కృష్ణన్ కృషి వల్లే.. తహవ్వుర్ రాణాను రప్పించడం వెనుక సీనియర్ లాయర్ దయాన్ కృష్ణన్ కృషి ఎంతో ఉంది. రాణా కేసులో భారత ప్రభుత్వం తరఫున అమెరికా కోర్టుల్లో ఆయన సమర్థంగా వాదనలు వినిపించారు. అమెరికా కోర్టులో రాణాపై విచారణ 2018లో ప్రారంభమైంది. 2023 మే 16న కృష్ణన్ చేసిన వాదనను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆఫ్ సెంట్రల్ డి్రస్టిక్ట్ ఆఫ్ కాలిఫోరి్నయా మేజిస్ట్రేట్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. రాణాను ఇండియాకు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చారు. రాణాను రప్పించే విషయంలో ఈ తీర్పు కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఒకే కేసులో రెండుసార్లు ఎలా శిక్షిస్తారంటూ రాణా తరఫు న్యాయవాది పాల్ గార్లిక్ క్యూసీ చేసిన వాదనను దయాన్ కృష్ణన్ గట్టిగా తిప్పికొట్టారు. రాణాపై ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ తరఫున వాదించే బృందంలో కృష్ణన్ సైతం చేరబోతున్నట్లు తెలిసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్కు ఆయన సహకరిస్తారు. ఈ బృందంలో అడ్వొకేట్లు సంజీవి శేషాద్రి, శ్రీధర్ కాలే సైతం ఉంటారని సమాచారం. అప్పటి హీరోనే ఇప్పటి ఎన్ఐఏ చీఫ్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సదానంద్ దాతే 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదులతో హోరాహోరీగా తలపడ్డారు. అప్పట్లో ఏసీపీగా పని చేస్తున్న సదానంద్ ఆ రోజు రాత్రి ముంబై కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబూ ఇస్మాయిల్ను 40 నిమిషాలపైగా ఒంటరిగా ఎదుర్కొన్నారు. ముష్కరుల కాల్పుల్లో మిగతా పోలీసులు గాయపడగా, అయన ఒక్కరే ధైర్యంగా ముందడుగు వేశారు. ఎదురు కాల్పులు జరుపుతూ ఆ ఇద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఉగ్రవాదులు విసిరిన గ్రనేడ్ పేలి సదానంద్ గాయపడ్డారు. అయినప్పటికీ కాల్పులు ఆపలేదు. 40 నిమిషాలపాటు సమయం చిక్కడంతో చాలామంది ప్రజలు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 26/11 దాడుల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏకు సదానంద్ దాతే 2024 మార్చి నుంచి సారథ్యం వహిస్తున్నారు. 2026 డిసెంబర్ 31దాకా ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

Tahawwur Rana: తహవూర్ రాణా దారులన్నీ మూసుకుపోయాయి.. ఇక
ఢిల్లీ: ముంబై 26/11 ఉగ్రదాడి కేసు ప్రధాన నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను (Tahawwur Rana) భారత్కు తరలించారు. అమెరికా నుంచి అతడిని తీసుకువచ్చిన విమానం గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఢిల్లీ విమానాశ్రయంలోనే రాణాను ఎన్ఏఐ(National Investigation Agency) అరెస్ట్ చేసింది. అనంతరం తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ సందర్భంగా తహవూర్ రాణా గురించి ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేసింది.ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహవర్ రాణాను భారత్కు తీసుకురావడంలో ఎన్ఐఏ విజయవంతమైంది. ముంబై దాడులకు పడిన పాల్పడిన కుట్ర దారున్ని న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నాం. అమెరికాలో రాణాకు అన్ని న్యాయపరమైన దారులు మూసుకు పోయాయి. 2023 మే 16న భారత్కు అప్పగించేందుకు అమెరికా స్థానిక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. pic.twitter.com/nS7dA58W55— NIA India (@NIA_India) April 10, 2025 రాణా ఫైల్ చేసిన అన్ని పిటిషన్లు అమెరికా సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమెరికా భారత్లోని కీలక సంస్థల సమన్వయంతో రాణాను భారత్కు తీసుకు రాగలిగాం. ముంబై ఉగ్రదాడుల కుట్ర దారు రాణా. డేవిడ్ హెడ్లితో కలిసి ముంబై దాడులకు కుట్ర పన్నాడు. లష్కర్ ఈ తోయిబా, హుజీ ఉగ్ర సంస్థలు, పాకిస్తాన్ కుట్ర దారులు ఇందులో భాగస్వాములు. ముంబై ఉగ్రదాడులో 166 మంది చనిపోయారు 238 మంది గాయపడ్డారు’అంటూ అధికారిక నోట్ను విడుదల చేసింది.

ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్.. తండ్రి కోపాగ్నికి బలి
నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్ సమస్తిపూర్(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్ కుమార్ సింగ్(Mukesh Singh Kumar) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్ సింగ్ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం..
ఎన్ఆర్ఐ

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు. రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.పాల్గొన్న కవులు: దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.https://youtube.com/live/qVbhijoUiX8అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

డా.గుడారు జగదీష్కు “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డు
మారిషస్ తెలుగు మహా సభ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫీనిక్స్లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఇండియన్ కల్చర్లో తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, శ్రీ విశ్వావసు నామ తెలుగు ఉగాదిని మారిషస్లోని తెలుగు వారు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ప్రముఖ సామాజిక-సాంస్కృతిక సంస్థ మారిషస్ తెలుగు మహా సభ నిర్వహించిన ఈ కార్యక్రమం, తెలుగు ప్రజల వారసత్వం మరియు సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వేదికగా నిలచింది. కార్యక్రమం సాంప్రదాయ తెలుగు నూతన సంవత్సర ఆచారాలతో ప్రారంభమైంది, వీటిలో భాగంగా మా తెలుగు తల్లి, దీప ప్రజ్వలనం మరియు గణపతి వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గుడారు జగదీష్ వైద్య రంగంలో చేసిన అసాధారణ కృషికి, ముఖ్యంగా వికలాంగుల శ్రేయస్సు కోసం వారి యొక్క అచంచలమైన అంకితభావానికి గుర్తింపుగా మారిషస్ ప్రధాన మంత్రి సత్కరించారు.నాలుగు దశాబ్దాలుగా వికలాంగుల పునరావాసం మరియు సమాజ సేవకు అంకితమైన డాక్టర్ జగదీష్ దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన అవిశ్రాంత సేవ ఎంతో మంది అభాగ్యుల జీవితాలను ప్రభావితం చేసింది. ఈ సేవలను గుర్తించిన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ డాక్టర్ గుడారు జగదీష్ ను “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో సత్కరించారు. డాక్టర్ జగదీష్ అసాధారణ మానవతా స్ఫూర్తిని మరియు అంకితభావాన్ని మారిషస్ ప్రధాని ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ తనను ఈ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినందుకు మారిషస్ తెలుగు మహా సభ సభ్యులకు, మారిషస్ ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన డాక్టర్ జగదీష్ కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ మరియు మంగళూరులోని మణిపాల్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత వైద్య సంస్థలలో వైద్య విద్యను అభ్యసించి ఆర్థోపెడిక్స్ విభాగంలో నైపుణ్యం పొంది, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ సంస్థల నుండి అత్యాధునిక పద్ధతులలో అధునాతన శిక్షణ సైతం తీసుకున్నారని తెలిపారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండు, ఇటలీ, ఫ్రాన్స్, నైజీరియా, కెన్యా, ఒమన్, స్విట్జర్లాండ్ మరియు మారిషస్లలో కూడా ఉచిత క్యాంపులు నిర్వహించి తన సేవలను విస్తరించి, అనేక జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనలు ప్రచురించారని తెలిపారు. రాబోయే రోజుల్లో మారిషస్కు కూడా డాక్టర్ జగదీష్ తన సేవలను అందించాలని ప్రధాని కోరారు.ప్రధానమంత్రి తన ప్రసంగంలో, తెలుగు సంస్కృతిని కాపాడటానికి, ప్రోత్సహించడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే వ్యక్తులను గుర్తించడంలో మారిషస్ తెలుగు మహాసభ యొక్క నిబద్ధతను ప్రశంసించారు. డాక్టర్ జగదీష్ అంకితభావం మరియు సమాజం పట్ల సేవానిరతిని ఆయన ప్రశంసించారు. ఆయన సేవ అందరికీ ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు."ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గుర్తింపు నాకే కాదు, సమాజానికి సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేసే ప్రతి వైద్యునికి ఈ గౌరవం దక్కుతుంది. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండేలా నా సేవలను కొనసాగించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను" అని డాక్టర్ జగదీష్ అన్నారు.మారిషస్ తెలుగు మహా సభ ప్రతినిధులు మాట్లాడుతూ టి.టి.డి. బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్గా & గ్రీన్మెడ్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ అధిపతి . డాక్టర్ జగదీష్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా ఉచిత పోలియో సర్జికల్ మరియు స్క్రీనింగ్ శిబిరాలకు నాయకత్వం వహించారని, నలభై మూడు సంవత్సరాల తన సేవలో భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో వికలాంగుల జీవితాలను మెరుగుపరచడానికి అనేక క్యాంపులను నిర్వహించి, 1,83,000 కు పైగా శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ఎంతో మందిని అంగ వైకల్యం పై విజయం సాధించేలా చేశారని తెలిపారు. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా అసమానమైనదని గుర్తు చేశారు.రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వావసు నామ సంవత్సరము అంటారు. దీని అర్థం ఇది విశ్వానికి సంబంధించినది. అదేవిధంగా, ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి తన సేవలను అందించిన డాక్టర్ గుడారు జగదీష్ కూడా మొత్తం విశ్వానికి సంబంధించిన వైద్యుడు కాబట్టి విశ్వావసు పేరిట “విశ్వ వైద్య దివ్యాంగ బంధు” అవార్డుతో ఆయనను సత్కరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగు వారి యొక్క కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబించే శాస్త్రీయ నృత్యాలు, జానపద పాటలు మరియు సాంప్రదాయ సంగీతంతో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ అవార్డు ప్రదానోత్సవంలో మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్చంద్ర రామ్ గూలమ్ తో పాటు ఉప ప్రధాన మంత్రి శ్రీ పాల్ రేమండ్ బెరెంజర్, ప్రజాసేవలు మరియు పరిపాలనా సంస్కరణల మంత్రి శ్రీ లుచ్మన్ రాజ్ పెంటియా, విద్య, కళలు మరియు సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ మహేంద్ర గోండీయా, మారిషస్లో భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ, ఇందిరా గాంధీ భారత సంస్కృతి డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య, మారిషస్ తెలుగు మహా సభ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సింగపూర్లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
క్రైమ్

భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!
యశవంతపుర(కర్ణాటక): వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినఘటన బెంగళూరుని హెబ్బాళ కనకనగరలో సోమవారం సాయంత్రం జరిగింది. బషీర్ ఉల్లా, బాహర్ అస్మా(29) దంపతులకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త మరో మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు అస్మా అనుమానించింది. ఇదే విషయంపై తీవ్ర మనో వేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో అస్మా ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా మారింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు వచ్చి పరిశీలించారు. అస్మాను చంపి ఉరివేసినట్లు ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బషీర్ ఉల్లాను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.

స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు
సాక్షి,బళ్లారి: ఇనుప ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి పొందిన బళ్లారి జిల్లా అసాంఘీక కార్యకలాపాలకు కూడా అడ్డాగా మారింది. మట్కా, పేకాట, జూదాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో పాటు స్పా మసాజ్ పేరుతో వేశ్యావాటిక తరహాలో అక్కడ అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్నారని పోలీసు తనిఖీల్లో బయట పడుతున్నాయి.గతంలో స్పా మసాజ్లు చేయించుకునేందుకు బ్యాంకాక్ వెళ్లేవారికి లేదా బెంగళూరు వెళ్లే వారికి ఆ కష్టనష్టాలు లేకుండా బళ్లారిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ లాడ్జి యజమానులు డబ్బుల కోసం వేశ్యావాటిక తరహాలోనే స్పా మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నగరంలో పేరుగాంచిన ప్రముఖ లాడ్జిల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నట్లు బహిరంగంగానే ఫ్లెక్సీలు పెట్టి మరీ స్పా మసాజ్ వ్యాపారాలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బళ్లారిలో స్పా మసాజ్ సెంటర్ల పేరుతో లాడ్జిల్లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో మసాజ్ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ వారిని లైంగిక క్రియలకు కూడా ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇటీవల నగరంలో పేరుగాంచిన బాలా రెసిడెన్సీ హోటల్లో స్పా మసాజ్ సెంటర్లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు దాడుల్లో వెలుగు చూడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాలా రెసిడెన్సీ హోటల్లో మసాజ్ పేరుతో వేశ్యావాటిక తరహాలో అమ్మాయిలతో లైంగిక క్రియలను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేయిస్తుండటంతో పోలీసులు తనిఖీ చేసి ఐదు మందిని అరెస్ట్ చేయడంతో పాటు ముగ్గురు అమ్మాయిలను రక్షించిన సంగతి విదితమే. పోలీసులు ఈ చర్యతో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే నగరంలో ఒక్క బాలా రెసిడెన్సీ హోటల్, లాడ్జిలోనే కాకుండా అదే తరహాలో స్పా మసాజ్ పేరుతో ప్రముఖ లాడ్జిల్లో అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఒక గది.. రూ.2 లక్షల బాడుగలాడ్జిల్లో ఒక గదిని ప్రత్యేకంగా స్పా మసాజ్ కోసం కేటాయిస్తూ నెలకు ఒక గదిని రూ.2 లక్షలకు పైగా బాడుగకు ఇస్తూ లాడ్జి యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. బాడుగకు తీసుకున్న వ్యక్తులు స్పా మసాజ్ పేరుతో లాడ్జిల్లోని గదుల్లో అమ్మాయిలతో పురుషులకు మసాజ్ చేయించి, వారు కోరితే సెక్స్కు ఓకే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇంతవరకు పోలీసులకు పెద్ద ఎత్తున మామూళ్లు ఇస్తూ యథేచ్ఛగా బ్యాంకాక్ తరహాలో ఇక్కడ అందమైన అమ్మాయిలతో స్పా మసాజ్ అనంతరం అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పోలీసులు ఇప్పటివరకు దాడులు చేసిన దాఖలాలు లేవు. అయితే ఎస్పీ శోభారాణి నేతృత్వంలో బాలా లాడ్జిపై దాడి చేసి పలువురిని అరెస్ట్ చేయడం శుభపరిణామమే అయినా ఇలాంటివి నగరంలో పేరుగాంచిన లాడ్జిల్లో స్పా మసాజ్ సెంటర్లు ఉన్నాయని, వాటిపై కూడా దాడులు నిర్వహించి స్పా మసాజ్లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో స్పా మసాజ్ సెంటర్లను మూసివేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర వాసులు పేర్కొంటున్నారు.

నీకు 21, నాకు 43.. ఓ ఆడిటర్ ప్రేమ వివాహం
తమిళనాడు: కెంగవల్లి సమీపంలో తల్లి దండ్రులపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన ఆడిటర్ పెళ్లి కోలంలో పోలీసులను ఆశ్రయించాడు. సేలం జిల్లా కెంగవల్లి సమీపంలోని క్రిష్ణపురం పంచాయతీకి చెందిన మణికంఠన్(43). ఆడిటర్గా ఉంటూ సేలం అంగమ్మాళ్ కాలనీలో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లయ్యాక భార్యతో మనస్పర్థలు రావడంతో పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. మణికంఠన్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న కొడుకు, 5వ తరగతి చదువుతున్న కుమార్తెతో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె విద్యాశ్రీ(21) ప్లస్ 2 పూర్తి చేసి ఇంట్లో ఉంటు వచ్చిన స్థితిలో, గత కొన్ని నెలలుగా ఆడిటర్ మణికంఠన్ ఆఫీసులో పనికి వెళ్లింది. ఇద్దరికీ పరిచయం ఏర్పడడంతో విద్యాశ్రీతో వివాహం జరిపించాలని మణికంఠన్ ఆమె తల్లిదండ్రులను కోరాడు. అయితే అతని తల్లిదండ్రులు వ్యతిరేకించారు. కాగా, మణికంఠన్ తన ఐదుగురు స్నేహితులతో కలిసి మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో విద్యాశ్రీ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె తల్లిదండ్రులు రాజేంద్రన్, వనిత పై దాడి చేసి విద్యాశ్రీ ని కారులో కిడ్నాప్ చేశారు. గాయపడిన రాజేంద్రన్ వనితను స్థానికులు రక్షించి కెంగవల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు దర్యాప్తులో 43 ఏళ్ల ఆడిటర్ మణికంఠన్, 21 ఏళ్ల యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తేలింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారిని వదిలి వేసినట్లు తెలిసింది.

కూతురిని చంపి.. తల్లి ఉరేసుకుని..
పెద్దపల్లి రూరల్: ఉన్నత చదువులు చదివింది.. కన్నబిడ్డకు విద్యాబుద్ధులు ప్రాప్తించేలా చూడాలంటూ రెండ్రోజుల క్రితమే బాసరలోని సరస్వతీదేవి అమ్మవారి ఎదుట అక్షరాభ్యాసం చేయించింది.. ఇంతలో ఏమైందో ఏమో.. క్షణికావేశంలో కన్న కూతురినే కడతేర్చింది.. ఆపై తానూ ఉరివేసుకుంది. పెద్దపల్లి టీచర్స్ కాలనీలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి ఎల్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న లోక వేణుగోపాల్రెడ్డికి సాహితి (29)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె రితన్య (2) ఉంది. టీచర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేని సమయంలో.. సాహితి కూతురు రితన్యకు ఉరివేసి చంపి, తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాహితికి రాత్రి తల్లిదండ్రులు ఫోన్చేసినా ఎత్తలేదు. దీంతో అనుమానించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడి సమాచారం తెలుసుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంటెక్ చదివిన సాహితి ఎక్కువగా ఆలోచిస్తుండేదని, సన్నగా ఉన్నాననే వేదనతో ఉండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ బాధ తాలూకు క్షణికావేశంలోనే సాహితి.. కూతురిని చంపి, ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. అక్షరాభ్యాసం చేయించి.. రెండు రోజుల క్రితమే బాసరలో చిన్నారి రితన్యతో తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. వచ్చే విద్యాసంవత్సరంలో కరీంనగర్లోని ఓ పాఠశాలలో నర్సరీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది. సాహితి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో.. భర్త వేణుగోపాల్రెడ్డి మంచివాడేనని స్పష్టం చేసింది. తన చావుకు ఎవరూ బాధపడొద్దని, తాను లేకుండా బిడ్డ ఎలా ఉంటుందోననే వేదనతోనే.. వెంట తీసుకెళ్తున్నానని లేఖలో పేర్కొంది.
వీడియోలు


డేవిడ్ హెడ్లీని అప్పగించడానికి సముఖంగా లేని యూఎస్ ఎజెన్సీలు


అజ్ఞాతంలో అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి


చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్ పై అంబటి రియాక్షన్


Naga Malleswari: జగన్ని తిట్టడానికి కాదు ప్రజలకోసం ప్రెస్ మీట్ పెట్టు


విజయ్ - టబు అదిరిపోయే కాంబో ఫిక్స్ చేసిన పూరి


కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుంభకోణాలు


మహాత్మా జ్యోతిరావు పూలేకు వైఎస్ జగన్ నివాళులు


కొత్తదనం కోరుకుంటున్న రష్మిక


తిరుమల ప్రతిష్టతను కూటమి సర్కార్ దెబ్బతీస్తోంది


మానసిక హత్యలు చేసే iTDP ముష్కరులు