వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలని కోరుకుంటున్న జగన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే కేంద్రం యోచనలో భాగమే రాష్ట్ర విభజన అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్లీనరీ సమావేశంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రసంగించారు.