-
టాలీవుడ్ హీరోయిన్కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్పై అలా
తెలుగు సినిమాలో హీరోయిన్గా చేసిన ఓ బ్యూటీ.. అరుదైన వ్యాధి బారిన పడింది. హాస్పిటల్ బెడ్పై ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధ భరించలేకపోతున్నానని అని చెబుతూ అసలు తనకు ఏమైంది? ఈ వ్యాధి సంగతేంటి? అనే విషయాల్ని చెప్పుకొచ్చింది. అలానే మహిళలకు ఇలాంటివి సాధారణంగా వస్తుంటాయని కూడా చెప్పింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? అసలేమైంది?(ఇదీ చదవండి: హీరోతో వివాదం.. ఫేస్ బుక్ లో సినిమా పెట్టేసిన డైరెక్టర్!)హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లి షమితా శెట్టి తెలుగులోనూ 'పిలిస్తే పలుకుతా' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. కాకపోతే అక్కలా పెద్దగా పేరు అయితే తెచ్చుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు బయటపెట్టింది. దీని గురించి హాస్పిటల్ బెడ్పై ఉంటూనే వివరంగా చెప్పుకొచ్చింది.'మహిళలకు వచ్చే సమస్యలో ఇది సర్వ సాధారణమైనది. గర్భాశయంలో చాలా నొప్పిగా అనిపిస్తుంది. అలాంటిదే నాకు ఇప్పుడు వచ్చింది. దాదాపు 40 శాతం మంది మహిళలు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. కాకపోతే మనలో చాలామందికి దీని గురించి తెలియదు. గత కొన్నాళ్ల నుంచి నేను దీని వల్ల నొప్పితో ఇబ్బంది పడ్డాను. కానీ డాక్టర్లు ఈ సమస్యకు మూలం ఏంటో గుర్తించారు. గర్భాశయంలో వచ్చిన ఈ సమస్యకు సర్జరీ ద్వారా పరిష్కారం దొరికింది' అని షమితా శెట్టి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)Did you know that almost 40 % of women suffer from Endometriosis.. and most of us are unaware of this disease!!! I want to thank both my dr s my gynac dr Neeta Warty and my Gp dr Sunita Banerjee for not stopping til they found out the root cause of my pain!🧿❤️ pic.twitter.com/T7dmTC2Cv4— Shamita Shetty 🦋 (@ShamitaShetty) May 14, 2024 -
ప్రియుడు ఫోన్ ఎత్తలేదని.. ఈ కొత్త జబ్బు గురించి తెలుసా?
ఆమె వయసు 18 ఏళ్లు. గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. కానీ, ఆ ఇష్టం ఆ వ్యక్తికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశాడు. మానసికంగా కుంగిపోయిన ఆమె ‘లవ్ బ్రెయిన్’ బారిన పడి ఆస్పత్రిలో చేరింది. లవ్ బ్రెయిన్(Love Brain).. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది.గ్జియాయూ(18) కాలేజీ స్టూడెంట్.గతకొంతకాలంగా తన ప్రియుడి మీదే ఆమె ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎప్పుడూ తనతో కాంటాక్ట్లో ఉండాలని, ఆ యువకుడు తాను ఎప్పుడు.. ఎక్కడ ఉంటున్నాడనే విషయం చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకరోజు వందకిపైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. దీంతో.. ఆమె అతనికి పలు సందేశాలు పంపింది. అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురి చేసింది. చివరకు.. ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు లవ్ బ్రెయిన్ సోకిందని వైద్యులు నిర్ధారించుకున్నారు. ఎవరికి సోకుతుందంటే..ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్లో ఉన్నవాళ్లు ఈ లవ్బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రేమలో అవతలి వాళ్లు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు.. వాళ్ల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణం. ఆ ఆలోచించడంలోనూ ఒకస్థాయి దాటి పోతుంటారు దీని బారిన పడ్డవాళ్లు. ఇది బార్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని.. చివరకు బైపోలార్ డిజార్డర్ బారినపడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కారణాలు.. లవ్ బ్రెయిన్ ఎక్కువ కేసుల ఆధారంగా.. తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు.. చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు.. ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావొచ్చని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా.. భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతులతో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం.. అందునా అతిప్రేమ కూడా ఒక రోగమనేది దీంతో తేలిపోయిందన్నమాట!. -
సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!
వేసవి అనంగానే దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతారు. ఈ కాలంలో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ కూల్డ్రింక్లు వంటిపై ఆధారపడుతుంటారు. అయితే కూల్డ్రింక్లు తాగొద్దని సూచించడంతో అందరూ..కొబ్బరి బొండాలు, చెరుకు రసాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో చెరుకు రసానికి మించిన పానీయం లేదని చెప్పొచ్చు. ఇది తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. పైగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అందరికీ ఇది మంచిదేనా? కాదా సవివరంగా తెలుసుకుందామా!. నోరూరించే తియ్యటి చెరుకు రసాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి చెరుకురసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! ఎన్ని లాభలంటే.. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది. చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్ ఫైబర్ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. వీళ్లు అస్సలు తాగొద్దు.. అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్ని చోట్ల చెరకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు. అలాగే ఒక్కోసారి ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్కి గేదెలను ఉపయోగిస్తారట!) -
కేరళలో పెరుగుతున్న గవదబిళ్లల కేసులు! ఎందువల్ల వస్తుందంటే..
కేరళలో గవద బిళ్లల కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏకంగా ఒక్క రోజులోనే దాదాపు 190 కేసులు నమోదయ్యాయి. దీంతో నేషనల్సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. గత నెలలో దాదాపు 2,500 కేసులు దాక నమోదయ్యినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాల రాష్ట్రాల పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గవద బిళ్లలు ఎందుకొస్తాయి? నివారణ ఏంటీ? తెలుసుకుందామా!. ఈ గవద బిళ్లలు ముఖ్యంగా పిల్లలు, యువకులను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రుబులవైరస్ కుటుంబానికి చెందిన పారామిక్సోవైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్కి మానవులు మాత్రమే అతిధేయులు. ఇది బాధితుడి నోటి నుంచి వచ్చే నీటి తుంపరల ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, లేదా మాట్లాడేటప్పుడు నోటి తుంపరల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కారణంగా చెవులు చుట్టూ ఉన్న రెండు ప్రాంతాల్లో బాధకరమైన వాపుతో కూడిన జ్వరం వస్తుంది. లక్షణాలు.. గవదబిళ్లలు వచ్చినప్పుడు పిల్లల లాలాజల గ్రంథులు వాస్తాయి. ఒక్కోసారి రెండు వైపులా దవడలు వాపుకు గురవుతాయి దీనివల్ల ఏమీ తినలేరు తాగలేరు. ఇది వారి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది దీంతోపాటు జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తాయి. ఒక్కోసారి పొత్తికడుపు నొప్పి కూడా ఉంటుంది. ఇలా ఏడు నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. సాధారణంగా ఈ గవదబిళ్లలు తేలికపాటివి, దానంతట అవే వెళ్లిపోతాయి. ఒక్కోసారి యువకులలో ఎన్సెఫాలిటిస్, చెవుడు లేదా ఆర్కిటిస్ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. నివారణ.. డీ హైడ్రేట్ అవ్వకుండా ద్రవాల రూపంలో ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు ఆహారం మెత్తగా తీసుకోవాలి. తగినంత బెడ్ రెస్ట్ తీసుకోవడం. వాపును తగ్గించడానికి స్క్రోటల్ సపోర్ట్, ఐస్ ప్యాక్లను ఉపయోగించాలి అలాగే వృషణాల వాపుతో కూడిన సందర్భాల్లో వాపును తగ్గించడానికి పరోటిడ్ గ్రంధులపై కోల్డ్ కంప్రెస్లను ఉపయోగించడం వంటివి చేయాలి. నొప్పి, వాపును తగ్గేందుకు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్ తీసుకోవాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే స్టెరాయిడ్స్ వాడకాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. గవదబిళ్ళకు చికిత్స.. ప్రస్తుతం, గవదబిళ్ళకు నిర్దిష్ట చికిత్స లేదు. చాలా చికిత్సా ఎంపికలు ద్రవాలు ఎక్కువగా తాగడం, కోల్డ్ కంప్రెస్ చేయడం, సులభంగా జీర్ణమయ్యే మెత్తని ఆహారాలు తీసుకోవడం. ఉప్పు నీటితో పుక్కిలించడం వంటి లక్షణాల నుండి ఉపశమనం పొందుతారు. ఇక దీని బారిన గర్భిణీ స్త్రీలు పడితే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. (చదవండి: ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు..ఆ ఇద్దరు మహిళలు!) -
కేరళలో ‘గవదబిళ్లలు’ వ్యాప్తి.. ఒక్క రోజులో 190 కేసులు!
కేరళలో ‘గవదబిళ్లలు’(మంప్స్) వ్యాధి బారినపడిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 190 కేసులు బయటపడడంతో వైద్యశాఖలో ఆందోళన నెలకొంది. మార్చి నెలలోనే 2,505 గవదబిళ్లల కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వ్యాధి విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత రెండు నెలల్లో మొత్తం 11,467 గవదబిళ్లలు కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి నేరుగా బాధితుని రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధిని ‘చిప్మంక్ చీక్స్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి బారినపడనప్పుడు జ్వరం, తలనొప్పి, అలసట, శరీర నొప్పి, లాలాజల గ్రంధులలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుని బుగ్గలు వాచినట్లు కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ వ్యాధి లక్షణాలు బాధితునిలో రెండు మూడు వారాల తర్వాత కనిపిస్తాయి. పారామిక్సోవైరస్ అనే వైరస్ కారణంగా ‘గవదబిళ్లలు’ వ్యాప్తి చెందుతుంది. ఇది బాధితుని నోటి నుంచి వెలువడే నీటి బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ‘గవదబిళ్ల’ బారిన పడినవారికి మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులను అధికంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి చికిత్స కొద్ది రోజుల పాటు కొనసాగుతుంది. యాంటీబయాటిక్స్తో ఈ వ్యాధి త్వరగా నయం కాదు. ‘గవదబిళ్ల’ బారినపడినవారు ఆమ్ల ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. -
చలికాలంలో సీఓపీడీని అశ్రద్ధ చేస్తే ఊపిరి తీస్తుంది
గుంటూరు మెడికల్: మోహన్ ప్రతిరోజూ సిగిరెట్లు కాలుస్తాడు. మూడు నెలలుగా దగ్గు వస్తున్నా పట్టించుకోకుండా వదిలివేశాడు. స్మోకింగ్ మానేయాలని వైద్యులు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. చలికాలం ప్రారంభం కావడంతో ఇటీవల ఓ రాత్రివేళలో శ్వాసతీసుకోవటం ఇబ్బందిగా ఉండి నిద్రకూడ పట్టకపోవటంతో అర్థరాత్రి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వైద్యులు శ్వాసకోస నాళాలకు సోకే సీఓపీడీ వ్యాధి సోకినట్లు చెప్పి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఎందరో ఈ వ్యాధి సోకినా తెలియక ప్రాణాపాయ స్థితివరకు ఇళ్ల వద్ద ఉంటూ చివరి సమయంలో పరుగులు తీస్తున్నారు. 2019లో 3.23 మిలియన్ల మంది ప్రపంచ వ్యాప్తంగా సీఓపీడీతో మృతిచెందారు. మనదేశంలో ప్రతిఏడాది 2,300 మంది చనిపోతున్నారు. సీఓపీడీ అంటే... క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్( సీఓపీడీ). ఊపిరితిత్తులకు వచ్చే ఒక రకమైన వ్యాధి ఇది. వ్యాధి సోకినవారికి గాలి గొట్టాలు ఇన్ఫెక్షన్కు గురై కొన్ని సార్లు మూసుకుపోయి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. ఆయాసం, దగ్గు, కళ్లెపడటం, ఛాతీలో బరువుగా ఉండటం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, గుండెదడ, కాళ్లు వాయటం, పిల్లికూతలు, బరువు తగ్గటం, కొద్దిగా జలుబు చేయగానే ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎక్సరే, స్పైరో మెట్రో లేదా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ద్వారా వ్యాధిని నిర్ధారణ చేస్తారు. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది... ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువ వస్తుంది. పొగతాగేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగకపోయినా పొగతాగేవారి పక్కన ఉండి పొగ పీల్చటం వల్ల కూడా వ్యాధి వస్తుంది. గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, కట్టెల పొయ్యి, పిడకల పొయ్యి వినియోగించేవారికి, బొగ్గు గనుల్లో, సిమెంట్ ఫ్యాక్టరీల్లో, వస్త్ర పరిశ్రమల్లో పనిచేసేవారికి, ధుమ్ము, ధూళితో కూడుకున్న ప్రదేశాల్లో, పరిశ్రమల్లో పనిచేసేవారికి వ్యాధి సోకుతుంది. ఉబ్బసం( ఆస్తమా), అలర్జీ ఉన్నవారు జబ్బు నయం అయ్యేందుకు వైద్యం చేయించుకోకపోతే సీఓపీడీ రావచ్చు. జిల్లాలో వ్యాధి బాధితులు... జిల్లాలో 50 మంది పల్మనాలజిస్టులు (ఊపిరితిత్తుల స్పెషాలిటీ వైద్య నిపుణులు) ఉన్నారు. ప్రతిరోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఇరువురు లేదా, ముగ్గురు బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిక వ్యాధుల హాస్పటల్లో ప్రతిరోజూ పది మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. -
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?
వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే.. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి. లక్షణాలు.. సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చికిత్స.. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు. (చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?) -
నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?
నిమోనియా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే శ్వాససమస్య. అనేక రకాల ఇన్ఫెక్షన్లు నిమోనియాకు దారితీస్తాయి. ఇలా సెకండరీ ఇన్ఫెక్షన్స్తో వచ్చే నిమోనియా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... నివారణ ఇలా... కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం అనే ఓవర్ క్రౌడింగ్ పరిస్థితికి దూరంగా ఉండాలి. గుంపుల్లోకి వెళ్లకూడదు. ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. పొగవాతావరణానికి ఎక్స్పొజ్ కాకుండా చూసుకోవాలి. అలాగే పొగతాగే అలవాటును తక్షణం మానేయాలి. ఆల్కహాల్ అలవాటుకూ దూరంగా ఉండాలి. మద్యం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అంతేకాదు... మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో ఊపిరితిత్తుల్లో ఉన్న మనకు సరిపడని పదార్థాలు అక్కడే ఉండిపోవడం వల్ల కూడా నిమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. ∙క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా మాత్రమే కాకుండా ఇతర ఇన్ఫెక్షన్లూ నివారితమవుతాయి. చిన్నపిల్లలకు, పెద్దవయసు వారికి నిమోనియాను నివారించే వ్యాక్సిన్ ఇవ్వడం మంచిది. -
ఎయిడ్స్ విధ్వంసాన్ని నివారిద్దాం!
మానవ చరిత్రలో ఎయిడ్స్ వ్యాధి సృష్టించిన విధ్వంసం, బీభత్సం, విషాదాలతో ఏ ఒక్క ఇతర అంశాన్నీ సరిపోల్చలేము. 1981 జూన్లో బయటపడిన ఎయిడ్స్ అత్యధిక కాలంగా కొనసాగుతున్న ప్రపంచ పీడ. 42 ఏళ్ల కాలంలో ఎనిమిది కోట్ల 56 లక్షల మంది ఎయిడ్స్ జబ్బుకు దారి తీసే హెచ్ఐవీ క్రిమి బారిన పడ్డారు. ఇప్పటికే నాలుగు కోట్ల నాలుగు లక్షల మంది ఎయిడ్స్ జబ్బుతో మరణించారు. చాలా ప్రపంచ పీడలు పరిమిత కాలంలోనే కల్లోలాన్ని సృష్టించి పోతుంటాయి. కానీ ఎయిడ్స్ జీవితకాలపు సాంక్రమిక జబ్బు. అందువల్ల హెచ్ఐవీ సోకిన వారు, వారి కుటుంబాలు నిరంతర చికిత్సతో, అప్పుడ ప్పుడు తలెత్తే అనారోగ్యాలతో ఆర్థికంగా కష్టాల పాలవుతుంటారు. సకాలంలో తగిన చికిత్స అందనిచో వారి కథ విషాదాంతమవు తుంది. ఎయిడ్స్ జబ్బుకి కారణమైన హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా లైంగికంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని సాంక్రమిక వ్యాధుల వలెనే... హెచ్ఐవీ వ్యాప్తికి అవగాహన లేమి, పేదరికం, ఆరోగ్య వైద్య సదుపాయాల కొరత, చదువు లేకపోవడం ముఖ్యమైన కారణాలు. ఈ పరిస్థి తులు నెలకొని ఉన్న ఆఫ్రికా, ఆసియా దేశా లలో హెచ్ఐవీ ప్రబలంగా వ్యాపించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 90 లక్షల మంది ఎయిడ్స్తో బాధపడు తున్నారు. వీరిలో 15 లక్షల మంది 15 సంవత్సరాల లోపువారే. ప్రపంచవ్యాప్తంగా 2022లో ఆరు లక్షల 30 వేల మంది ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. 17 లక్షల మంది కొత్తగా హెచ్ఐవీ బారిన పడ్డారు. భారతదేశంలో అందుబాటులో ఉన్న 2019 వివరాల మేరకు 23 లక్షల 49 వేల మంది హెచ్ఐవీ సంక్రమించిన వారున్నారు. వీరిలో పది లక్షల మంది మహిళలు. అదే ఏడాది దేశంలో దాదా పుగా 60 వేలమంది ఎయిడ్స్తో మరణించారు. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 5 లక్షల మంది హెచ్ఐవీ బాధితులున్నారని అంచనా. సహారా ఎడారికి దిగువన ఉన్న దక్షిణాది ఆఫ్రికాలోని బోట్స్వానా, ఉగాండా,జింబాబ్వే, జైరి, స్వాజిలాండ్, ఇథియోపియా, కాంగో, మలావి వంటి దేశాలలో హెచ్ఐవీ బయటపడిన మొదటి దశకంలో 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసు వారిలో 40 శాతం మంది వరకూ హెచ్ఐవీ బారిన పడ్డారు. వారు అనారోగ్యంతో ఫ్యాక్టరీలకు, పనులకు వెళ్లలేక పోవడంతో ఆ యా దేశాలలోని ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. వైద్యశాస్త్రంలో అనేక కొత్త విధానాలకు హెచ్ఐవీ / ఎయిడ్స్ దారులు చూపింది. ఒక జబ్బు కోసం పరిశోధన చేసి రూపొందించిన మందును వేరే జబ్బుకు వాడే ప్రక్రియ (రీపర్పసింగ్ డ్రగ్)ను మొదట హెచ్ఐవీ చికి త్సలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జిడోవుడిన్గా పిలుస్తున్న అజిడోథైమిడిన్ మందును క్యాన్సర్ చికిత్స కోసం రూపొందించారు. కాగా జిడోవుడిన్ ఔషధం హెచ్ఐవీ వృద్ధిలో పాత్ర ఉన్న ఒక ఎంజైము పనిని అడ్డుకొని, దాని వృద్ధిని నిరోధిస్తుంది. అందువల్ల అజిడోథైమిడిన్ని హెచ్ఐవీ పీడ ప్రారంభమైన ఐదు సంవత్సరాల తర్వాత, 1987 మార్చిలో హెచ్ఐవీ చికిత్సకు మొదటి ఫలవంతమైన చికిత్సగా ప్రవేశపెట్టారు. హెచ్ఐవీ చికిత్సలో వాడే కొన్ని మందులను ఈ క్రిమి సోకే అవకాశం ఉన్న వారికి ముందుగానే ఇవ్వడం మూలంగా సంక్ర మణను అడ్డుకునే విధానాన్ని నిపుణులు రూపొందించారు. దీనినే ‘ప్రీఎక్స్పోజర్ ప్రొఫై లాక్సిస్’ అంటారు. ఇది హెచ్ఐవీకే పరిమిత మైన కొత్త నిరోధక విధానం. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ఐవీ–ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో హెచ్ఐవీ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగాము. ఎయిడ్స్ జబ్బుకి దారి తీసే హెచ్ఐవీ క్రిమి ప్రధానంగా ఆ క్రిమి సోకిన వారితో లైంగిక చర్యలో పాల్గొన్నందు వల్లనే వ్యాప్తి చెందుతుంది. హెచ్ఐవీ బాధితురాలు అయిన తల్లి నుండి గర్భస్థ శిశువుకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్థులు, ఎయిడ్స్ వల్ల తమ వారిని కోల్పోయిన బాధితులు, హెచ్ఐవీకి గురయ్యే ప్రమాదం ఉన్నవారు– ఈ సమూహాలకు చెందినవారు ఎయిడ్స్పై అవగాహన కల్పించ డానికి ముందుండాలని ‘యూఎన్ ఎయిడ్స్’ పిలుపునిచ్చింది. డాక్టర్ యనమదల మురళీకృష్ణ వ్యాసకర్త సాంక్రమిక వ్యాధుల నిపుణులు మొబైల్: 94406 77734 (నేడు ప్రపంచ ఎయిడ్స్ డే) -
‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే?
కొన్ని వ్యాధులు ప్రధానంగా చర్మం, ఎముకలు, కీళ్లు, కండరాల వంటి వాటి చుట్టూ ఉండే కొలాజెన్ అనే మృదు కణజాలాన్ని ప్రభావితం చేస్తాయి. ఇలా వాటిని ఏకకాలంలో ప్రభావితం చేసే రకరకాల వ్యాధుల సమాహారాన్ని కలిపి ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్’గా చెబుతారు. వీటిల్లో జోగ్రన్స్ డిసీజ్, సిస్టమిక్ స్మ్లికరోసిస్, మిక్స్డ్ కనెక్టివ్ టిష్యూ డిసీజ్తో పాటు వెజెనెర్స్, పాలీకాండ్రయిటిస్, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి జబ్బులు ఉంటాయి. ఇవి తమ ఆటో యాంటీబాడీస్ కారణంగా ఎముకలనూ, మృదులాస్థిని దెబ్బతీస్తాయి. పురుషులతో పోలిస్తే ఇవి మహిళల్లోనే ఎక్కువ. ఈ కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్ లక్షణాలూ, ఇవి చేసే హానీ, వీటికి చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్లో ప్రధానమైనది లూపస్ అని పిలిచే వ్యాధి. లూపస్ అంటే తోడేలు అని అర్థం. ముక్కుకు ఇరువైపులా మచ్చతో చూడగానే తోడేలులా కనిపించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని లూపస్ అంటారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చిన్న కీళ్లపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు... లూపస్లో కనిపించే ఈ (మాలార్) ర్యాష్ సూర్యకాంతి పడ్డప్పుడు మరింత పెరగవచ్చు. కొందరిలో వెంట్రుకమూలాలు మూసుకుపోతాయి. లూపస్లో ఇది ఒక రకం. దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా కూడా ర్యాష్ రావచ్చు. తరచూ జ్వరం వస్తుంటుంది. బరువు తగ్గుతుంది. కొందరిలో జుట్టు రాలిపోవచ్చు. మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. కొందరిలో డిప్రెషన్ కనిపించి ఉద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో దీన్ని ఓ మానసికమైన లేదా నరాలకు సంబంధించినది సమస్యగా పొరబాటు పడేందుకు ఆస్కారం ఉంది. అయితే డిప్రెషన్ తాలూకు లక్షణాలు కనిపించినప్పుడు ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి... మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమో తెలుసుకోవాలి. కొందరిలో ఫిట్స్ రావచ్చు. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు మిగతా వాస్క్యులార్ జబ్బుల లక్షణాలు ఇలా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లను ప్రభావితం చేసి, వైకల్యానికి దారితీయవచ్చు. అప్పుడు సర్జరీతో మినహా దాన్ని చక్కదిద్దడం సాధ్యం కాకపోవచ్చు. అరుదుగా కొందరిలో కళ్లలో రక్తపోటు పెరగడంతో గ్లకోమాకు దారితీయడం, కన్ను పొడిబారడం, రెటీనాకూ, తెల్లగుడ్డులోని స్కెర్లా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం, కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం వంటి సమస్యలు రావచ్చు. పిల్లల్లోనూ... కొలాజెస్ వాస్క్యులార్ డిసీజ్లోని లూపస్ పిల్లల్లోనూ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అంటారు. చికిత్స... ప్రధానమైన సమస్యలైన ఎస్ఎల్ఈ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి రుమటాలజిస్టుల ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్లు ఈ సందర్భంగా జబ్బును అదుపు చేసే మందులతో పాటు అవసరాన్ని బట్టి ప్రెడ్నిసలోన్ వంటి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి చికిత్స చేస్తుంటారు. ఇది చాలా జాగ్రత్తగా అందించాల్సిన చికిత్స. --డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, సీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..) -
భారత్లో.. ఈ నాలుగు అరుదైన వ్యాధులకు అయ్యే ట్రీట్మెంట్ ఖర్చు భారీగా తగ్గనుంది
భారత్ ఔషదాల తయారీలో అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వ సంస్థల సహాయంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాదిలోనే నాలుగు అరుదైన వ్యాధులకు మందులను తయారు చేశారు. తద్వారా ఆ అరుదైన వ్యాధ్యులను నయం చేయించుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపూ 100 రెట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు టైరోసినిమియా టైప్ 1 చికిత్సకు ఏడాదికి అయ్యే ఖర్చు అక్షరాల రూ.2.2 కోట్ల నుండి రూ.6.5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఖర్చు రూ. 2.5 లక్షలకు చేరింది. ఒకవేళ ఈ అనారోగ్య సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే 10 సంవత్సరాల వయస్సులోపు పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తారు. మూడు ఇతర అరుదైన వ్యాధుల్లో..గౌచర్స్ వ్యాధి. ఈ అనారోగ్య సమస్య తలెత్తితే రక్తాన్ని ఆరోగ్యంగా ఉండటానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే ప్లీహము పరిమాణం పెరిగేలా చేస్తుంది. దీంతో ప్లేట్లెట్స్ పడిపోవడంతో పాటు ఇతర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విల్సన్స్ వ్యాధి శరీరంలోని ఎర్ర రక్త కణాలు, నరాల కణాలను నిర్మించడంలో, రోగనిరోధక వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే రాగి తగ్గుతుంది. మెదడు పని తీరును ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్.. దీని వల్ల బాధితులు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఖర్చులు కోట్ల నుంచి లక్షల్లోకి ఇప్పుడీ ప్రమాదకరమైన ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్తో గౌచర్స్ వ్యాధికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ. 1.8-3.6 కోట్ల నుండి రూ. 3.6 లక్షలకు, విల్సన్స్ వ్యాధికి వినియోగించే ట్రియంటైన్ క్యాప్సూల్స్తో సంవత్సరానికి రూ.2.2 కోట్ల నుండి రూ. 2.2 లక్షలకు, డ్రావెట్కు కన్నబిడియోల్ (Cannabidiol) అనే సిరప్ ఖరీదు రూ. 7లక్షల నుంచి రూ. 34 లక్షల వరకు అయ్యే సిరప్ రూ.1లక్షల నుంచి 5 లక్షల లోపు వరకు లభ్యమవుతుంది. 10 కోట్ల మందికిపైగా అరుదైన వ్యాధులు మన దేశంలో.. అంచనా ప్రకారం.. 8.4 కోట్ల నుంచి 10 కోట్ల మంది అరుదైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవి కాగా.. చిన్న వయస్సులోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి. జన్ ఔషద కేంద్రాల్లో మెడిసన్ ఏడాది క్రితం బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలైన జెనారా ఫార్మా, లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లు 13 రకాల అరుదైన వ్యాధుల నివారణకై మెడిసిన్ను తయారు చేయడం ప్రారంభించాయి. నాలుగు వ్యాధులకు సంబంధించిన మందులు అభివృద్ధి చేశామని, మిగతా వాటికి సంబంధించిన మందులు త్వరలో అందజేస్తామని, జన్ ఔషధి కేంద్రాలకు కూడా మందులను అందజేసే యోచనలో ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫెనిల్కెటోనూరియా, హైపెరమ్మోనిమియా వ్యాధులకు ఇప్పటికే చౌకైన మందులు తయారు చేశారు. స్పైనల్ మస్కులర్ అట్రోఫీకి గురైన బాధితులు కండరాల కదలికను నియంత్రిస్తుంది. ముఖ్యంగా వెన్నుపూసలో ఉండే ఈ కణాల్ని తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీంతో ఈ వ్యాధికి గురైన బాధితులు ఏ పని చేసుకోలేరు. దీన్ని నయం చేసేందుకు వినియోగించే ఇంజక్షన్ ఖరీదు అక్షరాల రూ.16 కోట్లు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ ఖర్చును తగ్గించే పనిలో ఉన్నాయి భారత ప్రభుత్వం, ఫార్మా సంస్థలు పనిచేస్తున్నాయి. -
ధూమపానంతో క్యాన్సర్ గాక ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు. కానీ ధూమపానంతో క్యాన్సర్ తో పాటూ ఎన్నో ఆరోగ్య సమస్యలు లింక్ అయ్యి ఉన్నాయో తెలుసా. ఒకరకరంగా చెప్పాలంటే సిగరెట్ కాల్చడం లేదు మన ఆరోగ్యానన్ని మనమే చేజేతులారా తగలెట్టుసుకుంటున్నాం అన్నాలి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు నవీన్ నడిమింటి. దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటో ఆయన మాటల్లో చూద్దామా! ఊపిరితిత్తుల వ్యాధులు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, క్షయ, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి (COPD), బ్రోన్కైటిస్ తోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల వ్యాధులకు ప్రధాన కారణం. 1. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఇది ఊపిరితిత్తుల కణజాలంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2. క్షయ: ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ధూమపానం చేసేవారిలో క్షయ వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3.-COPD అనేది ఊపిరితిత్తుల యొక్క పరిమిత గాలి ప్రవాహం వల్ల వచ్చే ఒక సమూహం. ఇందులో బ్రోన్కైటిస్ మరియు ఎంఫిసెమా ఉన్నాయి. ధూమపానం COPDకి ప్రధాన కారణం. ధూమపానం చేసేవారిలో COPD వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారి కంటే 20-30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 3. బ్రోన్కైటిస్: బ్రోన్కైటిస్ అనేది ఊపిరితిత్తుల శ్వాస గొట్టాల వాపు. ఇది తీవ్రమైన లేదా దీర్ఘకాలికంగా ఉండవచ్చు. తీవ్రమైన బ్రోన్కైటిస్ సాధారణంగా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ COPD యొక్క ఒక రకం. ధూమపానం తీవ్రమైన మరియు దీర్ఘకాలిక బ్రోన్కైటిస్కు ప్రధాన కారణం. గుండె జబ్బులు ధూమపానం గుండెపోటు, స్ట్రోక్ తోపాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 1.-గుండెపోటు: ఇది గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని 3 రెట్లు పెంచుతుంది. 2. స్ట్రోక్ ఇది మెదడుకు రక్త సరఫరా తగ్గినప్పుడు వచ్చే అత్యవసర పరిస్థితి. ధూమపానం స్ట్రోక్ ప్రమాదాన్ని 2 రెట్లు పెంచుతుంది. 3. ధూమపానం కొరోనరీ ఆర్టరీ వ్యాధి గుండె వైఫల్యం, గుండె సంబంధిత క్యాన్సర్ వంటి ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇతర క్యాన్సర్లు ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు మూత్రపిండ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మరియు ప్యాంక్రియాస్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. 1. మూత్రపిండాల క్యాన్సర్ ఇది మూత్రపిండాలలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం మూత్రపిండ క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 2. నోటి క్యాన్సర్ నోటిలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 3. గొంతు క్యాన్సర్: గొంతు క్యాన్సర్ అనేది గొంతులో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని 2-3 రెట్లు పెంచుతుంది. 4. గ్యాస్ట్రిక్ క్యాన్సర్: గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది జీర్ణశయాంతరంలో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. 5. 5. 5. ప్యాంక్రియాస్ క్యాన్సర్: ప్యాంక్రియాస్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాస్లో కణాల అసాధారణ పెరుగుదల. ధూమపానం ప్యాంక్రియాస్ క్యాన్సర్ ప్రమాదాన్ని 1.5-2 రెట్లు పెంచుతుంది. ధూమపానం దంతాల ఆరోగ్యానికి హానికరం ధూమపానం దంతాల క్షయం, పళ్ళ మధ్య రంధ్రాలు, దంతాల పసుపు వంటి దంత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నోటిలో ఆమ్లాల స్థాయిలను పెంచుతుంది అలాగే దంతాల క్షయానికి దారితీస్తుంది. దంతాల ఎనామెల్ను దెబ్బతీస్తుంది, ఇది పళ్ళ మధ్య రంధ్రాలకు దారితీస్తుంది. దంతాలపై పసుపు మచ్చలను ఏర్పరుస్తుంది. నోటిలో రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది నోటి పుండ్లకు దారితీస్తుంది. దంతాలను బలహీనపరుస్తుంది, ఇది దంతాల నష్టానికి దారితీస్తుంది. ఇలా క్యాన్సర్ మాత్రమె కాకుండా ధూమపానం ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీయగలదు.అందుకని వీలైనంత తొందరగా మానేయటం ఉత్తమం. -ఆయుర్వేద వైద్యులు, నవీన్ నడిమింటి (చదవండి: మీ ఆహారంలో ఇవి చేర్చితే మధుమేహం దరిదాపుల్లోకి రాదు!) -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
క్రయోథెరపీ!
హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించారు కూడా. ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు ఆమె పలు రకాల వైద్య చికిత్సా పద్ధతులు అనుసరిస్తున్నారు. వైద్య చికిత్సలో భాగంగా తాజాగా క్రయోథెరపీ చేయించుకుంటున్నారామె. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సమంత. క్రయోథెరపీలో భాగంగా గడ్డ కట్టేంత చల్లని నీటి టబ్లో మెడ భాగం వరకూ మునిగి ఉన్నారు సమంత. ‘‘క్రయోథెరపీ వల్ల వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య బాగా పెరగడంతో పాటు రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ థెరపీ శరీరానికి సరికొత్త శక్తిని ఇవ్వడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. రాజ్ –డీకే ద్వయం తెరకెక్కించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. -
వ్యాయామం తక్కువుగా చేసినా చాలు! పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
చాలమంది వర్క్ఔట్లు ఎక్కువగా చేస్తుంటారు. త్వరితగతిన బరువు తగ్గాలని లేదా మంచి ఫలితాలు కనిపించాలంటే ఆ మాత్రం వర్క్ఔట్లు ఉండాలని అనుకుంటారు. అందుకోసం అని వాకింగ్లు కొన్ని రకాల వ్యాయమాలు తెగ చేసేస్తుంటారు. ఐతే తాజా పరిశోధనలో అందుకు భిన్నంగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు కూడా మితంగా వ్యాయామం చేస్తే చాలని తేల్చి చెప్పారు. మొన్నటి వరకు పదివేల అడుగులు వేస్తే బరువు తగ్గుతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అన్ని అడుగులు అవసరం లేదని అధ్యయనంలో వెల్లడైందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తక్కువ వ్యాయామంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్పెట్టగలమా? పరిశోధనల్లో ఏం వెల్లడైంది తదితరాల గురించే ఈ కథనం!. స్పెయిన్లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ప్రకారం..తక్కువ వ్యాయామంతోనే మంచి రిజల్ట్స్ని పొందొచ్చని ప్రభావంతంగా కూడా ఉంటుందని పరిశోధనలో తేలింది. వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం దాదాపు 60% తగ్గుతుందని కూడా వెల్లడైంది. ఈ మేరకు ఈ విషయాలను అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. అందుకోసం సుమారు లక్ష మందికి పైగా వ్యక్తులపై పరిశోధనలు చేసినట్లు పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా పదివేల అడుగులు అవసరమని చెబతుంటారు. ఐతే అన్ని అడుగులు అవసరం లేదంటున్నారు. కేవలం రెండు కిలోమీటర్లు అనగా దాదాపు 2,700 అడుగులు చాలు వివిధ గుండె సంబంధిత సమ్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఎక్కువగా నడిచే వారిలో చాలా మంచి ప్రయోజనాలు కూడా కనిపించాయి. కానీ కొందరు ఎక్కువగా నడిస్తేనే మంచిదని భావించి బలవంతంగా చేస్తుంటారు. కానీ అదంతా అవసరం లేదంటున్నారు. రోజుకు రెండు కిలోమీటర్లు నడవండి, మంచి తృణ ధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి చాలు చాలా రుగ్మతలు నుంచి సులభంగా బయటపడతారని అంటున్నారు. అలాగే మగవాళ్లకు, ఆడవాళ్లకు వ్యాయామం ఎంత చేయాలనే వ్యత్యాసం ఏం ఉండదని పరిశోధనలో తేలిందన్నారు. తక్కువగా చేసిన మంచి ఫలితాలు ఉంటాయని భయపడాల్సి అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అదే టైంలో ఎక్కువగా చేసేవారికి ఆరోగ్య మరింత మెరుగ్గా ఉండటమేగాక మరిన్ని ప్రయోజనాలు ఉండటాన్ని గుర్తించాం అని చెప్పారు. ఐతే ఈ పదివేల అడుగులు నడవడం అనేది జపాన్ నుంచి వచ్చింది టోక్యో ఒలంపిక్స్ నేపథ్యంలో వచ్చిందని. ఆటగాళ్లు మెరుగ్గా ఆడేలా ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి సారించేందుకు జపాన్ ఇలా పదివేల అడుగుల లక్ష్యాన్ని నిర్దేశించిందని పేర్కొన్నారు. సైన్సు పరంగా అది ఎక్కడ ఫ్రూవ్ కాలేదన్నారు. ఈ నెంబర్ ఫిగర్ అందరు గుర్తుంచుకునేందుకు సులభంగా ఉంటుందని ఇలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. అందువల్ల ప్రతీరోజూ తక్కువ వ్యాయామం, సుమారు రెండు కిలోమీటలర్లు నడకతో కూడా పూర్తి ఫిట్నెస్గా ఉండగలమని నొక్కి చెబుతున్నారు. దీంతోపాటు వేళకు తినడం, కంటి నిండ నిద్రపోవడం వంటివి చేస్తే జీర్ణ వ్యవస్థ బాగొంటుంది. తద్వారా ఇతరత్ర సమస్యలు ఉత్ఫన్నం కావు అని చెబుతున్నారు పరిశోధకులు. (చదవండి: 'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మెదడుపై డెంగీ దాడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ప్రజలు ఓవైపు సీజనల్ జ్వరాలతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా మరోవైపు డెంగీ వ్యాధిలో తీవ్రమైన, అరుదైన రకానికి చెందిన డెంగీ ఎన్సెఫలైటిస్ వ్యాధి (రోగి మెదడును దెబ్బతీయడం ఈ వ్యాధికారక వైరస్ లక్షణం) బారినపడి ఏకంగా ఒక పీజీ వైద్య విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది. నగరంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో 3వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతున్న డాక్టర్ గోపికి ఈ నెల 24న డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని జీడిమెట్లలోని మల్లారెడ్డి నారాయణ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్లోని ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ శనివారం పరిస్థితి విషమించడంతో డాక్టర్ గోపి మృతి చెందారు. వెయ్యి మందిలో ఒక్కరిలోనే... డెంగీ ఎన్సెఫలైటిస్ బారినపడ్డ రోగులు కోలుకొనే అవకాశాలు అత్యంత తక్కువని వైద్యులు అంటున్నారు. సాధారణ డెంగీ సోకిన ప్రతి 1,000 మంది రోగుల్లో కేవలం ఒక్కరిలోనే డెంగీ వైరస్ మెదడు దాకా విస్తరించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ వైరస్తో బ్రెయిన్లోని ప్రధాన భాగాలు వాచిపోతాయి. దీంతో రోగులు బ్రతికే అవకాశాలు దాదాపుగా శూన్యం’అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తెలంగాణ) సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల చెప్పారు. వైద్యుల్లో ఆందోళన..: నగరంలో సీజనల్గా ప్రభావం చూపే డెంగీ వ్యాధి ఈ ఏడాది ఆలస్యంగా ప్రతాపం చూపడం ప్రారంభించింది. ప్రస్తుతం నగరవ్యాప్తంగా దీంతోపాటు పలు రకాల ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస వ్యాధులు నగరవాసుల్ని ఆసుపత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపుగా ప్రతి ఆసుపత్రిలోనూ వైరల్ ఫీవర్ సంబంధిత కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏకంగా ఒక వైద్య విద్యార్ధి సైతం డెంగీ ఎన్సెఫలైటిస్తో మృతి చెందడం నగరంలోని వైద్యుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది తొలి కేసు కాదని, ఇప్పటికే కనీసం అరడజను మంది వైద్యులు డెంగీబారిన పడ్డారని వైద్య విద్యార్థులు అంటున్నారు. ‘మన ఆసుపత్రుల్లో ప్రత్యేక డెంగీ వార్డులు లేవు. అలాగే దోమ తెరలు సైతం ఉండవు. ఈ విషయంలో అనుసరించాల్సిన ప్రొటోకాల్ను ఆసుపత్రుల్లో పాటించడం లేదు’అని ఓ వైద్య విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర పరి స్థితులు దోమల విజృంభణ, డెంగీ వ్యాప్తికి అను కూలంగా ఉన్నాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అటువంటి పరిస్థితుల్లో పనిచేసే వైద్య విద్యార్థులే డెంగీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ ని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సైతం దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
నివారించలేని వింత వ్యాధి! తనను తాను గాయపరచుకునేలా..
మనుషుల వికృత ప్రవర్తనలకు తగ్గట్టుగానే వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ఇదేం వ్యాధిరా బాబు అని ముక్కుమీద వేలేసుకునేలా ఉన్నాయి వాటి పేర్లు. కోపంతో మరో మనిషిని చంపడం ఒక తరహ అయితే..అదే చికాకు కోపంతో తనను తాను చంపేసుకునేలా ప్రేరేపిస్తుంది ఈ వ్యాధి. ఆ తర్వాత ఆ వ్యక్తికి తాను చేసిందేంది గుర్తుండదట. తనపై ఎవరో దాడి చేసినట్లు లేదా ప్రమాదం జరిగినట్లు భావిస్తారట. వాస్తవం వివరించిన వారికి అదేమీ గుర్తుండదట. చూడ్డానికి టీవీల్లో చూసే చేతబడి మాదిరిగా లేదా దెయ్యంలాంటి వ్యాధిలా ఉంటుంది. ఈ వింత వ్యాధి బారినపడ్డ మహిళ స్థితి గురించే ఈ కథనం!. బ్రిటన్కి చెందని 41 ఏళ్ల షార్లెట్ హెవిట్ ఉన్నటుండి ఆస్పత్రి పాలయ్యింది. ఆమె భర్త హుటాహుటినా ఆస్పత్రికి తీసుకురావడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ టైంలో ఆమె సుమారు ఒక వారం వరకు పూర్తి కోమాలో ఉంది. పైగా తాను ఎందుకు ఆస్పత్రిలో ఉన్నానని, ఏం జరిగిందని ఎదురు ప్రశ్నించడంతో ఆమె భర్తతో సహా వైద్యులు సైతం కంగుతిన్నారు. దీంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆమెక హంటిగ్టన్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేల్చారు. ఈ వ్యాధి కారణంగా ఉన్నట్లుండి ఆమె ఒక విధమైన ఉద్వేగానికిలోనై తనను తాను హాని చేసుకునులా వింతగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇది మెదడులోని భాగాలను నెమ్మది నెమ్మదిగా పనిచేయకుండా నిలిపేసి మానిసికంగా దెబ్బతినేలా చేస్తుంది. ఒక విధంగా సైకోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ మేరకు ఆమె భర్త మాట్లాడుతూ..తన భార్య షార్లెట్ ఆరోజు సడెన్గా గదిలోపలకి వచ్చి గట్టిగా అరుస్తూ.. కత్తితో తనను తాను గట్టిగా పొడుచుకుందని చెప్పుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామానికి తనకేం పాలిపోలేదని వాపోయాడు. కానీ ఇప్పుడేమో ఆమె తనకేమైందని ప్రశ్నిస్తుంటే చాలా గందరగోళంగా ఉందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఈ అసంఘటిత చర్య కారణంగా వైద్యులు ఆమెకు మూడుసార్లు సర్జరీ చేశారు. ఆమె పొట్టలోని ప్రేగుల్లో పావు వంతు దాక డ్యామేజ్ కాకుండా కాపాడారు. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..ఈ హంటిగ్టన్స్ వ్యాధి అనేది వారసత్వంగా వచ్చే రుగ్మత. దీని వలన మెదడులోని కొన్ని భాగాల్లో నరాలు క్రమక్రమంగా విఛ్చిన్నమై పోతాయి. ఫలితంగా మెదడులోని ఇతర ప్రాంతాల్లోని కదలికలను నియంత్రించే అవయవాల పనితీరు మార్పు వచ్చి.. జ్ఞాపక శక్తిని కోల్పోవడం, నిరాశ నిస్ప్రుహలకు లోనై వికృతంగా మారిపోవడం జరుగుతుంది. ఇవే ఈ వ్యాధి ప్రదాన లక్షణాలు. ఈ వ్యాధి బారినపడ్డవారి శరీరంలో అసంకల్పిత కుదుపు లేదా చంచలమైన కదలికలు సడెన్గా వస్తాయి. షార్లెట్ తాను ఇలా 2014లో 23 ఏళ్ల వయసులో ఇలాంటి స్థితిలోనే ఉన్నాని చెప్పుకొచ్చింది. అయినప్పటకీ తాను జీవితాన్ని కొనసాగించగలిగానని, మళ్లీ ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి స్థితినే ఎదుర్కొన్నానని వాపోయింది. ఈ వ్యాధి కారణంగా కుక్కును పార్క్లో వదిలేయడం, గ్యాస్ ఆఫ్ చేయడం మరచిపోవడం తదితర ఎన్నో సంఘటనలు జరిగాయని, ఇవే తనను నిరాశలోకి నెట్టేసి తనను తాను గాయపరుచుకునేలా ప్రేరేంపించాయని వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధికి ఎలాంటి నివారణ లేదు. కానీ రోగులు మానసిక ఆరోగ్యానికి సత్వరమే చికిత్స తీసుకుంటే నయం అవుతుందని చెబుతున్నారు. ఈ వ్యాధి వస్తే తొలుత రోజు వారీ జీవితాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ క్రమేణా సాధారణ పనులను సైతం సొంతంగా చేసుకోలేని ధీనస్థితికి వచ్చేస్తారు. ఈ వ్యాధికి గల కారణం.. ఈ వ్యాధిగ్రస్తుల డీఎన్ఏ ఈ హంటింగ్టిన్స్ ప్రోటీన్ని తయారు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేయదు. ఫలితంగా అవి అసాధారణ ఆకారంలో పెరిగా మెదడులోని న్యూరాన్లను నాశనం చేస్తాయి. దీంతో శరీర కదలికలను నియంత్రించే మెదడులోని బేసల్ గాంగ్లియాలో నరాలు నాశనం అవ్వడం జరుగుతుంది. ఫలితంగా ఆలోచన, నిర్ణంయ తీసుకోవడం, జ్ఞాపకశక్తి తదితర పనులు నిర్వహించే మెదడు పనితీరుని ప్రభావితం చేసి సడెన్గామనిషిని ఓ ఉన్మాదిలా మారుస్తుంది. (చదవండి: రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!) -
అంతుచిక్కని మహమ్మారి.. శోక సంద్రంలో తల్లిదండ్రులు
హైదరాబాద్: అంతుచిక్కని వ్యాధితో పోరాడిన సందెపల్లి శివచరణ్ ఓడిపోయి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆదివారం ఇంట్లోనే ప్రాణాలు విడిచాడు. మృతుడి అన్న అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం, ముల్కలపల్లి గ్రామానికి చెందిన సందెపల్లి ఉప్పలయ్య, పారిజాత దంపతులు చాలాకాలం క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వచ్చి స్థానిక సోనియాగాందీనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి సందెపల్లి అఖిల్, సందెపల్లి శివచరణ్ ఇద్దరు కుమారులు. అయితే వీరిద్దరూ చిన్ననాటి నుంచే అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారు మస్క్యూలర్ డిస్ట్రోఫి అనే వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం వంటి లక్షణాలతో ప్రారంభమైన వ్యాధి రానురాను కదల్లేని పరిస్థితుల్లోకి తీసుకెళ్లింది. క్రమంగా చేతులు, కాళ్లు వంకరపోయి పూర్తిగా చచ్చుబడిపోవడంతో ఒకరు 12, మరొకరు 8వ ఏట నుంచి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల దుస్థితిని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. తీవ్ర జ్వరంతో శివచరణ్ మృతి ఈ క్రమంలో వారు 2017లో సాక్షిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల దుస్థితిపై ఆడి.. పాడే.. వయస్సులో అంతుచిక్కని వ్యాధి అంటూ 2017 మే నెలలో సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. సాక్షి కథనానికి స్పందించిన బీఎల్ఆర్ ట్రస్టు చైర్మన్, ప్రస్తుత బీఆర్ఎస్ ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి వారిని కలిశారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంబైలో వ్యాధికి సంబంధించి వైద్యం లభిస్తుందని, అందుకు తమకు స్థోమత లేదని బీఎల్ఆర్తో తల్లిదండ్రులు వాపోయారు. తనకున్న పరిచయాలతో అక్కడి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరి వైద్యం చేయించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారని కొంత కాలం మందులు వాడాలన్న వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూ వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర జ్వరంతో శివచరణ్ ఆదివారం మృతిచెందాడు. పెద్ద కొడుకు అఖిల్ పరిస్థితి కూడా విషమంగానే ఉందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఎల్ఆర్ వారికి ఆర్థికసాయం అందజేసి ధైర్యం చెప్పారు. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ చీఫ్ -
అలా జరిగితే.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లా?
ఇటీవల కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యే మూత్రపిండాల వ్యాధి. ఇది ఒక్కటి పాడవ్వతే మొత్తం జీవన గమనమే మారిపోతుంది. దీని విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలిస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. దీన్ని గమనించినట్లయితే సత్వరమే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని అంటున్నారు. ఏవిధమైన సంకేతాలిస్తుంది. ఆ తదుపరి కిడ్నీలు మెరుగుపడేలా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది తదితర విషయాలు ఆయన మాటట్లోనే చూద్దాం. రక్తంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని ప్రొటీనురియా అంటారు. ఈ స్థితిలో ప్రోటీన్, గణనీయమైన మొత్తంలో మూత్రం ద్వారా బయటకు పోవడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ నష్టం మూత్రపిండ దెబ్బతింటున్నాయని చెప్పేందుకు తొలి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రోగులు చూసే మొదటి లక్షణం ప్రోటీన్యూరియా. ప్రోటీన్యూరియా కారణాలు: డీహైడ్రేషన్ మీ శరీరం శరీరం నుంచి చాలా ద్రవాన్ని కోల్పోయినప్పుడు, అది నిర్జలీకరణానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రోటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు వంటి పోషకాలను మూత్రపిండాలకు అందించడానికి నీరు సహాయపడుతుంది, కానీ తగినంత నీరు లేకుండా, ఇది రక్తం యొక్క సంక్లిష్ట పనితీరును కలిగి ఉంటుంది. క్రమంగా, మూత్రపిండాలు సరిగ్గా ప్రోటీన్లను తిరిగి పొందలేవు. బదులుగా ప్రోటీన్ మూత్రంలో చేరుతుంది . అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ప్రోటీన్ నష్టానికి ప్రధాన కారణం, ఎందుకంటే పెరిగిన రక్తపోటు కారణంగా మూత్రపిండాలపై పొర ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఫలితంగా అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్లిపోవడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ మెల్లిటస్: మధుమేహం మూత్రపిండ కణం పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రం ద్వారా విపరీతమైన ప్రోటీన్ బయటకు వస్తుంది. నెఫ్రోపతీ ఐజీఐ నెఫ్రోపతిలో, ఇమ్యునోగ్లోబులిన్ శరీరంలో పేరుకుపోతుంది, మూత్రపిండాల కణజాలంలో వాపును కలిగిస్తుంది. ఇది కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. పాలిసిస్టిక్ వ్యాధులు పాలిసిస్టిక్ వ్యాధిలో, మూత్రపిండము ఉపరితలంపై తిత్తుల సర్వర్ పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఇది మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో తిత్తులు ఏర్పడటం వల్ల ప్రొటీనురియా ఏర్పడుతుంది. లక్షణాలు: బలహీనంగా మారడం ప్రొటీన్లను కోల్పోవడం రోగులను రోజురోజుకు బలహీనపరుస్తుంది. రోగులకు, వారిని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి ప్రోటీన్ కీలకం. నురుగు మూత్రం నురుగు లేదా ముదురు రంగు మూత్రం మూత్రపిండ వైఫల్యం కారణంగా పెద్ద మొత్తంలో ప్రోటీన్ బయటకు వస్తుందని చూపిస్తుంది. మీ మూత్రంలోని ప్రోటీన్ గాలితో చర్య జరిపి నురుగును సృష్టిస్తుంది. మూత్రవిసర్జనలో ఫ్రీక్వెన్సీ ప్రతి 24 గంటలకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అదికూడా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం (ఒకసారి కంటే ఎక్కువ) లేదా తరచుగా మూత్రవిసర్జన. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వికారం వాంతులు అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వాంతులు మరియు వికారం ఏర్పడవచ్చు. ఆకలి లేకపోవడం: శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల రోగులు ఆకలి లేకపోవడం అనుభూతి చెందుతారు. కళ్ల చుట్టూ ఉబ్బడం: కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా ఉదయాన్నే కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తారు. వ్యర్థ పదార్థాల సేకరణ ఈ ప్రాంతాల్లో మంటను కలిగించవచ్చు. నివారణ: ప్రోటీన్ రహిత ఆహారం కిడ్నీ రోగికి ప్రొటీనురియా ఉంటే వారి ఆహారంలో 15 నుంచి 20% ప్రోటీన్ ఉండాలి. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న రోగులు ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచించారు. మూత్రపిండ రోగులకు సిఫార్సు చేయబడిన ఏకైక ప్రోటీన్ మూంగ్ కి దాల్. ఒక కప్పు పండు ఆహారంలో ఒక కప్పు పండు (ఏదైనా) కిడ్నీకి తగినంత మొత్తం. మీ సీరం బైకార్బోనేట్ స్థాయి సగటు ఉంటే, మీరు ఏదైనా పండు తీసుకోవచ్చు. కాకపోతే, వైద్యులు తమ రోగులకు ప్రతి ఆమ్ల పండును నివారించాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించండి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు వారి అధిక రక్తపోటును ఎలాగైనా నియంత్రించాలి. ఎందుకంటే పైన చెప్పాన సాధారణ కారణాలు మీ మూత్రపిండాలను దెబ్బతీస్తే, చెప్పిన వాటిని మెరుగుపరచడం ద్వారా మీ మూత్రపిండాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయుర్వేద కిడ్నీ చికిత్సలో మొదట కారణానికి చికిత్స చేస్తారు, ఆపై వ్యాధిని దశలవారీగా నయం చేస్తారు. మధుమేహాన్ని నియంత్రించండి మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, అధిక చక్కెర స్థాయి మూత్రపిండాలకు హాని కలిగించే మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ యోగ రెగ్యులర్ యోగా శ్వాస వ్యాయామాలు మీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అధిక రక్తపోటు కణాల పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల బలహీనమైన కణాలు ఖచ్చితంగా పని చేయలేవు. బరువు తగ్గడం మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విడుదల కారణంగా, రోగి బలహీనంగా మారి బరువు తగ్గుతారు. తగినంత నీరు త్రాగాలి ప్రతి వైద్యుడికి, రోగి ఎంత నీరు త్రాగాలి అని లెక్కించడం అసాధ్యం. రోగికి రోగికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నీరు అవసరమా అని తనిఖీ చేయడానికి దేవుడు మనకు నాలుక, నోటిని సెన్సార్గా ఇచ్చాడు. కాబట్టి మీ నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడు, ఒక సిప్ నీరు తీసుకోండి ఒకేసారి చాలా నీరు తాగొద్దు. యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సినజాగ్రత్తలు: 1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్, పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించాలి. ---నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!) -
అనారోగ్యం అంటే ఏంటీ..? ప్రకృతి వైద్యం ఏం చెబుతోంది?
ప్రతి రోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించ లేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులు త్యాగం చేయక తప్పదు. మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివాటి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్ర మిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని ‘ప్రకృతి వైద్యం’ ద్వారా నయం చేసుకోవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, శరీర కష్టం చేసే వారు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. రోజువారీ పనులనునడక, సైకిల్ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామం ఏదైనా ఒక్కటే నియమం, ‘శక్తికి మించి వ్యాయామం చేయకూడదు’. మిట్ట మధ్యాహ్నం ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది. నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్ చేయడం మంచిది. ఒబేసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు వ్యాయామం చాలా అవసరం. అలాగే మనం ఇంట్లో కూర్చుని యోగ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. యోగాసనాలు శరీరానికి, మెదడుకీ ఎంతగానో మేలు చేస్తాయి. ప్రకృతివైద్య సిద్ధాంతంలో, అనారోగ్యం అనేది ఆరోగ్యానికి భంగం కలిగించే ప్రక్రియగా, సహజ వ్యవస్థల సందర్భంలో ఆ తర్వాత కోలుకునే ప్రక్రియగా పరిగణించబడుతుంది. పేలవమైన పోషణ, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అనేకమైన విషయాలు ఆరోగ్యానికి ఎక్కువగా భంగం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వైద్యుల లక్ష్యం. – డా‘‘ ఎం. అఖిల మిత్ర, గౌతమ బుద్ధ అభివృద్ధి సమాఖ్య -
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్ఫాక్స్ వ్యాక్సినేషన్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!
హ్యాండ్ ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ చిన్నారుల్లో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధిలో పిల్లల చేతులు, కాళ్లు, నోటి మీద ర్యాష్, పొక్కులు, పుండ్ల లాంటివి వచ్చి బాధపెడతాయి. ఈ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నప్పుడు... ఔట్బ్రేక్స్ మాదిరిగా అకస్మాత్తుగా పిల్లల్లో అంటువ్యాధిలా వ్యాపిస్తుంది. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యాప్తి చెందే ఈ వ్యాధి వాతావరణంలో వేడిమీ, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుంది. అందుకే మనలాంటి ఉష్ణమండలపు ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువ. రోజుల వయసు పిల్లలు మొదలుకొని, పదేళ్ల చిన్నారుల వరకు కనిపించే ఈ సమస్య తల్లిదండ్రుల ఆందోళనకూ కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్లోని ర్యాష్, పుండ్లు, కురుపుల్లో నొప్పి ఓ మోస్తరుగా, కాస్త ఎక్కువగానే ఉండవచ్చు. దేహం రంగు (స్కిన్ టోన్)ను బట్టి ఈ కురుపులు, పుండ్లు పిల్లలందరిలో ఒకేలా కాకుండా కాస్త వేర్వేరుగా కనిపించవచ్చు. అంటే ఎరుపు, గ్రే కలర్, కొన్నిసార్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇవి మూడు నుంచి ఆరు రోజుల వరకు కనిపించి, ఆ తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కొంతమంది పిల్లల్లో పిరుదుల మీదా కనిపించే అవకాశం ఉంది. పుండ్లు పిల్లల్లో నోటి వెనకా, గొంతులోనూ వచ్చి బాధిస్తాయి. ఇలా జరగడాన్ని ‘హెర్పాంజియా’ అంటారు. కొంతమందితో మెదడువాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి ఇలా... ‘కాక్సాకీ’ అనే వైరస్ కారణంగా ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇది ఎంటరోవైరస్ జాతికి చెందిన వైరస్. పిల్లల ముక్కు నుంచి స్రవించే స్రావాలు, లాలాజలం, పుండ్ల నుంచి స్రవించే తడితో పాటు పిల్లలు తుమ్మడం, దగ్గడం చేసినప్పుడు వ్యాపించే తుంపర్ల (డ్రాప్లెట్స్) వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. వ్యాధి నయమై, లక్షణాలు తగ్గిపోయాక కూడా వైరస్ చాలాకాలం పాటు దేహంలోపలే ఉండి, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి పిల్లలతో ఉండే పెద్దల ద్వారా ఇతర పిల్లలకు ఇది వ్యాప్తి చెందవచ్చు. అరుదుగా ముప్పు... చాలావరకు దానంతట అదే తగ్గిపోయే ఈ వ్యాధి అరుదుగా కొంతమంది పిల్లల్లో ముప్పు తెచ్చిపెట్టవచ్చు. పిల్లల వయసు అనే అంశమే ఈ ముప్పునకు కారణం. అంటే సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇది ఒకింత ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో వ్యాధి నిరోధకత (ఇమ్యూనిటీ) కూడా పెరుగుతుంది కాబట్టి పెద్ద వయసు పిల్లల్లో ఇది ప్రమాదకరం కాబోదు. కొద్దిమంది పిల్లల్లో మెదడు, ఊపిరితిత్తులు, గుండె కూడా దుష్ప్రభావాలకు లోనవుతాయి. ఒక్కోసారి ఈ వ్యాధి తెచ్చిపెట్టే ముప్పులు ఈ కింది విధంగా ఉండవచ్చు. వైరల్ మెనింజైటిస్ : మెదడు పొరల్లో వాపుతో పాటు, మెదడు చుట్టూ ఉండే సెరిబ్రో స్పినల్ ఫ్లుయిడ్లో ఇన్ఫ్లమేషన్ కలగడం. ఎన్సెఫలైటిస్ : మెదడువాపునకు కారణమై ఒక్కోసారి ప్రాణాపాయం వరకు వెళ్లే పరిస్థితి రావచ్చు. అయితే ఇది చాలా చాలా అరుదు. చికిత్స ఇది వైరల్ జ్వరం కాబట్టి నిర్దిష్టంగా చికిత్స ఏదీ లేదు. కాకపోతే లక్షణాల ఆధారంగా చికిత్స (సింప్టమేటిక్ ట్రీట్మెంట్) అందించాల్సి ఉంటుంది. అంటే జ్వరం తగ్గడానికి పారాసిటమాల్, డీ–హైడ్రేషన్ సమయంలో ఐవీ ఫ్లుయిడ్స్, సీజర్స్వంటి కాంప్లికేషన్లతో పాటు వైరల్ మెనింజైటిస్, ఎన్కెఫలైటిస్ కనిపించినప్పుడు వాటికి అనుగుణంగా చికిత్స అందించడం అవసరం. ఈ వ్యాధి నివారణకు టీకా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నివారణ: కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. ∙నేరుగా దగ్గడం తుమ్మడం చేయకుండా, చేతిగుడ్డ /రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ∙వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన (కాచి, వడబోసిన లేదా క్లోరిన్తో బ్లీచ్ చేసిన) నీటిని తాగాలి. ∙పిల్లల వ్యక్తిగత వస్తువుల్నీ పరిశుభ్రంగా ఉంచాలి. వారి డయపర్ వంటి వాటిని జాగ్రత్తగా పారేయాలి (డిస్పోజ్ చేయాలి). పిల్లల వస్తువులు, బొమ్మల వంటివి... ఇతరులు వాడకుండా జాగ్రత్తపడాలి. లక్షణాలు తగ్గే వరకు స్కూల్కు పంపకపోవడమే మంచిది. వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పుడు ఇల్లు, తలుపులు, డోన్ నాబ్స్ వంటి వాటితో పాటు పరిసరాలనూ డిస్–ఇన్ఫెక్టెంట్ల సహాయంతో శుభ్రం చేయడం మేలు. వైరస్ కారణంగా 24 నుంచి 48 గంటల పాటు జ్వరం. ∙తీవ్రమైన నీరసం, నిస్సత్తువ. ∙ఆకలి లేకపోవడం, ఆకలి బాగా మందగించడం. ∙గొంతు బొంగురుపోవడం, ఇబ్బందికరంగా మారడం. ∙కొన్నిసార్లు ర్యాష్, పొక్కులు, కురుపులు చిగుర్లు, నాలుక, చెంపల లోపలివైపున కూడా కని పించవచ్చు. కొన్నిసార్లు పొక్కులు, కురుపులు లేకుండా ఎర్రబడిన భాగం కాస్త ఉబ్బెత్తుగా అయినట్లుగానూ కనిపించవచ్చు. డాక్టర్ రమేశ్ బాబు దాసరి, సీనియర్ పీడియాట్రీషియన్ (చదవండి: మరణం తర్వాత జీవితం ఉంటుందటా! షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు) -
గుండెపోటు మరణాల నివారణపై ఏపీ సర్కారు ప్రత్యేక దృష్టి
-
భయపెడుతున్న కండ్లకలక, వేలల్లో కేసులు నమోదు!
బనశంకరి(బెంగళూరు): కరోనా మరణాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన హావేరి జిల్లా ప్రస్తుతం మద్రాస్ ఐ కండ్లకలక కేసుల్లోనూ మొదటిస్థానంలో నిలిచింది. 9901 మంది కండ్లకలక బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 64,506 కండ్లకలక కేసులు వెలుగు చూడగా బీదర్ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. మూడో స్థానంలో శివమొగ్గ ఉంది. కండ్లకలక బాధితులు హావేరి జిల్లా ఆసుపత్రిలో వేలాదిమంది చికిత్స తీసుకుంటున్నారు.కాగా ఇటీవల రైతుల ఆత్మహత్యల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. రెండునెలల్లో 18 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చదవండి: రూపాయికే ఇడ్లీ..ఆహా ఏమి రుచి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement