-
ఓటీటీలో అదరగొడుతున్న ఫ్యామిలీ స్టార్.. వారికి కూడా అందుబాటులోకి!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. గీత గోవిందం కాంబినేషన్ కావడంతో అభిమానులు భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే ఓటీటీలో విడుదలైన ఫ్యామిలీ స్టార్కు సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 26న స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్లో టాప్-5లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో మేకర్స్ మరిన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.మొదట కేవలం తెలుగు, తమిళం భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఓటీటీలో ఫ్యామిలీ స్టార్కు వస్తున్న ఆదరణను చూసి మరో రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. విజయ్ దేవరకొండకు సౌత్లో ఉన్న క్రేజ్తో కన్నడతో పాటు మలయాళంలోనూ ఫ్యామిలీ స్టార్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ప్రస్తుతం నాలుగు భాషల్లో ఫ్యామిలీ స్టార్ అలరిస్తోంది. -
'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. తాజాగా సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తన సోదరుడు విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీస్టార్ చిత్రం గురించి ఆయన కామెంట్ చేశాడు.కొద్దిరోజుల క్రితం విడుదలైన 'ఫ్యామిలీస్టార్'కు కావాలనే నెగెటివ్ టాక్తో ప్రచారం చేశారు. ఆ సినిమా విడదల కావడానికి 48 గంటల ముందు నుంచే పబ్లిక్ మాట్లాడిని పాత వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. గతంలో విజయ్ సినిమాలకు సంబంధించిన మాటలను తీసుకొచ్చి ఫ్యామిలీస్టార్ రిజల్ట్, రివ్యూలు అంటూ తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టారు. అలాంటి సమయంలో ప్రేక్షకుల్లో కూడా కాస్త నిరుత్సాహం కనిపించింది. కనీసం సినిమా చూసిన తర్వాత అయినా అలా రివ్యూస్ ఇచ్చి ఉంటే.. నిజంగానే ప్రేక్షకులకు మూవీ నచ్చలేదేమోనని అనుకునే వాళ్లం. అలాంటిది ఫ్యామిలీస్టార్ విడుదలకు ముందే కావాలని టార్గెట్ చేసి కొందురు ఎందుకు ఎటాక్ చేశారో తెలియడం లేదు. ఇలాంటి పద్ధతి చిత్ర పరిశ్రమకు చాలా ప్రమాదకరం. ఇలాంటి పని ఎందుకు, ఎవరు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబర్క్రైమ్కు వారికి ఫిర్యాదు కూడా చేశాం. భవిష్యత్లో విజయ్ నుంచి మూడు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అని ఆయన అన్నారు. -
ప్రేమలు హీరోయిన్ తో ప్రేమలో పడనున్న రౌడీ..
-
రౌడీతో రౌడీ బేబీ.. క్రేజీ కాంబినేషన్ సెట్ కానుందా..
-
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో విజయ్ దేవరకొండ స్టైల్ వేరే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి రెండు మూడు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తర్వాత తర్వాతే అడుగులు తడబడ్డాయి. సినిమాల రిజల్ట్ అటకెక్కేసింది. ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలాంటి టైంలో రిస్క్ తీసుకునేందుకు రౌడీ హీరో రెడీ అయ్యాడని అంటున్నారు. అసలేంటి విషయం?(ఇదీ చదవండి: నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్)'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో వరస హిట్స్ కొట్టి విజయ్ దేవరకొండ.. స్టార్ అయిపోయాడు. కొందరైతే ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్తో పోల్చారు. కానీ ఈ సక్సెస్ని కొనసాగించలేకపోయాడు. 'నోటా' దగ్గర నుంచి వరసగా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. గతేడాది వచ్చిన 'ఖుషి' పర్వాలేదనిపిస్తే.. రీసెంట్గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' దారుణమైన ఫలితాన్ని చూసింది. కానీ విజయ్ చేతిలో ఇప్పుడు మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి.వీటిలో 'శ్యామ్ సింగరాయ్' తీసిన రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. రీసెంట్ గానే కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఉన్నంతలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అయితే రాహుల్ గత సినిమా మాదిరిగానే ఇందులోనూ హీరో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలని అంటున్నారు. మరి వేర్వేరు టైమ్ జోన్స్కి చెందినవా? లేదంటే ఒకసారి తెరపై కనిపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఏమైనా సరే కెరీర్ కాస్త డేంజర్లో ఉన్నప్పుడు ఇలాంటి పాత్రలంటే సాహసమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్) -
డబుల్ ధమాకా
హీరో విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. గురువారం (మే 9) తన బర్త్ డే సందర్భంగా మరో రెండు కొత్త చిత్రాల అప్డేట్స్తో అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చారు విజయ్ దేవరకొండ. వాటిలో ఓ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ మూవీ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై (ఎస్వీసీ) ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. విజయ్ హీరోగా ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ ఏప్రిల్ 5న విడుదలైంది. మరోసారి విజయ్ హీరోగా ఎస్వీసీ సంస్థ తన 59వ చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసినపోస్టర్లో విజయ్ కత్తి పట్టుకుని, వయొలెంట్ మోడ్లో ఉన్నారు. ‘కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే..’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ‘‘రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. మైత్రీతో మూడోసారి... ‘డియర్ కామ్రేడ్, ఖుషి’ వంటి సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూడో సినిమా ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్) ప్రకటన వచ్చింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించనున్నారు.‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ‘వీడీ 14’ తెరకెక్కనుంది. 19వ శతాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు మేకర్స్. -
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి డిఫరెంట్ జానర్ను టచ్ చేయనున్నాడు. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్తో మరోసారి కలిసి పని చేయనున్నాడు. ఈ మేరకు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది. VD14నేడు (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దానిపై ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. చారిత్రక సంఘటనల ఆధారంగా..19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. చూస్తుంటే ఈ సారి విజయ్ పెద్ద హిట్టే ఇవ్వాలని ప్లాన్ చేసినట్లున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. 'The Legend of the Cursed Land'Rahul Sankrityan X Vijay Deverakonda @MythriOfficial pic.twitter.com/estyTYSUrj— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024చదవండి: ఓటీటీలో పుష్ప విలన్ సూపర్ హిట్ మూవీ.. ఆ విషయంలో రికార్డ్! -
రౌడీ హీరో బర్త్ డే అప్డేట్.. కొత్త మూవీకి డైరెక్టర్ ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ను ట్విటర్లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.ఈ సినిమాను భారీస్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. “The blood on my hands is not of their death.. but of my own rebirth..“Ravi Kiran Kola X Vijay Deverakonda@SVC_official pic.twitter.com/xGXXiNbVQu— Vijay Deverakonda (@TheDeverakonda) May 9, 2024 -
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్.. ఫోటోలు
-
విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? బహుశా 'అర్జున్ రెడ్డి' మూవీ ఏమో! ఈ సినిమా అతడికి ఎంత ప్లస్ అయిందో అంతకు మించిన మైనస్ కూడా అయ్యిండొచ్చు. ఎందుకంటే దీని తర్వాత చాలా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఓ పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. కానీ ఎందుకో హిట్ అనే మాట మాత్రం వినలేకపోతున్నాడు! ఇంతకీ విజయ్ ఎక్కడ తప్పు చేస్తున్నాడు? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!)బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే ఏ రంగమైనా సరే కష్టమే. అలాంటిది ఎంతో పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయ్ దేవరకొండ వచ్చి నిలబడ్డాడు. సైడ్ క్యారెక్టర్స్, పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ వచ్చాడు. 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో రిషి అనే కీలక పాత్ర చేసి నటుడిగా నలుగురి కంట్లో పడ్డాడు. 'పెళ్లిచూపులు' మూవీతో ఫస్ట్ హిట్ కొట్టేశాడు. ఇక 'అర్జున్ రెడ్డి' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే విజయ్ గురించి చెప్పాల్సి వస్తే.. ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఎవరిని అడిగినా అదే చెప్తారు.ఇందులో విజయ్ యాక్టింగ్, ఆటిట్యూడ్, మేనరిజమ్స్.. ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. దీని తర్వాత చేసిన 'గీతగోవిందం' మూవీ విజయ్లోని క్యూట్ నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అలా వరసగా హ్యాట్రిక్ సినిమాలతో సక్సెస్ అందుకున్న విజయ్.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. దీంతో విజయ్ని ప్రస్తుత జనరేషన్ మెగాస్టార్ అనే రేంజులో ఆకాశానికెత్తేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత సినిమాల విషయంలో విజయ్ తప్పటడుగులు వేస్తూ వచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?)నోటా, ట్యాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్.. ఇలా విజయ్ దేవరకొండ చేసిన సినిమాలన్నీ కూడా ఎందుకో ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేకపోయాయి. అయితే 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. కానీ ఎందుకో కమర్షియల్ కథలతో మూవీస్ చేయడం.. విజయ్ని మిగతా హీరోలు అనిపించేలా చేసింది. ఎంత మంచి నటుడైనా సరే కాస్తోకూస్తో వైవిధ్యం ఉంటేనే జనాలు గుర్తిస్తారు. రెగ్యులర్ రొటీన్ మూవీస్ చేస్తే ఉన్న క్రేజ్ అలా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. విజయ్ కూడా ఈ విషయంలోనే తప్పటడుగులు వేస్తున్నాడా అనే డౌట్ వస్తోంది.విజయ్ దేవరకొండ అద్భుతమైన నటుడు. దీనిలో వంక పెట్టడానికి ఏం లేదు. కానీ సరైన సినిమాలే ఎందుకో పడట్లేదు. విజయ్ ఈ విషయం కాస్త కాన్సట్రేట్ చేసి.. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కాస్త వైవిధ్యంగా చేస్తే మాత్రం విజయ్.. మళ్లీ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ. కొత్త పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై కాస్త ఆలోచించాలని కోరుతూ విజయ్ దేవరకొండకు పుట్టినరోజు శుభాకాంక్షలు.(ఇదీ చదవండి: హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?) -
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
నువ్వు హీరోవా.. అని చీత్కారాలు పొందిన దగ్గరే నువ్వే అసలైన హీరో అని చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే మజానే వేరు! హీరో విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు తన సినిమా రిలీజ్ చేయడానికి అష్టకష్టాలు, అవమానాలు పడ్డ విజయ్.. ఇవాళ తన సినిమాలను గ్రాండ్గా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసే స్థాయికి ఎదిగాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి మనసులు గెలుచుకున్నాడు. ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్లకు రోల్ మోడల్ అయ్యాడు విజయ్. నేడు (మే 9న) విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయన జర్నీ చూసేద్దాం..విజయ్ కాన్ఫిడెన్స్ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూస్తున్నవాళ్లకు విజయ్ దేవరకొండ ఎవరో తెలియదు. రిషి క్యారెక్టర్ లో ఎంతో సహజంగా నటిస్తున్న అతన్ని చూసి ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రతిభ అందరికీ తెలిసింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన ఈ సినిమా నేషనల్ అవార్డ్ పొందింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన అర్జున్ రెడ్డి విజయ్ కెరీర్ కు ఒక బెంచ్ మార్క్ మూవీ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్లో విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.స్టార్గా ఎదగడమే కాదుటాక్సీవాలాతో కాస్త డీలా పడ్డా.. గీత గోవిందం ఆయన కెరీర్లో ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీగా నిలిచింది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు విజయ్ దేవరకొండను కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. సినిమా మీద ప్యాషన్, హీరోగా విజయ్ చూపించే డెడికేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టార్గా ఎదగడమే కాదు సొసైటీ పట్ల తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు విజయ్ దేవరకొండ. కరోనా సమయంలో దేవరకొండ ఫౌండేషన్ ద్వారా మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడమే కాకుండా ఇతరత్రా సాయం చేశాడు.దేవరశాంటయువతకు ఉపాధి కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు. దేవరశాంట పేరుతో ఏటా తన ఫ్యాన్స్ లో కొందరిని టూర్స్ పంపిస్తుంటాడు. తన పుట్టిన రోజున నగరంలోని వివిధ ప్రాంతాలలో ఐస్ క్రీం ట్రక్స్ ఏర్పాటు చేయిస్తాడు. ఖుషి సినిమా టైమ్ లో ప్రేక్షకుల్లో వందమందిని సెలెక్ట్ చేసి వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున కోటి రూపాయల సాయం అందించాడు. ఇలా మంచి మనసున్న హీరోగా విజయ్ దేవరకొండ పేరు తెచ్చుకున్నాడు.చదవండి: వైరల్ ఫోటో: కట్టప్పతో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా? -
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
-
రూరల్ యాక్షన్కి సై
హీరో విజయ్ దేవరకొండ అంటే సిటీ బ్యాక్డ్రాప్ కథలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలని ఓ రూరల్ యాక్షన్ డ్రామా మూవీ సైన్ చేశారు. ఈ సినిమా కోసం సిటీ నుంచి విలేజ్కి వెళ్లనున్నారు విజయ్ దేవరకొండ. అక్కడే ఫుల్ యాక్షన్ చేయనున్నారు.ఈ రూరల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ మూవీని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా ప్రతిభ నిరూపించుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించనున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. -
టాలెంటెడ్ డైరెక్టర్తో దిల్ రాజు- విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈరోజు లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్ దేవరకొండ- దిల్ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్ టాక్ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు. ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్మెంట్తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు. A Larger-than-life "Rural Action Drama" is on the cards 🧨#SVC59 will be @TheDeverakonda's Mass EndeavourX A @storytellerkola's Vision 💥 Produced by Raju - Shirish ✨More Updates on 9th May, Stay tuned to @SVC_official pic.twitter.com/FVca4INOGC— Sri Venkateswara Creations (@SVC_official) May 4, 2024 -
ట్రెండింగ్లో 'ఫ్యామిలీ స్టార్'.. అలాంటి రూమర్స్కు చెక్
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఇప్పటికే థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమా రీసెంట్గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్ విడుదల సమయంలో సినిమా మీద కొందరు చేసిన నెగిటివ్ ప్రచారం నిజమేననుకుని సినిమాను థియేటర్లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. విజయ్, మృణాల్ జోడీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశమని తెలుపుతున్నారు. కథలో హీరో తన గురించి ఆలోచించుకోకుండా ఫ్యామిలీ కోసం నిలబడటం అనే కాన్సెప్ట్ అందరూ ఆలోచించతగినట్లూ ఉందంటూ వారు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని ఈ సినిమా పట్ల తప్పుగా ప్రచారం చేసినా కూడా విజయ్ క్రేజ్తో ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్కు రీచ్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్తో ఆ దుష్ప్రచారం అంతా తేలిపోయింది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఫ్యామిలీ స్టార్ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నవారు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మిగతా సినిమాల్లాగే ఫ్యామిలీ స్టార్ లోనూ కొన్ని మిస్టేక్స్ ఉన్నా సినిమా అన్ని అంశాల్లో బాగుందని చెబుతున్నారు. ఫ్యామిలీ స్టార్ ఓటీటీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా నెగిటివ్ ప్రాపగండా నమ్మొద్దనే రియలైజేషన్ ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇది విజయ్ దేవరకొండ నెక్ట్ సినిమాలకు తప్పకుండా ఉపయోగపడనుంది. అమెజాన్ ప్రైమ్లో టాప్ వన్లో ఫ్యామిలీ స్టార్ చిత్రం దూసుకుపోతుంది. -
'ఫ్యామిలీ స్టార్' పరువు తీస్తున్న దోశ.. ఆ వార్నింగ్ సీన్ కూడా!
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి అడ్డంగా బుక్కపోయాడు. పాపం ట్రోలర్స్ దెబ్బకు ఇంకో రౌండ్ బ్యాండ్ పడుతోంది. థియేటర్ రిలీజ్ టైంలో కేవలం మాటల వరకే పరిమితమవగా.. ఇప్పుడు స్క్రీన్ షాట్స్, వీడియోలు పోస్ట్ చేసి మరీ సినిమా పరువు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రోల్స్ వైరల్ అయిపోతున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతోంది?ఉగాది కానుకగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ థియేటర్లలో రిలీజైంది. కుటుంబ నేపథ్య కథ కావడంతో ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది కదా అని అందరూ అనుకున్నారు. కానీ తొలిరోజే నెగిటివ్ టాక్ వచ్చింది. రెండో రోజుకి సీన్ అర్థమైపోయింది. జనాలు పట్టించుకోలేదు. నిర్మాత దిల్ రాజు మాత్రం తమ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్కి కనెక్ట్ అయిందని అన్నారు. కానీ అందులో నిజమేంటనేది ఆయనకే తెలియాలి.ఎందుకంటే తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్' వచ్చేసింది. అయితే సినిమా చూసిన చాలామంది నెగిటివ్ కామెంట్సే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో దోశ వేసే సీన్ చూసి.. 'అవసరమైతే దోశలు తినడం మానేస్తాం గానీ ఇలాంటి దోశలు తినం బాబోయ్' అంటున్నారు. అలానే విలన్ రవిబాబుకి వార్నింగ్ ఇచ్చే సీన్లో హీరో డైలాగ్స్ వరస్ట్గా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఓటీటీ రిలీజ్ వల్ల దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మరోసారి బలైపోతున్నాడు. What is this kalacondom 😶🏃#Familystar pic.twitter.com/qVN3vSJMDn— ..... (@DontDisturbu) April 26, 2024దోస వేసుకోటానికి లోభిస్తాం కాని సంవత్సరానికి 8 లక్షలు తాగుతాం 😎😎😎మొత్తం అంతాచూసాక టక్కున కథ చెప్పరా అంటే ఎవ్వడు చెప్పలేడు పరశురాంతో సహా అది #FamilyStar— Srivatsava Sesham(శ్రీవాత్సవ) (@srivatsavahai) April 27, 2024Worst ra dei !!@TheDeverakonda parasuram#FamilyStar pic.twitter.com/hL6pg7jxPz— Frustrated Thamizhan (@FrustTamizhan) April 27, 2024 -
సడన్గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ఎట్టకేలకు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. వచ్చిన తర్వాత చూసేందుకు ప్లాన్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ కానుంది?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాల దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వరసగా మూవీస్ అయితే చేస్తున్నాడు గానీ ఒక్కటంటే ఒక్క దానితో హిట్ కొట్టలేకపోతున్నాడు. 'ఖుషి' ఓ మాదిరి కలెక్షన్స్తో పర్వాలేదనిపించింది. ఇది తప్పితే మిగతావన్నీ డిజాస్టర్స్ అవుతూ వచ్చాయి. దీంతో 'ఫ్యామిలీ స్టార్'పై విజయ్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ మూవీ విషయంలోనూ నిరాశే ఎదురైంది.ఏప్రిల్ 5న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఉగాది, రంజాన్ లాంటి హాలీడే వీకెండ్ దొరికినప్పటికీ.. 'ఫ్యామిలీ స్టార్' చూసేందుకు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఊహించని విధంగా 20 రోజుల్లోనే ఓటీటీలో తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఏప్రిల్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్లో దక్షిణాది భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన 'ఫ్యామిలీ స్టార్'.. ఓటీటీలో ఇంకేం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
క్రేజీ గాసిప్.. ప్రశాంత్ నీల్తో విజయ్ దేవరకొండ సినిమా?
లైగర్ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ అయిపోయేవాడు. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ విజయ్ క్రేజీ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు కానీ పాన్ ఇండియా రేస్లో కాస్త వెనుకబడ్డాడు. ఒకే ఒక్క హిట్ వస్తే చాలు విజయ్తో సినిమా చేయడానికి కరణ్ జోహార్ మొదలు.. పాన్ ఇండియా దర్శకనిర్మాతలంతా రెడీగా ఉన్నారు.కానీ విజయ్ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆయన నటించిన సినిమాలన్నింటికి మంచి పేరు వస్తుంది కానీ బాక్సాపీస్ వద్ద బోల్తా పడుతుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్.. రెండు మంచి చిత్రాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పడు విజయ్ దృష్టి అంతా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పైనే ఉంది. ఈ చిత్రంలో ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు రౌడీ హీరో. గౌతమ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్.. విజయ్ని కలిశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ కోసం ప్రశాంత్ ఓ కథ రెడీ చేశారట. ఇటీవల హైదరాబాద్కి వచ్చి విజయ్కి కథ వినిపించాడట. మరి ఆ కథేంటి? వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. ఒకవేళ వీరిద్దరి కాంబోలో సినిమా ఉన్నప్పటికీ.. అది ఇప్పట్లో పట్టాలెక్కే చాన్స్ లేదు. ప్రశాంత్ ప్రస్తుతం సలార్ 2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలైన తర్వాతే ప్రశాంత్ మరో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తారు. సలార్ 2లో విజయ్ దేవరకొండ?ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సలార్. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా సలార్ శౌర్యంగపర్వం’ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాని కోసమే హైదరాబాద్కి వచ్చి విజయ్ని కలిశాడట ప్రశాంత్. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు కానీ ఈ క్రేజీ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. -
అతని పెళ్లి కోసం కుటుంబంతో సహా వెళ్లిన విజయ్ దేవరకొండ
ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఫ్యాన్స్లో రౌడీబాయ్గా ముద్రవేసుకున్న ఆయనకు ఎనలేని అభిమానులు ఉన్నారు. విజయ్ తన చుట్టూ ఉండే తన సిబ్బందిని కూడా కుటుంబసభ్యులుగా భావిస్తారని తెలిసిందే. విజయ్ పబ్లిక్ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు తనకు రక్షణగా బాడీ గార్డ్స్ ఉంటారు. ఎప్పుడూ విజయ్ కోసం వెన్నంటి ఉండే వారిలో ఒకరిది తాజాగా వివాహం జరిగింది. ఆ వేడుకలలో విజయ్ కూడా పాల్గొని సందడి చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా రవి అనే యువకుడి పెళ్లికి తన కుటుంబంతో సహా వెళ్లారు. గత కొన్నేళ్లుగా విజయ్ వద్ద ఆ యువకుడు వ్యక్తిగత బాడీ గార్డ్గా పనిచేస్తున్నాడు. దీంతో ఆ వివాహానికి తన తల్లిదండ్రులతో సహా వెళ్లాడు. నూతన వధువరులను విజయ్ కుటుంబసభ్యులు ఆశీర్వదించారు. ఈ క్రమంలో రవి కుటుంబ సాంప్రదాయం ప్రకారం హీరో విజయ్కి కత్తి బహుకరించి పెద్దలు సన్మానం చేశారు. దీంతో విజయ్ కూడా ఆ కత్తి పట్టుకొని ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీ స్టార్ చిత్రం తర్వాత గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.VD12 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. The #VijayDeverakonda and his family attended the wedding of his personal guard, #Ravi, and blessed the beautiful couple 💑✨️ pic.twitter.com/3YeyrGUkqs — S N R Talks (@SNR_Talks) April 23, 2024 -
ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అద్భుతమైన వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ థియేటర్లలో ఉన్న ఈ చిత్రానికి పెద్దగా జనాలు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి మూవీస్ దెబ్బకు విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పాన్ ఇండియా ఫేమ్ అయిత్ వచ్చింది కానీ సరైన హిట్ ఒక్కటి పడటం లేదు. తాజాగా 'ఫ్యామిలీ స్టార్' కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా చతికలపడిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. 45 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకుంది. కానీ ఇప్పుడు థియేటర్ రిజల్ట్ తేడా కొట్టేయడంతో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. మే 3 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి తీసుకొచ్చేయాలని అనుకుంటోందట. కుదిరితే ఇంకా ముందే కూడా వచ్చేయొచ్చు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆ సినిమా వల్ల భారీగానే నష్టపోయాం: చిరంజీవి) -
తెరపై చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో నిలిచిపోతుంది: మృణాల్ ఠాకూర్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా ఈ మృణాల్ ఠాకూర్ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. మృణాల్ ఇన్స్టాలో రాస్తూ.. 'నేను ఇందుగా ఉన్న క్షణాలు. ఇందు నేనుగా ఉన్న క్షణాలు. తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు. ఆమెలా ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు ... నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రలో కనిపించింది. ఓ కంపెనీకి సీఈవోగా అందరినీ మెప్పించింది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) -
ఫ్యామిలీ స్టార్పై నెగెటివ్ ప్రచారం.. విజయ్ ఫిర్యాదుపై క్లారిటీ!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురామ్- విజయ్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్గా తెరకెక్కించిన ఈ చిత్రంపై నెగెటివీటి కూడా పెద్దఎత్తున వైరలైంది. కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేయడంతో ఏకంగా నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే స్వయంగా థియేటర్ల వద్దకు వెళ్లి ఆడియన్స్ను కలిసి రివ్యూలు తీసుకున్నారు. మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడంపై సోషల్ మీడియా ఖాతాలపై విజయ్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. ఉద్దేశపూర్వకంగా ఫ్యామిలీ స్టార్ సినిమాపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మాదాపూర్ సైబర్ క్రైమ్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ ఓ ఫోటో నెట్టింట వైరలవుతోంది. అయితే దీనిపై విజయ్ను ఆరా తీయగా.. అలాంటిదేం లేదని బదులిచ్చారు. ఆ ఫోటో కొవిడ్ టైంలో ఓ కార్యక్రమంలో తీసిందని విజయ్ దేవరకొండ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Checked with @TheDeverakonda. Fake report pic.twitter.com/AFTDe2pylv — Haricharan Pudipeddi (@pudiharicharan) April 10, 2024 -
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్.. థియేటర్లు ఫుల్!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. ఉగాది, రంజాన్ పండుగలు వెంటవెంటనే రావడంతో ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఇవాళ ఉగాది సందర్భంగా ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సుల వద్ద హౌస్ ఫుల్ బోర్డులే దర్శమిస్తున్నాయి. వరుసగా సెలవులు రావడంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద రద్దీ కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనూ ఫ్యామిలీ స్టార్కు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం కాగా.. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత స్వయంగా థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ నుంచి రివ్యూ తీసుకున్నారు. నెగెటివ్ రివ్యూలపై ఆయన మండిపడ్డారు. ఇలా చేయడం ఇండస్ట్రీకి మంచిది కాదని అన్నారు. -
రియల్ 'ఫ్యామిలీ స్టార్' ఇంటికి వెళ్లిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ కొందరు కావాలనే విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి సినిమా బాగాలేదని విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా కూడా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందుకే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ప్రతి కుటుంబంలో ఒకరు తన వారందరి కోసం కష్టపడుతూనే ఉంటారు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. ఇదే పాయింట్తో సినిమా ఉంది. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ముందే చెప్పారు. సినిమా విడుదలకు ముందు దిల్ రాజు ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో పాల్గొన్న ప్రశాంత్ అనే యువకుడు వారి కుటుంబంలో 'ఫ్యామిలీ స్టార్'గా తన చెల్లెలు ఉన్నారని చెప్పాడు. వారి కుటుంబం కోసం దివ్యాంగురాలైన ఆమె పడిన కష్టాన్ని ఆ యువకుడు దిల్ రాజు ముందు చెప్పాడు. దీంతో దిల్ రాజు కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. సినిమా విడుదల తర్వాత తప్పకుండా మీ ఇంటికి వస్తాను.. ఆ రియల్ ఫ్యామిలీ స్టార్ను కలుస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్లోని సూరారంలో ఉన్న ఆ యువకుడి ఇంటికి దిల్ రాజు, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం వెళ్లారు. ఆ కుటుంబాన్ని సర్ప్రైజ్ చేశారు. కొంత సమయం పాటు ఆ కుటుంబ సభ్యులందరితో సరదాగ వారు గడిపారు. దివ్యాంగురాలైన ఆమె తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అడ్డుగా ఉన్నా చదువును పూర్తి చేసి ఉద్యోగం రాకపోతే కిరాణ షాపును నడపడం ఆపై ఎంతో కష్టపడి అమెజాన్లో ఉద్యోగం తెచ్చుకోవడం.. దాంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి అంశాలను ఆ యువకుడు పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. Team of #TheFamilyStar meets and salutes a real life FAMILY STAR ✨ The movie is all about celebrating our dearest ones, our family stars ❤🔥 Book your tickets for the perfect 𝗦𝗨𝗠𝗠𝗘𝗥 𝗙𝗔𝗠𝗜𝗟𝗬 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗘𝗥 now! 🎟️ https://t.co/lBtal2uGnv@TheDeverakonda… pic.twitter.com/18wi88fPwf — Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2024 -
ఎందుకురా మా వాడి వెంట ఇలా పడ్డారు.. ? విజయ్ మేనమామ కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. పరశురామ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. సినిమా బాగున్నప్పటికీ సోషల్మీడియాలో మరోవైపు నెగెటివ్ ప్రచారం చేయడంపై నిర్మాత దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మేము కష్టపడి తీసిన సినిమాపై కొందరు అలా చేయడం మంచిది కాదని ఆయన కోరారు. ఇలాంటి పద్ధతి కంటిన్యూ అయితే సినిమాలు తీయడం మానేసే పరిస్థితి కూడా రావచ్చని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ మేనమామ యష్ రంగినేని కూడా నెగెటివ్ ప్రచారంపై ఇలా రియాక్ట్ అయ్యారు. 'ఎందుకురా బాబు మా వాడి వెంట మరీ ఇలా పడ్డారు. ఇంత కసా ? ఇంత ఓర్వలేని తనమా ? లేక మావోడి కటౌట్ చూసి భయమా ? ఒక మంచి విలువలతో , సందేశంతో ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమాని కూడా వదలటం లేదు.మీ నెగటివ్ బ్యాచ్కు వాడంటే (విజయ్ దేవరకొండ) ఎలాగూ పడదు. కానీ ఆ ఇష్టపడేవాళ్లని కూడా సినిమాకి రానివ్వకుండా చేస్తున్నారేంటిరా బాబు. ఐనా ఇంకే హీరో సినిమాలకు లేని లాజిక్స్ మావోడి సినిమాలకి మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక మంచి హీరోగా పేరుతెచ్చుకుంటే తప్పా.. ?' అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Yash Rangineni (@yashrangineni)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
- సిరుల విరులు..కొండ చీపుర్లు
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
Advertisement