-
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
తిరువళ్లువర్కు మళ్లీ కాషాయం
● రాజ్భవన్లో తిరువళ్లువర్ డే ● నిఘా కట్టుదిట్టంసాక్షి, చైన్నె: తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్కు మళ్లీ కాషాయం రంగు పులిమారు. ఈ సారి రాజ్భవన్ వేదికగా కాషాయం వస్త్రంతో కూడిన తిరువళ్లువర్ ఫొటోను ఆయన విగ్రహం వద్ద ఉంచడం వివాదానికి దారి తీసింది. తిరువళ్లువర్ డే పేరిట శుక్రవారం గవర్నర్ ఆర్ఎన్ రవి నేతృత్వంలో వేడుక జరగడంతో రాజ్భవన్ పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళ కవి, తమిళ తిరుక్కురల్ గ్రంథం రచయిత, తత్వవేత్త తిరువళ్లువర్ పేరిట ప్రతి సంవత్సరం జనవరి 16న తిరువళ్లువర్ దినోత్సవాన్ని అధికారిక వేడుకగా జరుపుకోవడం తెలిసిందే. తమిళులు తిరుక్కురల్ను పవిత్ర గ్రంథంగా భావిస్తుంటారు. తిరుక్కురల్ను గౌరవించే విధంగా ముందుకెళ్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనకు రాజకీయ రంగుతోపాటు కాషాయ వస్త్రాన్ని దిద్దే పనిలో కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది తరచూ రచ్చకెక్కడం జరుగుతోంది. ఈసమయంలో రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సైతం కొత్త బాటను అనుసరించే విధంగా తీసుకున్న నిర్ణయం శుక్ర వారం చర్చకు దారితీసింది. తిరువళ్లువర్ మే 24న జన్మించినట్టుగా పేర్కొంటూ, ఆయన పేరిట కార్యక్రమాల ఆహ్వాన పత్రికను రాజ్భవన్ విడుదల చేసింది. తిరువళ్లువర్ దినోత్సవం జరుపుకుందా మని ఇచ్చిన ఈ ఆహ్వానం తమిళాభిమానులలో ఆగ్రహాన్ని రేపింది. ఉదయాన్నే రాజ్భవన్ నుంచి మైలాపూర్కు వెళ్లిన గవర్నర్ ఆర్ఎన్ రవి తిరువళ్లువర్ ఆలయంలో పూజలు చేశారు. ఇక్కడి జరిగిన కార్యక్రమాలలో పాల్గొని రాజ్భవన్కు వెళ్లారు. రాజ్భవన్లోని తిరువళ్లువర్ విగ్రహం వద్ద కాషా యం వర్ణంతో కూడిన ఆయన చిత్ర పటాన్ని ఉంచి పుష్పాంజలి ఘటించారు. ఈ సమాచారంతో తమిళాభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసే పనిలో పడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా రాజ్భవన్ ఉన్న గిండి పరిసరాలలో భద్రతను అమాంతంగా పెంచారు. ఆ పరిసరాలలో డేగ కళ్ల నిఘాతో పోలీసులు వ్యవహరించారు. గవర్నర్ తీరుపై న్యాయశాఖా మంత్రి రఘుపతి స్పందిస్తూ, వాదించే వారితో వాదనలకు సిద్ధం అని, తాను చేసేదే రైట్ అన్నట్టుగా పట్టు వీడకుండా ముందుకు సాగే వారిని ఎలా పిలవాలో ప్రజలే అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు. -
6 నుంచి బడులు
● ముందస్తు ఏర్పాట్లకు విద్యాశాఖ ఆదేశాలు సాక్షి, చైన్నె: వేసవి సెలవుల అనంతరం జూన్ 6వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఆదేశాలను విద్యాశాఖ డైరెక్టరేట్ శుక్రవారం జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో ముందస్తుగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్ నెలలో పది, ప్లస్ ఒన్, ప్లస్టూ పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భానుడి ప్రతాపం ఎక్కువే. మిగిలిన తరగతులకు సైతం సకాలంలో పరీక్షలను ముగించి ఏప్రిల్ రెండో వారం నుంచి బడులకు వేసవి సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ప్లస్ ఒన్ అడ్మిషన్లు, ఉన్నత విద్యా కోర్సుల సీట్ల భర్తీ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ సమయంలో వేసవి సెలవులను ముగించి బడులను తెరిచేందుకు విద్యా శాఖ చర్యలు తీసుకుంది. ఈ ఏడాది భానుడి ప్రభావం నేపథ్యంలో పాఠశాలలను ఆలస్యంగా తెరుస్తారని భావించారు. అయితే, ముందుగానే నైరుతి ప్రవేశం నేపథ్యం, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడడంతో జూన్ 6వ తేదీ నుంచి పాఠశాల పునఃప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసింది. అంతలోపు ఆయా పాఠశాలల్లో తీసుకోవాల్సిన ముందస్తు పనులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టి త్వరితగతిన ముగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఒకటో తరగతి నుంచి ప్లస్టూ వరకు 2024–25 విద్యాసంవత్సరం జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని, అంతలోపు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పునఃప్రారంభమైన రోజు లేదా మరు సటి రోజు నుంచి పుస్తకాలు, యూనిఫాం పంపిణీకి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉండగా ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో డీఎంకే దివంగత నేత కరుణానిధి జీవిత చరిత్ర పాఠ్యాంశం ప్రవేశపెట్టనున్నారు. ఇద్దరు బిడ్డలను కడతేర్చి తల్లి ఆత్మహత్య సేలం: సేలం పరిధిలోని సంగకిరి సమీపంలో కుటుంబకలహాలతో ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తల్లి కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని పుల్లకౌండంపట్టి అగ్రహారం పంచాయతీ వినోబాజీ నగర్కు చెందిన గోకుల్ (30) ఆటోడ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంజనశ్రీ (6), రిష్మిక (2) ఇద్దరు కుమార్తెలు. ఈక్రమంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గురువారం ఎప్పటిలాగే భార్యభర్తల మధ్య గొడవ చోటుచేసుకుంది. గోకుల్ పనికి వెళ్లగా, పిల్లలు ఇద్దరితో శిల్ప ఇంట్లో ఉంది. మనస్తాపం చెంది శిల్ప ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు దేవూరు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కుమారపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రౌడీ హత్య ● ఐదుగురి అరెస్ట్ అన్నానగర్: పెరియకులంలో ఓ రౌడీ హత్యకు గురయ్యాడు. ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తేని జిల్లా పెరియకులం వడకరైలోని అళగర్సామిపురానికి చెందిన గణేశన్ కుమారుడు కన్నదాసన్ (31). ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. అదే ప్రాంతానికి చెందిన సోదరులు కరణ్కుమార్ (25), పుహలేంది (24). ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న కన్నదాసన్, కరణ్కుమార్పై దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు వారిద్దరికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీనిపై కరణ్కుమార్ వడకరై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కన్నదాసన్ రాత్రి 11 గంటల సమయంలో కరణ్కుమార్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. షాక్కు గురైన కరణ్కుమార్, అతని తమ్ముడు పుగలేంది, స్నేహితులు అలగర్ (22), లంకేశ్వరన్(28), చార్లీ (23) కలిసి కన్నదాసన్ నుంచి కత్తి లాక్కొని, అదే కత్తితో అతన్ని పొడిచి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని పెరియకులం పోలీసులు ప్రభుత్వ జిల్లా ప్రధాన అస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం తేని ప్రభుత్వ వైద్యకళాశాల అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నదాసన్ మృతిచెందాడు. పోలీసులు కరణ్కుమార్ సహా ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేశారు. -
మాజీ డీజీపీ రాజేష్దాస్ అరెస్ట్
● బీలా వెంకటేషన్ ఫిర్యాదుతో చర్యలు సాక్షి, చైన్నె: సీనియర్ ఐఏఎస్ అధికారి, విద్యుత్శాఖ కార్యదర్శి బీలా వెంకటేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ డీజీపీ రాజేష్దాస్ను శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. తాంబరం డిప్యూటీ కమిషనర్ పవన్కుమార్రెడ్డి, పళ్లికరణై డిప్యూటీ కమిషనర్ గౌతం నేతృత్వంలోని పోలీసుల బృందం ఆయన్ను అరెస్టు చేసి చెంగల్పట్టు కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం మాజీ ప్రత్యేక డీజీపీ రాజేష్దాస్పై ఉన్న లైంగిక ఆరోపణల కేసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూనియర్ మహిళా ఐపీఎస్ అధికారిణికి ఆయన లైంగిక వేధింపులు ఇచ్చిన కేసులో మూడేళ్ల జైలు శిక్ష కూడా పడింది. ఈ పరిణామాలతో రాజేష్దాస్, ఆయన సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిణి బీలా రాజేష్ మధ్య కుటుంబపరంగా వివాదం మొదలైంది. రాజేష్దాస్ నుంచి విడాకులు కోరుతూ ఆమె చైన్నె కుటుంబ సంక్షేమ కోర్టును సైతం ఆశ్రయించారు. అలాగే, తన పేరును బీలా వెంకటేషన్గా మార్చుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో జైలుశిక్ష నేపథ్యంలో కోర్టులో లొంగిపోకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన రాజేష్దాస్ గతవారం తెరపైకి వచ్చారు. ఇందుకు కారణం కోర్టులో లొంగిపోవడం నుంచి మినహాయింపు సుప్రీంకోర్టు ద్వారా ఆయనకు దక్కడమే. దీంతో కేలంబాక్కం సమీపంలోని తయ్యూరులోని ఫామ్హౌస్కు ప్రైవేటు బౌన్సర్లతో వచ్చి కొత్త వివాదాంలో ఇరుక్కున్నారు. బీలా వెంకటేషన్ ఫిర్యాదుతో.. కేలంబాక్కం సమీపంలోని తయ్యూరులో బీలా వెంకటేషన్ పేరిట ఫామ్హౌస్ ఉంది. ఇక్కడే గతంలో అధిక సమయం రాజేష్దాస్ ఉండే వారు. ప్రస్తుతం దంపతుల మధ్య విడాకుల వ్యవహారం కోర్టుకు చేరిన నేపథ్యంలో ఈ ఫామ్హౌస్ వ్యవహారం వార్తల్లోకి చేరింది. అజ్ఞాతంలోకి వెళ్లి రాజేష్దాస్ మళ్లీ ఇక్కడకు రాకుండా అడ్డుకునే విధంగా బీలా వెంకటేషన్ నేపాల్కు చెందిన బహుదూర్ను సెక్యూరిటీగార్డుగా నియమించారు. అలాగే, తయ్యూరుకు చెందిన మేఘల ఇంటి తోట పనిచేస్తున్నారు. ఈనెల 18న అజ్ఞాతాన్ని వీడి ఈ ఫామ్హౌస్కు వచ్చిన రాజేష్దాస్ను సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో పది మంది ప్రైవేట్ బౌన్సర్లతో వచ్చిన రాజేష్దాస్ సెక్యూరిటీని చితక్కొట్టి తరిమేసినట్టు సమాచారం. దీంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన బీలా వెంకటేషన్, ఆ ఫామ్హౌస్కు పవర్ కట్ చేయించేందుకు ప్రయత్నించారు. తన ఇంటి మరమ్మతు పనులు జరగనున్నాయని, కొంతకాలం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని విద్యుత్ బోర్డు అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. పవర్ కట్ చేసేందుకు వెళ్లిన సిబ్బందిపై బౌన్సర్లు దాడి చేయడం వివాదానికి దారి తీసింది. దీంతో తన ఫామ్హౌస్ను రాజేష్ దాసుతోపాటు కొందరు ప్రైవేటు బౌన్సర్లు ఆక్రమించుకున్నారని ఆన్లైన్ ద్వారా 21న కేలంబాక్కం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు..అరెస్ట్ తనపై కొత్త కేసును కేలాంబాక్కం పోలీసులు నమోదు చేసిన సమాచారంతో ఆ ఫామ్హౌస్ నుంచి రాజేష్దాస్ జారుకున్నారు. రెండు రోజులుగా అజ్ఞాతంతో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం పనయూరులోని మరో ఫామ్హౌస్కు వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తాంబరం డిప్యూటీ కమిషనర్ పవన్కుమార్రెడ్డి, పళ్లికరణై డిప్యూటీ కమిషనర్ గౌతం నేతృత్బంలో యాభై మందికి పైగా పోలీసులు ఉదయాన్నే ఆయన ఫామ్హౌస్ను చుట్టుముట్టారు. బీలా వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసు, వారెంట్ను ఆయనకు చూపించి అరెస్టు చేశారు. కేలంబాక్కం పోలీసుస్టేషన్లో ఉంచి ఆయన వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. చెంగల్పట్టు కోర్టులో హాజరు పరిచేందుకు సైతం చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో రాజేష్దాస్ను ఈ కేసులో బెయిల్పై బయటకు తెచ్చేందుకు పలువురు న్యాయవాదులు రంగంలోకి దిగారు. అనారోగ్య కారణంగా కోర్టు శుక్రవారం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. -
మరో ఆరు వైద్య కళాశాలలు
● కేంద్రం గ్రీన్ సిగ్నల్ సాక్షి, చైన్నె: రాష్ట్రంలో మరో ఆరు వైద్యకళాశాలలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర వైద్య విద్యా కౌన్సిల్ ఇందుకు సంబంధించిన అనుమతులను శుక్రవారం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో వైద్య కళాశాలల సంఖ్య 80కు చేరనుంది. దేశంలోనే తమిళనాడులో అత్యధికంగా వైద్య కళాశాలలు ఉన్నాయి. అందుకే చైన్నె వైద్య హబ్గా మారింది. రాష్ట్రంలో 38 జిల్లాలు ఉండగా, జిల్లాకు ఒకటి చొప్పున వైద్య కళాశాల ఏర్పాటుపై పాలకులు దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం 38 ప్రభుత్వ, 36 ప్రైవేటు వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. 74గా ఉన్న ఈ సంఖ్య 80కు చేర్చే విధంగా మరో ఆరు కళాశాలలకు ప్రస్తుతం అనుమతులు దక్కాయి. ఈ ఆరు కళాశాలలు ప్రభుత్వానికి చెందినవే కావడం విశేషం. కొత్తగా ఆవిర్భవించిన మైలాడుతురై, తెన్కాశి, తిరుపత్తూరు జిల్లాలో తొలివిడతగా మూడు కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తర్వాత కొత్తగా ఆవిర్భవించిన మరో జిల్లా రాణిపేట కేంద్రంలో ఒకటి, ఈ జిల్లా పరిధిలోని అరక్కోణంలో మరొకటి, వెనుకబడిన జిల్లా పెరంబలూరులో మరకొటి ఏర్పాటు కానున్నాయి. ఈ ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులుగా ఒక్కొక్కటి 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తొలి విడతగా నిర్మాణాలు పూర్తిచేసుకునే కళాశాలలో 2025లో వైద్య సీట్లభర్తీ దిశగా కసరత్తులు చేపట్టబోతున్నారు. మలి విడత నిర్మాణ పనులు జరిగే కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ 2026లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేత తర్వాత నిధుల ఆధారం మేరకు ఒకే సారిగా అన్ని కళాశాలల పనులు ఒకేసారి చేపట్టేందుకు సైతం సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని వైద్య విద్యా డైరెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంచీపురంలోని ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి విస్తరణకు సైతం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం. -
హార్బర్లలో తుపాన్ అలర్ట్
● పశ్చిమ కనుమల్లో వీడని వర్షాలు ● జలాశయాల్లోకి పెరిగిన నీటి రాక సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపాన్గా బల పడనుండడంతో రాష్ట్రంలోని తొమ్మిది హార్బర్లలో హెచ్చరిక సూచిక ఎగురవేశారు. ఈ ప్రభావంతో పశ్చిమ కనుమల వెంబడి తమిళ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల్లో అగ్నినక్షత్రం ముగియనుంది. ఈ ఏడాది అగ్నినక్షత్రం వేళ భానుడి సెగ కన్నా, అకాల వర్షం ప్రభావం అధికంగా ఉండడంతో వాతావరణం అనేక జిల్లాల్లో చల్లబడింది. ప్రధానంగా రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణుల వెంబడి ఉన్న జిల్లాలు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, విరుదునగర్, తేని, దిండుగల్, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, నీలగిరి జిల్లాల్లో వాతావరణం పూర్తిగా మారింది. ఈ జిల్లాలోని వాగులు, వంకలు ఇప్పటికే పొంగిపొర్లుతున్నాయి. ఎండిపోయి ఉన్న జలాశయాలలో ప్రస్తుతం నీటి మట్టం అమాంతంగా పెరుగుతోంది. ఈ సమయంలో జూన్ ఒకటవ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనుండడంతో ఈ ప్రభావంతో పై జిల్లాల్లో మరింతగా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడి జలాశయాలు, చెరువులు, నీటి పరివాహక ప్రదేశాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. శుక్రవారం కూడా పై జిల్లాల్లో అనేక చోట్ల మోస్తరు, మరికొన్ని చోట్ల సాధారణంగా వర్షాలు పడుతుండడం విశేషం. హార్బర్లలో అలర్ట్.. బుధవారం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని చైన్నె నుంచి కన్యాకుమారి వరకు పదికి పైగా ఉన్న సముద్రతీర జిల్లాలో అలల తాకిడి పెరిగింది. సముద్రుడు తీవ్ర ఆక్రోశంతో ఉన్నట్టుగా కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో జాలర్లు తమ పడవలను ఒడ్డును మరింత సురక్షితం చేసుకునే పనిలో పడ్డారు. జాలర్లు చేపల వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్ల లేదు. వాయుగుండం తుపాన్గా మారి పశ్చిమబెంగాల్ వైపు ప్రయాణించనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. రీమాల్ అని ఈ తుపాన్కు నామకరణం చేశారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండనప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రవేశ నేపథ్యంలో గాలుల ప్రభావంతో పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాలలో వర్షాలు కొనసాగనున్నాయి. ఈనెల 28 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయి. తర్వాత నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు. సముద్రంలో రీమాల్ తుపాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని చైన్నె ఎన్నూరు, పుదుచ్చేరి, కారైక్కాల్, కడలూరు, నాగపట్నం, తూత్తుకుడి, రామనాథపురం, కన్యాకుమారి తీరాల్లోని హార్బర్లలో తుపాన్ హెచ్చరిక సూచిని ఎగుర వేశారు. కెరటాల జడితో పాటు సముద్ర తీరంలో 55 కిమీ వేగానికి పైగా గాలి ప్రభావం ఉండడంతో బీచ్ల వైపు వెళ్లే వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. -
స్టాలిన్ ఆపన్నహస్తం
● తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.430 కోట్లు ● చిన్నారుల సంరక్షణకు రూ.23.49 కోట్లు ● రూ.219 కోట్లతో బాలికా సంరక్షణ ప్రాజెక్టు ● రూ.67 కోట్లతో మహిళా హాస్టళ్లు ● మహిళల జీవితాల్లో వెలుగులపై మూడేళ్ల నివేదిక సాక్షి, చైన్నె: కరోనా మహమ్మారి రూపంలో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన పిల్లలకు సీఎం స్టాలిన్ ఆపన్న హస్తం అందించారు. తాను ఉన్నానని చాటే విధంగా ఆ పిల్లల పేరిట తలా రూ.5 లక్షలు చొప్పున మొత్తంగా రూ.430 కోట్లు డిపాజిట్ చేశారు. చిన్నారుల సంరక్షణకు రూ.23.49 కోట్లు కేటాయించారు. రూ.219 కోట్లతో బాలికా సంరక్షణ ప్రాజెక్టుతో పాటు రూ.67 కోట్లతో మహిళా హాస్టళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయించారు. సీఎం స్టాలిన్ మూడేళ్ల పాలనలో సీ్త్రల జీవితాల్లో పురోగతి, బాలికల భద్రత పేరిట ఓ నివేదికను సిద్ధం చేసి శుక్రవారం విడుదల చేశారు. ఇందులో తమిళనాడులో నివసిస్తున్న మహిళలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్లు, కరోనా రూపంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భద్రత, అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. కరోనా కాలంలో.. సీఎంగా స్టాలిన్ పగ్గాలు చేపట్టే నాటికి రాష్ట్రంలో కరోనా తీవ్ర తాండవం చేస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ప్రజలను రక్షించడం తన ప్రథమ కర్తవ్యంగా సీఎం పరిగణించి రేయింబవళ్లు శ్రమించారని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడంలో సఫలీ కృతులయ్యారని, ఈ మహమ్మారి రూపంలో తల్లిండ్రులను కోల్పోయిన పిల్లలకు తాను ఉన్నానన్న భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన 382 మంది పిల్లల పేరిట తలా రూ.5 లక్షల డిపాజిట్ చేయించారని తెలిపారు. 18 ఏళ్లు నిండగానే ఈ పిల్లలకు వడ్డీతో పాటు ప్రభుత్వ సాయం దక్కే విధంగా పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. కరోనాతో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 18 ఏళ్లలోపు ఉన్న13,682 మంది బాలబాలికలకు తలా రూ.3.లక్షల చొప్పున రూ.410.46 కోట్లు అందజేశారని వివరించారు. శ్రీలంక తమిళ శరణార్థుల శిబిరాల్లోని 9 మంది పిల్లలకు సైతం తలా రూ. 3 లక్షలు చొప్పున 27 లక్షలు అందజేశారని తెలిపారు. ఇతరుల సంరక్షణలో పెరుగుతు న్న 365 మంది పిల్లలకు నెలవారీ పోషణ ఖర్చుగా మొత్తంగా రూ.23 కోట్ల 149 లక్షలను కేటాయించారు. దీంతో సంరక్షకులకు నెలకు రూ.3 వేలు అందజేస్తున్నారని తెలిపారు. పిల్లల శ్రేయస్సును మెరుగుపరిచే లక్ష్యంతో శ్రీతమిళనాడు స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ– 2021్ఙని సైతం ఆవిష్కరించిన ఘనత స్టాలిన్కే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళల కోసం.. మహిళలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారని వివరించారు. ఇందుకోసం రూ.6,661.47 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్టు పద్దులతో సహా వివరించారు. 2022 నుంచి మూవలూరు రామామృతం అమ్మాయార్ ఉన్నత విద్యా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ పథకం మేరకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులందరికీ ప్రతినెలా రూ.1,000 నగదు అందజేస్తున్నామని, ఇందుకోసం ఇప్పటివరకు రూ.214.27 కోట్లను అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. 19 జిల్లాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా పనిచేస్తున్నాయని వివరించారు. రూ.218.88 కోట్లతో బాలికా సంరక్షణ పథకం కింద 87,501 మంది చిన్నారులు లబ్ధి పొందారని గుర్తుచేశారు. యువతులకు వివాహ ఆర్థిక సహాయ పథకాల కింద 3 సంవత్సరాలలో లక్షా 26 వేల 637 మందికి రూ.1,047 కోట్లను అందజేశామని తెలిపారు. 40 ఏళ్లు పైబడిన నిరుపేద ట్రాన్స్జెండర్స్కు నెలవారీ రూ.1,000 పింఛన్ను రూ.1,500 పెంచి అందజేస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లను విస్తృతం చేస్తూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం స్టాలిన్ మున్ముందు మరిన్ని బృహత్తర పథకాలను విజయవంతంగా అమలు చేయబోతున్నారని ప్రకటించారు. -
రాజుకుంటున్న ముల్లైపెరియార్ చిచ్చు
● న్యాయపోరాటానికి పళణి పట్టు ● ప్రభుత్వం నాటకం ఆడుతోందన్న సీమాన్ ● రెండవ రోజుగా అధికారులతో సీఎస్ భేటీ సాక్షి, చైన్నె: కేరళ– తమిళనాడు మధ్య ముల్లైపెరియార్ డ్యాం వివాదంతో పాటు శివందీ నది తీరంలో చెక్డ్యాంల నిర్మాణ పనుల వేగం చిచ్చు క్రమంగా రాజుకుంటోంది. కేరళ చర్యలను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తక్షణం న్యాయపోరాటానికి చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం ఇడిక్కిలోని ముల్లైపెరియార్ జలాశయంపై తమిళనాడుకు ఉన్న పూర్తి హక్కులను కాలరాసే విధంగా మళ్లీ కేరళ పాలకులు చేపట్టిన చర్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ జలాశయాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన అనుమతుల కోసం కేంద్రానికి కేరళ పాలకులు నివేదిక పంపించడం, ఈనెల 28వ తేదీ ఈ వ్యవహారం చర్చకు రాబోతున్న సమాచారంతో ఆ జలాశయం మీద ఆధార పడిన తేని, విరుదునగర్, మదురై, దిండుగల్, రామనాథపురం, శివగంగై జిల్లాల్లోని రైతుల్లో ఆగ్రహం రేగింది. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి రెండు రాష్ట్రాల మధ్య వివాదం భగ్గు మనకుండా సమన్వయం పాటిస్తున్నారు. అదే సమయంలో అక్కడక్కడ కేరళ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. డీఎంకే ప్రభు త్వాన్ని టార్గెట్ చేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. శివందీ నదీ తీరంలో చెక్ డ్యాం నిర్మాణాల చోద్యం చూసిన డీఎంకే పాలకులు ముల్లైపెరియార్ వ్యవహారంలోనూ అదే బాట అనుసరిస్తారన్న విమర్శలు గుిప్పిస్తున్నాయి. శివందీ నీటి పరిరక్షణ నినాదంతో శనివారం తిరుప్పూర్లో భారీ నిరసనలకు రైతులు పిలుపునివ్వడం గమనార్హం. న్యాయంపోరాటానికి పట్టు.. ఈ వ్యవహారంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పందిస్తూ, ఈనెల 28వ తేదీ జరిగే సమావేశంలో కేంద్రం ఏదేని అనుమతులు ఇచ్చేలోపు ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటంపై దృష్టిపెట్టాలని సూచించారు. గతంలో సుప్రీంకోర్టు తమిళనాడుకు అనుకూలంగా వచ్చిన తీర్పుల ఉత్తర్వులను అస్త్రంగా చేసుకుని న్యాయపోరాటానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. మౌనం వహిస్తే తమిళుల హక్కులను కాలరాసేస్తారని హెచ్చరించారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ ఈ వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వం నాటకం ఆడుతున్నట్టుందని మండిపడ్డారు. కేరళలో వారి మిత్రపక్షమైన వామ పక్ష పార్టీ ప్రభుత్వం ఉందని, అందుకే చూసీచూడనట్టుగా వ్యవహరిస్తూ తమిళ రైతుల హక్కులను తాకట్టు పెట్టే పనిలో పడ్డారని ఆరోపించారు. రెండో రోజూ సీఎస్ భేటీ.. శివందీ నది తీరంలో చెక్డ్యాం నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ ఇప్పటికే కేరళ సీఎం పినరాయ్ విజయన్కు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. తమిళ హక్కులకు భంగం కల్గించవద్దు అని, ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతకు ఇబ్బందులు కల్గకుండా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ పరిస్థితులలో శుక్రవారం సాయంత్రం రెండో రోజుగా సీఎస్ శివదాస్ మీనా సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నీటి పారుదల, రెవెన్యూ విభాగాల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కేరళ చర్యలను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఈనెల 28న ఢిల్లీలో జరగనున్న సమావేశంలో కేంద్రం ముందు ఉంచాల్సిన వాదనలు, ఇతర అంశాలను చర్చించారు. అలాగే, అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధమయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. పరిశీలనకు తీసుకోవద్దు.. డ్యాం వ్యవహారంపై సీఎం స్టాలిన్ శుక్రవారం సాయంత్రం స్పందించారు. కేరళ చర్యలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులోభాగంగా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రికి లేఖ రాశారు. ముల్లైపెరియార్ జలాశయం వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన్నట్టు వివరించారు. కొత్త డ్యాం నిర్మాణంపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకోవద్దని సూచించారు. ముల్లైపెరియార్ డ్యాం పటిష్టంగా ఉందని నిపుణుల కమిటీ సైతం స్పష్టం చేసిందన్నారు. తమతో సంప్రదింపులు జరపకుండా ఈ డ్యాం విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం, అనుమతులు ఇచ్చే అవకాశం కేంద్రానికి లేదన్నారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఆదేశాల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని, కేరళ చర్యలు కోర్టు ధిక్కార పరిధిలోకే వస్తాయని వివరించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము స్పష్టమైన అభ్యంతరాలు, వ్యతిరేకతను తెలియజేశామని, ఈ దృష్ట్యా 28వ తేదీన జరిగే సమావేశంలో కొత్త డ్యాం అంశంపై చర్చకు సంబంధించిన అజెండాను పక్కన పెట్టాలని, కేరళ ప్రతిపాదనలను పరిశీలనకో, పరిగణనలోకి తీసుకోవద్దు అని కోరారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి కొత్త ప్రతిపాదనలు, అనుమతులకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ముల్లైపెరియార్ జలాశయం -
21 కిలోల గంజాయి స్వాధీనం
సేలం: ఈరోడ్లో రైలులో అక్రమంగా తరలిస్తున్న రూ.7లక్షల విలువైన 21 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని శుక్రవారం వేకువజామున అరెస్టు చేశారు. ఈక్రమంలో ఈరోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో విక్రయించడానికి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్లు ప్రొహిబిషన్ పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు డీఎస్పీ షణ్ముగం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న మనోజ్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఒడిశాకు చెందిన అతను, తిరుపూర్ జిల్లా ఉడుమలైపేటైలో నివసించే అమన్కుమార్ వద్దకు బీహార్ నుంచి రై లులో 21 కిలోల గంజాయి తీసుకొచ్చినట్లు తెలిసింది. నామక్కల్ సహా ఇతర జిల్లాలకు ఈ గంజా యిని తరలిస్తారని విచారణలో తెలిసింది. దీంతో పోలీసులు అమన్కుమార్ను కూడా అరెస్టు చేశారు. తర్వాత ఇద్దరిని రిమాండ్కు తరలించారు. ● ఇద్దరి అరెస్టు -
క్లుప్తంగా
వేడుకగా ఊంజల్ సేవ తిరుత్తణి: పౌర్ణమి సందర్భంగా ద్రౌపదీదేవి ఊంజల్సేవను గురువారం రాత్రి నిర్వహించా రు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుత్తణి గాంధీ రోడ్డు మార్గంలోని ద్రౌపదీదేవి ఆలయంలో పౌర్ణమి పూజలు చేశారు. అమ్మవారికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఊంజల్ సేవ సందర్భంగా ద్రౌపదీదేవి ఉత్సవమూర్తులకు పుష్పాలతో అలంకరించి, ఊంజల్ సేవ నిర్వహించారు. దుకాణాల తొలగింపు తిరువళ్లూరు: ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా రోడుకిరువైపులా వెలిసిన దుకాణాలను మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో శుక్రవారం ఉదయం నుంచి తొలగించారు. తిరువళ్లూరులోని సీవీనాయుడు రోడ్డు, జేఎన్ రోడ్డు, బజారువీధి, మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పండ్లు, పూల దుకాణా లు వెలిశాయి. ఈ దుకాణాలకు వచ్చే వారు అడ్డదిడ్డంగా వాహనాలను ఆపిపేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనా ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే మున్సిపల్ కమిషనర్ సుభాషిణి, సీఐ అంథోని స్టాలిన్, మహిళ విభాగం జాయింట్ డైరెక్టర్ సెల్వరాణి ఆధ్వర్యంలో సిబ్బంది రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాలను తొలగించారు. దుకాణాలను తొలగించే సమయంలో వ్యాపారులకు, అధికారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. -
గోడౌన్లో స్పృహ తప్పిన కార్మికుడి మృతి
తిరువళ్లూరు: గోడౌన్లో స్పృహ తప్పిన ప్రైవేటు సంస్థ కార్మికుడ్ని వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తూత్తుకుడి జిల్లా మాధులపురం గ్రామానికి చెందిన ఆళగర్స్వామి కుమారుడు సోలైస్వామి(40) మప్పేడు సమీపంలోని ఆళింజివాక్కంలో ఉన్న ఇన్స్టా మెక్ కన్స్ట్రక్షన్ సంస్థలో రెండేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత 20వ తేదీన సంస్థలో పని చేస్తూ గోడౌన్కు వెళ్లిన సోలైస్వామి స్పృహ తప్పి పడిపోయాడు. ఆలస్యంగా గుర్తించిన సహచర సిబ్బంది మప్పేడులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడ చికిత్స అందించిన తరువాత తండలంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. -
ఆక్రమణలు తొలగించాలి
వేలూరు: కార్పొరేషన్ పరిధిలోని వాగులు, కాలువ లు, డ్రైనేజీ కాలువలపై ఉన్న ఆక్రమణలను వెంట నే తొలగించి డ్రైనేజీ నీరు సక్రమంగా వెళ్లేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేషన్ ప రిధిలోని ఆరో వార్డులో రాజావల్లి నగర్, వీఐటీ మె యిన్గేట్, చైన్నె రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆమె అ కస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ కాలువల్లో పూడిక తీత పనుల ను చేపట్టాలన్నారు. రానున్న వర్షా కాలంలో వర్షపు నీరు రోడ్డుపైకి రాకుండా చూడాలన్నారు. అలాగే కార్పొరేషన్లోని పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా కేటాయించిన ప్రాంతంలోనే చెత్తను వేసి, దాన్ని సేంద్రియ ఎరువుగా తయారు చేసి విక్రయించాలన్నారు. మొ త్తం 60 వార్డుల్లో సేకరించే ప్లాస్టిక్ వస్తువులు పూర్తి గా ఒక చోట చేర్చి, వాటిని అరియలూరు సిమెంట్ కంపెనీకి విక్రయించేలా చూడాలన్నారు. అనంత రం చెత్తను సేంద్రియ ఎరువులుగా తయారు చేసే కేంద్రాన్ని తనిఖీ చేసి, ఎరువులను ఎంత ధరకు వి క్రయిస్తున్నారన్న విషయం అడిగి తెలుసుకున్నారు. అలాగే విరుదంబట్టులోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి, రేషన్ కార్డు దారులకు సక్రమంగా నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారా? లేదా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ఆమెతో పాటు కార్పొరేషన్ కమిషనర్ జానకి, జోన్ అధికారి సెంథిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ శివకుమార్, కార్పొరేటర్ శ్రీనివాసన్, కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. -
నీట్ అవసరంపై అంజామై
తమిళసినిమా: వైద్యవిద్యలో నీట్ పరీక్షల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా నీట్ పరీక్షల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కారణంగా నీట్ వద్దని తమిళనాడుసహా పలు రాష్ట్రాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది నీట్ పరీక్షల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎలాంటి చిత్రం రూపొందలే దు. కాగా తొలిసారిగా అలాంటి కథతో అంజామై అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు మోహ న్రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడి గా పని చేసిన సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. నటుడు విదార్థ్, వాణిభోజన్, రఘుమాన్, క్రితిక్ మోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తిరుచ్చిత్రం పతాకంపై డాక్టర్ ఎన్.తిరునావుక్కరసు నిర్మించారు. మనోతత్త్వ వైద్యుడు, ఉపాధ్యాయుడు అయిన ఈయన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో నిత్ర నిర్మాణం చేపట్టి నిర్మించిన తొలి చిత్రం అంజామై. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన ఈ చిత్రం విడుదల హక్కులను పూర్తిగా డ్రీమ్ వారియర్స్ సంస్థ పొందడం విశేషం. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ అంజామై చిత్రాన్ని కొనుగోలు చేయడం విశేషం. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
కియారా మాత్రమే కాదు..
కూలీ తరువాత దానికి సీక్వెలే నటి జాన్వీకపూర్తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ జోరు మామూలుగా లేదుగా! ఎవరన్నారు ఈయన వయసు ఏదు పదులకు పైన అనీ. ఆ వయసులో నాన్నా, తాత వంటి క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తారు. అయితే ఇక్కడున్నది సూపర్స్టార్. సూపర్హిట్ చిత్రాల ఎవర్గ్రీన్ హీరో. ఇటీవల రజనీకాంత్ కధానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఇండిస్ట్రీ ిహిట్ గా నమోదైంది. ప్రస్తుతం జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటించారు. ఇది ఈయన నటించిన 170వ చిత్రం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే వేట్టైయాన్ తెరపై వసూళ్ల వేటకు సిద్ధం అవుతోంది. కాగా రజనీకాంత్ తాజాగా తన 171వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని సెన్సేషనల్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తెరకెక్కించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్లో ప్రారంభం కానుంది. దీనికి కూలీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో నటి శృతిహాసన్ ప్రధాన పాత్రను పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ప్రారంభం కాక ముందే రజనీకాంత్ తదుపరి చిత్రం గురించి ప్రచారం జరుగుతోంది. ఆయన నటించనున్న 172వ చిత్రం జైలర్ 2 అని తాజా సమాచారం. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్ ఉంటుందని నెల్సన్ అప్పుడే పేర్కొన్నారు. కాగా జైలర్ 2 చిత్రానికి కథను రెడీ చేసినట్లు, దీనికి ఆ చిత్రంలో చోటు చేసుకున్న హుకుమ్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో రజనీకాంత్ కెరీర్లో మరో సూపర్హిట్ చి త్రం అవుతుందని చె ప్పవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన రావడానికి మరి కొంత కాలం పడుతుంది.తమిళసినిమా: బాలీవుడ్ హీరోయిన్లు ఇప్పుడు దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారన్నది కాదన్నలేని నిజం. ప్రముఖ ఉత్తరాది బ్యూటీలు సైతం దక్షిణాది చిత్రాల అవకాశాలకు సై అంటున్న వైనం. ఇలియా నా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా నటి జాన్వీకపూర్ ఈ పట్టికలో చేరారు. దివంగత అందాలరాశి శ్రీదేవి వారసురాలైన ఈ మగువ ఇప్పటికే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో రామ్చరణ్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే నటి కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్చరణ్కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ ఇద్దరూ కలిసి ఒక చిత్రంలో నటిస్తే. అదీ తమిళ సినిమా అయితే, అందులో సంచలన నటుడు శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్గా ఉంటుంది కదూ ఎస్ అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. శింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. విశేషం ఏమిటంటే ఇందులో శింబుకు జంటగా నటి త్రిష నటిస్తున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ చిత్రం తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నా యి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవ ల విడుదల చేసిన సంగ తి తెలిసిందే. అందులో ఇద్ద రు శింబులు తలపడేలా ఉన్న దృశ్యం చోటు చేసుకుని చిత్రంపై అంచనాలను పెంచేసింది. కాగా శింబు ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు, అందులో ఒక పాత్ర హీరో, మరో పాత్ర విలన్ అనీ, అందేలా ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయకిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఇకపోతే తాజాగా మరో నాయకిగా జాన్వీకపూర్ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే కనుక నిజం అయితే ఈ క్రేజీ చిత్రం ద్వారా నటి కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. చిత్రం జూన్ నెలలోనే సెట్ పైకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.రజనీకాంత్ -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
వేలూరు: పట్టణంలోని పలు ప్రాంతాల్లో తరచూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న బంగారం, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వేలూరు కొనవట్టం సమీపంలోని లక్ష్మీనగర్కు చెందిన ఇంతియాస్ అహ్మద్ గత 12వ తేదీన ఇంటికి తాళం వేసి కస్పాలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూడగా ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి ఉండడాన్ని చూసి, ఇంట్లో పరిశీలించగా బంగారం, వెండి, ల్యాబ్టాప్ తదితర వస్తువులను చోరీ జరిగి నట్లు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యా దు చేశాడు. పోలీసులు విరింజిపురం ప్రాంతానికి చెందిన సూర్య, వేలూరు సంపత్ నగర్కు చెందిన సెల్వ ను అనుమానించి, అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వీరిద్దరూ లత్తేరి, కస్పా వంటి ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. వీరిద్ద రితో పాటు కొనవట్టం ప్రాంతానికి చెందిన సంతోష్తో కలిసి రోజూ ఏదో ఒక ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. దీంతో వారి వద్ద నుంచి రూ.లక్షలు విలువ చేసే బంగారం, వెండి, ల్యాప్టా ప్, బైకులను స్వాధీనం చేసుకుని, వేలూరు కోర్టులో హాజరు పరిచి, సెంట్రల్ జైలుకు తరలించారు. -
ట్రాన్స్ఫార్మర్లో వైర్లు చోరీ
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరులో 250 కేవీ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరాను నిలిపి వేసి, అందులోని రూ. 3 లక్షలు విలువ చేసే కాపర్ వైర్లను చోరీ చేసిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. ఆంబూరులోని మారుమూల ప్రాంతంలో విద్యుత్ శా ఖ ఆధ్వర్యంలో 250 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పా టు చేసి, గ్రామానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే గురువారం రాత్రి ఉన్న ఫళంగా 12 గంటల సమయంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో తరచూ విద్యుత్ సరఫ రా అంతరాయం ఏర్పడుతుందనే నిర్లక్ష్యంగా గ్రామస్తులు నిద్రించారు. శుక్రవారం ఉద యం వరకు విద్యుత్ సరఫరా రాకపోవడంతో గ్రామస్తులు విద్యుత్ శాఖ లైన్మెన్కు ఫోన్ చేసి, విచారించారు. దీంతో లైన్మెన్ ఉద యం గ్రామం వద్దకు వచ్చి తనిఖీ చేయగా ట్రాన్స్ఫార్మర్లోని విద్యుత్ సరఫరాను నిలిపి వేసి, అందులోని విలువైన రాగి వైర్లు, ముఖ్యమైన వస్తువులను చోరీ చేసి, బాక్సును మా త్రం అక్కడే వదిలి పెట్టి ఉండటాన్ని గమనించి ఉన్నతాఽధికారులకు సమాచారం అందజే శారు. దీంతో విద్యుత్శాఖ అసిస్టెంట్ ఇంజినీ ర్ కార్తికేయన్, ఆంబూరు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. -
ఆనంద్కృష్ణన్ నాన్ వైలెన్స్
కవిన్ చిత్రంలో లేడీసూపర్స్టార్? తమిళసినిమా: మెట్రో, కోడియిల్ ఒరువన్ వంటి సక్సెస్పుల్ చిత్రాలను ఇంతకుముందు తెరకెక్కించిన ఆనంద్కృష్ణన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి నాన్ వైలెన్స్ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో బాబీసింహా, మెట్రోశిరీష్, యోగిబాబు, అతిథిబాలన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతం అందిస్తున్నారు. ఏకే.పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను మెట్రో శిరీష్ శుక్రవారం తన ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టర్లో సగభాగంలో పదునైన కత్తులు, మరో సగ భాగంలో మంటల్లో కాలుతున్న ఒక ముఖం దృశ్యాలు చోటుచేసుకున్నాయి. దీంతో చిత్రం ఫస్ట్లుక్తో పాటు నాన్ వైలెన్స్ చిత్ర కథ ఎలా ఉంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. వైవిద్యభరిత కథ, కథనాలతో రూపొందుతున్న నాన్ వైలెన్స్ చిత్రా న్ని ఈ ఏడాదిలోనే తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
వైభవంగా అర్ధనారీశ్వరస్వామి రథోత్సవం
సేలం: తిరుచెంగోడులోని అర్ధనారీశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోడులోని అర్ధనారీశ్వరస్వామి దేవాలయంలో వైకాసి విశాఖ సందర్భంగా ఈ నెల 14వ తేదిన ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రథాన్ని పండ్ల బజార్ వద్దకు చేర్చి, ప్రత్యేకంగా అలంకరించి సిద్ధం చేసి ఉంచారు. శుక్రవారం ఉదయం అర్ధనారీశ్వరస్వామివారికి, వినాయకు డు, సుబ్రమణ్య స్వామి తదితర పరివార దేవతలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చి రథాన్ని పుర వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తితో అర్ధనారీశ్వరస్వామి రథాన్ని లాగారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం అర్ధనారీశ్వర స్వామి పరివార దేవతలతో కలిసి కొండకు తరలే కార్యక్రమం జరగనుంది. రథోత్సవం సందర్భంగా భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. -
విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి
అన్నానగర్: విద్యుత్ షాక్కు గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. సేలం జిల్లాకు చెందిన అన్బళగన్ (29). చైన్నెలోని వెస్ట్ తాంబరంలో ఉంటూ, కాటుప్పాక్కం పూందమల్లి అమ్మన్నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ భవనం గోడకు శుక్రవారం సిమెంట్ ప్లాస్టింగ్ పనిచేస్తున్నాడు. ఇందుకోసం సమీపంలోని ట్రాన్న్స్ఫారంపై ఇనుపరాడ్లు కట్టి పనిచేస్తున్నాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తు ట్రాన్న్స్ఫార్మర్ నుంచి వస్తున్న హైవోల్టేజీ తీగపై అన్బళగన్ కాలు తగలడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పూందమల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవిన్ కేంద్రంలో అవినీతి
తిరువళ్లూరు: కాకలూరులోని ఆవిన్ పాలకేంద్రంలో భారీగా అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్కు అందిన సమాచారం మేరకు అధికారులు చేపట్టిన తనిఖీల్లో గుట్టురట్టు అయ్యింది. ఆవిన్ కేంద్రం నుంచి రోజుకు 1,620 లీటర్ల పాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించిన విజిలెన్స్ అధికారులు షాక్కు గురయ్యారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరులోని ఆవిన్ పాల కేంద్రంలో పాడి రైతుల నుంచి రోజుకు లక్ష లీటర్లు పాలను సేకరించి 90 వేల లీటర్ల పాలను ప్యాకెట్ల రూపంలో ప్రజల కోసం వినియోగిస్తున్నారు. మిగిలిన పది వేల లీటర్లలో పెరుగు, మజ్జిగ, స్వీట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కాకలూరులో ఆవిన్పాల కేంద్రంలో తయారయ్యే పాల ప్యాకెట్లను 26 నుంచి 30 లారీల ద్వారా వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. కాగా కాకలూరు ఆవిన్ కేంద్రంలో కొద్ది రోజులుగా భారీగా పాలను ఆక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు విజిలెన్స్ ఽఅధికారులకు సమాచారం అందింది. దీంతో డీఎస్పీ సత్యశీలన్ నేతృత్వంలోని విజిలెన్స్ అధికారులు గురువారం రాత్రి 2 గంటలకు పాల వ్యాన్ వెళ్లే మార్గంలో నిఘా వుంచారు. నిఘాలో చెంగల్పట్టు, కాంచీపురం వెళుతున్న రెండు లారీలను మనవాలనగర్ వద్ద అడ్డుకున్న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో ఇండెక్స్లో వున్న సంఖ్య కంటే రెండు లారీల్లో 1,620 లీటర్ల పాలు ఎక్కువగా వున్నట్టు గుర్తించిన అధికారులు లారీని ఆవిన్ కేంద్రానికి తీసుకెళ్లి విచారణ చేశారు. విచారణలో రెండు మూడు నెలల నుంచి రోజుకు వెయ్యి లీటర్లకు పైగా పాల ప్యాకెట్లు, ఆవిన్ వస్తువులను గుట్టు చప్పుడు కాకుండా తరలించి విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. ఇప్పటి వరకు రూ.2కోట్ల మేరకు ఆవిన్లోని రెగ్యులర్, కాంట్రాక్ట్ సిబ్బంది కాజేశారని నిర్ధారించి నివేదికను సిద్ధం చేశామని వీటిని ఆవిన్ ఎండీకి సమర్పిస్తామని వివరించారు. అవినీతిపై జనరల్ మేనేజర్ రమేష్కుమార్ మాట్లాడుతూ ఆవిన్లో అక్రమాలు జరిగినట్టు విజిలెన్స్ నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తప్పు చేసిన రెగ్యులర్ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామన్నారు. దీంతో పాటు అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. విజిలెన్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ నాలుగు నెలలుగా సాగుతున్న దందా అధికారులు కాంట్రాక్ట్ సిబ్బందిపై చర్యలు -
క్లుప్తంగా
ప్రైవేట్ కంపెనీలో అగ్నిప్రమాదం ● రూ. 6 కోట్ల విలువైన వస్తువులు దగ్ధం తిరువొత్తియూరు: చైన్నె తండయార్ పేటలో ప్రైవేటు కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.6 కోట్ల విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చైన్నె పురసైవాక్కం, వేప్పేరికి చెందిన మనోజ్ కుమార్ పారిశ్రామికవేత్త. ఇతను తండయార్పేట వైద్యనాథన్ వంతెన కింద 7 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్సులేషన్ టేపు, సెల్లో టేపు తయారు చేసే కంపెనీ నడుపుతున్నాడు. కంపెనీలో 10 మందికి పైగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి కంపెనీ నుంచి 11.30 గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అయితే అప్పటికే కంపెనీలోని రూ.6 కోట్లు విలువ చేసే వస్తువులు దగ్ధమయ్యాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపున్నారు. గంజాయి స్వాధీనం అన్నానగర్: ఆంధ్రా నుంచి చైన్నెకి రెండు లగ్జరీ కార్లలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్, ముత్తపుదుపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆవడి, ముత్త పుదుపేటలో గురువారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్తో రెండు లగ్జరీ కార్లు ఆగకుండా వెళ్లాయి. దీంతో పోలీసులు కార్లను వెంబడించి వేళచ్చేరి సర్వీస్ రోడ్డు సమీపంలో అడ్డుకుని సోదాలు చేశారు. ఆంధ్రా నుంచి చైన్నెకి కార్లలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. రెండు లగ్జరీ కార్లతో పాటు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ కేసు నమోదు చేసి నాగమల్లేశ్వరరావు (32), నాని (25), ధనరాజ్ (28) అనే ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 24 బస్సులకు జరిమానా అన్నానగర్: చైన్నె సమీపం కిలాంబాక్కం సబర్బన్ బస్స్టేషన్కు ఎదురుగా ఉన్న రోడ్డులో శుక్రవారం సెమ్మంజేరి ట్రాఫిక్ సీఐ హేమంత్కుమార్ నో పార్కింగ్ ప్రాంతాల్లో ఆపిన తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ, తమిళనాడు ప్రభుత్వ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆమ్నీ బస్సు, మున్సిపల్ బస్సులు సహా 24 బస్సులకు రూ.1000 చొప్పున జరిమానా విధించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ప్రభుత్వ బస్సు డ్రైవర్లు.. ఎప్పటిలాగే ప్రయాణికులను దించేసి వెళతాం.. అయితే ఈరోజే ఎందుకు జరిమానా విధిస్తున్నారు అని ప్రశ్నించారు. ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ ప్రయాణికులను రోడ్లలో దింపడం, ఎక్కించుకోవడం.. నో పార్కింగ్ స్పాట్లలో ప్రయాణికులను దించడం నేరం.. దీంతో ప్రయాణికులు ప్రమాదకరంగా రోడ్డు దాటాల్సి వచ్చి ప్రమాదాలకు గురవతున్నారని అన్నారు. ప్రయాణికులను కిలాంబాక్కం బస్స్టేషన్లో దింపాలని ఆయన డ్రైవర్లకు సూచించారు. దాడి కేసులో వ్యక్తి అరెస్ట్ పళ్లిపట్టు: జాతర లెక్కలు అడిగినందుకు దాడి చేసిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామంలో జాతరకు సంబంధించి గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న గ్రామానికి చెందిన మణి(46) జాతర ఖర్చులకు సంబంధించిన వివరాలు అడిగాడు. ఆగ్రహం చెందిన అదే గ్రామానికి చెందిన అన్నాదురై (50) మణిపై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పళ్లిపట్టు పోలీసులు అన్నాదురైను అరెస్ట్ చేసి తిరుత్తణి సబ్జైలుకు తరలించారు. విద్యార్థి ఆత్మహత్య తిరువొత్తియూరు: హోటల్ గదిలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మపురి జిల్లాకు చెందిన కమల్ కుమారుడు కదిరవన్ (20) పూందమల్లి సమీపంలోని నసరత్తు పేటలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. తాంబరంలో తన కళాశాల స్నేహితులతో కలిసి ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. గురువారం కదిరవన్ వెస్ట్ మాంబలం బృందావన్ వీధిలో ఉన్న హోటల్లో ఒక గది తీసుకున్నాడు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలు సమయంలో ఒక్కొక్క గదిని ఉద్యోగి సంతోష్ తనిఖీ చేశాడు. ఆ సమయంలో కదిరవన్ గదికి వెళ్లి చూడగా అతను ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో సురేష్ హోటల్ మేనేజర్కు విషయం చెప్పాడు. మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్యాధునిక క్లీనింగ్ యంత్రాలు కొరుక్కుపేట: చైన్నె ఎయిర్పోర్ట్లో క్లీనింగ్ పనులు చేపట్టేందుకు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన రెండు మెకానికల్ క్లీనింగ్ మిషనన్లను చైన్నె ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సీవీ దీపక్ ప్రారంభించారు. చైన్నె విమానాశ్రయంలో శుభ్రత, నిర్వహణ పనులను ఎయిర్పోర్ట్ లోడర్లు చేస్తుంటాయి. ఇవి కొన్నిసార్లు సరిగ్గా శుభ్రం చేయవు. దీంతో ఒక్కోసారి విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విమానాశ్రయాలలో అధునాతన సాంకేతిక సౌకర్యాలతో కూడిన క్లీనింగ్ మెషిన్లను ఉపయోగించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రెండు అధునాతన సాంకేతికతతో కూడిన మొబైల్ క్లీనింగ్ మెషిన్లను సీవీ దీపక్ ప్రారంభించారు. -
యువతికి లైంగిక వేధింపులు
● ఉత్తరాది యువకుడి అరెస్ట్ తిరువొత్తియూరు: మద్రాసు హైకోర్టు మెట్రో రైల్వేస్టేషన్ లిఫ్ట్లో యువతికి లైంగిక వేధింపులకు గురి చేసిన ఉత్తరాది యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వేలూరు జిల్లాకు చెందిన 24 ఏళ్ల యువతి యూట్యూబర్. ఈమె హోటల్, జౌలీ దుకాణం, ఆహారం, ఇతర వస్తువులు గురించి వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో చైన్నెకి వచ్చి ఈమె మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి హైకోర్టు మెట్రో రైల్వేస్టేషన్కు వచ్చింది. అప్పుడు ఆమె రైల్వేస్టేషన్లో ఉన్న లిఫ్టులో ఎక్కారు. వెంటనే ఉత్తరాది రాష్ట్రానికి చెందిన యువకుడు అదే లిఫ్ట్లో ఆమెతో వచ్చాడు. లిఫ్ట్లో వెళుతున్న క్రమంలో హఠాత్తుగా యువకుడు యువతని లైంగికంగా వేధించాడు. లిఫ్ట్ ఆగిన వెంటనే అతను మెట్రో రైల్వేస్టేషన్ నుంచి బయటకు పారిపోయాడు. దిగ్భ్రాంతి చెందిన ఆమె ఎస్ప్లనేడు మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మెట్రో రైల్వేస్టేషన్లోని సీసీ కెమెరాల్లో తనిఖీ చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో యువతిని లైంగికంగా వేధించిన బిహార్కు చెందిన అమర్కుమార్ (20)ను ఇన్స్పెక్టర్ ప్రేమ అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
భోజన విరామ సమయం తగ్గింపు
అన్నానగర్: రాష్ట్రంలో మధ్యాహ్నం పూట రేషన్ షాపుల మూసివేత సమయాన్ని తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. తమిళనాడు వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. చైన్నె, నగర శివారు ప్రాంతాల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు రేషన్ షాపులు పనిచేస్తున్నాయి. ఇతర జిల్లాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నాయి. చైన్నె, నగర శివారు ప్రాంతాల్లో మధ్యాహ్నం రేషన్ దుకాణాలను మూసివేయడానికి, తిరిగి తెరవడానికి 2.30 గంటల విరామ సమయం ఇస్తున్నారు. ఆ సమయంలో కార్డుదారులు కొనుగోలు చేయని ఉత్పత్తులను దుకాణం నుంచి బయటకు పంపడంతోపాటు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు సహకార, ఆహార శాఖ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో తేలింది. దీంతో మధ్యాహ్నం పూట రేషన్ షాపుల మూసివేత సమయాన్ని తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. రేషన్ షాపుల పని వేళలు, సెలవుల మార్పునకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అలాగే, ప్రస్తుతం నెలలో మొదటి 2 శుక్రవారాలు సెలవు, మొదటి 2 ఆదివారాలు పని దినాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకే రోజు సాధారణ సెలవులు ఇవ్వాలని యోచిస్తోంది. ఆదివారం సెలవుదినంగా ప్రకటించాలని రేషన్షాపుల కార్మికులు కోరుతున్నారు. రేషన్ దుకాణ పనివేళల్లో మార్పు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
అన్నానగర్: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లా తిరుతురపూండి విహారల్ వీధికి చెందిన మణికంఠన్ (33) గురువారం రాత్రి మన్నార్గుడి నుంచి బైకులో తిరుత్తరపూండి వైపు బయలుదేరాడు. అదే సమయంలో తిరుతురపూండి మాదాపురానికి చెందిన రాబర్ట్ (38), రాజ్యలక్ష్మితో బైకులో మాదాపురం నుంచి పల్లంకోయిల్కు వెళుతున్నారు. ఆ సమయంలో మణికంఠన్ పల్లంగోవిల్ సమీపంలోని సుమతాంగి అనే ప్రాంతంలో ఎదురుగా ఉన్న కారును తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న రాబర్ట్ బైకును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మణికంఠన్, రాబర్ట్, రాజ్యలక్ష్మి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మణికంఠన్, రాబర్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రాజ్యలక్ష్మి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతులు మణికంఠనన్, రాబర్ట్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాము కాటుకు వృద్ధుడి మృతి తిరువళ్లూరు: ఇంట్లో చొరబడిన పామును చంపడానికి యత్నించిన వృద్ధుడు పాము కాటుకు బలైన సంఘటన ఆరంబాక్కంలో విషాదం నింపింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా ఆరంబాక్కం ఎల్ఆర్ మేడు ఎస్టీ కాలనీకి చెందిన మునస్వామి(63) కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. ఈ క్రమంలో గత 21వ తేదీ రాత్రి ఏడుగంటల సమయంలో ఇంట్లోకి నాగుపాము చొరబడింది. పామును గుర్తించిన కుంటుబసభ్యులు బయటకు వెళ్లిపోగా మునస్వామి పామును చంపడానికి యత్నించాడు. ఈ సమయంలో అతడు పాము కాటుకు గురి కావడంతో బంధువులు గుమ్మిడిపూండి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత 108 ద్వారా చైన్నె స్టాన్లీ వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఆరంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ వేడుకల్లో అపశృతి –మేక రక్తం తాగి పూజారి మృతి సేలం: ఈరోడ్ సమీపంలో జరిగిన ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. మేక రక్తం తాగిన పూజారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈరోడ్ సమీపంలోని గోపిచెట్టి పాళయం వద్ద ఉన్న నల్లకౌండం పాళయంకు చెందిన పళనిస్వామి (56). ఈయన కొలప్పలూర్ చెట్టియం పాళయంలోని అనమలైయార్ ఆలయ పూజారి. ఆలయంలో ఉత్సవాల సందర్భంగా గురువారం ఆలయ ప్రాంగణంలో భక్తులు మేకలను బలి ఇచ్చారు. మేకల రక్తాన్ని పళనిస్వామి సహా ఐదుగురు పూజారులు తాగారు. కొంతసేపటికి పళనిస్వామి వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతన్ని గోపిచెట్టి పాళయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పళనిస్వామిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిపారు. -
రూ.7.50 కోట్ల మోసం
● ముగ్గురు బ్యాంకు మేనేజర్ల అరెస్ట్ అన్నానగర్: శివకాశిలో నకిలీ నగలు తాకట్టు పెట్టి రూ.7.50 కోట్లు మోసానికి పాల్పడిన ముగ్గురు బ్యాంకు మేనేజర్లను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విరుదునగర్ జిల్లా శివకాశీ బస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేట్ భవనంలో జాతీయ బ్యాంకు నడుస్తోంది. ఈ బ్యాంకులో గత ఫిబ్రవరిలో నగలు రుణం పొందిన వారి వివరాలను బ్యాంకు నైల్లె రీజనల్ మేనేజర్ రంజిత్ పరిశీలించారు. రుణాలు తీసుకున్న వారి వివరాలు, తాకట్టు పెట్టిన నగలను ఆయన పరిశీలించారు. ఆ సమయంలో కొన్ని నగలు నకిలీవని తేలింది. అనంతరం ఈ విషయాన్ని బ్యాంకు యాజమాన్యానికి తెలియజేసి నకిలీ నగలు ఇచ్చి రుణాలు పొందిన వారిపై శివకాశి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ నగలు తాకట్టు పెట్టి రూ.7 కోట్ల 50 లక్షలు రుణం పొందిన తూత్తుక్కుడి జిల్లా కి చెందిన బాలసుందరం, అతడికి సహకరించిన ఆ బ్యాంకులో పనిచేసిన నగల వ్యాపారి ముత్తుమణిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేసు విచారణ నిమిత్తం జిల్లా క్రైం బ్రాంచ్కు బదిలీ చేశారు. మార్చి నుంచి పోలీసులు వివిధ కోణాల్లో ముమ్మరంగా విచారణ చేశారు.బ్యాంకులో జరిగిన మోసానికి బ్యాంక్ మేనేజర్ కుమార్ అమరేష్ (37), డిప్యూటీ మేనేజర్ అరవింద్ (28), అసిస్టెంట్ మేనేజర్ ముఖేష్ కుమార్ (29) సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు బ్యాంకు మేనేజర్లను గురువారం అరెస్టు చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement