తామరాకులకు వెళ్లి మృత్యువాత | Man drowned in pond | Sakshi
Sakshi News home page

తామరాకులకు వెళ్లి మృత్యువాత

Published Tue, Sep 15 2015 6:57 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల కొండాపూర్ గ్రామంలో తామరాకుల కోసం చెరువులోకి వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.

పెద్దేముల్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండల కొండాపూర్ గ్రామంలో తామరాకుల కోసం చెరువులోకి వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం...వినాయక చవితి పండుగ సందర్భంగా వికారాబాద్ ప్రాంతానికి చెందిన లాలప్పతోపాటు పలువురు సోమవారం కొండాపూర్ పెద్ద చెరువులో తామరాకులు తెంపటానికి వెళ్లారు. అయితే చెరువులో దిగిన లాలయ్య సాయంత్రమైనా తిరిగి ఒడ్డుకు చేరుకోలేదు. దీంతో తోటివారు చెరువులో వెతికారు. అయినా ఫలితం లేదు. మంగళవారం లాలప్ప కుటుంబసభ్యులు మరోసారి చెరువులో వెతకగా మృతదేహం దొరికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement