
భక్తుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నారాయణుడి ఆశీస్సులు మోసుకొచ్చి గరుడ పక్షి రాకతో చదలవాడ రఘునాయకుని కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు

స్వామి వారి కల్యాణ ఘట్టంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే గరుడ పక్షి రాకకోసం ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఎదురు చూశారు

నారాయణ నామస్మరణ మార్మోగుతున్న సమయంలో ఉదయం 11.30 గంటలకు గరుడ పక్షి కల్యాణ మండపంపై మూడు ప్రదక్షిణలు చేయడంతో రఘునాయకస్వామి కళ్యాణ ఘట్టాన్ని పండితులు పూర్తి చేశారు

అనంతరం సాయంత్రం గ్రామంలో నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










