Home space
-
మారుతున్న ట్రెండ్: ఇప్పుడంతా ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో సంప్రదాయ షాపింగ్ మాల్స్కు కాలం చెల్లింది. ఇల్లు, ఆఫీసు, మాల్ అన్నీ ఒకే చోట ఉండే మిశ్రమ వినియోగ భవనాలు ఊపందుకుంటున్నాయి. నగరవాసులు నివాసం ఉండే చోటుకు సమీపంలోనే కార్యాలయం, వారాంతాల్లో కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు షాపింగ్ మాల్ కూడా దగ్గర్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్మెంట్లు, ఆఫీసు స్పేస్తో పాటు రిటైల్ స్పేస్ అందుబాటులో ఉండే మిశ్రమ భవనాలకు డిమాండ్ పెరిగింది.ఈ ఏడాది జనవరి - మార్చి (క్యూ1)లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 24 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అధ్యయనం వెల్లడించింది. ఏడాది కాలంలో 55 శాతం వృద్ధి రేటు నమోదైంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మాల్స్, రిటైల్ సరఫరా పెరగడమే లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణం. ఈ ఏడాది వచ్చే మూడు త్రైమాసికాల్లో కొత్తగా 70 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.అత్యధికంగా గ్రేటర్లోనే..గృహాలు, కార్యాలయాల విభాగంలోనే కాదు రిటైల్ స్పేస్లోనూ హైదరాబాద్ దూసుకెళుతోంది. 2025 క్యూ1లో జరిగిన లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం వాటా మన గ్రేటర్దే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నగరంలో 8 లక్షల రిటైల్ స్థల లావాదేవీలు జరిగాయి. ఏడాది కాలంతో పోలిస్తే ఇది 106 శాతం ఎక్కువ. హైదరాబాద్ తర్వాత అత్యధికం రిటైల్ స్పేస్ లావాదేవీలు ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాల్లో జరిగాయి. 2025 క్యూ1లో దేశంలో జరిగిన మొత్తం రిటైల్ స్థల లీజుల్లో ముంబై 24 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్ 17 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ఆర్థిక రాజధాని(ముంబై)లో 5.8 లక్షల చ.అ., దేశ రాజధానిలో 4.1 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.హైస్ట్రీట్కు డిమాండ్..గ్రేటర్లో హైస్ట్రీట్ ప్రాంతాల్లోని రిటైల్ స్పేస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో జరిగిన లీజు లావాదేవీల్లో హైస్ట్రీట్ వాటా 90 శాతంగా ఉంది. కొత్తపేట, నల్లగండ్ల, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అత్యధిక లావాదేవీలు జరిగాయి. ఒక్క జూబ్లీహిల్స్లోనే ఏకంగా 24 శాతం లావాదేవీల వాటా కలిగి ఉంది. జూబ్లీహిల్స్లో రిటైల్ స్పేస్ అద్దెలు ఏటా 13.6 శాతం పెరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్లో మాత్రం అద్దెలు స్థిరంగా ఉన్నాయి. గచి్చ»ౌలి, నానక్రాంగూడ, టోలిచౌకీ ప్రాంతాలలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, రోడ్ల విస్తరణలతో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. సూక్ష్మ మార్కెట్లతో కనెక్టివిటీ పెరగడంతో ఆయా ప్రాంతాలలో రిటైల్ స్టోర్లు, స్థలాలకు ఆదరణ పెరిగింది.దేశీయ బ్రాండ్లదే హవా..ఫ్యాషన్, వెల్నెస్, ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగాలు ఎక్కువగా రిటైల్ స్పేస్ను లీజుకు తీసుకుంటున్నాయి. లీజు లావాదేవీల్లో దేశీయ బ్రాండ్ల వాటా ఏకంగా 98 శాతంగా ఉంది. ఫ్యాషన్ విభాగం 27 శాతం, వెల్నెస్ 19 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 16 శాతం లీజు వాటాలను కలిగి ఉన్నాయి. -
కక్షలెందుకు తమ్ముడూ.. కలిసి ఉందాం ఎప్పుడూ..
ఖిలా వరంగల్: ఇంటిస్థలం విషయమై అక్కాతమ్ముడి మధ్య తలెత్తిన వివాదానికి పోలీసులు ప్రేమపూర్వక పరిష్కారం చూపించారు. తమ్ముడికి అక్కతో రాఖీ కట్టించి ఇద్దరినీ ఏకం చేశారు. ఉర్సు కరీమాబాద్ కోయవాడకు చెందిన పస్తం కోటమ్మ, ఆమె తమ్ముడు కొత్తూరు ఏడుకొండలు మధ్య వారసత్వ ఇంటిస్థలంకోసం గొడవ జరుగుతోంది. చివరికి కోటమ్మ.. తమ్ము డిపై మిల్స్కాలనీ పీఎస్లో శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఐ సురేశ్ అక్కాతమ్ముడిని స్టేషన్కు పిలిపించారు. వారసత్వ ఇంటిస్థలం, తోబుట్టువుల అనుబంధంపై అవగాహన కల్పించి.. స్థల వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం అక్కతో తమ్ముడికి రాఖీ కట్టించారు. సుహృద్భావ పరిష్కారానికి కృషి చేసిన ఎస్ఐ సురేశ్ను ఇన్స్పెక్టర్ మల్లయ్య అభినందించారు. -
చెట్టు కింద పెళ్లి..!
- నేడు పోలీసు ఆంక్షల మధ్య ఒకటవనున్న జంట - ఇంటి స్థలం విషయంలో వివాదం సాక్షి, పెద్దపల్లి: ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తన కూతురి వివాహాన్ని చెట్టు కింద చేయాల్సిన పరిస్థితిని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్వాసి వడ్లకొండ రామలక్ష్మయ్య ఎదుర్కొంటున్నాడు. రామలక్ష్మ య్య గీత కార్మికుడు. సొంతిల్లు కూడా లేదు. భార్య రాజేశ్వరి ఎనిమిదేళ్ల క్రితం చనిపోయింది. ఇద్దరు కూతుళ్లు సుమలత, సుస్మిత. పెద్ద కూతు రు కుట్టుమిషన్పై పని చేస్తూ కుటుంబానికి చేదో డువాదోడుగా ఉంటోంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే.. తండ్రి ఇబ్బంది పడతాడని భావించిన సుమలత.. ఇంటర్ చదువుతున్న సుస్మిత పెళ్లి ముందుగా చేసేందుకు తండ్రిని ఒప్పించింది. దీంతో కరీంనగర్ జిల్లా చింతకుంట వాసి శ్రావణ్ తో సుస్మిత వివాహం నిశ్చయమైంది. 4 గుంటల స్థలంలో గుడిసె వేసుకొని 17 ఏళ్లుగా అక్కడే ఉం టున్నాడు. కూతురి పెళ్లి కావడంతో ఆ స్థానంలో రేకుల షెడ్డు వేసుకుందామనుకుని గుంతలు తీయడం ప్రారంభించాడు. గ్రామానికి చెందిన కొందరు వచ్చి.. రామలక్ష్మయ్య స్థలం అసైన్డ్ భూమి అని.. ఈ స్థలంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కడుతున్నామని అడ్డుకున్నారు. దీంతో ఇటుకలను అడ్డుగోడగా మార్చుకొని.. అక్కడే ఉంటున్నారు. సుస్మిత నిశ్చితార్థమూ చెట్టు కిందే జరిపించారు. విషయం అధికారులకు చేరడంతో తహసీల్దార్ నాగరాజమ్మ అధికారులతో సర్వే చేయించారు. అది పట్టా భూమి అని తేలింది. అయినా.. గ్రామస్తులు వినకుండా వివాదానికి తెరలేపడంతో చుట్టూ ఉన్న వ్యవసాయ భూముల ను సర్వే చేయించాలని నిర్ణయించా రు. ఆ స్థలం కింద స్టేటస్కో మెయిం టైన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సుస్మిత వివాహం జరగాల్సి ఉండగా, సోమవారం తహసీల్దార్, సుల్తానాబాద్ సీఐ వచ్చి రామలక్ష్మయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. స్థలంలో వివాహం చేస్తే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్నందున అక్కడే ఉన్న చెట్టు కింద పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో చెట్టు కిందే సుస్మిత వివాహం చేయనున్నారు. -
ఉసురు తీసిన స్థల వివాదం
కాట్రేనికోన, న్యూస్లైన్ : కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో ఇంటి స్థలం విషయంలో చెలరేగిన వివాదంలో మోకా కనకరాజు (32)ను అతడి చెల్లెలి భర్త హతమార్చాడు. ఎస్సై పి.వెంకట త్రినాథ్ కథనం ప్రకారం.. కందికుప్పకు చెందిన కనకరాజు కొంత కాలం క్రితం తనకున్న భూమిలోని కొంత భాగాన్ని కట్నంగా ఇచ్చి ఇంటి పక్కనే ఉంటున్న పొద్దూక బాలయోగి అనే వ్యక్తితో తన చెల్లెలి పెళ్లి చేశాడు. ఈ ఇంటి స్థలం విషయంలో పలుమార్లు బావ బామరుదల మధ్య తగాదాలు తలెత్తగా కుల పెద్దలు సర్ధిచెప్పారు. ఈ నేపథ్యంలో బాలయోగి చెల్లి దాకే లక్ష్మి, దాకే సత్యనారాయణ అయినవిల్లి నుంచి బుధవారం ఇంటికి రావడంతో గొడవ మొదలైంది. కుల పెద్దలు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినా మాట వినకపోవడంతో వెళ్లిపోయారు. గురువారం వేకువజామున పొద్దూక పండమ్మ, బాలయోగి, దాకే సత్యనారాయణ, దాకే లక్ష్మి, నాగాభక్తుల శ్రీను మూకుమ్మడిగా కనకరాజు ఇంటిపై దాడి చేశారు. ఇంటిని కూల్చివేసి, కనకరాజు గొంతు నులిమి, కత్తితో తలపై నరికి చం పారు. దాడి సమయంలో ఇంట్లో కనకరాజు తల్లి అప్పయమ్మ, చిన్న కుమారుడు ముఖేష్ ఉన్నారు. మృతుడి మామ కాశి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటత్రినాథ్ తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనకరాజు మృతితో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యా రు. భార్య వరలక్ష్మి, కుమారులు తేజలక్ష్మీ జగ న్, ముఖేష్ ఉన్నారు. భార్య విదేశాల్లో ఉండగా, పెద్ద కుమారుడు తేజలక్ష్మీ జగన్ ఇందుపల్లిలోని అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు ముఖేష్ మాత్రమే తండ్రితో ఉంటున్నాడు.