Participated
-
నా సంకల్పమేదీ విఫలం కాలేదు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వ ఆలోచనల్లో స్పష్టత ఉందని. సంకల్ప బలం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడన్న సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. తన జీవితంలో సంకల్పించిన లక్ష్యం ఏదీ ఇప్పటివరకు విఫలం కాలేదన్నారు. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పం కూడా విజయవంతమవుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా రవీంద్రభారతిలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం మాట్లాడారు. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ ‘తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు మా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని నిజం చేస్తూ దేశంలో తెలంగాణ ఓ వెలుగు వెలిగేలా చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగు రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. లాంటి కీలక నిర్ణయాలతో హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడేలా మారుస్తాం. మన ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ ఆ ఆలోచనకు నమూనాగా నిలవబోతుంది. ఇది జనావాస యోగ్యానికే పరిమితమయ్యే నగరం కాదు. ఉద్యోగ, ఉపాధి కల్పన సంక్షేమ పథకాల అమలుకు నిధులు కావాలంటే ఆ నగరానికి పెట్టుబడులు భారీగా రావాల్సి ఉంది. ఆ పెట్టుబడులతో రాష్ట్ర ఆదాయం పెరగాల్సి ఉంది. అందుకే ఆ నగరం జనావాసాలకే పరిమితం కాకుండా ఓ పెట్టుబడుల నగరంగా రూపు దిద్దుకుంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం..‘అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి నూరు శాతం మద్దతు వస్తుందని మా ప్రభుత్వం అనుకోవటం లేదు. దేవుళ్ల ఆరాధన విషయంలోనే భిన్నాభిప్రాయాలుండే సమాజం నుంచి.. ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి ఆమోదం ఆశించలేం. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమం కోసం మేం తీసుకునే చర్యలు అడ్డుకుంటే ఆగిపోతాయని అనుకునేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజల నుంచి మాకు సూచనలొస్తున్నాయి. కాబట్టి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం..’ అని రేవంత్ అన్నారు. ఉగాది పచ్చడి లాగానే భట్టి బడ్జెట్ ‘ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కూడా షడ్రుచుల ఉగాది పచ్చడి లాగానే ఉంది. తీపి ఉంది, పులుపు ఉంది, కారం ఉంది. కాస్తోకూస్తో ఉప్పు కూడా ఉంది. కొన్ని అంశాల్లో స్వేచ్ఛగా నిధులిచ్చారు. కొన్నింటి విషయంలో తప్పనిసరి నియంత్రణ పాటించారు. ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య వైద్యం తదితరాలకు మెరుగ్గా నిధులిచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు కావాలంటే, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉండాలి. అసాంఘిక శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలు సన్న బియ్యం కోరుకుంటున్నారు..నేను, భట్టి జోడెద్దుల్లా రాష్ట్రాన్ని పురోగమన పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. గతంలో పండుగ పూట మాత్రమే తెల్లన్నం చూసే భాగ్యం పేదలది. కోట్ల విజయభాస్కర్రెడ్డి రూ.1.90కే, తర్వాత ఎన్టీఆర్ రూ.2కే కిలోబియ్యం ఇచ్చి కొంత మార్పు తెచ్చారు. సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఆహారభద్రత చట్టం వచ్చాక ఇప్పుడు పేదలు శ్రీమంతుల తరహాలో సన్న బియ్యం తినాలని కోరుకుంటున్నారు. వారికోసం హుజూర్నగర్లో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్, ఎన్నికల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పార్టీలు, ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. రాష్ట్ర ప్రజలందరికీ విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు..’ అని సీఎం అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాభివృద్ధి: భట్టిఅన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఇలావుండగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం నూతనంగా రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. యాదగిరి క్షేత్ర ముఖ్య అర్చకులు మంగళగిరి నర్సింహమూర్తిని ఉగాది పురస్కారం, అవార్డుతో సన్మానించారు. -
సికింద్రాబాద్లో పతంగుల సందడి.. కైట్స్ ఎగరేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ (ఫోటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో సినీతారలు సందడి (ఫోటోలు)
-
మాదాపూర్ కేరీర్ ఫేయిర్లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)
-
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
కేసీఆర్ పాలనలో రాష్ట్రం పురోగతి
ప్రశాంత్నగర్ (సిద్దిపేట): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్రావు దంపతులు సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోమటి చెరువువద్ద మంత్రితో మహిళలు, యువతులు సెల్పిలు, ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. మహిళలు తీసుకువచ్చిన ఫలహారాలు తింటూ మంత్రి వారితో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండు కుండల్లా మారాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డామని, నేడు నీరు, విద్యుత్ సరఫరా నిరంతరం జరుగుతోందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ప్రజలందరూ బతుకమ్మ పండుగ చేసుకున్న విధంగానే దసరాను కూడా వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు బీఆర్ఎస్ యువజన నాయకుడు జువ్వన కనకరాజు ఆధ్వర్యంలో తయారు చేసిన భారీ బతుకమ్మను మంత్రి హరీశ్రావు తిలకించారు. -
London Pochamma Bonalu : లండన్ బోనాల్లో జోర్దార్ సుజాత (ఫొటోలు)
-
Manchu Manoj: సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ సక్సెస్ వేడుకలో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
-
Manchu Manoj : మహా రుద్ర యాగంలో పాల్గొన్న మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి (ఫొటోలు)
-
తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయంలో మహా కుంభాభిషేకం
-
మా ఆఖరి శ్వాస వరకు సీఎం జగన్ వెంటే ఉంటాం..
-
Dil Raju : రాములోరి కళ్యాణంలో ఆటపాటలతో సందడి చేసిన దిల్ రాజు దంపతులు ( ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి విశేష స్పందన
-
దేవుడి గదిలో సీఎం జగన్ ఫోటో
-
ప్రజా మద్దతు పుస్తకంలో వివరాలు నమోదు చేసిన ఎమ్మెల్యే భూమన
-
గడప గడపకు.. కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు
-
మొక్కలు నాటిన పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల (ఫోటోలు)
-
అహ్మదాబాద్ లో కైట్ ఫెస్టివల్
-
యోగా దినోత్సవంలో పాల్గొన్న విడదల రజని
-
రాజమండ్రి : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సమ్మేళనంలో సినీ నటుడు అలీ
-
ఆ దేశం పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యత: మంత్రి కేటీఆర్
-
మంచు లక్ష్మి @100 కి.మీ రైడ్
-
ఆ ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుంది..
సాక్షి, ఏలూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేవలం 8 నెలల్లోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రితో పాటుగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్యే వాసుబాబు, ఆర్డీవో పనబాక రచన, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాలకు పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ప్రజలంతా వైఎస్ జగన్ ప్రభుత్వం కోసం ఎదురుచూశారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ.. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలను ప్రవేశపెట్టి ఈ సంక్రాంతికి ప్రజలకు కానుకగా ఇచ్చారన్నారు. ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు చేరేవిధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఆళ్ల నాని పేర్కొన్నారు. -
అజిత్ షూటింగ్ను కెరీర్గా ఎంచుకున్నాడా.. !
కోలీవుడ్ విలక్షణ హీరో అజిత్కు నటనతో పాటు పలు రంగాల్లో ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. అజిత్కు చిన్నతనం నుంచి ఏరో మోడలింగ్లో ప్రతిభ ఉంది. ఇటీవలె అజిత్ను ‘హెలికాప్టర్ టెస్ట్ పైలట్ అండ్ యూఏవీ సిస్టమ్ సలహాదారుడి’గా మద్రాస్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ నిరాయుధ వైమానిక వాహన ప్రయోగ పోటీల్లో అయన పాల్గొనవచ్చు. దీంతో పాటు అజిత్కు ఫోటోగ్రఫీ, కారు రేసింగ్ రంగాల్లో కూడా ప్రావీణ్యం ఉంది. కారు రేసింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పాల్గొన్నారు. అయితే రీసెంట్గా అజిత్ షూటింగ్ చేస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే గత కొన్ని నెలల కింద కొయంబత్తుర్లో నిర్వహించిన తమిళనాడు రాష్ట్ర 45వ షూటింగ్ చాంపియన్షిప్లో అజిత్ పాల్గొన్నాడు. అజిత్ తదుపరి చిత్రం ‘నెర్కొండ పార్వై’ అగస్టు 8న పేక్షకుల ముందుకు రానుంది. -
సెయింట్ జాన్స్ స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
-
హెటిరో ఆధ్వర్యంలో వాక్ ఏ థాన్
-
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రులు
-
కేక్ మిక్సింగ్లో పాల్గొన్న నటి
-
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి
సైదాబాద్: తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ వేడుకలు ప్రతీక అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఐఎస్సదన్ డివిజన్ పరిధిలోని ఇంద్రప్రస్థ కాలనీ, కేశవనగర్ కాలనీలో బుధవారం జరిగిన బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి పాల్గొని బతుకమ్మ ఆడారు. స్థానిక కార్పొరేటర్ సామ స్వప్న సుందర్రెడ్డి, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతు అందరిని ఉత్సాహపరిచారు. అనంతరం దాండియా ఆడారు. -
జగన్కు ఘన స్వాగతం
అభిమానులకు ఆప్యాయంగా పలకరింపు అంబేడ్కర్ విగ్రహానికి నివాళి తుని : శ్రీకాకుళం యువభేరి సదస్సుకు హాజరైన వైస్సార్ సీపీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ వెళుతూ మంగళవారం సాయంత్రం పాయకరావుపేట తాండవ జంక్షన్ వద్ద కొద్దిసేపు ఆగి నాయకులు, కార్యకర్తలను కలిశారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జగ్గంపేట ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్చంద్రబోస్, తుని, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వరుపుల సుబ్బారావు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, పెండెం దొరబాబు, కురసాల కన్నబాబు, ముత్తా శశిధర్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అత్తిలి సీతారామస్వామి తదితరులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. తుని, పాయకరావుపేటకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న ఆదిలాబాద్ కలెక్టర్ జగన్మోహన్
-
మహేష్కి అదే మైనస్ పాయింట్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కేసిఆర్
-
పేద దళిత క్రైస్తవులను ఆదుకుంటాం:చంద్రబాబు
-
ఆరిపాక జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు