నేడు సీఎం జగన్‌ బస్సు యాత్ర యధాతథం | cm ys jagan memantha siddham bus yatra on april 15th | Sakshi
Sakshi News home page

నేడు సీఎం జగన్‌ బస్సు యాత్ర యధాతథం

Published Mon, Apr 15 2024 4:53 AM | Last Updated on Mon, Apr 15 2024 8:16 AM

cm ys jagan memantha siddham bus yatra on april 15th - Sakshi

వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ కొనసాగనుంది.

కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు సీఎం బస్సు యాత్ర ప్రారంభం 

జొన్నపాడు వద్ద భోజన విరామం 

సాయంత్రం గుడివాడ వద్ద బహిరంగ సభ  

నారాయణపురం వద్ద రాత్రి బస   

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఒక్కరోజు విరామం అనంతరం ఇవాళ తిరిగి కొనసాగనుంది. యాత్రలో భాగంగా 15వ రోజైన సోమవారం(ఏప్రిల్‌ 15) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు.

మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా కేసరపల్లి దగ్గర నుంచి సీఎం జగన్‌ సోమవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్‌ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటారు. 

గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్‌ చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement