
దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. వరుసగా నాలుగో రోజు (ఏప్రిల్ 12) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 270 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,670 వద్ద నిలిచాయి. నిన్న మాదిరిగానే ఈ రోజు కూడా రూ. 250 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 270 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.
చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,670 వద్ద ఉంది.
దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,850 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.
వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరుగుదలవైపు అడుగులు వేసాయి. ఈ రోజు (ఏప్రిల్ 12) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,000 వద్ద ఉంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
ఇదీ చదవండి: అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!