భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంతిమ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వాజ్పేయి పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా కాలినడకన అంతిమ యాత్రలో ముందుకు సాగిపోతున్నారు. తద్వారా తమ నేతకు కడసారి నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చిన జన సందోహానికి, బీజేపీ నేతలు, శ్రేణులకు స్ఫూర్తిగా నిలిచారు. కాగా తమ మహానేతకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది.