-
గాడిద మోత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఇంట్రస్టింగ్ కథనం
మన దేశంలో మహారాష్ట్రలో గాడిదలను అధిక స్థాయిలో రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇటుక బట్టీలలో ఇసుక రవాణాలో వీటి వీపు మీద 200 కేజీల వరకూ వేయడానికి వెనుకాడరు. దీని వల్ల గాడిదలు హింసకు గురవుతున్నాయి. రోగాల బారిన పడుతున్నాయి. అందుకే నాందేడ్కు చెందిన సిర్జనా నిజ్జర్ గాడిదల సంరక్షణ గురించి పోరాడుతోంది. గాడిద మోత నుంచి గాడిదలను తప్పించాలంటోంది. ఆమె పోరాటం గురించి...‘జనం దేనికైనా విరాళాలు ఇస్తారు గాని గాడిదలంటే ఇవ్వరు. కాని గాడిదలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు’ అంటుంది సిర్జనా గుజ్జర్.ఢిల్లీ యూనివర్సిటీలో లా చదివిన సిర్జనా జనం కోసం న్యాయస్థానాల్లో వాదించడం కంటే హింసకు గురవుతున్న మూగజీవాల కోసం సమాజంలో వాదించడం మేలు అనుకుంది. అందుకే ఆమె ఎఫ్.ఐ.ఏ.పి.ఓ. (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్)లో కీలకబాధ్యతలు నిర్వహిస్తోంది. వీధి శునకాలతో మొదలైన ఆమె సేవ నేడు గాడిదలకు చేరింది.నాందేడ్లో చూసి...మహరాష్ట్రలోని నాందేడ్ సిర్జనా తాతగారి ఊరు. కాలేజీ రోజుల్లో వేసవి సెలవుల్లో అక్కడకు వెళితే గాడిదలు విపరీతంగా కనిపించేవి. వాటిని చూసి సరదా పడదామనుకుంటుడగానే ఒళ్లంతా గాయాలతో, బరువులు మోయలేక అవస్థపడుతూ, తిండి లేక ఎముకలు తేలి ఉన్న వాటి రూ΄ాలు సిర్జనాకు ఎంతో బాధ కలిగించేవి. విద్యార్థిగా ఉండగానే వాటి కోసం చేతనైనంతలో హెల్త్ క్యాంప్స్ నిర్వహించేది. లా పూర్తయ్యాక ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటి సంరక్షణ కోసం పని చేస్తోంది.మూడు జిల్లాల్లో...‘మహరాష్ట్రలోని మూడు జిల్లాలు నాందేడ్, బీడ్, లాతూర్లలో గాడిదల సంఖ్య ఎంత లేదన్నా 6000 ఉంటుంది. ఇవి మహరాష్ట్రలో వాన కొరత ్ర΄ాంతాలు. జనం పేదరికంలో మగ్గుతుంటారు. ఈ మూడు జిల్లాల్లోనూ ఇటుక బట్టీలు విస్తారం. వాటిలో కూలీ చేస్తే రోజుకు వంద రూ΄ాయలు వస్తాయి. ఇటుకలు మోయడానికి వీరంతా గాడిదలను ఉపయోగిస్తారు. ఇటుకలను చేరవేయడానికి వాటి వీపు మీద 60 కేజీల నుంచి 100 కేజీల వరకూ బరువు మోయిస్తారు. ఈ ప్రాంతంలో పారే ఉపనది చంద్రభాగ ఒడ్డు నుంచి ఇసుక మోయిస్తారు. శక్తికి మించి బరువు మోయడం వల్ల గాడిదలు గాయాల బారిన పడతాయి. ఒక్కోసారి వాటి కాళ్లు విరుగుతాయి. కంటి సమస్యలు వస్తాయి. వాటికి వైద్యం చేయించే శక్తి పేదలకు ఉండదు. వాటిని అలాగే వదిలేస్తారు’ అంటుంది సిర్జనా.వానలు వస్తే పస్తే‘నాందేడ్, బీడ్, లాతూర్ జిల్లాల్లో అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకూ నిర్విరామంగా ఇటుక బట్టీల పని జరుగుతుంది. అన్నాళ్లు గాడిదలకు పని ఉంటుంది. కొద్దోగొ΄్పో తిండి దొరుకుతుంది. కాని ఎప్పుడైతే తొలకరి మొదలవుతుందో ఇటుక బట్టీలు మూతపడతాయి. కూలీలు గాడిదలకు తిండి భారం అని రోడ్ల మీద వదిలేస్తారు. వాటికి తిండి దొరకదు. మంచినీరు దొరకదు. రోగాలతో బాధ పడతాయి. ముసలివైతే కబేళాకు అమ్మేస్తారు. వాటి కోసం ఈ మూడు జిల్లాలో సంరక్షణాశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్.పి.సి.ఏ. (సొసైటీస్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు యానిమల్స్) బలోపేతం చేస్తున్నాం. గత పదేళ్లలో గాడిదల సంఖ్య కూడా బాగా తగ్గింది. వీటి సంఖ్య కాపాడుకుంటూ వీటితో మానవీయంగా వ్యవహరించే చైతన్యాన్ని కలిగించడమే నా లక్ష్యం’ అని తెలిపింది సిర్జనా. -
సందీప్ - జావెద్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
గొర్రెల స్కీమ్ లో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తింపు
-
ఇలాంటి జీవి ఒకటి ఉందా?
-
అంబానీ కొడుకు నిజంగా గ్రేట్.. అడవిని సృష్టించిన కొత్త పెళ్లికొడుకు.
-
ఏడాదిలో ఆరు నెలలు.. 'గోపాలకుల వనవాసం'!
ఈ జీవిత పోరాటంలో ఒక్కొక్కరి జీవనం ఒక్కోవిధంగా కొనసాగుతూంటుంది. వాటిలో ఎన్నో మార్పులు, చేర్పులు కూడా జరుగుతూంటాయి. కొన్ని సమయాల్లో జీవించడానికి వలసలు వెళ్లాల్సివస్తుంది. కొందరైతే ఊర్లు, దేశాలు, ఏకంగా ఖండాలే దాటి వెళ్తున్నారు. అది కూడా బస్సులు, రైల్లు, విమనాల్లోనో ప్రయాణిస్తున్నారు. జీవన శైలిలో ఇది ఒకెత్తు అయితే, మరో ఎత్తు.. మూగ జీవాలకై.. గిరిజన తండా వాసులు పడే తంటాలు. ఎండనకా, వాననకా, రాళ్లనకా, ముళ్లనకా వారివి కాలినడక ప్రయాణాలు. ఇలా ఒకరోజు రెండురోజులు కాదు.. ఏకంగా ఏడాదిలో ఆరుమాసాలు. ఇంటివాకిలిపై, పిల్లాజల్లలపై మనసున్నా గానీ, ఎంచుకున్న మార్గాన్ని వీడక, మూగప్రాణుల కడుపు మేతకై ఈ ఆడపడుచుల ప్రయాణాన్ని గురించి ఓసారి చూద్దాం! రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం మద్దిమల్ల, వీర్నపల్లి గిరిజన తండాలకు చెందిన 25 కుటుంబాలు ఆరు నెలలపాటు ఇల్లు విడిచి, ఊరును వదిలి వనవాసం చేస్తూ... ఆవులను మేపుతుంటారు. స్థానికంగా గడ్డి లేకపోవడంతో ఊరు వదిలి మన్నెం(వలసపోవడం) అనివార్యమైంది. మద్దిమల్ల నుంచి అటవీమార్గంలో ఆవులను మేపుతూ.. కోరుట్ల, మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్ శివారులోకి వెళ్లి.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆవులను మేపుతారు. ఎక్కడ రాత్రి అయితే అక్కడే ఆవులతోపాటు నిద్రిస్తారు. అక్కడే వంట చేసుకుని తింటారు. ఎవరైనా పెద్ద రైతులు తమ పొలాల్లో సేంద్రియ ఎరువుల కోసం ఈ ఆవుల మందలను వారం, పది రోజులు పెట్టించుకుని డబ్బులు ఇస్తారు. ఆవుల మూత్రం, పేడ పొలాలకు సేంద్రియ ఎరువులుగా పనికి వస్తాయి. అందుకే రైతులు ఎక్కువగా ఆవుల మందలను పొలాల్లో పెట్టిస్తారు. అలా వచ్చిన డబ్బులతోనే గిరిజనులు బియ్యం కొనుక్కుని, కట్టెల పొయ్యిపై వంట చేసుకుని తింటారు. కొన్ని ఆవులను, కోడెలను ఒక్కోదాన్ని రూ.15వేల నుంచి రూ.30 వేలకు స్థానిక రైతులకు, పశువుల సంతల్లో అమ్ముతారు. కోడెలు రైతులకు ఎవుసానికి అక్కరకు వస్తుంటాయి. ఇలా ఆరు నెలలపాటు వనవాసం చేసి వర్షాకాలంలో ఇల్లు చేరుతారు. ఆవుల మందలే ఆధారం.. గిరిజనులకు ఆవుల మందలే ఆధారం. ఒకప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఆవులు ఉండేవి. ఇప్పుడు వాటిని మేపేందుకు చెల్కలు లేక, అడవుల్లోకి వెళ్లకుండా కంచెలు వేయడంతో ఆవుల సంఖ్య తగ్గింది. మరోవైపు వన్యప్రాణుల భయం వెంటాడుతుండడంతో అడవుల్లోకి వెళ్లడం తగ్గిపోయింది. మైదాన ప్రాంతాలన్నీ పొలాలుగా మారడంతో పశుపోషణ భారమైంది. అయినా.. కొందరు గిరిజనులు ఆవులను పోషిస్తూ.. వాటితో వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టడం, పిల్లలను చదివించడం, ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆవుల మందల సంఖ్య తగ్గిపోయింది. అయినా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఓ వంద కుటుంబాల వరకు ఆవులే ఆధారంగా ఇప్పటికీ జీవిస్తున్నాయి. ఇవి చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా! -
Narsingi Animal Fest Photos: నార్సింగిలో మూడో రోజు పశు సంక్రాంతి (ఫొటోలు)
-
TS: పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పీఎస్లో పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసు నమోదైంది. గొర్రెల పంపిణీలో అవకతకలు జరిగాయంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం అమలులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. గొర్రెల పంపిణీ కోసం గుంటూరు జిల్లా నుండి అధికారులు గొర్రెలను తీసుకొచ్చారు. గొర్రెలను ఇచ్చిన వారికి బదులు ఇతరుల ఖాతాలోకి నగదు జమ అయ్యిందని, మొత్తం 2 కోట్ల రూపాయలు మోసం జరిగిందని గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధన శాఖ అధికారులపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.. పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
యానిమల్ సక్సెస్ మీట్లో అలియా ధరించిన డ్రస్ ధర ఎంతంటే..?
సెలబ్రెటీలు ధరించిన డ్రస్లు ఎప్పడూ అత్యంత ఖరీదులోనే ఉంటాయి. వాటికి గోల్స్ అంచు లేదా డైమండ్లు పొదగబడి ఉండటం వంటివి జరుగుతాయి కూడా. అయితే కొన్ని ఖరీదైన డ్రస్లు చూస్తే ఏముంది ఇందుల? ఎందుకింత ఖరీదు? అనిపిస్తుంది. అలాంటి డ్రస్ అలియా వేసుకొచ్చింది. అదికూడా తన భర్త నటించిన యానిమల్ మూవీ సక్సెస్ మీట్కి. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఒకరకంగా చాలా రోజుల తర్వాత బాలీవుడ్ మూవీ ఈరేంజ్లో దూసుకుపోతున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. అదిగాక ఈ మూవీలో "జమల్ జమలు కుదు" పాట ఎంతలా వైరల్ అవుతోందో చెప్పాల్సివసరం లేదు. ఈ మేరకే ఈ సినిమా బృందం తమ మూవీ విజయోత్సవాన్ని జరుపుకుంది. ఈ వేడుకకు అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మూవీ సక్సస్ని పంచుకునేందుకు మంచి గ్రాండ్ లుక్తో వచ్చారు. ఈ వేడుకలో ఆమె నీలిరంగు దుస్తుల్లో స్టన్నింగ్ లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాటిన్ కటౌట్ డ్రస్లో చాలా గ్లామరస్గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ రసారియో కలక్షన్స్ ఈ డ్రెస్ని డిజైన్ చేసింది. దీని ధర ఏకంగా రూ. 1.5 లక్షలు. ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ రణబీర్, అలియా జంట, రణబీర్ కపూర్, రష్మిక మందన్న, బాబీడియోల్, అనిల్కపూర్, డైరెక్టర్లు,తదితర బాలివుడ్ తారాగణమంతా హాజరయ్యారు. (చదవండి: జమల్ జమలు కుదు... యానిమలు!) -
జమల్ జమలు కుదు... యానిమలు!
‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమల్ జమలు కుదు’ సూపర్హిట్ అయింది. ఈ పాటలో ఒక్క ముక్క అర్థం కాకపోయినా యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట యూత్ ఫ్రేవరెట్ రింగ్ టోన్గా మారింది. ‘జమల్ జమలు కుదు’ అనేది 1950 నాటి ఇరానీ పాట. ఇరానీ కవి బిజన్ స్మందర్ ఈ పాట రాశారు. ఖటరెహ్ మ్యూజిక్ గ్రూప్ ట్యూన్ కంపోజ్ చేసింది. తొలిసారిగా 1950లో టెహ్రాన్లోని ఖరజెమీ హైస్కూల్లో పాడారు. ‘జమల్ జమలు కుదు’ అంటే ఆంగ్లంలో ‘వో మై లవ్, మై స్వీట్ లవ్’ అని అర్థం. ఈ పాటలో కనిపించిన తనాజ్ దావూది సోషల్ మీడియాలో వైరల్ గర్ల్గా మారింది. టెహ్రాన్లో పుట్టి పెరిగిన తనాజ్ డ్యాన్సర్, మోడల్. ‘యానిమల్’ షూటింగ్ సమయంలో తనాజ్ ముంబైలో ఉంది. ఈ పాటకు సంబంధించిన ఓల్డ్ వెర్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘యానిమాల్ సినిమాలోని పాట కంటే ఓల్డ్ వెర్షన్ బాగా ఎంజాయ్ చేసే విధంగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు నెట్లోకవాసులు. -
Pet's Show : వింతవింత జంతువులతో కొలువుదీరిన ఈ కార్నివాల్ (ఫొటోలు)
-
‘యానిమల్’ మెషీన్ గన్ సీక్రెట్ ఇదే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 2023, డిసెంబర్ ఒకటిన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి, గత రికార్డులను బద్దలు కొట్టింది. భారత్లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన 10 చిత్రాల జాబితాలో ‘యానిమల్’ చేరింది. రూ. 100 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 835.87 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రణబీర్ ‘మెషిన్ గన్’ను ఉపయోగించే దృశ్యం ప్రేక్షకులను అమితంగా అలరిస్తోంది. ఈ మెషిన్ గన్ ఎలా తయారు చేశారనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. కొందరు ఇది నిజమైన మెషీన్ గన్ కాదని, ఇదంతా వీఎఫ్ఎక్స్తో రూపొందించిన అద్భుతం అని అంటున్నారు. అయితే దీనిలో నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ మెషీన్ గన్ గురించి ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మెషిన్ గన్ స్టీల్తో తయారు చేశామని, దీనిని తయారీకి ఐదు నెలలు పట్టిందని తెలిపారు. దీనిని తయారు చేయడానికి వందమంది శ్రమించారని, 500 కిలోల స్టీల్ను ఉపయోగించామని తెలిపారు. ఈ గన్ తయారు చేస్తున్నప్పుడు దీనికి సంబంధించిన సీన్ అందరినీ ఇంతలా ఆకట్టుకుంటుందని అనుకోలేదని అన్నారు. సినిమా దర్శకుడు సందీప్ ఆలోచనలకు అనుగుణంగా ఈ గన్ రూపొందించామన్నారు. మొదట సందీప్ పెద్ద మెషీన్ గన్ గురించి చెప్పారని, అంత భారీ గన్ రూపకల్పనకు నాలుగైదు నెలలు పడుతుందని చెప్పానన్నారు. మెషీన్ గన్ తయారీలో ఎంతో శ్రద్ద చూపించామని, వినూత్నంగా దానిని తీర్చిదిద్దామని తెలిపారు. ఆ మెషీన్ గన్ బరువు 500 కిలోలని సురేష్ తెలిపారు. -
మిస్ వరల్డ్ అందాల పోటీల్లోకి 'యానిమల్' బ్యూటీ షఫీనా ఎంట్రీ (ఫోటోలు)
-
ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా?
భూమ్మీద అత్యంత పురాతన కాలం నాటి జంతువులు ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాయంటే నమ్ముతారా?. నో ఛాన్స్ అంతరించిపోయే ఉంటాయని కచ్చితంగా చెబుతాం. అది అబద్ధం... నేనింకా బతికే ఉన్నానంటోంది ఈ తాబేలు. దీని వయసెంతో వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఎందుకంటే ఇది డైనసర్ల కాలం నుంచి ఉంది. ఒకరకరంగా చెప్పాలంటే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల కాలం నుంచి ఉన్న జీవిగా ఈ తాబేలుని పేర్కొనవచ్చు. ఆ తాబేలు ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం! ఈ తాబేలు పేరు జోనాథన్. ఇది బ్రిటన్లోని సెయింట్ హెలెనాలో ఉంది. ఆ ద్వీపానికి చేరుకునేటప్పటికే ఈ తాబేలు వయసు 50 ఏళ్లు. అప్పటికే పూర్తిగి పరిణితి చెంది ఉంది. అందువల్ల ఇది సుమారు 1832లో జన్మించాడని చెబుతుంటారు దీని సంరక్షకులు. లేదా అంతకంటే పెద్దవాడైనా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పడది తన 191వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఇప్పుడూ దీన్నే చూస్తే పురాతన కాలం నాటి కొన్ని జీవులు ఇంకా బతికే ఉన్నాయని ఒప్పుకుంటారు కదూ. అయితే తాబేలు జీవిత కాలం 60 నుంచి 150 ఏళ్లు. ఐతే కొన్ని మాత్రం 200 ఏళ్ల వరకు జీవిస్తాయని చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ జోనాథన్ తాబేలు కూడా ఆ కోవకు చెందిందేనేమో!. అయితే అలాంటి తాబేలు భారత్లోని కొలకతాలో కూడా ఉందట. దాని పేరు అద్వైత. ఇది ఏకంగా 255 ఏళ్లు జీవించినట్లు చెబుతున్నారు. తాబేలుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు శిరచ్ఛేదం చేసిన తాబేలు చనిపోదట. తల నరికిన 23 రోజుల వరకు బతికిన సందర్భాలు కూడా ఉన్నాయట. చైనా వాళ్లు దీన్ని దీర్ఘాయువుకి చిహ్నంగా భావిస్తారట. అంతేగాదు తాబేలు మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించిన మరణించదట. పైగా మెదడును తొలగించిన ఆరు నెలల వరకు కూడా బతికే ఉంటుందట The world’s oldest living land animal - the Seychelles giant tortoise named Jonathan - has just celebrated his 191st birthday. His age is an estimate, based on the fact that he was fully mature when he arrived on the island in 1882.pic.twitter.com/t4hpd73KsE — Massimo (@Rainmaker1973) December 4, 2023 (చదవండి: దెయ్యాలకు బోజనం పెట్టే పండుగ గురించి విన్నారా?) -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్బస్టర్గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
ఈ ఏడాది కలిసొచ్చింది
రణ్బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతని, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘యానిమల్’ చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ‘యానిమల్’ రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబడుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మాకు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నాలుగు, ‘దిల్’ రాజుప్రోడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు.. ఇలా మొత్తంగా ఏడు సినిమాలు చేస్తున్నాం. రామ్చరణ్గారి ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ మేన్ ’ను మార్చిలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. -
'యానిమల్' సినిమాలో హాట్ బ్యూటీ 'త్రిప్తి డిమ్రి' ఫోటోలు వైరల్
-
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది.. -
‘యానిమల్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘అర్జున్రెడ్డి’సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సందీప్రెడ్డి వంగ. అదే సినిమాను కబీర్సింగ్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకొని ‘యానిమల్’సినిమాను తెరకెక్కించాడు. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ చిత్రం ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యానిమల్ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యానిమల్ చిత్రానికి ఎక్స్లో మంచి స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని ఎక్కువ మంది చెబుతున్నారు. రణ్బీర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ల నటన అదిరిపోయిందంటున్నారు. వయోలెన్స్ ఎక్కువైందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Big day for the Indian box office 🥵 Anticipate the cinematic magic as #AnimalMovie hits screens tomorrow, promising an exhilarating experience. 💥💥💥💥💥 Also, get ready for the much-awaited #SalaarCeaseFire trailer dropping tomorrow. Double the excitement, double the… pic.twitter.com/h0evNakiCL — Thyview (@Thyview) November 30, 2023 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో బిగ్డే ఇది. సినిమాటిక్ మ్యాజిక్ ఊహించబోతున్నాం. ఈ సినిమా అద్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ రోజు డబుల్ ధమాకా. సలార్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతున్నది. నాకు డబుల్ ఎక్సైట్మెంట్ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. Very good 1st half 👌👌 Ranbir like never before and Vanga has written a simply mind blowing character for him. Everything on point so far. Waiting for 2nd half #Animal — RGK 🍀 (@iamrgk_) December 1, 2023 ఫస్టాఫ్ చాలా బాగుంది. కర్బీర్ కపూర్ని ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. అతనికి సందీప్ వంగ మంచి పాత్రను ఇచ్చాడు. ప్రతి పాయింట్ బాగుంది. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #OneWordReview...#Animal: BLOCKBUSTER Rating: ⭐️⭐⭐️⭐️½#RanbirKapoor𓃵 in a never seen before avatar his career best performance #AnimalReview#AnimalTheFilm #RanbirKapoor #Svr #AnimalOn1stDec #AnimalReview #BobbyDeol #AnilKapoor #AnimalOn1stDec #RashmikaMandanna #AnimalMovie pic.twitter.com/Kz4IXMFTSl — himesh (@himeshmankada) November 30, 2023 ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్ బ్లాక్ బస్టర్. ఇలాంటి పాత్రలో రణ్బీర్ని ఎప్పుడు చూడలేదు. అతని కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు’అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 I Really Wish #Animal to be biggest Blockbuster for Ranbir Kapoor, Bobby Deol , Sandeep Vanga ,Anil Kapoor for showing their Love &Respect towards @urstrulyMahesh Their gesture and way of receiving is so heart warming❤️ All The Best Sandeep & Ranbir#AnimalMovie #AnimalTheFilm pic.twitter.com/nWeQOFayyN — Hemanth Kiara (@ursHemanthRKO) November 30, 2023 Ranbir 🔥🔥🔥#AnimalMovie One of the best climax 😢#AnimalTheFilm #Animal #AnimalOn1stDec #AnimalAdvanceBooking #AnimalPremieres #AnimalReview #RanbirKapoor𓃵 pic.twitter.com/DXHF05TK1C — Abhishek (@Abhishek09kk) December 1, 2023 Inside reports ..everywhere positive#AnimalReview#ANIMAL : BLOCKBUSTER. Rating: 🌟🌟🌟🌟🌟½#SandeepReddyVanga immerses us into the world of #Animal, delivers a KING-SIZED ENTERTAINER… Imagine SPIRIT 🥵 #spirit #Prabhas #salaar pic.twitter.com/zcbo47vEAy — Film Royce (@film_royce) December 1, 2023 #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 -
హాట్టాపిక్గా మారిన మహేశ్ బాబు టీషర్ట్.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న మహేశ్ తాజాగా యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. సింపుల్ టీ షర్ట్లో క్లాసీ లుక్స్తో కనిపించాడు. దీంతో మహేశ్ ధరించిన టీ షర్ట్ ధర ఎంత ఉంటుందబ్బా అంటూ నెటిజన్లు గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు.సాధారణంగా సెలబ్రిటీలు వేసుకున్న దుస్తులు, వస్తువుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఫ్యాన్స్లో ఎక్కువగా ఉంటుంది. అలా మహేశ్ బాబు యానిమల్ ఈవెంట్కు ధరించిన టీషర్ట్ ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఇది 'గివెంచి' బ్రాండ్కు సంబంధించినది.చూడటానికి సింపుల్గా ఉన్నా దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఈ టీషర్ట్ ధర వందల్లో కాదు సుమారు రూ. 47వేలు మరి. ఈ విషయం తెలిసి.. సింపుల్ టీషర్ట్ ఏకంగా ఇంత కాస్ట్లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
ప్రమోషన్స్లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ను యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్కు హాజరైన మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనిల్ కూపూర్ మాట్లాడుతూ..' అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకు ఓ విషయం చెప్పాలి. ఒక నటుడిగా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే. నాకు మొదటి చిత్రం తెలుగులోనే. 1980లో వంశవృక్షం చిత్రంలో నటించా. డైరెక్టర్ బాపు నన్ను హీరోగా టాలీవుడ్కు పరిచయం చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. దాదాపు 43 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇది ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తోంది. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్. ఇది నా రెండో తెలుగు చిత్రం. మహేశ్ బాబుతో నాకు కుటుంబంలాంటి అనుబంధం. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్. ది గ్రేటెస్ట్, గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సార్. మన సినిమా ఇండస్ట్రీలోని ప్రపంచానికి పరిచయం చేశారంటూ ' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది. -
అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా : రాజమౌళి
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేసే డైరెక్టర్ వస్తాడు. అతడు సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాంటి డైరెక్టర్. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం. యానిమల్ చిత్ర టీజర్ చూడగానే ఈ సినిమా నేను చూడాలని వెంటనే అనిపించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా టీజర్ చూడగానే మొదటి రోజే చూడాలనిపించిన చిత్రం యానిమల్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు. నా ఫేవరేట్ యాక్టర్ రణ్బీర్ కపూర్: రాజమౌళి బాలీవుడ్ సూపర్స్టార్ రణ్బీర్ కపూర్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ ఎవరు అంటూ నన్ను చాలా మంది అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండ రణ్బీర్ కపూర్ అని చెప్తాను. నేను చూసిన తన సినిమాలు తక్కువే కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. తన 15 ఏళ్ల కెరీర్లో తన టాలెంట్ చూపించుకునేలాంటి చిత్రాలు చాలా తక్కువ వచ్చాయి. యానిమల్తో తనకు ఆ లోటు తీరుతుంది. రణ్బీర్ కపూర్ ఇండస్ట్రీలోనే టాప్లో ఉంటాడని జక్కన్న అన్నారు. -
యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది: మహేష్ బాబు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలివుడ్ సూపర్స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విఛ్చేసారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజనల్ ట్రైలర్ నేనెప్పుడూ చూడలేదు. డైరెక్టర్ సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. తను చాలా స్పెషల్, యూనిక్ డైరెక్టర్. దేశంలోనే సందీప్ ఓ ఒరిజనల్ ఫిల్మ్ మేకర్ అన్నారు. అలానే ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తాను రణ్బీర్ కపూర్కి చాలా పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. ఇంతకుముందు కూడా ఈ విషయం రణ్బీర్కి చెప్పాను. కానీ అతడు దాన్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు లేడు. ఈ స్టేజ్ పై మరోసారి చెబుతున్నాను. నేను రణ్బీర్కి వీరాభిమానిని. ఇండియాలోనే అతడు బెస్ట్ యాక్టర్. యానిమల్ చిత్రంలో తను అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ అని మహేష్ అన్నాడు. ఇక డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. -
‘యానిమల్’ లుక్ కోసం బాబీ కఠోర సాధన.. నాలుగు నెలలు నో స్వీట్స్!
అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ విలన్గా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాబీ దేవోల్ లుక్,యాక్టింగ్పై ప్రేక్షకులను నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఈ చిత్రంలోని తన పాత్ర కోసం బాబీ చాలా కష్టపడ్డాడట. రణ్బీర్ కంటే భారీగా కనిపించేందుకు నాలుగు నెలల పాటు కఠోర సాధన చేశాడట. బాబీ ఫిట్నెస్ ట్రైనర్ ప్రజ్వల్ శెట్టి ఈ విషయాన్ని తెలియజేశాడు. ‘యానిమల్ చిత్రంలో విలన్ పాత్ర పోషించేందుకు బాబీ చాలా కష్టపడ్డాడు. లుక్ విషయంలో దర్శకుడు సందీప్ కొన్ని సూచనలు చేస్తూ.. రణ్బీర్ కంటే భారీగా కనిపించాలని కండీషన్ పెట్టాడు. దీంతో బాబీ..నాలుగు నెలల పాటు కచ్చితమైన డైట్ ఫాలో అయ్యాడట. తనకు బాగా ఇష్టమైన స్వీట్స్ కూడా తినకుండా.. సాధన చేశాడు. దీంతో బాబీ డియోల్ శరీరంలోని కొవ్వు శాతం 12కి తగ్గింది. అతని బరువు 85 నుండి 90 మధ్యకు చేరింది.ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్ చూసి చిత్ర యూనిట్ అంతా షాకైంది. క్లైమాక్స్ షూట్ రోజు బాబీ నన్ను సెట్కి పిలించుకొని అందరి ముందు అభినందించారు’అని ప్రజ్వల్ తెలిపాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- పోలింగ్ వేళ జమ్ములో కాల్పుల కలకలం
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
Advertisement