Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Police Restrictions On YS Jagan Rapathadu Tour1
రాప్తాడుకు వైఎస్‌ జగన్‌.. పోలీసుల ఆంక్షలు!

సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్‌ పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.ఇది కూడా చదవండి: రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!

Supreme Court Key Orders Pass AP Police In Mithun Reddy Case2
సుప్రీంకోర్టులో మిథున్‌ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాయి. దీంతో, మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్‌ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Saudi Arabia Impose Visa Ban 2025 Includes India3
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్‌

రియాద్: హజ్‌ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్‌, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్‌ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్‌కాని యాత్రికుల కారణంగా హజ్‌లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్‌ షా

He Should: Dhoni Sent Harsh Message By Pakistan Great Amid IPL 2025 Struggle4
జట్టుకు భారం!.. ధోని ఎప్పుడో రిటైర్‌ కావాల్సింది: పాక్‌ మాజీ క్రికెటర్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ఆకట్టుకోలేకపోతున్నాడు. వికెట్‌ కీపర్‌గా తనదైన మెరుపు విన్యాసాలతో అలరిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ‘తలా’.. ఇప్పుడు జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి.క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 76 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేటు 138.18. ఇక ఈ సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన సీఎస్‌కే (CSK).. ఆ తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోయింది.ఉన్న పేరు చెడగొట్టుకోవద్దుఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్‌ అయి.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై ఆటతీరును విమర్శించే క్రమంలో ధోని బ్యాటింగ్‌ వైఫల్యాన్ని హైలైట్‌ చేస్తూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని చాన్నాళ్ల క్రితమే రిటైర్‌ కావాల్సిందని.. జిడ్డు బ్యాటింగ్‌ కారణంగా తన కీర్తికి తానే మచ్చ తెచ్చుకునే ప్రయత్నాలు మానివేయాలని సూచించాడు.ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ధోని చాలా ఏళ్ల క్రితమే ఆటగాడిగా వీడ్కోలు తీసుకోవాల్సింది. సాధారణంగా వికెట్‌ కీపర్లు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆటను కొనసాగించలేరు. అందుకు నేనే ఓ ఉదాహరణ.సీఎస్‌కే ఇకనైనా గుర్తించాలివయసు మీద పడుతున్నా... ఇంకా టీవీల్లో కనిపిస్తూ.. నా ప్రదర్శన బాగా లేదనేలా విమర్శలు వస్తూ ఉంటే.. నా గత కీర్తి మసకబారిపోతుంద కదా! పదిహేనేళ్ల పాటు గొప్ప ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నా .. ఇప్పుడిలా పేలవ ప్రదర్శన కనబరిస్తే యువ తరానికి అంతగా రుచించదు.నిజానికి 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అతడి ఆట జట్టుకు ఏమాత్రం మేలు చేకూర్చలేదు. అప్పుడే వాళ్లు (టీమిండియా యాజమాన్యం అన్న అర్థంలో), అతడు పరిస్థితిని అంచనా వేసుకున్నారు. తర్వాత అతడు తప్పుకొన్నాడు.ఏదేమైనా జట్టు కంటే ఆటగాడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం ఆటకు మీరు అన్యాయం చేసినట్లే. అందుకే సీఎస్‌కేను అందరూ ట్రోల్‌ చేస్తున్నారు. గత 2-3 మ్యాచ్‌లలో ధోని రాగానే ప్రేక్షకుల నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి.#MSDhoni, the Thala, walks into his Chepauk Den and the crowd makes DHO-NOISE!Can he finish it off in style for #CSK tonight with his parents cheering for him?Watch LIVE action ➡ https://t.co/4Kn2OwL1UW#IPLonJioStar 👉 #CSKvDC, LIVE NOW on Star Sports 2, Star Sports 2 Hindi… pic.twitter.com/1TkzYloNwL— Star Sports (@StarSportsIndia) April 5, 2025 కానీ సీఎస్‌కేకు ఇప్పుడు విజయాలు, పాయింట్లు కావాలి. ప్రస్తుతం వారు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి.. సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రషీత్‌ లతీఫ్‌ చెన్నై జట్టు యాజమాన్యానికి సూచించాడు.ఆడుతూనే ఉంటాడు..కాగా ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత ధోని రిటైర్మెంట్‌ గురించి ప్రశ్న ఎదురుకాగా... ‘‘అతడితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నా.. ఈ విషయంలో నాకు ఎలాంటి సమాచారం లేదు.ఇప్పటికీ అతడు ఫిట్‌గానే ఉన్నాడు’’ అని సీఎస్‌కే హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అన్నాడు. మరోవైపు.. ధోని కూడా తన శరీరమే తన రిటైర్మెంట్‌ అంశాన్ని నిర్ణయిస్తుందంటూ.. ఇప్పట్లో వీడ్కోలు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

Students Miss JEE Main Exam Due to Pawan Kalyan Convoy Traffic Snarl5
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్‌

విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కారణంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్‌ డిజిటల్‌ జేఈ విద్యార్థులకు పవన్‌ కాన్వాయ్‌ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.పెందుర్తిలో జేఈఈ మెయిన్స్‌ ఎగ్జామ్‌ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్‌ కాన్వాయ్‌ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్‌ వస్తున్నారని పోలీస్‌ అధికారులు ట్రాఫిక్‌ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.పవన్‌ కళ్యాణ్‌ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్‌ సెంటర్‌ ఉంది. పవన్‌ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్‌ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్‌ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

KSR Comments On Land Issues In AP And Telangana6
రేవంత్‌ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్‌జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్‌లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్‌ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్‌ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Peddi First Shot Glimpse Hindi Out Now And Glimpse 24 hrs Record Views7
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్‌ గల్లంతు

మెగా హీరో రామ్‌ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్‌ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్‌ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్‌ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్‌ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్‌ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్‌ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్‌ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్‌ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో పెద్ది గ్లింప్స్‌ టాప్‌-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్‌ (36 మిలియన్లు)తో టాప్‌-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్‌ విడుదల.. డబ్బింగ్‌ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హందీ వర్షన్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్‌ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్‌ టాప్‌ (గ్లింప్స్‌) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్‌ (17.12 మిలియన్లు)

Road Accident On Special Deputy Collector Ramadevi8
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మృతి

అన్నమయ్య జిల్లా,సాక్షి : సంబేపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ10బీఎఫ్‌ 4990 కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవీ మరణించారు.చిత్తూరు-కర్నూలు జాతీయ ‌రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మరణించినట్లు వైద్యులు తెలిపారు.

How AI is Transforming Healthcare9
వైద్య రంగంలో గేమ్‌ ఛేంజర్‌గా కృత్రిమమేధ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలోనూ కృత్రిమమేధ ఎంతగానో తోడ్పడుతుంది. అధునాతన అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా ఏఐ రోగి సంరక్షణను మెరుగుపరుస్తుంది.. కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.. వైద్య పరిశోధనను వేగవంతం చేస్తుంది. ప్రాథమికంగా వ్యాధి గుర్తింపు నుంచి అందుకు అవసరమైన చికిత్సల వరకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కృత్రిమ మేధ ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోంది. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)ప్రాథమికంగా రోగ నిర్ధారణ..ఆరోగ్య సంరక్షణకు ఏఐ సహకారం అందిస్తోంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ముందుగానే మరింత కచ్చితంగా వ్యాధులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ నమూనాలతో ఎక్స్-రే రిపోర్ట్‌లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు వంటి మెడికల్‌ ఇమేజింగ్‌ వ్యవస్థల ద్వారా మానవుల కంటే మెరుగ్గా వైద్య పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు, మామోగ్రామ్లలో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి లేదా కంటి స్కాన్లలో డయాబెటిక్ రెటినోపతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ వంటి పరిస్థితుల అవకాశాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఇహెచ్ఆర్), వేరబుల్స్, జన్యు ప్రొఫైల్స్ నుంచి డేటాను ప్రాసెస్ చేయగలదు. భవిష్యత్తులో తలెత్తె సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా కృత్రిమమేధ త్వరగా వైద్యులకు సమాచారం అందిస్తుంది. ఇది నిత్యం రోగులు వెచ్చించే చికిత్స ఖర్చులను తగ్గిస్తుంది.వైద్య సిఫారసులుఏఐ రోగులకు అనుగుణంగా రిపోర్ట్‌లను విశ్లేషించి చికిత్సలను సూచిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దాంతో జీవనశైలి, వైద్య చరిత్రలు వంటి లార్జ్‌ డేటాసెట్లను విశ్లేషించి ఏఐ మెరుగై చికిత్సలను అందించేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు, ఏఐ అల్గారిథమ్స్ రోగి జన్యు డిజైన్‌ ఆధారంగా నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సలను సిఫారసు చేయగలవు. కొత్త మందులకు రోగులు ఎలా స్పందిస్తారో అంచనా వేయడం ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు ఔషధ అభివృద్ధికి సహాయపడతాయి. ఇది క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయడనికి తోడ్పడుతుంది. ఇది నిర్దిష్ట జనాభాకు మరింత ప్రభావవంతమైన మందులను రూపొందించడానికి ఫార్మా కంపెనీలకు సహాయపడుతుంది.పరిపాలనా విధుల్లో..హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్ తరచుగా షెడ్యూల్, బిల్లింగ్, రికార్డుల నిర్వహణ వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులపై ఉంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ రంగంలోకి దిగుతోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్‌పీ) సాధనాలు డాక్టర్-రోగి సంభాషణలను విశ్లేషించగలవు. సంబంధిత వివరాలతో ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రిపోర్ట్‌లను అప్‌డేట్‌ చేయగలవు. చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్లు రోగులకు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ బుకింగ్స్‌ను నిర్వహిస్తాయి. సాధారణ రోగి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాయి. ఇది ఆసుపత్రులు, క్లినిక్‌లకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.టెలిమెడిసిన్, రిమోట్ కేర్..ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనల నేపథ్యంలో టెలిమెడిసిన్ వృద్ధిని కృత్రిమమేధ వేగవంతం చేసింది. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు, వీడియో కాల్స్ ద్వారా రోగులు నివేదించిన లక్షణాలను విశ్లేషించడం వల్ల రిమోట్‌గానే సేవలందించింది. కృత్రిమ మేధ ఉపయోగించిన వేరబుల్ పరికరాలు హృదయ స్పందన రేటు లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్‌ చేస్తాయి. రియల్ టైమ్‌లోనే అందుకు అనుగుణంగా రోగుల పరిస్థితులపట్ల వైద్యులను అప్రమత్తం చేస్తాయి.పరిశోధనలు వేగవంతంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య ఆవిష్కరణల వేగాన్ని పెంచుతోంది. విస్తారమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మానవులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే ఔషధ ఆవిష్కరణలో కృత్రిమ మేధ నమూనాలు సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. దీనివల్ల కొత్త మందులను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సంక్లిష్ట వ్యాధులను, వాటి పురోగతిని అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఉదాహరణకు, పార్కిన్సన్ వంటి న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయో ఇది అంచనా వేయగలదు.మానసిక ఆరోగ్యానికి మద్దతుగా..ఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణలోనూ పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువర్తనాలు, చాట్‌బాట్‌లు వ్యక్తులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)ని అందిస్తున్నాయి. ఈ సాధనాలు ఆందోళన, నిరాశ లేదా ఒత్తిడి సంకేతాలను విశ్లేషిస్తాయి. అవసరమైనప్పుడు చికిత్సకులను సూచిస్తాయి.ఇదీ చదవండి: కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలుసవాళ్లు-పరిష్కారాలుఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధ ఉంతో తోడ్పాటు అందిస్తున్నప్పటికీ ఈ ఏఐ వ్యవస్థలు సున్నితమైన రోగి సమాచారంపై ఆధారపడతాయి. కాబట్టి డేటా గోప్యత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, ఈ విభాగంలో చట్టాలకు లోబడి నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రంగంలో ఏఐ నమూనాల విశ్లేషణను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోగులు ఏఐ సిఫార్సులపై విశ్వాసం కలిగి ఉండేలా విధానాలు పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై పారదర్శకత చాలా అవసరం.

Influencer claims shower can affect how much vitamin D your body absorbs check the facts10
హవ్వ! ఎండలోంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే విటమిన్‌ డీ గాయబ్‌?!

తెలిసీ తెలియని జ్ఞానంతో యూట్యూబర్లు, ‌వెల్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్లమంటూ ఇంటర్నెట్‌లో ఇచ్చే ఆరోగ్య సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే లేనిపోని అనుమానాలు, అపోహలు ఆందోళన తప్పదు. ఇంటర్నెట్‌లో వచ్చి సూత్రాలను, లేదా వారి ప్లాన్‌లను దినచర్యలో చేర్చుకోవాలని నిర్ణయించుకునే ముందు ఖచ్చితంగా నిపుణులచే ధృవీకరించు కోవాలి. అశాస్త్రీయమైన భావాలతో అలాంటి వారిచ్చే సలహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉదాహరణకు ఈ స్టోరీని చదవండి. పేరు తెలియని ప్రసవానంతర వెల్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్‌ ఒకటి చర్చకు దారి తీసింది. రోజు సమయం, సూర్యేడి దిశ, మీరు స్నానం చేసే సమయాన్ని బట్టి శరీరం విటమిన్ డి గ్రహించే స్థాయిలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ‘‘ఎండలోంచి వచ్చిన వెంటనే సూర్యరశ్మికి గురైన వెంటనే స్నానం చేయవద్దు, ఒక గంట వేచి ఉండండి (మీ చర్మానికి దానిని గ్రహించడానికి సమయం కావాలి!) సలహా ఇచ్చేసింది. వెంటనే స్నానం చేస్తే మన శరీరం గ్రహించిన విటమిన్‌ డీ కరిగిపోతుందని ఈ పోస్ట్‌ ఉద్దేశం.ఇంకా ఏం చెప్పిందంటే..మహిళలకు గర్భధారణ విషయంలో గర్భధారణ సమయంలో విటమిన్ డీ, బిడ్డ ఎముక, మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.తక్కువ విటమిన్ డి గర్భధారణ మధుమేహం, ప్రీక్లాంప్సియా & అకాల జనన ప్రమాదాన్ని పెంచుతుంది. శక్తి, రోగనిరోధక పనితీరును మెరుగు పరుస్తుంది. మానసిక శక్తినిస్తుంది. ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్‌ లాంటి వాటి నుంచి రక్షణిస్తుంది. సన్‌కు ఎక్స్‌పోజ్‌ కాకపోవడం వల్లే మహిళల్లో విటమిన్‌ డీ లోపం వస్తోందని, ఈ విటమిన్‌ లభించే పదార్థాల గురించి కూడా సమాచారం ఇచ్చింది. ఇదంతాబాగానే ఉంది. కానీ ఎండలోంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే విటమిన్‌ డీ పోతుంది. వెంటనే స్నానం చేయవద్దు, ఒక గంట వేచి ఉండండి (మీ చర్మానికి దానిని గ్రహించడానికి సమయం కావాలి!) అంటూ చెప్పిన ఈ పోస్ట్‌ వాదనను నిపుణులు తోసిపుచ్చారు.ఈ వాదనలో నిజం ఎంత? తీవ్రమైన ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్ల నీటితో స్నానం చేయడం మంచిది కాదని కూడా చెబుతారు. కానీ విటమిన్‌ డీ నష్టం గురించి ఎక్కడా ప్రస్తావనలేదు. ముంబైలోని గ్లెనీగల్స్ హాస్పిటల్ పరేల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మంజూషా అగర్వాల్ ఈ వాదనను తోసిపుచ్చారు. వెంటనే స్నానం చేసినా లేదా గంట తర్వాత స్నానం చేసినా, విటమిన్ డీ ఎక్కడికీ పోదని స్పష్టం చేశారు. ఇది అంతర్గతంగా జరిగే చర్య కాబట్టి ఆందోళన అవసరం లేదని భరొసా ఇచ్చారు. “UVB కిరణాలు చర్మ కణాలలోని కొలెస్ట్రాల్‌తో సంకర్షణ చెందినప్పుడు విటమిన్ D చర్మంలో సంశ్లేషణ చెందుతుంది. ఈ ప్రక్రియ ఉపరితలంపై కాకుండా అంతర్గతంగా జరుగుతుంది. చర్మాన్ని కడగడం వల్ల, మురికి పోయినట్టు విటమిన్‌ తుడిచిపెట్టుకుపోదని అధ్యయనాలు నిర్ధారించాయని తెలిపారు. దీనికి బదులుగా సురక్షితమైన సూర్యరశ్మి ని స్వీకరించడం, చర్మాన్ని, దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం పై దృష్టి పెట్టడం మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. < View this post on Instagram A post shared by H.E.A.L.20 | Postpartum Wellness (@h.e.a.l.20)విటమిన్‌ డీ ప్రాధాన్యతమన శరీరానికి కావాల్సిన విటమిన్‌ డీ పొందాలంటే సూర్యరశ్మి కీలకం. సూర్య‌కాంతి మ‌న శ‌రీరం త‌గలడం ద్వారా బాడీలో విట‌మిన్ డి త‌యార‌వుతుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బలోపేంగా ఉండాలంటే విట‌మిన్ డి చాలా అవసరం. డీ విటమిన్‌ పుష్కలంగా ఉంటేనే ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప‌లు జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రగాలంటే విట‌మిన్‌ డీ ప్రాధాన్యత చాలా ఉంది. రోజులో ఉద‌యం లేదా సాయంత్రం స‌మ‌యంలో అతినీల‌లోహిత కిర‌ణాల ప్ర‌భావానికి మన శరీరం గురైనపుడు,ముఖ్యంగా ఉద‌యం 8 గంట‌ల లోపు లేదా సాయంత్రం 4 నుంచి 6 గంట‌ల మ‌ధ్య సూర్య కాంతి త‌గిలేలా ఎండ‌లో ఉంటే విటమిన్‌ డీ పుష్కలంగా లభిస్తుంది. విట‌మిన్ డిని శ‌రీరం అలా త‌యారు చేసుకుని ప‌లు అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకుంటుంది. విపరీతమైన ఎండతీవ్రతకు గురైతే అతినీల‌లోహిత కిర‌ణాలతో ఎక్కువ హాని క‌లుగుతుంది. అందుకే ఉద‌యం 8 గంట‌ల లోపు వాకింగ్‌ చేసినా, సూర్య నమస్కారాలు చేసినా, ఎండలో నిలబడినా మంచిదని వైద్య నిపుణులు చెబుతారు. సూర్యోదయం కంటే ముందు స్నానం చేయడం ఉత్తమమైన విధానమని కూడా పెద్దలు చెబుతారు.నోట్‌: సోషల్ మీడియాలో ఏదైనా వైరల్ పోస్ట్ లేదా ట్రెండ్‌ను గుడ్డిగా నమ్మేయొద్దు. ఇపుడు ఎక్కడ ఫేక్‌ న్యూస్‌, తప్పుడు సమాచారం విరివిగా వ్యాప్తి చెందుతోంది. ఏ సమాచారాన్నైనా ఒకటిరెండు సార్లు చెక్‌ చేసుకోవడం అవసరం. విశ్వనీయత కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement