Top Stories
ప్రధాన వార్తలు

తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు.

మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది. యూఎస్ఏ (పవర్ ఇండెక్స్ 0.0744)2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.రష్యా (పవర్ ఇండెక్స్0.0788)అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.చైనా (పవర్ ఇండెక్స్ 0.0788)పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.భారత్ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దక్షిణకొరియా (పవర్ ఇండెక్స్ 0.1656)పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.యూకే (పవర్ ఇండెక్స్ 0.1785)పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్రాన్స్ (పవర్ ఇండెక్స్ 0.1878)అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.జపాన్ (పవర్ ఇండెక్స్ 0.1839)సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉన్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.టర్కీ (పవర్ ఇండెక్స్ 0.1902)టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.ఇటలీ (పవర్ ఇండెక్స్ 0.2164)అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.పవర్ ఇండెక్స్ లెక్క ఇలా..పవర్ ఇండెక్స్ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్ఫోర్స్ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం. .

‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’
పాట్నా: జమ్మూకశ్మీర్ పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. ఉగ్రవాదులకు బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదులు సప్తసముద్రాల అవతల దాక్కున్నా సరే వెతికి మరి మట్టిలో కలిపేస్తాం. 140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాదుల్నే కాదు వారిని పెంచి పోషిస్తున్న ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుంది’ అని హెచ్చరించారు. ప్రధాని మోదీ గురువారం బీహార్లో (Bihar)పర్యటించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ రాష్ట్రం మధుబని నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలను బలోపేతం చేసేందుకు వీలుగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రూ.13,480 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. సభలో మాట్లాడానికి ముందు పహల్గాం బాధితులకు రెండు నిమిషాల కళ్లు మూసుకుని శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు.#WATCH | On Pahalgam terror attack, PM Modi says, "Today, on the soil of Bihar, I say to the whole world, India will identify, trace and punish every terrorist and their backers. We will pursue them to the ends of the Earth. India's spirit will never be broken by terrorism.… pic.twitter.com/8SPHOAJIi2— ANI (@ANI) April 24, 2025 ‘పహల్గాం ఉగ్ర దాడిలో అమాయకులు చనిపోయారు. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకుంటాం. టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్తాం. ఉగ్రవాదులను మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ దుఃఖం, ఆగ్రహం ఉన్నాయి. ఈ దాడి కేవలం అమాయక పర్యాటకులపై మాత్రమే కాదు. భారత దేశ ఆత్మపై దాడి జరిగింది. దాడి చేసిన ఉగ్రవాదులు, దానికి కుట్ర పన్నిన వారికి మనం విధించే శిక్ష వారి ఊహకి కూడా అందదు. జమ్మూకశ్మీర్లోనే కాదు దేశంలో ఉగ్రవాదాన్ని నాశనం చేసేందుకు సమయం ఆసన్నమైంది.140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచేస్తుందన్నారు. సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరేఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచం మొత్తానికి హామీ ఇస్తున్నా. భారత్ ప్రతి ఉగ్రవాదిని, వారికి వెనక ఎవరు ఉన్నా సరే వారిని గుర్తిస్తుంది. శిక్షిస్తుంది. ఉగ్రవాదులు సప్త సముద్రాల వెనుక దాక్కున్నా సరే వెంబడించి మరి మట్టిలో కలిపేస్తాం. ఉగ్రవాదం దేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదు. ఉగ్రవాదానికి తప్పక శిక్ష పడుతుంది. న్యాయం జరిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సంకల్పంలో మొత్తం దేశం దృఢంగా ఉంది. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉన్నారు. ఈ సమయంలో మనతో పాటు నిలిచిన ప్రపంచ దేశాల ప్రజలకు, వారి నాయకులకు నా కృతజ్ఞతలు’అని అన్నారు.

పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్లోకి అక్కడ పనిచేసే ఓ కేక్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.VIDEO | Amritsar, Punjab: Pakistani national reach Attari-Wagah border to return to their country after India suspended the SAARC visa exemption scheme (SVES) asking Pakistani citizens in India under SVES visa to leave the country within 48 hours. The decision was taken the… pic.twitter.com/0CVYTaJcBU— Press Trust of India (@PTI_News) April 24, 2025

బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. అపర కుబేరులకు మరింత సంపద సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందా? అన్న అనుమానం వస్తోంది. దేశంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీలలో ఒకటిగా పేరొందిన టాటా కంపెనీకి చెందిన టీసీఎస్కు ఏపీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం 99 పైసలకే అమ్మాలని నిర్ణయిస్తుందా? పైగా అది ఒక డీల్ అని చెబుతారా? వారి సొంత ఆస్తిని కూడా ఇలాగే పప్పు బెల్లాలకు పంచిపెడతారా?. ప్రజల ఉమ్మడి ఆస్తులకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు, వ్యవహరించడం సమర్దనీయమా?.విశాఖపట్నంలో ఐటీ కంపెనీ టీసీఎస్కు 21.6 ఎకరాల భూమి దాదాపు ఉచితంగా అందచేసేందుకు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. టీసీఎస్కు భూమి ఇలా ఇవ్వడం ఏమిటని అంతా ఆశ్చర్యపడుతూంటే రెండు నెలల క్రితం మాత్రమే నమోదైన ఉర్సా అనే కంపెనీకి ఇదే తరహాలో 60 ఎకరాలు ఇచ్చే ప్రతిపాదన నిశ్చేష్టులను చేస్తోంది. విశాఖకు లేదా, ఏపీలో మరోచోటకైనా ఏవైనా పరిశ్రమలు వస్తుంటే స్వాగతిస్తారు. అయితే, ఆ కంపెనీల వల్ల ఏపీకి ఉపయోగం ఉండాలి. అదే టైమ్లో ఆ కంపెనీలను ఆకర్షించడానికి కొన్ని రాయితీలు ఇవ్వడం తప్పు కాదు. ఏ ప్రభుత్వమైనా ఆ రకంగా కొన్ని విధానాలు రూపొందించుకుంటుంది.కానీ, ఏపీలో కూటమి ప్రభుత్వం భూముల విషయంలో ఒక విధానమంటూ లేకుండా ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. తమకు నచ్చిన ప్రైవేటు కంపెనీలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలియ చేస్తుంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కన్నా, సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ పవర్ ఫుల్గా ఉంటున్నారని, ఆయన మాట కాదనలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారన్న అభిప్రాయం ఉంది. అది ప్రతి రోజూ రుజువు చేస్తున్నట్లుగా లోకేశ్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిని మంత్రివర్గం అంతా వంత పాడటం సర్వ సాధారణంగా మారిపోయినట్లుంది. పైకి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంటూ ప్రచారం చేస్తూ లోకేశ్ స్వయంగా కార్పొరేట్, ప్రైవేటు రంగంలో తన పరపతి పెంచుకునే పనిలో ఉన్నారేమో అనిపిస్తుంది.తెలంగాణకు హైదరాబాద్, కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై బ్రాండ్లు అయితే.. ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అని లోకేశ్ గొప్పగా చెప్పుకుంటారు. కానీ, అందులో వాస్తవం లేదని ఈ తాజా నిర్ణయం తెలియచేస్తుంది. ఎవరికైనా బ్రాండ్ ఇమేజీ ఉంటే ఏపీకి ఆయా ప్రముఖ సంస్థలు వాటంతట అవే రావాలి. లేదా కూటమి సర్కార్ కోరగానే ప్రభుత్వ విధానాల ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలి. అవేవీ కాకుండా అత్యంత విలువైన ప్రజల ఆస్తులను తమకు ఉచితంగా ఇస్తేనే వస్తామని ఆ ప్రైవేటు సంస్థలు చెబితే చంద్రబాబు బ్రాండ్ ఏమైనట్లు?. విశాఖలో 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం అంటే చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా అన్న సందేహం మేధావులలో వస్తోంది. టీసీఎస్కు ఈ రకంగా స్థలం ఇచ్చాక, మిగిలిన సంస్థలు కూడా ఇదే రకంగా భూమి ఇవ్వాలని కోరవా?. అందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా?. ఈ ముసుగులో కూటమి పెద్దలు తమ అస్మదీయ కంపెనీలకు విలువైన భూములను ఈ రకంగా అప్పగిస్తే పరిస్థితి ఏమిటి?. ఒక్కసారి అమ్మాక ఆ సంస్థలు సరిగా పని చేయకపోయినా, ఆ భూమి అమ్ముకున్నా చేయగలిగేది ఏం ఉంటుంది?.ఐటీ పరిశ్రమకు ప్రభుత్వ స్థలాలను లీజుకు ఇస్తే అదో రకం. కానీ, ఏకంగా వాటిని ఉచితంగా దానం చేస్తున్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే అది ఏ రకంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది?. మన సంపదతో వారు ఎంజాయ్ చేసినట్లు కాదా?. కాకపోతే తమకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా తమ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా?. గతంలో జగన్ ప్రభుత్వంలో అదానీ, తదితర సంస్థలకు లీజ్ పద్దతిలో భూములు కేటాయిస్తేనే మొత్తం అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారని ఎల్లో మీడియా నానా గగ్గోలు పెట్టాయి కదా?. అప్పుడు ఆ మీడియాకు టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చాయి కదా!. ఇప్పుడు వందల కోట్ల విలువైన భూములను వేల కోట్ల లాభాలు గడించే టాటా సంస్థకు ఉచితంగా ఇస్తున్నారు. దీన్ని ఎలా సమర్ధించుకుంటారు?. నిజమే ఆ కంపెనీ వస్తే కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. అవన్నీ ఏపీలోని వారికే వస్తాయన్న గ్యారంటీ ఉండదు. అయినా ఫర్వాలేదు. రిజిస్ట్రేషన్ విలువకో, మార్కెట్ విలువకో, దానికన్నా కాస్త తక్కువకో భూములు కేటాయిస్తే తప్పు కాదు.సాధారణంగా పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ ఆయా చోట్ల మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు పెట్టుకునేవారికి నిర్దిష్ట రేటుకు విక్రయిస్తుంటుంది. అంతే తప్ప ఉచితంగా ఇవ్వదు. కానీ, టాటా సంస్థకు విశాఖ రిషికొండ వద్ద 21.6 ఎకరాల భూమిని కేవలం 22 రూపాయలకే అమ్ముతున్నామని, తానే ఈ కంపెనీతో డీల్ చేశానని లోకేశ్ ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు. దానికి ఆ ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఆశ్చర్యపోయారు. అదెలాగా ప్రభుత్వం అలాంటి విధానం తయారు చేసిందా? లేక కంపెనీల వారీగా ఇలాగే అమ్ముతుందా? అని అడిగితే ప్రభుత్వం విధానం కాదని, టాటా సంస్థ కేటలిస్టుగా ఉంటుందని భావించి తాము ఈ నిర్ణయం చేశామని 1990 దశకంలో కూడా ఇలేగే జరిగిందని అన్నారు.టాటా కన్సల్టెన్సీకి నికర లాభమే రూ.48554 కోట్లట. అంత పెద్ద కంపెనీ ఎకరా పది కోట్లు పెట్టి కొనుగోలు చేసినా వారికి అయ్యే వ్యయం 220 కోట్లే. ఆ మాత్రం భరించలేని స్థితిలో ఆ కంపెనీ లేదా?. కానీ, ప్రభుత్వమే ఇంత విలువైన భూమిని లీజుకు కాకుండా దాదాపు ఉచితంగా ఇచ్చేస్తామని అంటే ఏ సంస్థ కాదంటుంది?. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం, ప్రజల సంపదను ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతోందని ఐఏఎస్ వర్గాలలోనే చర్చ జరుగుతోందట. పీ-4 విధానంలో ప్రైవేటు సంస్థలు ముందుకు వచ్చి పేదలను దత్తత తీసుకోవాలి. కానీ, ఇలా కుబేరులను దత్తత తీసుకుని, ప్రజల సంపదను కోటీశ్వరులకు అప్పగించడం పీ-4 విధానమా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. నిజానికి విశాఖలో యూనిట్ పెట్టడానికి టీసీఎస్ గత ప్రభుత్వ టైమ్లోనే అంగీకరించింది. ఆ కంపెనీ అధినేత చంద్రశేఖరన్ అప్పట్లోనే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్తో భేటీ కూడా అయ్యారు. కానీ, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు లోకేశ్ తానే దీనిని సాధించానని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తప్పు కాదు.. అదే మార్కెట్ రేటుకు ఈ భూమిని వారికి ఇచ్చేలా ఒప్పందం చేసుకుని ఉంటే అప్పుడు క్రెడిట్ తీసుకున్నా ఫర్వాలేదు.అలా కాకుండా ఉత్త పుణ్యానికి వందల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేసి. అదేదో గొప్ప సంగతి అన్నట్లు చెప్పుకుంటే ఏమి లాభం. పైగా ఈ ప్రక్రియ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్దంగా ఉందని మేధావులు చెబుతున్నారు. రిషికొండ వద్ద రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే చదరపు గజం విలువ ముప్పై వేల వరకు ఉంది. మార్కెట్ ధర ఇంకా అధికంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ విలువను పరిగణనలోకి తీసుకుంటే ఆ భూమి విలువ 320 కోట్లకు మించి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ చెప్పారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం ప్రభుత్వ భూములను మార్కెట్ విలువలో 10 శాతం కంటే తక్కువకు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వరాదు. అలాగే అమ్మదలిస్తే మార్కెట్ ధరకన్నా తక్కువకు విక్రయించ రాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే టైంలో విశాఖలో నావికా దళానికి, సీబీఐకి ఎకరా రూ.కోటి చొప్పున, పోస్టల్ శాఖకు ముప్ఫై సెంట్లకే రూ.కోటి చొప్పున వసూలు చేశారు. ఇప్పుడు టీసీఎస్కు 22 రూపాయలకు ఇవ్వడం ఏమిటని శర్మ ప్రశ్నించారు.టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడి పెడితే 12వేల ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ అంటున్నారు. నిజంగా అంతమందికి ఉద్యోగాలు వస్తాయా అన్నది ఒక డౌటు. అది కూడా ఏపీ వారికే ఇస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వచ్చాక కాని, ఇతరత్రా కాని, ఐటీ రంగంలో కూడా ఉద్యోగాలు ఇవ్వడం తగ్గిందని చెబుతున్నారు. ఈ మధ్యనే గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని చెబుతున్నారు. అసలు టీసీఎస్కు మాత్రమే 21 ఎకరాల స్థలం అవసరమా? పోనీ ఏ ముప్పై ఏళ్లో, ఏభై ఏళ్లకో లీజుకు వస్తే తిరిగి ప్రభుత్వానికి ఆ స్థలం వస్తుందిలే అని అనుకోవచ్చు. రూ.22 లకే ఇచ్చేస్తే దానిపై ప్రభుత్వానికి హక్కులు కూడా ఉండవు.నిజంగానే 12 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లయితే ఆ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం అవుతుందా?. అమరావతిలో సైతం కూటమి సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారీ రేట్లకు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకు అందులో మూడో వంతు ధరకే భూములు ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా ఉచితంగా భూములు ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారు. దీనినే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటారని పలువురు చమత్కరిస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
న్యూఢిల్లీ: కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది. 1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది. 1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.:::జమ్ముల శ్రీకాంత్ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?

IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్లో రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు

బ్యాంకులకు ఏప్రిల్లో ఇంకా 4 సెలవులు..
మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. ఈ మిగిలిన రోజుల్లో ఏప్రిల్ 30 వరకూ దేశంలోని బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ వారాంతపు సెలవులైన నాలుగో శనివారం, ఆదివారంతోపాటు విశేష దినోత్సవాల సెలవులూ ఉన్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.దేశంలో బ్యాంకులకు సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయిస్తుంది. స్థానిక పండుగలు, విశేష సందర్భాల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఈ సెలవులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది.రానున్న బ్యాంక్ సెలవుల జాబితా» ఏప్రిల్ 26న నాలుగో శనివారం, గౌరీ పూజ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.» ఏప్రిల్ 27న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.» ఏప్రిల్ 29న పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు.» ఏప్రిల్ 30న కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు మూతపడనున్నాయి.ఈ సెలవులు ఆఫ్లైన్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపినప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.

World Mental Health Index : అట్టడుగున హైదరాబాద్, కారణాలివే!
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్క్యు) స్కేల్లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఎంహెచ్క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.యువతే ఎక్కువ.. మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.పంచుకునే మనసులు లేక.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్ను దగ్గర చేస్తుంది. పర్యావరణ ప్రభావం.. మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది. రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్.. అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది.

ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
ములుగు, సాక్షి: చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులో ములుగు కర్రెగుట్టల అడవుల్లో ఆపరేషన్ కగార్(Operation Kagar) మూడో రోజు కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. ధర్మతాళ్లగూడెం వద్ద అర్ధరాత్రి నుంచి జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇప్పటిదాకా.. ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. ఇద్దరు జవాన్లు గాయపడగా.. బీజాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు.. గత మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ సెర్చ్ ఆపరేషన్ ఆధారంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెంది ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. గాలింపు చర్యల్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులు, మూడు రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. ఐదు వేల మంది మాత్రమే కర్రెలగుట్టను రౌండప్ చేశారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కానీ, పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ మాత్రం ఆ సంఖ్య పదివేల దాకా ఉండొచ్చని చెబుతోంది. సుమారు 2,500 మంది మావోయిస్టులు దాగి ఉన్న సమాచారంతో.. వేలమంది పోలీస్, కేంద్ర భద్రతా బలగాల సిబ్బంది కర్రిగుట్టలను చట్టుముట్టిట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా మూడు హెలికాప్టర్లు, పదుల సంఖ్యలో డ్రోన్ల ద్వారా ములుగు అటవీ ప్రాంతం(Mulugu Forest)లో కూంబింగ్ కొనసాగుతోంది. మాకేం సంబంధం లేదుకర్రిగుట్టలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కూంబింగ్కు తమకు సంబంధం లేదని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్- కేంద్ర బలగాలు చూసుకుంటున్నాయని, తమకు ఎలాంటి సమాచారం కూడా లేదని ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ప్రకటించారు. కూబింగ్లో పాల్గొంటున్న కేంద్ర భద్రత బలగాలకు మంచినీరు, ఆహారం, తుపాకులు, మందు గుండు సామాగ్రిని పోలీసులు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండడంతో.. కర్రిగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.మరోవైపు.. ఛత్తీస్గడ్ వైపు నుంచి ఊసూర్ బ్లాక్లోని కర్రెగుట్టల(Karreguttalu) సమీపంలో మంగళవారం కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కానీ, కాల్పులను పోలీసులు ధృవీకరించలేదు. కేవలం సెర్చింగ్ ఆపరేషన్ మాత్రమే చేస్తున్నామని చెబుతున్నారు.కర్రెగుట్ట అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో.. ఇటు ములుగు వాజేడు మండలం పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇటీవల మావోయిస్టుల నుండి కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. గుట్టల్లోకి ఎవరు రావొద్దంటూ లేఖ విడుదల చేశారు. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు..మావోయిస్టుల లేఖతో అప్రమత్తమైన కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ మడవి హిడ్మా, హీడ్మా దళం కర్రెగుట్టల్లో సంచరిస్తున్నట్లుగా కేంద్ర సాయుద బలగాలకు ఉప్పందించనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.కూంబింగ్ సరికాదుఇదిలా ఉంటే.. కేంద్రం, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ ప్రభుత్వాలు వెంటనే కాల్పుల విరమణను పాటించి, మావోయిస్టులతో శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పీస్ డైలాగ్ కమిటీ(పీడీసీ) చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కర్రెగుట్టలకు సంబంధించి పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ వెంటనే కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ వైపు శాంతి చర్చల ప్రతిపాదన తెస్తూనే ఇటువంటి హత్యకాండకు ప్రభుత్వాలు తెగబడటం దుర్మార్గమన్నారు. ఈ ముసుగులో సాధారణ ప్రజానీకం మరణించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్రభుత్వం నుంచి ముందుగా శాంతి చర్చల అడుగులు పడాలని, ఆ ప్రతిపాదన మావోయిస్టుల నుంచి కూడా వచ్చిందని గుర్తు చేశారు. శాంతి చర్చలకు అడుగులు పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో భద్రతా బలగాలను ఉసిగొల్పి మావోయిస్టులను పూర్తిస్థాయిలో అంతమొందించాలని చూడటంతో ఒక దుర్మార్గమైన చర్య అంటూ హరగోపాల్ వ్యాఖ్యానించారు.
ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
ముంబయి ఎయిర్పోర్ట్లో సేవలు నిలిపివేత.. కారణం..
సమ్మర్ హీట్ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే..!
పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
‘ఇక తట్టా బుట్టా సర్దుకోండి’.. పాక్ పౌరులకు మరోసారి భారత్ హెచ్చరిక
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
దసరా విలన్పై మరో నటి ఆరోపణలు.. సెట్లో చాలా అసభ్యంగా!
మళ్లీ ఉగ్ర కాండ!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
భారీ ట్విస్ట్లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
బంగారం డిమాండ్కు ‘ధరా’ఘాతం!
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
పక్కా కక్షే... అక్రమ కేసే
గన్నవరం విమానాశ్రయం రికార్డు
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
పాక్కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
65 దాటితే 'నో' పదవి
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
మేఘా ఇంజనీరింగ్కు భారీ కాంట్రాక్టు
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
రెడ్బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
‘పది’పోయిన ఫలితాలు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
జగిత్యాలకు రెడ్ అలర్ట్
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
3 నిమిషాల్లో!
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయి: కమిన్స్
ఇషాన్ కిషన్పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
సంచలన విజయం దిశగా జింబాబ్వే
పోలవరం ఎత్తు కుదింపు
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
బ్యాంకులకు ఏప్రిల్లో ఇంకా 4 సెలవులు..
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
సర్జికల్ స్ట్రైక్ తరహాలో.. పాక్ను భారత్ దెబ్బ కొట్టాల్సిందే!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
చిన్నస్వామిలో చిందేసేనా!
ఒక్కో బనానా రూ.565, బీర్ ధర రూ. 1,697, ఎక్కడో తెలుసా?
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
ముంబయి ఎయిర్పోర్ట్లో సేవలు నిలిపివేత.. కారణం..
సమ్మర్ హీట్ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్గ్లాస్ పెట్టాల్సిందే..!
పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సందడి
‘ఇక తట్టా బుట్టా సర్దుకోండి’.. పాక్ పౌరులకు మరోసారి భారత్ హెచ్చరిక
IPL: కోట్లలో జీతాలు.. అత్యధిక మొత్తం అందుకున్న కామెంటేటర్ ఎవరో తెలుసా?
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా: దానం నాగేందర్
దసరా విలన్పై మరో నటి ఆరోపణలు.. సెట్లో చాలా అసభ్యంగా!
మళ్లీ ఉగ్ర కాండ!
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం
నెత్తురోడిన కాశ్మీరం-పర్యాటకులపై ఉగ్రదాడి 26 మంది బలి
‘నువ్వు’ కాదు ‘మీరు’.. విజయశాంతి రిక్వెస్ట్
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
RRRలో నటించా.. జెప్టో యాడ్లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
ఎవరి జీవితాలు వారివే.. ఇక మమ్మల్ని కలపాలని చూడొద్దు: నిఖిల్
నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
బాబు పాలన.. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు!
IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
వివాహేతర సంబంధం: భార్యను పోలీసులకు అప్పగించిన భర్త
పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
ప్రవస్తిది అంతా డ్రామా.. తప్పు నీవైపే.. ఇంకా లాగి ఏం సాధిస్తావ్?: సింగర్ హారిణి
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
అఘోరీకి షాక్ ఇచ్చిన సంగారెడ్డి జైలు అధికారులు
IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
భారీ ట్విస్ట్లతో థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
తిరుపతిలో రోడ్డు ప్రమాదం, బస్సు బోల్తా
బంగారం డిమాండ్కు ‘ధరా’ఘాతం!
"గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
బ్రెయిన్ సర్జరీ.. అరగుండుతో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న అషూ రెడ్డి
మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్
రోహిత్, సూర్య మెరుపులు.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
‘రింగు’లో 8 వరుసల వంతెనలు
పక్కా కక్షే... అక్రమ కేసే
గన్నవరం విమానాశ్రయం రికార్డు
కావలి చేరుకున్న మధుసూదన్ పార్థివ దేహం.. కుటుంబ సభ్యులు ఆవేదన
'మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు'.. ప్రవస్తి ఆరోపణలకు నిర్మాత క్లారిటీ
కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
పాక్కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
నిషా కళ్లతో ఆషిక.. చీరలో నిధి అగర్వాల్ అలా
మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్
65 దాటితే 'నో' పదవి
SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు
మరి నేను చదివిన చదువుకు ఎక్కడా కొత్తగా ఉద్యోగాల్లేవ్!
మేఘా ఇంజనీరింగ్కు భారీ కాంట్రాక్టు
ఆలయాల్లో పూజలు అందుకుంటున్న సినీతారలు వీరే...
‘దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తాం’
'కోర్ట్' దర్శకుడికి కారు గిఫ్ట్ ఇచ్చిన నాని!
రెడ్బుక్ పాలన.. విడదల రజిని మరిది గోపీ అరెస్ట్
సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
‘పది’పోయిన ఫలితాలు
YSRCP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు
Imanvi: ఆమెని 'ఫౌజీ' నుంచి తీసేయాలని డిమాండ్స్
జగిత్యాలకు రెడ్ అలర్ట్
వారెవ్వా క్లాసెన్.. ఐపీఎల్-2025లో భారీ సిక్సర్! వీడియో వైరల్
3 నిమిషాల్లో!
SRH Vs MI: లైన్లోకి వచ్చారా వార్ వన్ సైడే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్
వాళ్లిద్దరి వల్లే ఈ మాత్రం.. ఇంకా కొన్ని మ్యాచ్లే ఉన్నాయి: కమిన్స్
ఇషాన్ కిషన్పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
ఎంఐఎం గెలుపు లాంఛనమే!
‘ మీ ఉద్యోగాల్లో మీరు తిరిగి చేరండి.. మిగతాది నేను చూసుకుంటా’
Divorce: అక్కడ విడాకులంటే మహిళలకు పండగే పండగ!
అంత నీచమైన ఆలోచన నాకు లేదమ్మా?.. ప్రవస్తి ఆరోపణలపై స్పందించిన సునీత
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్
బాబూ.. అప్పనంగా అప్పగించేస్తారా?
'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
చూశారా.. ‘బంగారమే డబ్బు’!
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
‘48 గంటల్లో మా దేశం విడిచి వెళ్లిపోండి’.. పాక్ పౌరులకు కేంద్రం హెచ్చరిక
సంచలన విజయం దిశగా జింబాబ్వే
పోలవరం ఎత్తు కుదింపు
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే..ప్రాణాలతో..నావీ అధికారి చివరి వీడియో వైరల్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్
IPL 2025: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం
ఆ ఆరు రాష్ట్రాల విద్యార్థులు రావద్దు
కానిస్టేబుల్తో నిర్మల వివాహేతర సంబంధం..
ములుగులో ఆపరేషన్ కగార్.. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి?
బ్యాంకులకు ఏప్రిల్లో ఇంకా 4 సెలవులు..
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
పహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న నటి..నెటిజన్స్ ఫైర్!
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
పోలీసులు, మేజిస్ట్రేట్లుపై హైకోర్టు రిజిస్టర్ జనరల్కు ఫిర్యాదు
తిరుపతిలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా..
సర్జికల్ స్ట్రైక్ తరహాలో.. పాక్ను భారత్ దెబ్బ కొట్టాల్సిందే!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
చిన్నస్వామిలో చిందేసేనా!
సినిమా

ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)ని భారత్తో సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కూడా పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, అల్లు అర్జున్తో పాటు బడా హీరోలంతా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. తాజాగా సాయి పల్లవి(Sai Pllavi) కూడా ఉగ్రదాడి పై స్పందిస్తూ ఎక్స్లో సుధీర్ఘ పోస్ట్ పెట్టింది.‘పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని.. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది. ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుంచి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.. ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని , ప్రార్థనలను అందిస్తున్నాను’ అని సాయి పల్లవి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చాలా మంది నెటిజన్స్ సాయి పల్లవిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం గతంలో ఇండియన్ ఆర్మీ గురించి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ సమయంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి.. గోవుల పేరిటి చేసే వాటిని రెండింటిని ఒకే విధంగా పోల్చారు. ఆ సమయంలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్ పెడితే.. ఆ పాత వీడియోను షేర్ చేస్తూ సాయి పల్లవిపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సాయి పల్లవికి మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. The loss, pain and fear feels personal. Learnt of horrific crimes in history and still a witness to such inhuman acts shows nothing has changed. A group of animals have wiped out hope.From a mindspace of wanting to create memories with family, to being thrown off your senses,…— Sai Pallavi (@Sai_Pallavi92) April 23, 2025

పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి
ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు.తీవ్రంగా ఖండిస్తున్నా..ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.దుష్ప్రచారందీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.నా రక్తంలోనూ..USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్గా, డ్యాన్సర్గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!

'గేమ్ ఛేంజర్' డిజాస్టర్పై సుబ్బరాజ్ కామెంట్లు.. ఫ్యాన్స్ ఫైర్
రామ్చరణ్ 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ గురించి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj) పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన కొత్త సినిమా 'రెట్రో' ప్రమోషన్స్లో భాగంగా 'గేమ్ ఛేంజర్' ఫలితం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాకు సుబ్బరాజే కథ అందించారు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్ కూడా పలు వేదికల మీద చెప్పారు. అయితే, తాజాగా ఈ సినిమాలో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పడం విశేషం.'గేమ్ ఛేంజర్' గురించి కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా ఇలా చెప్పుకొచ్చారు. 'నేను కేవలం వన్ లైన్ మాత్రమే గేమ్ఛేంజర్ కోసం ఇచ్చాను. గ్రౌండెడ్గా ఉండే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ పాయింట్తో స్టోరీ ఇస్తే చివరకు అది చాలా మార్పులకు లోనైంది. ఆ కథలో చాలామంది రచయితలు వేలు పెట్టడంతో చివరికి మరో రకంగా అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా విషయంలో ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఎవరూ ఊహించలేరు. జయాపజయాలు ఎప్పటికీ మనచేతుల్లో ఉండవు.' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.అయితే, ఇదే మాట సినిమా విడుదల సమయంలో ఎందుకు చెప్పలేదంటూ కార్తీక్ సుబ్బరాజ్ను మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రిలీజ్కు ముందు మాత్రం కథ మొత్తం నాదే అంటూ చెప్పి.. ఇప్పుడు సినిమా ఫలితం అనుకున్నంతగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అందరూ కలిసి చరణ్ను తీవ్రంగా నష్టపరిచారని వారు చెబుతున్నారు. 'గేమ్ ఛేంజర్' విడుదలకు ముందు సుబ్బరాజ్ ఏమన్నారంటే.. 'గేమ్ ఛేంజర్' స్టోరీ రాశాగానీ అది పక్కా శంకర్ విజన్తో రూపొందించబడుతుందని బహిరంగంగానే సుబ్బరాజ్ చెప్పారు. తన కథను తెరపైకి శంకర్ తీసుకొస్తే ఎలా ఆనందంగా ఉంటుందన్న దానికి గేమ్ ఛేంజర్ సినిమా నిదర్శనం అంటూ చెప్పారు. తన కథతో శంకర్ మూవీ తీయడం ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం అంటూ సుబ్బరాజ్ పేర్కొన్నారు. "I have given only one liner of #GameChanger story to Shankar sir. In my version IAS officer was grounded, was excited to see Shankar sir's version. Many writers came onboard and so story & screenplay has been changed. Yes film didn't work audience🙁"-KSpic.twitter.com/DKNuUPh48G— AmuthaBharathi (@CinemaWithAB) April 24, 2025

ఓటీటీలోకి సడెన్గా వచ్చేసిన 'హన్సిక' సినిమా
హన్సిక నటించిన గార్డియన్ సినిమా ఏడాది తర్వాత సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే మేకర్స్ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైంది. అయితే, ఈమూవీ బిగ్ డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీలో సురేష్ చంద్రమీనన్, శ్రీమాన్ కీలక పాత్రలలో నటించారు.ఔట్డేటెడ్ హారర్ మూవీగా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అయితే, గతేడాది మే నెలలో విడుదలైన ఈ చిత్రం సడెన్గా 'ఆహా' తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత హన్సికకు మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగులో చివరగా 105 మినట్స్ అనే మూవీలో ఆమె నటించింది. ప్రస్తుతం నషా పేరుతో తెలుగులో ఓ వెబ్సిరీస్ చేస్తున్న ఈ బ్యూటీ పలు టీవీ షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.అసలు కథేంటంటే..రోటీన్ హారర్ స్టోరీగా దర్శకుడు శబరి గురుశరవణన్ తెరకెక్కించారు. అపర్ణ (హన్సిక) ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తుంది. ఓ ప్రమాదంలో గాయపడిన అపర్ణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవహిస్తుంది. అపర్ణ సహాయంతో సిటీలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న వారిపై ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటుంది? అసలు ఆ ఆత్మ ఎవరు? అపర్ణ శరీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్రవేశించింది? ఆ ఆత్మ కారణంగా అపర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో పడింది అన్నదే అసలు కథ.
న్యూస్ పాడ్కాస్ట్

పాకిస్తాన్కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్లో ఫీజుల షెడ్యూల్కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు
క్రీడలు

ఇషాన్ కిషన్పై దుమ్మెత్తిపోస్తున్న ఎస్ఆర్హెచ్ అభిమానులు.. అమ్ముడుపోయాడంటూ కామెంట్లు
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయినా.. రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించిన తీరుపై సొంత అభిమానులే తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇషాన్ ముంబై ఇండియన్స్తో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఇషాన్ తమను నమ్మించి వెన్నుపోటు పొడిచాడని దుయ్యబడుతున్నారు. ఇకపై సన్రైజర్స్ యాజమాన్యం అతనికి అవకాశాలు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ నిన్న ముంబై ఇండియన్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో ఇషాన్ అంపైర్ ఔట్ ఇవ్వకపోయినా తనంతట తానే మైదానాన్ని వీడాడు. హెడ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్.. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి ఇషాన్ బ్యాట్ను మిస్సై వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. బంతికి బ్యాట్కు తాకిందని భావించిన ఇషాన్ అంపైర్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఔటయ్యానని అనుకుని పెవిలియన్ బాట పట్టాడు. రీ ప్లేలో బంతి బ్యాట్కు కానీ శరీరానికి కానీ తగల్లేదని తేలింది. దీంతో ఇషాన్పై ఎస్ఆర్హెచ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే హెడ్ ఔటై కష్టాల్లో ఉన్నామని తెలిసి కూడా ఇషాన్కు ఇంత నిర్లక్షమా అని మండిపడుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నా ఇషాన్కు ఏ మాత్రం పట్ట లేదని దుయ్యబడుతున్నారు. రూ. 15.25 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగేనా చేసేదని దుమ్మెత్తిపోస్తున్నారు.కాగా, ఈ సీజన్లో ఇషాన్ తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సెంచరీ చేశాడు. అప్పుడు సన్రైజర్స్ అభిమానులు ఇషాన్ను ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తారు. ఆ మ్యాచ్ తర్వాత ఇషాన్ వరుసగా 7 మ్యాచ్ల్లో విఫలమై అభిమానులను నిరాశలో ముంచెత్తాడు. సరిగ్గా ఆడకపోతే ఫామ్లో లేడని భావించిన ఫ్యాన్స్, ఔట్ కాకపోయినా ఔటయ్యానని తనకు తానే ప్రకటించుకోవడంపై ఫైరవుతున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి వచ్చాడు. ఆ ఫ్రాంచైజీకి అమ్ముడుపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సీజన్లోనే ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో ఇషాన్ ఆ జట్టు ఓనర్ నీతా అంబానీతో చనువుగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా చేసినందుకు నీతా మేడం ఇషాన్కు రిలయన్స్ మార్ట్ నుండి సరుకులు పంపుతుందని జోక్ చేస్తున్నారు. ఇషాన్ ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్లోనే కొనసాగిన విషయం తెలిసిందే.

IND vs PAK: బీసీసీఐ కీలక నిర్ణయం
ప్రశాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు (IND vs PAK)తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమని పునరుద్ఘాటించింది. ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ.. ముష్కరుల చర్యను తీవ్రంగా ఖండించింది.పాకిస్తాన్తో ఇకపై కూడా..బీసీసీఐ తరఫున కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajiv Shukla) ఈ మేరకు తమ స్పందన తెలియజేశారు. రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘బాధిత కుటుంబాలకు మా మద్దతు. ఉగ్రవాదుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ప్రభుత్వ నిర్ణయానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. పాకిస్తాన్తో ఇకపై కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోము. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకుంటాం. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే అంశం గురించి సమీప భవిష్యత్తులో కనీసం చర్చ కూడా ఉండదు.అయితే, ఐసీసీ ఈవెంట్లలో మాత్రం నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ప్రస్తుత పరిస్థితులను ఐసీసీ కూడా నిశితంగా గమనిస్తోంది’’ అని స్పోర్ట్స్తక్తో పేర్కొన్నారు.మాటలకు అందని విషాదంఇక బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. ‘‘పహల్గామ్లో జరిగిన పాశవిక ఉగ్రదాడి కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.బీసీసీఐ తరఫున ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో వారంతా ధైర్యం కోల్పోకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఈ విషాదాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదు. మనమంతా వారికి అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు.బాధితులకు నివాళికాగా పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్-2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ బాధితులకు నివాళి అర్పించింది. ఆటగాళ్లంతా నిమిషం పాటు మౌనం పాటించారు. అదే విధంగా చీర్లీడర్స్ ప్రదర్శనలు లేకుండా చూసుకున్నారు. బాణసంచా కూడా కాల్చలేదు.చివరగా 2008లోఇదిలా ఉంటే.. భారత జట్టు చివరగా 2008లో పాకిస్తాన్లో పర్యటించింది. అదే విధంగా పాక్ జట్టు 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు భారత పర్యటనకు రాగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. భద్రతా కారణాల దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకోగా.. ఐసీసీ జోక్యంతో తటస్థ వేదికైన దుబాయ్లో రోహిత్ సేన తమ మ్యాచ్లు ఆడింది. ఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవగా.. ఆతిథ్య పాక్ జట్టు ఒక్క విజయం లేకుండానే నిష్క్రమించింది.కాగా జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో గల బైసారన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి దిగారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు.చదవండి: Pahalgam Incident: "గౌతమ్ గంభీర్ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు

పాకిస్తాన్కు వెళ్లిపోయిన కేన్ మామ
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ఆడేందుకు పాకిస్తాన్కు వెళ్లిపోయాడు. కేన్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో ప్రారంభం నుండి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కేన్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అతను పీఎస్ఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. పీఎస్ఎల్లోని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ కేన్ను రూ. 86 లక్షలకు కొనుగోలు చేసింది. ఇదే కరాచీ కింగ్స్ ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ను రూ. 2.57 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది. కేన్ పీఎస్ఎల్లో తదుపరి మ్యాచ్లు వార్నర్ కెప్టెన్సీలో ఆడతాడు. కేన్ పీఎస్ఎల్లో ఆడటం ఇదే మొదటిసారి. పాక్ జట్టుతో చేరిన విషయాన్ని కరాచీ కింగ్స్ యాజమాన్యం సోషల్మీడియా వేదికగా వెల్లడించింది.𝐇𝐢 𝐊𝐚𝐫𝐚𝐜𝐡𝐢 𝐟𝐚𝐧𝐬! 𝐈 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 👋The wait is over! Kane Williamson has joined the #KingsSquad 🤩#YehHaiKarachi | #KarachiKings | #HBLPSLX pic.twitter.com/R2z8nEpXbp— Karachi Kings (@KarachiKingsARY) April 24, 2025కేన్ 2015 నుండి 2024 వరకు ఐపీఎల్లో ఆడాడు. 9 సీజన్లలో అతను అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. ఎక్కువ కాలం సన్రైజర్స్కు ఆడిన కేన్.. ఆ జట్టును 2018 సీజన్లో ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు. ఆ సీజన్లో కేన్ 17 మ్యాచ్ల్లో 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. కేన్ను ఎస్ఆర్హెచ్ అభిమానులు ముద్దుగా కేన్ మామ అని పిలుచుకుంటారు. కేన్ను 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్ వదిలేసింది. ఆతర్వాత అతను గుజరాత్ టైటాన్స్తో జత కట్టాడు. ఈ సీజన్ మెగా వేలానికి ముందు గుజరాత్ కూడా కేన్ను వదిలేసింది. మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నా కేన్ను ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. ఘన చరిత్ర కలిగిన కేన్ ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 18 అర్ద సెంచరీల సాయంతో 2128 పరుగులు చేశాడు.పీఎస్ఎల్లో కేన్ సహా చాలామంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఐపీఎల్లో అవకాశాలు రాకపోవడంతో వీరంతా పీఎస్ఎల్ పంచన చేరారు. పీఎస్ఎల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ (1.88 కోట్లు) కాగా.. టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, మార్క్ చాపమన్, ఆడమ్ మిల్నే, కొలిన్ మున్రో, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జేమీసన్ ఓ మోస్తరు వేతనంతోనే సరిపెట్టుకున్నారు. పీఎస్ఎల్-2025లో కేన్ ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్లో క్వెట్టా గ్లాడియేటర్స్తో (ఏప్రిల్ 25) తలపడనుంది. ఈ మ్యాచ్తో కేన్ పీఎస్ఎల్ అరంగేట్రం చేస్తాడు.

SRH VS MI: రికార్డుల్లోకెక్కిన రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరోసారి రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో అత్యంత అరుదైన 12000 పరుగుల మైలురాయిని తాకాడు. నిన్న (ఏప్రిల్ 23) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా (443 ఇన్నింగ్స్ల్లో) నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు క్రిస్ గేల్ (345 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది. గేల్ తర్వాత విరాట్ (360), వార్నర్ (368), అలెక్స్ హేల్స్ (432) అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకారు. ఓవరాల్గా టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన 8వ ఆటగాడిగా హిట్మ్యాన్ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ తన టీ20 కెరీర్లో 8 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు చేశాడు.నిన్నటి మ్యాచ్లో రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (4-0-26-4), దీపక్ చాహర్ (4-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-31-1), బుమ్రా (4-0-39-1), సాంట్నర్ (4-0-19-0) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సన్రైజర్స్ను క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు.అనంతరం ఛేదనలో ముంబై ఆదిలోనే రికెల్టన్ (11) వికెట్ కోల్పోయింది. అయినా రోహిత్ (46 బంతుల్లో 70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తమ జట్టును గెలిపించారు. ముంబై మరో 26 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ముంబై వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.
బిజినెస్

బ్యాంకులకు ఏప్రిల్లో ఇంకా 4 సెలవులు..
మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. ఈ మిగిలిన రోజుల్లో ఏప్రిల్ 30 వరకూ దేశంలోని బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ వారాంతపు సెలవులైన నాలుగో శనివారం, ఆదివారంతోపాటు విశేష దినోత్సవాల సెలవులూ ఉన్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.దేశంలో బ్యాంకులకు సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయిస్తుంది. స్థానిక పండుగలు, విశేష సందర్భాల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఈ సెలవులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది.రానున్న బ్యాంక్ సెలవుల జాబితా» ఏప్రిల్ 26న నాలుగో శనివారం, గౌరీ పూజ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.» ఏప్రిల్ 27న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.» ఏప్రిల్ 29న పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు.» ఏప్రిల్ 30న కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు మూతపడనున్నాయి.ఈ సెలవులు ఆఫ్లైన్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపినప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.

బంగారం ధరల్లో మళ్లీ మార్పు
దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 24) కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజున పుత్తడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3000 మేర క్షీణించి రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 24 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,340- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,200ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.160 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్మార్క్ సర్టిఫికేషన్ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. వెండి ధర కేజీకి రూ.100 మేర క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

బంగారం డిమాండ్కు ‘ధరా’ఘాతం!
ముంబై: బంగారం ధరలు గణనీయంగా పెరిగిపోవడం వినియోగ డిమాండ్ను దెబ్బతీయొచ్చని పరిశ్రమ వర్గాలు, రేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెల 30న అక్షయ తృతీయ, తదుపరి మే చివరి వరకు వివాహాల సీజన్ నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నెల 22న బంగారం 10 గ్రాములకు ఢిల్లీలో రూ.1,01,350కు పెరిగిపోవడం తెలిసిందే. ‘‘బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం అన్నది డిమాండ్పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత డిమాండ్ స్థిరపడుతుంది. మొత్తం మీద అయితే మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు.2023లో 741 టన్నుల బంగారం దిగుమతి కాగా, ధరలు 20% మేర పెరిగినప్పటికీ 2024లో 802 టన్నులు దిగుమతి కావడాన్ని ఆయన ప్రస్తావించారు. బంగారం ధర రూ.లక్షకు చేరడం కచ్చితంగా డిమాండ్పై 10–15% ప్రభావం ఉండొచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా చెప్పారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. ‘‘మార్కెట్లో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా ధరలు పెరుగుదలతో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి నెలకొంది. అయినప్పటికీ వినియోగదారుల్లో ఉన్న సానుకూల సెంటిమెంట్ పరిశ్రమకు అనుకూలిస్తుంది’’ అని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు.విక్రయాలు 9–11 శాతం తగ్గొచ్చు.. బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టాలకు చేరినందున ఈ ఏడాది (2025–26) సంస్థాగత రిటైల్ జ్యుయలర్ల అమ్మకాలు (పరిమాణం పరంగా) 9–11% వరకు తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ పరిమాణంలో కొనుగోళ్లకు మొగ్గు చూపించొచ్చని పేర్కొంది. కొనుగోలు వ్యయం అంతే ఉండి, క్యారట్, గ్రాముల రూపంలో తగ్గొచ్చని వివరించింది. అయినప్పటికీ అమ్మకాల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 13–15% పెరగొచ్చని తాజా నివేదికలో తెలిపింది.రూ.లక్ష దిగువకు పసిడిబంగారం ధర రూ.లక్షను దాటిన ఒక్కరోజులోనే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 నష్టపోయింది. రూ.99,200 వద్ద స్థిరపడింది. 99.5% స్వచ్ఛత బంగారం రూ.3,400 నష్టపోయి రూ.98,700కు దిగొచ్చింది. చైనాపై విధించిన టారిఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలోనే తగ్గించనున్నట్టు ట్రంప్ ప్రకటించడం అమ్మకాలకు దారితీసింది.

ఖరీదైనవి కొంటున్నారా? కట్టండి పన్ను..
న్యూఢిల్లీ: హ్యాండ్ బ్యాగ్లు, చేతి గడియారాలు, పాదరక్షలు, క్రీడా వస్త్రాలు రూ.10 లక్షలు మించినవి మరింత ఖరీదుగా మారనున్నాయి. వీటిపై ఒక శాతం మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) చేయనున్నారు. ప్రస్తుతం ఒక శాతం టీసీఎస్ రూ.10 లక్షలు మించిన మోటారు వాహనాలపైనే అమలవుతోంది. ఒక శాతం టీసీఎస్ వర్తించే విలాస వస్తువుల జాబితాను ఆదాయపన్ను శాఖ తాజాగా విడుదల చేసింది.పెయింటింగ్లు, శిల్పాలు, పురాతన వస్తువులు, కాయిన్లు, స్టాంప్లు, పడవలు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్బ్యాగ్లు, కళ్లద్దాలు, పాదరక్షలు, క్రీడావస్త్రాలు, క్రీడా పరికరాలు, హోమ్ థియేటర్ సిస్టమ్లు, రేసింగ్ కోసం ఉద్దేశించిన గుర్రాల విక్రయ ధరపై ఒక శాతం టీసీఎస్ అమలవుతుంది. కొనుగోలుదారుల నుంచి ఉత్పత్తి ధరపై ఒక శాతం అదనంగా టీసీఎస్ను విక్రయదారులే వసూలు చేస్తారు. వారి పాన్ వివరాలు కూడా తీసుకుని, ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. కొనుగోలుదారులు ఆదాయపన్ను రిటర్నులు వేయడం ద్వారా తమ పన్ను చెల్లింపులో సర్దుబాటు చేసుకోవచ్చు.పన్ను చెల్లించే బాధ్యత లేకపోతే రిఫండ్ కోరొచ్చు. టీసీఎస్ రూపంలో ఆదాయపన్ను శాఖకు అదనంగా ఎలాంటి పన్ను ఆదాయం రాదు. కాకపోతే అధిక కొనుగోళ్ల వివరాలను పాన్ నంబర్ల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అధిక విలువతో కూడిన విచక్షణారహిత కొనుగోళ్ల పర్యవేక్షణను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులను పెంచుకోవడం దీని లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫ్యామిలీ

ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
‘ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే...భలే ఛాన్సులే’ అంటుంది సుపరిచిత సినిమా పాట. ‘మజా’ సంగతి ఎలా ఉన్నా ‘ఇల్లరికం అల్లుడు’ అంటే మజాకా కాదు. అత్తామామలను కన్నతల్లిదండ్రుల్లా చూసుకునే మంచి మనసు ఉండాలి. ఈ విషయంలో నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు మద్నూర్ మండల ఇల్లరికం అల్లుళ్లు...మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గల్లీకో నలుగురు ఇల్లరికం అల్లుళ్లు ఉంటారు. అందులో రెండు మూడు తరాల వాళ్లున్నారు. ఒకటి రెండు కుటుంబాల్లో మామ, అల్లుడు ఇద్దరూ ఇల్లరికం వాళ్లే ఉన్నారు. ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్లు తమ బంధువుల అబ్బాయిలను, తెలిసిన వాళ్ల అబ్బాయిలను, బంధుత్వం లేని వాళ్లను కూడా ఇల్లరికం తెచ్చుకుని వారికి తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తారు.అత్తగారి ఇల్లే....అమ్మగారి ఇల్లుఇల్లరికం వచ్చిన అల్లుల్లు అత్తారింటిలో భాగం అయిపోతారు. ఇక్కడి ఇంటి పేరే వారి ఇంటి పేరుగా మారిపోతుంది. సంతానం లేని కుటుంబాల్లో దగ్గరి బంధువుల అమ్మాయిని దత్తత తీసుకుని, వేరే అబ్బాయిని ఇల్లరికం తెచ్చుకుని పెళ్లిచేసి ఇంట్లో పెట్టుకుంటారు. ఇల్లరికం వచ్చిన అల్లుళ్లు అన్నీ తామై కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.అల్లుడే కుమారుడై...మగ సంతానం లేకపోవడంతో ఇల్లరికం అల్లుడిని తెచ్చుకునే పద్ధతిని చాలామంది పాటిస్తున్నారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయడంతో పాటు, వృద్ధాప్యంలో అత్తామామలకు ఆసరాగా ఉంటున్నారు అల్లుళ్లు. దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది.మంచిగ చూసుకుంటరు...తాడిచెట్లవార్ సచిన్ సొంతూరు మహారాష్ట్రలోని సావర్మల్. అత్తమామలు తాడిచెట్ల అంజయ్య, రుక్మిణిలకు మగసంతానం లేరు. 2021లో సచిన్ను ఇల్లరికం తెచ్చుకున్నారు. ‘మా అత్తామామలకు కొడుకు, అల్లుడు అన్నీ నేనే. వ్యాపారం చూసుకుంటాను. ఇంటి వ్యవహారాలన్నీ నేను చూస్తాను. అందరం చాలా బాగా ఉంటాం’ అంటున్నాడు సచిన్.‘మాది మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా. మా అత్తమామలకు ఒకతే ఆడపిల్ల కావడంతో 2022లో నన్ను ఇల్లరికం అల్లుడిగా తీసుకుని పెళ్లి జరిపించారు. ఇంట్లో అందరూ మంచిగ చూసుకుంటరు. నేను బిజినెస్ చేస్తున్నాను. ఇంట్లో అందరి సహకారం బాగుంది. ఎవరూ తేడా చూపరు’ అంటున్నాడు కన్నవార్ మణికంఠ.‘2003 లో నేను ఇల్లరికం వచ్చాను. అల్లుడినైనా కొడుకులాగా మా అత్తామామలను చూసుకోవాలి. ఏ ఇబ్బందీ లేకుండా సంతోషంగా ఉన్నాం’ అంటున్నాడు గంపల్వార్ నాగనాథ్.‘నాకు ముగ్గురు పిల్లలు. వాళ్లను బాగా చదివిస్తున్నాను. మా అత్తమామ నన్ను కొడుకులా చూసుకుంటారు. నాకు వాళ్లే తల్లిదండ్రులు’ అంటున్నాడు గడ్డంవార్ మల్లికార్జున్. ఇవన్నీ చూస్తుంటే మనం మొదట్లో పాడుకున్న పాటకు తగ్గట్టే ఉన్నారు అనిపిస్తోంది కదా!మామ... అల్లుడు ఇద్దరూ ఇల్లరికమే...మద్నూర్లో గడ్డంవార్ నడిపి గంగారాం 1966లో ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు. ఆయనే ఆ ఇంటికి కొడుకైనా, అల్లుడైనా. ఆయనకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు పెళ్లిళ్లు చేసిన తరువాత నాలుగో కూతురికి ఇల్లరికం అల్లుడిని తెచ్చుకోవాలనుకున్నారు. 2000 సంవత్సరంలో మల్లికార్జున్ను ఇల్లరికం తెచ్చుకుని నాలుగో కూతురితో పెళ్లి జరిపించాడు. అప్పటి నుంచి ఇంటి బాధ్యతలు మళ్లికార్జున్ చూసుకుంటున్నాడు.అల్లుళ్ల సంఘం!మద్నూర్ మండల కేంద్రంలో ఇల్లరికం అల్లుళ్లు కలిసి ఒక సంఘం పెట్టుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఊళ్లో ఇల్లరికం అల్లుళ్ల పేర్లతో జాబితాను రూపొందించుకున్నారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి వంటి పదవులకు కూడా పేర్లు నిర్ణయించుకున్నారు. ఎందుకోగానీ సంఘం పెట్టుకోవాలనే వారి కల కలగానే మిగిలిపోయింది. చిన్న చూపు చూడలేదు... చిన్న సమస్యా రాలేదుమా ఆయన ఇల్లరికం వచ్చిండు. మాకు అందరు బిడ్డలే. మేమూ అల్లున్ని ఇల్లరికం తెచ్చుకున్నం. ఎప్పుడు గూడా చిన్న సమస్య రాలేదు. అందరం మంచిగనే ఉంటం. ఇల్లరికం అని ఎవరినీ ఎవరూ చిన్న చూపు చూడలేదు. కలిసి మెలిసి ఉండి ఎవరి పని వాళ్లు చేసుకుంటుంటరు. – గడ్డంవార్ చంద్రకళ – ఎస్. వేణుగోపాలాచారి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Pahalgam: ఈ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరము? గుండెల్ని పిండేసే వీడియోలు
జమ్మూకశ్మీరిలోని పహల్గామ్ ఉగ్ర దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. మినీ స్విట్జర్లాండ్ బైసరన్ లోయలో మంగళవారం జరిగిన మారణ హోమం పలువురి కంటతడి పెట్టిస్తోంది. ఈ సంఘటనకు భయానక వివరాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. హనీమూన్కి వచ్చి ఒకరు, సెలవులకోసం వచ్చి ఒకరు ఇలా 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న వైనాన్ని యావద్దేశం ఖండించింది. 8 ఏళ్ల శిశువు నుండి నావికాదళ అధికారి వరకు, 22 మంది పర్యాటకులు, ఇద్దరు విదేశీయులు ,ఇద్దరు స్థానికులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో తండ్రి కోల్పోయిన చిన్నారి హృదయ విదారకంగా రోదిస్తున్న వీడియో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉగ్రమూకలు రెచ్చిపోయి పర్యాటలకు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ప్రాణ భయంతో అనేకమంది పరుగులు తీశారు. 26 మంది తూటాలకు నేలకొరిగారు. ఇలా తండ్రిభౌతిక దేహం మీద ఒక చిన్నారి రోదిస్తున్న వీడియో నెటిజనుల గుండె పిండేసింది. అతణ్ని రక్షించి తీసుకెళ్లుతుండగా, ఆ చిన్నారి రోదన ముఖ్యంగా అమ్మకావాలి అటూ ఏడుస్తున్న దృశ్యాలు హృదయ విదారకం ఉన్నాయి. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని, బాధితులకు నివాళులర్పించారు. దేశం ఉగ్రవాదానికి తలొగ్గదని, దోషులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించారు. आपका दिल फट्ट जाएगा इस छोटे बच्चे का रोना सुनकर! इसके पिता का जुर्म इतना सा था की वह एक हिंदू थे! इन आतंकियों को ऐसा सबक सीखना चाहिए की इनकी 100 पुश्ते भी याद करके काँप जाये! #PahalgamTerroristAttack #HindusUnderAttack pic.twitter.com/J6Q6xhSU8L— Priyanshi Bhargava (@PriyanshiBharg7) April 23, 2025మృతుల్లో నావికాదళ అధికారి వినయ్ నర్వాల్.భార్య హిమాన్షి నర్వాల్ భర్త శవపేటిక పక్కన తీవ్రంగా రోదించింది. తన భర్త ధైర్యసాహసాల గురించి మాట్లాడుతూ విలపించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. కోటి ఆశలతో కొత్తజీవితాన్ని ప్రారంభించిన ఆ జంట కలలు క్షణాల్లో తునాతునాలైపోయాయి. ఇక హిమాన్షి దుఃఖాన్ని నిలువరించడం ఎవ్వరి తరము? #WATCH | Delhi | Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/KJpLEeyxfJ— ANI (@ANI) April 23, 2025మరోవైపు ఆ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు టెర్రరిస్టుల ఊహాచిత్రాలను దర్యాప్తు బృందాలు విడుదల చేశాయి. ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరిని జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులుగా భావిస్తున్నారు.

మస్క్తో వైట్హౌస్లో బ్రేక్ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం

కలర్ఫుల్.. సిబ్లింగ్స్ వాక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్లో గానీ సంప్రదించాలన్నారు.
ఫొటోలు


సచిన్ టెండుల్కర్ బర్త్డే.. అరుదైన ఫొటోలు చూశారా? (ఫోటోలు)


వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)


పహల్గాం ఉగ్రదాడి ప్రాంతంలో షూటింగ్స్ జరుకున్న చిత్రాలివే


#DakshaNagarkar : హీరోయిన్ దక్ష నాగర్కర్ కిల్లింగ్ లుక్స్


హార్దిక్ పాండ్యాతో ఫొటో..SRHvsMI మ్యాచ్లో నటి కుషిత కల్లపు (ఫొటోలు)


హైదరాబాద్ : ఘనంగా జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక (ఫొటోలు)


హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)


నెల్లూరులో కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి సందడి (ఫొటోలు)


SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)


Pahalgam: పహల్గాం ఉగ్ర దుశ్చర్య.. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీ(ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు.. హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) తగ్గేదే లే అంటోంది. విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులకు ట్రంప్ సర్కార్ కత్తెర వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కత్తెరకు సిద్ధపడుతున్న తరుణంలో విశ్వవిద్యాలయం అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఫెడరల్ నిధులను నిలిపివేయడం ద్వారా.. విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచుసెట్స్ (massachusetts) కోర్టులో దావా వేసింది. అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారంటూ దావాలో ప్రస్తావించింది. ట్రంప్ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని.. ఫెడరల్ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. నిధులను స్తంభింపజేయడం, ఫెడరల్ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దావాలో హార్వర్డ్ యూనివర్సిటీ కోరింది.హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్హౌస్(White House) పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించినవి అవి. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు, కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం ప్రచురించింది.అయితే.. వైట్హౌజ్ జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్(Alan Garber) స్పష్టం చేస్తున్నారు. వాటిని బహిరంగంగా తిరస్కరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్ చర్యలపై ట్రంప్ యంత్రాంగం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే.. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ కార్యక్రమం (ఎస్ఈవీపీ) ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. కానీ, ఈ పరిణామాలను హార్వర్డ్ తేలికగా తీసుకుంటోంది. ‘ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం’ అని వర్సిటీ ప్రతినిధి స్పష్టంచేశారు.తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.ట్రంప్ యంత్రాంగంతో ఘర్షణ వైఖరి కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీ.. ఫెడరల్ నిధుల నుంచి దాదాపుగా 9 బిలియన్ డాలర్లను కోల్పేయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.

నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది.

పోప్ వారసుని ఎన్నిక ఇలా...
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నుకుంటారు. అందుకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. అది వాటికన్లోని సిస్టిన్ చాపెల్లో ఆద్యంతం అత్యంత గోప్యత నడుమ జరుగుతుంది. తుది ఫలితాన్నే తప్ప ప్రక్రియను ఎప్పటికీ బయటికి వెల్లడించరు. ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి చెప్పడం పూర్తిగా నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన కార్డినల్స్ను తక్షణం వెలి వేసేలా నిబంధనలను పోప్ బెనెడిక్ట్–16 కఠినతరం చేశారు. 1996లో పోప్ జాన్పాల్–2 తిరగరాసిన పోప్ ఎన్నిక తాలూకు నియమ నిబంధనలను బెనెడిక్ట్ రెండుసార్లు సవరించారు. → పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని ఎన్నుకునేదాకా రోజువారీ వ్యవహారాలను వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ చాంబర్లెయిన్ హోదాలో లాంఛనంగా నిర్వర్తిస్తారు. ఈ దశలో కీలక నిర్ణయాలేవీ తీసుకోరు. → పోప్ మృతిని చాంబర్లెయిన్ అధికారికంగా ధ్రువీకరించాక పోప్ నివాసానికి సీల్ వేస్తారు. → పోప్ అస్తమయంతో ఒకరిద్దరు మినహా దాదాపుగా వాటికన్ అధికారులంతా మాజీలవుతారు. → ‘ఫిషర్మన్స్ రింగ్’గా పిలిచే పోప్ అధికారిక ముద్రను చాంబర్లెయిన్ ప్రత్యేక సుత్తెతో విరగ్గొడతారు. తద్వారా ప్రస్తుత పోప్ పాలనకు తెరపడిందని లాంఛనంగా ప్రకటిస్తారు. → త్వారత కార్డినల్స్ కాలేజీ సమావేశమై పోప్ అంత్యక్రియల ఏర్పాట్లను ఖరారు చేస్తుంది. → ఫ్రాన్సిస్ కోరిక మేరకు అంత్యక్రియలు ఆయనకెంతో ఇష్టమైన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో సాదాసీదాగా జరుగుతాయి. సాధారణంగా పోప్ అంత్యక్రియలకు సైప్రస్, జింక్, ఇల్మ్తో కూడిన మూడు శవపేటికలను ఉపయోగిస్తారు. ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు మాత్రం ఆయన కోరిక మేరకు జింక్తో కూడిన ఒకే పేటికను వాడనున్నారు. → తర్వాత వాటికన్లో 9 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. ఈ సమయంలో కార్డినల్స్ అంతా రోమ్కు విచ్చేస్తారు. ప్రక్రియ ఇదీ.. → పోప్ మరణించిన 15 నుంచి 20 రోజులకు ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా మొదలవుతుంది. → కార్డినల్స్ అంతా సిస్టిన్ చాపెల్లో సమావేశమై పోప్ను ఎన్నుకుంటారు. 80 ఏళ్లలోపు వయసువారు మాత్రమే అందుకు అర్హులు. ప్రస్తుతం ఆలోపు వయసున్న కార్డినల్స్ 135 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎలక్టర్ల సంఖ్య 120కు మించరాదు. → పోప్ ఎన్నిక దీర్ఘచతురస్రాకృతిలో ఉండే కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. దానిపై భాగంలో ‘సుప్రీం పాంటిఫ్గా నేను ఎన్నుకుంటున్నది’ అని రాసుంటుంది. పేరు రాసేందుకు వీలుగా పక్కన ఖాళీ వదులుతారు. → ఒక్కో కార్డినల్ దానిపై తనకిష్టమైన వారి పేరు రాసి సగానికి మడిచి ట్రేలో వేస్తారు. దాన్ని సరిగ్గా నింపిందీ లేనిదీ స్రు్కటినీర్స్గా పిలిచే ముగ్గురు కార్డినల్స్ సరిచూస్తారు. → తర్వాత ఒక్కో బ్యాలెట్ తెరిచి అందులో రాసిన పేరు బయటికి చదువుతూ లెక్కిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం ఫలితాలను ప్రకటిస్తూ పోతారు. → కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వచ్చిన వారే తదుపరి పోప్ అవుతారు. అందుకోసం ఇనిíÙయల్ మాస్గా పిలిచే లాంఛన కార్యక్రమం అనంతరం ఫస్ట్ బ్యాలెట్ నిర్వహిస్తారు. పోప్ను ఎన్నుకోలేకపోతే బ్యాలెట్లను సూది ద్వారా దారానికి గుచ్చి ట్రేలో వేస్తారు. తర్వాత వాటిని స్తూపాకారపు స్టౌలో కాల్చేస్తారు. దాని తాలూకు పొగ నల్ల రంగులో సిస్టిన్ చాపెల్ చిమ్నీ గుండా అందరికీ కన్పించేలా బయటికొస్తుంది. ఇంకా పోప్ను ఎన్నుకోలేదని దాని అర్థం. అలా పోప్ను ఎన్నుకునే దాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది పూర్తవగానే తెల్ల పొగ వెలువడుతుంది. చర్చి గంటలు మోగుతాయి. → అనంతరం కార్డినల్స్ ‘మనం పోప్ను ఎన్నుకున్నాం’ అని ప్రకటిస్తారు. నూతన పోప్ ఎంచుకున్న పేరును చదివి విన్పిస్తారు. → చివరికి కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి అందరికీ దర్శనమిచ్చి తన తొలి ఆశీర్వాదమిస్తారు. → పోప్ ఎన్నిక ప్రక్రియ పొడవునా కార్డినల్స్తో పాటు అందులో పాలుపంచుకునే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. వారు మొబైల్స్తో సహా ఎలాంటి ఆడియో, వీడియో పరికరాలూ వెంట ఉంచుకునేందుకు వీల్లేదు. రేసులో వీరే బాప్టిజం తీసుకున్న క్యాథిలిక్ పురుషుడెవరైనా పోప్ కావచ్చు. అయితే 1378 నుంచి కేవలం కార్డినల్స్ మాత్రమే పోప్గా ఎన్నికవుతూ వస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా విన్పిస్తున్న కొన్ని పేర్లు... → ఇటలీకి చెందిన కార్డినల్ పియెట్రో పారోలిన్ (70). వాటికన్లో సీనియర్ దౌత్యాధికారి. ప్రస్తుత విదేశాంగ మంత్రి. → కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఔలెట్ (80). 2010 నుంచి 2023 దాకా వాటికన్ బిషప్స్ హెడ్గా ఉన్నారు. → ఆ్రస్టియాకు చెందిన కార్డినల్ క్రిస్టోఫ్ షోన్బర్న్ (80). పోప్ బెనెడిక్ట్–16 దగ్గర శిష్యరికం చేశారు. సంప్రదాయవాదిగా పేరు. → ఫిలిప్పీన్స్కు చెందిన కార్డినల్ లూయిస్ టగ్లే (67. వాటికన్ మిషనరీ ఆఫీస్ సారథిగా ఫ్రాన్సిసే ఎంపిక చేశారు. → ఇటలీకి చెందిన కార్డినల్ మట్టెయో జుప్పీ (69). ఫ్రాన్సిస్కు బాగా ఇషు్టడు. కార్డినల్స్లో నలుగురు భారతీయులు పోప్ను ఎన్నుకునే 35 మందితో కూడిన కార్డినల్స్ కాలేజీలో నలుగురు భారతీయులున్నారు. వారు ఫిలిప్ నెరీ ఫెరారో, బాసెలియొస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకోబ్ కూవకాడ్.

చైనాలో 10జీ నెట్వర్క్..!
బీజింగ్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో డ్రాగన్ దేశం చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 10 గిగాబైట్స్ ఫర్ సెకన్స్() వేగంతో పనిచేసే 10జీ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ను ప్రారంభించింది. రాజధాని బీజింగ్ సమీపంలోని హుబే ప్రావిన్స్లో చేపట్టిన ప్రయోగ పరీక్షలో గరిష్టంగా 10 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు మీడియా వెల్లడించింది. ఈ వేగంతో అత్యంత స్పష్టతతో కూడిన రెండు పూర్తి సినిమాలను కేవలం సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ తదితర రంగాల్లో దీనితో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి.
జాతీయం

శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాధిత పర్యాటకులు, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత వెంటనే కేంద్ర హోంమంత్రితో సమన్వయంతో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు చేపట్టి, శ్రీనగర్ నుంచి ఢిల్లీకి రెండు, ముంబైకి రెండు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైతే మరిన్ని విమానాలను సిద్ధంగా ఉంచేలా కూడా చర్యలు చేపడతామని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రయాణికులపై భారం పడరాదన్న ఉద్దేశంతో విమాన ధరలకు రెక్కలకు బ్రేక్ వేస్తూ ఏకకాలంలో టికెట్ల ధరలు పెరగకుండా ఉండేందుకు అన్ని ఎయిర్లైన్స్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, కశ్మీర్లో ఉన్న తెలుగు పర్యాటకుల రాకపోకలు సమన్వయం చేసేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, పహల్గామ్ వద్ద ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి చంద్రమౌళి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే విశాఖ కలెక్టర్తో మాట్లాడి, మృతదేహాన్ని గౌరవంగా విమానమార్గంలో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల తరలింపునకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్లైన్స్, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నారు.

పొగచూరి ఎండతగలక..
న్యూయార్క్: సూరీడుని అదృశ్య శక్తి మింగేయడం, దాంతో భూమి మీద సూర్యరశ్మి కరువై ఒక్కసారిగా వాతావరణం చల్లబడం వంటి అభూత కల్పనల్లో వింటుంటాం. అలాంటి అరుదైన, వింత ఘటనకు అగ్రరాజ్యం వేదికైంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2023 జూన్లో భానుడు భగభగమండుతున్నా సిటీలో మాత్రం వాతావరణం చల్లబడింది. ఆ నగరంలో భూమిపై సూర్యరశ్శి ప్రసరణ తగ్గిపోవడమే కారణం. ఆనాడు సమీప కెనడా దేశంలోని అటవీకార్చిచ్చు కారణంగా దట్టంగా కమ్ముకున్న దుమ్ము, ధూళి మేఘాల కారణంగా న్యూయార్క్లో ఆకాశం మొత్తం మసకబారి సూర్య కిరణాలకు కాస్తంతయినా జాగా లేకుండా పోయిందని, అందుకే ఉష్ణోగ్రత మూడు డిగ్రీ సెల్సియస్ తగ్గిందని ఒక అధ్యయనం తాజాగా వెల్లడించింది. సంబంధిత అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎని్వరోన్మెంట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూఉపరితాన్ని సూర్యరశ్మి తాకలేకపోవడంతో కాస్తంత వెలుతురు, వేడి తగ్గడాన్ని ‘గ్లోబల్ డిమ్మింగ్’అంటారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిని మరింత గరళం చేసే వాయువులు భూ వాతావరణంలో చిక్కుబడిపోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని రట్గర్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. ఏకంగా 1,000 కిలోమీటర్లు ప్రయాణించి.. ఫిలిప్ డెమొక్రిటో, జార్జియస్ కెలీసిడీస్ల సారథ్యంలోని పరిశోధనా బృందం కెనడా దావానలం తాలూకు పొగ, ధూళి ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను కమ్మేసిన వైనాన్ని ఈ బృందం పరిశోధించింది. ‘‘ఈ దుమ్ము, ధూళి మేఘాల్లోని గోధమ రంగ కర్భన ఆర్గానిక్ అణువుల కారణంగానే సూర్యరశ్మి భూమిని తాకలేకపోయింది. ఉష్ణోగ్రత తగ్గడానికి ఇదే కారణం. ఈ భారీ ‘దుమ్ము గొడుగు’కారణంగా స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన సహజ గాలికి సైతం ఆటంకాలు ఏర్పడ్డాయి. గాలి అటు ఇ టూ వేగంగా వెళ్లే పరిస్థితిలేకపోవడంతో ఎక్క డి వాయు కాలుష్యం అక్కడే గాఢంగా పరుచుకుపోయింది. ఈ కాలుష్య గాలిలోని సూక్ష్మధూ ళి కణాలు అలాగే భూమి సమీప వాతావరణంలోనే తిష్టవేశాయి. ఈ సమయంలో న్యూయార్క్ నగరంలో సూక్ష్మ ధూళి కణాలు( 2.5 పీఎం) అత్యంత ఎక్కువ స్థాయిలో పోగుబడ్డాయి. పర్యావరణ పరిరక్షణా సంస్థ నిర్దేశించిన స్థాయి కంటే ఏకంగా మూడు రెట్లు ఎక్కువ సూక్ష్మధూళి కణాలు వాతావరణంలో ఉండిపోయాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుచేసిన స్థాయి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా సూక్ష్మ ధూళి కణాలు నగర గాలిలో ఉన్నాయి’’అని పరిశోధకులు చెప్పారు. వ్యాధి నిరోధక శక్తి సగానికి.. ఊహించనంతగా పెరిగిన వాయుకాలుష్యం కారణంగా స్థానికులను శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముట్టాయని అధ్యయనకారులు తెలిపారు. రట్గర్స్ బృందం చేసిన మరో పరిశోధన ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో ప్రచురితమైంది. ఈ పెను వాతావరణ పోకడ కారణంగా నగరంలోని ప్రతి ఒక్క ఒక్కరి ఊపిరితిత్తుల్లోకి అదనంగా సగటున 9.3 మిల్లీగ్రాముల బరువైన పొగ అణువులు చొరబడ్డాయని దీంతో ఇన్ఫెక్షన్లతో పోరాడే వాళ్ల వ్యాధినిరోధక శక్తి సామర్థ్యం ఏకంగా 50 శాతం క్షీణించిందని ఆ పరిశోధన పేర్కొంది. కెనడాలో కార్చిచ్చు ఘటనలు కొనసాగినన్ని రోజులూ న్యూయార్క్లో ఆస్తమా సంబంధ కేసులు 44 శాతం నుంచి ఏకంగా 82 శాతానికి పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని పరిశోధన ఉదహరించింది. ‘‘ఈ ప్రాంతంలో ఇలాంటి దృగి్వíÙయం జరగడం ఇదే తొలిసారి. అయితే ఇదే చివరిసారి అని మాత్రం చెప్పలేం. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి మళ్లీ సంభవించే ప్రమాదం ఉంది’’అని పరిశోధకుడు ఫిలిప్ డెమొక్రిటో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా ఇకపై తరచూ, అత్యధికంగా కార్చిచ్చు ఘటనలు సంభవించి ఈశాన్య అమెరికాకు కాలుష్య కష్టాలు పెరిగే అవకాశముందని ఫిలిప్ విశ్లేషించారు. కార్చిచ్చులకు, పట్టణ ప్రాంతంలో వాతావరణంలో మార్పులకు, ప్రజారోగ్యానికి మధ్య సంబంధాలను ఈ పరిశోధన విశదీకరించింది.

సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పంపిణీతో ఏపీకి తీరని నష్టం
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం–1956లోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణాజలాల పునఃపంపిణీ కోసం కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాల వల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గతంలోని కేటాయింపులు కాకుండా ఇప్పుడు మళ్లీ కేటాయింపులను మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలను ఖరారు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది.కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి ట్రైబ్యునల్కు కేంద్రం జారీచేసిన సెక్షన్ 3ను రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. నదీజలాల కేటాయింపు విషయంలో గతేడాది తీసుకున్న కేంద్ర నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, నదీజల వివాద చట్టం ప్రకారం బ్రిజేష్ ట్రైబ్యునల్కు ఇలా అదనపు అంశాలు పరిశీలించే అధికారం లేదని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు.గతంలో కృష్ణానది జలాల పంపిణీలో భాగంగా ఏపీకి 811 టీఎంసీలు కేటాయించగా.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. అయితే ఈ కేటాయింపులను మళ్లీ మొదటి నుంచి పరిశీలించేలా విధివిధానాలు ఖరారు చేయడం వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం కోర్టు సమయం ముగియడంతో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తదుపరి వాదనలు గురువారం లేదా మరోరోజు వింటామని ధర్మాసనం తెలిపింది.

పాక్కు ‘పంచ్’.. ఆ దేశ పౌరులకు వీసాలు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై మంగళవారం ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. దీని వెనక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపిస్తోందంటూ మండిపడింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్తో దౌత్య సంబంధాలకు చాలావరకు కత్తెర వేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమా వేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు తదితరాలు వీటిలో ఉన్నాయి. దీంతో పాక్తో ఇప్పటికే క్షీణించిన దౌత్య సంబంధాలు మరింత అట్టడుగుకు దిగజారాయి. ఈ చర్యలతోనే సరిపెట్టకుండా ఉగ్ర ముష్కరులకు, వారిని ప్రేరేపిస్తున్న పొరుగు దేశానికి దీటుగా బదులిచ్చేందుకు కూడా కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ దిశగా చేపట్టాల్సిన చర్యలపై సీసీఎస్ భేటీలో రెండున్నర గంటలకు పైగా లోతుగా చర్చ జరిగింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష మంగళవారం రాత్రి సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వెనుదిరిగిన ప్రధాని మోదీ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీతో విమానాశ్రయంలోనే సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలు అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సాయంత్రం ఆరింటికి మోదీ సారథ్యంలో సీసీఎస్ అత్యవసరంగా సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, జైశంకర్, దోవల్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్కుమార్ సింగ్, విక్రం మిస్రీ, ప్రధాని ముఖ్య కార్యదర్శులు పీకే మిశ్రా, శక్తికాంత దాస్, అత్యున్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యురాలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనలో ఉండటంతో హాజరు కాలేదు. దాడిపై ప్రతిస్పందన ఎలా ఉండాలన్నదే ప్రధాన అజెండాగా భేటీ జరిగింది. దాడి జరిగిన తీరు తదితరాలను అమిత్ షా వివరించారు. 25 మంది భారతీయులు, ఒక నేపాల్ జాతీయుడు మృతి చెందినట్టు చెప్పారు. శిక్షించి తీరతాం: మిస్రీ పహల్గాం దాడిని సీసీఎస్ అత్యంత తీవ్రంగా ఖండించినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తెలిపారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దాడికి తెగబడ్డ ముష్కరులతో పాటు దాని సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించి తీరాలని సీసీఎస్ తీర్మానించింది’’ అని వెల్లడించారు. ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ రాణా మాదిరిగానే వారిని కూడా చట్టం ముందు నిలబెట్టడం ప్రకటించారు. ‘‘జమ్మూ కశ్మీర్లో విజయవంతంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగి, ఆ ప్రాంతమంతా ఆర్థికాభివృద్ధితో కళకళలాడుతున్న వేళ పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్రపూరిత దాడి ఇది. దాని వెనక దాగున్న సీమాంతర లింకులపై సీసీఎస్ లోతుగా చర్చించింది. ప్రపంచ దేశాలన్నీ దాన్ని అత్యంత తీవ్ర పదజాలంతో ఖండించిన తీరును ప్రశంసించింది. ఉగ్రవాదంపై రాజీలేని పోరులో భారత్కు ఆ దేశాల మద్దతుకు ఇది ప్రతీక అని పేర్కొంది. పాక్పై తీసుకున్న చర్యల జాబితాను చదివి వినిపించారు. పాక్పై చర్యలివే... – సార్క్ వీసా మినహాయింపు పథకం (ఎస్వీఈఎస్) కింద పాక్ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత. ఇప్పటికే జారీ చేసిన వీసాల రద్దు. వాటిపై ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశం. – ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం మానుకునేదాకా 1960లో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందం సస్పెన్షన్. – భారత్, పాక్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజాబ్లోని అటారీ సరిహద్దు తక్షణం మూసివేత. దానిగుండా పాక్కు వెళ్లినవారు తిరిగొచ్చేందుకు మే 1 దాకా గడువు. – ఢిల్లీలోని పాక్ హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వారంలోపు భారత్ వీడాలని ఆదేశం. ఇస్లామాబాద్లోని భారత హై కమిషన్ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారుల ఉపసంహరణ. – ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గింపు.
ఎన్ఆర్ఐ

పిట్స్బర్గ్లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్కాంగ్లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ‘అమ్మానాన్నా.. నన్ను క్షమించండి. నేను ఇల్లు వదిలి వెళ్లిపోతున్నా’.. అంటూ ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి లేఖ రాసి అదృశ్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. బద్దెనల్లిలో రెండేళ్లుగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రియాంక.. కాంగ్రెస్ నేతల వేధింపులు భరించలేకపోతున్నానంటూ.. లేఖ రాసి సోమవారం అదృశ్యమైంది. డీపీఓకు రాజీనామా లేఖ వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత క్రీదాది మల్లేశ్బాబుతోపాటు మరికొందరు పెట్టే బాధల వల్ల మానసిక వేదన భరించలేకపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కాగా, తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతురి కోసం తల్లిదండ్రులు మంగళవారం తిరుపతికి బయలుదేరారు.

యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.

హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
వీడియోలు


Telugu Movies 2026: నెవర్ బిఫోర్ బ్లాస్టింగ్


భారత్లో పాక్ సినిమాలు, నటులపై నిషేధం


LIVE: జీవితంలో మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: YS Jagan


రఘురామ కృష్ణంరాజు వైఖరిని తప్పు పడుతున్న జనం


Big Questions: కశ్మీర్ ఉగ్రదాడి గురించి ముందే తెలుసా?


ఢిల్లీ: పాకిస్థాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత


పహల్గామ్ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న కుటుంబం


పహల్గాంలోని బైసరన్ వ్యాలీ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్


పహల్గామ్ మృతులకు వైఎస్ జగన్ సంతాపం


వరుస ట్వీట్లతో TDP MPకేశినేని చిన్నిని టెన్షన్ పెడుతున్న కేశినేని నాని