-
దివ్యాంగులకు ప్రత్యేక వసతి గృహాలు
విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రాకడ మణి ఏలూరు (టూటౌన్): శారీరక వైకల్యం, దృష్టి లోపం, మూగ, చెవుడు (బధిరులు) తదితర దివ్యాంగ విద్యార్థులకు 3వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు వరకూ ఏలూరులోని కోటదిబ్బ ప్రాంతంలో ప్రత్యేక వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయని విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమశాఖ అధికారి పి.రాకడ మణి తెలిపారు. బాలబాలికలకు వేర్వేరుగా హాసళ్లు ఉన్నాయన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరే వారు హాస్టళ్లలో వసతి పొందుతూ చదువుకోవచ్చని చెప్పారు. హాస్టళ్లలో భోజనం, వసతితో పాటు నాలుగు జతల దుస్తులు, దుప్పట్లు, ట్రంకు పెట్టె, నోటు పుస్తకాలు, రోజూ గుడ్డు, వారంలో రెండు/మూడు రోజులు చికెన్తో భోజనం తదితర సదుపాయాలు ఉన్నాయన్నారు. కాస్మోటిక్ చార్జీల కింద 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు బాలురకు రూ.175, బాలికలకు రూ.130, 7వ తరగతి ఆపై చదివే విద్యార్థులకు రూ.200 చొప్పున అందిస్తామన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉన్నారన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 81429 38379, 93940 04882లలో సంప్రదించాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లలతో నేరుగా వచ్చి వసతి గృహాలను సందర్శించవచ్చని ఆమె తెలిపారు. -
న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన
కామవరపుకోట: వీరిశెట్టిగూడెం మాజీ ఎంపీటీసీ డి.పాపమ్మ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ ఆమె బంధువులు పాపమ్మ మృతదేహంతో వీరిశెట్టిగూడెం అడ్డరోడ్డు వద్ద శనివారం సాయంత్రం రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. పాపమ్మ(54) అత్తవారి గ్రామం వీరిశెట్టిగూడెం కాగా.. భర్త మరణానంతరం పుట్టిల్లు తడికలపూడిలో ఉంటుంది. ఈ నెల 13న వీరిశెట్టిగూడెంలో ఓటు వేసిన అనంతరం తడికలపూడి వెళ్లిపోయింది. వీరిశెట్టిగూడెంకు చెందిన ఒక వ్యక్తి ఓటు వేసినందుకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఆమె వీరిశెట్టిగూడెం వెళ్లి తిరిగి తడికలపూడి రాలేదు. రాత్రి వీరిశెట్టిగూడెంకు చెందిన ఒక వ్యక్తి అపస్మారక స్ధితిలో ఉన్న పాపమ్మను తడికలపూడిలోని బంధువుల ఇంటి సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. పాపమ్మను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పాపమ్మ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలంటూ బంధువులు రాస్తారోకో నిర్వహించారు. డీఎస్పీ రవిచంద్ర, సీఐ పి.రాజేష్, ఎస్సై జయబాబు ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సంఘటనపై దెందులూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైందనిని తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. శనివారం ఏలూరు సమీపంలో వట్లూరులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను, భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు అన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను సంబంధిత రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ హాలులోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వంటివి అనుమతించమన్నారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ అనుమతించరాదన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లను కలెక్టర్ పరిశీలించి సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ను తనిఖీచేసి ఈవీఎంల భద్రతను పరిశీలించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. వీరి వెంట ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏలూరు ఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. ముక్కంటి, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
22ఏ నుంచి 11,715 ఎకరాల తొలగింపు
● జిల్లాలో 9,172 మంది రైతులకు సంబంధించి 11,715.32 ఎకరాల 22ఏ భూముల్లో నిషేధాజ్ఞలు తొలగించి శాశ్వత ప్రయోజనం చేకూర్చారు. ● ప్రధానంగా పోలవరం నియోజకవర్గంలో 2484.64 ఎకరాల 22ఏ అసైన్డ్ భూమిని 1,775 మందికి అందించారు. ● గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలంలో 1,238 మందికి 1,910.08 ఎకరాల 22ఏ అసైన్డ్ భూమిని పంపిణీ చేశారు. ● చింతలపూడిలో 22ఏలో ఉన్న అసైన్డ్ భూమి 3,780.15 ఎకరాలను 2,464 మందికి పంపిణీ చేశారు. ● నూజివీడు నియోజకవర్గంలో 22ఏలో ఉన్న అసైన్మెంట్ భూమి 2,781.38 ఎకరాలను 2,580 మందికి అందజేశారు. ● దెందులూరు నియోజకవర్గంలో 503.24 ఎకరాల 22ఏ అసైన్డ్ భూమిని 479 మందికి పంపిణీ చేశారు. ● కై కలూరు నియోజకవర్గంలో 310.32 ఎకరాల 22ఏ అసైన్డ్ భూమిని 353 మందికి అందించారు. ● ఏలూరు అర్బన్లో 19 సెంట్ల 22ఏలో అసైన్డ్ భూమిని అనుభవదారుడికి అప్పగించారు. ● ఉంగుటూరులో 31.67 ఎకరాల 22ఏ అసైన్డ్ భూమిని 50 మందికి పంపిణీ చేశారు. ● అలాగే ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ల్యాండ్ పర్చేజ్ కింద కొనుగోలు చేసిన 391.45 ఎకరాల భూమిని 611 మంది ఎస్సీ లబ్ధిదారులకు కేటాయించారు. ● 1,548.86 ఎకరాలకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ టైటిల్స్ను పంపిణీ చేశారు. -
ఉమ్మడి ‘పశ్చిమ’లో సంక్షేమానికే పట్టం!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ సమయంలో జనప్రభంజనం సునామీలా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా... కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగా పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది.ఇక టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు మారాయి. ప్రతి ఊరిలో నాడు-నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి, 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. నాడు-నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్ సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లలో రూ.3,880 కోట్ల పెన్షన్, 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యా కానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు.జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగాయి.ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్ను రూ.80 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమేకం కావడం, పాజిటివ్ ఓటు మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోయింది.నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనూ వైఎస్సార్సీపీదే హవా!ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో వైఎస్ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో చూద్దాం.నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.నరసాపురంలో ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని మూడు పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలముకుంది. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆచంటలో ఆ పార్టీ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనుకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తాలేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్నచోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్లుగా జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ, మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది.వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కారు, వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ తాజా పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.70 ఏళ్ల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. -
మొక్కలతో వాతావరణ సమతుల్యం
కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ఏలూరు(మెట్రో): పర్యావరణ సమతుల్యానికి, ఆరోగ్యకరమైన నగర వాతావరణాన్ని నిర్వహించేందుకు మొక్కలు నాటి పెంచాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం నగరంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. నగరంలోని తంగెళ్లమూడి–జంగారెడ్డిగూడెం రోడ్డు, సీఆర్ఆర్ కళాశాల వద్ద, అశోక్నగర్, పంపుల చెరువు తదితర ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో మామిడి, జామ, నేరేడు వంటి ఫల రకాల మొక్కలతోపాటు రావి తదితర 400 మొక్కలను నాటుతున్నట్టు చెప్పారు. ఈ మొత్తాన్ని తాను స్వయంగా అందిస్తున్నానన్నారు. వీటికి ట్రీగార్డ్స్ అమర్చి పెంపకం విషయంపై అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. కలెక్టర్ సతీమణి మానస మాట్లాడుతూ మొక్కల పెంపకం ఆవశ్యతకను చిన్నతనం నుంచే పిల్లలకు తెలియజేయాలన్నారు. డీఆర్వో డి.పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలీ, కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, డ్వామా పీడీ ఎ.రాము, డీఎఫ్ఓ శైలజ పాల్గొన్నారు. నష్ట నివారణపై అవగాహన పెంచాలి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాద సమయంలో ఆస్తి, ప్రాణనష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. నగరంలోని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని ఆమె సందర్శించి అగ్నిమాపక వాహనాలు, వాటర్ బోట్లను పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలు, బోట్లను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో వరదల సమయంలో మెరుగైన సేవలందించారని సిబ్బందిని కొనియాడారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ సీహెచ్ రత్నబాబు మాట్లాడుతూ జిల్లాలో 6 రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖల కార్యాలయాలు ఉన్నాయని, వాటిలో 8 అగ్నిమాపక నివారణ వాహనాలు ఉన్నా యన్నారు. అత్యవసర పరిస్థితిలో వినియోగానికి యంత్ర పరికరాలు, వాటర్ బోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జాగ్రత్త చర్యలపై జిల్లాలోని పరిశ్రమలు, ప్రజానివాస ప్రాంతాల్లో డెమో ప్రదర్శనలు ఇస్తున్నామన్నారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వి.రామకృష్ణ ఉన్నారు. -
స్ట్రాంగ్రూమ్స్కు మూడంచెల భద్రత
ఏలూరు టౌన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎం బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు. ఏలూరు సర్ సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్రూమ్స్ వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం ఆమె పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర సా యుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అధికారులు నిరంతరం అ ప్రమత్తంగా ఉంటూ విధులను సమర్థవంతంగా ని ర్వర్తించాలని ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ అ ధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉన్నది లేనిదీ తనిఖీ చేస్తారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా కార్డెన్, సెర్చ్లు నిర్వహిస్తున్నామని అనుమానిత వ్యక్తులు, అసాంఘిక చర్యలకు పాల్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఏలూరు జిల్లాలో 17 చోట్ల కార్డెన్, సెర్చ్ నిర్వహించామని, ఈ తనిఖీల్లో 140 మోటారుసైకిళ్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. -
ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ షీట్లు విడుదల చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాపరిషత్ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ షీట్లు వెంటనే విడుదల చే యాలని కోరుతూ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలుగా పీఎఫ్ బ్యాలెన్స్ షీట్లు విడుదల చేయకపోవడానికి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సు మారు 7,700 మంది పీఎఫ్ ఖాతాదారులైన ఉ ద్యోగ, ఉపాధ్యాయులు వారి ఖాతాల్లో వివరా లు తెలియక ఆందోళన చెందుతున్నారని అ న్నారు. పదవీ విరమణ పొందుతున్న వారు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిపై సీఈఓ స్పందిస్తూ తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి దీనిపై కసరత్తు చేస్తున్నామని, ఇదే ప్రథమ ప్రాధాన్యతగా భావించి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే బ్యాలెనన్స్ షీట్లు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇంటర్ సప్లిమెంటరీకి 1,966 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు శుక్రవారం జిల్లాలోని 27 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలు జరిగాయి. ఫస్టియర్ పరీక్షలకు 1,537 మంది జనరల్ విద్యార్థులకు 1,397 మంది, 182 మంది ఒకేషనల్ విద్యార్థులకు 159 మంది హాజరయ్యారు. మొత్తంగా 1,719 మందికి 1556 మంది హాజరయ్యారు. అలాగే సెకండియర్ పరీక్షలకు 259 మంది జనరల్ విద్యార్థులకు 218 మంది, 221 మంది ఒకేషనల్ విద్యార్థులకు 192 మంది హాజరయ్యారు. మొత్తంగా 480 మందికి 410 మంది హాజరయ్యారు. తొలిరోజు పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని పరీక్షల కన్వీనర్ బి.ప్రభాకరరావు తెలిపారు. తల్లీకూతుళ్ల ప్రతిభ టి.నరసాపురం: భగవద్గీత పారాయణం పోటీల్లో టి.నరసాపురానికి చెందిన తల్లీకూతుళ్లు ప్రతిభ కనబర్చి గణపతి సచ్చిదానంద స్వామి చేతులమీదుగా పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు. మైసూర్లోని దత్త పీఠం వద్ద దత్త వేంకటేశ్వరస్వామి ఆలయ 25వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా భగవద్గీత పారాయణ పోటీ లు ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. టి.నర సాపురం నుంచి కొనకళ్ల లక్ష్మీనాగనిర్మల, ఆమె కుమార్తె లక్ష్మీ నాగచేతన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలువురు పోటీల్లో పాల్గొనగా నాగనిర్మల ఉత్తమ శ్రేణి డిస్టింక్షన్, నాగచేతన ప్రథ మ శ్రేణిలో నిలిచి ప్రతిభ కనబర్చారు. తల్లీకూతుళ్లు ఇద్దరు ఏడాదిన్నరగా ఆన్లైన్లో భగవద్గీత శ్లోకాలు ఉపాధ్యాయుల ద్వారా చదవడం నేర్చుకుని కంఠస్థం చేశారు. లక్ష్మీ నాగనిర్మల మాట్లాడుతూ భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను కంఠస్థం చేసినట్టు చెప్పారు. భగవద్గీత పారాయణ ద్వారా ఆధ్యాత్మికత పెరగడంతో పాటు విలువలతో కూడిన జీవి తం అలవడుతుందన్నారు. ప్రశాంతంగా టెన్త్సప్లిమెంటరీ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్షకు 4,004 మంది విద్యార్థులకు 1,498 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 37.41గా ఉంది. 17 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, 4 కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి, 6 కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కలిపి మొత్తం 27 పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేశారు. తొలిరోజు ఎక్కడా ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఫెర్రీ వేలం పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రం రేవులో ఫెర్రీ వేలం నిర్వహించినట్టు పంచాయతీ కార్యదర్శి టి.విజయకుమారి తెలిపారు. శుక్రవారం సర్పంచ్ సబ్బారపు శ్రీరామమూర్తి అధ్యక్షతన 2024–25కు ఫెర్రీకి బహిరంగ వేలం నిర్వహించారు. ఎం.సత్యనారాయణ అనే వ్యక్తి వేలం పాటలో రూ.11.70 లక్షలకు ఫెర్రీని దక్కించుకున్నట్లు విజయకుమారి తెలిపారు. -
బాస్కెట్బాల్లో జయకేతనం
అంతర జిల్లాల యూత్ బాస్కెట్బాల్ పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచింది. బాలికల జట్టు తృతీయ స్థానం సాధించింది. 8లో uకౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపునకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. జూన్ 4న నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. 289 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 340 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 309 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 938 మంది సిబ్బంది ర్యాండమైజేషన్ను పారదర్శకంగా నిర్వహించామన్నారు. డీఆర్వో డి.పుష్పమణి, కలెక్టరేట్ ఏఓ కె.కాశీవిశ్వేశ్వరరావు, ఎన్ఐసీడ డీఐఓ శర్మ పాల్గొన్నారు. -
వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే..
తాడేపల్లిగూడెం/తణుకు: రాష్ట్రంలో వచ్చేది.. సంక్షేమ పాలన ఇచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అంటూ జిల్లాలో బెట్టింగులు జోరందుకున్నాయి. పోలింగ్ ముగిసిన రోజున డాంబికాలు పోయి, హంగామా సృష్టించిన కూటిన నేతలకు భంగపాటు తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కూటమి గెలుస్తుందని కోసు పందాలు, ఒకటికి రెండు, ఒకటికి మూడు, ఐదు అంటూ హైప్ క్రియేట్ చేసిన వారంతా వారం రోజులుగా పత్తాలేకుండా పోయారు. తాజా పరిణామాలు, పోలింగ్ విశ్లేషణలు బయటకు వచ్చిన తర్వాత బెట్టింగ్రాయుళ్లు హడావుడి తగ్గింది. వైఎస్సార్సీపీ మరలా అధికారం చేపడుతుందని చాలెంజ్ చేస్తే.. కూటమి అభిమానులు, పందాలరాయుళ్లు పత్తాలేకుండా పోతున్నారు. రాయలసీమ, కడ ప ప్రాంతాల నుంచి వచ్చిన వారు వైఎస్సార్సీపీ వైపు సవాల్ కు సై అంటున్నా పందాలు కాచే వారు కానరాని పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. చంద్రబాబు సొంత సామాజికవర్గం సిండికేట్గా మారి బెట్టింగ్లు వేసే వాతావరణం జిల్లాలో వేళ్లూనుకుంది. ఐదేళ్లుగా సంక్షేమ పాలనను అన్నివర్గాలకు చేరువ చేసిన జగనన్న ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టేలా పోలింగ్ సరళి ఉందన్నది సర్వేలు, విశ్లేషణల సారాంశం. కూటమికి ఓటేసిన వారు రోడ్లెక్కి హల్చల్ చేస్తున్నట్టుగా వాతావరణం ఉండగా.. ఫ్యాన్కు ఓటేసిన వారు నిశ్శబ్ధ విప్లవాన్ని మరోసారి తెచ్చేలా సైలెంట్గా ఉన్నారని, పోలింగ్ బూత్ల వద్ద క్యూలు, అర్ధరాత్రి వరకు సాగిన పోలింగ్ సరళి ఇందుకు నిదర్శనం అని అంటున్నారు. అధికార పార్టీకి ఓటేసిన వారు సైలెంట్గా ఉండగా, కూటమికి ఓటేసిన వారు హంగామాతో పందాలను చేజిక్కించుకొని లబ్ధి పొందాలని చూస్తున్న వాతావరణం జిల్లాలో నెలకొంది. రెండు రోజులుగా మారిన పరిస్థితి 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఫలితాలపై బెట్టింగ్లు వేయడానికి చాలా మంది జంకుతున్నారు. నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులు, పోలింగ్ సరళి, తాయిలాల పంపిణీలను ఆధారంగా చేసుకుని నియోజకవర్గ ఫలితం, గ్రామాల వారీ ఆధిక్యతలు, వార్డుల్లో బూత్ల వారీ ఆధిక్యాలు ఎలా ఉంటాయనే స్థాయిలోనే పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మెజార్టీపై పందాల కంటే సీటు పందాలు, జిల్లాలో గెలిచే స్థానాలు, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎన్ని సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు, మేజిక్ ఫిగర్ దాటి ఎన్ని సీట్లు రావచ్చు అనే కోణంలో ప్రధానంగా పందాలు సాగుతున్నాయి. గతంలో మాదిరి ఆస్తులను పణంగా పెట్టి పందాలు వేసే వాతావరణం జిల్లాలో లేదు. పార్టీల సానుభూతిపరులుగా అభ్యర్థుల వెంట క్రియాశీలకంగా తిరిగిన వారు ఎక్కువగా బెట్టింగులు వేస్తున్నారు. రెండు రోజులుగా తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వస్తుందనే కోణంలోనే ఎక్కువగా పందాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇతర నియోజకవర్గాలపైనా.. పందెం రాయుళ్ల హాట్ ఫేవరేట్గా పిఠాపురం నిలుస్తోంది. అక్కడ పోటీలో ఉన్న పవన్ కల్యాణ్, వంగా గీతలో ఎవరు గెలుస్తారు.. గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందన్న దానిపై పందెం కాస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి పవన్ కల్యాణ్ ఓడిపోవడంతో ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతారా? లేక అలవాటైన రీతిలో ఓడిపోతారా? అని ఆరా తీస్తున్నారు. మంగళగిరి, హిందూపురం, కుప్పం స్థానాలపైనా పందేలు నడుస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబుకు మెజార్టీ తగ్గుతుందని పందెం కాయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు. పందేలకు సై.. సై.. పెరుగుతున్న బెట్టింగ్లు పత్తాలేని కూటమి సానుభూతిపరులు -
‘మారణహోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం’
ఏలూరు (టూటౌన్): గాజాలో మారణహోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదాం అని భారత కార్మిక సంఘాల సమైక్య(ఇఫ్టూ) రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక ఇఫ్టూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.జియోనిస్ట్ ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనాను దురాక్రమిస్తున్నారని అన్నారు. పాలస్తీనా ప్రజల జాతి ఆకాంక్షలను అణచివేస్తున్నారని దీని కోసం పాలస్తీనాపై బాంబు, వైమానిక దాడులు చేస్తూ మారణహోమాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా ప్రజలను దుర్మార్గంగా అణిచివేస్తున్నారన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ గాజాలో ఇప్పటి వరకూ 35వేల మంది ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయిల్ సాయుధ బలగాల చేతుల్లో వందలాది మంది పాలస్తీనీయన్లు బలయ్యారన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
డీవైఈఓ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
డీఆర్వో పుష్పమణి ఏలూరు(మెట్రో): ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవైఈఓ) పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పరీక్షా సమన్వయ అధికారి డి.పుష్పమణి తెలిపారు. శుక్రవారం ఆమె చాంబర్లో శనివారం జరుగనున్న డీవైఈఓ పరీక్ష నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ స్కూల్, ఏలూరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మొత్తంగా 320 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు ఉదయం 8.30 గంటలలోపు అభ్యర్థులు కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతలి లేదన్నారు. ఒక్కో కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, లైజన్ ఆఫీసర్ను నియమించామన్నారు. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎ.కృష్ణవేణి (మోనిటర్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్.కస్తూరి పరీక్ష నిర్వహణ అధికారులుగా నియమించారన్నారు. -
ఉగాది జాతీయస్థాయి నాటికగా ఇంద్రప్రస్థం
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణంలోని బీవీఆర్ కళాకేంద్రంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి 31వ ఉగాది నాటికల పోటీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. బీవీఆర్ కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు నాటిక పోటీల విజేతల వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటిక నిలిచింది. ఉత్తమ ద్వితీయ నాటికగా విశాఖపట్నం తెలుగు కళా సమితి వారి నిశబ్ధమా నీ ఖరీదెంత ? ఉత్తమ తృతీయ నాటికగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి రాత, జ్యూరీ ప్రదర్శనలుగా హైదరబాద్ సిరిమువ్వ కల్చరల్ థింక్, కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ వారి కౌసల్యా సుప్రజారామ, ఉత్తమ రచనలుగా ఇంద్రప్రస్థం, స్నిగ్ధ, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడిగా ఇంద్రప్రస్థం నాటికలో ఎన్.రవీంద్రరెడ్డి, ఉత్తమ నటిగా అమృతహస్తంలోని మాలతి పాత్రలోని మాధవి, ద్వితీయ ఉత్తమ నటిగా స్వప్నం రాల్చిన అమృతంలో జ్యోతిరాణిి (సుగుణ), ఉత్తమ ప్రతి నాయకుడిగా అమృతహస్తం నాటికలో ఏపూరి హరిబాబు, ఉత్తమ హాస్య నటుడిగా నిశబ్ధమా నీ ఖరీదెంతలో వామనరవు, (కన్నబాబు), ఉత్తమ బాలనటిగా రాత నాటికలో స్వప్నిక, ఉత్తమ సహాయ నటుడిగా కౌసల్యా సుప్రజారామలో సీతారాం (విజయ్), ఉత్తమ సహాయ నటిగా ఇంద్రప్రస్థంలో సౌందర్య పాత్ర జి.నాగ కుసుమసాయి, ఉత్తమ సంగీతం రాతలో సురభి నాగరాజు, ఉత్తమ ఆహార్యం రాతలో శివ ప్రసాద్, ఉత్తమ రంగాలంకరణ ఇంద్రప్రస్థంలో ఫణి, ఉత్తమ రంగోద్దీపనంగా కౌసల్యా సుప్రజా రామ, జ్యూరీ అవార్డులు కొత్త తరం కొడుకు శ్రీరామచంద్రయ్య, డి.ఉమాశంకర్, రైతే రాజులో రైతు వెంకన్న (భుజంగరావు), న్యాయ నిర్ణేతలుగా ఆకుల మల్లేశ్వరరావు, కత్తుల రామ్మోహన్రావు, వి.వేణుగోపాల్ వ్యవహరించారు. -
వృద్ధురాలి మెడలో ఐదు కాసుల గొలుసు చోరీ
కామవరపుకోట: ఇద్దరు యువకులు దాహం వేస్తుందని, మంచినీళ్లు ఇవ్వమని, వృద్ధురాలి మెడలో 5 కాసుల బంగారు గొలుసు అపహరించిన ఘటన చిన్నమ్మరావుపాలెంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని ఆడమిల్లి గ్రామ పంచాయతి చిన్నమ్మారావుపాలెం గ్రామానికి చెందిన కమ్మ తులసమ్మ శుక్రవారం మధ్యాహ్నం తన ఇంటి ఆవరణలో కూర్చుని ఉండగా, ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చి ఆ వృద్ధురాలిని మంచినీళ్లు కావాలని అడిగారు. ఆమె లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఒకడు ఆమె మెడలో నుంచి బంగారం గొలుసు లాగేశాడు, ఆ సమయంలో ఆమె ఆ యువకులను ప్రతిఘటించే ప్రయత్నం చేసినా వారు వృద్ధురాలిని తోసేసి, ద్విచక్ర వాహనంపై దొంగలిద్దరు ఆడమిల్లి మీదుగా కామవరపుకోట వైపు వెళ్లిపోయారు. ఈ సంఘటనపై తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దొంగిలించిన బంగారం విలువ సుమారు రు. 2 లక్షలకు పైనే ఉంటుందని బాధితులు వాపోతున్నారు. -
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని, ఈ నెల 30 వరకు ధ్యానం సేకరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి చెప్పారు. ఈ మేరకు ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 2.40 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని, ఇప్పటివరకు 2 లక్షల టన్నులు కొనుగోలు చేశామన్నారు. డిమాండ్ కలిగిన విత్తనాన్ని రైతులు సాగు చేయడంతో అనుకున్న మేరకు కొనుగోలుకు ధాన్యం రాలేదన్నారు. జిల్లావ్యాప్తంగా 17,198 మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారని, రైతులకు ఇబ్బందులు లేకుండా కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు సొమ్ములు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రూ.434.76 కోట్ల ధాన్యం కొనుగోలు చేయగా, దీనిలో ఇప్పటివరకు రూ.241.59 మేర కోట్ల చెల్లింపులు చేశామని, మిగిలిన వారికి వారం పది రోజుల్లో సొమ్ములు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేసీ చెప్పారు. ప్ర స్తుతం జిల్లావ్యాప్తంగా మిల్లర్ల వద్ద నుంచి బియ్యాన్ని సేకరించే పనిలో ఉన్నామని, ఇప్పటికే 25 శాతం సీఎంఆర్ పూర్తయ్యిందన్నారు. నెల రోజుల్లో నూరు శాతం సీఎంఆర్ ప్రక్రియను పూర్తి చేసేలా మిల్లర్ల వద్ద నుంచి బియ్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం : జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ నారుమడులు, ఖరీఫ్కు వరి విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందని జేసీ లావణ్యవేణి తెలిపారు. ఖరీఫ్కు సంబంధించి ఇప్పటికే రైతులకు 10,800 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరో 18 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను సైతం సిద్ధం చేశామన్నారు. పచ్చిరొట్ట విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని, గిరిజన ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీతో అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జూన్ రెండో వారానికి నారుమడులు వేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించిందన్నారు. కెమెరాల నిఘాలో స్ట్రాంగ్రూమ్లు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందని జేసీ లావణ్యవేణి తెలిపారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. మూడంచెల అంచెల భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరిచామని, మొదటి అంచెలో కేంద్ర పారామిలటరీ భాగాలు, రెండో అంచెలో రాష్ట్ర పారామిలటరీ బలగాలు, మూడో అంచెలో రాష్ట్ర పోలీసు బలగాల నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో ఉంచామన్నారు. 96 కెమెరాల మధ్య నిరంతరం నిఘా ఉంటుందని చెప్పారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో భాగంగా ర్యాండమ్ గా ఐదు వీవీప్యాట్లను సైతం లెక్కిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల కమిషన్ నియమించిన ఒక అబ్జర్వర్, ప్రత్యేక పరిశీలకులు ఉంటారన్నారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు, ఆయా పార్టీల ఏజెంట్ల నియమించుకోవాలని, సమావేశాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను అనుమతించమన్నారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పోలింగ్ మాదిరిగా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తిచేసేలా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉందని జేసీ లావణ్యవేణి వివరించారు. 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు రూ.241.59 కోట్ల చెల్లింపులు 30 వరకు ధాన్యం సేకరణ ఖరీఫ్కు వ్యవసాయశాఖ సిద్ధం ఈవీఎంలకు పటిష్ట భద్రత ‘సాక్షి’తో జేసీ లావణ్యవేణి -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పోలవరం రూరల్: మండలంలోని ఎల్ఎన్డీపేట గ్రామంలో ఒక వీధిలో రోడ్డుపై నిలిపి ఉంచిన వాటర్ ట్యాంకర్ను ఢీకొని ఒక యువకుడు మృతిచెందాడు. పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్ఎన్డీపేట గ్రామానికి చెందిన కాసాని కిరణ్బాబు(35) అనే యువకుడు శుక్రవారం తెల్లవారుజామున ఇంటి వద్ద నుంచి మోటార్సైకిల్పై వెళుతుండగా, ప్రమాదవశాత్తు అక్కడే నిలిపిన వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. దీంతో కిరణ్బాబుకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు 108 వాహనంలో కిరణ్బాబును పోలవరం వైద్యశాలకు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య భవానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ తెలిపారు. పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు పాలకొల్లు అర్బన్: మండలంలోని కొత్తపేటలో శుక్రవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి, ఐదుగురు వ్యక్తులపై దాడి చేసింది. దీంతో స్థానిక యువజనులు పిచ్చికుక్క వెంటపడి తరిమికొట్టి చంపేశారు. గెద్దాడ కిరణ్కుమార్, గొల్లమందుల యోబు, బద్దె వజ్రమ్మతో మరో ఇరువురు పిచ్చికుక్క కాట్లకు గురయ్యారు. వీరంతా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స పొందారు. బ్యాంకులో గుండెపోటుతో మహిళ మృతి తణుకు: పట్టణంలోని ఒక బ్యాంకుకు వచ్చిన మహిళ గుండె పోటుతో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఆలపాటి లక్ష్మీనారాయణమ్మ (55) తన భర్తతో కలిసి జిల్లా సహకార బ్యాంకు తణుకు బ్రాంచ్కి వచ్చారు. ఈ క్రమంలో బ్యాంకు ఆవరణలో కూర్చున్న లక్ష్మీనారాయణమ్మ గుండెపోటుతో కుప్పకూలిపోయింది.దీంతో ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. పాల వ్యాన్ను ఢీకొట్టి వ్యక్తి మృతి కామవరపుకోట: ఆగి ఉన్న పాలవ్యాన్ను వెనక నుండి ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో గండిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై జయబాబు తెలిపిన వివరాల ప్రకారం లింగపాలెం మండలం శింగగూడెం గ్రామానికి చెందిన ఉమ్మడి దుర్గారావు (42) గురువారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి తడికలపూడి గ్రామపంచాయతీ వేంపాడు బంధువులు ఇంటికి వెళ్లి అదే రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా మండలంలోని కళ్ళచెరువు గ్రామ పంచాయతీ గండిగూడెం గ్రామ శివారు వచ్చేసరికి రోడ్డు పక్కన ఆగి ఉన్న పాల వ్యాన్ను వెనుక నుండి ఢీ కొట్టాడు. ఘటనలో దుర్గారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడకు అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై జయబాబు తెలిపారు. -
ఖరీఫ్కు కొత్త వరి వంగడాలు సిద్ధం
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300 వరి రకాలు సాగుచేస్తున్నప్పటికీ బీపీటీ 5204, ఎన్డీఎల్ఆర్ 7, స్వర్ణ, పీఏపీఎల్ 1100, ఆర్జీఎల్ 2537 వంటి కొన్ని రకాలు మాత్రమే తినడానికి అనువుగా ఉంటున్నాయి.ఈ సమస్యను అధిగమించేందుకు మరిన్ని రకాలను, అధిక పోషక విలువలు కలిగిన వాటిని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూలై 19న విడుదల చేసింది. అందులో బీపీటీ 5204, ఎంటీయూ 1271, బీపీటీ 2846, బీపీటీ 2841, ఎన్ఎల్ఆర్ 3238 రకాలు ఉన్నాయి. వాటి వివరాలను మార్టేరు రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ (వరి) డాక్టర్ టి.శ్రీనివాస్ తెలిపారు. ఆయా రకాల వరి వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఆయన తెలిపారు. ఎంటీయూ 1271 అధిక గింజలతో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్న రకం. పంట కాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి 69.7 శాతం నిండు గింజలు కలిగి అధిక దిగుబడి ఇస్తుంది. రైతు, మిల్లర్, సన్నగింజ ధాన్యం మార్కెట్కి అనుకూలమైన వెరైటీ. కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సార్వాకు అనువైన రకం. దోమ, ఎండాకు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.8 టన్నుల నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. బీపీటీ 2846 కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో బీపీటీ 5204కు దీటైన ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. మార్కెట్కు, వినియోగదారులకు అనువుగా ఉంటుంది. పంట కాలం 145 నుంచి 150 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. సన్నగింజ రకం. కాండం దృఢంగా ఉండి చేను పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. భోజనానికి అనుకూలమైన రకం. 65.2 శాతం నిండు గింజలు కలిగి మిల్లర్, మార్కెట్కు అనుకూలమైన వెరైటీ. అగ్గి తెగులు, మెడ విరుపు, పొట్ట కుళ్లు తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రైతుకు మంచి ఆదాయం ఇస్తుంది. నేరుగా విత్తే విధానం, సేంద్రియ వ్యవసాయ విధానానికి అనువైన రకం. బీపీటీ 2841 అధిక ప్రొటీన్, జింక్, ఇతర పోషక విలువలు కలిగి, మధుమేహ రోగులకు భోజనానికి అనువైన నల్ల బియ్యపు రకం. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా, భోజనానికి అనువుగా ఉంటూ అధిక దిగుబడినిచ్చే మధ్యస్థ సన్న గింజ రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 65.2 శాతం నిండు గింజలు కలిగి పచ్చి బియ్యానికి అనువుగా ఉంటుంది. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి బాగుంటుంది. అగ్గి తెగులు, మెడవిరుపు, దోమ పోటును తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 టన్నుల దిగుబడి సామర్థ్యం కలిగి, రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకూ అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్లో కిలో సింగిల్ పాలిష్ బియ్యానికి రూ. 200 పైచిలుకు ధర పలికే అవకాశం ఉన్న రకం. ఎన్ఎల్ఆర్ 3238 అధిక జింక్ కలిగి ఉంటుంది. మధ్యస్థ సన్న గింజ రకం. 120 – 125 రోజుల కాల పరిమితి కలిగిన స్వల్పకాలిక వెరైటీ. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ చేనుపై మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. 62% నిండు గింజలు కలిగి, బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు తెగుళ్లను తట్టుకుంటుంది. తక్కువ నత్రజనితో (సిఫారసు చేసిన నత్రజనిలో 75%) సగటున ఎకరాకు 2.6 టన్నుల దిగుబడి ఇస్తుంది. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయం చేసే అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటూ, డిజిటల్ మార్కెటింగ్కి అనువైన రకం.విత్తనాల కోసం వీరిని సంప్రదించవచ్చు అధిక శాతం విస్తీర్ణంలో కొత్త వెరైటీల సాగుకు కసరత్తు చేస్తున్నట్లు డా. టి.శ్రీనివాస్ తెలిపారు. ఎంటీయూ వరి రకాల విత్తనాల కోసం మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీడ్ ఆఫీసర్ డాక్టర్ పీవీ రమణారావు (ఫోన్ 94404 41922), బీపీటీ రకాల కోసం డాక్టర్ కృష్ణవేణి (ఫోన్ 94417 21120), ఎన్ఎల్ఆర్ రకాలకు డాక్టర్ శ్రీలక్ష్మి (ఫోన్ 98855 27227), వరి రకాల వివరాలు, సాగులో సందేహాల నివృత్తి కోసం డాక్టర్ టి.శ్రీనివాస్ (ఫోన్ 93968 48380) సంప్రదించాలని డా. టి.శ్రీనివాస్ వివరించారు.2023లో అఖిల భారత స్థాయిలో విడుదలైన వరి వంగడాలుఎంటీయూ 1275 పంట కాలం 135 నుంచి 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ మధ్యస్థ సన్నంగా ఉండి పచ్చి బియ్యానికి అనుకూలం. బియ్యం పారదర్శకంగా ఉండి భోజనానికి అనువుగా ఉంటుంది. అగ్గి తెగులు, మెడ విరుపు, బ్యాక్టీరియా ఆకు ఎండు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది.బీపీటీ 3050 కేంద్ర రకాల విడుదల కమిటీ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలలో సాగు కోసం విడుదల చేసిన రకం. పంట కాలం 130 నుంచి 135 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి గింజ మొలకెత్తదు. కాండం ధృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ పొడవుగా లావుగా ఉండి అధిక బియ్యం రికవరీ కలిగిన రకం. అగ్గి తెగులు, మెడ విరుపు, గోధుమ రంగు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. సగటున ఎకరాకు 2.4 నుంచి 2.6 టన్నుల దిగుబడి వస్తుంది. -
కౌంటింగ్కు సర్వ సన్నద్ధం
ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర సచివాలయం నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ ఎం.సూర్యతేజ, డీఆర్వో డి.పుష్పమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు సర్వ సన్నద్ధంగా ఉన్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, కౌంటింగ్ కోసం అదనపు ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసి స్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. మొదటి ర్యాండమైజేషన్, శిక్షణా కార్యక్రమం ఈనెల 27న నిర్వహిస్తామన్నారు. ఆర్వోలు ఎం. ముక్కంటి, ఎన్ఎస్కే ఖాజావలీ, కె.అద్దయ్య, వై.భవానీ శంకరి, కె.భాస్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, ఏఓ కె.కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలను ఉపేక్షించం ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. కౌంటింగ్కు అందరూ సహకరించాలన్నారు. అభ్యర్థులు వారి కౌంటింగ్ ఏజెంట్లగా పంపే వారి పూర్తి వివరాలను ఫారం–18లో నెలాఖరులోపు సమర్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వాచ్లను అనుమతించమన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను ప్రదర్శిస్తామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేస్తారన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల విజయోత్సవాల్లో భాగంగా ఊరేగింపులు, ర్యా లీలు, బాణసంచా కాల్పులకు అనుమతి లేదన్నా రు. ఓట్ల లెక్కింపునకు నిర్దేశిత గుర్తింపు కార్డులతో హాజరుకావాలన్నారు. డీఆర్వో డి.పుష్పమణి, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీఆర్ఆర్ మోహన్రావు (వైఎస్సార్సీపీ), ఎంఎల్ఎస్ఏ కుమార్ (కాంగ్రెస్), కె.బాలకృష్ణ (తెలుగుదేశం), బి.రాజు (నవరంగ కాంగ్రెస్ పార్టీ), డి.ఆదర్ష్ (లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ), తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
డీఈఓ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
డీఆర్వో పుష్పమణిఏలూరు(మెట్రో): ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఈఓ) పరీక్షలను ఈనెల 25న జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించనున్నారని డీఆర్వో, జిల్లా సమన్వయ అధికారి డి.పుష్పమణి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడూతూ జిల్లాలో పరీక్షలకు 320 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ స్కూల్, ఏలూరు ఇంజనీరింగ్ టెక్నాలజీ కాలేజీలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని, అభ్యర్థులు ఉదయం 8.30 గంటలలోపు కేంద్రాల్లోకి చేరుకోవాలన్నారు. ఒక్కో కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్, లైజన్ ఆఫీసర్ను నియమించామన్నారు. కేంద్రాల్లోకి పేపర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద మౌలిక వసతులు కల్పించామని, హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
కమనీయం.. కాళ్లకూరు రథోత్సవం
కాళ్ల: కాళ్లకూరులో వేంకటేశ్వరస్వామి (వెంకన్న) తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. తొలుత రథంపై ఆశీనులైన స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం గ్రామ పెద్దలు, భక్తు లు రథాన్ని లాగి రథోత్సవం ప్రారంభించారు. రథోత్సవంలో బుట్టబొమ్మలు, శక్తివేషాలు, తీన్మార్ డప్పులు, మేళతాళాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పురవీధుల మీదుగా సాగిన రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి నిత్యౌపాసన, బలిహరణ, పంచసూక్త హవనం, రజత పుష్పాలతో విశేష పూజ, నీరాజన మంత్రపుష్ప ప్రసాద వినియోగం వంటి పూజాదికాలు జరిపించారు. -
ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత
జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఏలూరు టౌన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామనీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి అన్నారు. ఏలూరు గిరిజన భవన్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రధాన అనుచరులు, నాయకులతో ఎన్నికల కౌంటింగ్పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నియమ, నిబంధనలు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలన్నారు. వచ్చేనెల 6 వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటాయన్నారు. కోడ్ అమల్లో ఉండగా నమోదయ్యే క్రిమినల్ కేసులన్నీ ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో నిందితులకు శిక్షలు పడేలా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవన్నారు. జిల్లా అదనపు ఎస్పీ జి.స్వరూపరాణి, ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, టూటౌన్ సీఐ ప్రభాకర్, త్రీటౌన్ సీఐ కె.శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ నాయకులు నూకపెయ్యి సుధీర్బాబు, మంచెం మైబాబు, మున్నుల జాన్గురునాథ్, సుంకర చంద్రశేఖర్, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో శుక్రవారం నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 వరకు, టెన్త్ పరీక్షలు జూన్ 3 వరకు జరుగనున్నాయి. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జిల్లాలో 27 కేంద్రాలను ఏర్పాటుచేయగా మొత్తంగా 12,797 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జూన్ 6న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 7న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 124 కేంద్రాల్లో నిర్వహిస్తారు. వీటిని ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పరీక్షల నిర్వహణకు 27 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 27 మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, 280 మందికి పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థులకు స మస్యల పరిష్కారానికి ఏలూరులో కంట్రోల్ రూమ్ 08812 230197 నంబర్ను ఏర్పాటుచేశారు. టెన్త్ పరీక్షలకు 50 కేంద్రాలు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. జిల్లాలో 11,500 మంది విద్యార్థులు హాజరుకానుండగా 50 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమె రాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటుచేశారు. కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8121840400కు లేదా జిల్లా విద్యాశాఖాధికారి సెల్ 9849909105 నంబర్కు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో తెలియజేయవచ్చు. విద్యార్థులు గంట ముందుగా కేంద్రాల వద్దకు చేరుకోవాలి. కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష సమయానికి అనుగుణంగా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు నడపాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. పక్కాగా ఏర్పాట్లు విద్యార్థులు హాల్టికెట్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. కేంద్రాల వద్ద నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, పేజర్ లేదా ఇంట్రాక్ట్ ప్రోగ్రామింగ్ చేయగల ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు జరిగే తేదీల్లో ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. అలాగే పరిసర ప్రాంతాల్లో కంప్యూటర్ సెంటర్లు, జెరాక్స్ సెంటర్లను మూసివేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇన్విజిలేటర్ల కొరత ఏర్పడినచోట సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసి ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. నేటి నుంచి పరీక్షల నిర్వహణ ఇంటర్ పరీక్షలకు 12,797 మంది.. టెన్త్ పరీక్షలకు 11,533 మంది హాజరు పరీక్షలు జనరల్ ఒకేషనల్ విద్యార్థులు విద్యార్థులు ఇంటర్మీడియెట్ఫస్టియర్ 7,744 920 సెకండియర్ 3,209 924 టెన్త్ పరీక్షలు బాలురు 6,970 బాలికలు 4,563 మొత్తం 11,533 -
ఏలూరుదే తొలి ఫలితం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ కొనసాగుతోంది.. ఏ పార్టీ గెలుస్తుంది.. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి.. జిల్లాలో ఎక్కువ మెజార్టీ ఎవరికి వస్తుంది.. ఇలా ఎక్కడ చూసిన పొలిటికల్ ఫీవర్ కనిపిస్తోంది. ఏలూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలో తొలి ఫలితం ఏలూరు నియోజకర్గం కాగా తుది ఫలితం నూజివీడు నియోజకవర్గానిది వెల్లడయ్యే అవకాశం ఉంది. వచ్చేనెల 4న.. వచ్చే నెల 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో తుది ఘట్టం, ఐదేళ్ల భవిష్యత్ను నిర్ణయించే కార్యక్రమం ఇదే. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఈవీఎంలు ఏలూరు సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్కు చేరుకున్నాయి. స్ట్రాంగ్ రూమ్తో పాటు కౌంటింగ్ సెంటర్లను కూడా అక్కడే ఏర్పాట్లుచేసి అవసరమైన సౌకర్యాలను కూడా అధికారులు సిద్ధం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్ను కేటాయించి ఏడు హాల్స్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభిస్తారు. దాంతో పాటు సర్వీసు ఓట్లు, ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ను రెండు కేటగిరీలుగా విభజించి మ్యానువల్ ఓట్ల లెక్కింపు, ఎలక్ట్రానిక్ ఓట్ల లెక్కింపును వేర్వేరుగా చేపట్టనున్నారు. 14 టేబుళ్ల చొప్పున.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్ను కేటాయించారు. ఒక్కో హాలులో 14 టేబుళ్లు అసెంబ్లీకి, 14 టేబుళ్లు పార్లమెంట్కు సిద్ధం చేసి రౌండ్ల వారీగా లెక్కించనున్నారు. ప్రతి రౌండ్లో 14 టేబుళ్ల ద్వారా లెక్కిస్తారు. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి రౌండ్లు కొనసాగనున్నాయి. తక్కువ బూత్లు ఉన్న చోట తక్కువ రౌండ్లలోనే ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ బూత్లు ఉన్న చోట కాస్త ఆలస్యంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి. మధాహ్నం 1 గంటకు తొలి ఫలితం కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో తక్కువ పోలింగ్ బూత్లు ఉన్న ఏలూరు నియోజకవర్గ ఫలితం మొదటగా వెల్లడయ్యే అవకాశం ఉంది. తర్వాత ఉంగుటూరు ఫలితం తేలనుంది. అలాగే చివరగా నూజివీడు నియోజకవర్గ ఫలితం వచ్చే అవకాశం ఉంది. తొలి ఫలితం మధ్యాహ్నం 1 గంటకు, తుది ఫలితం సాయంత్రం 6 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు పూర్తయి విజేతలను ప్రకటించిన తర్వాత అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్లమెంట్ ఓట్లను కూడా అసెంబ్లీ తరహాలోనే లెక్కిస్తారు. గెలుపొందిన ఎంపీ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ఏలూరు జిల్లా ఓట్ల లెక్కింపునకు అధికారుల సన్నాహాలు అసెంబ్లీకి 14, పార్లమెంట్కు 14 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో ప్రక్రియ ప్రారంభం జూన్ 4న ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్లో పక్కా ఏర్పాట్లు సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ చివరిగా నూజివీడు ఫలితం వెల్లడయ్యే అవకాశం నియోజకవర్గం పోలింగ్ రౌండ్లు కేంద్రాలుఏలూరు 213 16 ఉంగుటూరు 214 16 కై కలూరు 235 18 దెందులూరు 239 18 చింతలపూడి 273 21 పోలవరం 284 22 నూజివీడు 286 22 -
మట్టి రవాణా చేస్తున్న 3 ట్రాక్టర్లు సీజ్
నిడమర్రు: చానమిల్లి గ్రామంలో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీల్దారు కె.పోసిబాబు చెప్పారు. గురువారం చానమిల్లి గ్రామంలో గునులు, భూగర్భశాఖ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా పొలాల్లోని మట్టిని తవ్వితరలిస్తున్నట్లు సమాచారం రావడంతో వెంటనే ఆయా ట్రాక్టర్లను తహసీల్దారు కార్యాలయం వద్ద సీజ్ చేసి, మట్టిని తరలిస్తున్న యర్ర సాయి (బావాయిపాలెం), అచ్యుత వెంకట సత్యరామాంజనేయులు (రావులపాలెం), దాసరి జయరాజు (జగ్గవరం గ్రామం, టి.నరసాపురం మండలం)లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మట్టిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించాలంటే తప్పనిసరిగా అధికారులు అనుమతుల తీసుకోవాలన్నారు. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని తరలిస్తే భూయజమానులపై, మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తులు, వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. ఆర్ఐ ఆర్.సుబ్బారావు, వీఆర్వో ఏడుకొండలు తదితరులున్నారు. సీపీఎఫ్ ఫ్యాక్టరీ మూసివేతతో ఆందోళన గణపవరం: రొయ్యలు, చేపల మేతలు తయారు చేసే సరిపల్లెలోని సీపీఎఫ్ కర్మాగారాన్ని నిర్వాహకులు మూసివేయడంతో దీనిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. బుధవారం ఫ్యాక్టరీ గేట్లకు యాజమాన్యం తాళాలు వేసి కర్మాగారాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర్ధాంతరంగా ఫ్యాక్టరీ మూసివేస్తే తామంతా ఉపాధి కోల్పోయి వీధిన పడతామని కార్మికశాఖ అధికారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. దశాబ్దకాలం క్రితం థాయిలాండ్కు చెందిన సీపీఎఫ్ కంపెనీ సరిపల్లెలో చేపలు, రొయ్యల మేతల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పింది. దీనిలో సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఫ్యాక్టరీలను నెలకొల్పగా, ప్రస్తుతం అన్ని ఫ్యాక్టరీలు నష్టాల బాటలో ఉన్నాయనే సాకుతో లాభాలబాటలో నడుస్తున్న సరిపల్లె యూనిట్ను సైతం మూసివేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గురువారం కూడా ఉద్యోగులు కంపెనీ గేటువద్ద ఆందోళన చేశారు. అయితే కలెక్టర్తో జరిగే చర్చల ద్వారానైనా తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు. తాము ఉద్యోగాలు కోల్పోతే ఎలా బతకాలంటూ వారు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమకు కొంతమొత్తం పరిహారంగానైనా చెల్లించి ఆదుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
వేధింపులతో విద్యుత్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఏలూరు (ఆర్ఆర్ పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ కార్యాలయంలో అధికారిణి వేధింపులు భరించలేక ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేకెత్తించింది. వివరాలిలా ఉన్నాయి. ఏలూరులోని సంస్థ సర్కిల్ కార్యాలయంలోని ఏడీఎం విభాగంలో జూనియర్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బి.కృష్ణవేణి తన కింది అధికారులను గత కొన్నేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై ఉద్యోగులు పలుసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. 2022 ఫిబ్రవరి 13న కార్యాలయంలో పనిచేసే పి.నళిని విద్యుత్ సంస్థ సీజీఎంకు, వి.అర్జునరావు, పి.శేషుకుమారి, ఆర్.అనిల్ కృష్ణ, సీహెచ్ శ్రీలక్ష్మి వేర్వేరుగా ఏలూరు ఈఈకి ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇదిలా ఉండగా గత బుధవారం కార్యాలయంలోని ఏడీఎం విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బి.కృష్ణకిషోర్ ఆమె వేధింపులు భరించలేక మనస్తాపంతో కార్యాలయంలోని మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, తోటి ఉద్యోగులు అతన్ని వారించి రక్షించారు. ఈ ఘటనపై కృష్ణకిషోర్ భార్య జి.జ్యోతిర్మయి బుధవారం ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు గురువారం ఇరువర్గాలను స్టేషన్కు పిలిచి విచారణ చేశారు. అయితే జ్యోతిర్మయి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. జేఏఓ కృష్ణవేణికి ఎస్పీ కార్యాలయంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధితుడు కృష్ణ కిషోర్ భార్య జ్యోతిర్మయి పోలీసులతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులకు తన గోడును వెళ్లబోసుకుని ఫిర్యాదులు చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించి వెంటనే జేఏఓ కృష్ణవేణిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఎస్ఈ సాల్మన్ రాజును కలిసి కోరారు. దీనిపై ఎస్ఈ స్పందించి విచారణకు ఆదేశించారు. కృష్ణకిషోర్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి మూడు రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని ఏలూరు కన్స్ట్రక్షన్స్ ఈఈ టి.శశిధర్ను ఎస్ఈ లిఖితపూర్వకంగా ఆదేశించారు. జేఏఓ బి.కృష్ణవేణి వేధింపులతో ఉద్యోగుల్లో మనస్తాపం రెండేళ్ల క్రితమే ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు బాధితుని భార్య ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు విచారణకు ఎస్ఈ ఆదేశం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement