-
సిగ్గుందా? రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్
-
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
సాక్షి, ఖమ్మం: సీఎం రేవంత్కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేస్తమన్నారు.. ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనిపేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హామీలను, గ్యారంటీలను ఏ ఒక్కటి అమలు చేసే పరిస్థితిలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, రెండు పార్టీలకు నైతిక విలువలు లేవన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా, ప్రజలు సానుకూలంగా స్పందించారని, డబుల్ డిజిట్తో విజయకేతనం ఎగురవేస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.బీజేపీని ఏ విధంగా ఆదరించబోతున్నారో లోక్ సభ ఎన్నికలో చూడబోతున్నారు. కేసీఆర్ పాలనపై విసిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమర్ధించారు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అగస్ట్కు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలి. పాత రుణాలు చెల్లించక పోవడంతో కొత్త రుణాలను బ్యాంకులు ఇవ్వడం లేదని, రైతులు వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో సీఎం రేవంత్ చెప్పాలి.రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు ఆడించే బాధ్యతను కేంద్రం తీసుకుంది, 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో చెప్పాలి. తెలంగాణలో 80 శాతం దొడ్డు బియ్యం ను రైతులు పండిస్తారు. బాయిల్ రైలి కొనేందుకు మోదీ ముందుకొచ్చారు. వచ్చే సీజన్కు బోనస్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. రైతులతో ఎందుకు చెలగాటం అడుతోందో చెప్పాలి. బీబఆర్ఎస్ సమాధి కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ల పాలన గగనం.ఎకరానికి 15 వేలు, కౌలు రైతుకు 12 వేలు.. ధాన్యం బోనస్ పైన 500 వందలు ఇస్తానని చెప్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు ఆడించే బాధ్యతను కేంద్రం తీసుకుంది. ఆరు గ్యారంటీలలో బోనస్ కూడా ఒకటి అని సోనియాగాంధీ ప్రకటించింది. రైతులతో ఎందుకు చెలగాటం అడుతోందో చెప్పాలి. మహిళలకు 2,500,నిరుద్యోగుల 4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఓట్లు వేయించుకున్నారు. విద్యార్థుల కు 5 లక్షల గ్యారంటీ కార్డు కు అతిగతి లేకుండా పోయింది. ప్రశ్నించేందుకు బిజెపి పార్టీ కి ఓటు వేయాలి. పట్టభద్రులు ఆలోచించి బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
రైతులకు రేవంత్ మోసం.. ప్రతిపక్షాలు ఫైర్
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే
హనుమకొండ/భువనగిరి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఒక్క తాను ముక్కలేనని, జెండాలే వేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి దుయ్యబ ట్టారు. శనివారం హనుమకొండ, భువనగిరిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హనుమకొండలో కేజీ టు పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపించగా, బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని విమర్శించారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి రింగ్రోడ్డును అమ్మిందని, ఐదు నెలల ముందు మద్యం టెండర్లు నిర్వహించిందని, హైదరాబాద్లో స్థలాలు అమ్మిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇవ్వడానికి తంటాలు పడుతోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేదని కిషన్రెడ్డి విమర్శించారు. కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ను ప్రజలు అదరించారు తప్ప.. అభిమానంతో ఆ పార్టీకి ఓట్లు వేయలే దన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో జరిగిన నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశానికి కిషన్రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
సినీ హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా? లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని పేర్కొన్నారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అవతరించనుందని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని విమర్శించారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారు.. ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా ఏ గ్యారంటీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించట్లేదని ధ్వజమెత్తారు.డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.చదవండి: ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ Live: Press Meet, 6 Ashoka Road, New Delhi. https://t.co/lynyvwj2XR— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) May 15, 2024 -
10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ పది సీట్లు గెలుస్తామని, ఓటర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వ్యక్తమైనందున 12 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదనే ధీమా రాష్ట్ర బీజేపీలో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘వేవ్’ స్పష్టంగా కనిపించిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. నాలుగు సిట్టింగ్ ఎంపీ సీట్లతోపాటు విజయావ కాశాలు అంతగా లేదని మొదట్లో భావించిన సీట్లలోనూ బీజేపీ సత్తా చాటుతుందని పేర్కొ న్నారు.నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి వంటి సీట్లు కూడా వస్తాయని, ఎన్నడూ ఊహించనంత స్థాయిలో ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సందర్భంగా ప్రజలు బీజేపీని, మోదీని చూశారని, అభ్యర్థులు ఎవరనేది కూడా చూడలేదన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన సమా వేశంలో ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ భేటీలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చపార్టీ కార్యాలయంలో నల్లగొండ–వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న జరగనున్న ఉపఎన్నికపై సన్నాహక సమావే శం జరిగింది. పోలింగ్కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇన్చార్జీలను నియమించుకుని, అన్ని మండలాల్లో పార్టీ నాయకులు పర్యటించేలా కార్యాచరణను సి ద్ధం చేశారు. ఈ ఎన్నిక కోసం ఎన్.రామచంద్రరా వును ఇన్చార్జీగా నియమించారు. పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన కసరత్తు అంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు. -
డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినాయ కత్వం ఊహిస్తున్నట్లే తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపించిందని, ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని, మహిళలు, యువత ఆదరించారని, పట్టణప్రాంతంలోనూ తమ పార్టీకే ఓట్లు పడ్డాయని చెప్పారు. ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబా ద్లో బీజేపీ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు.పట్టణప్రాంతాల్లో పోలింగ్ కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. సోమవారం పోలింగ్ సమయం ముగిశాక పార్టీ కార్యాలయం లోకిషన్రెడ్డి మీడియాతో మాట్లా డారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి రెచ్చ గొట్టినా ప్రజలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని, లేకపోతే అగ్గిరగిలేదన్నారు.సికింద్రాబాద్, ఆదిలాబాద్ తదితరచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి గోబెల్స్ ప్రచారం చేసినా బీజేపీని ప్రజ లు ఆదరించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఓటేసిన ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ హామీలపై కార్యాచరణఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల అమలుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని పోరాడుతుందని కిషన్రెడ్డి చెప్పారు. ‘ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని నేను చెబితే దానిపైనా ఫిర్యాదుచేశారు. మోదీ పేరు ఎత్తకుండా నిషేధం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.ప్రతిదానికీ మోదీని చాలెంజ్ చేశారు. మోదీపై విమర్శలు గుప్పించడం ద్వారా పెద్దనాయకుడు కాలేరని ఆయన గ్రహించాలి. ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుందామని రాహుల్ అనుకున్నట్టున్నారు. ఆయన ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. ఎవరు ఏమిటనేది జూన్ 4న ఫలితాలతో తేలిపోతుంది’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.ఓటర్ల జాబితాల్లో సంస్కరణలు తేవాలి‘ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలి. ఓటరు లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ లిస్టులను తనిఖీ చేసి, చనిపోయినవారి ఓట్లను తొలగించాలి. జూబ్లీహిల్స్లో ఒక వర్గం వారివి వేల ఓట్లు తొలగించారు. వేల ఓట్లను డిలీట్ అని పేర్కొన్న జాబితాను ఆదివారం రాత్రే మాకు ఇచ్చారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు ఇచ్చినా ఓట్లు లేవని తిప్పిపంపించారు.మా అబ్బాయి ఓటు ఎక్కడో, నా ఓటు ఎక్కడో ఉంటుంది. దీనిపై కేంద్రమంత్రిగా లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. ఓటర్ల వివరాలతో ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే బాగుండేది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. విమోచన అధికారికం‘ప్రతిఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పసుపుబోర్డు, టెక్స్టైల్ బోర్డు వంటి వాటిని మోదీ తెలంగాణకు ఇచ్చారు. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక త్వరలోనే ఆయన చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తాం’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
మోదీ ‘ఉల్లంఘన’లపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, రోడ్షోల్లో చేసిన ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే, ప్రధాని మోదీకి బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గడువు పొడిగించాలని బీజేపీ కోరగా, ఈసీ మరింత సమయం ఇచ్చిది. మోదీ ఏమన్నారంటే..: నారాయణపేట, ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా, చిన్నపిల్లలతో ప్లకార్డులు ప్రదర్శింపజేశారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, ఆ పార్టీ భారత దేశ ఎన్నికల్లో గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ‘సాక్షి’కి తెలిపారు.కాగా, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన, విద్వేషకర ప్రసంగాల విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వివరణ కోరుతూ మొత్తం 13 నోటీసులను జారీచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలైతే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నోటీసులు జారీచేయగా, ప్రాంతీయ పార్టీలైతే వాటి అధ్యక్షులకు నేరుగా నోటీసులిచ్చారు. -
బీజేపీపై తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా బీజేపీ ని ఎదుర్కో లేక, ప్రజ ల దృష్టి మరల్చేందు కు కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నేతలు పిరికిపందల మాదిరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏం అమలు చేశారో, మిగతావి ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. బీజేపీపై కాంగ్రెస్ ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు.శుక్రవారం ఎల్బీ స్టేడి యంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్రెడ్డి చెప్పారు. దేశం కోసం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు. ఈ విషయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, కేసీఆర్ల సర్టిఫికెట్లు తమకు అవ సరం లేదన్నారు. తమకు కావాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమేనని స్పష్టం చేశారు.రేవంత్రెడ్డి మిడిమిడి జ్ఞానంతో బీజే పీని విమర్శిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధు లు ఖర్చు చేస్తే.. ముఖ్యమంత్రి దాన్ని గాడిద గుడ్డుతో పోలుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ కుటుంబపాల నతో రాష్ట్రానికి, ప్రజలకు తీరనినష్టం జరిగితే బీజేపీ, మోదీ మాత్రమే ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగా ణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలన్నారు. -
నేటి మోదీ సభ తెలంగాణకు కీలకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఎల్బీస్టేడియం సభవేదికగా ఎన్నికల సందేశం ఇస్తారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీస్టేడియంలో జరిగే బహిరంగసభ తెలంగాణకు కీలకమని పేర్కొన్నారు. ‘ఐదుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, యువత సభకు రావాలి. మోదీకి మనమంతా అండగా నిలబడాల్సిన అవసరముంది. దీనికంటే ముందు నారాయణపేటలో జరిగే బహిరంగసభలో ప్రధాని పాల్గొంటారు’అని కిషన్రెడ్డి చెప్పారు. గురువారం ఎల్బీస్టేడియంలో సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై రాహుల్గాంధీ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ ‘అండర్ కరెంట్, ఓపెన్ కరెంట్ ఉంది.. ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తూ బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయి’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘కేసీఆర్ మాటలు ప్రజలు సీరియస్గా తీసుకోవడం లేదు. నవ్వుకుంటున్నారు. గాడిద గుడ్డు ప్రచారానికే కాంగ్రెస్ పరిమితమైంది. తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదు. బీజేపీ హైకమాండ్ ఆదేశాలతో మేము 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలిశాం. ఏ ఫ్రంట్ కూడా మోదీకి ప్రత్యామ్నాయంగా లేదు. కాంగ్రెస్కు విమర్శించడానికి ఏం లేదు. కాబట్టి దుష్ప్రచారం చేస్తుంది. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసింది. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి మాటలను ఏ ఒక్కరూ సీరియస్గా తీసుకోవడం లేదు. రిజర్వేషన్ల అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్గాంధీ సినిమా ఫ్లాప్ అయ్యింది. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని రేవంత్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారం చేస్తున్నారు. సబ్కాసాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నాం’అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. -
ఇక్కడ బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే సీఎం రేవంత్రెడ్డి, ఇతర విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు నమ్మక పోవడంతో అది తమకు అనుకూలంగా మారిందని వ్యాఖ్యానించారు. బీజేపీని ఇరుకున పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ చేసిన ‘రిజర్వేషన్’ ప్రచారం విఫలమైందన్నారు. ఆ ఫలాల లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. దీంతో రేవంత్రెడ్డిలో అభద్రతాభావం, అసహనం పెరగగా, కాంగ్రెస్ పార్టీలో మరింత కలవరం పెరిగిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. ప్రజలు ఓట్లు మాత్రం బీజేపీకే వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం ఆపితే బీజేపీ నిలిపేసిందని రేవంత్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తాయని ముందే తెలిసి నా.. రైతుభరోసా ఎందుకివ్వలేదో రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చునని ఎద్దేవాచేశారు.ఆర్ఆర్ టాక్స్ వసూళ్లు తప్ప రేవంత్కేమీ తెలియదు‘రేవంత్రెడ్డి బాధ్యతారహిత విమర్శలు చేస్తున్నారు. బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప హామీల అమలు చేతల్లో చూపించే సోయి లేదు. ఆర్ఆర్ టాక్స్ వసూలు చేయడం తప్ప వేరే విషయం తెలియదు. రీసెర్చ్ టీం పెట్టుకుని.. ఏ తిట్లు తిట్టాలి, ఏ వీడియో ఫేక్ చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్నారు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘కేంద్రంతో బీఆర్ఎస్ ఘర్షణ పడ్డందుకే తెలంగాణకు అన్యాయం జరిగిందని గతంలో రేవంత్ అన్నారు... కేంద్రంతో సఖ్యతతో ఉంటా అని చెప్పి ఇప్పుడు గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎన్నికలు రాగానే ఏం రోగం పుట్టిందో.. స్వార్థం కోసం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు’ అని తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పదేళ్లలో కేంద్రం చేసిన దానిపై సీఎం రేవంత్రెడ్డితో ఎన్నికల తరవాత కూడా తాను చర్చకు సిద్ధమని చెప్పారు. ‘ఎక్కడ ప్రచారా నికి వెళ్ళినా ఆ అభ్యర్థిని కేంద్ర మంత్రి చేస్తా అని సీఎం అంటున్నారు... పోర్ట్ఫోలియోలు కూడా ఇస్తున్నారు. అసలు కాంగ్రెస్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తోంది... ప్రధాని ఎవరు ?’ అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ తప్పిదాలతో తెలంగాణకు నష్టం‘మాజీ సీఎం కేసీఆర్ తప్పు వల్లనే కృష్ణా జలాల్లో తెలంగాణ నష్టం పోయింది. కేటీఆర్ చిల్లర గాని లెక్క మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కేంద్రం ఎంత ఇచ్చిందో చర్చకు నేను సిద్ధం. హైదరాబాద్ డబ్బులు అదిలాబాద్లో ఖర్చు పెట్టొద్దా? అలాంటి వారికి ఏమి చెపుతాము’ అని వ్యాఖ్యానించారు. ‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. భువనగిరి కోట అభివృద్ధికి కేంద్రం ఏం చేసిందో టూరిజం శాఖను అడిగి తెలుసుకో లేదంటే మంత్రి జూపల్లి కృష్ణారావును అడిగి తెలుసుకోవాలి.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారి మాటలకు నేను సమాధానం చెప్పను. మా పార్టీ అధికారప్రతినిధులు మాట్లాడుతారు’ అని విలేకరుల ప్రశ్నలకు కిషన్రెడ్డి బదులిచ్చారు. ’’రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడావి జాత్యంహకార వ్యాఖ్యలు. దేశ ప్రజల పట్ల కాంగ్రెస్ దురహంకార వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడతాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. అసలు అలాంటి ఆలోచన మా ఎజెండాలోనే లేదు. కాంగ్రెస్లో అంతర్గత కలహాలు చాలా ఎక్కువ. అలాంటి కారణాలతో ప్రభుత్వం కూలిపోతే మాకు సంబంధం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెల్లు కావొస్తుంది. మరో నాలుగున్నరేళ్ల పాటు మాకు వేచి చూసే ఓపిక ఉంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతాం. ప్రజలకు పార్టీని మరింత చేరువ చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడి అధికారం సాధించే దిశగా కృషి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి పదేళ్లు పట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐదేళ్లు చాలా ఎక్కువ’ అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి జి.కిషన్రెడ్డి మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రిజర్వేషన్లను తొలగించే ప్రసక్తే లేదు దేశంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన మాకు ఏమాత్రం లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉద్ఘాటించారు. జహీరాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రిజర్వేషన్లను తొలగించేది లేదని మోదీ చెప్పిన తర్వాత కూడా సీఎం హోదాలో ఉండి రేవంత్రెడ్డి నోటికి ఎంతొస్తే అంతలా మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని అర్థం చేసుకున్న రేవంత్.. కాంగ్రెస్లో తన అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ఆవిధంగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ’’ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని మార్చిన చరిత్ర ఎవరిది?. పత్రికాస్వేచ్ఛను హరించిందెవరు?’’. అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా, ఓడినా దేశానికి ఏ మాత్రం లాభం ఉండదన్నారు. తెలంగాణకు కేంద్రం 9.5లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం రూ.9.5 లక్షలకోట్లు తెలంగాణకు ఇస్తే.. గాడిద గుడ్డు అని విమర్శిస్తారని,, ఈ విమర్శలు చూసి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కిషన్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల గేమ్ ఛేంజర్గా రూ.26వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తన చొరవతో వచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి ఈ పనులకు శంకుస్థాపన చేయొద్దనే కారణంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిందన్నారు. ‘మహిళలకు 33శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్తో ముస్లిం మహిళలకు ఆత్మగౌరవాన్ని కాపాడింది మోదీ ప్రభుత్వం. అందుకే దేశంలోని ముస్లిం మహిళలు మోదీని అన్నగా, తమ్ముడిగా భావిస్తున్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో ఆ రెండు దేశాలతో మాట్లాడి 25వేలమంది భారతీయులను బయటకు తీసుకొచ్చిన ఘనత మోదీదే. ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్.. ‘ఆయుష్మాన్ భారత్’పేదలకు అందించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’మోదీ ఘనత. దీన్ని మరో ఐదేళ్లవరకు ఈ ఉచిత ఆహార పథకాన్ని పేదలకు అందించాలని నిర్ణయించాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఉండాలనేది మోదీ ఆలోచన. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేది బీజేపీ నినాదంగా కాకుండా ప్రజానినాదంగా మారింది. మణిపూర్ సున్నితమైన అంశం. ప్రాణనష్టం పెద్దమొత్తంలో లేకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఉక్కు నాణ్యత సరిపోదని స్పష్టమైంది. ఓటు రాజకీయాల కోసం కాదు.. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వ్యర్థం చేసే ఆలోచన మాకు లేదు. సికింద్రాబాద్లో రూ.720 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 25% పనులు పూర్తయ్యాయి. విమానాశ్రయం తరహాలో ఈ రైల్వేస్టేషన్ ఉండబోతోంది. నాంపల్లి రైల్వేస్టేషన్, కాచిగూడ స్టేషన్ రీ డెవలప్ మెంట్ చేస్తున్నాం. రూ.300 కోట్లతో చర్లపల్లిలో కొత్త టరి్మనల్ నిర్మించాం. తెలంగాణ అభివృద్ధికి మోదీ గ్యారంటీ. బీజేపీలో ఇతర పారీ్టల నాయకులు చేరితే స్వాగతిస్తాం. అలాగని వారిపై ఉన్న కేసుల దర్యాప్తు ఆగదు.’’అని కిషన్రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవం కోసం ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే!: కిషన్రెడ్డి
కె.రాహుల్తెలంగాణలో బీజేపీకి పోటీయే లేదని.. రెండో స్థానం కోసం అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తేల్చుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో చాలా వరకు బీజేపీ–కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని.. అక్కడక్కడా బీఆర్ఎస్ తమతో తలపడాల్సి రావచ్చునని వ్యాఖ్యానించారు. గ్యారంటీలను, హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో చెప్పుకోవడానికి రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేకనే.. రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడిపై ఒట్లు పెడుతూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల 13న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ప్రచార పర్వం, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వ్యూలోని కీలక అంశాలు ఆయన మాటల్లోనే.. బీజేపీకే అనుకూల వాతావరణం తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడంతో అధికార కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ల పాలనలో వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు బీఆర్ఎస్ను వెన్నాడుతున్నాయి. దీంతో మోదీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 12 స్థానాలకు మించి వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. మేం కచ్చితమైన ఎన్నికల కార్యాచరణతో ముందుకెళుతున్నాం. రాష్ట్రంలోని ఒక్కో ఎంపీ సీటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీలు, టీమ్లు ఏర్పాటు చేశాం. నాయకులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులను ఒక్కో అసెంబ్లీకి పంపించాం. ఇవి లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇంకా ఏ పార్టీ, ఎంపీ అభ్యర్థులు కూడా పోలింగ్బూత్ స్థాయి వరకు చేరుకోలేదు. మేం మాత్రం కచ్చితమైన ప్రణాళికతో బూత్ స్థాయి వరకు ఓటర్లను చేరుకున్నాం. బీజేపీ బలాన్ని పెంచుకుంటున్నాం.. హైదరాబాద్ నుంచి బరిలో ఉన్న మాధవీలత, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న వినోద్రావు బీజేపీలో ఉన్నవారే, ప్రజాసంఘాల్లో పనిచేస్తున్నవారే. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు కొన్ని సీట్లలో ఇతర పార్టీల వారికి, బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాం. తెలంగాణలో బీజేపీ ఇంకా చిన్న పార్టీ. పెరగాల్సిన అవసరం ఉంది. సంకీర్ణమైతే దేశం ష్టుపడుతుంది రాబోయేది సంకీర్ణ యుగమంటూ మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ సంకీర్ణంలో చేరుతారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం ఆయనను చేర్చుకునే ప్రసక్తే లేదు. సంకీర్ణమంటే దేశమైనా, రాష్ట్రమైనా ష్టుపడతాయన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎవరికి వారు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ పరిస్థితి పట్ల ప్రజలు విసిగి వేసారాకే.. 2014లో, 2019లో బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఎన్డీయేను అందలం ఎక్కించారు. ఈసారి గెలిచాక జమిలి ఎన్నికలే.. మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) విధానంతో ముందుకెళతాం. వచ్చే ఎన్నికలు కలిసే జరుగుతాయి. దేశంలో జనగణనతోపాటు నియోజకవర్గాల పునరి్వభజన జరగాల్సి ఉంది. ఇందులో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటూ దుష్ఫ్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు. సీఎం, మాజీ సీఎం స్థాయివాళ్లు దిగజారి మాట్లాడుతున్నారు! ప్రస్తుతం రాజకీయ వాతావరణమంతా కలుషితమై పోయింది. గతంలో ఎన్నికలంటే గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండేది. ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ మాత్రం సంబంధం లేని విషయాలు ప్రస్తావించడం, అబద్ధాలు మాట్లాడటం, ఉపయోగించే భాషపై నియంత్రణ లేకపోవడం పెరిగింది. కొడతా, తిడుతా, చంపుతా, పాదాల కింద నలిపేస్తా అంటూ సీఎం, మాజీ సీఎం స్థాయిల వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రచారంలో, మాట్లాడే మాటల్లో నైతికత లేకుండా పోయింది. హైదరాబాద్ లోక్సభ స్థానం సహా అన్నిచోట్లా డబ్బులే కీలకపాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. రాముడి పేరిట కాదు.. అభివృద్ధిని చూపి వస్తున్నాం బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా రాముడి ప్రస్తావన ఉందా? మీడియా, వార్తాపత్రికల్లో దీని ప్రాతిపదికన ఎక్కడైనా ఓట్లు అడిగామా? పదేళ్లలో మేం ఎంత అభివృద్ధి చేశాం, ఏయే రంగానికి ఎన్నెన్ని నిధులిచ్చామో స్పష్టంగా చెప్పి ఓట్లు అడుగుతున్నాం. ఎంత మందికి బియ్యం ఇస్తున్నాం, రైతులకు ఏం చేశామనేది చెప్తున్నాం. మేం రాముడి పేరిట ఓట్లు అడుగుతున్నామని విమర్శిస్తున్న వారు దీనికి సమాధానం చెప్పాలి. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి దేశంలో సుస్థిర ప్రభుత్వం రావడం ద్వారా అవినీతి, అక్రమాలకు చెక్పెట్టవచ్చు. ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. ఇక ముందు మరింత అభివృద్ధి జరగాలంటే బీజేపీని అత్యధిక సీట్లలో గెలిపించాలని కోరుతున్నాను. రేవంత్కు ముందుంది ముసళ్ల పండుగ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి ఓట్లు అడిగే నైతికహక్కు లేదంటున్నాం. మా ఇంటింటి ప్రచారంలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్తుంటే మంచి స్పందన వస్తోంది. రేవంత్రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలు ఎలా చేస్తారు? ఇప్పుడు తొందరపడి ఎగిరెగిరి పడితే సరిపోతుందా? భూములు అమ్మి ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు? ఏం చేస్తారనేది ప్రజల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరీ దారుణంగా వ్యవహరిస్తోంది. రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ఫ్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం. -
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు ఎవరి హయాంలో ఎక్కువ నిధులొచ్చాయో చర్చకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సవాల్ విసి రారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 2004–14 మధ్య యూపీఏ సర్కార్ ఇచ్చిన నిధులు, 2014–24 మధ్య తమ ఎన్డీయే పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అందించిన నిధులపై అర్థవంతమైన చర్చ చేపడదామన్నారు. ఎవరి పాలనలో ఎక్కువ నిధులొచ్చాయో ఆధారాలతో ప్రజల ముందు చర్చిద్దామని సూచించారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులు అందించిందని పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనతో విభేదిస్తే తనతో సీఎం చర్చకు రావాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కిషన్రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘కొడంగల్ లేదా అమరవీరుల స్తూపం లేదా కృష్ణా, గోదావరి ఒడ్డునైనా సరే తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. స్థలం, సమయం, తేదీ నిర్ణయించాలని రేవంత్ను లేఖలో కోరారు. అయితే చర్చ సందర్భంగా ఉపయోగించే భాష హుందాగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన సవాల్ను స్వీక రించి అర్థవంతమైన చర్చలో పాల్గొనేందుకు సీఎం సాను కూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుడదామన్నారు.‘గాడిద గుడ్డు’ను ఖండిస్తున్నాం..‘2014–24 కాలంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ మీరు, కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ కేబినెట్లో భాగస్వామిగా వ్యక్తిగతంగానూ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా’అని కిషన్రెడ్డి లేఖలో స్పష్టంచేశారు. ఇలా దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం ముఖ్యమంత్రి పదవినే దిగజారుస్తుందని మండిపడ్డారు. అబద్ధాల ప్రచారం సరికాదు..‘పీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా గతంలో యూపీఏ సాధించిన ఘనతలు, విజయాలను మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఎన్డీయే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కూడా మీరు విమర్శించవచ్చు. కానీ మీరు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలను ఆశ్రయించడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే’అవుతుంది అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు.యూపీఏ హయాంలో తెలంగాణకు వచ్చింది రూ. 45 వేల కోట్లే‘మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 9 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చింది. కేవలం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, జీఎస్టీ పరిహారం కిందనే ఏకంగా రూ. 2 లక్షల కోట్లు తెలంగాణకు విడుదల చేసింది. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి రూ. 1.32 లక్షల కోట్లు ఇచ్చింది. అందులో తెలంగాణ వాటా రూ. 45,000 కోట్లు మించదు. అంటే యూపీఏ హయాంలోకన్నా మోదీ ప్రభుత్వం తెలంగాణ కు 4 రెట్లు ఎక్కువ నిధులిచ్చింది. 1947 నుంచి 20 14 వరకు 67 ఏళ్లలో తెలంగాణలో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్లకుపైగా వెచ్చించి కొత్తగా మరో 2,500 కి.మీ జాతీయ రహదారులు నిర్మించింది. నిర్మాణానికి 100%, భూసేకరణకు 50% కేంద్ర నిధులతో నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు సహా మరో 2,500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరించాం. 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ అందుబాటులోకి తెచ్చాం’అని కిషన్రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్.. దద్దమ్మ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో లెక్కలేనన్ని హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ వాగ్దానాలతో లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లో శుక్రవారం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో కాంగ్రెస్ కల్ల»ొల్లి హామీలతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వానికి.. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పారీ్టకి ఈ లోక్సభ ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఉచిత విద్యుత్ ఎక్కడా అమలు జరగడం లేదనీ, అందరికీ కరెంట్ బిల్లులు వస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్ప టికే ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్న కిషన్రెడ్డి.. ఊళ్ల లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీ ల అమలు ఏమైందంటూ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై మాట్లాడేందుకు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ చేశారు. అలాగే రైల్వేల కో సం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. మోదీ వచ్చాక ఎన్ని నిధులు వచ్చాయో చర్చకు రావాలని రేవంత్రెడ్డిని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. చేతి గుర్తు బదులు గాడిద గుడ్డు పెట్టుకున్నారేమో? కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి పసలేదని విమర్శించిన కిషన్రెడ్డి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి కింద పడేసి చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. ’’గ్యారంటీల పేరుతో గాడిద గుడ్డు ఇచ్చారు. తమ ఎన్నికల చిహ్నం చేతి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు గుర్తు పెట్టుకున్నారేమోనని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని ధ్వజమెత్తిన కిషన్రెడ్డి.. దానికి కర్త కర్మ క్రియ బీజేపీనే అని స్పష్టం చేశారు. ప్రజావాణి దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారని నిలదీశారు. ప్రజావాణిలో కనీసం సీఎం ఒక్క రోజు కూడా పాల్గొనలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది? తెలంగాణలో ఏ మార్పు మొదలైందని హైదరాబాద్లో బోర్డులు పెడుతున్నారని కిషన్రెడ్డి నిలదీశారు. కేసీఆర్ కుటుంబ పాలన పోయి సోనియా కుటుంబ పాలన వచి్చందని ఆరోపించారు. ‘28,942 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉంచిన నియామకాలకు సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. అవన్నీ ఏమయ్యాయి? తెలంగాణలో రేషన్ కార్డులు ఇస్తున్నారా? సింగరేణి కార్మికులకు కోటి బీమా కల్పించారా ? ఒక్క మహిళ సంఘానికైనా వడ్డీ లేని రుణం ఇచ్చారా’అని కిషన్రెడ్డి నిలదీశారు. ఇప్పటికీ ఒక్క తెల్లరేషన్ ఇవ్వకపోగా ఇచి్చనట్లు హోర్డింగులతో అడ్వర్టైజ్మెంట్లతో ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామంటూ, దావోస్ నుంచి రూ.40 ,232 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామంటూ, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ. 5 లక్షల బీమా కల్పించినట్లు మెట్రో పిల్లర్లపై హోర్డింగులతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అప్పుడు కేసీఆర్ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిదు నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మార్కును చూపించారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీలో ఐటీ కంపెనీల యజమానులు చేరిక శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఐటీ కంపెనీ యజమాని ఊరంగంటి వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు ఐటీ కంపెనీల యజ మానులు, ఉద్యోగులు, వరంగల్ జిల్లాకు చెందిన దగ్గు విజేందర్రావు ఆధ్వర్యంలో పలు వురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి కిషన్రెడ్డి పారీ్టలోకి ఆహా్వనించారు. పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. -
తప్పుడు ప్రచారంతో బురదచల్లే ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని దాడులు చేసినా, తప్పుడు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా, మాకు కవచం తెలంగాణ ప్రజలే. నరేంద్రమోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకు అభిమానం ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణగడ్డపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను పాతరేయడం ఖాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. బుధవా రం పార్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవ ర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ కల్పన, డివిజన్ అధ్యక్షులు, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లా డారు.‘బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. రాహుల్గాంధీ నాయకత్వం అవసరం లేదని ప్రజలు తిరస్కరిస్తున్నారు. మోదీ మాత్రమే సమగ్రమైన, సుస్థిర మైన, సమర్థవంతమైన పాలన ఇవ్వగలరనే ఉద్దేశంతో తెలంగాణవ్యాప్తంగా ప్రజలంతా ఆదరిస్తున్నారు. దీంతో, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోయి బీజేపీపై ముప్పేట దాడికి ప్రయత్నిస్తున్నాయి. ఓటుకు నోట్లు కేసులో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కు సపోర్ట్ చేసినట్టుగానే.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవి నీతి కేసుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తోంది.బీజేపీని గెలవనీయొద్దనే దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్–బీఆర్ఎస్ డూ ప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్–కాంగ్రెస్ రాజకీయ డ్రామా కార్య క్రమాలు సమాంతరంగా నడుస్తున్నాయి. వారంరోజులుగా సీఎం వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. పూర్తిగా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల వేళ తలపై గాడిద గుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నడు. ఆ గుడ్లు తలపై పెట్టుకొని 5 నెలల పాలనలో తాను ప్రజలకిచ్చే ది ఇదేనంటూ ప్రజలకు వివ రిస్తున్నడు. ఆస్థాయికి దిగజా రిండు. ఎన్నికలకు వెళ్లేటప్పు డు ఏ పార్టీ అయినా ప్రజలకు చేసిన పనులు చేయాల్సిన పనులను వివరిస్తుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొది లేసింది. మళ్లీ ఆగస్టు 15న రుణమాఫీ అంటూ ఊదరగొడుతున్నా రు. మిగతా గ్యారంటీల గురించి మాట్లాడటం లేదు’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ది దిగజారుడుతనం‘రాష్ట్రంలో మోదీ, బీజేపీకి ఆదరణ, మద్దతు పెరుగుతోంది. దీనిని తట్టుకోలేక మార్ఫింగ్ వీడియోలతో బీజేపీపై బురదజల్లుతూ కాంగ్రెస్ అత్యంత దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. టెలిఫోన్ ట్యాపింగ్తోపాటు హోంమంత్రి వీడియో మార్ఫింగ్ అంశాలు రెండు నేరమే. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధా లు చెబుతుంటే, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఈ విషయంలో మొదటి ముద్దాయి సీఎం. మార్ఫింగ్ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. అందులో ఏ వ్యక్తి ప్రమేయమున్నా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. రేవంత్రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మి దిన్నరేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో తెలంగాణకు ఎన్ని నిధులిచ్చా రనే దానిపై చర్చకు సిద్ధం కావాలి. ప్రెస్క్లబ్లో లేదా తెలంగాణ అమరవీరుల స్థూపంలేదా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం..ఏ చోటనైనా రేవంత్రెడ్డితో చర్చకు నేను సిద్ధం. గాడిద గుడ్లు నెత్తిన పెట్టుకోవడం కాదు.. తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు రావాలి’ అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.రేవంత్రెడ్డి.. ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా..? ‘పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ మాట్లాడిన రేవంత్రెడ్డి.. ఈరోజు తన కాళ్లకింద భూమి కదిలిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో రోజుకో విధంగా మాట్లాడుతున్నాడు. గుజరాత్ పెత్తనానికి.. తెలంగాణ పౌరుషానికి పోటీ అని రేవంత్రెడ్డి అంటున్నడు. రేవంత్రెడ్డి అసలు ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవా? టీడీపీలో ఉండి ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రేవంత్రెడ్డి. ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. మీ ఇటలీ పౌరుషానికి, అవినీతి పౌరుషానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు. గుజరాత్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏనే ఇటలీది. ఐఎన్సీ అంటేనే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఒకరికొకరం తోడు అంటూ కేసీఆర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ బాసులకు తాకట్టు పెడుతున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నరు’ అని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. -
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎలా అంటావ్?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని సీఎం రేవంత్రెడ్డిని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నిలదీశారు. దమ్ముంటే దీనిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపైనా చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక.. రేవంత్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీగా రేవంత్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్రెడ్డి విమర్శించారు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే లెంపలేసుకుని గద్దె దిగిపోవాలని వ్యాఖ్యానించారు. ఒట్లు, ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి, బీసీ రిజర్వేషన్ల పేరుతో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్సభ సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతుండటాన్ని తట్టుకోలేక బీజేపీపై విష ప్రచారానికి దిగింది. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ–బీఆర్ఎస్ ఒకటేనంటూ రాహుల్ గాం«దీ, రేవంత్రెడ్డి దు్రష్పచారం చేశారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజల ఆదరణ కొరవడటంతో కొత్త నాటకానికి తెరలేపింది. అబద్ధపు పునాదులపై ఎదిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. బీసీ రిజర్వేషన్లు తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో గండి కొట్టినది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి కాంగ్రెస్కు రిజర్వేషన్లపై బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు. అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట సభలో చేసిన ప్రసంగాన్ని మారి్ఫంగ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిందంటే.. ఆ పార్టీ దిగజారుడుతనడానికి పరాకాష్ట. బీజేపీ స్థైర్యాన్ని దెబ్బతీసి, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొటే ప్రయత్నం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై పోలీసు కేసు పెట్టాం. ఈసీకి ఫిర్యాదు చేశాం. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గుర్తించారు ప్రధాని మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ నాటకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలు కూడా కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదు. భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే.. కాంగ్రెస్ చోడో అంటూ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. బీసీలకు న్యాయం బీజేపీతోనే.. దేశంలో అత్యున్నత పదవుల నుంచి రాజకీయ రంగం దాకా బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమే. తొలిసారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా కేంద్ర కేబినెట్లో ఏకంగా 27 మంది బీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చిన ఘనత బీజేపీదే. మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారని తట్టుకోలేక కాంగ్రెస్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో వారికి న్యాయం చేయడం బీజేపీతోనే సాధ్యం..’’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్?
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే ఆయ్యారు కానీ అవతల టికెట్ ఇవ్వాల్సిన వాళ్లు మాత్రం కామ్గా చేతులెత్తేస్తున్నారు. దీంతో నెక్ట్స్ ఏం చేయాలో తోచని ఆయోమయ పరిస్థితుల్లో మరో పార్టీకి జంప్ ఆలోచనలో ఉన్నారు ఎంపీ వెంకటేష్.తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిశారు. పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. అయిన్పటికీ గోమాస శ్రీనివాస్ నేడు నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అసలు పెద్దపల్లి బీఫామ్ను బీజేపీ ఎవరికి ఇవ్వనుంది, వెంకటేష్ నేత అసలు పోటీ చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి నామినేషన్ చివరి రోజైన రేపు(గురువారం) పెద్దపల్లి అభ్యర్థి మార్పుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకుడైన వెంకటేష్ నేత గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. అయితే మళ్లీ బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందో రాదో అని భావించిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. కేవలం ఎంపీ టికెట్ కోసం కండువా మార్చేసినా.. చివరికి నిరాశే మిగిలింది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ మొండిచేయి చూపింది. గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్లో ఉండి ప్రయోజనం లేదంటూ మళ్లీ పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వెంకటేష్ నేత బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి -
రాజ్యాంగం మార్చేస్తాం.. ఈ ఎన్నికల తర్వాత అన్నీ ఛేంజ్
-
బీఆర్ఎస్, కాంగ్రెస్లవి అవినీతి ప్రభుత్వాలు
రాంగోపాల్పేట్ /సికింద్రాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ ఏర్పడితే నీతివంతమైన పాలన అందుతుందని ప్రజలు ఆశించారని, కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ విమర్శించారు. గత పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదని, తమది అవినీతి రహిత ప్రభుత్వమని అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్యాట్నీ సెంటర్లో నిర్వహించిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ కేంద్రంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అప్పుడు అవినీతి పెరిగిపోయిందని, ఆ పార్టీ నాయకుల మీద అవినీతి కేసులు నమోదై మంత్రులు కూడా జైలుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలో వచ్చిన పదేళ్లలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించి రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ధ్వజమెత్తారు. కాగా, కిషన్రెడ్డికి మనుషులు మాత్రమే తెలుసని కులం, మతం, రంగును ఆయన చూడరని, ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎలాంటి అవినీతి మరక ఆయనకు అంటలేదని అన్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ స్థానాల నుంచి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్లను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. పదేళ్లలో పది లక్షల కోట్లు ఖర్చు పెట్టాం: కిషన్రెడ్డి గత పదేళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేశామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.719 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, నైతిక విలువలకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేశానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మరో మారు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువతకు ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, మరో మారు మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కి రేపు అనేది లేదని, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేది బీజేపీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, ఈటల రాజేందర్, మర్రి శశిధర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్సింగ్ రాథోడ్, శ్యాంసుందర్గౌడ్, చీర శ్రీకాంత్ పాల్గొన్నారు. కోలాహలంగా నామినేషన్ దాఖలు చేసిన కిషన్రెడ్డి కిషన్రెడ్డి నామినేషన్ కార్యక్రమం శుక్రవారం కోలాహలంగా సాగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ నేతలు లక్ష్మణ్ తదితరులతో కలసి కిషన్రెడ్డి దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎస్వీఐటీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ సభలో మాట్లాడారు. తర్వాత సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్రెడ్డి నామినేషన్ వేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. పార్టీ నేతలు లక్ష్మణ్, శ్యాంసుందర్గౌడ్, శారదామల్లేశ్, అజయ్కుమార్ ఆయన వెంట ఉన్నారు. కాగా, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కూడా రాజ్నాథ్సింగ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అవుట్ డేటెడ్ పార్టీ.. రాజ్నాథ్ సింగ్ సెటైర్లు
హైదరాబాద్,సాక్షి : కాంగ్రెస్ అవుట్డేటెడ్ పార్టీ.. దేశ రాజకీయాల్లో ఉనికిని కోల్పోతుంది అని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియకు ముందు ఏర్పాటు చేసిన పార్టీ సభలో రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ కాలం చెల్లిపోయింది. దేశ రాజకీయాల్లో తన ఉనికిని కోల్పోయింది. బీజేపీ మాత్రం దేశ నిర్మాణం కోసమే రాజకీయాలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఉద్దేశించి, తెలంగాణలోని అధికార పార్టీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అయితే తెలంగాణ ఏర్పాటు ఘనత బీఆర్ఎస్కు కాదని, అనేక మంది త్యాగాల వల్లే దక్కుతుందని సూచించారు. గత కాంగ్రెస్ హయాంలో అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ..అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ.. మోదీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు. కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజ్గిరి)లకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. Secunderabad resonates with #PhirEkBaarModiSarkar My gratitude to Hon’ble Union Minister for Defence and Senior BJP leader Shri @rajnathsingh for joining & addressing the nomination rally in Secunderabad. The determination of the people of #Secunderabad in re-electing… pic.twitter.com/9EA3wDwtly — G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) April 19, 2024 బీఆర్ఎస్ను తరిమి కొట్టినందుకు గడిచిన పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఒక్క అవినీతి లేకుండా నరేంద్ర మోడీ పాలన చేస్తున్నాడని కేంద్ర క్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. ఖమ్మం బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు విజయాన్ని కాంక్షిస్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం నగరంలోని జెడ్.పీ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు అవినీతి ప్రభుత్వాలే అని విమర్శించారు. ఈ ప్రభుత్వాల హయాంలో రైతులను మోసం చేసి యూరియా కుంభకోణం చేశాయని,రైతులపై భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు మోదీ ఆర్ధిక సాయం చేశారన్నారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370ని అమలు చేశామని గుర్తు చేశారు.మహిళలకు సమాన హక్కుల కోసం మోదీ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. ముస్లింల కోసం త్రిపుల్ తలాకును తొలగించామని,మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. బీజేపి అధికారంలోకి రాగానే దేశంలో ఓకే పౌరసత్వాన్ని తీసుకురాబోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానిగా పనిచేసినప్పుడు పేదరికం తొలగిస్తామన్నారు కానీ ఇప్పటికీ పేదరికం అలానే ఉందన్నారు రాజ్ నాధ్ సింగ్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో తెలుగు ప్రజలను 22 వేల మందికి పైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీ దన్నారు.బీజేపిని గెలిపించి మూడోసారి మోదీని ప్రధాన మంత్రిని చేద్దామని ఖమ్మం ప్రజలు కూడా బీజేపిని ఆదరిస్తారన్నారు. -
బీఆర్ఎస్ పనైపోయింది.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
-
నేడు నామినేషన్ వేయనున్న కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హాజరుకానున్నారు. ముందుగా ఆయన సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఆలయం నుంచి పాదయాత్రగా వెళ్లి 11 గంటల సమయంలో మెహబూబ్ కాలేజీ వద్ద వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కిషన్రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ప్రసంగిస్తారు. -
నేను పని చేశాననుకుంటే మళ్లీ గెలిపించండి: కిషన్రెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం/చిక్కడపల్లి (హైదరాబాద్): సికింద్రాబాద్ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర, దేశాభివృద్ధికి తన వంతు కృషి చేశానని సికింద్రాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి చెప్పారు. ‘నా సేవలను గుర్తించి, నేను పని చేశానని భావిస్తే మళ్లీ నాకే ఓటు వేసి గెలిపించండి..’అని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా గురువారం లోయర్ ట్యాంక్బండ్లోని పింగళి వెంకటరామిరెడ్డి హాల్లో ఏర్పాటు చేసిన సభలో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘ప్రజలకు నివేదిక’పేరుతో గత ఐదు సంవత్సరాలలో తాను చేసిన రూ.10 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణం, కాజీపేట్లో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్, వరంగల్లో ఏర్పాటు చేయబోతున్న పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కు, రామగుండంలో కొత్తగా నిర్మించిన ఎరువుల కర్మాగారం, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించిన నిధులు, సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం, ములుగు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న సమ్మక్క, సారక్క గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఐఐటీ, పశువుల ఔషధాలకు సంబంధించి పరిశోధనల కోసం నిర్మించిన దక్షణ ఆసియాలోనే అతిపెద్ద బయోమెడికల్ రీసెర్చి సెంటర్ తదితరాలను వివరించారు. మరోసారి ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవ చేస్తా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గంలో, జంట నగారాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా కిషన్రెడ్డి తెలియజేశారు. మరోసారి ప్రజలు తనను ఆశీర్వదిస్తే మరో ఐదు సంవత్సరాలు ఇదే తరహా సేవలు అందిస్తానని తెలిపారు. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజల కోసం తపన పడుతున్న కిషన్రెడ్డి వంటి నాయకులు ఈ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. సంస్కారం ఉన్న వారికే ఓటు వేయాలన్నారు. తన ఓటు కిషన్రెడ్డికే వేస్తానని చెప్పారు. ప్రముఖ సామాజికవేత్త హనుమంతరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ మంత్రి కృష్ణయాదవ్, బీజేపీ నాయకులు మర్రి శశిధర్రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొన్నాల శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- హై రిటర్న్స్ కోసం ఆశపడితే మీకూ ఇదే జరగొచ్చు..!
- శ్రీదేవికి ఇష్టమైన ఆలయంలో జాన్వీ కపూర్.. ఫోటోలు వైరల్!
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- IPL 2024: వారికి భారీ నజరానా.. బీసీసీఐ కీలక ప్రకటన
- నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- మౌంట్ ఎవరెస్ట్పై భారీగా ట్రాఫిక్జామ్!
Advertisement