-
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవితవ్యంపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవేళ పరాజయం పాలైతే రాహుల్గాంధీ రాజకీయాల నుంచి కొంత కాలం విరామం తీసుకోవాలని సూచించారు. ‘మీ సొంత వ్యూహాల మీద మీరు ఎన్నికలకు వెళ్లారు. ఇలాంటప్పుడు మీ పార్టీ ఓడిపోతే మీరు విరామం తీసుకోవడం వ్యూహాత్మకంగా, నైతికంగా సరైనది’అని రాహుల్ను ఉద్దేశించి పీకే అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్ల దాకా గెలుచుకునే అవకాశాలున్నాయని పీకే చెప్పుకొచ్చారు. -
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేయడంపై వయనాడ్ ప్రజలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘తప్పేముంది రాహుల్ ఇండియా కూటమిలో అగ్రనేత’ అని ఒకరు అనగా రాయ్బరేలీలో గెలిస్తే వయనాడ్ సీటును రాహుల్ వదిలేస్తారని మరొకరన్నారు. అయితే రాహుల్ వయనాడ్ను వదిలేయడం తమకు అంత మంచిది కాదని చెప్పాురు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీ తీసుకున్న నిర్ణయం ఇండియా కూటమికి మేలు చేస్తుందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్)నేత కున్హలికుట్టి అన్నారు. ప్రధాని మోదీ కూడా గతంలో రెండు సీట్లలో పోటీ చేశారని కుట్టి గుర్తు చేశారు. -
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
గువహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ పాకిస్తాన్లో పోటీచేస్తే ఖచ్చితంగా గెలుస్తారని ఎద్దేవా చేశారు.‘పాకిస్తాన్లో రాహుల్గాంధీ చాలా పాపులర్. ఒకవేళ పాకిస్తాన్లో ఎన్నికలు జరిగితే అక్కడ రాహుల్గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్ను పాకిస్థాన్లో మేం ఓడించలేం. అయితే పాకిస్తాన్లో ఏం జరుగుతుందో దానికి వ్యతిరేకంగా భారత్లో జరుగుతుంది’అని హిమంత సెటైర్లు వేశారు. రాహుల్గాంధీ శుక్రవారం(మే3) తన పాత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి కాకుండా రాయ్బరేలి నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన వేళ హిమంత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మూగబోయిన మైకులు..రెండో దశ పోలింగ్కు కౌంట్డౌన్
న్యూఢిల్లీ,సాక్షి: రెండో విడత లోక్సభ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 స్థానాల్లో ఓట్ల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమామాలిని తదితరులు సెకండ్ ఫేజ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లోక్సభ ఎన్నికల రెండో దశ ప్రచారానికి బుధవారం(ఏప్రిల్24) సాయంత్రం తెరపడింది. దాదాపు నెల రోజులుగా హోరెత్తిన మైకులు మూగబోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనుండగా.. శుక్రవారం(ఏప్రిల్26) రెండో దశ పోలింగ్ జరగనుంది. 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్.ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం రెండో దశలో 89 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, మధ్యప్రదేశ్లోని బేతుల్ నుంచి బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలవి మరణంతో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ జరగనుంది.కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అసోం, బిహార్లో ఐదేసి, ఛత్తీస్గఢ్, బెంగాల్లో మూడు, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘంకాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, గజేంద్ర సింగ్ షెకావత్, లోక్సభ మాజీ స్పీకర్ ఓంబిర్లా, వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్, టీవీ రాముడు అరుణ్ గోవిల్, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని, నటి నవనీత్ కౌర్ రాణా సహా పలువురు ప్రముఖులు రెండో దశ బరిలో ఉన్నారు.వరుసగా రెండోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభకు పోటీచేస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాతో తలపడుతున్నారు. ఏప్రిల్19న తొలి దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. లోక్సభ బరిలో అఖిలేశ్.. మళ్లీ అక్కడి నుంచే -
కేరళ: రాహుల్గాంధీపై ప్రధాని సెటైర్లు
తిరువనంతపురం: ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల పాలనలో కేరళ పరిస్థితి దిగజారిపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కేరళలోని పాలక్కాడ్లో సోమవారం(ఏప్రిల్ 15) జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ దాకా లెఫ్ట్ ప్రభుత్వాలు ఎక్కడున్నా ఒకేలా వ్యవహరిస్తాయని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ యువరాజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఓట్లడుగుతాడు. కానీ కేరళ పజలకు ఉన్న ఒక్క సమస్యపైనా మాట్లాడడు’ అని రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధాని చురకంటించారు. మరోపక్క బీజేపీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోపై సోమవారం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై రాహుల్గాంధీ విమర్శలు -
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
కాంగ్రెస్ మేనిఫెస్టో.. రాహుల్గాంధీపై కిషన్రెడ్డి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ కొత్తగా మ్యానిఫెస్టో విడుదల చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఆరు గ్యారంటీ ల అమలుపై చర్చించడానికి రావాలని రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ‘దేశంలో ఉన్న ప్రతి మహిలకు లక్ష రూపాయల భృతి ఇస్తామని అంటున్నారు. తెలంగాణ లో ఇస్తామని చెప్పిన నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది ? ఉట్టికి ఎగరనివాడు ఆకాశానికి ఎగిరినట్లు ఉంది. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇస్తామని చెప్పిన రైతు రుణ మాఫీ ఏమైంది ? రుణమాఫీ చేయకుండా.. గిట్టుబాటు ధర గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి.. ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష వేస్తాం -
కాంగ్రెస్ మేనిఫెస్టో: రాహుల్ గాంధీకి హరీశ్రావు లేఖ
సాక్షి,హైదరాబాద్: మేనిఫెస్టోల పేరుతో మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని, తర్వాత వాటిని విస్మరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మాజీ మంత్రి హరీశ్రావు ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి శుక్రవారం(ఏప్రిల్ 5) ఒక బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ మోసాలు ఇప్పటికే అనేకసార్లు అనుభవపూర్వకంగా రుజువైనందున, మళ్లీ మేనిఫెస్టోల పేరుతో ప్రజలను మోసం చేయవద్దని సూచిస్తున్నామని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మారిన వెంటనే పదవి పోయేలా చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం హాస్యాస్పదమని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి అరచేతిలో స్వర్గం చూపిస్తూ హామీలివ్వడం తర్వాత చేతులు ఎత్తేయడం మీకు అలవాటేనని లేఖలో హరీశ్రావు చురకంటించారు. ‘కాంగ్రెస్ మోసం చరిత్రలో ఎన్నోసార్లు రుజువయింది. మీ నాయకత్వంలోనే 2004, 2009 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. రెండు సందర్భాల్లోనూ అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మీరే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన అన్ని హామీలన్నింటిని విస్మరించారు. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి మళ్లీ మీరు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అసలు మీ మేనిఫెస్టోలకు ఏమైనా విలువ ఉన్నదా ? ఒక్కదానినైనా అమలు చేశారా ? అలాంటి వారికి మేనిఫెస్టోలు ఎందుకు? ఈసారి మీ మేనిఫెస్టోలో చెప్పిన మాటలకు చేతలకు ఏమాత్రం పొంతనలేదని విషయం ఇప్పటికే రుజువైంది. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీరు చెప్పలేదు. హామీలు ప్రకటించడమే తప్ప వాటిని అమలు చేసే విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేని మీకు, మళ్ళీ కొత్త హామీలను ఇచ్చే నైతిక హక్కు లేదు. తెలంగాణ ప్రజలను మళ్లీమళ్లీ మోసం చేయాలనుకునే మీ ఎత్తుగడలు ఇక ముందు సాగబోవు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా’ అని లేఖలో హరీశ్రావు తెలిపారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల -
రాహుల్ గాంధీపై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ఎన్నికల కమిషన్కు బీజేపీ సోమవారం(ఏప్రిల్ 1) ఫిర్యాదు చేసింది. లోక్సభ ఎన్నికల్లో అధికార పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిందని, ఎన్నికలను బీజేపీ రిగ్గింగ్ చేస్తోందని రాహుల్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాహుల్గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం పూరీ మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించారు. ఈవీఎంలపైనా, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపైనా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషులను పెట్టిందని ఆరోపించారు. రాహుల్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకుగాను ప్రస్తుత ఎన్నికల్లో అతడి ప్రచారంపై ఆంక్షలు విధించాలి’ అని పూరీ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీ దేశానికి చేస్తున్నది మంచిది కాదు.. కేజ్రీవాల్ -
రాహుల్కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
Truck Drivers Protest: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పందించారు. రోడ్ యాక్సిడెంట్ల కేసుల్లో శిక్షను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్ట సవరణ చేయడాన్ని షెహన్షాకా ఫర్మానాగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షంతో చర్చించకుండా చట్టాలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణ వల్ల తీవ్ర పరిణామాలుంటాయి. కష్టపడి పనిచేసుకుని జీవితాలు గడిపే డ్రైవర్ల జీవితాలను చట్టాల పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేయడం సరికాదు. ఈ చట్టాన్ని కొన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది’అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో సోమవారం(జనవరి 1) నుంచి దేశంలోని పలు నగరాల్లో బంకులకు పెట్రోల్, డిజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా నగరాల్లో వాహనదారులు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ కోసం ద్వి చక్ర వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
రాహుల్పై ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహించారా అంటే అవుననే అంటున్నారు ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ. ‘ప్రణబ్ మై ఫాదర్..ఎ డాటర్ రిమెంబర్స్’ అనే పేరుతో తన తండ్రితో జ్ఞాపకాలపై బుక్ను షర్మిష్ట లాంచ్ చేశారు. ఈసందర్భంగా ఆమె ప్రణబ్,రాహుల్గాంధీలకు సంబంధించిన ఆసక్తిర విషయం ఒకటి వెల్లడించారు. ‘యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏదైనా క్రిమినల్ కేసులో 2 ఏళ్లు, అంతకుపైగా శిక్ష పడితే వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పును అమలు కాకుండా అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఆ ఆర్డినెన్స్ కాపీని 2013 సెప్టెంబర్లో ఎంపీ రాహుల్ గాంధీ మీడియా ఎదుటే చించి వేశారు. ఈ ఘటనను ముందుగా ప్రణబ్కు చెప్పింది నేనే. రాహుల్ ఆర్డినెన్స్ కాపీని చించివేయడంపై ప్రణబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆర్డినెన్స్పై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి రాహుల్ అలా ఆర్డినెన్స్ కాపీని చించివేయడం ఆయన మూర్ఖత్వం అని చాలా మంది అంటుంటారు. వారిలాగే మా నాన్న కూడా రాహుల్ చర్యను వ్యతిరేకించారు. రాహుల్ ప్రభుత్వ క్యాబినెట్లో కూడా లేరు. ఆయనెవరు ఆర్డినెన్స్ను చింపివేయడానికి అని ప్రణబ్ అన్నారు’ అని షర్మిష్ట అప్పటి జ్ఞాపకాలను వివరించారు. ఇదీచదవండి..ప్రధానిపై కథనం..సంజయ్ రౌత్పై కేసు -
హస్తం.. హోరు.. అనుకరించిన కాంగ్రెస్ నేతలు!
సాక్షి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గ పర్యటనలు విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అధికార పార్టీ అవినీతిని వెలుగులోకి తెచ్చి సంపదను పేదలకు సంక్షేమ రూపంలో పంచుతామని చెప్పడంతో కార్యకర్తలు ఈలలు, కేకలతో హోరెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నుంచి 2 గంటలకు రాహుల్గాంధీ హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకున్నారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం, ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, ఇనగాల వెంకట్రాంరెడ్డి పూలబొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. అనంతరం హెలికాప్టర్లో మామూనూరులో దిగిన ఆయన అక్కడి నుంచి వరంగల్ చౌరస్తాకు చేరుకున్నారు. అభ్యర్థి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, పార్టీ నాయకులు స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. జనసంద్రంగా పాదయాత్ర! జనసంద్రంగా మారిన చౌరస్తాలో కారు దిగుతూనే రాహుల్ ప్రజలకు అభివాదం చేశారు. ప్రచారంలో భాగంగా వరంగల్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు, మండిబజార్, పోచమ్మమైదాన్ వరకు పాదయాత్ర సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్తో పాదం కలిపారు. ప్రధాన రహదారిలో వేగంగా నడుస్తూ ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, భవనాల ఎదుట, పైఅంతస్తుల్లో ఉన్న ప్రజలకు అభివాదం తెలుపుతూ రాహుల్గాంధీ ముందుకుసాగారు. పోచమ్మమైదాన్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్కు తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో జంక్షన్ జనంతో కిక్కిరిసిపోయింది. రాహుల్ స్పీచ్కు విశేష స్పందన.. రాహుల్గాంధీ ప్రసంగానికి పార్టీ శ్రేణులు, అభిమానులు నీరాజనాలు పలికారు. పీఎం నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక చెట్టు కొమ్మలేనని పేర్కొనడంతో ప్రజల నుంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రస్తావించగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కులగణన, పేదరిక నిర్మూలన, స్థానిక సంస్థల్లో కులాల లెక్కింపు, రాజకీయ ప్రాధాన్యత, ఆ మేరకు బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు, కేసీఆర్ అవినీతి అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, నర్సంపేట, తూర్పు నుంచి పోటీ చేస్తున్న దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు డాల్వీ, దీపమున్సీ, కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, నాయకులు మీసాల ప్రకాశ్, నల్లగొండ రమేష్, గోపాల నవీన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలో.. నర్సంపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గెలుపు కోసం నిర్వహించిన రోడ్షోలో ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావడంతో నర్సంపేట పట్టణంలోని వరంగల్, నెక్కొండ, మల్లంపల్లి, పాకాల రోడ్లు పూర్తిగా నిండిపోయాయి. కాగా, మహేశ్వరం గ్రామంలోని సెయింట్థెరిస్సా పాఠశాల ఎదుట హెలిపాడ్ను ఏర్పాటు చేయగా కార్యకర్తలు, నాయకులు, భారీ సంఖ్యలో చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు రాహుల్గాంధీ హెలికాప్టర్ దిగి అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో నర్సంపేటలోని అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. రాహుల్ రాకతో ట్రాఫిక్ను మళ్లించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. డీఎస్పీలు రవీందర్, మురళి ఆధ్వర్యంలో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తును నిర్వహించారు. రౌడీ రాజ్యం.. నియంత పాలన: కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ వరంగల్ తూర్పులో రౌడీ రాజ్యం, నియంత పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విమర్శించారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దౌర్జన్యాలు, స్థలాల కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి మమ్ముల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రెండుసార్లు ప్రజలను మభ్య పెట్టి, మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలకే మేలు జరగలేదని, కల్వ కుంట్ల కుటుంబం మాత్రం బాగుపడిందన్నారు. మళ్లీ ఎన్నికల్లో అధికారం కావాలని ముందుకొస్తున్నారని, ప్రజలు గుర్తించి తిప్పికొట్టాలని, కాంగ్రెస్ను ఆదరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇవి కూడా చదవండి: కారు.. జోరు! అంతటితో ఆగిపోదు.. అసలు ముచ్చట అప్పటినుంచే.. -
ఉమ్మడి వరంగల్లో.. మరోమారు రాహుల్గాంధీ!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేత, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ మరోమారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్నారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం, అంబట్పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. గత నెల 18, 19 తేదీల్లో ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో బస్సుయాత్ర, సభలు నిర్వహించిన ఆయన.. సుమారు 15 రోజుల వ్యవధిలో రెండోసారి పర్యటించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అంబట్పల్లి సమీపంలో సుమారు ఐదువేల మందితో మహిళాసాధికారత సభను నిర్వహించుకునేందుకు అనుమతి లభించినా.. బుధవారం రాత్రి 9 గంటలకు హెలిపాడ్ ఏర్పాటు, హెలికాప్టర్ గ్రౌండ్స్ క్లియరెన్స్లు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా ఆదివాసీ ప్రాంతాలను ఎంచుకున్న రాహుల్గాంధీ.. ఉమ్మడి జిల్లాలో తొలి పర్యటన, సభలు ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లోనే మొదలెట్టారు. గత నెల 18న హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా రామప్ప ఆలయానికి చేరుకున్న రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ.. అక్కడినుంచే బస్సుయాత్ర ప్రారంభించారు. అనంతరం రామాంజాపూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన తర్వాత చెల్పూర్ జెన్కో గెస్టుహౌస్లో రాత్రి బస చేశారు. 19న ఉదయం బైక్ర్యాలీగా బస్సుయాత్ర సాగగా, కాటారం వద్ద జరిగిన సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉదయమే కార్యక్రమం.. హెలికాప్టర్ ద్వారా గురువారం ఉదయమే జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేరుకోనున్నారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు సైతం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో రాహుల్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం నుంచే పోలీస్ బలగాలను మోహరించారు. గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సభకు అనుమతి ఉండగా.. 8.30 గంటల నుంచి 11 గంటల వరకు మహిళలతో సదస్సు ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శశిభూషణ్ కాచే తెలిపారు. కాగా, అంబట్పల్లి సభలో పాల్గొననున్న రాహుల్గాంధీ.. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిపోయిన ప్రాంతాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, రాహుల్ పర్యటన ఏర్పాట్లను మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఇవి చదవండి: ట్రిక్కులెన్ని చేసినా.. హ్యాట్రిక్ తప్పదు! : మంత్రి హరీశ్ రావు -
TS Election 2023: రాహుల్, ప్రియాంకగాంధీ పర్యటన.. కాంగ్రెస్ కేడర్లో కొత్త ఉత్సాహం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన కాంగ్రెస్ కేడర్లో కొత్త ఉత్సాహం నింపింది. ములుగు జిల్లా రామాంజాపూర్ వద్ద బుధవారం జరిగిన విజయభేరి సభలో తెలంగాణ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అభ్యర్థులను గెలిపించుకునేందుకు అగ్రనేతలు రాహుల్, ప్రియాంకగాంధీ కాకతీయులు ఏలిన గడ్డ నుంచే పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలో రామప్ప ఆలయాన్ని సందర్శించిన రాహుల్, ప్రియాంక రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకున్న వారు అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బస్సుయాత్ర ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్సుయాత్ర ద్వారా రామప్ప ఆలయం నుంచి రామాంజాపూర్ విజయభేరి సభ వద్దకు చేరుకున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ను ఓడించడం కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కూటమిగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే విపక్ష నేతలందరిపై సీబీఐ, సీఐడీ, ఈడీ దాడులు చేయించి కేసులు పెట్టిన కేంద్రం అవినీతికి కేరాఫ్గా మారిన కేసీఆర్పై ఒక్క కేసు పెట్టలేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనులు, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై దుమ్మెత్తి పోశారు. బహిరంగ సభలో మహిళా డిక్లరేషన్ను ప్రకటించిన ప్రియాంకగాంధీ అధికారంలోకి వచ్చాక ప్రతీ మహిళకు నెలకు రూ.2,500 అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు అన్నాచెల్లెళ్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి పథకాలను వివరిస్తూ.. తెలంగాణలో అమలు చేయనున్నామని ప్రకటించారు. రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో పీఎం.. పీఎం రాహుల్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన సందర్భంగా ములుగు ఎస్పీ గాష్ ఆలం భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 'ఆదివాసీ గిరిజనులతోపాటు అందరికీ ఆరాధ్య దైవాలైన సమ్మక్క, సారలమ్మ జాతర దేశంలోనే అతిపెద్దది. దేశంలో మేం అధికారంలోకి వస్తే జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం. కుంభమేళా తరహాలో నిర్వహిస్తాం.' – రాహుల్గాంధీ రామప్పలో పూజలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ సందర్శించారు. రామప్పకు సాయంత్రం 4 గంటలకు వారిద్దరు రావాల్సి ఉండగా, 37నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఆలయ ఆర్చకులు హరీష్శర్మ, ఉమాశంకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు ఆశీర్వచనం అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం వారు ఆలయం చుట్టూ కలియదిరిగారు. టూరిజం గైడ్ విజయ్కుమార్ ఆలయ విశిష్టత గురించి వివరించారు. జనసంద్రంగా మారిన రామాంజాపూర్.. రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ హాజరైన కాంగ్రెస్ విజయభేరి సభ సందర్భంగా రామాంజాపూర్ జనసంద్రంగా మారింది. ఇటు సీతక్క, అటు గండ్ర సత్యనారాయణ అభిమానులు అధికసంఖ్యలో తరలిరావడంతో గ్రామ పరిసరాలు కార్యకర్తలతో హోరెత్తాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు పడిన దొడ్ల, మొండాయి, మల్యాల, మేడారం, ఊరట్టం తదితర గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. రేవంత్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సీతక్కను దగ్గరకు తీసుకుని ఈమె ఎవరో తెలుసా.. నా సోదరి అంటూ నాలుగు సార్లు ఉచ్ఛరించి సభలో నూతన ఉత్తేజాన్ని నింపారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలపై ప్రజలను అభిప్రాయాన్ని అడగ్గా.. సానుకూలంగా స్పందించారు. సభలో పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ మాణిక్కం ఠాకూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, డి.శ్రీధర్రాబు, నాయకులు మధుయాష్కీగౌడ్, మల్లు రవి, తూర్పు జగ్గారెడ్డి, భూపాపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ, కొండా సురేఖ, నాయిని రాజేందర్రెడ్డి, వేం నరేందర్రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాఘవరెడ్డి, పొదెం వీరయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, మల్లాడి రాంరెడ్డి పాల్గొన్నారు. స్వాగతం పలికిన రాష్ట్ర నేతలు రామప్పలోని హెలిపాడ్ వద్ద అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణతోపాటు పలువురు నేతలు బొకేలు అందించి స్వాగతం పలికారు. రామప్ప ఆలయం ముందు అగ్రనేతలకు కోయ కళాకారులు కొమ్ము డాన్స్, గిరిజనులు లంబాడా నృత్యం ద్వారా స్వాగతం పలికారు. కేటీపీపీ అతిథి గృహంలో బస.. రాహుల్, ప్రియాంకగాంధీ బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. చెల్పూరు కేటీపీపీ అతిథి గృహంలో బస చేశారు. ప్రత్యేక గదిలో రాహుల్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, పలువురు రాష్ట్రస్థాయి నాయకులతో కాసేపు ముచ్చటించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం డైనింగ్ హాల్లో రాత్రి భోజనంలో కొంచెం బిర్యానిని టేస్ట్ చేసి మటన్ కబాబ్ తీసుకున్నారు. అలాగే చిన్న పుల్కాతో పాలక్ పప్పు తీసుకొని భోజనాన్ని ముగించారు. రాహుల్గాంధీ గురువారం ఉదయం 7 గంటలకు కేటీపీపీ అతిథి గృహం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. అనంతరం కేటీపీపీ ఉద్యోగులతో మాటాముచ్చట చేసి, వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు. అక్కడి నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాకు వెళ్తారు. ఇవి చదవండి: ప్లాట్ల విక్రయంలో.. బోథ్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు! Follow the Sakshi TV channel on WhatsApp: -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న ఎంపీ రాహుల్గాంధీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన బస్సుయాత్ర రెండోరోజు పెద్దపల్లిలో కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు విజయరమణారావుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాహుల్గాంధీ పాల్గొనే కార్యక్రమాలకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం తరలిరానున్న నేపథ్యంలో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మంథని–కరీంనగర్ పర్యటన ఇలా.. రాహుల్గాంధీ గురువారం ఉదయం భూపాలపల్లి జిల్లాలో పర్యటన ముగించుకొని బస్సులో పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రవేశించనున్నారు. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలి కేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంథనిలో రోడ్ షో లో పాల్గొన్న అనంతరం రామగిరి మండలం సెంటినరీకాలనీలో మధ్యాహ్నం రాష్ట్ర నాయకులతో కలిసి భోజనం చేస్తారు. తర్వాత సింగరేణి కార్మికులు, రైతులతో సమావేశమవుతారు. వారితో మాట్లాడాక బస్సులో కమాన్పూర్ చౌరస్తాకు చేరుకొని, రోడ్ షోలో పాల్గొంటారు. సబ్బితం నుంచి బైక్ ర్యాలీ ద్వారా పెద్దపల్లి బహిరంగ సభకు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. భారీ బహిరంగ సభ అనంతరం రాత్రి 7 గంటలకు కరీంనగర్ చేరుకొని, 10 గంటల వరకు పాదయాత్ర చేయనున్నారు. 40 వేల మందితో భారీ బహిరంగ సభ.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల కు చెందిన సుమారు 40 వేల మంది పాల్గొననున్నా రు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను రాహుల్గాంధీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు, పెద్దపల్లి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ఎమ్మె ల్యే విజయరమణారావు సభాస్థలిని పరిశీలించారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాపై ఫోకస్.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర చేపడుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మొత్తం 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా అధిష్ఠానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సిటీలో రాహుల్ యాత్ర ఇలా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ గురువారం కరీంనగర్లో పర్యటించనున్నారు. మొగ్దుంపూర్ వద్ద నేతలు స్వాగతం పలుకుతారు. నగరంలోని మారుతీనగర్ చౌరస్తా నుంచి రాత్రి ఏడు గంటలకు పాదయాత్రగా నాకా చౌరస్తా మీదుగా అశోక్నగర్ నుంచి రాజీవ్చౌక్ చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ.వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, రోహిత్చౌదరి, క్రిస్టోఫర్తిలక్, జీవన్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్రెడ్డి యాత్రలో పాల్గొననున్నారు. -
మెగా విద్వేష షాపింగ్ మాల్: నడ్డా
న్యూఢిల్లీ: ప్రేమ దుకాణం పేరిట రాహుల్ మెగా విద్వేష షాపింగ్ మాల్ తెరిచారంటూ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అభివృద్ధిని ప్రపంచమే గుర్తించింది. దాన్ని యువరాజు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు సర్జికల్ స్రైక్స్పై అనుమానాలు వ్యక్తం చేస్తారు. హిందువులు, ముస్లింలను విడదీయడంపై మాట్లాడుతారు. సమాజాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరోవైపు ప్రేమ దుకాణం నడుపుతున్నానంటూ చెప్పుకుంటుంటారు. నిజానికది మెగా విద్వేష షాపింగ్ మాల్’’ అన్నారు. -
Rahul Gandhi:16 ఏళ్ల బాలుడి ప్రతిభకు రాహుల్ గాంధీ ఫిదా
జైపూర్: రాజస్థాన్ రాజ్సమంద్ జిల్లాలోని నందేస్క్రిప్ట్ గ్రామానికి చెందిన ఓ బాలుడి ప్రతిభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిదా అయ్యారు. ఆ కుర్రాడు చేసిన బౌలింగ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అతడి కలలు నిజం చేసేందుకు సాయం అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ను కోరారు. దీపక్ శర్మ అనే వ్యక్తి పోస్టును షేర్ చేశారు రాహుల్. అందులో 16 ఏళ్ల భరత్ సింగ్ అనే కుర్రాడు.. చేల వల కట్టి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ‘దేశంలోని నలుమూల్లో అద్భుత ప్రతిభ దాగి ఉంది. అలాంటి వారిని గుర్తించి వెలుగులోకి తీసుకురావటం మన బాధ్యత. ఆ బాలుడి కలలు సాకారమయ్యేందుకు సాయపడాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ను కోరుతున్నాను.’ అని తన ట్విట్టర్లో రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. ఆయన ట్వీట్కు రిప్లై ఇచ్చారు సీఎం గెహ్లోత్.‘తప్పకుండా.., ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి అవసరమైన సాయం చేస్తాము’ ట్వీట్ చేశారు. हमारे देश के कोने-कोने में अद्भुत प्रतिभा छिपी हुई है, जिसे पहचानना और बढ़ावा देना हमारा कर्तव्य है।@ashokgehlot51 जी से मेरा निवेदन है, इस बच्चे का सपना साकार करने के लिए कृपया उसकी सहायता करें। https://t.co/vlEKd8UkmS — Rahul Gandhi (@RahulGandhi) July 27, 2022 ఇదీ చదవండి: తినేందుకు రోటీ ఇవ్వలేదని గొడవ.. కత్తితో పొడిచి హత్య -
హరిద్వార్ ధర్మసంసద్ ప్రసంగాలపై కేసు నమోదు
డెహ్రాడూన్: మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వసీం రజ్వీ అలియాస్ జితేంద్ర నారాయణ్ త్యాగి, తదితరులపై కేసు నమోదైంది. వారిపై ఐపీసీ 153 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు హరిద్వార్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రకీందర్సింగ్ తెలిపారు. అదేవిధంగా, గత వారం హరిద్వార్లో ధర్మసంసద్ నిర్వహించి న, ప్రసంగించిన వారిపై చర్యలు తీసుకోవా లని టీఎంసీ ప్రతినిది సాకేత్ గోఖలే జ్వాలాపూర్లో ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు గర్హనీయం హిందుత్వవాదం పేరుతో కొందరు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యల ద్వారా హింస జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దానికి అన్ని మతాలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. హింసను ప్రేరేపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మాజీ ప్రధానిని హత్య చేయాలని పిలుపునివ్వడం, వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేయడం హీనమైన చర్యన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించేలా ఆ వ్యాఖ్యలున్నాయని ఆమె ట్వీట్ చేశారు. -
పన్నుల వసూళ్లులో కేంద్రం పీహెచ్డీ: రాహుల్
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల వసూలులో పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు. ఆయన ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరు పై మండిపడ్డారు.ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా కన్నా పెట్రోలు, డీజిల్ల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందని చెప్తున్న ఓ పత్రిక కథనాన్ని జత చేస్తూ ఈ ట్వీట్ చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు ఒక రోజు నిలకడగా ఉన్నాయి. ఆ తర్వాత ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో ఈ ధర రూ.100కు చేరువలో ఉంది. భోపాల్లో అత్యధికంగా లీటరు పెట్రోలు ధర రూ. 105 గా వుంది. చదవండి:అత్యాచారం కేసు.. మాజీ మంత్రి అరెస్ట్ -
లవ్ యూ రాహుల్: ప్రియాంక
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ భాయ్ దూజ్((భగినీ హస్త భోజనం) పండుగ సందర్భంగా తన సోదరుడు రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటి వరకు దిగిన ఫోటోలను ఓ ఫ్రేమ్లో అమర్చి ప్రియాంక షేర్ చేశారు. ఈ ఫ్రేమ్లో నానమ్మ ఇందిరాగాంధీ, తల్లిదండ్రులు రాజీవ్గాంధీ, సోనియాగాంధీతో దిగిన ఫోటోలను సైతం ఆమె ట్వీట్ చేశారు. వీటికి ‘లవ్ యూ రాహుల్గాంధీ.. భాయ్దూజ్’ అంటూ సోదరుడిపై ఉన్న అప్యాయతను వ్యక్తం చేశారు. అయితే ఇటీవలే రక్షబంధాన్ రోజు సైతం ప్రియాంకా.. రాహుల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక ఈ భాయ్ దూజ్ వేడుక. ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ తర్వాత జరుపుకునే ఈ వేడుక సందర్భంగా సోదర, సోదరీవమణులు ఒకరికొకరు ఆశీస్సులు పొందడం, బహుమతులు ఇచ్చిపుచ్చకోవడం అనవాయితీ. కాగా సినీ ఇండస్ట్రీలో సైతం సెలబ్రిటీలు ఈ బాయ్ దూజ్ వేడుకలను నిర్వహించుకొని వారి సోదరిలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. love you @RahulGandhi ❤❤❤❤#भाईदूज pic.twitter.com/GxR4Og4P4d — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 29, 2019 -
10న రాహుల్ గాంధీ అమేథీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ అమేథీ పర్యటన ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత రాహుల్ మొదటిసారిగా జూలై 10న అమేథీలో పర్యటించనున్నారు. ముందుగా లక్నోకు చేరుకుని గౌరీగంజ్లో అక్కడి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడటానికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత శివమహేశ్ మెడికల్ కళాశాల వేడుకకు హాజరు కానున్నారు. 15 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ కుటుంబీకులు అమేథీలో విజయబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్గాంధీ పరాజయం పాలయ్యారు. కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. దేశమంతటా కాంగ్రెస్ తక్కువ స్థానాలకు పరిమితం కావటంతో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు. -
నా యుద్ధం ఉగ్రవాదంపై... విపక్షాల దాడి నాపై
అహ్మదాబాద్/అదాలజ్/ధర్: పొరుగుదేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమివేయాలని తాను యుద్ధం చేస్తుండగా ప్రతిపక్షాలు మాత్రం తనపై దాడి చేయాలని చూస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం ప్రధాని గుజరాత్, మధ్యప్రదేశ్లలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘నేను ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లు (ప్రతిపక్షాలు) నన్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారు. పేదరికంపై నేను పోరాడుతుండగా వాళ్లు చౌకీదార్ను తొలగించేందుకు చూస్తున్నారు. నిజాయతీపరుడైన ఈ చౌకీదార్తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లు మోదీ హఠావో అంటూ అరుస్తున్నారు’ అని చెప్పారు. పాక్కు బుద్ధి చెప్పాం పాక్లోకి ప్రవేశించి ఉగ్రశిబిరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగ్గిన బుద్ధి చెప్పామని ప్రధాని అన్నారు. ‘పుల్వామా ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్లో ప్రవేశించి అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాం. తీరు మారకుంటే తలెత్తే పరిణామాలేమిటో పాక్కు ముందే చెప్పాం’ అని అన్నారు. కానీ, ఎయిర్స్ట్రైక్ పాక్పై జరిగినా భారత్లో ఉన్న కొందరికి ఆ దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు. ‘పుల్వామాకు ప్రతీకారంగా మనం చేసిన దాడిని ప్రపంచమంతా మద్దతు పలుకుతుండగా అత్యంత కల్తీ కూటమి(ప్రతిపక్ష మహాకూటమి) నేతలు మాత్రం పాక్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. రాహుల్ ‘ఆకలి బాధ’ వ్యాఖ్యలపై.. ఒక్క పూట కూడా ఖాళీ కడుపుతో నిద్రించని వారు మాత్రమే ఆకలి బాధ మానసికమైందని అంటారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘పేదరికం పేరుతో ఓట్లు దండుకుని దేశాన్ని 55 ఏళ్లపాటు పాలించిన వీళ్లకు పేదరికం అనేది కేవలం మానసిక భావన’ అని 2013లో రాహుల్ చేసిన ప్రకటనను ఉదహరిస్తూ వ్యాఖ్యానించారు. అన్నీ ప్రభుత్వమే చేయాలనుకుంటున్నారు ‘ప్రభుత్వమే ప్రతీ పనినీ చేపట్టాలని ప్రజలు భావిస్తున్నారు. ఫలానా పనిని ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కొత్త ఒరవడి’ అని అన్నారు. -
దేశ్కా చౌకీదార్’ మాత్రమే దొంగ
రాంచీ: ‘కాపలాదార్లంతా దొంగలు కారు.. దేశానికి కాపలాదారు (దేశ్కా చౌకీదార్) మాత్రమే దొంగ’అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాంచీలో శనివారం జరిగిన బహిరంగ సభ ‘పరివర్తన్ ఉల్గులన్ మహా ర్యాలీ’లో రాహుల్ మాట్లాడుతూ.. ‘కొందరు కాపలాదార్లు ఆ (చౌకీదార్ చోర్ హై)నినాదంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తామంతా నిజాయతీ పరులమనీ, ఆ నినాదాన్ని మార్చుకోవాలని సూచించారు. అయితే, ఆందోళన చెందవద్దని వారికి చెప్పా. కాపలాదారే దొంగ నినాదం ప్రధాని మోదీని ఉద్దేశించిందేనన్న విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దేశానికి కాపలాదారు మాత్రమే దొంగ. ఈ ఒక్క కాపలాదారు కారణంగా అందరికీ అప్రతిష్ట వచ్చిపడింది’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని మోదీ రూ.30 వేల కోట్ల మేర తన సన్నిహితుడైన అనిల్ అంబానీకి అక్రమంగా లాభం కలిగేలా చేశారంటూ రాహుల్ ఆరోపిం చారు. ‘వాయుసేన దేశాన్ని రక్షిస్తుండగా మన ప్రధాని మాత్రం సైన్యం నుంచి డబ్బు దోచుకుంటున్నారు’ అని రాహుల్ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, చిన్న దుకాణదారులను పట్టించుకోని ప్రధానమంత్రి పారిశ్రామికవేత్తలకు బ్యాంకు లిచ్చిన రూ.3.5 లక్షల కోట్ల రుణాలను మాత్రం రద్దు చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని అమలు చేసి, పేదల బ్యాంకు అకౌంట్లలోకి నేరుగా డబ్బును జమ చేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు గిమ్మిక్కులు చేసే కాపలాదారు(ప్రధాని) మళ్లీ విఫల మయ్యారని రాహుల్ మండిపడ్డారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టమాట రేటు.. మిర్చి ఘాటు
నేడు అక్కడక్కడా వర్షాలు
తొలి ఫలితం పుట్టపర్తిదే!
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
14 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగావకాశం
‘108’లో ప్రసవం
అతిసారం నివారణకు చర్యలు చేపట్టాలి
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
డీఆర్ కాలనీలో చోరీ
తప్పక చదవండి
- నేరేడు పండ్లు తింటే, పిల్లలు నల్లగా పుడతారా? మీరు మాత్రం బీ కేర్ఫుల్
- ఛత్తీస్గఢ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 17 మంది మృతి
- అంబేద్కర్, గాంధీ మధ్య ఆ చర్చ జరిగితే చూడాలని ఉంది: జాన్వీ కపూర్
- AP: తొలి ఫలితం వచ్చేది అప్పుడే!
- Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
- ‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Tirumala: తిరుమలలో భక్తుల రద్ధీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
Advertisement