-
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ను తమ ట్రాప్లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం ఈసీని కలిసింది. టీడీపీ నేత చంద్రబాబు, ఈనాడు పత్రిక, ఆర్ టీవీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ.. కోడ్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు, నంద్యాల సభల్లో చంద్రబాబు అప్రజాస్వామిక పదజాలం వాడారని, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ 230 ఫిర్యాదులు ఈసీకి ఇచ్చాం. ఎన్నికల సంఘం సరిగ్గా స్పదించలేదు. కూటమి ఫిర్యాదులపై వెంటనే స్పందించింది. ఈసీ ప్రభావం పడకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు కూటమి కట్టారని మల్లాది విష్ణు అన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా తీర్పును ఆపలేరు. ప్రజలు ధర్మం, న్యాయం, నిజం పక్కనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూతో ఆర్. టీవీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడింది. మనుగడ కోల్పోతున్నామన్న భయంతోనే సీఎం జగన్ పై ముప్పేట దాడి చేస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. -
నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
బాగా చదివే విద్యార్థులను వెన్నుతట్టి...ప్రోత్సహిస్తే ..మరింతగా వారు రాణిస్తారు..ఆ విద్యార్థుల ప్రతిభకే ప్రభుత్వం పట్టం గడుతూ... దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు వారికి చేయూతనందిస్తుంటే...వారి తల్లిదండ్రులే వేనోళ్ల కొనియాడుతున్న అపురూప దృశ్యం ఈ రోజు నవ్యాంధ్రలో అపూర్వంగా కనిపిస్తోంది.. రామోజీరావుకు ఒక్కరికే విద్యారంగ ప్రగతి నచ్చడం లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ పచ్చమద్దతుదారుకు ఒంటిపై తేళ్లూ జెర్రులు పాకుతున్నట్లుగా ఉంది... పచ్చపార్టీ కొమ్ముకాయకపోతే తనకు రోజు గడవదు...పచ్చను రోజూ ఏదోలా పైకి లేపనిదే తనకు నిద్ర పట్టదు...ఈ మానసిక అల్లకల్లోలంలో మంచినీ చెడుగా చెప్పడం పెద్ద దురలవాటుగా మార్చుకున్నారు...శనివారం నాటి ఈనాడులో తన పిచి్చని, దౌర్భాగ్యాన్నంతా రంగరించి ‘ఈ చదువులు మాకొద్దు మామా’ శీర్షికన ప్రచురించిన కథనం ఇలాంటిదే...విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడమంటే నాణ్యమైన విద్యను నేరి్పంచడం...వారి భవిష్యత్తుకు జీవితకాల భరోసా ఇవ్వడం...ఇవేవీ చంద్రబాబు పద్నాలుగేళ్లలో చేయలేక, చేవలేక చతికిల పడితే కేవలం అయిదంటే అయిదేళ్లలో చేసి చూపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి రామోజీరావుకు మహా కంటగింపుగా ఉంది...మా బాబు సాధించలేకపోయిన ఘనతను జగన్ సాధిస్తారా? ...అనే ఈర‡్ష్య అణువణువునా జీరి్ణంచుకుపోయిన రామోజీలోని విషమంతా అక్షరాల్లో కుమ్మరించి, జనంలోకి వదులుతున్నారు...ఈ అవాస్తవాల విషానికి విరుగుడుగా వాస్తవాల ఫ్యాక్ట్చెక్ ఇది...సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నా, ఈనాడు రామోజీరావుకొక్కరికే అవేవీ కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం ఎందుకూ కొరగాకుండా పోయినా, అదే అద్భుతమన్నట్లు వరి్ణంచిన ఈనాడు ఇప్పుడు విద్యారంగం పురోభివృద్ధి సాధిస్తున్నా అవాస్తవాలను అచ్చేస్తోంది.. ఓ రిక్షా కార్మికుడు, వ్యవసాయ కూలీ, వెయిటర్..ఇలా రోజు పనిచేస్తే గానీ పొద్దుగడవని కుటుంబాల బిడ్డలు పెద్ద చదువుల్లో రాణిస్తుంటే అక్కసు వెళ్లగక్కుతోంది.ప్రతిభ ఉంటే ఆ విద్యారి్థకి ఎంత సాయమైనా చేసి చదివించే సంస్కరణలను సీఎం జగన్ ప్రవేశపెడితే.. కుట్ర కథనాలతో అసత్యాలను ప్రచారం చేస్తోంది. సీఎం జగన్ ఉన్నత విద్యను మొత్తం ఉచితం చేసేశారు. టీడీపీ ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు చెల్లిస్తే.. 59 నెలల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18 వేల కోట్లకు పైగా చెల్లిస్తుండటం విశేషం. ఇందులో గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలూ ఉన్నాయి ఉన్నత చదువుల్లో భాగంగా పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తోంది. గతంలో కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇంత మేలు చేస్తుంటే ఎన్నికల్లో చతికిలపడ్డ చంద్రబాబును ఎలాగైనా గద్దెనెక్కించేందుకు తనవంతు దుష్ట యజ్ఞాన్ని చేస్తోంది. ఆరోపణ: వర్సిటీల్లో 76 శాతం పోస్టుల ఖాళీ వాస్తవం: విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం గత ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు, రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినైనా నియమించారా? దీనిపై ఎప్పుడైనా రామోజీరావు చంద్రబాబును ప్రశి్నంచారా? గత ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు నియామక ప్రక్రియపై పలు కేసులు అప్పుడే కోర్టుల్లో నమోదయ్యాయి. వాటిని కోర్టులో పరిష్కరించి గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం వర్సిటీల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీని ప్రకారం 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిని భర్తీ చేస్తే సీఎం జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోనన్న కుట్రలతో చంద్రబాబు వాటిపైనా కోర్టుల్లో కేసులు వేయించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆరోపణ: పీజీ చదివినా ఏం లాభం? ఉద్యోగాలు రావట్లేదు... వాస్తవం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచి్చన తర్వాత ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. కరిక్యులమ్ను పూర్తి స్థాయిలో మార్పు చేయడంతో పాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దారు. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్íÙప్తో చదువు సమయంలోనే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించారు. మైక్రోసాఫ్ట్తో కలిసి అప్స్కిల్లింగ్ చేపట్టారు. ఇవన్నీ చేయడంతోనే డిగ్రీ, బీటెక్లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ యువత ఎంఎన్సీ కంపెనీల్లో భారీ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తోంది.ఇలా చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ ఉద్యోగాలు 2022–23 విద్యా సంవత్సరంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీతోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు సాధించారు. వీటిల్లో మళ్లీ 17 వేల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులూ ఉండటం మరో విశేషం. ఇలా డిగ్రీ స్థాయిలో మంచి ఉద్యోగాలు రావడంతో యువత కుటుంబ ఆరి్థక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ముందుగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.అనంతరం ఆన్లైన్ సరి్టఫికేషన్, దూరవిద్య.. ఇలా వివిధ రూపాల్లో తమకు నచి్చన పీజీ కోర్సులను అభ్యసిస్తున్నారు. కొన్ని కంపెనీలయితే తమ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు అవే ప్రైవేట్ వర్సిటీలతో అనుసంధానమైన పీజీ, ఎంటెక్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే నేరుగా పీజీ చదివే వారి సంఖ్య కొంత తగ్గింది.ఆరోపణ: ఓట్ల కోసమే ఎడెక్స్ కోర్సులువాస్తవం: విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ప్రఖ్యాత ప్రపంచ వర్సిటీల కోర్సులను సీఎం జగన్ ప్రభుత్వం ఎడెక్స్ ద్వారా అందిస్తోంది. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతం సంపాదిస్తారని బలంగా విశ్వసిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ ‘‘ఎడెక్స్’’ ద్వారా 260కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్తో కలిసి 2 వేలకు పైగా కోర్సులను అందుబాటులోకి తెచి్చంది.హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సరి్టఫికేషన్లు పొందేలా ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏకంగా 1.80 లక్షలకు పైగా విద్యార్థులు సరి్టఫికేషన్లు సాధించారు. ఈ ఎడెక్స్ కోర్సులను బయట నేర్చుకోవాలంటే ఒక్కో కోర్సుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.తొలి విడతలో 4 లక్షల మందికి ఈ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. వీరందరూ ఒక్కో కోర్సు చొప్పున చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్ల వ్యయమవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఎడెక్స్ ద్వారా స్థానికంగా అధ్యాపకుల కొరతను అధిగమించడంతో పాటు నాణ్యమైన బోధననూ అందించగలుగుతోంది. ఆరోపణ: డిగ్రీ విద్య అస్తవ్యస్తం... నాణ్యమైన బీఈడీ విద్య లేదు.. వాస్తవం: డిగ్రీలో సింగిల్ మేజర్, మైనర్ విధానంతో విద్యారి్థని ఒక ప్రధాన సబ్జెక్టులో నిపుణుడిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఈ తరహా విద్యా విధానాన్ని అవలంబించడంతోనే అక్కడ ఉన్నత విద్యలో విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్ను అందిస్తోంది. వీటికి తోడు 100కి పైగా మైనర్ సబ్జెక్టుల్లో విద్యార్థులు నచి్చన వాటిని చదువుకోవడానికి అవకాశమూ కలి్పస్తోంది.మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీని (హానర్స్) ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని యూజీసీ సైతం ప్రశంసించింది. చంద్రబాబు హయాంలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, బయటి రాష్ట్రాల విద్యార్థులను నిలువు దోపిడీ చేసేందుకు బీఈడీ, డీఈడీ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మౌలిక సౌకర్యాలు లేకుండా కాగితాలపై విద్యార్థులను చూపించి ప్రజాధనాన్ని దోపిడీ చేసేవారు.వీటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, తన అనుయాయులకు అక్రమార్జన నిలిచిపోవడంతోనే రామోజీరావు ఏడుపు ఎక్కువైంది. ఎంటెక్ కోర్సుల్లోనే ఇదే తంతు నడిచేది. బీటెక్లో సున్నా ప్రవేశాలు ఉన్న కాలేజీల్లో ఎంటెక్ 90–100 శాతం ప్రవేశాలు ఉండేవి. అంటే ఇక్కడ చదువు చెప్పేది ఉండదు. కేవలం ఫీజుల కోసమే కళాశాలల బోర్డులు తగిలించుకుని కనిపించేవి. ఆరోపణ: ఈఏపీసెట్లో 500లోపు ర్యాంకర్లు ఏపీలో చేరడం లేదు.. ప్రతిభావంతులు బయటికి వెళ్లిపోతున్నారు.. వాస్తవం: ఈఏపీసెట్లో టాప్ 500 లోపు ర్యాంకర్లు కచి్చతంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కచి్చతంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్లోనూ అర్హత సాధిస్తున్నారు. అలాంటప్పుడు వారు జాతీయ వర్సిటీలను కోరుకోవడంలో తప్పేముంది. వారు మినహా ఏపీలో మిగిలిన విద్యార్థులు ఇంజనీరింగ్ చేరుతున్నారు కదా. వీరిలో నుంచే దాదాపు అర కోటికిపైగా ప్యాకేజీలు పొందుతున్న విద్యార్థులు ఏటా కనిపిస్తున్నారు. మరి వీరంతా ఈనాడు దృష్టిలో ప్రతిభావంతులు కాదా? ఆరోపణ: నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు చూపు? వాస్తవం: చంద్రబాబు హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచి్చంచాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. సీఎం జగన్ మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను అందిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కనీ్వనర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. రెండేళ్లలో 7 వేల మంది వరకు విట్, ఎస్ఆర్ఎం, మోహన్బాబు, సెంచూరియన్ వంటి ప్రైవేటు వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. -
బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునరి్నర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు » రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. » అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచి్చంది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. » ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చిoది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. » ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. » ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. » ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధారి్మక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. -
చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
వాహనాల్లో తుపాకులు... చేతుల్లో కర్రలు, రాళ్లు, తాగి ఖాళీ చేసిన బీరు బాటిళ్లు... ఇవన్నీ పట్టుకుని ప్రాజెక్టులు చూడటానికి ‘యాత్ర’గా వెళ్లారంటే నమ్మగలమా? వీళ్లు ఎలాంటి యాత్రకు ప్లాన్ చేస్తున్నారో తెలియటం లేదా? గుంపును నడిపిం చే నాయకుడు ఆవేశంతో... ‘‘తరమండిరా నా కొడుకుల్ని’’ అంటూ ఎదుటివాళ్లను కొట్టమని రెచ్చగొడుతుంటే దాన్నేమనుకోవాలి? పైపెచ్చు... ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండ్రా నా కొడకల్లా రా..’’ అని తన బావమరిది సినిమాల్లో రెచ్చిపోయినట్లుగా 73 ఏళ్ల చంద్రబాబు నాయుడు రెచ్చిపోయాడంటే ఏమనుకోవాలి? ఆయన మాటలతో రెచ్చిపోయి పరుగులు తీస్తూ ఎదుటి వ్యక్తులపై రాళ్ల దాడికి తెగబడ్డ తెలుగుదేశం రౌడీ మూకలు ఏం యాత్ర చేస్తున్నట్లు? నిరసన తెలపటానికి నల్ల జెండాలతో వచ్చిన 20 మంది కూడా లేని వైఎస్సార్ సీపీ కార్యకర్త లను తరమటంతో పాటు పోలీసులను రాళ్లు విసిరి గాయపరిచిన వారిపై కేసు పెట్టడం తప్పా? అన్నమయ్య జిల్లా ‘అంగళ్లు’ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎవరు ఎవరిపై హత్యాయత్నం చేశారో తెలియటం లేదా? మరి ఈ ఘటనలోకెమెరాల సాక్షిగాకార్యకర్తల్నిరెచ్చగొట్టివిధ్వంసానికిపాల్పడినచంద్రబాబునాయుడిపై కేసు పెట్టడం తప్పెలా అవుతుంది? దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ కోణంలోనే చూసి... ‘వైకాపాజులుం’ అంటూ రాసిన మీ కలానికి జోహార్లు రామోజీరావు గారూ!!. మీ పాత్రికేయానికి 50 ఏళ్లు నిండుతున్న తరుణంలో మీరు కొత్త లోతులకుదిగజారిపోతున్నారని అర్థం కావటం లేదా? ఏది నిజం?పుంగనూరులో మరీ దారుణం. అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా లేరు. ఉన్నదల్లా పోలీసులే. వారు కూడా బందోబస్తు కోసం పుంగనూరు ఊళ్లోకి వెళ్లే రోడ్లకు బారికేడ్లు పెట్టి... ఆ బారికేడ్ల వెనక నిలుచున్నారు. ఇక చంద్రబాబు నాయుడి మూకకు ఆ ఊళ్లోకి వెళ్లాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్లు అనుమతి తీసుకున్న రూట్ మ్యాప్లో... పుంగనూరు బైపాస్ మీదుగా వెళ్లిపోవాలి తప్ప పుంగనూరు ఊళ్లోకి వెళ్లటమనేది లేదు. అందుకే పోలీసులు అక్కడ బందోబస్తుగా నిలుచున్నారు. అలాంటి చోట వెళుతూనే... దూరం నుంచే పోలీసులపైకి రాళ్లు, బీరు బాటిళ్లు విసురుతూ వారిని గాయపరిచిందెవరు? ఉద్దేశ పూర్వకంగా దాడి చేసి... ఏకంగా 47 మంది పోలీసుల్ని రక్తం వచ్చేలా రాళ్లతో కొట్టిందెవరు? ఒక కానిస్టేబుల్ కంటి చూపు కూడా పోయింది కదా!!. ఇది హత్యాయత్నం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఉసిగొల్పడం వల్లే కదా... వారంతా పోలీసుల పైకి రాళ్లతో విరుచుకుపడ్డారు!!. ఆ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయటంతో... టీడీపీ మూకలు కూడా తాము తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో ఎదురుదాడికి దిగాయి. చంద్రబాబు నాయుడు దాడులకు ప్రేరేపించటంతో పాటు... దగ్గరుండి రెచ్చగొడుతూ దాడులు చేయించటం... ఆయన సమక్షంలోనే మొత్తం దాడులు జరగటం... ఇదంతా కుట్ర కాక మరేంటి? చంద్రబాబుపై కేసు పెడితే తప్పేంటి రామోజీరావు గారూ? అసలు ముందే దాడులు చేయాలన్న ప్రణాళిక లేకుంటే తెలుగుదేశం నేతల వాహనాల్లో తుపాకులు ఎందుకున్నాయి? కర్రలు, రాడ్లు ఎందుకు వెంట తెచ్చుకున్నారు? చేతుల్లో రాళ్లు సిద్ధంగా ఉన్నాయంటే అర్థమేంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి రామోజీరావు గారూ? చంద్రబాబు టీడీపీ గుండాలను ఉసిగొల్పిన వీడియోలు వైరల్... డీఎస్పీని ఉద్దేశించి ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆరి్టస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు చంద్రబాబు. తనను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు కూడా. ఇంకా.. ‘దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి రక్షణలో ఉన్నా. ఏయ్ పోలీస్... బట్టలిప్పు. రోషం లేని జీవితం. మీ పతనం చూసేవరకు వెంటపడతా’ అంటూ పుంగనూరులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఆడియో, వీడియో సాక్షాలతో సహా బయటపడ్డాయి. చంద్రబాబు వైఖరిని చూసి జనం ఛీకొట్టడమే కాదు... ఆయన అడ్డంగా దొరికిపోయాడు కనక పోలీసులు తననే ఏ–1గా పెట్టి కేసు నమోదు చేశారు. అంతటా తనకు ప్రతికూలత పెరుగుతుండటంతో... సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తనపైనే హత్యాయత్నం జరిగిందని, అలాంటిది తనపైనే కేసు పెట్టడం ఏంటని కొత్త రాగం అందుకున్నారు. అందుకే.. రామోజీరావు సైతం తన బాబుకు మద్దతుగా సంఘటన జరిగిన నాలుగు రోజుల తరవాత... అంతా వైఎస్సార్ సీపీ కార్యకర్తలే చేశారని, ఎదురు కేసులు పెడుతున్నారని కొత్త కథనం అందుకున్నారు. ఇదంతా చంద్రబాబు మాస్టర్ ప్లాన్లో భాగమేనని అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి? అయినా సాక్ష్యాలతో దొరికిపోవడం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓట్ల కోసం కోట్లు లంచాలిచ్చిన కేసులో చంద్రబాబు ఇలానే ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూ అడ్డంగా దొరికిపోయిన వ్యవహారం ఎవరికీ తెలియంది కాదు. ఇక అంగళ్లు, పుంగనూరులో బహిరంగంగానే పోలీసులపై దాడులు చేయాలని ఆయన తమ కార్యకర్తలను ఆదేశించారు. మరి హత్యాయత్నానికి ప్రేరేపించిన వ్యక్తిపై కేసు పెట్టరా? చట్ట ప్రకారం పోలీసులు కేసు పెడితే అంతగా పెడబొబ్బలు పెడితే ఎలా...! చంద్రబాబు మీకు ఎక్కువ కావచ్చు. కానీ చట్టానికి అతీతుడు కాదు. అంతా చంద్రబాబు పన్నాగమే... రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ కరువవుతున్న టీడీపీకి... లేని సానుభూతి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రపన్నారన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సాగునీటి ప్రాజెక్టుల పేరిట తాను చేపట్టే యాత్రలో విధ్వంసం సృష్టించాలనేది ఆయన పన్నాగం. ముందుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో అంగళ్లు సర్కిల్కు వద్దకు చంద్రబాబు చేరుకోగానే టీడీపీ మూకలు కేకలు వేస్తూ... తొడలు చరుస్తూ కర్రలు, బీరు బాటిళ్లు, రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డాయి. దాంతో పోలీసులతో సహా పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో చంద్రబాబు శాంతించ లేదు. తన వాహనం నుంచే ప్రసంగిస్తూ ‘పుంగనూరులో ఓ పుడింగి ఉన్నాడు.. పదండి అక్కడ తేల్చుకుందాం’ అని టీడీపీ నేతలు, కార్యకర్తలతో అన్నాడు. పుంగనూరులో విధ్వంసానికి అప్పటికే ‘అన్నీ’ సిద్దం చేసుకునే ఆయన ఆ మాటన్నారు. 2 వేలమందికిపైగా టీడీపీ రౌడీలు మాటువేశారు. అప్పటికే కృష్ణదేవరాయ కూడలికి సమీపంలో సిద్ధంగా ఉంచుకున్న రాళ్లు, మద్యం బాటిళ్లు, బీరు బాటిళ్లు, గుండ్రటి టపాసు బాంబులును గట్టిగా విసిరే బాధ్యత కొందరికి అప్పగించారు.ఒకరిద్దరు పోలీసులు చనిపోయినా పర్వాలేదు... పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపే పరిస్థితిని క్రియేట్ చేయాలన్నది బాబు లక్ష్యం. పోలీసు కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలకు విఘాతం కలించాలన్నది అసలు పన్నాగం. అందుకే రూట్ మ్యాప్లో లేకపోయినా సరే పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని పట్టుబట్టారు. ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉండే చంద్రబాబు పర్యటన రూట్ను ముందే ఖరారు చేస్తారు. ఆ మేరకు ఆ రూట్ను భద్రతా బలగాలు పరిశీలించి క్లియరెన్స్ ఇస్తాయి. అదే రీతిలో టీడీపీ నేతలు ముందుగా ఇచి్చన దరఖాస్తు మేరకు పుంగనూరు బైపాస్ నుంచి యాత్రకు అనుమతినిచ్చారు. ఆ విషయాన్ని ఎన్ఎస్జీ కార్యాలయానికి కూడా తెలిపారు. కానీ చివరి నిముషంలో ఆ రూట్ కాకుండా పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని చంద్రబాబు ఎందుకు పట్టుబట్టారు? అదీ తనకు భద్రత విధుల్లో ఉండే ఎన్ఎస్జీ కమాండోలకు ఎలాంటి సమాచారం లేకుండా? ఎందుకంటే పుంగనూరులో అయితే యథేచ్ఛగా విధ్వంస కాండ సృష్టించవచ్చనేది కుతంత్రం. ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిఖార్సైన నిజాలు. పోలీసులు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవటం వల్లే పరిస్థితి చేయిదాటిపోకుండా ఉందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కానీ ‘ఈనాడు’కు ఇవేవీ పట్టవు. ఎందుకంటే దానికి నిజాలతో పనిలేదు. బాబు కోసం పనిచేస్తే చాలు. పోలీసులను రక్తమోడేలా కొట్టారు... ఒకరి కన్నుపోగొట్టారు చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ రౌడీ మూకలు అంగళ్లులో సృష్టించిన విధ్వంస కాండా అంతా ఇంతా కాదు. ఏకంగా ముందస్తు కుట్రతోనే తెచ్చుకున్న రాళ్లూ, కర్రలు, బీర్ సీసాలతో పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఈ పెనుదాడిలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయారు. టీడీపీ అల్లరి మూకల రాళ్లవర్షంతో గాయపడిన మహిళా పోలీసులు హాహాకారాలు చేయడం అక్కడున్న అందరినీ కలచివేసింది. చాలా మంది ఖాకీ దుస్తులు రక్తంతో తడిసి ఎర్రబారటం దాడి తీవ్రతకు నిదర్శనం. టీడీపీ రౌడీల రాళ్ల దాడితో రణ«దీర్ అనే కానిస్టేబుల్ కన్ను పోయింది. మరో కంటికి ఆపరేషన్ చేస్తేగానీ ఏమీ చెప్పలేమన్నది వైద్యుల మాట. ఇవన్నీ వీడియోలు, ఫొటోలతో సహా బయటపడినా... ‘ఈనాడు’ మాత్రం ఎవరిపై దాడి చేశారు...? ఎవరు గాయపడ్డారు?...అంటూ నంగనాచి కబుర్లు చెప్పడం పాత్రికేయానికి పట్టిన ఖర్మ కాక మరేంటి? -
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో..ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగావాస్తవం: మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. ఆరోపణ: సీఎం యాప్ సిగ్గు..సిగ్గువాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారువాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయివాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు. జీఎల్టీ ఖర్చులను కూడా భరిస్తూ.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. -
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సాక్షి, అమరావతి : అసత్యాలను అక్షరాలుగా పేర్చడంలో ఆరితేరిన రామోజీరావు అనేకానేక అబద్దల కథనాలతో ఈనాడును నింపేస్తున్నారు. రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమలపైనా విషం చిమ్ముతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా, లేని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గతంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి వాటిపై భారం వేశారంటూ పచ్చి అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. నిజానికి మార్ట్గేజ్ బాండ్కు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో ఎటువంటి మార్పు లేదు. గతంలో ఉన్న ఛార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయినా 25 రెట్లు పెరిగిందని అబద్దాలు ప్రచురించేశారు. ఎక్కడ ఏ పరిశ్రమకు ఎలా పెరిగిందో మాత్రం చూపలేకపోయారు. దాన్నిబట్టే ఈనాడులో అచ్చేసింది పచ్చి అబద్ధమని తేలిపోయింది.ఆ రెండింటికీ తేడా తెలియదా?డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకి, మార్ట్గేజ్ బాండ్కి తేడా తెలియకుండా రామోజీ అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రుణాలు పొందినప్పుడు ఇచ్చే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్కు మాత్రమే వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. మ«ద్య తరహా పరిశ్రమలకు ఎప్పుడూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు లేదు. మధ్యతరహా పరిశ్రమ రూ.5 కోట్లు రుణం తీసుకుంటే దాని మార్ట్గేజ్ బాండ్కి స్టాంప్ డ్యూటీగా 0.5 శాతం చొప్పున 2.5 లక్షలు చెల్లిస్తున్నారనడం పూర్తి అవాస్తవం. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ని మార్ట్గేజ్బాండ్గా ఊహించుకుని దానికి 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాలనే కాకి లెక్క వేసి ప్రజలను మాయ చేయాలనేది రామోజీ ప్రయత్నం. ఒకవేళ ఏదైనా పరిశ్రమ తీసుకునే ఎన్ని కోట్ల రుణానికైనా డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకు చెల్లించే స్టాంప్ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంపు డ్యూటీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్కు వర్తించదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చట్టం ప్రకారం వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ కడితే సరిపోతుంది. 25 రెట్ల భారం ఎక్కడ వేసినట్లు? ఈ కనీస పరిజ్ఞానం కూడా రామోజీకి లేదు.వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజలు, పరిశ్రమలకు అనుకూలంగా అనేక మార్పులు జరిగాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో పాటు ఈ–స్టాంపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా గతంలోకంటే సులభంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల సేవలు పొందుతున్నారు. ఇలాంటి అంశాలను తప్పుదోవ పట్టించే క్రమంలో రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలపై రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో బాదేస్తున్నారంటూ ఒక కల్పిత కథనాన్ని ప్రచురించారు. -
రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్కు కేంద్రం నుంచి ఆమోదం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోదముద్రా పడింది. ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు. -
పౌర సమాజం మేల్కోవాలి !
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది . కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా.. చంద్రబాబు కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా చావో రేవో అన్నట్లుగా వైఎస్సార్సిపి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నిత్యం నీతులు వల్లించే రామోజీ ఇప్పుడు విలువలను విడిచి చంద్రబాబు కోసం గారడీలు చేయడం దీనికి పరాకాష్ట.నిజానికి రామోజీ మొదటి నుండీ వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే పాతరోజుల్లో నగ్నంగా కనిపించకుండా ముసుగు వేసుకొని టీడీపీకి కొమ్ముకాసేవాడు. ఇప్పుడు ఈ ముసుగులన్నీ తొలగించి నగ్నంగానే విచ్చలవిడిగా అన్ని కట్టుబాట్లు గాలికొదిలేసి పుఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నాడు. ఈనాడు పత్రికను చూస్తే.. అవసానదశలో కూడా రామోజీ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో అని ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకు, నా సొంత అనుభవాన్నే తీసుకోండి. ఎటువంటి ఆధారాలూ లేకుండా "సీబీఐ వెతుకుతున్న నిందితుడు" అనే హెడ్లైన్ పెట్టి ఈనాడులో మూడ్రోజులు అడ్డమైన రాతలు రాయడం .. రామోజీ దిగజారుడు తనానికి పరాకాష్ట. విచిత్రంగా అసలు కేసు ఏమిటి? అది నిజంగా ఇంకా వుందా లేదా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో వుంది? నోటీసులు ఇచ్చారా లేదా? ఇస్తే ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ఆ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? ఇలాంటివేవీ ఆ మూడ్రోజుల రాతల్లో ఎక్కడా కనిపించలేదు. కనీసం కేసు తాలూకు వివరాలు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు .లుక్ అవుట్ అంటే ఏమిటి ? ఇంటర్పోల్ అంటే ఏమిటి? అవి ఏ ఏ దేశాలలో ఏ విధంగా పనిచేస్తాయో అన్న కనీస అవగాహన లేకుండా .. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది కేసు చేధించినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధాన వార్తగా అచ్చేశాడంటే .. రామోజీ ఎంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. పేరు మార్చానంట... వేషం మార్చానంట. సినిమా వాళ్ళు కూడా ఇంత పకడ్భందిగా స్టోరీ అల్లలేరు. ఎవరో ఇచ్చిన స్టోరీని కనీసం నిజానిజాలు నిర్దారించుకోకుండా యధాతధంగా అచ్చేసి రామోజీ శునకానందం పొందటం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు.పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరుతోనే వున్నాను, వయస్సుతో వచ్చిన మార్పులు తప్పితే వేషంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. జుట్టు ఊడిపోతే విగ్గురాజు లాగా విగ్గు ఎందుకులే అని స్టయిలిష్గా ఫుల్ షేవ్ చేస్తాను . నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయాలు తెలుసు. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి నోటీసులు లేవు . గుండుతో ఉంటే ఎయిర్పోర్టులో వదిలేస్తారా ? రామోజీకి మన వ్యవస్థల మీద ఎంత చిన్న చూపు వుందో అర్థం చేసుకోండి.నా మీద వార్త రాస్తున్న సమయంలోనే ప్లాన్ లో భాగంగా నా ఫేస్బుక్ అకౌంట్ మీద రిపోర్టులు కొట్టించి 24 గంటలు బ్లాక్ అయ్యేలా కుట్ర పన్నారు. పైగా "చూశారా, అకౌంట్ కూడా క్లోజ్ చేసాడని" అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు . నేను ఫేస్బుక్కి ఛాలెంజ్ ఆప్షన్ పెట్టి అకౌంట్ను వెనక్కి తెచ్చుకొని పోస్ట్ పెట్టేవరకూ యెల్లో మీడియా అంతా చెలరేగిపోయింది.చిన్నప్పటి నుండీ పత్రికల్లో రాతలకి, రోత రాజకీయాలకి , ఎన్నికలప్పుడు ప్రచారం చేసే పుకార్లకు అన్నిటికీ అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి రామోజీ రాతలు చూసి మనకేదో పబ్లిసిటీ వచ్చిందిలే అని నవ్వుకున్నాం కానీ ... అదే నా స్థానంలో గీతాంజలి లాంటి అభాగ్యులు వుంటే అలాంటి వార్తలకు ఎంతమంది తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు.? ఒకపక్క సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ వార్తలకే ప్రాణాలు తీసుకొంటుంటే .. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో కధనాలు వస్తే ఎంతమంది తట్టుకొని నిలబడగలరు?ఇదే విషయమై మొన్న ఈనాడులో పనిచేసిన పాతతరం జర్నలిస్టులు కలిసినప్పుడు చర్చకి వస్తే వాళ్ళు చెప్పిన గత సంగతులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం .. రామోజీ మాట వినని ప్రభుత్వ అధికారులమీద , వివిధ వ్యవస్థలలో ఉన్న అనేకమంది ప్రముఖుల మీద , ఆఖరికి సొంత వ్యవస్థలో పనిచేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి దొంగ వార్తలు రాసి దారికి తెచ్చుకొనేవాడట . అలా తన దారికి రానివాళ్ళమీద మరింత విషపూరితంగా రాసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడట. ఇది రామోజీ దగ్గర అనేక సంవత్సరాలుగా దగ్గరగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు చెప్పిన సంగతులు.రామోజీ ఇంత నీచస్థాయికి దిగజారటానికి కారణాలు ఏమిటి ?తరచి చూస్తే కారణాలు సుస్పష్టం. రామోజీ తన జీవితపు అవసాన దశలో ఉన్నాడు. నిజానికి ఈ వయస్సులో ఎవరైనా మరింత హుందాగా గౌరవం పొందాలని .. శత్రువులతో కూడా మంచి అనిపించుకోవాలని తాపత్రయపడతారు. నలభై ఏళ్లుగా తన టక్కుటమారా విద్యలతో ఒంటికి తెల్లని బట్టలు ముసుగుగా తొడిగి మీడియాని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ చెరబట్టాడు, అధికారం అండతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా తనకి ఎదురు తిరిగిన ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ఎక్కించటంలో సఫలీకృతుడు అవ్వటంతో ఇక తనకి ఎదురే లేదని, తానే సర్వాంతర్యామి అనే స్థాయికి చేరుకున్నాడు.చంద్రబాబు వెన్నుపోటు దిగ్విజయం అవ్వటంతో తాను తలచుకుంటే ముఖ్యమంత్రులను దించేయగలననీ .. అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని భయపెట్టగలిగాడు. చంద్రబాబు హయాంలో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఫిలింసిటీకి రూపకల్పన చేసి వేల ఎకరాలని దోచుకొని ఆఖరికి రాష్ట్రం విడిపోవటానికి బీజాలు కూడా వేసాడు. విడిపోయిన రాష్ట్రానికి తన మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం .. ఆ ఊపులోనే దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావటంతో ఇక తనకి తిరుగే లేదని .. తాను దేవేంద్రుడంతటి వాడినని తనకో రాజధాని కావాలనే ఉద్దేశ్యంతో దానికి అమరావతి పేరు పెట్టి ' ఇది మారాజ్యం / మా ఏలుబడిలో ఉన్న రాజ్యం ' అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కుఠిల బుద్ధితో ఎన్నో అరాచకాలు చేసారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఈడ్చికొట్టడం, ఆ తరువాత మార్గదర్శి కేసులో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో రామోజీకి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. మార్గదర్శి ఫైనాన్సియల్ మీద ఎంక్వయిరీ జరుగుతుండడంతో తన మోసాలు బట్టబయలు అవ్వటం ఖాయమని నిర్దారించుకున్నాడు రామోజీ. మార్గదర్శిలో అక్రమంగా డిపాజిట్లు సేకరించటమనేది కేసులో ఒక పార్శం మాత్రమే. వాస్తవానికి నిజమైన డిపాజిట్ దారులు 10 శాతం మంది మాత్రమే, మిగతా డబ్బంతా చంద్రబాబు బినామీదారులే... నల్ల డబ్బుని .. ఎల్లయ్య, పుల్లయ్య పేరులతో డిపాజిట్ దారులుగా రికార్డులు సృష్టించి మార్గదర్శిలో దాచుకున్నారు. అందుకే ఫిర్యాదు ఇచ్చే వాళ్లు కనిపించరు. ఎందుకంటే అక్కడ ఉన్నది 90 శాతం ఫేక్ డిపాజిట్ దారులే. కేసు ముందుకి వెళ్లే కొద్దీ ఈ అసలైన ఈ విషయం బయటకొస్తుంది. వీటన్నిటి నుండి రామోజీ తప్పించుకోవటం అసంభవం.రామోజీకి ఇప్పుడు 88 ఏళ్ళు. జీవితపు అవసాన దశలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరణిస్తే శాశ్వత కీర్తి వస్తుంది. ఎవరైనా అదే కోరుకొంటారు. కానీ రామోజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది . అందుకే రామోజీ కంపించిపోతున్నాడు. కేసులలో తనకి శిక్ష పడటం ఖాయమని.. సమాజానికి తన నిజ స్వరూపం బట్టబయలు అవ్వటంతో పాటుగా కేంద్రం ఇచ్చిన పద్మవిభూషణ్ కూడా తిరిగి తీసుకుంటారని .. ఇది దేశంలో మరెవ్వరికీ జరగని ఘోరమైన అవమానమని రామోజీ భయకంపితులవుతున్నాడు. అవమానభారంతో మరణిస్తే ఇన్ని రోజులు తన టక్కుటమారా విద్యాలతో నిర్మించిన సామ్రాజ్యం , సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కుప్పకూలిపోవటం ఖాయమని , రామోజీ అనేది ఒక విషపురుగుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందనే ఆందోళనలో రామోజీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు .ఇదంతా తప్పించుకోవాలంటే రామోజీ ముందున్న ఏకైక మార్గం మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం . అదొక్కటే రామోజీ ముందున్న పరిష్కారం . అందుకోసమే ఎన్నడూ లేనంతగా దిగజారి విషం చిమ్ముతున్నాడు . రాజకీయపార్టీల కంటే కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తూ పేపర్ మొత్తాన్ని విషంతో నింపేస్తున్నాడు. గడచిన కొద్ది నెలలుగా ప్రధాన శీర్షికలని గమనించండి. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా ప్రభుత్వం మీద మీద ఊహించనంత స్థాయిలో విషం చిమ్ముతూ తాను ఎంత ఆందోళనలో ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాడు. విషయం చిన్నదా, పెద్దదా? నిజమా, అబద్దమా? అనే దానితో నిమిత్తం లేకుండా ఏదో రకంగా ఎదుటి పక్షానికి నష్టం చేయాలి .. ఈనాడు పరువుపోయినా ఫరావాలేదు .. కొద్దిమంది నమ్మినా అంతే చాలు .. అనే తరహాలో సిగ్గు విడిచేసి పుంఖానుపుంఖాలుగా వార్తలని వండి వారుస్తున్నాడు .అందుకే పౌర సమాజం మేల్కోవాలి , నిజాలని గ్రహించి సమాజపు భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. దానికి ఒక తేదీ ఉంది. జూన్ 4, 2024.శివ అన్నపురెడ్డి, అమెరికా -
రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్
-
కాల యముళ్లు
-
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?ఏది నిజం..?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి.ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు? -
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గురించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మనవళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగలరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్నమాటలను తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహితుడు పడుకుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు. -
అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆప్యాయత చూపిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆత్మస్థైర్యం పెరుగు తుంది. గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారి ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది.ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారు. ఆరు నూరైనా ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. ప్రధాని మోదీ సమక్షంలో ఇలా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఒక్క రిజర్వేషన్లే కాదు.. ఎన్ఆర్సీ, సీఏఏతో పాటు ఏ అంశంమైనా సరే ముస్లిం మైనార్టీల మనోభావాలకు, ఇజ్జత్, ఇమాన్కు అండగా నిలబడతాం. 175 అసెంబ్లీ సీట్లకుగానూ 4 శాతం అంటే ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి పొలిటికల్ రిజర్వేషన్లు కూడా కల్పించిన ఏకైక పార్టీ మీ బిడ్డది మాత్రమే. మైనార్టీలకు ఏనాడైనా మంచి చేసిన చరిత్ర చంద్ర బాబుకు ఉందా? ఎన్ని జన్మలకైనా వస్తుందా? చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ.– ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి కర్నూలు/సాక్షి, అనంతపురం/సాక్షి ప్రతినిధి, కడప: ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న వాటి గురించి కాకుండా కేవలం చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ, రామోజీరావు లాంటి దుష్ట చతుష్టయానికి ఏం కావాలి? అని మాత్రమే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఏపీకి వచ్చిన ఢిల్లీ పెద్దలంతా మన రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించేలా ఎలాంటి ప్రకటన చేయకుండా నాలుగు రాళ్లేసి వెళ్లారని వ్యాఖ్యానించారు. అక్కచెల్లెమ్మల అభ్యున్నతి, అవ్వాతాతల చిరునవ్వులు, సామాజిక వర్గాల వికాసానికి పాటుపడతామని కూటమి నేతలు చెప్పడం లేదని, చంద్రబాబుది పెత్తందార్ల కూటమి అని ధ్వజమెత్తారు. గురువారం కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కొల్లాపురమ్మ టెంపుల్ రోడ్డు వాల్మీకి సర్కిల్, అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..దేశంలోనే అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే..చంద్రబాబు ఈమధ్య ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షాతో ఏపీలో ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడు. చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నప్పుడు ప్రజలంతా ఏం ఆశించారంటే.. పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను ఇప్పటికైనా ఇస్తారేమో! ఈ మాట వారి నోటి నుంచి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూశారు. ఆ ప్రకటన చేస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మాట ఒక్కటీ మాట్లాడకుండా... చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి? దత్తపుత్రుడికి ఏం కావాలి? వదినమ్మకు ఏం కావాలి? దుష్ట చతుష్టయానికి ఏం కావాలి? అని వీళ్లకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి, మన మీద నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. అదే మోదీ గారు మొన్నటిదాకా ఇదే చంద్రబాబును ‘ఇంతటి అవినీతిపరుడు దేశ చరిత్రలోనే ఉండడు’ అని చెప్పిన నోటితోనే ఇవాళ వారి కూటమిలో చేరినందుకు పొగిడి వెళ్లిపోయారు! మరి దీనివల్ల రాష్ట్రంలో రైతులకుగానీ, అక్కచెల్లెమ్మలకుగానీ, అవ్వాతాతలకుగానీ, పిల్లలకుగానీ, ఏ ఒక్కరికైనా లాభం జరిగిందా? 2014 హామీలపై మాట్లాడని కూటమి నేతలుమరి దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ వీరంతా 2014లో ఇచ్చిన మేనిఫెస్టోను చూపించి ఇదిగో ఇవన్నీ చెప్పాం.. ఆ ముఖ్యమైన హామీలను నెరవేర్చాం!! అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కూటమి అంటారు.. డబుల్ ఇంజన్ అంటారు! 2014లో ఇదే ముగ్గురి ఫొటోలతో, చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికీ పంపిన పాంప్లెట్, మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలనే అమలు చేయలేకపోతే ఇక డబుల్ ఇంజనూ... డబుల్ ఇంజనూ! అని ఎందుకు అంటున్నారు? అంటరానితనంపై యుద్ధం మిగిలే ఉంది!ఈ పెత్తందార్ల కూటమి అంతా పేద పిల్లలకు గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. మొన్న వచ్చి చంద్రబాబును పక్కన పెట్టుకుని మాట్లాడిన అమిత్ షా, ఢిల్లీ పెద్దలను అడుగుతున్నా. బాబును, దత్తపుత్రుడినీ అడుగుతున్నా. వీళ్లకు మద్దతు ఇస్తున్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5నూ అడుగుతున్నా. మీ పిల్లలు, మీ మనవళ్లు.. మీవాళ్లలో ఏ ఒక్కరినైనా కూడా ఇంగ్లిష్ మీడియం బడుల్లో కాకుండా తెలుగు మీడియంలోగానీ లేదా మీ స్థానిక భాషలోగానీ చదివిస్తున్నారా? మన గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట! ఇటువంటి పెత్తందారీ భావజాలంతో వాళ్లు మన ప్రజల ముందుకు వచ్చి ఓటు వేయమని అడుగుతున్నారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే పేద పిల్లలకు, గవర్నమెంట్ బడుల్లో చదువుతున్న ఆ పిల్లలకు ఒక్కరికైనా ఇంగ్లీష్ మీడియం నేర్పుతారా? అందుకే ఆలోచన చేయండి. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చేయాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.మోసపూరిత హామీలతో బాబు మేనిఫెస్టోమరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. రాబోయే ఐదేళ్లూ ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలివి. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్లీ మోసపోవడమే! చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే. ఆయన జీవితమంతా మోసాలు, అబద్ధాలే. అధికారం దక్కిన ప్రతిసారీ పేదలను మోసం చేశాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మోసపూరితంగా ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం లేదు. ఎన్నికల తరువాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాలను మారుస్తూ 99 శాతం వాగ్దానాలను చిత్తశుద్ధితో అమలు చేశాం. గతంలో రాష్ట్రంలో కేవలం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాడు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వివిధ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు పారదర్శకంగా అందించాం.వ్యవస్థల్లో సమూల మార్పులు..నాడు–నేడుతో బాగుపడిన ప్రభుత్వ పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం, ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు, తొలిసారిగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐటీ దాకా ప్రయాణం, బడులు తెరవగానే విద్యాకానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, పూర్తి ఫీజులు చెల్లిస్తూ విద్యాదీవెన, వసతి దీవెన, కరిక్యులమ్లో సమూల మార్పులు, అంతర్జాతీయ వర్సిటీల నుంచి సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు, తప్పనిసరి ఇంటర్న్షిప్.. ఇలాంటి విద్యా విప్లవాలను గతంలో ఎప్పుడైనా చూశారా? ఇంజనీరింగ్, డాక్టర్, డిగ్రీ లాంటి ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థుల్లో ఏకంగా 93% మంది జగనన్న విద్యా దీవెన అందుకుంటున్నారు. నా అక్క చెల్లెమ్మలు వారి కాళ్లపై నిలబడేలా ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు 31లక్షల ఇళ్లపట్టాలు వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశాం. ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం గతంలో ఎప్పుడైనా జరిగిందా?ముస్లింలపై బాబు కపట ప్రేమ..ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ శపథం చేసింది. అలాంటి పార్టీతో చంద్రబాబు జత కట్టాడు. మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతానంటున్నాడు. మైనార్టీలను మోసం చేసేందుకు డ్రామాలాడుతూ కపట ప్రేమ నటిస్తున్నాడు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఉంటాయా? ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో చెబుతున్నా.. ఆరు నూరైనా నూరు ఆరైనా 4 శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ బిడ్డ జగన్ ఇస్తున్న మాట. వైఎస్సార్ బిడ్డ మాట. ఈ మాట ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు చెప్పగలరా? మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు కొనసాగుతున్నారు? మైనార్టీలపై మీ బిడ్డ జగన్ది నిజమైన ప్రేమ. ఇవాళ ఇక్కడున్న వేలాది మందితోపాటు అందరికీ ఒక్క విషయం చెబుతున్నా.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన ఇచ్చినవి కాదు. ముస్లింలలోనూ ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్, సయ్యద్, మొఘల్కు రిజర్వేషన్లు వర్తించవు. వారిలో పేదవారికి మాత్రమే ఇచ్చారు. అన్ని మతాల్లోనూ బీసీలు, ఓసీలు ఉంటారు. అలాంటప్పుడు రాజకీయ స్వార్థంతో మైనార్టీలను వేరేగా చూసి వారి నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత వరకూ ధర్మం? రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాదా? ఎట్టిపరిస్థితుల్లోనూ రిజర్వేషన్లతో పాటు ఎన్ఆర్సీ, సీఏఏ లాంటి ఏ అంశంలోనైనా ముస్లింలకు అండగా నిలబడతా. ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటా. వారిపై ప్రేమ చూపుతా. ఇళ్ల పట్టాలు, డీబీటీ, షాదీ తోఫాతో పాటు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించాం. నలుగురు ఎమ్మెల్సీలు, నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మైనార్టీ సోదరుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఐదేళ్లు నా పక్కనే పెట్టుకున్నా. మైనార్టీ సోదరికి శాసనసభ మండలి ఉపాధ్యక్షురాలిగా అవకాశం కల్పించాం. మైనార్టీ సబ్ప్లాన్ బిల్లు తేవడంతో పాటు ప్రతీ సందర్భంలోనూ చిత్తశుద్ధి చాటుకున్నాం.రైతన్నలకు తోడుగా..గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూట 9గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ లాంటి పథకాలను తీసుకొచ్చాం. రైతన్నలను ఇంతగా ప్రేమించే ప్రభుత్వం కానీ పథకాలు కానీ గతంలో ఉన్నాయా? స్వయం ఉపాధికి అండగా ఆటోలు, టాక్సీలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్ననేస్తం, మత్స్యకార భరోసాతో పాటు చిరువ్యాపారులకు తోడు, చేదోడు అందించాం. లాయర్లకు లానేస్తం ఇచ్చాం.. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా?ఆరోగ్యం.. పౌరసేవలువైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని విస్తరించి ఉచితంగా సేవలందిస్తున్నాం. విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా ద్వారా అండగా నిలిచాం. గ్రామంలోనే విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష తెచ్చాం. ప్రజల ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఉందా? ఇవాళ ఏ గ్రామానికి వెళ్లి చూసినా 600 రకాల పౌరసేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం కనిపిస్తోంది. 60–70 ఇళ్లకు వలంటీర్ల సేవలు, ఇంటికే రూ.3వేల పింఛన్, రేషన్, పౌరసేవలు, పథకాలు, గ్రామాల్లో అక్క చెల్లెమ్మలకు అండగా మహిళా పోలీసు, దిశ యాప్ లాంటివి గతంలో ఎప్పుడైనా అమలయ్యాయా? ఇవాళ మన గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తున్నాయి. మరి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కటైనా మంచి పని గుర్తుకొస్తుందా? బాబు ఇచ్చే డబ్బులన్నీ మీవే..బటన్లు నొక్కి మీ బిడ్డ మీకు మంచి చేశాడు. ఎలాంటి బటన్లు నొక్కని చంద్రబాబు వద్ద డబ్బులు దండిగా ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులను ఆయన దోచుకున్నాడు. ఆ దోచుకున్న డబ్బులో నుంచి ఓటుకు రూ.2 వేలు, రూ.3 వేలు, కొన్నిచోట్ల రూ.4వేలు కూడా ఇచ్చేందుకు తయారుగా ఉన్నాడు. చంద్రబాబు డబ్బులిస్తే వద్దనకుండా తీసుకోండి. ఎందుకంటే.. ఆ డబ్బు అంతా మనదే. మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. మీకు ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించండి. మీ కుటుంబ సభ్యులతోనూ చర్చించండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తీసుకుని నిర్ణయం తీసుకోండి. ఎవరి వల్ల ఈ మంచి కొనసాగుతుందో గమనించి ఓటేయాలని కోరు™è ున్నా. మంచి చేసిన ఫ్యాను ఇంట్లో¯ó∙ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోకండి. మళ్లీ జగన్ ఉంటేనే ప్రతి నెలా కేలండర్ ప్రకారం పథకాలు మీ చేతికే అందుతాయి. మళ్లీ వలంటీర్లు మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన కొనసాగాలన్నా, బడులు, పేద పిల్లల చదువులు బాగుండాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో మన అభ్యర్థులనే గెలిపించాలి.బాబు హేళన చేస్తే జగన్ ఆత్మస్థైర్యం కల్పించాడు‘నేను ప్రతీ సందర్భంలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ప్రేమను బాహాటంగా ఎందుకు చూపిస్తానో తెలుసా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ప్రేమ చూపిస్తే గ్రామాలు, రాష్ట్రంలో వారికిచ్చే గౌరవం పెరుగుతుంది. వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. ఇది జరగాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ‘నా...’ అనే ఆప్యాయత చూపించాలి. చంద్రబాబును చూస్తే ఇలాంటి ప్రేమ, న్యాయం దేవుడెరుగు! అధికారంలో ఉంటే బడుగు, బలహీన వర్గాలను హేళన చేసి కించపరుస్తూ బెదిరిస్తారు. దారుణమైన మోసాలూ చేస్తారు. 2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612కోట్ల రైతురుణాల మాఫీ జరిగిందా? ⇒ రూ.11,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశారా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం ద్వారా రూ.25 వేలు డిపాజిట్ దేవుడెరుగు కనీసం రూపాయైనా ఇచ్చాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగభృతి ఇచ్చాడా? ఐదేళ్లలో ఏ ఒక్కరికైనా రూ.1.20 లక్షలు ఇచ్చారా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు జరిగిందా?⇒ రూ.10వేలకోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత, పవర్లూమ్స్ రుణాలమాఫీ హామీలు అమలయ్యాయా? ⇒ అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు ఇస్తానని నమ్మబలికి ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మించారా? కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేటలో ఎవరికైనా కనిపిస్తున్నాయా? ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశారు. ⇒ మళ్లీ కూటమిగా మీ ముందుకొచ్చి సూపర్సిక్స్, సూపర్ సెవన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్కారు అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు.రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎం జగన్ అభయంకళ్యాణదుర్గం: కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మంచానికే పరిమితమైన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులుకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అక్కడ స్ట్రెచర్పై ఉన్న శ్రీనివాసులును చూసి సీఎం జగన్ బస్సులో నుంచి దిగారు. నేరుగా శ్రీనివాసులు వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గత ఏడాది నవంబర్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లు బాధితుడు తెలిపాడు. అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ఇప్పటికే రూ.7 లక్షలకు పైగా ఖర్చయిందని కుటుంబ సభ్యులు సీఎం జగన్కు వివరించారు. ఇందుకు సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. శ్రీనివాసులు త్వరలోనే కోలుకొనేలా మెరుగైన వైద్య సేవలకు సిఫారసు చేస్తామని, వైద్య ఖర్చులను భరిస్తామని వారికి భరోసా ఇచ్చారు.రాజంపేటలో 18వ మెడికల్ కాలేజీ.ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని అమరన్న, మిథున్ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్లో అది చేస్తానని మాట ఇస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా, 18వ మెడికల్ కాలేజీ రాజంపేటలో వస్తుంది.ఢిల్లీ దాకా సౌండ్ వినిపించాలి..మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి. మీ బిడ్డ పెన్షన్లు నేరుగా ఇంటికే పంపుతుంటే అడ్డుకున్న వారికి ఆ సౌండ్ వినిపించాలి. అంత గట్టిగా సౌండ్ వినిపించేలా భారీ మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించాలని ప్రార్థిస్తున్నా.ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా?చంద్రబాబు మన జిల్లాకు వచ్చి మూడు ప్రాంతాల్లో మీటింగులు పెట్టాడు. రాయచోటికి వెళ్తే రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్గా కంటిన్యూ అవుతుంది అంటాడు. మదనపల్లికి పోతే మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అంటాడు. రాజంపేటకు వస్తే రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ అంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్మొచ్చా? ఇదే రాజంపేటలో మన గంగిరెడ్డి అన్నకు చెందిన అన్నమయ్య కాలేజీని ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలతో టైఅప్ చేయించి ఒక వర్సిటీగా మీకు అందించాం. పింఛా ప్రాజెక్టు దాదాపు 90 శాతం పనులు పూర్తిచేశాం. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, గాలేరు నగరి కాలువ పనులు రైల్వేకోడూరు వరకు పూర్తి చేయాలన్నా మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి.మన అభ్యర్థులను ఆశీర్వదించండికర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బీవై రామయ్య, ఇంతియాజ్, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకర నారాయణ, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్రెడ్డి, నాకు సొంత తమ్ముడు లాంటి ఎంపీ అభ్యర్థి మిథున్రెడ్డిని గొప్ప మెజార్టీతో మీరంతా ఆశీర్వదించాలని కోరుతున్నా.రాజంపేటలో 18వ మెడికల్ కాలేజీ.ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని అమరన్న, మిథున్ ఇద్దరూ కలసి నాపై ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే టర్మ్లో అది చేస్తానని మాట ఇస్తున్నా. రాష్ట్రంలో ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టగా, 18వ మెడికల్ కాలేజీ రాజంపేటలో వస్తుంది.వైఎస్సార్సీపీకి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతుకర్నూలు(సెంట్రల్): వైఎస్సార్సీపీకి జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు ప్రకటించారు. గురువారం సీఎం జగన్ కర్నూలులోని వైఎస్సార్ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పాల్గొని తమ మద్దతు సీఎం వైఎస్ జగన్కే అని ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. వైఎస్ జగన్ పొలిటికల్ హీరో అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎంగా వైఎస్ జగన్ గెలుపొందడం ఖాయమన్నారు. వైఎస్ జగన్తోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమన్నారు. -
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.కాని జగన్ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్ కల్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి. మొదట వైఎస్సార్సీపీ అంత సీరియస్గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్ కల్యాణ్లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.జగన్ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్!
ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్ఈజెడ్లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్ను జగన్పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్ను అభినందించాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
దొంగలు దొరికారు
-
మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు
సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. ఆఖరికి తన పార్టీ వెబ్సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్ టూ సేమ్! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్ అయితే ‘మీ భూములు జగన్ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్ను అందరికీ షేర్ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్ చేసిన వారికి... ‘దిసీజ్ ప్రైవేట్ వీడియో’ అనే మెసేజ్ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు. గుడ్డలిప్పిన గురుశిష్యులు! కొద్దిరోజులుగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం.సునీల్కుమార్ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు. చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్ రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్ హయాంలో వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు. ఆదరాబాదరాగా అదృశ్యం.. ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్లోని ఈటీవీ ఛానల్లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్ ఛానల్లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్ టైటిలింగ్ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఈటీవీలో ఏం చెప్పారంటే.. భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్ పాస్ పుస్తకంలోగానీ ఆన్లైన్ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిష్టర్లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది. -
మోదీ మాస్టర్ ప్లాన్లో బకరాలైన బాబు, పవన్
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్లు కూడా ముస్లీంల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లే అవుతుంది.వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే యత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్ సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్ను దూషించడానికే యత్నిస్తున్నారు.ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో అబద్దాలు రాస్తున్నారు. జగన్ తన ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్తో పాటు, వైఎస్సార్సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ మరీ రాసుకున్నారు.చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ గ్యారంటీకి చంద్రబాబు, పవన్లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ హామీగా ఉండబోరట. బహుశా ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్లే అయితే, జనాన్ని బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు. -
కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో
సాంబశివుడు.. గోవిందరెడ్డి.. సుబ్బారావు.. ఎవరు వీళ్లంతా?రామోజీరావు రహస్య సంతానమా? లేకపోతే చంద్రబాబు దత్తపుత్రులా? లేని పేర్లను సృష్టించి.. లేని రిజిస్టరులో వీళ్ల పేర్లు వివాదంలో చిక్కుకున్నట్లుగా రాసి పారేసి... లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన ‘ఈనాడు’ను ఏమనుకోవాలి? రాష్ట్రాన్ని రాచపుండులా పీడిస్తున్న రామోజీరావు తన చంద్రబాబు కోసం ఇంకెంత దిగజారుతారు? అసలు అమల్లోకే రాని ‘ల్యాండ్ టైట్లింగ్ చట్టం’ గురించి ఎందుకు జనాన్నింతలా భయపెడుతున్నారు? జనం గనక మాకు వద్దంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ చట్టాన్నయినా తెస్తుందా? అలా తెచ్చిన దాఖలా ఒక్కటయినా ఉందా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన చట్టం ఈ ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్’. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ అన్ని రాష్ట్రాలకూ పంపితే.. ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసి ముసాయిదా చట్టాన్ని చేసింది. కానీ ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ఏవీ ఇప్పటిదాకా విడుదల కాలేదు. అంటే ఈ చట్టం కింద టైటిల్ రిజిస్టరు ఎలా ఉంటుంది? టైటిల్ రిజిష్ట్రారుగా ఎవరిని నియమించాలి? రెవెన్యూ అధికారులనా... లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి జ్యుడీíÙయల్ అధికారులనా? ఇలా ఈ చట్టం అమలుకు సంబంధించి ఉండే సమగ్ర నియమ నిబంధనలేవీ ఇంకా రూపు దిద్దుకోనేలేదు. ఈ రూల్స్ విడుదలయ్యాక వీటిపై గ్రామ స్థాయి నుంచి సభలు నిర్వహించి.. ప్రజల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నియమాలు (రూల్స్) రూపొందిస్తారు. ఆ రూల్స్కు లోబడే చట్టాన్ని అమలు చేస్తారు.ఇవేవీ జరగకుండానే... చట్టం అమలయిపోతున్నట్లుగా, ప్రభుత్వం భూములు లాక్కుంటోందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేయటం ఎంత దుర్మార్గం రామోజీరావ్? అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఒక మాటంటూ ఉంటారు. తాను పోరాడుతున్నది మాయా యుద్ధం చేసే మారీచులతోనని. ఈ ఎల్లో ముఠా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందని, ఎంతటి విపత్తులనైనా సృష్టిస్తుందని. నారా వారిని ఎలాగైనా గద్దెనెక్కించాలని మాయా యుద్ధం చేస్తున్న ‘ఈనాడు’ బుద్ధి... అందుకే ఇపుడు భూ మార్గం పట్టింది. చట్టం రావాలంటే సర్వే పూర్తి కావాలి..మూడేళ్ల కిందట కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించి అన్ని రాష్ట్రాలకూ పంపిన తర్వాత.. నీతీ ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా చట్టానికి రూపకల్పన చేయటంతో పాటు.. రాష్ట్రంలోని గ్రామాల్లో రీ సర్వే చేపట్టింది. నిజానికి వందేళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సర్వే తప్ప.. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమూ భూముల సమగ్ర సర్వే చేపట్టలేదు.కొత్తగా సర్వేయర్లను నియమించి.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తాన్ని మోహరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రీ సర్వే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సర్వే జనరల్ సైతం రాష్ట్రానికి వచ్చి రీ సర్వే చేస్తున్న తీరును ప్రశంసించారు. ఈ రీ సర్వే చేస్తూ... కింది స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న చిన్న వివాదాల కోసం మొబైల్ న్యాయ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పటికి 4 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. మరో 2 వేల గ్రామాల్లో తుది దశలో ఉంది. కాకపోతే రాష్ట్రంలో మొత్తం 17 వేల గ్రామాలున్నాయి. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది.మొత్తం అన్ని గ్రామాల్లోనూ రీసర్వే పూర్తయ్యాక వివాదాలు లేని భూములకు సంబంధించి వాటి యజమానులకు హక్కు పత్రాలు అందజేస్తారు. ఆ హక్కు దారుల వివరాలే చివర్లో టైటిల్ రిజిస్టరులో ఉంటాయి. ప్రజలంతా అంగీకరించి.. ప్రభుత్వం గనక ముందుకు వెళితే ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవటానికి కొన్నేళ్లు పడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కనక... మిగతా రాష్ట్రాలు కూడా రీ సర్వేలు పూర్తి చేసి, ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే.. అప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్టరు నిర్వహించడానికి వీలవుతుంది.కేంద్రం ఆశిస్తున్నది అదే. దీనివల్ల దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడి భూమినయినా కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీలో భూమి కొనుగోలు చేసినా విజయవాడ రిజిస్టరు కార్యాలయంలోనే దాన్ని రిజిస్టరు చేసుకోవచ్చు. పైపెచ్చు ఒక భూమిని ఎక్కడ ఎవరు కొనుగోలు చేసినా... విక్రయించినా, లేక ఆ భూమిపై ఎక్కడ రుణం తీసుకున్నా ఆ వివరాలన్నీ టైటిల్ రిజిస్టరులో నమోదవుతాయి.కాబట్టి రుణం వంటి వివరాలు దాచి మరొకరి దగ్గర రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇదిగో ఇలాంటిది వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదు కనకనే సుజనా చౌదరి లాంటి వ్యక్తులు పారిశ్రామిక వేత్తల ముసుగులో ఒకే పరిశ్రమకు సంబంధించిన భూముల్ని పలు ఆర్థిక సంస్థల దగ్గర తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. చివరకు బ్యాంకుల్ని ముంచేశారు. ఇప్పుడేమో తాను ఆ వ్యాపారాల నుంచి తప్పుకున్నానని, తనకేమీ సంబంధం లేదని శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు.టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ సమగ్రంగా రీ సర్వే జరిపి... వివాదాలేవీ లేవని తేలి్చన మీదట ఆ భూములకు టైటిల్ పత్రాలిస్తారు కనక.. అక్కడి నుంచి ఆ టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం టైటిల్ ఇచ్చాక కూడా ఆ భూమి అసైన్డ్ అనో, డీ పట్టా అనో వివాదం గనక తలెత్తితే ఆ టైటిల్ దారుకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వమే ఆయా భూములకు బీమా చేస్తుంది. బీమా సొమ్మును టైటిల్ దారుకు చెల్లిస్తుంది. ఈ నిబంధన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టే ఈ చట్టం విషయంలో ముందుకు అడుగులు వేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ చెబుతోంది. మోదీతో చెప్పించగలవా బాబూ?ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చంద్రబాబు ముఠా, ఎల్లో మీడియా ఉధృతంగా విష ప్రచారం చేస్తున్నాయి. పత్రికల్లో కథనాలు రాయించటంతో పాటు పనికిమాలిన వ్యక్తులకు లాయర్ల కోటు తొడిగి నిపుణుల ముసుగులో ఎల్లో చానెళ్లలో మాట్లాడిస్తోంది. సోషల్ మీడియాలో అబద్ధాలను జోరుగా వైరల్ చేస్తోంది.వీటిలో ఏ ఒక్క శాతం నిజం ఉన్నా.. ఈ చట్టం కేంద్రానిది కనుక ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, కాబట్టి దీన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని మోదీతో చెప్పించగలవా? మరి అవేవీ చెయ్యలేనపుడు ఎందుకీ విష ప్రచారం? ఎందుకు బీజేపీతో కలిసి పోటీ చేయటం? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి గట్టడమెందుకు? వారు చేస్తున్న చట్టం ప్రజలకు మేలు చేసేది కాదని, దాన్ని తెలుగుదేశం అంగీకరించదని నేరుగా చెప్పలేని నీ బతుకెందుకు? అబద్ధాల పునాదులపై నిరి్మంచుకున్న నీ రాజకీయ కోట పునాదులతో సహా పేలిపోయే రోజు అతి దగ్గరలోనే కనిపించటం లేదా! -
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
-
పచ్చ చిలుకలుగా ఆ మేధావులు.. కళ్లకు గంతలు కట్టిన చంద్రబాబు
ఈ మధ్య కాలంలో తెలుగుదేశం బాకా మీడియా ఈనాడు కొత్త పుంతలు తొక్కి ఏపీ జనాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా మేధావుల పేరుతో కొందరిని తీసుకు వచ్చి, ఇంటర్వ్యూలు అంటూ ఒక తంతు నడిపి, వారితో తమకు కావల్సినవి చెప్పించుకుని ప్రజలను మోసం చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో మేధావులుగా ముద్ర వేసుకున్న కొంతమంది భ్రష్టు పట్టిపోతున్నారు. ఈనాడు రామోజీ పైత్యాన్ని ఈ మేధావుల నోట్లో పెట్టి పచ్చి అబద్ధాలను చెప్పిస్తున్నారు. ఆ మేధావులైనా నిస్సిగ్గుగా ఒక పార్టీ కోసం పనిచేయడం ఏమిటో అర్దం కాదు.ఏ అంశానికైన రెండు కోణాలు ఉంటాయి. వాటిలో ఒకదానివైపే చూసి, రెండో కోణాన్ని వదలివేసి మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మేధావి అవుతారో అర్దం కాదు. ఈనాడు మీడియా నిర్లజ్జగా బట్టలు ఊడదీసుకుని తిరుగుతోంది కాబట్టి, మేధావుల ముసుగులో మరికొందరిని కూడా అలాగే చేస్తోంది. ఇప్పటికే మాజీ ఐఎఎస్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్, జయప్రకాష్ నారాయణ, పీవీ రమేష్ వంటివారిని తమ ప్రయోజనాలకు వాడుకున్న ఈనాడు మీడియా కొద్ది రోజుల క్రితం ఆర్దిక వేత్త పేరుతో మహేంద్రదేవ్ను తెరపైకి తెచ్చి ఆయనతో కొన్ని దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయించి బానర్గా తన పత్రికలో అచ్చేసింది. అది చదివితే వీరు నిజంగా మేధావులా, లేక తెలుగుదేశం కోసం రామోజీ చెప్పినట్లు, కోరినట్లు మాట్లాడే మేతావులా అన్నది తెలుసుకోవడం కష్టం కాదు.లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ కొంతకాలం క్రితం వరకు ఏపీలో విద్య, వైద్య రంగాలలో సంస్కరణలు, అమలు అవుతున్న స్కీములు చాలా బాగున్నాయని మెచ్చుకునేవారు. కానీ ఎన్నికల సమయానికి ఆయనపై రామోజీ ఒత్తిడి బాగానే పనిచేసినట్లుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి జేపీ కూడా యుటర్న్ తీసుకుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించి ఎన్డీఏ కి అనుకూలంగా మాట్లాడారు. అంటే చంద్రబాబు కోసం పనిచేయడం ఆరంభించారన్నమాట. జేపీ ఇంతగా దిగజారి పోయి చివరికి కుల ముద్ర వేయించుకునే దుస్థితికి వస్తారని నేనైతే ఊహించలేదు.ఈనాడు మీడియా కోసం ప్రచారం చేస్తున్న ఈ మేధావులలో ఎక్కువ మంది ఒకే కులం వారు ఉండడాన్ని అంతా గమనిస్తున్నారు. దీనివల్ల చంద్రబాబుకే నష్టం తప్ప ఇంకొకటి కాదు. తాము చేస్తున్నది ఏమిటో వారికి తెలియడం లేదు. తాజాగా మహేంద్రదేవ్ అనే మరో మేధావిని ఈనాడు ముగ్గులోకి దింపి ఆయనను కూడ గబ్బు లేపింది. ఆయన తండ్రి సంజీవదేవ్ చాలా గౌరవమైన వ్యక్తి. ఈయన కూడా పద్ధతిగానే ఉంటారు. కానీ రామోజీ ట్రాప్లో పడి తన ప్రతిష్టను తానే దెబ్బతీసుకున్నారనిపిస్తుంది.ఇంతకాలం టీడీపీ కోసం పనిచేసిన సోకాల్డ్ మాజీ ఐఏఎస్లు చెప్పేదానిని జనం నమ్మడం లేదని మహేంద్రదేవ్ ను ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది. ఆయనను ఇంటర్వ్యూ చేయడం తప్పని ఎవరూ చెప్పరు. కానీ ప్రశ్నలు అడిగిన తీరు, ఆయననుంచి జవాబులు రప్పించుకున్న వైనం చూస్తే, కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ద్వేషాన్ని వెళ్లగక్కడానికి, ఏపీ ప్రజలను మోసం చేయడానికే ఈ ఇంటర్వ్యూని వాడుకున్నారని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.ఏపీలో నిరుద్యోగం తాండవిస్తోందట. ఇది ఒక ప్రశ్న. దానిపై ఆయన అవునంటూ దిక్కుమాలిన సమాధానం. దేశవ్యాప్తంగా ఈ సమస్య లేదా! ఆ మాటకు వస్తే అమెరికా వంటి అగ్రదేశంలో కూడా నిరుద్యోగం ఉంది. అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరానికి వచ్చి చూస్తే అడ్డాలపై పనులు లేని కూలీలు, వందలు, వేల సంఖ్యలో కనిపిస్తారు. ఉద్యోగం కోసం తిరిగే వేలాది మంది యువకులు కనిపిస్తారు. వారిని మోసం చేసి డబ్బులు వసూలు చేసుకునే కంపెనీలకు తక్కువేమీ లేదు. కానీ రామోజీ దిక్కుమాలిన ఆలోచన ఏమిటంటే ఏపీలో మాత్రమే నిరుద్యోగ సమస్య ఉన్నట్లు జనాన్ని నమ్మించాలనే.పోనీ ఆ మాటకు వస్తే 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో నిరుద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదు! ఆయన పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తెచ్చి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా! అప్పుడు ఎందుకు తేలేకపోయారో చెప్పాలి కదా! పరిశ్రమలకు ఆయువుపట్టుగా భావించే ప్రత్యేక హోదాను వద్దన్న చంద్రబాబు నిర్వాకం మాట ఏమిటి? ఇది ఒక అంశం అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు కరోనా సమస్య ఉన్నప్పటికీ, మూడేళ్లలో ఆయన టైమ్లో వచ్చిన పరిశ్రమలు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటి గురించి ఈ మేధావులు పట్టించుకోరు.చంద్రబాబు టైమ్ లో వచ్చిన కియా కార్ల ప్లాంట్ వచ్చింది. అది తమ ఘనత అని బీజేపీ నాయకులు చెబుతారు. అది వేరే విషయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్లో అనేక పరిశ్రమలు వచ్చాయి. వాటిని పట్టించుకోరు. పైగా పరిశ్రమలు తరలిపోతున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరంభించిన ఒక్కో పోర్టు వల్ల రెండువేల మందికి ఉపాధికి కల్పిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న, కుటీర, మధ్య తరహా పరిశ్రమలు మొదలైనవాటిని ప్రోత్సహించడం, స్వయం ఉపాధి కింద లక్షల యూనిట్లు వచ్చిన వైనాన్ని జనం మర్చిపోవాలన్నది ఈనాడు మీడియా కోరిక. దానికి ఈ మేధావులు బాజా వాయించడం దురదృష్టకరం.ఏపీకి పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా అడ్డుకోవాలా అని అడ్డగోలు కథనాల గురించి ఈ మేధావులకు తెలియదు. ప్రభుత్వపరంగా చంద్రబాబు పాలనలో 34వేల ఉద్యోగాలు ఇస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వలంటీర్ల వ్యవస్థ ద్వారా రెండున్నర లక్షల మందికి ఐదువేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. వీటన్నిటిని ఉపాధి కింద పరిగణనలోకి తీసుకోకుండా కుహానా మేధావులు చెబుతున్నారు. సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ బాధ పడ్డారు. బాగానే ఉంది.2014లో చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి వస్తానంటే లక్ష కోట్ల రూపాయల రైతుల, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తానని వాగ్ధానం చేస్తే, ఇదే ఈనాడు మీడియా ఎందుకు బాండ్ కొట్టింది. అప్పుడు ఏ సంపద సృష్టించి రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. పోనీ ఫలానా రకంగా సంపద సృష్టించానని చెప్పగలరా! కేవలం అమరావతి రాజధాని పేరుతో 29 గ్రామాలలో తన వాళ్లతో భూములు కొనిపించి రేట్లు పెంచడమే సంపద సృష్టించడం అవుతుందా? ఆఆ గ్రామాలలో వేల ఎకరాల భూములలో పంటలను ఎండబెట్టి విధ్వంసానికి పాల్పడితే అది గొప్ప విషయం అని రాస్తారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు. రాష్ట్రం అంతటా పేదలకు సంపద పెరగాలని ఆయన తలపెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తద్వారా ఒక్కొక్కరికి ఐదు నుంచి పది లక్షల రూపాయల ఆస్తి లేదా సంపద సమకూరింది. దీనిని సంపదగా ఈ మేధావులు పరిగణిచరా? రాష్ట్ర రుణాలు పద్నాలుగు లక్షల కోట్లు దాటిపోయాయని ఈయనకు ఎవరు చెప్పారు. ఈనాడు వాళ్లు చెప్పిన అబద్ధాలను ప్రచారం చేయడం కోసం ఈయన పరువు తీసుకోవాలా? అసలు ఎప్ఆర్బీఎం పరిధిలో లేకుండా రాష్ట్రాలు ఆ స్థాయిలో రుణాలు చేయగలుగుతాయా? జీఎస్ డీపీ వృద్ధిలో ఏపీ అగ్ర భాగాన ఉందన్న సంగతి ఈ మేధావులకు తెలియదా? తెలియకపోతే తప్పు ఏపీ ప్రజలదా!కరోనా సంక్షోభంలో ఏపీ ప్రభుత్వం ఎంత చక్కగా విధులు నిర్వర్తించింది వీరికి తెలియవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరు రామోజీ, చంద్రబాబు వంటి పెత్తందారుల తరపున పని చేస్తున్నారు కనుక. ప్రత్యక్ష నగదు బదిలీ తాత్కాలికమేనని అంటున్నారు. బాగానే ఉంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నారనే కదా! అది తప్పని మీరు నమ్మితే ఏమి చెప్పాలి. ఎవరు అలాంటి స్కీములు అమలు చేసినా మంచిది కాదని అనాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు అన్న చందంగా మాట్లాడి మీ మేధావి మస్తిష్కానికి దరిద్రపు రాజకీయం అంటిందన్న అభిప్రాయం కలిగించడం లేదా?వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్కీముల ద్వారా ఏటా సుమారు ఏభైవేల కోట్ల రూపాయల నగదు పంపిణీ చేశారు. దాంతో ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఇదే బాబు, పవన్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నదానికంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా నగదు పంచుతామని చెబుతున్నారు. అంటే ఏటా లక్షన్నర కోట్లు పంచుతామని అంటున్నారన్నమాట. దీనిని మేధావి మహేంద్రదేవ్ తప్పు పడతారా? లేక సమర్థిస్తారా? చంద్రబాబు ఏమి చేసినా ఈయనకు కూడా బాగానే ఉంటుందని అనుకోవాలా! ఇంత చిన్న లాజిక్ ను మహేంద్రదేవ్ వంటివారు కూడా విస్మరిస్తే సమాజానికి ఎలాంటి సంకేతం ఇస్తుంది?పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి కేంద్రం తగు రీతిలో నిధులు ఇవ్వకపోవడం కారణమని వీరికి తెలియదా! విద్యా రంగంలో వచ్చిన మార్పుల గురించి ముందుగా మహేంద్రదేవ్ వంటివారు స్వయంగా ఏపీకి వెళ్లి పరిశీలించి చూసిన తర్వాత ఏవైనా విమర్శలు లేదా సలహాలు ఇవ్వవచ్చు. అలాకాకుండా రామోజీ కళ్లలో ఆనందం చూడడానికి వీరు ఏమి చెబితే అది చెప్పడానికి అయితే మహేంద్రదేవ్ వంటివారి మేధావితనం ఎవరికి పనికి వచ్చినట్లు. ఏపీ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలియకుండా ఇలాంటి మేధావులు మాట్లాడడం ఎంత దారుణం.ఏడాదికి రెండు లక్షల మంది ఇంజనీరింగ్ చదవుతున్నారట. వారిలో కొందరికి కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు రావడం లేదట. మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమి చేసినట్లు? ఆ ప్రశ్న అసలు ఈ మేధావులకు రాదా? ఈనాడు వాళ్లు చెత్త ప్రశ్నలు వేస్తే, మహాద్భాగ్యమన్నట్లు వీరు వారికి కావల్సిన సమాధానాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమలు వేటిని వీరు గుర్తించరా! వాటన్నిటి జాబితా చాంతాడు అవుతుంది.ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు చేయాలన్నది రామోజీ విధానం అయితే ఆయన ఉద్యోగం కోసం అప్పట్లోనే ఢిల్లీ ఎందుకు వెళ్లారు? హైదరాబాద్లో ఎందుకు కంపెనీలు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఏపీలో కాకుండా హైదరాబాద్, తెలంగాణలో తన యూనిట్లు ఎందుకు నెలకొల్పారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం తప్పని దిక్కుమాలిన ధీరిలు చెబుతున్నారు. అదే అమెరికా వెళితే అంతా తన ఘనత అని డబ్బా వాయించుకుంటారు. ఉపాధి లేకపోతే డ్రగ్స్ వంటి వ్యసనాలు వస్తాయట.అదే కరెక్టు అయితే హైదరాబాద్, బెంగుళూరు, గుజరాత్ తదితర ప్రాంతాలలో డ్రగ్స్ ఎందుకు విస్తారంగా ఉన్నాయి? హైదరాబాద్ లోనే అత్యధికంగా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న సంగతి వీరికి తెలియదా! బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తెప్పించింది ఎవరన్నది ఇంతవరకు ఎందుకు తేల్చలేదు? మేధావులు కేవలం ఎవరి రాజకీయ స్వార్థం కోసమో ఇంటర్వ్యూలు ఇచ్చి వారి పరువు పోగొట్టుకోకూడదు.నిజానికి మహేంద్ర దేవ్ వంటివారికి వాస్తవాలు తెలియనివి కావు. ఏకపక్షంగా మాట్లాడడం పద్ధతి కాదని కూడా తెలుసు. కానీ మరి వారిపై ఎలాంటి ఒత్తిడి ఉందో ఏమో కానీ, రామోజీ కోరుకున్న అబద్ధాలు చెప్పి అనవసరంగా భ్రష్టు పడుతున్నారు. మేధావులు వాస్తవ పరిస్థితి తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పాలి. ఎన్నికల సమయంలోనే వీరు మాటలను టీడీపీ మీడియా ప్రచారం చేయడంలోనే కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. ఆ విషయాన్ని టీడీపీ తరపున మాట్లాడే మేధావులు తెలుసుకుంటే మంచిది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్సేల్గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement