వివాహిత ఆత్మహత్యాయత్నం | women suicide attempts in nalgonda distirict | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Published Thu, Oct 8 2015 1:27 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 AM

కుటుంబ కలహాలతో వివాహిత కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.

భువనగిరి: కుటుంబ కలహాలతో వివాహిత  కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో సగానికి పైగా కాలిపోయిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం హన్మపురంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన జమాలుద్దీన్(38), జహంగీర్‌బీ(33) దంపతులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురైన జహంగీర్‌బీ ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement