Diagnosed
-
చిన్న పిల్లలను విడువని కేన్సర్ భూతం..!
కేన్సర్..కేన్సర్..కేన్సర్ ఈ మాట వింటుంటేనే గుండెలు గుభేలమంటున్నాయి. ప్రస్తుతం ఎవరిని కదిలించినా ఈ మహమ్మారిపై చర్చిస్తున్నారు. గతంలో వందల్లో ఒకరికో..ఇద్దరికో కేన్సర్ సోకేది. ప్రస్తుతం ఈ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం.. మారుతున్న జీవన శైలి, తినే ఆహారపు అలవాట్లు, కాలుష్యం, జన్యుపరమైన లోపాలు. ఇవన్నీ కేన్సర్ భూతం వికటాట్టహాసానికి దారితీస్తున్నాయి. గత మూడు దశాబ్దాలలో కేన్సర్ బాధితుల సంఖ్య 79 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల నుంచి వయసు మీరిన వారి వరకు అందరిని ఈ భూతం కబలిస్తోంది, ఆ మూడు ఆసుపత్రుల్లో..నగరంలోని ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి, ఎంఎన్జే ఆసుపత్రి, నిమ్స్ ఆసుపత్రుల నివేదికల ప్రకారం సగటున ప్రతి లక్ష మందిలో 3,865 మంది కేన్సర్ బాధితులు ఉన్నారు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్, పేగు, జీర్ణశయ, కాలేయ వంటివి దాదాపు వందుకు పైగా కేన్సర్ రకాలు ఉన్నాయి. పురుషుల్లో నోటి కేన్సర్, మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ అత్యధిక శాతం మందిని వేధిస్తోందని నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రొగ్రాం నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2025లో 53,565 మందికి కేన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తునా్నరు. ఇందులో పురుషులు 24,857 మంది, మహిళలు 28,708 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.మహిళలల్లో ముప్పు ఎక్కువమహిళల్లో ఎక్కువ మంది కేన్సర్ భారిన పడుతున్నారు. ఎన్సీఆర్పీ నివేదికల ప్రకారం ప్రతి లక్ష మంది మహిళల్లో 2,151 మంది మహిళలు కేన్సర్ బాధితలుగా ఉన్నారు. అదే సమయంలో పురుషులు 1,714 మంది వ్యాధి భారినపడుతున్నారు. బాధితుల్లో అత్యధికంగా 35.5 శాతం మంది మహిళలు బ్రెస్ట్ కేన్సర్కు గురవుతున్నారు. పురుషుల్లో నోటి కేన్సర్ 13.3 శాతం, ఊపిరితిత్తుల కేన్సర్ 10.9 శాతం మంది బాధపడుతున్నారు. 14 ఏళ్ల లోపు వయసు గల మిలియన్ మంది పిల్లల్లో ఏడాదికి సరాసరిన 94 మంది కేన్సర్ బారినపడుతున్నారు. ఇందులో అబ్బాయిలు 55 మంది ఉండగా, ఆడపిల్లలు 39 మంది ఉంటున్నారు.పొగాకుతో ప్రాణ గండం..కేన్సర్ బాధితుల్లో పొగాకు వాడకం వల్ల వ్యాధికి సోకిన వారు పురుషుల్లో 42 శాతం మంది ఉండగా అందులో నోటి కేన్సర్ 31 శాతం మంది, నాలుక 19 శాతం మంది, ఊపిరి తిత్తుల 26 శాతం ప్రధానంగా ఉన్నాయి. మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు పీల్చడం వల్ల కేన్సర్ వస్తుందని నిర్ధారించారు. ఇందులో 30 శాతం మంది ఊపిరితిత్తులు, 22 శాతం మంది నోరు, 17 శాతం మంది నాలుక కేన్సర్తో బాధపడుతున్నారు.కేన్సర్ రావడానికి కారణాలుశారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, ఊబకాయం కలిగి ఉండడం, రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగిపోవడం, ఉప్పు అధికంగా ఉండే అహారాలను తీసుకోవడం, పండ్లు, పాలను తగినంతగా తీసుకోకపోవడం, పొగాకు వాడకం, మద్యం సేవించడం, వారసత్వంగా కూడా కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. రేడియేషన్ ప్రభావం, పర్యావరణ కాలుష్యం కూడా కేన్సర్లకు దారితీస్తున్నాయి.అందుబాటులో అత్యాధునిక చికిత్సలు..కేన్సర్కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ వంటి ఉత్తమ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. జన్యు పరీక్షలు, రక్త పరీక్షలు, ఇమేజింగ్ పరీక్షలు (సీఎక్స్ఆర్, యూఎస్జీ, సీటీ, ఎమ్మారై, పీఈటి), బయాప్సీలు వంటి పరీక్షలతో కేన్సర్లను గుర్తించవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే వ్యాధికి దూరంగా ఉండొచ్చు.పిల్లల్లో జెనిటిక్, పర్యావరణం, తినే ఆహారం, డీఎన్ఏ డిస్టర్బ్ కావడం వలన కేన్సర్ వస్తుంది. బ్లడ్, కిడ్నీ, లివర్, కన్ను, ఎముకలపై ప్రభావం చూపిస్తుంది. పెద్దల్లో వెంట్రుక, గోరు తప్ప మిగతా అన్ని శరీర బాగాల్లోనూ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మం కందిపోవడం, మచ్చలు రావడం, జ్వరం, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, హెమోగ్లోబిన్ తగ్గిపోవడం, గొంతులో బ్లీడింగ్ ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్ మొదటి రెండు దశల్లో ఉంటే 80 శాతం పైగా బాధితులకు నయం అవుతుంది.--స్నేహ సాగర్, మెడికల్ అంకాలజిస్టు, జీవీకే హెల్త్ హబ్(చదవండి: వెయిట్లాస్కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్గేట్స్ ఏమన్నారంటే..) -
ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్గేట్స్
ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత కూడా. అంతేగాదు ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా 'సోర్స్ కోడ్' ఫిబ్రవరి 04న విడుదల కానుంది. ఇటీవల ఆయన వాల్స్ట్రీట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాల ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తాను గనుక ఇప్పుడు పుట్టి ఉంటే.. కచ్చితం తనకు ఆటిజం నిర్ణారణ అయ్యేదని అన్నారు. అలా అనడానికి గల రీజన్ వింటే విస్తుపోతారు. .!.బిల్గేట్స్ తనకు చిన్నతనంలో ఆటిజం లక్షణాలను ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ రోజుల్లో దాని గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం లేకపోవడంతో అదెంటో కూడా అప్పటి వ్యక్తులెవరకీ తెలిసే అవకాశం లేదన్నారు. తాను చిన్నప్పుడు చాలా నెమ్మదిగా ఉండేవాడినని అన్నారు. ప్రతిది తొందగా నేర్చుకోలేకపోవడం, ఎవరితో కలవకపోవడం వంటి ఆటిజం లక్షణాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మిగతా పిల్లలతో పోలిస్తే అంత చురుకైన వాడిని కాదు, పైగా అంత బాగా చదివే విద్యార్థిని కూడా కాదని చెప్పుకొచ్చారు. ఇక్కడ అలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారన్నా.. దానిపైనే ఆ పిల్లవాడు ఈ సమస్యని అధిగమించడం అనేది ఉంటుంది. తన తల్లిందండ్రులు అలానే తన సమస్యను అర్థం చేసుకుని ప్రత్యేకంగా చూడకుండా సాధారణంగానే వ్యహరించేవారన్నారు. అలాగే తన ప్రవర్తన ఇబ్బందికరంగా మారకుండా తన బలహీనతలు, బలాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని అన్నారు. ముఖ్యంగా తనకు తగిన స్కూల్ ఏదో చెక్చేసి మరీ అందులో చేర్పించారన్నారు. అలాగే తన బిహేవియర్ని మార్చుకునేలా తగిన కౌన్సలర్ వద్ద ట్రీట్మెంట్ ఇప్పించారని చెప్పారు. అందువల్ల తాను ఈ రోజు ఆ సమస్యను అధిగమించి ప్రభావవంతంగా చదువుకోగలిగానన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యను గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేంది. కానీ పిల్లలు ఆ సమస్యతోను అధిగమించలేకపోతున్నారు తల్లిదండ్రులకు అలాంటి పిల్లలతో మసులోకోవాలనే దాని గురించి అవగాహన ఉండటం లేదన్నారు. ఇక్కడ మిగతా పిల్లల్లా.. తన పిల్లవాడు చురుకుగా లేడన్న లోపంతో తల్లిదండ్రులే కుమిలిపోతున్నారు. ఇక పిల్లవాడికి ఎలా ధైర్యం చెప్పి వాడి లోపాన్ని సరిచేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ముందు.. ఉన్న సమస్యను లేదా లోపాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి లోపల ఉన్న అంతర్గత శక్తిని తట్టి లేపేలా తల్లిదండ్రులుగా తగిన ప్రోత్సాహం ఇస్తే ఏ పిల్లవాడు ఆటిజం బాధతుడిగా జీవితాంత ఉండిపోడని అన్నారు. ఈ సమస్యను అవమానంగా భావించడం, సోసైటీలో చులకనైపోతామనే భయం తదితరాల నుంచి తల్లిందండ్రులు బయటపడాలి. వారు స్థైర్యం తెచ్చుకుని వారితో తగిన విధంగా వ్యవహరించి ఓపికగా మార్చుకోగలం అనే దానిపై దృష్టి సారించండి. ఇది జీవితం విసిరిని సవాలు లేదా టాస్క్గా ఫీలవ్వండి. గెలిస్తే మీ అంత గొప్పోడు ఎవ్వడూ లేడనే విషయం గుర్తెరగండి. అలాంటి చిన్నారుల్లోని బలాన్ని తట్టి లేపి, వారు పుంజుకునేలా ప్రోత్సహించండి. అంతే ఏ పిల్లవాడు ఆటిజం బాధితుడిగా మిగిలిపోడు. అద్భుతాలను సృష్టించే మేధావిగా, గొప్ప వ్యక్తిగా రూపుదొద్దుకుంటాడని అన్నారు. ఏ చిన్నారికైనా ఇల్లే ప్రథమ బడి, అదే జ్ఞానాన్ని సముపార్జించగల శక్తిని అందిస్తుందని చెబుతున్నారు బిల్గేట్స్.(చదవండి: భారత రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహిళలు వీరే..!) -
దటీజ్ మధురిమ బైద్య..! మైండ్బ్లాక్ అయ్యే గెలుపు..
బాల్యమంతా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉంది. స్నేహితులను కోల్పోయింది. ఓ పేషెంట్లా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నా.. వెరవక చదువుని కొనసాగించింది. అంతటి స్థితిలోనూ మంచి మార్కులతోనే పాసయ్యింది. ఓ పక్కన ఆ మహమ్మారి నుంచి కోలుకుంటూనే నీట్కి ప్రిపర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. కేన్సర్ అనంగానే సర్వం కోల్పోయినట్లు కూర్చొనవసరం లేదు. సక్సెస్తో చావు దెబ్బతీస్తూ బలంగా బతకాలని చాటి చెప్పింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ అమ్మాయే మధురిమ బైద్య. ఆరవ తరగతిలో ఉండగా అంటే.. 12 ఏళ్ల ప్రాయంలో అరుదైన నాన్-హాడ్కిన్స్ లింఫోమా కేన్సర్ బారిన పడింది. అది కూడా స్టేజ్ 4లో ఉండగా వైద్యులు ఈ వ్యాధిని గుర్తించారు. దీంతో ఆమె చికిత్స నిమిత్తం ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్(Tata Memorial Hospital) చుట్టూ తిరుగడంతోనే బాల్యం అంతా గడిచిపోయింది. కనీసం స్నేహితులు కూడా లేరు మధురిమకు. అయినా సరే చదువుని వదల్లేదు. ఆ ఆస్పత్రి ఓపీడీల్లో చదువుకునేది. ఆఖరికి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యినప్పుడూ పుస్తకాలను వదలేది కాదు. అలా చదువుతోనే మమేకమయ్యేలా తన బ్రెయిన్ని సెట్ చేసుకుంది. నిజానికి ఆ దశలో ఉండే కీమోథెరపీలు మోతాదు అంతా ఇంత కాదు. చదివినా బుర్ర ఎక్కదు కూడా. కానీ మధురిమ ఆ బాధని కూడా లెక్కచేయకుండా చదువు మీద ధ్యాసపెట్టి దొరికిన కొద్ది సమయంలోనే చదువుకుంటుండేది. ఆమె కష్టానికి తగ్గట్టు పదోతరగతిలో 96% మార్కులతో పాసై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఇంటర్ కూడా 91% మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తను ఇంతలా కష్టపడి చదవడటానికి కారణం.. తనలాంటి కేన్సర్ బాధతులందరికీ ఓ ప్రేరణగా ఉండాలనేది ఆమె కోరకట. అందుకోసమే తనను తాను వ్యాధిగ్రస్తురాలిగా లేదా బాధితురాలిగా అస్సలు బావించేదాన్ని కాదని అంటోంది. తన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు జీవితంపై పోరాడుతున్న యోధురాలిగా అనుకుని ముందుకు సాగానని సగర్వంగా చెబుతోంది మధురిమ. తన కెరీర్ అంతా ఆరోగ్యానికి సంబంధించిన సవాళ్లతోనే పోరాడింది. సంవత్సరాల తరబడి సాగిన కీమోథెరపీ(chemotherapy), రేడియేషన్(Radiation), ఎముక మజ్జ మార్పిడి(Bone marrow transplant) వంటి కఠినతరమైన శస్త చికిత్సలతో కేన్సర్ని విజయవంతంగా జయించింది. కానీ వాటి కారణగా శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనమైంది. అందువల్ల తరుచుగా జలుబు, దగ్గు వంటి అంటువ్యాధుల బారినపడుతుండేది. అయినా సరే చదువుని ఆపలేదు. ఎంబీబీఎస్ చేయాలన్న కోరికతో ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET-UG 2024)కి కూడా ప్రిపేర్ అవ్వడమేగాక తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇక్కడ మధురిమ కేన్సర్ చివరిదశలో పోరాడుతున్న నైరాశ్యాన్ని దరిచేరనివ్వలేదు. పైగా తన కలను సాకారం చేసుకునే సమయంలో ఎదురవ్వుతున్న కఠినమైన ఆరోగ్య సవాళ్లన్నింటిని తట్టుకుంటూనే మంచి మార్కులతో పాసయ్యింది. అదీగాక అత్యంత కఠినతరమైన నీట్ ఎగ్జామ్ని అలవోకగా జయించింది. మధురిమ సక్సస్ జర్నీ చూస్తే..దృఢ సంకల్పం, మొక్కవోని పట్టుదల ముందు..కఠినతరమైన కేన్సర్ కనుమరుగవుతుందని తేలింది. అంతేగాదు ఇక్కడ తన ఆరోగ్య పరిస్థితులన్నింటిని అంగీకరించిందే తప్ప 'నాకే ఎందుకు ఇలా' అనే ఆలోచన రానీయలేదు. అందుకు తగ్గట్టుగా తన సామార్థ్యాన్నిపెంపొందించటంపై దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మధురిమ గెలుపు మాములుది కాదని ప్రూవ్ చేసింది. (చదవండి: గర్భధారణ సమయంలో ఎటాక్ చేసే వ్యాధి..! హాలీవుడ్ నటి సైతం..) -
నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?
హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..గ్రేవ్స్ వ్యాధి అంటే..?థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.లక్షణాలు:అలసట, బలహీనతవేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనవణుకువిపరీతమైన ఆకలి, బరువు తగ్గడంఆందోళన, చిరాకు, మానసిక కల్లోలంతరచుగా ప్రేగు కదలికలుఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపుఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది. ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి. (చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!) -
నటికి ఎంత కష్టమొచ్చింది.. క్యాన్సర్ మూడో స్టేజ్! (ఫోటోలు)