flop movies
-
వాట్ నెక్ట్స్?
చిత్ర పరిశ్రమలో విజయాలను బట్టి కొత్త అవకాశాలు వరిస్తుంటాయి. ఈ విషయంలో నటీనటులకు కొంత మినహాయింపు ఉంటుందని చెప్పాచ్చు. కానీ దర్శకుల పరిస్థితి అలా కాదు. హిట్స్ అనేవి వారి కెరీర్ని నిర్ణయిస్తుంటాయన్నది ఇండస్ట్రీ టాక్. ఒక్క హిట్టు పడితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి. అదే ఫ్లాపులొస్తే మాత్రం వాట్ నెక్ట్స్? మనకు అవకాశం ఇచ్చే హీరో ఎవరు? నిర్మాత ఎవరు? వంటి ప్రశ్నలు వారిలో మెదులుతుంటాయి. మరికొందరు దర్శకులు హిట్ ఇచ్చినా నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈ నిరీక్షణ సమయం కొందరికి ఆరేళ్లు, నాలుగేళ్లు, మరికొందరికి మూడేళ్లు, ఇంకొందరికి రెండేళ్లు, ఏడాదిన్నర ఉంటోంది. మరి... ‘వాట్ నెక్ట్స్’ అంటే... ప్రస్తుతానికి ‘నో ఆన్సర్’. రెండేళ్లు దాటినా... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో అందంగా తెరకెక్కించే క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘చందమామ’ (2007) సినిమా తర్వాత కృష్ణవంశీకి చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. 2017లో వచ్చిన ‘నక్షత్రం’ సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న అనంతరం ఆయన తెరకెక్కించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. 2023 మార్చి 22న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా కృష్ణవంశీ తర్వాతిప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాలుగు సంవత్సరాలు దాటినా... తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్గా పేరు సొంతం చేసుకున్నారు చంద్రశేఖర్ ఏలేటి. ‘ఐతే’ (2003) మూవీ ద్వారా డైరెక్టర్గా పరిచయయ్యారాయన. ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకుపైగా కెరీర్ పూర్తి చేసుకున్న చంద్రశేఖర్ తీసింది కేవలం ఏడు సినిమాలు (ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా, చెక్) మాత్రమే. వీటిలో ‘ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం’ సినిమాలు విజయాలు అందుకున్నాయి. ‘ఒక్కడున్నాడు, ప్రయాణం, మనమంతా’ వంటివి మంచి చిత్రాలుగా నిలిచాయి. ఇక నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా 2021 ఫిబ్రవరి 26న విడుదలై ప్రేక్షకులను నిరాశపరచింది. ఈ చిత్రం విడుదలై నాలుగు సంవత్సరాలు దాటినా ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఆరేళ్లు అవుతున్నా.... తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పద్దెనిమిదేళ్ల ప్రయాణం వంశీ పైడిపల్లిది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారాయన. ఇన్నేళ్ల కెరీర్లో తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అయినా అన్నీ విజయాలు అందుకున్నాయి. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్తో తమిళంలో ‘వారిసు’ (తెలుగులో వారసుడు) సినిమా చేశారు. ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై తమిళంలో సూపర్ హిట్గా నిలిచింది. మహేశ్బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ (2019) వంటి హిట్ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మరో తెలుగు సినిమా చేయలేదు. అలాగే తమిళంలోనూ ‘వారిసు’ తర్వాత అక్కడ కూడా ఏ మూవీ కమిట్ కాలేదు. తెలుగులో ఆయన సినిమా విడుదలై దాదాపు ఆరేళ్లు కావస్తున్నా తర్వాతిప్రాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య మహేశ్బాబుతో మరో సినిమా చేయనున్నారనే వార్తలు వచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా షాహిద్ కపూర్ హీరోగా హిందీలో వంశీ పైడిపల్లి ఓ మూవీ తెరకెక్కించనున్నారని బాలీవుడ్లో వినిపించినా ఈప్రాజెక్టు గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి... వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం తెలుగులోనా? తమిళంలోనా? బాలీవుడ్లోనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజలు వేచి చూడకతప్పదు. మూడేళ్లయినా... మాస్ సినిమాలు తీయడంలో, హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ సురేందర్ రెడ్డి శైలి ప్రత్యేకమనే చె΄్పాలి. కల్యాణ్రామ్ హీరోగా రూ΄÷ందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘అతనొక్కడే, కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకుని ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన తర్వాతిప్రాజెక్ట్ ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు.అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’ సినిమా 2023 ఏప్రిల్ 28న రిలీజైంది. భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమా చేస్తున్నారు అఖిల్. అయితే ‘ఏజెంట్’ తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్న మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఫలానా హీరోతో ఆయన తర్వాతి సినిమా ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ రాలేదు.ఏడాది దాటినా.... టాలీవుడ్లో దాదాపు పదిహేనేళ్ల ప్రయాణం పరశురామ్ది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘యువత’ (2008) సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారాయన. ఆ తర్వాత ‘ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం, సర్కారువారి పాట, ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలు తీశారు పరశురామ్. విజయ్ దేవరకొండ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘గీతగోవిందం’ (2018) సినిమా బ్లాక్బస్టర్ అందుకోవడంతో పాటు వంద కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్ బాబుతో ‘సర్కారువారి పాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు.‘గీత గోవిందం’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫ్యామిలీ స్టార్’ అనే చక్కని కుటుంబ కథా చిత్రం తీశారు పరశురామ్. 2024 ఏప్రిల్ 5న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా రిలీజై ఏడాది దాటినా ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పర శురామ్ మరో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలొచ్చినా ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా కార్తీ హీరోగా పరశురామ్ ఓ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా గతంలో వచ్చాయి. కానీ, ఈప్రాజెక్ట్పైనా ఎలాంటి అప్డేట్ లేదు. మూడేళ్లు పూర్తయినా.... అందమైన కుటుంబ కథా చిత్రాలతో పాటు సున్నితమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో కిశోర్ తిరుమల శైలే వేరు. రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘నేను శైలజ’ (2016) మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత కిశోర్ తిరుమలని మరో హిట్ వరించలేదు. శర్వానంద్, రష్మికా మందన్నా జోడీగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం 2022 మార్చి 4న రిలీజైంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా విడుదలై మూడేళ్లు పూర్తయినా ఆయన నెక్ట్స్ప్రాజెక్ట్పై ఎలాంటి ప్రకటన లేదు. హీరో రవితేజతో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ ఇప్పటికీ స్పష్టత లేదు. ఒకటిన్నర సంవత్సరమైనా... అందమైన ప్రేమకథలే కాదు... చక్కని కుటుంబ కథా చిత్రాలు తీయడంలో దిట్ట శ్రీకాంత్ అడ్డాల. ‘కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల తర్వాత తన పంథా మార్చి ‘నారప్ప, పెదకాపు 1’ వంటి మాస్ సినిమాలు తీశారాయన. ఆ చిత్రాలు అనుకున్నంత విజయాలు సాధించలేదు. ‘పెదకాపు 1’ చిత్రం 2023 సెప్టెంబర్ 29న రిలీజైంది. ఈ మూవీకి సీక్వెల్గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. అయితే రెండో భాగంపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ లేదు. మరి శ్రీకాంత్ అడ్డాల తర్వాతి చిత్రంగా ‘పెదకాపు 2’ ఉంటుందా? లేకుంటే మరోప్రాజెక్ట్ని ప్రకటిస్తారా? అనేది వేచి చూడాలి. ఏడాదిన్నర దాటినా... ‘నిన్ను కోరి, మజిలీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు శివ నిర్వాణ. ఆ తర్వాత ‘టక్ జగదీష్, ఖుషి’ సినిమాలు తీశారాయన. విజయ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలై విజయం అందుకుంది. ఆ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటిపోయినా శివ నిర్వాణ నెక్ట్స్ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ (2018) సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత ‘మహాసముద్రం’ (2021) సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచన ఆయన ‘మంగళవారం’ (2023) సినిమాతో మరో హిట్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమా విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘మంగళవారం’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, ఈ మూవీ ప్రీప్రోడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారని ఫిల్మ్నగర్ టాక్. వీరే కాదు... మరికొందరు దర్శకుల తర్వాతి సినిమాలపైనా ఎలాంటి ప్రకటన లేదు. ఏడాదిన్నరగా...‘ఆంధ్రావాలా’ (వీర కన్నడిగ), ‘ఒక్కడు’ (అజయ్) వంటి తెలుగు సినిమాల కన్నడ రీమేక్తో శాండిల్వుడ్కి దర్శకుడిగా పరిచయమయ్యారు మెహర్ రమేశ్. ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కంత్రీ’ (2008) చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారాయన. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ (2009) చిత్రాన్ని తెరకెక్కించారు మెహర్ రమేశ్. తెలుగులో ‘శక్తి, షాడో, భోళా శంకర్’ వంటి సినిమాలు, కన్నడలో ‘వీర రణచండి’ (2017) మూవీ తెరకెక్కించారు. వెంకటేశ్ హీరోగా ఆయన తీసిన ‘షాడో’ (2013) సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు పదేళ్లు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమా చేసే అవకాశం అందుకున్నారు మెహర్ రమేశ్. 2023 ఆగస్టు 11న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా రిలీజై ఏడాదిన్నరకుపైగా అయినా ఇప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మెహర్ రమేశ్. -
ముగ్గురు స్టార్స్, పరమ చెత్త సినిమాగా రికార్డ్.. థియేటర్లలో నో రిలీజ్!
కొన్ని సినిమాలు అద్భుతంగా ఆడతాయి. మరికొన్ని అట్టర్ ఫ్లాప్గా నిలుస్తాయి. భారీ తారాగణం, భారీ బడ్జెట్ ఉన్నా సరే కంటెంట్లో దమ్ము లేకపోతే ప్రేక్షకులను మెప్పించడం కష్టం. ఇప్పుడు చెప్పుకునే సినిమా అదే కోవలోకి వస్తుంది. సడక్.. 1991వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇదీ ఒకటి. మహేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంజయ్దత్, పూజా భట్ ప్రధానపాత్రల్లో నటించారు. రెండు దశాబ్దాలకు సీక్వెల్ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమాకు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ ప్రకటించారు. సంజయ్ దత్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్.. ఇలా బడా స్టార్స్తో 2020లో సీక్వెల్ తీసుకొచ్చారు. అయితే సడక్ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో సడక్ 2 మూవీని అంతే స్థాయిలో తిప్పికొట్టారు. యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 70 లక్షలమంది డిస్లైక్ కొట్టారు.నేరుగా ఓటీటీలో రిలీజ్తీరా సినిమాకు థియేటర్లు దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీకి ఐఎమ్డీబీలోనూ అత్యంత దారుణమైన రేటింగ్స్ ఉన్నాయి. కేవలం 1.2 రేటింగ్ ఉంది. అంతేకాదు, ఓటీటీలో రిలీజైన రెండు రోజులకే సడక్ 2 వంద అత్యంత చెత్త చిత్రాల్లో ఒకటిగా చేరిపోవడం గమనార్హం.ముఖ్య కారణం!కాగా సడక్ 2పై అంత వ్యతిరేకత రావడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఈ మూవీ రిలీజైన ఏడాదే నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలీవుడ్లోని నెపోటిజమే అతడి ప్రాణాలు తీసిందని జనాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ కారణం వల్లే బాలీవుడ్ బడా స్టార్స్ కలిసి నటించిన సడక్ 2 సినిమాకు యూట్యూబ్లో లక్షల్లో వచ్చిపడ్డాయి. చదవండి: Pushpa 2 Movie: నార్త్లో పుష్ప 2 దూకుడుకు బ్రేక్? -
జనవరి టు మార్చి టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్
-
2020: బాలీవుడ్ చెత్త సినిమాలు ఇవే
బాలీవుడ్లో హిట్ వస్తే ఎంత పేరు వస్తుందో ఫ్లాప్ వస్తే అంత రిపేరు కూడా వస్తుంది. హిట్ అవుతుందని ప్రేక్షకుల మీదకు వదిలిన సినిమాలు బొక్కబోర్లా పడే సన్నివేశాలు ప్రతి సంవత్సరంలో ఉంటాయి. బాలీవుడ్లో 2020లో అతి చెత్త ఐ.ఎం.డి.బి రేటింగ్స్ పొందిన సినిమాలుగా ఆరు సినిమాలు తేలాయి. అవి 1.లవ్ ఆజ్ కల్ (దర్శకుడు ఇమ్తియాజ్ అలీ), 2.సడక్ 2 (దర్శకుడు మహేష్భట్), 3.కూలీ నంబర్ 1 (దర్శకుడు డేవిడ్ ధావన్), 4. ఇందూకి జవాని (అబిర్ సేన్గుప్తా) 5. ఘోస్ట్ స్టోరీస్ (కరణ్ జొహర్), 6.లక్ష్మి (దర్శకుడు ప్రభుదేవా). 2020లో విడుదలైన ఈ 6 సినిమాలు ఐ.ఎం.డి.బి రేటింగ్స్లో 2 కంటే తక్కువ రేటింగ్స్ నమోదు చేసుకున్నాయి. వీటిలో లవ్ ఆజ్ కల్, సడక్ సీక్వెల్స్ అయితే కూలీ నంబర్ 1 రీమేక్. లక్ష్మి కూడా రీమేక్. ఘోస్ట్ స్టోరీస్ని పెద్ద పెద్ద దర్శకులు డైరెక్ట్ చేసినా అస్సలు ఫలితం కనిపించలేదు. తెలుగు,తమిళంలో హిట్ అయిన ‘కాంచన’ హిందీలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తమిళంలో హీరో పిరికివాడు. హిందీలో ధైర్యస్తుడు. అక్కడే ట్రీట్మెంట్ రాంగ్ వెళ్లింది. దానికితోడు ఇందులో లవ్ జిహాద్ ఉందనే విమర్శలు కూడా వచ్చి సినిమా ప్రతికూల ఫలితాలు పొందింది. సడక్ 2 మీద హీరో సంజయ్ దత్ ఆశలు పెట్టుకున్నా అందులో ఆలియా భట్ నటించినా ఫలితం కనిపించలేదు. సరైన కథ, సరైన దర్శకత్వం ఉంటేనే సినిమా నిలుస్తుందని ఇంత పెద్ద స్టార్స్ ఉన్న సినిమాల ఫ్లాప్ ద్వారా మరోసారి అర్థమైంది బాలీవుడ్కి. -
‘చిత్రం’గా చతికిలపడ్డాయి..
సినిమాకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదు నేటితరం నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు అంతే భారీమొత్తంలో నష్టాలను తీసుకుచ్చి నిర్మాతలకు ఊహకందని విధంగా చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఈ ఏడాది కొంతమంది హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయాయి. ఎంత ప్రచారం చేసినా, ఎంత హైప్ క్రియేట్ చేసినా ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించడంలో కొన్ని చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. అవేంటో చూద్దాం.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రూలర్ భారీ అంచనాలతో విడుదలైంది. దీనికోసం విపరీతమైన పబ్లిసిటీ కూడా చేశారు. కానీ విడుదలైన తొలినాడే ఈ సినిమా తేలిపోయింది. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారనుకోండి అది వేరే విషయం. ఇక థియేటర్ దాకా వెళ్లిన ప్రేక్షకులకు అనవసరంగా వచ్చాం అన్న ఫీలింగ్ రాకమానదు. వెరసి ఈ సినిమా ఒక పాత చింతకాయ పచ్చడి. కలెక్షన్లు బాగున్నా ఫ్లాఫ్తో 2019కు బాలయ్య గుడ్బై చెప్పక తప్పలేదు. 17 ఏళ్ల క్రితం వచ్చిన మన్మథుడు ఎంత సూపర్ హిట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆ సినిమాకు సీక్వెల్ కాకపోయినప్పటికీ అదే టైటిల్తో మన్మథుడు2 ద్వారా అభిమానులను పలకరించాడు. ఇప్పటికీ తను గ్రీకువీరుడినే అంటూ వచ్చిన మన్మథుడు 2 అట్టర్ ఫ్లాఫ్గా నిలిచింది. ఈ సినిమాతో నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. ఆయన కెరీర్లోనే పెద్ద ఫ్లాఫ్గా నిలిచిపోయింది. గతేడాది రంగస్థలం సినిమాతో టాలీవుడ్ను షేక్ చేసిన మెగా హీరో రామ్చరణ్ ఈ ఏడాది మాత్రం ఘోర ఓటమిని చవిచూశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వినయ విధేయ రామ’ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. బలహీనమైన కథకు బోలెడు ఫైట్ సీన్లు జోడించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించలేదు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ రౌడీతో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంచనాలు ఘనం, ఫలితం శూన్యం అన్న మాదిరిగా తయారైంది ఈ సినిమా పరిస్థితి. వరుసగా అపజయాలను చవిచూస్తున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా ఆశాదీపంగా కనిపించినా చివరికి నిరాశనే మిగిల్చింది. ఆర్ఎక్స్100 సినిమాతో టాలీవుడ్ను తనవైపుకు తిప్పుకున్న హీరో కార్తికేయ. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను వచ్చినంటూ ముందూ వెనకా చూసుకోకుండా చేసుకుంటూ పోయాడు. అదే అతనికి పెద్ద మైనస్గా మారింది. గుణ 369 దారుణంగా దెబ్బ తీసినా 90ఎమ్ఎల్తో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఈ ఏడాది హారర్ చిత్రాలు ఏమంత మెప్పించలేకపోయాయి. సుధీర్బాబు, నందిత కలిసి నటించిన కామెడీ హారర్ ఫిల్మ్ ‘ప్రేమకథా చిత్రం’ అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో సప్తగిరి కామెడీతో చెలరేగిపోయాడు. ఈ చిన్న సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. దీంతో హీరో సుమంత్ దానికి సీక్వెల్ ట్రై చేశాడు. కానీ రోత పుట్టించే కామెడీతో, నాసిరకమైన కథతో ప్రేక్షకులను నిరాశపరిచింది. విలన్గా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తర్వాత హీరోగానూ రాణించాడు. కానీ ఆయనకు హిట్ రావడమే గగనమైపోయింది. తాజాగా ఆయన నటించిన 26వ చిత్రం ‘చాణక్య’ కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. పాత కథను తిప్పి తిప్పి చూపించడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. గోపీచంద్ మాత్రమే ఫుల్ ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించింది. మిగతావాళ్లందరూ పేలవ ప్రదర్శన కనబర్చారు. కనీసం పాటలు కూడా బాగోలేవు. అలా చాణక్య మరో ఫ్లాఫ్గా మిగిలిపోయింది. సందీప్ కిషన్కు ఈ ఏడాది కూడా అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. నిను వీడని నీడను నేనేతో మళ్లీ సక్సెస్బాట పట్టాడనుకునే లోపే తెనాలి రామకృష్ణతో డిజాస్టర్ బాట పట్టాడు. గతంలో కామెడీ సినిమాలతో మంచి విజయాలందుకుని.. ఆ తర్వాత ట్రాక్ తప్పిన దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డితో కలిసి ‘తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బీ’తో పలకరించాడు. కానీ ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేకపోవడంతో ప్రేక్షకులు కనీసం ఈ సినిమా వంక చూడనైనా చూడలేదు. జబర్దస్త్ జోకులతో సినిమా నెట్టుకొద్దామనుకున్నా అక్కడక్కడా తప్పితే ఆ హాస్యం కూడా పెద్దగా పండలేదు. రాజుగరి గదితో మంచి హిట్ అందుకున్న దర్శక నిర్మాత ఓంకార్ రాజుగారి గది3తో నిరాశపర్చాడు. తన తమ్ముళ్లకు మంచి హిట్ ఇస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ఓంకార్ రాజుగారి గది3 రూపొందించాడు. కానీ ఈ సినిమా రొటీన్ కామెడీ హారర్ చిత్రంగా పేరు ముద్రించుకోయింది. అలా రాజుగారి గది3 ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. -
బాక్సాఫీస్ లాస్
-
వారికే అవకాశం అంటున్న యువహీరో
సిని పరిశ్రమలో విజయం సాధించిన వారికే విలువ. ఈ సూత్రం హీరోయిన్లకే కాదు దర్శకులకు వర్తిస్తుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఇక ఇండస్ట్రీలో వారిని పట్టించుకునే వారు ఉండరు. కానీ యువ హీరో శర్వానంద్ పద్దతి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విలక్షణమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ తాజాగా ఒప్పుకున్న రెండు సినిమాల దర్శకులను చూస్తే చాలా సాహసం చేస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యువ హీరో ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు కాగా, మరో చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకుల పాత చిత్రాలు రెండు ఫ్లాప్ చిత్రాలే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలోవచ్చిన ‘లై’, నిఖిల్ హీరోగా సుధీర్వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కేశవ’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత ఈ దర్శకుల చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శర్వానంద్ వీరికి మరో అవకాశం ఇవ్వడమంటే సాహసం చేశాడనే చెప్పవచ్చు. అయితే శర్వానంద్కు వీరిద్దరు చెప్పిన కథ నచ్చడం వల్లే అవకాశం ఇచ్చాడని సన్నిహతులు తెలుపుతున్నారు. దర్శకుల గత విజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని మరోసారి నిరూపించాడు శర్వానంద్. అలానే మరో ఫ్లాప్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. -
నేను ఫ్లాప్ యాక్టర్
కరణ్ జోహార్ బాలీవుడ్లో ఎన్నో బ్లాక్బాస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ వంటి చిత్రాలు ఓ ఉదాహరణ. డైరెక్టర్గా సూపర్ సక్సెస్ అయిన కరణ్ ‘నేను ఫ్లాప్ యాక్టర్’ అంటున్నారు. పూర్తి స్థాయి యాక్టర్గా కరణ్ చేసిన ‘బాంబే వెల్వెట్, వెల్కమ్ న్యూయార్క్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచాయి. ‘‘నేనో ఫ్లాప్ యాక్టర్ని. నటుడిగా చేసిన ఏ ఒక్క సినిమా సరిగ్గా ఆడలేదు. సక్సెస్ఫుల్ సినిమాలు లేకపోవడంతో ఎవ్వరూ నన్ను యాక్టర్గా తీసుకోవాలనుకోవడం లేదు. అలాగే ఆ సినిమాల్లో నా నటన కూడా అంత చెప్పుకోదగ్గ రేంజ్లో లేదు’’ అని నిజాయితీగా పేర్కొన్నారు. -
నా ఫ్లాపులకు నా పొగరే కారణం
ఇటీవలి కాలంలో తన సినిమాలు ఫ్లాప్ కావడానికి తన పొగరే కారణం తప్ప మరేమీ కాదని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. చాలా కాలం తర్వాత ముంబై తిరిగి వెళ్లిన ఆయనను అక్కడి మీడియా ప్రశ్నించినపుడు ఆయనీ సమాధానం చెప్పారు. తాను సినిమాలు త్వరత్వరగా తీసేసి చుట్టేయడం వల్లే అవి ఫ్లాప్ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారని, కానీ ఇంతకుముందు తాను తీసిన డిపార్ట్మెంట్, ఆగ్ లాంటి సినిమాలకు చాలా సమయం తీసుకున్నా.. అవి కూడా ఆడలేదని గుర్తుచేశారు. సర్కార్ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేశానన్నారు. సత్యకు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువని గుర్తుచేశారు. తాను అడవిగుర్రం లాంటివాడినని, చాలా వేగంగా ఉంటానని, తన ఆటవికతను అణిచేసుకోడానికి ప్రయత్నిస్తే, తనలోని విభిన్నత కూడా అణిగిపోతుందని వర్మ అన్నారు. తాను రెండేళ్లలో ఆరు స్క్రిప్టులు పూర్తిచేశాని, దాంతోపాటు వందలాది విదేశీ సినిమాలు చూసి, పునరుత్తేజం పొందానని చెప్పారు. తన పొగరు వల్ల, అతి నమ్మకం వల్ల చేసిన తప్పులన్నీ సరిచేసుకుని.. ఇప్పుడు ముంబైకి వచ్చానని అన్నారు. ఇక తన కొత్త కార్యాలయం 'కంపెనీ' ఇప్పుడో టూరిస్టు స్పాట్లా మారిపోయిందని వర్మ తెలిపారు. కేవలం బాలీవుడ్ నుంచే కాక టాలీవుడ్ నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తున్నారని, కొంతమంది అసలు సినిమాలతో సంబంధం లేనివాళ్లు కూడా వస్తున్నారని చెప్పారు. తన మీద ఉన్న పాత ముద్రను పూర్తిగా చెరిపేసుకుని కొత్తతరహాలో కనిపించాలనే ఈ ఆఫీసును కూడా అలా తయారుచేశానన్నారు. -
వెంకీకి కలిసిరాని 2013
-
వాళ్లిద్దరితో రెండో సినిమా ఫట్టే!